రాందేవ్ పై కాంగ్రెస్ పరువు నష్టం దావా | Congress sends defamation notice to Ramdev | Sakshi

రాందేవ్ పై కాంగ్రెస్ పరువు నష్టం దావా

Dec 19 2013 10:31 PM | Updated on Mar 18 2019 9:02 PM

రాందేవ్ పై కాంగ్రెస్ పరువు నష్టం దావా - Sakshi

రాందేవ్ పై కాంగ్రెస్ పరువు నష్టం దావా

స్వలింగ సంపర్కంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురు బాబా రాందేవ్ పై మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు పరువు నష్టం దావా వేశారు.

స్వలింగ సంపర్కంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురు బాబా రాందేవ్ పై మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు పరువు నష్టం దావా వేశారు. చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు స్వలింగ సంపర్కులు కాబట్టే దీనికి మద్దతు తెలుపుతున్నారని రాందేమ్ వ్యాఖ్యానించినట్టు కథనాలు వెలువడ్డాయి. దీనిపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ న్యాయ, మానవ హక్కుల విభాగం ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ ద్వివేది పరువు నష్టం నోటీస్ పంపారు.

రాందేవ్ వారంలోగా తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి క్షమాపణలు చెబుతూ రాందేవ్ రాతపూర్వకంగా పత్రిక ప్రకటన ఇవ్వాలని, లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement