సీమాంధ్రులను రెచ్చగొట్టొద్దు: సోనియా గాంధీ | Don't provoking Seemandhra People, says sonia Gandhi | Sakshi
Sakshi News home page

సీమాంధ్రులను రెచ్చగొట్టొద్దు: సోనియా గాంధీ

Published Sat, Oct 5 2013 12:43 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Don't provoking Seemandhra People, says sonia Gandhi

తెలంగాణ ప్రాంత నేతలకు సోనియా సూచన
 సాక్షి, న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించొద్దని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, రాజ్యసభ సభ్యుడు ఎం.ఎ.ఖాన్‌లు శుక్రవారం తెలిపారు. విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజలకు పూర్తి న్యాయం చేస్తామని సోనియా హామీ ఇచ్చారని చెప్పారు. ఇలాఉండగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎన్ని అవరోధాలు ఎదురైనా కాంగ్రెస్ వెనకడుగు వేయబోదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మీమ్ అఫ్జల్ స్పష్టం చేశారు. 8 పార్టీలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే, బీజేపీ, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు ఆ తర్వాత తమ వైఖరులను మార్చుకున్నాయని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement