ఎనిమిది మంది ఉగ్రవాదుల కాల్చివేత | eight terrorists were shot dead | Sakshi
Sakshi News home page

ఎనిమిది మంది ఉగ్రవాదుల కాల్చివేత

Published Sun, Oct 22 2017 6:04 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

eight terrorists were shot dead - Sakshi

ఇస్లామాబాద్‌(పాకిస్తాన్‌): భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో శనివారం రాత్రి ఎనిమిది మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఈ సంఘటన పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో చోటుచేసుకుంది. ఉగ్రవాదులు నగరంలోని ఓ బిల్డింగ్‌లో దాక్కున్నారని తెలియడంతో పోలీసులు, భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

అక్కడ జరిగిన కాల్పుల్లో ఐదుగురు తీవ్రవాదులు అక్కడికక్కడే మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.  తీవ్రంగా గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కాసేపటికే మృతిచెందారు. మరో ముగ్గురు పోలీసులు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. సంఘటనా స్థలంలో భారీ ఎత్తున పేలుడు పదార్ధాలతో పాటు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement