బారాముల్లా జిల్లాలోని యూరీ సెక్టార్ నియంత్రణ రేఖ వద్ద శుక్రవారం రాత్రి సైన్యం, చొరబాటుదారుల మధ్య భారీ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
శ్రీనగర్: బారాముల్లా జిల్లాలోని యూరీ సెక్టార్ నియంత్రణ రేఖ వద్ద శుక్రవారం రాత్రి భారీ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులపై సైన్యం జరిపిన కాల్పుల్లో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు. ఈ ఘటనలో ఒక జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయాడు.
శుక్రవారం ఉదయం నుంచే భారీగా ఆయుధాలు కలిగిన ముష్కర బృందం భారత్లోకి చొరబడేందుకు యత్నించిదని, సైన్యం కాల్పుల్లో ఐదుగురు మరణించగా మరికొందరు పలాయనం చిత్తగించారని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు.