మావ్(యూపీ): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. గురువారం ఉదయం విద్యార్థులతో వెళుతున్న స్కూల్ బస్సును ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో ఐదుగురు చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో్ మరో 20 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్కూల్ బస్సు మావ్ లో రైలు పట్టాలు దాటుతున్న సమయంలో ఆకస్మికంగా వచ్చిన ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.