Passenger train
-
Hyderabad: ఊరగాయలో బల్లి.. హోటల్ సీజ్ చేసిన పోలీసులు
నాంపల్లి: తిరుపతికి వెళ్లి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు వెళ్తున్న భక్తులకు నగరంలో అపశృతి చోటుచేసుకుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో బల్లిపడిన వంటకాన్ని తిని వాంతులు చేసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి నాంపల్లి శాంతిభద్రతల పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రకు చెందిన 30 మంది భక్తులు దైవదర్శనం కోసం ఇటీవల తిరుపతికి వెళ్లారు. దర్శనం అనంతరం రైలులో మంగళవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. బుధవారం ఉదయాన్నే హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుండి పూర్ణా ప్యాసింజర్ రైలులో సొంతూరు వెళ్లాల్సి ఉంది. మంగళవారం రాత్రి నగరంలోనే బస చేయడంతో రైల్వే స్టేషన్కు చేరువలో ఉండే మహేష్ రెస్టారెంట్లో డిన్నర్ చేశారు. 30 మంది ఒకేసారి భోజనాలు చేస్తుండగా ఊరగాయ(పికిల్)లో చనిపోయిన బల్లిని చూశారు. అన్నంలో ఊరగాయను వేసుకుని కలుపుతుండగా ఓ భక్తుడి చేతికి బల్లి తగిలింది. దీంతో అతడక్కడే వాంతులు చేసుకున్నారు. ఈ క్రమంలో మిగతా వారూ అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. స్థానికులు గమనించి అంబులెన్స్లో చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వీరంతా త్వరగానే కోలుకోవడంతో తిరిగి ఉదయాన్నే హైదరాబాదు రైల్వే స్టేషన్కు చేరుకుని పూర్ణా ప్యాసింజర్ రైలులో తిరుగుపయనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మహేష్ హోటల్ను రాత్రి మూసివేయించారు. హోటల్ సిబ్బందిని, యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
సాధా‘రణ’ బోగీ.. కిక్కిరిసి
రైళ్లలో జనరల్ బోగీలు చూడగానే కిక్కిరిసి ఉంటాయి. కూర్చోవడానికే కాదు.. నిల్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు. లగేజీ బెర్తు...వాష్రూమ్, ఫుట్బోర్డు ఇలా ఎక్కడచూసినా ఫుల్ రష్ కనిపిస్తుంది. గంటల తరబడి నిలబడటానికి ఇబ్బంది పడేవారు.. సీట్లలో కూర్చున్న ప్రయాణికుల కాళ్ల వద్ద కూడా కూర్చొనేవారు ఉన్నారు. వాస్తవానికి ఒక్కో జనరల్ బోగీలో కూర్చొని 75 మంది దాకా ప్రయాణించొచ్చు. కానీ ఏ జనరల్ బోగీ చూసినా... అందులో ప్రయాణించే వారి సంఖ్య 150 నుంచి 200 మంది పైనే ఉంటుంది. సికింద్రాబాద్, కాచిగూడ, మహబూబ్నగర్, వరంగల్, కామారెడ్డి, కాజీపేట రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల సమస్యలను తెలుసుకొనేందుకు ‘సాక్షి ’క్షేత్రస్థాయిలో పర్యటించింది. ప్రయాణికుల కష్టాలు తెలుసుకుంది. సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లలో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్కు అనుగుణంగా సాధారణ బోగీల సంఖ్య పెంచకపోవడంతో వందలాదిమంది రెండు, మూడు బోగీల్లోనే కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోంది. దానాపూర్ ఎక్స్ప్రెస్ మాత్రమే కాదు గోదావరి, పద్మావతి, నారాయణాద్రి, విశాఖ ఎక్స్ప్రెస్, తెలంగాణ ఎక్స్ప్రెస్ తదితర అన్ని రైళ్లలోనూ సాధారణ ప్రయాణికులు నిత్యం నరకం చవిచూస్తున్నారు. మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజన్లు ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సివస్తోంది. బిహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన లక్షలాదిమంది కార్మికులు హైదరాబాద్లో నిర్మాణరంగంలో పనిచేస్తున్నారు. ఈ కార్మికుల కుటుంబాలు, బంధువులు నిత్యం తమ స్వస్థలాలకు రాకపోకలు సాగిస్తారు. ఈ ప్రయాణికుల డిమాండ్ మేరకు రైళ్లు లేక, అందుబాటులో ఉన్న రైళ్లలోనే ప్రయాణం చేస్తున్నారు. తగ్గిన ప్యాసింజర్ రైళ్లు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్యాసింజర్ రైళ్లు బాగా తగ్గుముఖం పట్టాయి. కొన్నింటిని ఎక్స్ప్రెస్లుగా మార్చారు. పదేళ్లు దాటినా ఇంటర్సిటీ రైళ్ల సంఖ్య పెరగలేదు. దీంతో హైదరాబాద్ నుంచి దూరప్రాంతాలకు బయలుదేరే రైళ్లలోనే సాధారణ బోగీలను ఆశ్రయించాల్సి వస్తోంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి ప్రతిరోజు రాకపోకలు సాగిస్తున్న సుమారు 250 రైళ్లలో సుమారు 100 వరకు ప్యాసింజర్ రైళ్లు ఉంటే 150 వరకు ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి. కానీ 2 లక్షల మందికి పైగా సాధారణ ప్రయాణికులే కావడం గమనార్హం. ప్రస్తుతం 24 బోగీలు ఉన్న ట్రైన్లలో 2 నుంచి 3 సాధారణ బోగీలు ఉండగా, 18 బోగీలు ఉన్న రైళ్లలో కేవలం 2 సాధారణ బోగీలే ఉన్నాయి. ప్రయాణికులు మాత్రం వాటి సామర్థ్యానికి రెట్టింపు సంఖ్యలో ఉన్నారు. ఎలాగోలా ప్రయాణం ముంబయి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా భువనేశ్వర్కు వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్కు ముందు ఒకటి, వెనుక మరొకటి చొప్పున 2 జనరల్ బోగీలు మాత్రమే ఉన్నాయి. కానీ ఒక్కో బోగీలో కనీసం 250 మందికి పైగా ప్రయాణం చేస్తూ కనిపించారు. కొందరు బాత్రూమ్ వద్ద కిటకిటలాడుతుండగా, మరికొందరు పుట్బోర్డుపైన నిండిపోయారు. అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా ఉంది. » కాజీపేట్, వరంగల్ స్టేషన్లలో సాధారణ బోగీల్లో ప్రయాణికుల దుస్థితిని పరిశీలించినప్పుడు, ఒక్క కోణార్క్ ఎక్స్ప్రెస్లోనే కాకుండా ఈస్ట్కోస్ట్, సంఘమిత్ర, గోరఖ్పూర్, సాయినగర్ షిర్డీ, కృష్ణా, మచిలీపట్నం, గౌతమి, గోదావరి, శాతవాహన, గోల్కొండ, ఇంటర్సిటీ, తదితర అన్ని రైళ్లలోను ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపించింది. » కామారెడ్డి మీదుగా ఇటు సికింద్రాబాద్, అటు నాందేడ్, ముంబై, షిరిడీలకు వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లలోనూ 2 సాధారణ బోగీలు మాత్రమే ఉన్నాయి. » సికింద్రాబాద్ నుంచి ముంబయికి వెళ్లే దేవగిరి ఎక్స్ప్రెస్ ట్రైన్లోని 2 సాధారణ బోగీలు సికింద్రాబాద్లోనే కిక్కిరిసిపోతాయి. కానీ మిర్జాపల్లి, అక్కన్నపేటస్టేషన్, కామారెడ్డి, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నాందేడ్, ముంబయికి వెళ్లే ప్రయాణికులు దేవగిరి ఎక్స్ప్రెస్లోని సాధారణ బోగీలనే ఆశ్రయిస్తారు. దీంతో ఈ ట్రైన్ కామారెడ్డికి వచ్చేసరికి కాలు మోపేందుకు కూడా చోటు ఉండదు. అయినా సరే ముంబయికి ఉపాధి కోసం వెళ్లే కూలీలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నారు. రైళ్ల రద్దుతో పెరుగుతున్న రద్దీ హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే పుష్ఫుల్, ప్యాసింజర్ రైళ్లను తరచు రద్దు చేయడం వల్ల మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లపైన ఒత్తిడి పెరుగుతోంది. మెయింటెనెన్స్ పనుల పేరిట వారం, పదిరోజుల పాటు రద్దు చేస్తున్నారు. మరోవైపు ఏ ట్రైన్ ఎప్పుడు, ఎందుకు రద్దవుతుందో కూడా తెలియదు. దీంతో రోజువారీ ప్రయాణం చేసే చిరువ్యాపారులు, ఉద్యోగస్తులు, విద్యార్ధులు, వివిధ వర్గాలకు చెందినవారు ఎక్స్ప్రెస్ రైళ్లను ఆశ్రయిస్తున్నారు. రోలింగ్ కారిడార్ బ్లాక్ పనుల వల్ల సాధారణ రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేయడమే ఇందుకు కారణం. ‘ఒక నెలలో పుష్ఫుల్ రైళ్లు 20 రోజులునడిస్తే కనీసం 10 రోజులు రకరకాల కారణాలతో రద్దవుతున్నాయని తాండూరుకు చెందిన శ్రీనివాస్ తెలిపారు. మరోవైపు కోవిడ్ అనంతరం చాలా వరకు పుష్ఫుల్ రైళ్లను ఎక్స్ప్రెస్లుగా మార్చారు. సాధారణ బోగీల సంఖ్యను పెంచకుండా చార్జీలు మాత్రమే పెంచారు. » మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్నగర్, తదితర స్టేషన్ల నుంచి సుమారు 1000 మందికి పైగా నగరానికి రాకపోకలు సాగిస్తారు. కానీ మహబూబ్నగర్ నుంచి కాచిగూడకు రాకపోకలు సాగించే డెమో ట్రైన్ తరచు రద్దవుతోంది. గంటల తరబడి ఆలస్యంగా నడుస్తోంది. దీంతో ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొంతకాలంగా 40 నిమిషాలకు పైగా ఆలస్యంగా నడుస్తుందని , దీంతో సకాలంలో హైదరాబాద్కు చేరుకోలేకపోతున్నామని పలువురు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. బోగీలు పెంచడమే పరిష్కారం అన్ని ప్రధాన రైళ్లలో సాధారణ బోగీలను 2 నుంచి 4కు పెంచనున్నట్టు ఇటీవల రైల్వేశాఖ స్పష్టం చేసింది. కానీ దక్షిణమధ్య రైల్వేలో ఇంకా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాలుగైదు రైళ్లలో మాత్రమే బోగీల సంఖ్యను పెంచినట్టు అధికారులు తెలిపారు. జోన్ పరిధిలో సుమారు 320 మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లన్నింటిలోనూ సాధారణ బోగీలు పెంచడమే తక్షణ పరిష్కారం. » అన్ని ప్రధాన రైళ్లలో మహిళల కోసం ఒక ప్రత్యేక బోగీని ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. కిక్కిరిసిన రైళ్లలో ప్రయాణం మహిళలకు ఎంతో కష్టం. ఈ దిశగా చర్యలు చేపట్సాల్సి ఉంది. డెమో రైలును రైట్టైమ్ ప్రకారం నడపాలి మహబూబ్నగర్ డెమో రైలులో ఏడాది నుంచి ప్రయాణం చేస్తున్న. కొద్ది రోజుల నుంచి డెమో ఆలస్యంగా నడుస్తోంది. దీంతో టైమ్ ఆఫీసుకు వెళ్లలేకపోతున్నా. లేట్గా వెళ్లిన రోజుల్లో కొన్నిసార్లు సగం జీతమే లెక్కలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. రైల్వే ఉన్నతాధికారులు స్పందించి డెమో రైలును టైమ్ ప్రకారం నడపాలి. – ఎం.మహేశ్, ప్రైవేట్ ఉద్యోగి, మర్లు (మహబూబ్నగర్) నాలుగు రోజుల జీతం కట్ కొన్ని రోజుల నుంచి డెమో రైలు ఆలస్యంగా బయలుదేరి వెళుతుండ డంతో చాలా ఇబ్బందులు పడుతున్నా. నేను పనిచేసే సంస్థకు ఆలస్యంగా వెళుతుండటంతో నెలలో నాలుగు రోజులైన జీతం కట్ చేస్తున్నారు. డెమో రైలును రైట్టైమ్లో నడిపి మా సమస్యను పరిష్కరించాలి. – శ్రీనివాస్, ప్రైవేట్ ఉద్యోగి, హన్వాడ బోగీలు పెంచాలి ఇరవై ఏళ్లుగా కాంట్రాక్టు రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాను. ఉదయం 9 గంటల వరకు ఉద్యోగంలో ఉండాలి. అందుకే ప్రతి రోజు ఉదయం 7 గంటలకు ఉండే పుష్ఫుల్ ట్రైన్కు వెళ్తాను. ఇది సుమారు 45 నిమిషాల పాటు ఆలస్యంగా వస్తుంది. దీని తర్వాత వచ్చే కాకతీయ ట్రైన్ వేళలు మార్చారు. బోగీల సంఖ్య కూడా తగ్గించారు. దీంతో ఎక్స్ప్రెస్ రైళ్లపైన ఆధారపడాల్సి వస్తోంది. సాధారణ రైళ్లలో బోగీలు పెంచితే చాలు. – సత్తిబాబు, కాంట్రాక్టు రైల్వే ఉద్యోగి, భువనగిరి -
జనం గుండెల్లో బోగీ మంటలు
సాక్షి ప్రతినిధి,గుంటూరు, లక్ష్మీపురం, తెనాలి రూరల్: రైళ్లలోని జనరల్ బోగీలు నరకానికి నకళ్లుగా మారాయి. ఫలితంగా ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. వందల కిలోమీటర్ల దూరం నిలువు కాళ్లపై నిలబడే ఉండాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో మహిళలు, పిల్లలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం తీరుపై మండిపడుతున్నారు. ఏసీ కోచ్లు, వందేభారత్ రైళ్లపై ఉన్న శ్రద్ధ సామాన్యులు వెళ్లే జనరల్ బోగీలపైనా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం వివిధ రైళ్లలో జనరల్ బోగీలపై ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో ఈ విషయాలు బయటపడ్డాయి.రెండే జనరల్ బోగీలుగుంటూరు స్టేషన్ నుంచి నిత్యం సుమారుగా 20 వేల మందికిపైగా ప్రయాణం చేస్తుంటారు. గుంటూరు రైల్వే స్టేషన్కు నిత్యం సుమారుగా 65 రైళ్లు వస్తుంటాయి. వీటిలో ప్రధానంగా సికింద్రాబాద్, వైజాగ్, తిరుపతి, గుంతకల్లు, పిడుగురాళ్ల, విజయవాడ, రాజమండ్రి, వైపుగా ప్రయాణించే రైళ్లు ఉన్నాయి. ఈ స్టేషన్ మీదుగా ప్రయాణించే వాటిలో సికింద్రాబాద్–తిరువనంతపురం వెళ్లే శబరి ఎక్స్ప్రెస్, హౌరా – సికింద్రాబాద్ నడిచే ఫలక్నుమా, సికింద్రాబాద్ – భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్, వాస్కో–షాలీమార్ మధ్య నడిచే అమరావతి ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ – బెంగళూరు మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్ప్రెస్కి రెండు జనరల్ బోగీలు మాత్రమే ఉన్నాయి. వీటిల్లో ప్రయాణికులు కనీసం నిలబడేందుకూ స్థలం లేక నరకయాతన అనుభవించారు. బోగీలో కనీసం తాగునీటి వసతి లేదు. మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దుర్గంధం వెదజల్లుతున్నాయి. వాటివద్దే ప్రయాణికులు కూర్చుని, నిలబడి ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది.ప్యాసింజర్ రైళ్లు తగ్గింపుఒకప్పుడు పేదల బండిగా ఉన్న రైలు ఇప్పుడు పేద వారికి అందని ద్రాక్షగా మారుతోంది. కేంద్రప్రభుత్వం ఎక్స్ప్రెస్లు, సూపర్ఫాస్ట్, వందేభారత్ వచ్చాక ప్యాసింజర్ రైళ్లను తగ్గించి వేయడమే కాకుండా ఎక్స్ ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీలను కాలక్రమేణా కుదిస్తూ వస్తోంది. రైళ్లలో ప్రయాణికుల సౌకర్యాలు పెంచుతున్నామనే పేరుతో రైలు ప్రయాణాన్ని పేదలకు దూరం చేస్తోంది.టాయిలెట్లూ అస్తవ్యస్తం ధన్బాద్ నుంచి అలెప్పి వెళ్లే ఎక్స్ప్రెస్ మంగళవారం మూడు గంటలు ఆలస్యంగా రాత్రి 7.50 గంటలకు తెనాలి రైల్వే స్టేషన్కు వచ్చింది. 24 బోగీలు ఉన్న ఈ రైలులో మూడు మాత్రమే జనరల్ బోగీలు. ఫలితంగా వీటిల్లో జనం కిక్కిరిసిపోయారు. వీటిలో 80 మంది చొప్పున ప్రయాణించేందుకే అవకాశం ఉంటుంది. కానీ సుమారు 140 మంది వరకు ఉన్నారు. రెండు జనరల్ బోగీల బాత్రూమ్లకు కిటికీ అద్దాలు లేవు. అందులోకి వెళ్లిన వ్యక్తి బయటకు కనపడేలా ఉన్నాయి. తలుపు దగ్గర, నడిచే దారిలో, ఆఖరికి టాయిలెట్ల వద్ద కూడా ప్రయాణికులు కూర్చుని ప్రయాణించారు.బోగీలు తగ్గిస్తే ఎలాకేంద్రం సామాన్య ప్రజలకు రైలు ప్రయాణం దూరం చేసేలా ఉంది. జనరల్ బోగీలు ఉండట్లేదు. స్లీపర్ కోచ్లు, ఏసీ కోచ్ల ధరలు అందని ద్రాక్షాలా ఉన్నాయి. నాలాంటి పేదల కోసం జనరల్ బోగీలు పెంచాల్సింది పోయి తగ్గిస్తే ఎలా?– కుర్రా హనుమంతరావు, క్రోసూరు, పల్నాడు జిల్లాఉగ్గబట్టుకున్నాంమాది తెనాలి. నేను శబరి ఎక్స్ప్రెస్ జనరల్ బోగీలో ఎక్కాను. ఎప్పుడు తెనాలి చేరుకుంటానా అని ఉగ్గబట్టుకుని కూర్చున్నా. భరించలేని దుర్వాసన, నిలబడేందుకూ స్థలం లేదు. ఫుట్ బోర్డుపై కూర్చుని ప్రయాణించాను.– కూరపాటి సుదీప్, తెనాలికిటకిటనేను తిరుపతి వెళ్తున్నా. నేను ఎక్కిన రైలులో రెండు మాత్రమే జనరల్ బోగీలు. కిటకిటలాడుతున్నాయి. ఏ స్టేషన్లో అయినా తగ్గుతారని అనుకుంటే రైలు ఆగిన ప్రతి స్టేషన్లో జనం ఎక్కుతూనే ఉన్నారు. జనరల్ బోగీలను పెంచాలి.– గాజలు రామాంజనేయులు, బయ్యవరం -
రైలులో మంటలు... నాలుగు బోగీలు దగ్ధం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ ప్యాసింజర్ రైలు అగ్నిప్రమాదానికి గురైంది. సోమవారం(జూన్3) ఢిల్లీ సరితా విహార్లో తాజ్ ఎక్స్ప్రెస్ రైలుకు మంటలంటుకున్నాయి. దీంతో రైలులోని నాలుగు బోగీలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి.అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ ఏమీ కాలేదని ఢిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపింది. మంటలార్పడానికి ఐదు ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. అగ్ని ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉంది. Breaking: Fire in a passenger train near Sarita Vihar, Delhi. 6 fire tenders rushed to the site. Further details awaited. pic.twitter.com/ru0l6UPG8y— Prashant Kumar (@scribe_prashant) June 3, 2024 -
హేవలాక్.. గోదావరి ఐకానిక్..
సాక్షి డెస్క్, రాజమహేంద్రవరం: అమ్మమ్మగారింటికనో.. చుట్టాలింటికనో గోదావరి అవతల ఉన్న ఏ విజయవాడకో.. మెడ్రాసుకో (ఇప్పుడంటే చైన్నె కానీ.. అప్పట్లో అలానే కాస్త స్టైలుగా అనేవారు ఎందుకో! కాకపోతే కొందరు మద్రాసు, మదరాసు అనేవారు) చిన్నప్పుడు వెళ్లిన వాళ్లందరికీ రాజమండ్రి పాత రైలు బ్రిడ్జిపై ప్రయాణం ఎప్పటికీ చెదరని ఓ మధుర జ్ఞాపకమే. పగటి పూట అయితే చాలామంది కాకినాడ – మెడ్రాసు సర్కార్ ఎక్స్ప్రెస్ లేకపోతే ప్యాసింజర్ రైలు ఎక్కేవారు. అప్పట్లో బొగ్గు ఇంజన్. కూ... అంటూ చెవులు చిల్లులు పడేలా పే....ద్ధ కూత పెట్టుకుంటూ చుక్చుక్చుక్ మంటూ వచ్చేది. రైలు నెమ్మదిగా రాజమండ్రి (కొంతమంది ‘రాజమంట్రి’ అనేవారు. అదేమిటో!) చేరిందంటే చాలు.. గోదావరి వచ్చేసిందని పెద్దవాళ్లు అప్రమత్తం చేసేవారు. అందరూ పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు, పది, 20 పైసలు.. కాస్త ఉన్న వాళ్లయితే పావలా నుంచి రూపాయి కాసు వరకూ చేతులతో పట్టుకుని రైలు బోగీ కిటికీలు, గేట్ల వద్దకు ఉరికేందుకు సిద్ధంగా ఉండేవారు. ఏదో యుద్ధానికి సిద్ధమైన యోధుల్లా..రైలు కూత పెట్టి నెమ్మదిగా రాజమండ్రి స్టేషన్ను వీడేది. ఇంజిన్.. దాని వెనుకనే ఒకదాని వెనుకన ఒక్కో బోగీ గోదావరి బ్రిడ్జి మీదుగా పరుగులు తీసేవి. ఇప్పుడంటే రోడ్ కం రైల్వే బ్రిడ్జి, ఆర్చి బ్రిడ్జి ఉన్నాయి కానీ.. అప్పట్లో రైలు గోదావరి దాటాలంటే ఒక రకం జేగురు రంగులో ఉండే రెడ్ ఆకై ్సడ్ పూత పూసిన పాత బ్రిడ్జి ఒక్కటే దిక్కు.. దీనికే హేవలాక్ బ్రిడ్జి అని మరో పేరు. అమ్మో బ్రిడ్జి మీద ప్రయాణమే.. అప్పట్లో ఆ బ్రిడ్జిపై ప్రయాణం అంటే చాలామందికి హడల్.. గుండెలు గుబగుబలాడిపోయేవి. ఓపక్క ఠక్ఠక్.. ఠక్ఠక్ అంటూ రైలు చక్రాల సౌండ్.. అది ఇనుప బ్రిడ్జి కావడంతో వాటి అదురు నుంచి వచ్చే రీసౌండ్.. చిన్న పిల్లలైతే భయంతో బిర్రబిగుసుకుపోయేవాళ్లు. మరోపక్క కిందన అఖండ గోదావరి. ఎటు చూసినా కనుచూపు మేరంతా అగాధంలాంటి జలరాశే. అసలే ఆ బ్రిడ్జికి అటూ ఇటూ ఏమీ ఉండేవి కావు. ఒక వేళ ఈ రైలు ఆ బ్రిడ్జి మీంచి కింద పడిపోతే.. అనే ఆలోచన వస్తేనే పై ప్రాణాలు పైనే పోయినట్టుండేది. (ఒకవేళ బ్రిడ్జికి అటూ ఇటూ గోడలుంటే మాత్రం వేగంగా వెళ్తున్న రైలు పడితే ఆపుతాయా? అదో వెర్రి ఆలోచన.) ఈలోగా గోదావరిలో డబ్బులేసేవాళ్లు.. పూలు, పండ్లు విసిరేవారు.. చల్లగా చూడాలమ్మా అంటూ తల్లి గోదారికి దణ్ణాలు పెట్టేవాళ్లు. ఈ ప్రాంత ప్రజలతోనే కాదు.. ఉత్తరాంధ్ర ప్రజలతో కూడా అనుబంధం పెనవేసుకున్న ఈ హేవలాక్ వంతెనకు చాలానే చరిత్ర ఉంది. అంతకు ముందు కేవలం పడవలే.. హేవలాక్ బ్రిడ్జి నిర్మించక ముందు గోదావరి నదిని దాటడానికి ఇక్కడి ప్రజలు పడవలే వినియోగించేవారు. ఆ రోజుల్లో గోదావరి వరద ఉధృతంగా ఉంటే ఒక్కోసారి పడవలు తలకిందులై ప్రాణనష్టం కూడా జరిగేది. అటువంటి దుస్థితికి ఈ వంతెన చెక్ చెప్పింది. ప్రజలు సురక్షితంగా గోదావరి దాటడానికి ఒక రవాణా సాధనం లభించింది. అప్పట్లో బ్రిడ్జిపై ఎలాంటి ఆధారం లేకుండా రైలు వెళ్తూంటే అందులోని ప్రయాణికులు చాలా భయపడేవారు. అదే సమయంలో థ్రిల్గా కూడా ఫీలయ్యేవారు. పర్యాటక ఆకర్షణగా మార్చేందుకు ప్రణాళిక రైళ్ల రాకపోకలను 1997లో నిలిపివేసిన పదేళ్ల తరువాత ఈ వంతెనను పర్యాటకంగా, రాజమహేంద్రవరం – కొవ్వూరు మధ్య పాదచారుల మార్గంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని ప్రభుత్వం భావించింది. ఇందుకు అనుగుణంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ 2008లో ఈ వంతెన సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టేందుకు తీర్మానం చేసింది. దీనిపై రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించలేదు. నాటి ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ఈ ప్రాజెక్ట్ను ఆమోదించాల్సిందిగా రైల్వే శాఖకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. హేవలాక్ బ్రిడ్జిని తొలగించి, దానిలోని ఉక్కును తీసుకువెళ్లాలని రైల్వే శాఖ చేసిన యత్నాలను స్థానికులు తిప్పి కొట్టారు. ఈ ఐకానిక్ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరారు. బ్రిడ్జిపై రోడ్డు వేస్తే చిరు వ్యాపారులకు, రైతులకు ఉపయోగపడుతుందని, వాకింగ్ ట్రాక్గా కూడా పనిస్తుందని చెప్పారు. చిన్నచిన్న దుకాణాలు ఏర్పాటు చేస్తే పర్యాటకంగా ఆకట్టుకుంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2017లో రైల్వే శాఖకు కొంత మొత్తం చెల్లించి, సొంతం చేసుకుంది. దీనిని వారసత్వ సంపదగా అభివృద్ధి చేస్తామని చెప్పింది. అడుగులు ముందుకు పడలేదు. ప్రస్తుత రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ కల సాకారమయ్యే రోజు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలు పొడవు : 2.7 కిలోమీటర్లు – వెడల్పు: 1.7 మీటర్లు నిర్మాణం ప్రారంభం : 1897 నవంబర్ 11 నిర్మాణ అంచనా వ్యయం : రూ.47 లక్షలు వంతెన ప్రారంభం : 1900 ఆగస్టు 30 వంతెన మూసివేత : 1997 స్తంభాలు : 56 (రాతి కట్టడాలు) మొట్టమొదట ప్రయాణించిన రైలు : మెయిల్ చివరిసారి ప్రయాణించిన రైలు : కోరమాండల్ ఎక్స్ప్రెస్ 1897లో నిర్మాణం ఆరంభం ఈ వంతెనను అఖండ గోదావరిపై బ్రిటిష్ వారి పాలనలో హౌరా – మద్రాసు (నేటి చైన్నె) రైలు మార్గంలో రాజమహేంద్రవరం – కొవ్వూరు పట్టణాల మధ్య 1897లో నిర్మించారు. దీనిని వంద సంవత్సరాల పాటు వినియోగంలో ఉండేలా అప్పట్లో డిజైన్ చేశారు. స్తంభాలు పూర్తి రాతి కట్టడాలు. బలమైన ఉక్కు గడ్డర్లు ఉపయోగించారు. దీని నిర్మాణానికి ఫ్రెడరిక్ థామస్ గ్రాన్విల్లే వాల్డన్ ఇంజినీర్ ఇన్ చీఫ్గా వ్యవహరించారు. ఈ వంతెనకు అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నర్ సర్ ఆర్థర్ ఎలిబ్యాంక్ హేవ్లాక్ పేరు పెట్టారు. -
సికింద్రాబాద్ టు సిద్దిపేట రూ.440
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి సిద్దిపేటకు ఎక్స్ప్రెస్ బస్ చార్జి రూ.140. వెళ్లి రావటానికి రూ.280. రెండు రోజులకు రూ.560. అదే రైలులో నెల రోజులు ప్రయాణించేందుకు రూ.440 చెల్లిస్తే సరి. రెండు రోజుల బస్ చార్జి కంటే చవకగా, ఏకంగా నెలరోజుల పాటు ప్రయా ణించే వెసులుబాటును రైల్వే శాఖ కల్పించింది. ఈ నెల మూడో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన సికింద్రాబాద్–సిద్దిపేట ప్యాసింజర్ రైలు ఆ ప్రాంత వాసులకు కారు చవక ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య 117 కి.మీ. ప్రయాణానికి రైలు టికెట్ ధర కేవలం రూ.60 మాత్రమే. ఇప్పుడు దానిని మరింత చవకగా మారుస్తూ నెలవారీ సీజన్ టికెట్ను అందుబాటులోకి తెచ్చింది. మామూలు టికెట్ ప్రకారం.. వెళ్లి రావటానికి రూ.120 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆ లెక్కన నెల రోజులకు రూ.3,600 అవుతుంది. కానీ, నెల రోజుల సీజన్ టికెట్ కొంటే కేవలం రూ.440తో నెల రోజుల పాటు ఎన్ని ట్రిప్పులైనా తిరగొచ్చు. ఇంతకాలం బస్సులు, ప్రైవేటు వాహనాలకు ఎక్కువ మొత్తం చెల్లిస్తూ ప్రయాణిస్తున్న నిరుపేద వర్గాలకు ఇది పెద్ద వెసులుబాటుగా మారనుంది. స్పెషల్ రైలు సర్వీసుగా సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య ఈ రైలు సేవలు ప్రారంభమైనప్పటికీ, సీజన్ టికెట్ను జారీ చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ప్రత్యేక రైలులో ఎక్స్ప్రెస్ టికెట్ ధరలను అమలు చేస్తారు. దాన్ని రెగ్యులర్ సర్వీసుగా మార్చగానే ఆర్డినరీ టికెట్ ధరలను వర్తింపచేస్తారు. ఈ ప్రకారం ప్రస్తుతం అమలులో ఉన్న టికెట్ ధర రూ.60 నుంచి రూ.50కి తగ్గుతుంది. అయితే దీనితో సంబంధం లేకుండా ఇప్పుడు సీజన్ టికెట్ను అందుబాటులోకి తెచ్చారు. 101 కి.మీ. నుంచి 135 కి.మీ. వరకు ప్రయాణ దూరానికి సీజన్ టికెట్ ధర రూ.440 ఉంటుంది. సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య రైలు ప్రయాణ దూరం 117 కి.మీ.గా ఉంది. దీంతో ఈ టికెట్ ధరను రూ.440 ఖరారు చేశారు. నెల తర్వాత దానిని మళ్లీ రెన్యూవల్ చేసుకోవచ్చు. సికింద్రాబాద్ –సిద్దిపేట మధ్య ఇతర స్టేషన్ల వరకు కూడా ఈ సీజన్ టికెట్ పొందే వెసులుబాటు కల్పించారు. ఆయా స్టేషన్ల మధ్య దూరం ఆధారంగా ఆ టికెట్ ధర ఉంటుంది. ట్రిప్పు వేళలు ఇలా.. ♦ సిద్దిపేటలో రైలు (నంబరు:07483) ఉదయం 6.45కు బయలుదేరి సికింద్రాబాద్కు 10.15కు చేరుకుంటుంది. ♦ తిరిగి సికింద్రాబాద్లో రైలు (నంబరు:07484) ఉదయం 10.35కు బయలుదేరి సిద్దిపేటకు మధ్యాహ్నం 1.45 గంటలకు చేరుకుంటుంది. ♦ తిరిగి సిద్దిపేటలో మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరి సిక్రింద్రాబాద్కు సాయంత్రం 5.20 గంటలకు చేరుకుంటుంది. ♦ సికింద్రాబాద్లో సాయంత్రం.5.45 గంటలకు బయలుదేరి సిద్దిపేట కు రాత్రి 8.45 గంటలకు చేరుకుంటుంది. ♦ హాల్ట్స్టేషన్లు: మల్కాజిగిరి, కేవలరీ బ్యారెక్స్, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చ ల్, మనోహరాబాద్, నాచారం, బేగంపేట, గజ్వేల్, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ, సిద్దిపేట -
ప్యాసింజర్ రైళ్లు ఆలస్యం..
పెద్దపల్లి: సాధారణ, మధ్య తరగతి ప్రజలు తక్కువ ఖర్చు.. భద్రతతో కూడిన రైలులో సకాలంలో గమ్యం చేరేందుకు ప్రయాణిస్తుంటారు. అయితే ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖాజీపేట–సిర్పూర్ కాగజ్నగర్, నిజామాబాద్– సిర్పూర్కాగజ్నగర్ మధ్య నడిచే రామగిరి, పుష్పుల్, ఇంటర్సిటీ, సింగరేణి ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. 98 కిలోమీటర్ల దూరంలో కాజీపేట, 220కిలోమీటర్ల దూరంలో ఉన్న సికింద్రాబాద్, ని జామాబాద్ వెళ్లేందుకు పొద్దస్తమానం పడిగాపులు కాయాల్సి వస్తోందని ప్రయాణికులు అంటున్నారు. ట్రాక్ పనులు చేపడితే రద్దే.. కరీంనగర్, కాజీపేట– కాగజ్నగర్ మధ్య రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడితే గతంలో ఒకటి రెండు రైళ్లను నడిపించిన రైల్వేశాఖ.. ప్రస్తుతం వారం రోజుల పాటు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తోంది. ఆర్టీసీ బస్సు చార్జీలతో పోల్చితే నాలుగో వంతు రైలు చార్జీలు ఉండడంతో సాధారణ, నిరుపేద ప్రయాణికులు రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతారు. కాగా గంటల తరబడి రైళ్ల ఆలస్యంతో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్స్ప్రెస్, గూడ్సులకే మొదటి ప్రాధాన్యం క్రమంగా పెరుగుతున్న రైళ్ల సంఖ్యకు అనుగుణంగా రైల్వే ట్రాక్స్ విస్తరిస్తున్న రైల్వేశాఖ ప్యాసింజర్ రైళ్ల రాకపోకలపై మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. ప్యాసింజర్ రైలు రాకపోకలు సాగించే క్రమంలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైళ్లు మొదటగా పంపించేందుకు వీటిని గంటల తరబడి నిలిపివేస్తుండడంతో సాధారణ ప్రయాణికులు ఇక్కట్లకు గురవుతున్నారు. గూడ్స్ రాకపోకలతో వందలాది కోట్ల ఆదాయం ఉండగా, రైల్వేశాఖ సేవా దృక్పథాన్ని మరిచి లాభార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తుందనే విమర్శలు మూటగట్టుకుంటుంది. -
ప్యాసింజర్ రైళ్లకు మంగళం
స్వాతంత్రోద్యమ కాలం నుంచి రైళ్లు ప్రజల జీవితాలతో ముడిపడి ఉండేవి. రోడ్డు మార్గాలు, రవాణా సాధనాలు అంతంతమాత్రంగా ఉన్న రోజుల్లో పేద, మధ్య, ఎగువ తరగతి ప్రజలకు ప్రయాణ సాధనం రైలు మాత్రమే. దీంతో రైల్వే శాఖ నిరంతరం ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో పనిచేసేది. కాలక్రమేణా ఆధునికత సంతరించుకున్న రైల్వే శాఖ సేవామార్గాన్ని విస్మరించి లాభార్జనే పరమావధిగా పనిచేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి, వాటిని ఎక్స్ప్రెస్లుగా మర్పు చేయడంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రయాణం భారంగా మారింది. ఏలూరు (టూటౌన్): ఒక నాడు అధికంగా కనిపించే ప్యాసింజర్ రైళ్లు క్రమేణా కనుమరుగయ్యాయనే చెప్పవచ్చు. ఎక్కడో కొన్ని మార్గాల్లో మినహా ప్యాసింజర్ రైళ్లు అనేవి కనిపించని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా విజయవాడ డివిజన్ పరిధిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా రాజమండ్రి–విజయవాడ ప్యాసింజర్ రైలు ప్రతి రోజు అప్ అండ్ డౌన్గా తిరిగేది. ఇది పేద ప్రజలకు, నిత్యం ప్రయాణించే చిరు వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు అక్కరకు వచ్చేది. ఉదాహరణకు ఏలూరు నుంచి కేవలం రూ.15 చార్జీతో విజయవాడ ప్రయాణం చేసి మళ్లీ సాయంత్రం తిరిగి వచ్చే వెసులుబాటు ఉండేది. అంటే ఒక ప్రయాణికుడు కేవలం రూ.30 ఖర్చుతో ఏలూరు నుంచి విజయవాడ వెళ్లి వచ్చే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఈ రైలు ఎక్స్ప్రెస్గా మార్చి వేశారు. అలాగే చార్జీలు పెద్ద ఎత్తున పెంచి వేశారు. దీంతో గతంలో కిక్కిరిసి ఉండే ప్రయాణికులు ప్రస్తుతం ఎక్స్ప్రెస్ రైలుగా మార్చిన తరువాత నామమాత్రంగానే కనిపిస్తున్నారు. కాకినాడ పోర్టు నుంచి విజయవాడ వచ్చే ఫాస్ట్ ప్యాసింజర్ రైలు సైతం నేడు ఎక్స్ప్రెస్ రైలుగా రూపాంతరం చెందింది. సుదూర ప్రాంతం నుంచి వచ్చే రాయగడ–గుంటూరు ప్యాసింజర్ సైతం ఎక్స్ప్రెస్గా మార్చి వేశారు. దీంతో ఈ ప్రాంతం నుంచి విశాఖపట్టణం, శ్రీకాకుళం, రాయగడ ప్రాంతాలకు వెళ్లే వలస కూలీలు, సాధారణ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పాత సీసాలో కొత్త సారా నింపినట్లు గతంలో నడిచే ప్యాసింజర్ రైళ్లనే ఎక్స్ప్రెస్లుగా మార్చి వేసి పెద్ద ఎత్తున చార్జీలు వసూలు చేస్తున్నారే తప్ప ఆ రైళ్లల్లో అదనంగా ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదంటూ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. స్లీపర్ బోగీలు కుదింపు.. ఏసీ బోగీలు పెంపు రైళ్లలో ప్రయాణించే జనరల్, స్లీపర్ క్లాస్ బోగీల విషయంలో రైల్వే శాఖ పట్టించుకోవడం లేదనేది ప్రయాణికుల వాదనగా ఉంది. రద్దీ ఉండే అనేక రైళ్లలో ఏసీ బోగీల సంఖ్యను ఇబ్బడిముబ్బడిగా పెంచుతున్నారు. ఇదే సమయంలో జనరల్, స్లీపర్ బోగీల సంఖ్యను కుదిస్తున్నారు. భువనేశ్వర్ నుంచి బెంగుళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్ప్రెస్లో గతంలో స్లీపర్ బోగీలు 10, ఏసీ బోగీలు 3 ఉండేవి. తాజాగా స్లీపర్ బోగీలను ఆరుకు తగ్గించి, ఏసీ బోగీలను ఆరుకు పెంచారు. అలాగే విశాఖపట్టణం–హైదరాబాద్ మధ్య నడిచే గోదావరి ఎక్స్ప్రెస్లో గతంలో స్లీపర్ బోగీలు 12 ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య ఏడుకు తగ్గించి, ఏసీ బోగీలను మూడు నుంచి ఏడుకు పెంచారు. ఇలా పలు ఎక్స్ప్రెస్ రైళ్లలో స్లీపర్ బోగీలను తగ్గించి, ఏసీ బోగీలను పెంచడం వల్ల సాధారణ ప్రజలకు రైలు ప్రయాణం అందని ద్రాక్షలా చేస్తున్నారనేది ప్రయాణికుల వాదనగా ఉంది. రైళ్ల రద్దుతోనూ తప్పని అవస్థలు ఇటీవల ఒడిశాలో జరిగిన కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంతో పాటు ట్రాక్ల మెయింట్నెన్స్ పేరుతో విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. నిత్యం ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండే విజయవాడ–విశాఖపట్టణం రత్నాచల్ ఎక్స్ప్రెస్, గుంటూరు–విశాఖపట్టణం మధ్య నడిచే సింహాద్రి ఎక్స్ప్రెస్, కాకినాడ పోర్టు–విజయవాడ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలును పలు పర్యాయాలు రద్దు చేస్తుండటంతో వాటిలో ప్రయాణించేందుకు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ రెగ్యులర్ ప్రయాణికులు, విద్యార్థులు, వ్యాపారులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు నిత్యం ప్రయాణించే రైళ్లే. వీటిని పలు కారణాలతో ఎక్కువ సార్లు రద్దు చేస్తుండటంతో నిత్యం ప్రయాణించే వారి బాధలు వర్ణనాతీతంగా చెప్పుకోవచ్చు. ఆదాయం బాగుంటేనే గ్రీన్సిగ్నల్ పలు కారణాలతో ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్న రైల్వే శాఖ అంతరాష్ట్ర సర్విసులను, రైల్వేకు అధిక ఆదాయం తెచ్చే వందేభారత్ వంటి రైళ్ళను మాత్రం యధావిధిగా నడపడంపై సాధారణ ప్రయాణికులు విమర్శలు చేస్తున్నారు. భిన్నమతాలు, భాషలు, ప్రాంతాలను కలిపే రైళ్లు నేడు లాభాలు తెచ్చే మార్గాల వైపే దృష్టి సారించడం శోచనీయమంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్లీపర్ బెర్త్ దొరకడమే కష్టమే స్లీపర్ క్లాస్ బోగీల సంఖ్యల తగ్గించి వేస్తుండటంతో రిజర్వేషన్ దొరకడమే కష్టంగా మారింది. నెల ముందు రిజర్వేషన్ కోసం ప్రయత్నించినా వెయిటింగ్ లిస్ట్ వస్తోంది. గతంలో నాలుగు రోజుల ముందు ప్రయత్నిస్తే స్లీపర్ క్లాస్లో రిజర్వేషన్ దొరికేది. సామాన్య, మధ్యతరగతి ప్రయాణికుల పట్ల రైల్వే శాఖ శ్రద్ద చూపాల్సిన అవసరం ఉంది. – కొరబండి బాబూరావు, సామాజిక కార్యకర్త, ఏలూరు -
రెండు రైల్వే లైన్లు !
కోదాడ: ఇప్పటి వరకు ప్యాసింజర్ రైలు ముఖం చూడని జిల్లా వాసులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. జిల్లా మీదుగా రెండు రైల్వే లైన్లు వేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో కొద్ది సంవత్సరాల్లోనే జిల్లా వాసులకు ఒక సాధారణ, మరో హైస్పీడ్ రైల్వేలైన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే డోర్నకల్–మిర్యాలగూడ మార్గానికి సంబంధించి సర్వే దాదాపు పూర్తికావొచ్చింది. తాజాగా శుక్రవారం కేంద్ర రైల్వే, పర్యాటకశాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్రెడ్డిలు తెలుగు రాష్ట్రాల విభజన హామీల్లో భాగంగా శంషాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్ వరకు హైస్పీడ్ రైల్వేలైన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీని సర్వే కోసం కాంట్రాక్టర్ను కూడా నియమించడంతో ఈ ప్రాజెక్టు వేగంగా పట్టాలెక్కే అవకాశముంది. కేంద్ర మంత్రుల తాజా ప్రకటనతో జిల్లావాసులకు ఆనందాన్ని కలిగిస్తుంది. తీరనున్న జిల్లా వాసుల చిరకాల వాంఛ తమ పట్టణంలో రైలు ఎక్కాలనుకుంటున్న జిల్లావాసుల చిరకాలకోరిక తీరే సమయం దగ్గరపడింది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్రెడ్డి ప్రకటించిన ఈ కొత్త రైల్వేలైన్ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే జిల్లాలోని సూర్యాపేట, కోదాడ వాసులు హైస్పీడ్ రైలు ఎక్కడానికి ఎక్కువ సమయం పట్టదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల విభజన హామీల్లో భాగంగా రెండు రాష్ట్రాలను కలుపుతూ శంషాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్ వరకు కొత్త రైల్వేలైన్ ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ (పెట్) సర్వేకు రైల్వేబోర్డు అనుమతులు మంజూరు చేసింది. దీనికి కాంట్రక్టర్ను కూడా నియమించింది. ఆరు నెలల్లో సదరు కాంట్రాక్టర్ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. 220 కి.మీ. గరిష్ట వేగంతో (సెమీ హైస్పీడ్) రైళ్లను నడిపే విధంగా ఈ లైన్ వేయాలని నిర్ణయించారు. రైల్వే లైన్ అలైన్మెంట్ ప్రాథమికంగా శంషాబాద్ నుంచి అంబర్పేట ఓఆర్ఆర్ మీదుగా 65వ నంబర్ జాతీయ రహదారికి సమాంతరంగా ఏర్పాటు చేయడానికి అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. దీనివల్ల ఉమ్మడి జిల్లాలోని చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి, సూర్యాపేట, కోదాడ పట్టణాల సమీపంలోనుంచి ఈ లైన్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పూర్తికావొచ్చిన డోర్నకల్ – మిర్యాలగూడ లైన్ సర్వే డోర్నకల్ నుంచి మిర్యాలగూడ వరకు నూతనంగా ఏర్పాటు చేయనున్న బ్రాడ్గేజ్ రైల్వేలైన్ సర్వే పనులు గడిచిన ఆరు నెలలుగా జరుగుతున్నాయి. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో సర్వే పనులు ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం నల్లగొండ జిల్లా పరిధిలో సర్వే జరుగుతోంది. ఈ లైన్ డోర్నకల్, నేలకొండపల్లి, కోదాడ, హుజూర్నగర్ల మీదుగా మిర్యాలగూడకు చేరుకోనుంది. మరో ప్రతిపాదనలో డోర్నకల్, నేలకొండపల్లి, కోదాడ, హుజూర్నగర్ మీదుగా ఇప్పటికే ఉన్న జాన్పహాడ్ వద్ద లైన్కు కలిసే విధంగా తయారు చేస్తున్నట్లు సమాచారం. దీనిలో మొదటి ప్రతిపాదనకే అధికారులు మొగ్గుచూపుతున్నారని.., వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ లైన్కు నిధులు మంజూరు చేయించడానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ విషయంలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, కోదాడకు చెందిన ఐఆర్టీఎస్ అధికారి బర్మావత్ నాగ్యానాయక్ తీవ్ర కృషి చేస్తున్నట్లు తెలిసింది. ఎంపీ కాగానే పార్లమెంట్లో ప్రతిపాదించా.. హైదరాబాద్ – విజయవాడల మధ్య హైస్పీడ్ రైల్వేలైన్ ఆవశ్యకతను నేను ఎంపీగా ఎన్నిక కాగానే తొలిసారి పార్లమెంట్లో ప్రతిపాదించాను. రెండు రాష్ట్రాల మధ్య ఈ లైన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాను. ప్రభుత్వం దీనిపై ఇన్నాళ్లకు నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉంది. దీనికి వెంటనే నిధులు మంజూరు చేయించడానికి నావంతు ప్రయత్నం చేస్తాను. – ఉత్తమ్కుమార్రెడ్డి, ఎంపీ నల్లగొండ -
సిబ్బంది లేని రైల్వే స్టేషన్లు అవి.. టిక్కెట్లు ఎవరిస్తారంటే..
మనం పలు రైల్వే స్టేషన్ల పేర్లు వినేవుంటాం. వాటిలో కొన్నింటి పేర్ల చివర సెంట్రల్, టెర్మినల్, రోడ్డు అని ఉండటాన్ని చూసేవుంటాం. అయితే కొన్ని రైల్వే స్టేషన్ల పేరు చివర పీహెచ్ అని రాసివుంటుంది. అలా ఎందుకు ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? అందుకే ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని రైల్వే స్టేషన్ల పేర్ల చివరన పీహెచ్ అని ఉంటుంది. ఇక్కడ పీహెచ్ అంటే పాసింజర్ హాల్ట్ అని అర్థం. అంటే ఈ స్టేషన్లలో కేవలం పాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయి. ఇటువంటి స్టేషన్లు మిగిలిన స్టేషన్ల కన్నా కాస్త భిన్నంగా ఉంటాయి. ఈ స్టేషన్లలో రైల్వేశాఖ తరపున ఎటువంటి అధికారిగానీ, ఉద్యోగిగానీ ఉండరు. పాసింజర్ హాల్ట్ అనేది డీక్లాస్ తరహా స్టేషన్. రైళ్లు ఆగేందుకు సిగ్నల్ చూపేలా ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉండవు. అయితే సిగ్నల్స్ లేని ఇటువంటి స్టేషన్లలో రైళ్లు ఎలా ఆగుతాయనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. ఇటువంటి రైల్వే స్టేషన్లలో రైళ్లను రెండు నిముషాల పాటు ఆపాలంటూ ట్రైన్ డ్రైవర్కు ముందుగానే ఆదేశాలు అందుతాయి. ఈ మేరకు డ్రైవర్ ఆయా స్టేషన్లలో రైళ్లను ఆపుతాడు. కాగా ఇటువంటి స్టేషన్లలో రైల్వే సిబ్బందే లేకపోతే మరి ప్రయాణికులు టిక్కెట్లు ఎలా తీసుకోవచ్చనే సందేహం కలుగుతుంది. ఇటువంటి డీ క్లాస్ స్టేషన్లలో రైల్వేశాఖ స్థానికంగా ఉన్న ఒక వ్యక్తిని కమిషన్ ఆధారంగా టిక్కెట్లు విక్రయించేందుకు నియమిస్తుంది. అయితే ప్రస్తుతం ఇటువంటి రైల్వేస్టేషన్లకు స్వస్తి పలకాలని రైల్వేశాఖ యోచిస్తోంది. ఇటువంటి స్టేషన్ల నుంచి రైల్వేకు ఎటువంటి ఆదాయం రావడంలేదని సమాచారం. -
తీవ్ర విషాదం.. పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు
ఇటీవలే గ్రీస్ దేశంలో జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 50కిపైగా మందికి మృతిచెందిన ఘటన మరువక ముందే మరో విషాదం నెలకొంది. ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పిన ప్రమాద ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో 16 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఈజిప్టు దేశంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఈజిప్టులోని కైరో నగరంలో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. కాగా, నైలు డెల్టాలోని మెనోఫ్ నగరానికి వెళ్లే మార్గంలో కల్యుబ్ నగరంలోని స్టేషన్ మీదుగా ప్రయాణిస్తుండగా ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరకుని గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ రైలు ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించినట్టు వెల్లడించారు. AFP: Two people were killed and several others injured Tuesday in a #train_accident north of #Cairo, #Egypt's #health_ministry said. A ministry statement said there were "two dead in the train accident at #Qalyub, while the injured are in a stable condition." pic.twitter.com/ILBz8R0xs4 — Usama Farag (@VOAFarag) March 7, 2023 -
హైదరాబాద్: పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు ఎంఎంటీఎస్లు, దూర ప్రాంతాలకు మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లు తాత్కాలికంగా రద్దు అయ్యాయి. మరమ్మతుల పనుల కారణంగానే దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. నేడు(బుధవారం),రేపు(గురువారం) నడిచే ప్యాసింజర్ రైళ్లు కూడా రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే. ప్యాసింజర్ రైళ్లలో.. విజయవాడ-భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్-విజయవాడ, సికింద్రాబాద్-వరంగల్, వరంగల్-సికింద్రాబాద్ సర్వీసులు ఉన్నాయి. అలాగే.. ఎంఎంటీఎస్ రైళ్ల వివరాలకొస్తే.. లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, ఫలక్నుమా-లింగంపల్లి లింగంపల్లి-ఫలక్నుమా ఆర్సీ పురం-ఫలక్నుమా ఫలక్నుమా-ఆర్సీ పురం ఫలక్నుమా-హైదరాబాద్ల మధ్య ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. రెండురోజుల పాటు ఈ అంతరాయం కొనసాగుతుందని ట్విటర్ ద్వారా స్పష్టం చేసింది దక్షిణ మధ్య రైల్వే. Cancellation of Passenger and MMTS Trains pic.twitter.com/RuX3ewtDG2 — South Central Railway (@SCRailwayIndia) January 11, 2023 -
Train Video: ఇది రైలు ప్రయాణమా? ఇంత ఘోరమా?
వైరల్: మన దేశంలోనే అతిపెద్ద ప్రజారవాణా వ్యవస్థ.. భారతీయ రైల్వేస్. అలాగే.. అత్యంత రద్దీ వ్యవస్థ కూడా ఇదే!. పండుగలు, ఇతర సెలవుల సమయంలో రైళ్లలో రద్దీ ఏపాటి ఉంటుందో తెలియంది కాదు. అయితే.. సాధారణ రోజుల్లోనూ కొన్ని మార్గాల్లో రద్దీ అధికంగా ఉంటోంది. ఆ రద్దీని తట్టుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించలేకపోతోందనే విమర్శ ఇండియన్ రైల్వేస్పై ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా రాజేష్ దుబే అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అమృత్సర్ కథిహార్ ఎక్స్ప్రెస్లో 72 బెర్త్ స్లీపర్లు ఉన్న కోచ్లో ఏకంగా 350 మంది ప్రయాణించారు. ఎటు చూసినా ప్యాసింజర్లు, లగేజీలతో పూర్తిగా కిక్కిరిసిపోయింది. అంత నరకంలోనూ గమ్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లు, మరో మార్గం లేక ఇలా చేసినట్లు కొందరు ప్రయాణికులు వెల్లడించారు. అయితే.. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులు అలా ప్రయాణించడం నేరమే!. కానీ, ఆ టైంకి అక్కడ టీటీఈ కూడా లేకపోవడంతో.. విషయం రైల్వేస్ దృష్టికి వెళ్లింది. రైల్వే సేవా అధికారిక ట్విటర్ అకౌంట్ ఈ ప్రయాణ వివరాలను అందించమని కోరగా.. చివరకు ఫిర్యాదు నమోదు అయ్యింది. Video Credits: The Logical Indian -
దేశంలో అత్యంత నెమ్మెదిగా నడిచే రైలు ఇదే.. అయినా ‘యూనెస్కో’ గుర్తింపు
చెన్నై: ఒక రైలు తన ప్రయాణం మొదలు పెట్టిందంటే.. అది గమ్యం చేరేందుకు గరిష్ఠ వేగంతో దూసుకెళ్తుంది. వందే భారత్, రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్, దురంతో ఎక్స్ప్రెస్ వంటి రైళ్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయని తెలుసు. కానీ, దేశంలో అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఏదో తెలుసా? అసలు అలాంటి ఓ ట్రైన్ ఉంటుందని ఊహించారా? అవునండీ నిజమే ఉంది. అది కేవలం గంటకు 10 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది. కానీ, అది యునెస్కో వారసత్వ సంపద జాబితాలో చోటు సంపాదించింది. అదే తమిళనాడులోని ‘మెట్టుపాలయం ఊటీ నీలగిరి ప్యాసెంజర్ ట్రైన్’. ఈ ట్రైన్ ప్రత్యేకతలు ఓసారి తెలుసుకుందాం. భారత్లో అత్యంత నెమ్మెదిగా నడిచే ట్రైన్గా ఈ రైలు ప్రసిద్ధిగాంచింది. అత్యంత వేగంగా నడిచే రైలుతో పోలిస్తే.. ఇది 16 రెట్లు నెమ్మదిగా వెళ్తుందంటే నమ్మశక్యం కాదు. ఐదు గంటల్లో కేవలం 46 కిలోమీటర్లు ప్రయాణించి గమ్యం చేరుకుంటుంది. అయితే, అందుకు ప్రధాన కారణం అది కొండ ప్రాంతంలో నడవటమే. ఐక్యరాజ్య సమితి విభాగం యునెస్కో ఈ రైలును ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. యునెస్కో ప్రకారం.. నీలగిరి మౌంటెయిన్ రైల్వే లైన్ నిర్మాణం కోసం 1854లో తొలుత ప్రతిపాదన చేశారు. కానీ, కొండల్లో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులతో వాయిదా పడుతూ వచ్చింది. చివరకు 1891లో పనులు ప్రారంభం కాగా.. 1908లో పూర్తయ్యాయి. The slowest train goes uphill at the speed of 10 kilometers per hour You can jump off the train, light up a smoke, take few drags and climb on the train again. It’s the Mettupalayam Ooty Nilgiri Passenger train. pic.twitter.com/DHyFKe3cbp — Gouthama Venkata Ramana Raju Chekuri (@gouthamaraju) May 2, 2020 ఆహ్లాదానిచ్చే రైడ్.. ఐఆర్టీసీ ప్రకారం.. ఈ రైలు చాలా సొరంగాల గుండా ప్రయాణిస్తుంది. 46 కిలోమీటర్ల ప్రయాణంలో 100కుపైగా వంతెనలను దాటుతుంది. పెద్ద పెద్ద రాళ్లు, లోయలు, తేయాకు తోటలు, పచ్చని కొండల అందాలు ఆహ్లాదానిస్తాయి. మెట్టుపాలయం నుంచి కూనూర్ మధ్య సుందరమైన దృశ్యాలు కనిపిస్తాయి. ప్రధాన స్టేషన్లు.. నీలగిరి మౌంటెయిన్ రైల్వే ప్రతిరోజు మెట్టుపాలయం నుంచి ఊటీ వరకు సేవలందిస్తుంది. రోజు ఉదయం 7.10 గంటలకు ఈ రైలు మెట్టుపాలయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ఊటీకి చేరుకుంటుంది. తిరిగి ఊటీలో 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.35 గంటలకు మెట్టుపాలయంకు చేరుకుంటుంది. ఈ రూట్లో ప్రధానంగా కూనూర్, వెల్లింగ్టన్, అరవన్కుడు, కెట్టి, లవ్డేల్ వంటి స్టేషన్లు వస్తాయి. ఈ రైలులో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అని రెండు రకాల కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఫస్ట్ క్లాస్లో తక్కువ సంఖ్యలో సీట్లు ఉంటాయి. డిమాండ్ పెరిగిన క్రమంలో 2016లో నాలుగో బోగీని జత చేసింది రైల్వే శాఖ. టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? నీలగిరి మౌంటెయిన్ రైల్వేలో ప్రయాణించేందుకు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. హాలీడేస్, వీకెండ్లో పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదీ చదవండి: ఏనుగుతో ఫోటోకు కొత్త జంట పోజు.. చిర్రెత్తి కుమ్మిపడేసిందిగా! -
పట్టాలు తప్పిన రైలు.. విశాఖ వైపు వెళ్లే పలు ట్రైన్స్ ఆలస్యం!
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి బాలాజీపేట వద్ద గూడ్స్ రైలు పట్టింది. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, బుధవారం తెల్లవారుజామున గూడ్స్ రైలు భోగి పూర్తిగా పట్టాలపై పడిపోయింది. ఇక, ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని భోగిని పట్టలాపై నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం కారణంగా విశాఖ వైపునకు వెళ్లు ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అత్తిలి వద్ద పలు రైళ్లు నిలిచిపోయాయి. -
100 బోగీలు..1.9 కిలోమీటర్ల పొడవు!
జెనీవా: ప్రపంచంలోనే అతి పొడవైన ప్రయాణికుల రైలు తమదేనంటూ స్విట్జర్లాండ్కు చెందిన రేషియన్ రైల్వే కంపెనీ ప్రకటించింది. 100 బోగీలతో 1.9 కిలోమీటర్ల పొడవైన ఈ రైలును ఆల్ఫ్స్ పర్వతాల గుండా అల్బులా/బెర్నినా మార్గంలో నుంచి ప్రీడా నుంచి బెర్గ్యున్ వరకు శనివారం విజయవంతంగా నడిపినట్లు తెలిపింది. సుమారు 25 కిలోమీటర్ల ప్రయాణానికి గంట సమయం పట్టిందని వివరించింది. పర్వతాల దిగువన మెలికలు తిరుగుతూ ఉండే 22 టన్నెళ్లు, 48 వంతెనల మీదుగా సాగే సుందరమైన ఈ మార్గాన్ని 2008లో యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చిందని తెలిపింది. 175వ వార్షిక ఆవిర్భావ ఉత్సవాలు జరుపుకుంటున్న స్విస్ రైల్వేల ఇంజినీరింగ్ ప్రతిభను చాటేందుకే ఈ ప్రయత్నాన్ని చేపట్టినట్లు రేషియన్ రైల్వే డైరెక్టర్ రెనాటో ఫసియాటి చెప్పారు. ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. -
మెదక్లో రైలు కూత
మెదక్జోన్: మెదక్ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. శుక్రవారం మెదక్లో రైలు కూత వినిపించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. మెదక్–అక్కన్నపేట రైల్వేస్టేషన్ మధ్య నూతన రైల్వే లైన్ను జాతికి అంకితం చేస్తూ మెదక్ నుంచి కాచిగూడ వరకు ప్యాసింజర్ రైలును మెదక్ రైల్వేస్టేషన్లో కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ను ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, రఘునందన్రావు, ఎమ్మెల్సీ సుభాష్రెడ్డితో కలిసి ప్రారంభించి రైలు టికెట్ కొనుగోలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ మెదక్ నుంచి ఎన్నికై ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇక్కడి ప్రజలు రైలు కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. మెదక్ జిల్లా ప్రజలకు ఇది పండుగ వేళ అన్నారు. మెదక్–అక్కన్నపేట వరకు 17.2 కిలోమీటర్ల రైల్వేలైన్ కోసం రూ.205 కోట్లు వ్యయమైందన్నారు. మెదక్ నుంచి రెండు ప్యాసింజర్ రైళ్లను ప్రారంభిస్తున్నామన్నారు. అంతేకాకుండా సికింద్రాబాద్–ముంబై ట్రాక్కు కనెక్ట్ చేస్తారని చెప్పారు. త్వరలో వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు గతంలో ఈ ప్రాంతంలోని మాసాయిపేట వద్ద పాఠశాల బస్సును రైలు ఢీకొట్టిన దుర్ఘటన ఇంకా తన కళ్ల ముందే కదలాడుతోందని, అలాంటి ఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా 43 స్టేషన్ల పరిధిలో ప్రత్యేక పనులను చేపట్టామని కిషన్రెడ్డి చెప్పారు. భద్రాచలం, సత్తుపల్లిలో రైల్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు సైతం రూ.221 కోట్ల వ్యయంతో జరుగుతున్నాయని, రూ.653 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసి అభివృద్ధి చేసుకోవాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజీ పడబోమని స్పష్టంచేశారు. కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి అన్ని రంగాల్లో్ల ప్రాధాన్యత ఇస్తోందని, మెదక్ జిల్లా కేంద్రానికి నేషనల్ హైవే నర్సాపూర్ మీదుగా నిర్మించారని చెప్పారు. అలాగే జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.లక్షా నాలుగు వేల కోట్లను ఖర్చుపెట్టినట్లు తెలిపారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య నియంత్రణ కోసం చర్లపల్లి రైల్వేస్టేషన్లో రూ.221 కోట్లతో రైల్వే టర్మినల్ నిర్మిస్తున్నామన్నారు. వరంగల్లో రూ.400 కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
నిరీక్షణ ఫలించిన వేళ.. మెతుకుసీమకు రైలుబండి
మెదక్జోన్: ఎన్నో దశాబ్దాలుగా రైలుకోసం ఎదురు చూస్తున్న మెతుకు సీమ ప్రజల కల ఎట్టకేలకు నెరవేరే సమయం ఆసన్నమైంది. శుక్రవారం రైలు ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. దివంగత ఇందిరా గాంధీ ఎంపీగా మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటినుంచే ఈ ప్రాంతానికి రైల్వే సౌకర్యం కల్పించాలన్న డిమాండ్ ఉంది. అందుకోసం చాలా కాలం ఉద్యమాలు కొనసాగాయి. 2012 –13లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉండగా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంతకు ముందు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కృషి ఫలితంగా కాస్ట్ షేరింగ్ పద్ధతిలో రామాయంపేట మండలం అక్కన్నపేట నుంచి మెదక్ జిల్లా కేంద్రం వరకు కొత్త బ్రాడ్గేజ్ రైల్వేలైన్ మంజూరైంది. 2014లో శంకుస్థాపన.. మెదక్–అక్కన్నపేట రైల్వేలైన్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 17.2 కిలోమీటర్ల దూరం కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి 2012–2013 సంవత్సరంలో రూ.117 కోట్లు అవసరమని అంచనా వేసి ఆమోదం తెలిపారు. 2014లో రైల్వేలైన్ నిర్మాణానికి అప్పటి ఎంపీ విజయశాంతి చేతులమీదుగా శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత పనుల ఆలస్యంతో అంచనా వ్యయం రూ.206 కోట్లకు చేరింది. ఇందులో రూ.103 కోట్లు రాష్ట్రం భరించగా, మిగతా నిధులు కేంద్రం విడుదల చేసింది. భూసేకరణకు రాష్ట్ర నిధులు రైల్వేలైన్ కోసం అవసరమయ్యే 392 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి రైతులకు రూ.16.80 కోట్ల పరిహారం అందజేసింది. రేక్పాయింట్తో రైతులకు మేలు.. రెండు నెలల క్రితమే మెదక్కు రేక్పాయింట్ మంజూరు కాగా, మంత్రి హరీశ్రావు దానిని ప్రారంభించారు. రైతులు తాము పండించిన ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా తరలించుకోవడానికి ఈ పాయింట్ ఉపయుక్తంగా ఉంటుంది. అదే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎరువులు, ఇతర ఉత్పత్తులు కూడా దిగుమతి చేసుకోవచ్చు. మెదక్, కామారెడ్డి జిల్లాల ప్రజలకు సౌలభ్యం మెదక్ నుంచి రైళ్ల రాకపోకలతో మెదక్, కామారెడ్డి జిల్లాల ప్రజలకు లబ్ధి చేకూరనుంది. మెదక్, హవేళిఘనాపూర్, చిన్నశంకరంపేట, కొల్చారం మండలాలు, కామారెడ్డి జిల్లా లింగంపేట, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వారు ఈ సేవలు పొందొచ్చు. కలనెరవేరింది... మెదక్ నుంచి ఇందిరాగాంధీ ఎంపీగా గెలుపొంది దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచే ఇక్కడి ప్రజలు రైలు కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని రాష్ట్ర వాటాగా 50 శాతం నిధులు విడుదల చేయడంతోపాటు భూసేకరణ కూడా వేగవంతం చేసి పరిహారం చెల్లించారు. దీంతో పనులు త్వరగా పూర్తయ్యాయి. ఎట్టకేలకు రైలు రాకతో ఈ ప్రాంత ప్రజల కల నెరవేరింది. :: పద్మాదేవేందర్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మూడు రైల్వేస్టేషన్లు.. మెదక్– అక్కన్నపేట మధ్యలో కొత్తగా నిర్మించిన రైల్వేలైన్ దూరం 17.2 కిలోమీటర్లు. ఈ మధ్యలో మెదక్, శమ్నాపూర్, లక్ష్మాపూర్లలో కొత్తగా రైల్వేస్టేషన్లు నిర్మించారు. ప్రస్తుతానికి మెదక్ టు కాచిగూడ, మెదక్ టు మహబూబ్నగర్కు ఉదయం, సాయంత్రం వేళ రెండు రైళ్లు నడుపుతారు. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని రైళ్లు నడిపేందుకు ప్రయత్నిస్తామని దక్షిణమధ్య రైల్వే అధికారులు చెప్పారు. -
ప్యాసింజర్ రైళ్ల రద్దు.. ఆలస్యం! కారణం ఏంటంటే..
దేశవ్యాప్తంగా పలు ప్యాసింజర్ రైళ్లను అర్ధాంతరంగా ఇండియన్ రైల్వేస్ రద్దు చేస్తోంది. అంతేకాదు చాలావరకు ప్యాసింజర్ రైళ్లు విపరీతమైన ఆలస్యంతో నడుస్తున్నాయి. ఈ పరిణామాలేవీ ఊహించని ప్రయాణికులు.. ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకీ ఎందుకంటారా?.. తీవ్రమైన బొగ్గు కొరత. అవును.. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత కొనసాగుతోంది. వేసవి కావడం.. విద్యుత్ వినియోగం పెరిగిపోవడంతో బొగ్గుకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో.. విద్యుత్ సంక్షోభం తలెత్తే ఘటింకలు మోగుతుండడంతో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. బొగ్గు సరఫరా కోసం మార్గం సుగమం చేసేందుకే ప్యాసింజర్ రైళ్లను రద్దుచేయడం, ఆలస్యంగా నడపడం చేస్తోంది రైల్వే శాఖ. అంతేకాదు గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతంగా బొగ్గు లోడ్ను గమ్యస్థానాలకు చేర్చే ప్రయత్నాలు చేస్తోంది. భారత్లో 70 శాతం కరెంట్ బొగ్గు నుంచే ఉత్పత్తి అయ్యేది. అలాంటిది దేశంలో ప్రస్తుతం అనేక ప్రాంతాలు చాలా గంటలు కరెంట్ కోతను ఎదుర్కొంటున్నాయి. కొన్ని పరిశ్రమలు అయితే ఈ శిలాజ ఇంధనం కొరత కారణంగా ఉత్పత్తిని తగ్గించేశాయి. ఉక్రెయిన్పై రష్యా దాడికి ఆజ్యం పోసిన అధిక ఇంధన ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం కష్టపడుతున్న సమయంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. మొత్తంగా 670 ప్యాసింజర్ ట్రిపులను మే 24వ తేదీవరకు రద్దు చేసినట్లు.. మరికొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు నొటిఫై చేసింది రైల్వేస్. అయితే ఏయే రూట్లలో ప్రయాణాలు రద్దు అనేది ప్రయాణికులే గమనించాలని కోరింది. అలాగే ప్యాసింజర్ రైళ్ల అంతరాయం తాత్కాలికం మాత్రమేనని, అతిత్వరలోనే పరిస్థితి చక్కబడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు ఇండియన్ రైల్వేస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్కృష్ణ బన్సాల్. ప్రయాణికులు సహకరించాలని ఆయన కోరుతున్నారు. బొగ్గు సరఫరాలో అంతరాయాలకు భారతీయ రైల్వే తరచు విమర్శలు ఎదుర్కొనడం సహజంగా మారింది. సరిపడా క్యారేజీలు లేకపోవడం వల్ల ఎక్కువ దూరాలకు ఇంధనాన్ని తీసుకెళ్లడం కష్టంగా ఉంటోంది. అలాగే రద్దీగా ఉండే మార్గాల్లో ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు తమ తమ ప్రయాణాల కోసం తంటాలు పడుతుంటాయి. కొన్నిసార్లు సరుకులు ఆలస్యం అవుతాయి. అయినప్పటికీ, గనులకు దూరంగా ఉన్న వినియోగదారుల కోసం క్యారియర్ బొగ్గు రవాణా కొనసాగుతోంది. ఢిల్లీలో పరిస్థితి ఘోరం ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే బొగ్గు కొరత తీవ్రంగా మారుతోంది. దీంతో డిల్లీ సర్కార్.. కేంద్రం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఢిల్లీకి అవసరమయ్యే 30 శాతం పవర్ను దాద్రి-2, ఊంచహార్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం వాటిలో బొగ్గు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే.. అవి పని చేయడం ఆగిపోతాయని ఢిల్లీ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. మెట్రో రైళ్లతో పాటు ఆస్పత్రుల్లోనూ కరెంట్ సరఫరా నిలిచిపోతుందటూ ఢిల్లీ సర్కార్ ఒక ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. -
ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: పలు మార్గాల్లో ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్–రేపల్లె–సికింద్రాబాద్ రైలు (17645/17646)ఈ నెల 27 నుంచి రాకపోకలు సాగించనుంది. ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 7.45కు రేపల్లెకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 7.50 గంటలకు రేపల్లె నుంచి బయలుదేరి సాయంత్రం 4.55 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. కాచిగూడ–నిజామాబాద్ రైలు (07594/07595)ఈ నెల 29 నుంచి రాకపోకలు సాగించనుంది. సాయంత్రం 6.50 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి రాత్రి 11.50కి నిజామాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 5.05 గంటలకు బయలుదేరి ఉదయం 9.40గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. రాయచూర్–గద్వాల్ (07496/07495) ఈ నెల 27నుంచి అందుబాటులోకి రానుంది. మధ్యాహ్నం 1.10 కి బయలుదేరి 2.30 కు గద్వాల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.20 కి రాయచూర్ చేరుకుంటుంది. -
విశాఖ – కోరాపుట్ ప్యాసింజర్ పునఃప్రారంభం
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): విశాఖపట్నం – కోరాపుట్ – విశాఖపట్నం ప్యాసింజర్ రైలును రైల్వే మంత్రి అశ్వినివైష్టవ్ శుక్రవారం కోరాపుట్ స్టేషన్లో జెండా ఊపి పునః ప్రారంభించారు. అనంతరం ఇదే రైలులో ఈ మార్గంలో స్పెషల్ బోగీలో విండో ఇన్స్పెక్షన్ చేశారు. గతంలో విశాఖపట్నం – కోరాపుట్ – విశాఖపట్నం మధ్య నడిచే డైలీ ప్యాసింజర్ రైలును కరోనా కారణంగా నిలిపేశారు. ఈ క్రమంలో ప్రజల విజ్ఞప్తి మేరకు పునః ప్రారంభించేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించిందని వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. శనివారం నుంచి విశాఖపట్నం–కోరాపుట్(08538), ఆదివారం నుంచి కోరాపుట్–విశాఖపట్నం (08537) రైళ్లు పాత టైమింగ్స్ ప్రకారమే నడువనున్నాయి. ఈ సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ విశాఖపట్నం–నిజాముద్దీన్–విశాఖపట్నం సమతా ఎక్స్ప్రెస్, విశాఖపట్నం –నిజాముద్దీన్–విశాఖపట్నం స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్లు త్వరలో పూర్తిస్థాయిలో ఎల్హెచ్బీ కోచ్లతో నడుస్తాయని తెలిపారు. సమ్మలేశ్వరి ఎక్స్ప్రెస్, హిరాఖండ్ ఎక్స్ప్రెస్, జగదల్పూర్–రూర్కెలా–జగదల్పూర్ ఎక్స్ప్రెస్లకు లఖింపూర్ రోడ్ను అదనపు హాల్ట్గా అంగీకరించామన్నారు. ఇదే విధంగా విశాఖపట్నం – కిరండూల్ –విశాఖపట్నం ఎక్స్ప్రెస్కు బచేలిలో అదనపు హాల్ట్ కేటాయించనున్నట్లు తెలిపారు. (క్లిక్: సికింద్రాబాద్– కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు) -
చిన్న స్టేషన్లలో ఆగనున్న ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు
కాకినాడ: ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు చిన్న స్టేషన్లలో కూడా నిలుపుదల చేయాలంటూ కాకినాడ ఎంపీ వంగా గీత చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. కరోనా సమయంలో ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసి వాటిని ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్పుచేయడంతో చిన్న స్టేషన్లలో రైళ్ల నిలుపుదల నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ఎంపీ వంగా గీత రైల్వే మంత్రి, రైల్వేబోర్డు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కరోనా తీవ్రత తగ్గినప్పటికీ ప్యాసింజర్ రైళ్లు పునరుద్ధరించకపోవడం వల్ల రైతులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, చిరువ్యాపారులు, సాధారణ పేద, మధ్య తరగతి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ఆమె కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఆమె చేసిన కృషి నేపథ్యంలో ఇప్పటికే తిమ్మాపురం, హంసవరం, రావికంపాడు, రైల్వే స్టేషన్లలో ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లను నిలుపుదల చేసేందుకు రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. కాకినాడ–విశాఖ, విశాఖ–కాకినాడ మధ్య శుక్రవారం నుంచి ఈ మూడు స్టేషన్లలో రైలు ఆగనుంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం తన విజ్ఞప్తితో రాష్ట్రంలోని ప్యాసింజర్ రైళ్లు పునరుద్ధరణతోపాటు చిన్న స్టేషన్లలో రైళ్ల నిలుపుదల విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకున్న రైల్వే అధికారులకు ఎంపీ వంగా గీత కృతజ్ఞతలు తెలిపారు. ఇది చదవండి: అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలన్న ఆలోచనే బాబుకు లేదు: సీఎం జగన్ -
మంటల్లో ఇంజన్.. రైలును ముందుకు తోసిన ప్యాసింజర్లు
ఐకమత్యమే మహాబలం అనేవాళ్లు పెద్దలు. అలాగే భిన్నత్వంలో ఏకత్వం.. బహుశా మన గడ్డకే సొంతమైన స్లోగన్ కాబోలు. కొన్ని పరిస్థితులు, ఘటనలు మినహాయిస్తే.. కలిసికట్టుగా ముందుకు సాగడంలో మనకు మనమే సాటి. ఇందుకు సంబంధించిన వీడియో ఇది. యూపీలో జరిగిన ఓ ఘటన తాలుకా వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. షార్నాపూర్-ఢిల్లీ మధ్య రైలు, మీరట్ దౌరాలా రైల్వే స్టేషన్ దగ్గర రైలు శనివారం అగ్నిప్రమాదానికి గురైంది. ఇంజన్కు మంటలు అంటుకోగా.. దాని నుంచి వెనకాల రెండు బోగీలకు మంటలు విస్తరించాయి. వెంటనే అధికారులు స్పందించి.. ఆ ఇంజన్, బోగీలను మిగతా బోగీలతో విడదీశారు. ఆ వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు.. మిగతా కంపార్ట్మెంట్లను ముందుకు తోసి మంటలు అంటుకోకుండా చూడగలిగారు. #WATCH | Uttar Pradesh: Fire broke out in engine & two compartments of a Saharanpur-Delhi train, at Daurala railway station near Meerut. Passengers push the train in a bid to separate the rest of the compartments from the engine and two compartments on which the fire broke out. pic.twitter.com/Vp2sCcLFsd — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 5, 2022 ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఇక ప్రయాణికులు రైలును ముందుకు తోస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్గా మారింది. కశ్మీర్లో రోడ్డు ప్రమాదం జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుంది. సాంబా నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఒక కారు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. చికిత్స పొందుతున్న డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. కాగా, ఆ వాహనం అనంత్నాగ్ వ్యాలీకి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. -
రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్.. 706 రోజుల తర్వాత..
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కుతున్నాయి. 2020 మార్చి 24 కోవిడ్ తొలి లాక్డౌన్ వేళ నిలిచిన విషయం తెలిసిందే. రైల్వేచరిత్రలో ఇంత సుదీర్ఘకాలం రైళ్లు స్తంభించిన సందర్భం లేదు. కోవిడ్ వల్ల తొలిసారి ఆ పరిస్థితి ఎదురైంది. కోవిడ్ ఆంక్షలను తొలగించేకొద్దీ విడతలవారీగా రైళ్లను తిరిగి పునరుద్ధరించినా, ప్యాసింజర్ రైళ్లకు పచ్చజెండా ఊపలేదు. 706 రోజుల తర్వాత అన్రిజర్వ్డ్ ప్రయాణాలకు అనుమతినిస్తూ, కోవిడ్ ముందు ఉన్న తరహాలో ప్యాసింజర్ రైళ్లను తిరిగి ప్రారంభించేందుకు రైల్వేబోర్డు అనుమతించింది. కోవిడ్ ప్రబలుతుందని... కోవిడ్ మొదటిదశ తీవ్రత తగ్గిన తర్వాత మూడు నెలలకాలంలో 80% ఎక్స్ప్రెస్ రైళ్లను పట్టాలెక్కించారు. పండగల కోసం కొన్ని స్పెషల్ రైళ్లు నడిపించారు. రెండోదశ లాక్డౌన్తో మళ్లీ రైళ్లకు బ్రేక్పడింది. మళ్లీ తొందరగానే ఎక్స్ప్రెస్, స్పెషల్ రైళ్లను తిరిగి ప్రారంభించారు. కానీ, ఎంత రద్దీ పెరిగినా ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించలేదు. చివరకు స్టేషన్లకు వచ్చే రద్దీని నిలువరించలేక తప్పని పరిస్థితిలో కొన్ని ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించినా, వాటిని ఎక్స్ప్రెస్ రైళ్లుగానే నడిపారు. అన్రిజర్వ్డ్ టికెట్లు జారీ చేస్తే బోగీల్లో రద్దీ పెరిగి కోవిడ్ ప్రబలుతుందని అధికారులు పేర్కొంటూ వచ్చారు. చదవండి: (ఆ మానవ మృగాన్ని అరెస్ట్ చేయకపోవడం దారుణం: బండి సంజయ్) ఇదీ అసలు కారణం... దక్షిణమధ్య రైల్వేలో 230 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. రోజుకు సగటును పదిన్నర లక్షల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తే, అందులో 8 లక్షలమంది ప్యాసింజర్ రైళ్లలోనే తిరుగుతారు. కానీ, ప్యాసింజర్ రైళ్ల టికెట్ ధర నామమాత్రంగా ఉండటంతో వాటి ద్వారా భారీ నష్టాలు వచ్చిపడుతున్నాయి. ప్యాసింజర్ రైళ్ల నిర్వహణవ్యయంలో 20 శాతం మాత్రమే టికెట్ ద్వారా తిరిగి వసూలవుతుంది. అంటే, 80 శాతం నష్టాలేనన్నమాట. ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా కలుపుకుంటే, మొత్తం నిర్వహణ వ్యయంలో 65 శాతం తిరిగి వసూలవుతాయి. దీంతో వాటిని నడిపే విషయంలో అధికారులు ఆసక్తి చూపలేదన్న అభిప్రాయముంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో మొత్తం 230 ప్యాసింజర్ రైళ్లకుగాను 160 రైళ్లు ప్రస్తుతం ఎక్స్ప్రెస్ రైళ్ల తరహాలో అన్రిజర్వ్డ్ టికెట్లు లేకుండా నడుస్తున్నాయి. ఇవి ఇక కోవిడ్ ముందు ఉన్న ప్యాసింజర్ రైళ్ల తరహాలో నడుస్తాయి. ఇప్పటికీ ప్రారంభం కాకుండా ఉన్న మిగతా ప్యాసింజర్ రైళ్లను దశలవారీగా ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. -
కరోనా: ఈ నెల 24 వరకు కొన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్ : కరోనా మహమ్మారి విస్తరణ ఉధృతంగా కొనసాగుతోంది. దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య మూడు లక్షలను దాటేసిన కొత్త కేసుల సంఖ్య 3,47,254గా ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జనవరి ఈ నెల 21 నుండి 24 వరకు కొన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసింది. ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన జారీ చేసింది. దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. క్రితం రోజు మూడు లక్షలు దాటేయగా 24 గంటల వ్యవధిలో మరింత పెరిగాయి. దేశంలో పాజిటివిటీ రేటు 17.94 శాతానికి ఎగబాకింది. కేసుల పరంగా తెలంగాణాలో రోజుకు నాలుగువేలకు పైగా, ఏపీలో 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 1.40 లక్షల కేసులతో కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకూ ఒమిక్రాన్ బారినపడిన వారి సంఖ్య 9,692కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. (2/3) Cancellation of Passenger Trains from 21st to 24th January, 2022 @drmsecunderabad @drmhyb @drmgtl @VijayawadaSCR @drmgnt #IndiaFightsCorona pic.twitter.com/kPpHJOHHen — South Central Railway (@SCRailwayIndia) January 21, 2022 (1/3) Cancellation of Passenger Trains from 21st to 24th January, 2022 @drmsecunderabad @drmhyb #Unite2FightCorona #IndiaFightsCorona pic.twitter.com/oy6WOCKYbH — South Central Railway (@SCRailwayIndia) January 21, 2022 -
Indian Railways: ప్యాసింజర్ రైళ్లలో ఛార్జీల మోత
Indian Railways continue To reservations For passenger trains second class Journey: సెకండ్ క్లాస్ ప్రయాణాలను రిజర్వేషన్ కేటగిరీలో కొనసాగించడంపై రైల్వే శాఖ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడింది. సామాన్యుడికి రిజర్వేషన్ ఛార్జీల భారం తప్పదని పరోక్షంగా తేల్చేసింది రైల్వే మంత్రిత్వ శాఖ. ఈ మేరకు ప్యాసింజర్ రైళ్లలో ద్వితియ శ్రేణి తరగతిలో ప్రయాణాలకు ‘రిజర్వేషన్’ కొనసాగుతుందని పార్లమెంట్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఎదురైన ఓ ప్రశ్నకు రైల్వే మంత్రి సమాధానమిచ్చారు. కరోనా ఫస్ట్ ఫేజ్ తర్వా తి సడలింపులతో భారతీయ రైల్వే శాఖ ‘కొవిడ్ స్పెషల్’ పేరిట ప్రత్యేక రైళ్లు నడిపింది. ఆ టైంలో ప్యాసింజర్ రైళ్లను మెయిల్ ఎక్స్ప్రెస్లుగా, పండుగ స్పెషల్గా మార్చేసి ఎక్కువ ఛార్జీలతో రైళ్లను నడిపించింది భారతీయ రైల్వేస్. పైగా సెకండ్ క్లాస్ సహా అన్ని కేటగిరీలను రిజర్వేషన్ కోటాలోకి మార్చేసింది. అయితే.. తాజాగా కొవిడ్ స్పెషల్ కేటగిరీని ఎత్తేస్తూ.. రెగ్యులర్ సర్వీసులుగా వాటిని మార్చేస్తున్నట్లు ప్రకటించింది రైల్వే శాఖ. దీంతో టికెట్ రేట్లు తగ్గుతాయని, సామాన్యుడికి ఊరట లభించిందని, ప్యాసింజర్ రైళ్లు ప్రయాణికుల కోలాహలంతో పూర్వవైభవం సంతరించుకోవచ్చని భావించారంతా. కానీ,. అనూహ్యంగా ప్యాసింజర్ రైళ్లలో సెకండ్క్లాస్ ప్రయాణాలకు ఇంకా రిజర్వేషన్ కేటగిరీ కిందే కొనసాగుతోంది. ఈ విషయమై ఎదురైన ప్రశ్నకు రైల్వే మంత్రి పార్లమెంట్లో బదులిచ్చారు. ప్యాసింజర్ రైళ్లలో సెకండ్ క్లాస్ ప్రయాణాలకు, ప్రయాణికులు రిజర్వేషన్ బుకింగ్ చేసుకోవాల్సిందేనని మంత్రి పేర్కొన్నారు. ఒకవేళ అత్యవసర లేదంటే ప్రత్యేక పరిస్థితులు ఏర్పడితే మాత్రం.. కొన్ని రైళ్లకు మినహాయింపు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. దీంతో రిజర్వేషన్ ఛార్జీల రూపంలో సామాన్యుడికి మోత మోగనుంది. అంతేకాదు తక్కువ దూరం ప్రయాణాలైనా సరే.. రిజర్వేషన్ కింద భారం మోయాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే రవాణాశాఖ నివేదికల ప్రకారం.. 364 ప్యాసింజర్ రైళ్లను 2020-2021 ఏడాది మధ్య ఎక్స్ప్రెస్ సర్వీసులుగా మార్చేసి నడిపించింది రైల్వే శాఖ. సెకండ్ క్లాస్ కేటగిరీలో సగటున రెండున్నర కోట్ల మంది ప్రయాణిస్తున్నట్లు ఒక అంచనా. సింగిల్ క్లిక్తో 35పై.లకే 10 లక్షల ఇన్సూరెన్స్ -
ఒమిక్రాన్ కేసులు.. రైల్వే గుండెల్లో ‘రైళ్లు’
సాక్షి, హైదరాబాద్: రేపో మాపో పట్టాలెక్కుతాయనుకున్న ప్యాసింజర్ రైళ్లకు బ్రేక్ పడింది. వేగంగా వ్యాపిస్తుందని భావిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్లోనూ వెలుగు చూడటంతో, ప్యాసింజర్ రైళ్లు నడిపే విషయంలో రైల్వే బోర్డు వెనక్కి తగ్గింది. దేశవ్యాప్తంగా 2020 మార్చి చివరలో కోవిడ్ మొదటి లాక్డౌన్ సందర్భంగా రైళ్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దశలవారీగా ఎక్స్ప్రెస్ రైళ్లను పట్టాలెక్కిస్తూ వస్తున్న రైల్వేబోర్డు ప్యాసింజర్ రైళ్లను మాత్రం ప్రారంభించలేదు. ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణికుల నియంత్రణకు అవకాశం లేకపోవటం, ఎక్కువ స్టాపుల్లో ఆగాల్సి ఉండటంతో ఎక్కేవారు, దిగేవారు సైతం ఎక్కువగా ఉంటారనే ఉద్దేశంతో వీటిని నడిపే విషయంలో వెనుకంజ వేస్తూ వచ్చింది. అలా చూస్తుండగానే 20 నెలలు గడిచిపోయాయి. కోవిడ్ రెండో దశ పూర్తిగా తగ్గిపోయినందున ఇక అన్ని రైళ్లను ప్రారంభించాలని అక్టోబర్ చివరలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. పది రోజు ల క్రితం పాత పద్ధతిలో రైళ్లను పునరుద్ధరిస్తూ పాత నంబర్లతో, పాత సమయాల్లో నడపటం మొదలుపెట్టింది. రైళ్లు మామాలుగా తిరుగుతున్నా.. ఎక్కడా కోవిడ్ కేసుల పెరుగుదల లాంటి సమస్యలు రాలేదు. దీంతో ఈ వారం లో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్లు ప్రారంభిద్దామనుకున్న సమయంలో తొలిసారిగా కర్ణాటక లో రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. కొత్త కేసుల పెరుగుదల లేకుంటే.. కొత్త వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి అనేకమంది ప్రయాణికులు మన దేశానికి వచ్చారని, వారిలో కొందరు కోవిడ్ పాజిటివ్గా ఉన్నారని తేలింది. అలాగే మూడో దశ పొంచి ఉందనే వార్తల నేపథ్యంలో ఎక్కడా ప్యాసింజర్ రైళ్లు ప్రారంభించొద్దని రైల్వేబోర్డు తాజాగా ఆదేశించింది. మరికొన్ని రోజులు వేచిచూసి, కొత్త కేసుల పెరుగుదల లేకుంటే ప్రారంభించాలని నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 250 ప్యాసింజర్ రైళ్లు తిరుగుతాయి. ప్రస్తుతం వీటిల్లోంచి 50 రైళ్లను మాత్రం ఎక్స్ప్రెస్ రైళ్ల తరహాలో నడుపుతున్నారు. ఇక నగరంలో 121 ఎంఎంటీఎస్ రైళ్లు తిరగాల్సి ఉండగా, దశలవారీగా 60 రైళ్లను ప్రారంభించారు. తాజాగా మరో 25 రైళ్లను గురువారం పట్టాలెక్కించారు. ఎంఎంటీఎస్ రైళ్ల విషయంలో నిర్ణయం జోన్ స్థాయిలో తీసుకునే వీలున్నందున స్థానిక అధికారులు వీటికి పచ్చజెండా ఊపారు. కానీ ప్యాసింజర్ రైళ్ల విషయంలో మాత్రం రెడ్ సిగ్నల్ రావటంతో వీటి ప్రారంభాన్ని వాయిదా వేశారు. -
నష్టాలను తప్పించుకునేందుకు కరోనా సాకు
సాక్షి, హైదరాబాద్: ప్యాసింజర్ రైళ్ల నిర్వహణతో వచ్చే నష్టాలను కొంతమేర తగ్గించుకునేందుకు రైల్వేశాఖ కోవిడ్ బూచిని సాకుగా వాడుకుంటోంది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టి, ఆంక్షలు ఎత్తివేసి చాలా రోజులైనా ఈ రైళ్లను పట్టాలెక్కించకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎక్స్ప్రెస్ రైళ్ల పేరుతో సాధారణ రైళ్లను ప్రారంభించి రిజర్వేషన్ టికెట్లతో ప్రయాణాలకు అనుమతించిన రైల్వేశాఖ, తాజాగా అన్రిజర్వ్డ్ టికెట్ బుకింగ్నూ ప్రారంభించింది. కానీ, ప్యాసింజర్ రైళ్లను మాత్రం షురూ చేయడం లేదు. ప్యాసింజర్ రైళ్లను ప్రారంభిస్తే కరోనా కేసులు విస్తరించే అవకాశం ఉందని, అందుకే వాటిని ప్రారంభించడం లేదని రైల్వేశాఖ పేర్కొంటోంది. సిటీ బస్సులు, మెట్రో సర్వీసులు, సాధారణ బస్సులు, అన్రిజర్వ్డ్ ఎక్స్ప్రెస్ రైళ్లు, ప్రార్థన మందిరాలు, ఉత్సవాలు, బహిరంగ సభలు, పెళ్లిళ్లుపేరంటాలు.. ఇలా వేటివల్లా విస్తరించని కరోనా, ప్యాసింజర్ రైళ్లతోనే వ్యాపిస్తుందన్న వాదన వింతగా కనిపిస్తున్నాయి. ఈ రైళ్లు లేకపోవటంతో అల్పాదాయ ప్రయాణికులు ఎక్కువ ధర చెల్లించి ఇతర ప్రయాణ సాధనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. (చదవండి: సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు: బడి బండి భద్రమేనా?) నిర్వహణ వ్యయం ఎక్కువే.. ప్యాసింజర్ రైళ్ల టికెట్ ధరల్లో ప్రయాణికులపై 30 శాతమే భారం పడుతోందని, 70 శాతాన్ని రైల్వేనే రాయితీగా భరిస్తోందని రైల్వేశాఖ స్పష్టం చేస్తోంది. సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ రాయితీ 55 శాతం వరకు ఉందని పేర్కొంటోంది. అలాగే, ప్యాసింజర్ రైళ్లకు హాల్టులు ఎక్కువ. ప్రయాణికులున్నా.. లేకున్నా.. నిర్ధారిత స్టేషన్లో కచ్చితంగా ఆగాల్సిందే. ఇలా రైలును ఆపి మళ్లీ పరిగెత్తించేందుకు డీజిల్/విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో చమురు/కరెంట్ ఛార్జీ భారం పెరుగుతుంది. 400 కి.మీ. దూరం ఉండే గమ్యం చేరటంలో ఎక్స్ప్రెస్ రైళ్లు నాలుగైదు స్టేషన్లకు మించి ఆగవు. కానీ, 150 కి.మీ. దూరంలో ఉండే ప్రాంతానికి వెళ్లే ప్యాసింజర్ రైళ్లు 15 నుంచి 18 వరకు స్టేషన్ల్లో ఆగుతాయి. ఇది నిర్వహణ ఖర్చును పెంచేందుకు కారణమవుతోంది. టికెట్ ధరలు చవక, నిర్వహణ వ్యయం ఎక్కువతో ప్యాసింజర్ రైళ్లు భారీ నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. రావాల్సింది రూ.900 కోట్లు.. వస్తోంది రూ.400 కోట్లు.. దక్షిణమధ్య రైల్వేకు కోవిడ్కు ముందు నెలకు రూ.400 కోట్ల మేర టికెట్ రూపంలో ఆదాయం వచ్చేది. ఇందులో ప్యాసింజర్ రైళ్లతో వచ్చేది రూ.60 కోట్లు మాత్రమే. నష్టాలు లేకుండా బ్రేక్ ఈవెన్ రావాలంటే ఈ ఆదాయం రూ.900 కోట్ల వరకు ఉండాలి. అంటే.. అంతమేర నష్టాలొస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇంత నష్టాలొస్తున్నా.. సరుకు రవాణా రైళ్లతో సమకూరుతున్న భారీ వసూళ్లతో దీన్ని కొంత పూడ్చుకుంటోంది. కోవిడ్ కారణంగా లాక్డౌన్ నిబంధనల మేరకు ప్యాసింజర్ రైళ్లను గతేడాది మార్చి ఆఖరున నిలిపేశారు. ఆ తర్వాత వాటిని ప్రారంభించలేదు. కానీ, దశలవారీగా ఎక్స్ప్రెస్ రైళ్లను స్పెషల్ ఎక్స్ప్రెస్లుగా, పండగ ప్రత్యేక రైళ్లుగా తిప్పుతూ ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రారంభించారు. అవి కిక్కిరిసి ప్రయాణికులతో పరుగుపెడుతున్నాయి. ఇదిలా ఉండగా, ప్రస్తుతం దేశం మొత్తమ్మీద కేరళ మినహా ఏ రాష్ట్రంలో కూడా ఎక్కువ కరోనా కేసులు నమోదు కావడం లేదు. మూడో వేవ్ వస్తుందన్న హెచ్చరికలున్నా.. దేశంలో ఎక్కడా కఠిన నియంత్రణలు, ఆంక్షలు లేవు. కానీ, ఒక్క ప్యాసింజర్ రైళ్ల విషయంలోనే ఏడాదిన్నరగా ఆంక్షలు కొనసాగిస్తుండటం విడ్డూరంగా కనిపిస్తోంది. కనీసం వాటిని ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి రైల్వే బోర్డు నుంచి జోన్లకు కనీస సమాచారం కూడా లేదు. ► దక్షిణమధ్య రైల్వే పరిధిలో నిత్యం నడిచే ఎక్స్ప్రెస్ రైళ్లు: 350 ► ప్యాసింజర్ రైళ్లు: 200 ► నిత్యం జోన్ పరిధిలో ప్రయాణించేవారు: 10.5 లక్షలు ► వీరిలో అన్రిజర్వ్డ్ బోగీల్లో ఎక్కేవారు: 8 లక్షలు ► నిత్యం టికెట్ల ద్వారా సమకూరే ఆదాయం: రూ.12–15 కోట్లు ► ఈ మొత్తంలో ప్యాసింజర్ రైళ్ల వాటా: రూ.3 కోట్లలోపే ► ప్యాసింజర్ రైలు టికెట్పై రూపాయికి 70 పైసల నష్టం వాటిల్లుతోంది.. ఇదీ రైల్వే మాట. ► కోవిడ్ ఆంక్షల పేరుతో ఏడాదిన్నరగా ప్యాసింజర్ రైళ్ల సిబ్బంది జీతాలు మినహా నిర్వహణ నష్టాలన్నీ ఆగిపోయాయి. ► టికెట్ ఆదాయం కూడా ఆగినా.. అది నామమాత్రమే. -
నష్టాలను తప్పించుకునేందుకే కరోనా సాకు
సాక్షి, హైదరాబాద్: ప్యాసింజర్ రైళ్ల నిర్వహణతో వచ్చే నష్టాలను కొంతమేర తగ్గించుకునేందుకు రైల్వేశాఖ కోవిడ్ బూచిని సాకుగా వాడుకుంటోంది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టి, ఆంక్షలు ఎత్తివేసి చాలా రోజులైనా ఈ రైళ్లను పట్టాలెక్కించకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎక్స్ప్రెస్ రైళ్ల పేరుతో సాధారణ రైళ్లను ప్రారంభించి రిజర్వేషన్ టికెట్లతో ప్రయాణాలకు అనుమతించిన రైల్వేశాఖ, తాజాగా అన్రిజర్వ్డ్ టికెట్ బుకింగ్నూ ప్రారంభించింది. కానీ, ప్యాసింజర్ రైళ్లను మాత్రం షురూ చేయడం లేదు. ప్యాసింజర్ రైళ్లను ప్రారంభిస్తే కరోనా కేసులు విస్తరించే అవకాశం ఉందని, అందుకే వాటిని ప్రారంభించడం లేదని రైల్వేశాఖ పేర్కొంటోంది. సిటీ బస్సులు, మెట్రో సరీ్వసులు, సాధారణ బస్సులు, అన్రిజర్వ్డ్ ఎక్స్ప్రెస్ రైళ్లు, ప్రార్థన మందిరాలు, ఉత్సవాలు, బహిరంగ సభలు, పెళ్లిళ్లుపేరంటాలు.. ఇలా వేటివల్లా విస్తరించని కరోనా, ప్యాసింజర్ రైళ్లతోనే వ్యాపిస్తుందన్న వాదన వింతగా కనిపిస్తున్నాయి. ఈ రైళ్లు లేకపోవటంతో అల్పాదాయ ప్రయాణికులు ఎక్కువ ధర చెల్లించి ఇతర ప్రయాణ సాధనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. చదవండి: ‘ట్యాంక్బండ్ను చూసి ఎలా ఫీల్ అవుతున్నారు.. పాండిచ్చేరిలా ఉంది’ నిర్వహణ వ్యయం ఎక్కువే.. ప్యాసింజర్ రైళ్ల టికెట్ ధరల్లో ప్రయాణికులపై 30 శాతమే భారం పడుతోందని, 70 శాతాన్ని రైల్వేనే రాయితీగా భరిస్తోందని రైల్వేశాఖ స్పష్టం చేస్తోంది. సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ రాయితీ 55 శాతం వరకు ఉందని పేర్కొంటోంది. అలాగే, ప్యాసింజర్ రైళ్లకు హాల్టులు ఎక్కువ. ప్రయాణికులున్నా.. లేకున్నా.. నిర్ధారిత స్టేషన్లో కచి్చతంగా ఆగాల్సిందే. ఇలా రైలును ఆపి మళ్లీ పరిగెత్తించేందుకు డీజిల్/విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో చమురు/కరెంట్ ఛార్జీ భారం పెరుగుతుంది. 400 కి.మీ. దూరం ఉండే గమ్యం చేరటంలో ఎక్స్ప్రెస్ రైళ్లు నాలుగైదు స్టేషన్లకు మించి ఆగవు. కానీ, 150 కి.మీ. దూరంలో ఉండే ప్రాంతానికి వెళ్లే ప్యాసింజర్ రైళ్లు 15 నుంచి 18 వరకు స్టేషన్ల్లో ఆగుతాయి. ఇది నిర్వహణ ఖర్చును పెంచేందుకు కారణమవుతోంది. టికెట్ ధరలు చవక, నిర్వహణ వ్యయం ఎక్కువతో ప్యాసింజర్ రైళ్లు భారీ నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. చదవండి: ట్యాంక్ బండ్: ఆదివారం.. ఆనంద విహారం రావాల్సింది రూ.900 కోట్లు.. వస్తోంది రూ.400 కోట్లు.. దక్షిణమధ్య రైల్వేకు కోవిడ్కు ముందు నెలకు రూ.400 కోట్ల మేర టికెట్ రూపంలో ఆదాయం వచ్చేది. ఇందులో ప్యాసింజర్ రైళ్లతో వచ్చేది రూ.60 కోట్లు మాత్రమే. నష్టాలు లేకుండా బ్రేక్ ఈవెన్ రావాలంటే ఈ ఆదాయం రూ.900 కోట్ల వరకు ఉండాలి. అంటే.. అంతమేర నష్టాలొస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇంత నష్టాలొస్తున్నా.. సరుకు రవాణా రైళ్లతో సమకూరుతున్న భారీ వసూళ్లతో దీన్ని కొంత పూడ్చుకుంటోంది. కోవిడ్ కారణంగా లాక్డౌన్ నిబంధనల మేరకు ప్యాసింజర్ రైళ్లను గతేడాది మార్చి ఆఖరున నిలిపేశారు. ఆ తర్వాత వాటిని ప్రారంభించలేదు. కానీ, దశలవారీగా ఎక్స్ప్రెస్ రైళ్లను స్పెషల్ ఎక్స్ప్రెస్లుగా, పండగ ప్రత్యేక రైళ్లుగా తిప్పుతూ ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రారంభించారు. అవి కిక్కిరిసి ప్రయాణికులతో పరుగుపెడుతున్నాయి. ఇదిలా ఉండగా, ప్రస్తుతం దేశం మొత్తమ్మీద కేరళ మినహా ఏ రాష్ట్రంలో కూడా ఎక్కువ కరోనా కేసులు నమోదు కావడం లేదు. మూడో వేవ్ వస్తుందన్న హెచ్చరికలున్నా.. దేశంలో ఎక్కడా కఠిన నియంత్రణలు, ఆంక్షలు లేవు. కానీ, ఒక్క ప్యాసింజర్ రైళ్ల విషయంలోనే ఏడాదిన్నరగా ఆంక్షలు కొనసాగిస్తుండటం విడ్డూరంగా కనిపిస్తోంది. కనీసం వాటిని ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి రైల్వే బోర్డు నుంచి జోన్లకు కనీస సమాచారం కూడా లేదు. ►దక్షిణమధ్య రైల్వే పరిధిలో నిత్యం నడిచే ఎక్స్ప్రెస్ రైళ్లు: 350 ►ప్యాసింజర్ రైళ్లు: 200 ►నిత్యం జోన్ పరిధిలో ప్రయాణించేవారు: 10.5 లక్షలు ►వీరిలో అన్రిజర్వ్డ్ బోగీల్లో ఎక్కేవారు: 8 లక్షలు ► నిత్యం టికెట్ల ద్వారా సమకూరే ఆదాయం: రూ.12–15 కోట్లు ►ఈ మొత్తంలో ప్యాసింజర్ రైళ్ల వాటా: రూ.3 కోట్లలోపే ►ప్యాసింజర్ రైలు టికెట్పై రూపాయికి 70 పైసల నష్టం వాటిల్లుతోంది.. ఇదీ రైల్వే మాట. ►కోవిడ్ ఆంక్షల పేరుతో ఏడాదిన్నరగా ప్యాసింజర్ రైళ్ల సిబ్బంది జీతాలు మినహా నిర్వహణ నష్టాలన్నీ ఆగిపోయాయి. ► టికెట్ ఆదాయం కూడా ఆగినా.. అది నామమాత్రమే. -
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు..
సాక్షి, కరీంనగర్ : గతేడాది కోవిడ్ తొలిదశ లాక్డౌన్ సందర్భంగా మార్చినెలాఖరులో నిలిపివేసిన రైళ్లను సోమవారం నుంచి పున:ప్రారంభించేందుకు దక్షిణ మధ్యరైల్వే చర్యలు చేపట్టింది. దాదాపు 16నెలల సుదీర్ఘ విరామం అనంతరం దశలవారీగా రైళ్లను నడిపించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే కరీంనగర్– తిరుపతి ప్రత్యేక రైలు వారంలో రెండు పర్యాయాలు గురు, ఆదివారాల్లో నడుస్తుండగా సోమవారం నుంచి కాచిగూడ – కరీంనగర్ ప్యాసింజర్ రైలు ప్రారంభమవుతుంది. సోమవారం ఉదయం 6గంటలకు కాచిగూడలో బయల్దేరి నిజామాబాద్ మీదుగా మధ్యాహ్నం 2గంటలకు కరీంనగర్ రైల్వేస్టేషన్కు చేరుకుంటుంది. తిరిగి మరుసటిరోజు 20న మధ్యాహ్నం 2.20గంటలకు కరీంనగర్ నుంచి బయల్దేరి రాత్రి 11గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. ఈ నెల 20న ఉదయం 8గంటలకు కరీంనగర్ నుంచి పుష్పుల్ రైలు బయల్దేరి పెద్దపల్లికి 8.30 గంటలకు చేరుకుంటుంది. పెద్దపల్లి నుంచి మధ్యాహ్నం 1గంటకు బయల్దేరి కరీంనగర్కు 1.45గంటలకు చేరుకుంటుంది. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కరీంనగర్ రైల్వేస్టేషన్ మేనేజరు ప్రసాద్ కోరారు. -
ప్యాసింజర్ చార్జీల మోత
సాక్షి, హైదరాబాద్: ప్యాసింజర్ రైలు ప్రయాణం ఇక నుంచి సామాన్యులకు భారంగా మారనుంది. సోమవారం నుంచి పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్ల వేగంతోపాటే చార్జీల పెంపునకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. కోవిడ్ కారణంగా గతేడాది మార్చి 22 నుంచి నిలిపివేసిన ప్యాసింజర్ రైళ్లను 16 నెలల తర్వాత పునరుద్ధరించారు. సోమవారం నుంచి 82 రైళ్లు పట్టాలెక్కనున్నాయి. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు కేవలం రూ.50 లోపు చార్జీలతో రాకపోకలు సాగించిన ప్రయాణికులు ఇక నుంచి ఈ రైళ్లలో ఎక్స్ప్రెస్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న ప్యాసింజర్ చార్జీలపైన 30 నుంచి 40% వరకు భారం పడనుంది. ఈ రైళ్లన్నిం టినీ అన్ రిజర్వ్డ్ ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్చడంతో ఆటోమేటిక్గా చార్జీలు సైతం పెరగనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కోవిడ్కు ముందు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో నడిచిన ఈ రైళ్లు సోమవారం నుంచి గంట కు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. రైళ్లవేగాన్ని పెంచేందుకు దక్షిణ మధ్య రైల్వే అన్ని ప్రధాన రూట్లలో పట్టాల సామర్థ్యాన్ని పెంచింది. అన్ని చోట్ల అన్రిజర్వ్డ్ టికెట్లు ఇప్పటివరకు రిజర్వేషన్ టికెట్ల తరహాలోనే జనరల్ సీట్లకు సైతం ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవలసి వచ్చింది. ఇక నుంచి అన్ని రైల్వేస్టేషన్లలో కౌం టర్ల ద్వారా ప్రయాణికులు అప్పటికప్పుడు టికెట్లు తీసుకొని ప్రయాణం చేయవచ్చు. ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్(ఏటీవీఎం) యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా కూడా టికెట్లు పొందవచ్చు. -
‘సామాన్యుడి రైలు బండి’ ఇప్పట్లో కదిలేనా?
సాక్షి, హైదరాబాద్: చరిత్రలో ఎన్నడూ లేనట్టు 16 నెలల పాటు నిలిచిపోయే ఉన్న ‘సామాన్యుడి రైళ్ల’ను ప్రారంభించేందుకు సిద్ధమైన రైల్వే బోర్డు మళ్లీ పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. కోవిడ్ రెండో దశ దాదాపు తగ్గిపోవడంతో సుదీర్ఘ విరామం తర్వాత ప్రారంభం అయ్యే వేళ ప్యాసింజర్ రైళ్లకు ఇప్పుడు కోవిడ్ మూడో వేవ్ హెచ్చరికలు అడ్డుపడనున్నాయి. కోవిడ్ కేసులు మళ్లీ పెరిగితే.. నిత్యం రద్దీతో పరుగుపెట్టే ప్యాసింజర్ రైళ్లు సూపర్ స్ప్రెడర్లుగా మారతాయన్న భయం వ్యక్తమవుతోంది. ప్యాసింజర్ రైళ్లలో రద్దీని నియంత్రించడం సాధ్యంకాదని తాజాగా రైల్వే బోర్డు కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందని సమాచారం. వీటిని ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వేకు రైల్వే బోర్డు నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదని జోన్ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. రద్దీని నియంత్రించే వీలులేక.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నిత్యం 220 ప్యాసింజర్ రైళ్లు తిరుగుతాయి. వీటిల్లో 90 శాతం రైళ్లు తెలుగు రాష్ట్రాల మధ్య తిరిగేవి కాగా, మిగతావి పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులకు రాకపోకలు సాగిస్తాయి. ఇటీవల ప్రారంభించిన ఎంఎంటీఎస్ రైళ్లతో పరిస్థితిని అంచనా వేసి వీటిని జూలై రెండో వారం నాటికి ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. కానీ ఈ లోగా కోవిడ్ మూడో వేవ్ హెచ్చరికలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు స్వీయ నిర్ణయంతో రాష్ట్రాల మధ్య బస్సులు, ఇతర రవాణా సర్వీసులను నిలిపేస్తున్నాయి. రైల్వే వాటి పరిధిలో లేనందువల్ల రైళ్లలో రాకపోకలు సాగుతూనే ఉంటాయి. అయితే ప్యాసింజర్ రైళ్లలో ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే ఎక్కువ హాల్టులు ఉండటం, అన్రిజర్వ్డ్ విధానం అమలు వల్ల ప్రయాణికుల రద్దీని నియంత్రించడం అసాధ్యం. ఈ నేపథ్యంలో.. కేంద్రానికి రైల్వే బోర్డు తన అభిప్రాయాన్ని తెలిపినట్టు సమాచారం. దీంతో వైద్య శాఖ సలహాలు తీసుకుని కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది. దేశవ్యాప్తంగా రోజువారీ కోవిడ్ కేసులు బాగా తగ్గినప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాగే ఉంటే ఇది మూడో వేవ్గా మారుతుందన్న అభిప్రాయం నేపథ్యంలో.. ప్యాసింజర్ రైళ్ల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నారు. -
South Central Railway: పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్లు!
సాక్షి, సిటీబ్యూరో: తక్కువ చార్జీలతో ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసే ప్యాసింజర్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. లాక్డౌన్ ఎత్తివేయడంతో వివిధ మార్గాల్లో ప్ర ధాన రైళ్లను పునరుద్ధరించడంతో పాటు ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తెచ్చిన దక్షిణమధ్య రైల్వే తాజాగా ప్యాసింజర్ రైళ్లపైన దృష్టి సారించింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు సుమారు 100 ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ప్రతి రోజు ఉదయాన్నే నగరానికి చేరుకొని తిరిగి సాయంత్రం సొంత ఊళ్లకు వెళ్లే లక్షలాది మందికి ప్యాసింజర్ రైళ్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మేడ్చల్, మనోహరాబాద్, ఉందానగర్, వరంగల్, కాజీపేట్, హన్మకొండ, తాండూ రు, వికారాబాద్, మహబూబ్నగర్, కర్నూ లు, నిజామాబాద్, మణుగూరు తదితర ప్రాంతాల నుంచి పుష్ఫుల్, డెము, మెము, ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవసరాల కోసం వచ్చే వాళ్లతో పాటు కనీసం 2 లక్షల మంది ప్రయాణికులు ప్యాసింజర్ రైళ్లను వినియోగించుకుంటున్నారు. కోవిడ్ మహమ్మారి దృష్ట్యా గతేడాది మార్చి 23వ తేదీ నుంచి ఈ రైళ్లను నిలిపివేశారు. 15 నెలలుగా ప్యాసింజర్ రైళ్ల సేవలు స్తంభించాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కేవలం రూ.100 నెలవారీ పాస్లపైన ప్రతి రోజు హైదరాబాద్కు వచ్చి పోయే ఎంతోమంది ఉపాధికి విఘాతం కలిగింది. ఎంఎంటీఎస్ సర్వీసులకు లభించే ఆదరణ మేరకు జూలై నుంచి దశలవారీగా ప్యాసింజర్ రైళ్లను నడిపేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. ఎంఎంటీఎస్ రైళ్లలో 30 శాతం ఆక్యుపెన్సీ మూడు రోజుల క్రితం పునరుద్ధరించిన ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణికుల ఆక్యుపెన్సీ 30 శాతం దాటింది. ప్రస్తుతం10 రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. సాధారణ రోజుల్లో 1.5 లక్షల మంది ప్రయాణంచేస్తారు. రోజుకు 121 సర్వీసులు నడుస్తాయి. అందుబాటులో జనరల్ టికెట్లు.. గతేడాది లాక్డౌన్ విధించడంతో పాటే కౌంటర్ల ద్వారా ఇచ్చే జనరల్ టికెట్లను కూడా నిలిపివేశారు. సాధారణంగా అప్పటికప్పుడు టికెట్లు కొనుగోలు చేసి వెళ్లే వారు ప్రత్యేకంగా జనరల్ టికెట్లకు కూడా రిజర్వు చేసుకోవలసి రావడం ఇబ్బందిగా మారింది. పైగా ప్యాసింజర్ రైళ్లను నిలిపివేయడంతో ఈ టికెట్ల ప్రాధాన్యతను కూడా తగ్గించారు. తాజాగా ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరించడంతో జనరల్ టికెట్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. అన్ని ఎంఎంటీఎస్స్టేషన్లలో ఈ టిక్కెట్లు లభిస్తాయి. అలాగే ఆటోమేటిక్ టికెట్వెండింగ్ మిషన్లు, యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా కూడా ప్రయాణికులు ఇప్పుడు జనరల్ టికెట్లను పొందవచ్చు. ప్రస్తుతానికి ఎంఎంటీఎస్ రైళ్ల కోసమే ఈ సదుపాయం ఉంది. త్వరలో ప్యాసింజర్ రైళ్లకు కూడా ఏటీవీఎంలు, యూటీఎస్ ద్వారా జనరల్ టికెట్లు తీసుకోవచ్చు. -
23 రైళ్లు తాత్కాలిక రద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులు లేకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే 23 రైళ్లను తాత్కాలికంగా రద్దుచేయగా, మరో రెండింటిని పాక్షికంగా రద్దు చేసింది. కోవిడ్ దృష్ట్యా గతకొద్ది రోజులుగా రైళ్లలో ప్రయాణికుల ఆక్యుపెన్సీ చాలావరకు పడిపోయింది. దీంతో డిమాండ్ ఉన్న రూట్లలోనే నడుపుతున్నారు. ఔరంగాబాద్–నాందేడ్, ఆదిలాబాద్–నాందేడ్, వికారాబాద్–గుంటూరు, సికింద్రాబాద్–యశ్వంత్పూర్, తిరుపతి–మన్నార్గుడి, రేపల్లె–కాచి గూడ, గుంటూరు–కాచిగూడ, సికింద్రాబాద్–సాయినగర్ షిరిడి, చెన్నై సెంట్రల్–తిరుపతి, సికింద్రాబాద్–విశాఖపట్టణం, ఔరంగాబాద్– రేణిగుంట, పర్బనీ–నాందేడ్ మధ్య రాకపోకలు సాగించే రైళ్లను ఆదివారం నుంచి జూన్ 2 వరకు రద్దు చేసినట్లు సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. నాందేడ్–తాండూరు–పర్బనీ మధ్య నడిచే 2 సరీ్వసులను ఈనెల 31 వరకు సికింద్రాబాద్–తాండూరు మధ్య నడుపుతారు. -
ఈజిఫ్టులో ఘోర రైలు ప్రమాదం: 11 మంది మృతి
కైరో: ఈజిఫ్టులో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు ఈజిఫ్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తర కైరోలోని బన్హాలో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు వంద మందికి పైగా గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని రక్షించడానికి అంబులెన్స్లు, వైద్య సిబ్బందిని తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్యాసింజర్ రైలులో ఉన్న ప్రయాణిలకు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీశారు. రైలు దేశ రాజధాని కైరో నుంచి మన్సౌరాకు వెళుతున్న సమయంలో నాలుగు బోగీలు హఠాత్తుగా పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటపై ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్ ఫట్టా అల్ సిసి విచారం వ్యక్తంచేశారు. రైలు ప్రమాద ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అయితే రైలు పట్టాలకు తప్పడానికి గల కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు. రైలు డ్రైవర్, ఇతర రైలు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: అమెరికాలో మళ్లీ కాల్పులు -
ఎక్కడా ఆంక్షల్లేవు.. మరి ప్యాసింజర్కు రైళ్లేవి?
ఎన్నికల సభలు జరుగుతున్నాయి.. వేల మంది హాజరవుతున్నారు.. థియేటర్లలో పక్కపక్కనే కూర్చుని సినిమా చూస్తున్నారు.. బస్సుల్లో తిరిగే విషయంలోనూ ఎలాంటి నిబంధనలు లేవు.. మార్కెట్లలో ఎంతమంది జనం ఉంటున్నారో అసలు లెక్కే లేదు.. ఎక్కడా ఆంక్షల్లేవు.. ఎవరిలోనూ కోవిడ్ భయం లేదు.. జనజీవనం దాదాపుగా సాధారణ పరిస్థితుల్లోకి వచ్చేసింది.. కానీ, రైళ్ల విషయంలో మాత్రం ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. స్పెషల్ పేరుతో ఎక్స్ప్రెస్, ప్రీమియం కేటగిరీ రైళ్లనే తిప్పుతూ ప్యాసింజర్ రైళ్లను మాత్రం పక్కన పెట్టేసింది. సభల నుంచి సినిమాల వరకు అన్నింటా ఆంక్షలు ఎత్తివేస్తూ కోవిడ్ జాగ్రత్తలు పాటించమని చెబుతున్న కేంద్రం.. ఎంతోమందిని గమ్యస్థానం చేర్చే రైళ్ల విషయంలో అందుకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరి స్తోంది? అన్నదే సగటు ప్రయాణికుడి ప్రశ్న. సాక్షి, హైదరాబాద్/సికింద్రాబాద్: సికింద్రాబాద్.. కాచిగూడ..నాంపల్లి.. ఇవీ రాష్ట్రంలో ప్రధాన రైల్వేస్టేషన్లు. కోవిడ్కు ముందు ఈ స్టేషన్లలో ఎప్పుడు చూసినా ప్రయాణికుల రద్దీ కనిపిస్తూనే ఉండేది. లాక్డౌన్ సమయం మినహాయిస్తే ఇప్పుడు ప్రయాణాల విషయంలో దాదాపు ‘సాధారణ పరిస్థితి’వచ్చేసింది. ప్రజలు రాకపోకలతో బిజీగా మారిపోయారు. కానీ రైల్వేస్టేషన్లు మాత్రం బోసిపోయే ఉంటున్నాయి. కోవిడ్ నిబంధనలు క్రమంగా సడలిస్తూ సాధారణ పరిస్థితి కలిగేలా చూస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రైళ్లను నడిపే విషయంలో భిన్నంగా వ్యవహరిస్తుండటం ప్రయాణికులకు శాపంగా మారింది. దీంతో బస్సులు, ఇతర వాహనాల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ కూడా పూర్తిస్థాయిలో సర్వీసులు నడిపిస్తోంది. తొలుత సిటీ బస్సులను పరిమితంగా నడిపిన ఆ సంస్థ.. ఇప్పుడు వాటిని కూడా దాదాపు పూర్తిస్థాయిలో నడుపుతోంది. కానీ రైల్వే మాత్రం ఒక్క ప్యాసింజర్ రైలును కూడా నడపటంలేదు. హైదరాబాద్ నుంచి ఇతర పట్టణాలకు తిరిగే డెమూ మెమూ రైళ్లతోపాటు ఎంఎంటీఎస్ రైళ్లను కూడా ఆపరేట్ చేయడంలేదు. కేవలం ఎక్స్ప్రెస్ రైళ్లు, ప్రీమియం కేటగిరీ రైళ్లలో కొన్నింటిని కోవిడ్ స్పెషల్ రైళ్లు, పండగల ప్రత్యేక రైళ్ల పేరుతో నడుపుతోంది. ఇవి జనం అవసరాలకు ఏమాత్రం సరిపోవడంలేదు. ఒక్క ప్యాసింజర్ రైలు కూడా లేదు.. రాష్ట్రం నుంచి 250 వరకు ప్యాసింజర్ రైళ్లు నడుస్తాయి. వీటిలో 180కి పైగా దక్షిణమధ్య రైల్వేకు సంబంధించినవి కాగా, మిగతావి ఇతర జోన్లలో మొదలై దక్షిణమధ్య రైల్వే మీదుగా నడిచేవి. అల్పాదాయ వర్గాలకు చెందినవారంతా ఎక్కువగా వీటిపైనే ఆధారపడతారు. అయితే, ఈ రైళ్లలో ఒక్కటి కూడా ఇప్పుడు నడవడంలేదు. ఇక సాధారణ రోజుల్లో సగటున నిత్యం 303 ఎక్స్ప్రెస్ రైళ్లు, రాజధాని, శతాబ్ది వంటి ప్రీమియం కేటగిరీ రైళ్లు నడిచేవి. వీటిలో ప్రస్తుతం నిత్యం సగటున 179 మాత్రమే నడుస్తున్నాయి. ఇవన్నీ పండగ ప్రత్యేక రైళ్లు, కోవిడ్ స్పెషల్ రైళ్ల పేరుతో తిరుగుతున్నాయి. రద్దీ మార్గాల్లోనే తక్కువ.. హైదరాబాద్ నుంచి ఏపీలోని విశాఖపట్టణం, విజయవాడ, నర్సాపూర్, కాకినాడ, గుంటూరు వైపు వెళ్లే రైళ్లు కిటకిటలాడుతుంటాయి. వీటిలో విజయవాడకు నిత్యం సగటున 30 వరకు రైళ్లు తిరిగేవి. కానీ ప్రస్తుతం పది మాత్రమే నడుస్తున్నాయి. అలాగే విశాఖపట్టణానికి దాదాపు 25 రైళ్లు (అన్నీకలిపి) ఉంటాయి. వాటిలో ఇప్పుడు 13 మాత్రమే తిరుగుతున్నాయి. చెన్నైకి ఐదు రైళ్లుండగా.. ఇప్పుడు రెండే వెళుతున్నాయి. బెంగుళూరుకు ఐదుకు గాను ఒక్కటే తిరుగుతోంది. ఇలా రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో కూడా చాలా తక్కువ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. తిరుపతికి నుంచి ఐదు ఎక్స్ప్రెస్ రైళ్లు ఉండగా ప్రస్తుతం అన్నింటినీ తిప్పుతున్నారు. తిరుపతికి భక్తుల తాకిడి పెరగడంతోనే వాటిని పునరుద్ధరించారు. ముంబైకి నగరం నుంచి ఐదు రైళ్లు నిత్యం ఉండగా నాలుగు నడుస్తున్నాయి. ఢిల్లీకి మూడు రైళ్లు ఉండగా.. మూడింటినీ తిప్పుతున్నారు. రద్దీ ఉండటం లేదంటున్న రైల్వే.. ఇప్పుడు నడుపుతున్న రైళ్లలో రద్దీ అంతగా ఉండటం లేదని, కొన్నింటికి తప్ప వెయిటింగ్ లిస్ట్ ఉండటం లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. దీంతో పూర్తిస్థాయిలో రైళ్లను పునరుద్ధరించాల్సిన అవసరం లేదన్న భావన వారి మాటల్లో వ్యక్తమవుతోంది. ‘అన్ని రైళ్లను పునరుద్ధరిస్తే తిరిగి అన్ని స్టేషన్లు కిటకిటలాడటం ఖాయం. రైళ్లు లేకపోవడంతోనే ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు అన్ని రైళ్లను నడిపితే అవి కిటకిటలాడి మళ్లీ కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే వాటిని తిప్పటం లేదు’అని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. అయితే, సినిమాహాళ్లు కిటకిటలాడితే కేసులు పెరుగుతాయనే భయం లేనప్పుడు.. రైళ్ల విషయంలోనే ఈ ఆంక్షలెందుకు అనేది సగటు ప్రయాణికుడి ప్రశ్న. రైళ్లు పూర్తిస్థాయిలో తిరగకపోవటంతో ట్రాక్కు సంబంధించిన పనులను రైల్వే ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రాక్కు సంబంధించి పనులు కొలిక్కి తేచ్చేందుకు కొంతకాలం ప్రయాణికుల రైళ్లను తక్కువగా నడపాలని భావించి ఉండొచ్చన్న విమర్శలు ఉన్నాయి. ప్రయాణికుల రైళ్లతో రైల్వేకు నష్టమే వస్తోందని.. అందువల్లే లాభాలొచ్చే సరుకు రవాణా రైళ్లను గతంలోకంటే ఎక్కువగా తిప్పుతున్నారని కూడా అంటున్నారు. అయితే, అధికారులు వీటిని కొట్టిపడేస్తున్నారు. రైల్వే బోర్డు అనుమతిస్తే రైళ్లు నడిపేందుకు సిద్ధం: గజానన్ మాల్యా ‘కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో రైళ్లను నడపటం లేదు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ రైళ్లను నడుపుతున్నాం. ప్రస్తుతం ఎక్స్ప్రెస్ రైళ్లలో 60 శాతం తిప్పుతున్నాం. మిగతా రైళ్లను నడపటమనేది జోన్ పరిధిలో లేదు. రైల్వే బోర్డు అనుమతిస్తే నడిపేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎంఎంటీఎస్ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది’అని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ఇటీవల ఓ సమావేశంలో పేర్కొన్నారు. జనరల్ ప్రయాణాలు అనుమతించాలి భువనేశ్వర్ వెళ్లేందుకు రైలు ఏమైనా ఉందేమో అని స్టేషన్కు వచ్చాను. కనీసం లోనికి కూడా అనుమతించడం లేదు. బస్సులో వెళదామంటే కళ్లు తిరిగే చార్జీలు చెబుతున్నారు. సాధారణ ప్రయాణాలు అనుమతించి మాలాంటి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలి. – విశాల్, సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ టికెట్ ఇవ్వడంలేదు మా అమ్మను ట్రైన్ ఎక్కించేందుకు స్టేషన్కు వచ్చాను. ఆమెకు చదువు రాదు. పైగా వృద్ధురాలు. సహాయంగా లోపలకు వెళ్లడానికి ప్లాట్ ఫామ్ టికెట్లు ఇవ్వడం లేదు. ఇక్కడ మహిళలు, వృద్ధులు ఒంటరిగానే ప్లాట్ఫామ్ల మీదకు వెళ్లాల్సి వస్తోంది. ఫ్లాట్ఫామ్ టికెట్లు ఇస్తే బాగుంటుంది. – దినేశ్, అమీర్పేట్ రాయితీలు పునరుద్దరించాలి ప్రత్యేక రైళ్ల పేరుతో అన్ని రకాల రాయితీలను నిలుపుదల చేశారు. వికలాంగులు మొదలు సీనియర్ సిటిజన్లు ఇతరత్రా రాయితీలు ఏమీ లేవు. దీంతో ప్రయాణికులు నష్టపోతున్నారు. ప్రత్యేక రైళ్లలో కూడా రాయితీలు ఇవ్వాలి. – నరేశ్, కూకట్పల్లి అన్ని కౌంటర్లు తెరవాలి రిజర్వేషన్ కన్ఫామ్ కాని పక్షంలో టికెట్ రద్దు చేయించుకునేందుకు నగరంలోని అన్ని రైల్వే కౌంటర్లను అందుబాటులోకి తేవాలి. రైలు బయటుదేరేందుకు అరగంట లోపే టికెట్ రద్దు చేసుకునే అవకాశం ఉండడం, రద్దు చేయించుకోవడం కోసం అందరూ సికింద్రాబాద్ రిజర్వేషన్ కౌంటర్కు రావడం ఇబ్బందిగా ఉంది. – ప్రమోద్కుమార్, మియాపూర్ బస్సులో నాగ్పూర్కు రూ.1500 అడుగుతున్నారు ఉపాధి కోసం నాగ్పూర్ నుంచి నగరానికి వలస వచ్చాను. ఇప్పుడు సొంతూరు వెళ్లాలంటే రైళ్లు లేవు. దక్షిణ్ ఎక్స్ప్రెస్లో వెళదామని స్టేషన్కు వచ్చాను. కానీ జనరల్ బోగీలు లేవంటున్నారు. బస్సులో టికెట్కు రూ.1500 అడుగుతున్నారు. ఎప్పుడూ రైలులో రూ.200కే వెళ్లేవాడిని. –నితీష్, నాగ్పూర్ రైళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం మధ్యప్రదేశ్ వెళ్లాలంటే హైదరాబాద్ నుంచి నేరుగా బస్సులు లేవు. మారుతూ మారుతూ బస్సుల్లో మా ఊరు వెళ్లాలంటే బోలెడు ఖర్చుపెట్టక తప్పదు. కూలి పనులతో సంపాదించిన సొమ్మంతా బస్సులకే పెట్టాలి. రిజర్వేషన్ టికెట్ ఉంటేగానీ రైలు ఎక్కనీయడంలేదు. ప్రభుత్వం త్వరగా అన్ని రైళ్లూ నడిపితే బాగుంటుంది. – అభి, ఉమరై, మధ్యప్రదేశ్ -
ఫ్యాక్ట్ చెక్: ఫిబ్రవరి 1 నుంచి సాధారణ రైళ్లు
న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి కారణంగా భారతీయ రైల్వే అన్ని సాధారణ పాసెంజర్ రైళ్లను ఆపివేసిన సంగతి మనకు తెలిసిందే. గత ఏడాది మార్చి నుంచి కేవలం ప్రత్యేక రైళ్లను మాత్రమే భారతీయ రైల్వే నడుపుతోంది. ఇదిలావుండగా, 2021 ఫిబ్రవరి 1 నుంచి అన్ని ప్యాసింజర్ రైళ్లు, లోకల్ రైళ్లు, స్పెషల్ రైళ్లు పనిచేయబోతున్నాయని ఒక సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంపై పీఐబీ ఫాక్ట్ చెక్ స్పందించింది.(చదవండి: ఇంట్లో నుంచే ఓటరు ఐడీ డౌన్లోడ్) ఈ సందేశం పూర్తిగా అబద్ధమని భారతీయ రైల్వే అటువంటి ప్రకటన చేయలేదని రైల్వే అధికారులతో పాటు పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ఫాక్ట్ చెక్ ట్వీట్ చేసింది. దేశంలో ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తున్నామని ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలతో చర్చించిన తర్వాతే సాధారణ రైళ్లపై నిర్ణయం తీసుకుంటామని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్ దేశ వ్యాప్తంగా ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతోంది. ప్రస్తుతం రైల్వే మొత్తం మెయిల్ లేదా ఎక్స్ప్రెస్ రైళ్లలో 65 శాతం రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. -
ఆ పాసింజర్లు ఇక ఎక్స్ప్రెస్లు!
సాక్షి, అమరావతి:ఇన్నాళ్లూ పాసింజర్లుగా నడుస్తున్న పలు రైళ్లు ఎక్స్ప్రెస్లుగా మారబోతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ, గుంటూరు డివిజన్లలో దాదాపు 20 వరకు పాసింజర్లు ఇలా ఎక్స్ప్రెస్ రైళ్లుగా అప్గ్రేడ్ కానున్నాయి. దేశంలోని వివిధ జోన్ల పరిధిలో నడుస్తున్న పాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్/మెయిల్లుగా మార్పు చేస్తూ తాజాగా రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డు వాటి వివరాలను వెల్లడించింది. పాసింజర్ రైళ్లు గమ్యాన్ని చేరడంలో ఆలస్యమవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎక్స్ప్రెస్లుగా అప్గ్రేడ్ చేయాల్సిన పాసింజర్ రైళ్ల వివరాలను ఆయా రైల్వే జోనల్ కార్యాలయాల నుంచి రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు/సిఫార్సులు వెళ్లాయి. వాటిని అనుసరించి పలు పాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్లుగా మార్పు చేసింది. అమలు ఎప్పటినుంచంటే.. అయితే ఈ రైళ్లు ఎప్పట్నుంచి ఎక్స్ప్రెస్లుగా రూపాంతరం చెందుతాయన్నది రైల్వే బోర్డు ఇంకా స్పష్టం చేయలేదు. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో కొన్ని స్పెషల్ రైళ్లను మాత్రమే నడుపుతున్నారు. తిరిగి పూర్తి స్థాయిలో రెగ్యులర్ రైళ్లను నడపడం ప్రారంభించాక అప్గ్రేడ్ చేసిన రైళ్లను ఎక్స్ప్రెస్లుగా నడపుతారని తెలుస్తోంది. వేగంగా గమ్యానికి.. ఇవి ఎక్స్ప్రెస్లుగా మారితే ప్రయాణ వేగం మరింతగా పెరగనుంది. దీంతో గమ్యానికి చేరుకునే సమయం బాగా తగ్గుతుంది. ప్రయాణం కలిసొస్తుంది. కాగా ప్రస్తుతం ఆగుతున్న పాసింజర్ హాల్టుల్లో ఇకపై ఈ ఎక్స్ప్రెస్లు ఆగవన్నమాట! అయితే కొత్తగా ఎక్స్ప్రెస్లుగా మారిన రైళ్లకు పాసింజర్ హాల్టులున్న కొన్ని ముఖ్య స్టేషన్లలో హాల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎక్స్ప్రెస్లుగా మారగా మిగిలిన పాసింజర్ రైళ్లు మాత్రం నిర్ణీత స్టేషన్లలో యథావిధిగా ఆగుతాయి. కొత్తగా ఎక్స్ప్రెస్లుగా మారాక ఈ రైళ్లలో స్లీపర్ క్లాస్ బోగీలు, మరికొన్ని రైళ్లలో థర్డ్ ఏసీ కోచ్లను కూడా ఏర్పాటుతో పాటు రిజర్వేషన్ సదుపాయం కూడా ఉండే వీలుంది. ఎక్స్ప్రెస్లుగా మారనున్న పాసింజర్ రైళ్లు ఇవే.. -
కొనసాగుతున్న రైతుల రైల్రోకో
చండీగఢ్ : పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకి వ్యతిరేకంగా పంజాబ్లో రైల్ రోకో ఆందోళన కొనసాగుతోంది. గత మూడు రోజులుగా రైతులు రైలు పట్టాలపై కూర్చొని రైల్ రోకోలు నిర్వహిస్తున్నారు. తొలుత కిసాన్ మజ్దూర్ సంఘర్‡్ష కమిటీ ఈ నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే, ఆ తర్వాత వివిధ సంఘాలు మద్దతు ప్రకటించాయి. అమృత్సర్లో అన్నదాతలు చొక్కాలు విప్పి బిల్లులపై తమ నిరసనను తీవ్రంగా వ్యక్తం చేశారు. చొక్కాలు విప్పి రైలు పట్టాలపై కూర్చుంటే అయినా కేంద్రం తమ గోడు వింటుందని కిసాన్ కమిటీ ప్రధాన కార్యదర్శి శర్వణ్ సింగ్ పాంధేర్ అన్నారు. రైతుల నిరసనలతో రైల్వే అధికారులు మరో మూడు రోజులు రాష్ట్రంలో అన్ని పాసింజర్ రైళ్లను రద్దు చేశారు. రైతులకి మద్దతుగా రండి: రాహుల్ పిలుపు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా శనివారం స్పీక్ అప్ ఫర్ ఫార్మర్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మోదీ ప్రభుత్వం రైతుల్ని అమాయకుల్ని చేసి దోపిడీ చేస్తోందని వారికి మద్దతుగా ప్రజలందరూ గళమెత్తాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడానికే వ్యవసాయ బిల్లుల్ని ఆమోదించారని ఆరోపించారు. -
ప్యాసింజర్ రైళ్లను ఇప్పట్లో నడపలేం
గుంతకల్లు: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నవంబర్ నాటికి కూడా ప్యాసింజర్ రైళ్లను నడపడం కష్టమేనని డీఆర్ఎం అలోక్తివారీ తెలిపారు. సోమవారం ఆయన గూగుల్ మీట్ యాప్ ద్వారా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన డివిజన్లో జరుగుతున్న పలు రైల్వే అభివృద్ధి పనులను తెలిపారు. ఎర్రగుంట్ల – నంద్యాల మధ్య 123 కి.మీ, ధర్మవరం – పాకాల మధ్య 227 కి.మీ విద్యుద్దీకరణ పనులను 2021లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలోనే గుత్తి – ధర్మవరం మధ్య 30 కి.మీ డబులింగ్ రైలు మార్గం చేయనున్నట్లు తెలిపారు. గుత్తి యార్డులో దాదాపు రూ.15 కోట్లతో ఆధునిత ఎలాక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిగ్నిల్ వ్యవస్థను పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చామన్నారు. మిషన్ రఫ్తార్లో భాగంగా గుత్తి – రేణుగుంట మధ్యలో 130 కిమీ వేగంతో సుమారు 280 కి.మీలు (రానుపోను) రైలు నడిపినట్లు తెలిపారు. ఈ స్పీడ్ ట్రయల్ రన్ను సీఓసీఆర్ (కన్ఫర్మేటరీ ఓసీలోగ్రాప్ కార్ రన్) ద్వారా ఈ రైలు మార్గంలో ట్రాక్ పటిష్టతతో పాటు 23 వంతెనల నాణ్యతను, సిగ్నిల్ వ్యవస్థను పరిశీలించామన్నారు. అలాగే గుత్తి – వాడీ మధ్య ట్రాక్ పటిష్ట పరిచే పనులు వేగవంతంగా చేస్తున్నామని, ఈ డిసెంబర్ నాటికి ఈ మార్గంలో కూడా 130 కి.మీ వేగంతో రైళ్లను నడుపుతామన్నారు. జిల్లా కలెక్టర్ అనుమతితో గుంతకల్లు రైల్వే డివిజనల్ ఆస్పత్రిని కోవిడ్ కేర్ సెంటర్గా ఏర్పాటు చేసి రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. -
పట్టాలెక్కిన రైళ్లు.. ప్రయాణానికి రెడీనా!
న్యూఢిల్లీ: లాక్డౌన్తో దాదాపు నెలల విరామం తర్వాత ప్రయాణికుల రైళ్లు మంగళవారం పట్టాలెక్కాయి. ఎనిమిది రాజధాని ఎయిర్కండిషన్డ్ రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలు దేరాయి. మొదటి రోజు 8,121 మంది ప్రయాణికులతో రైళ్లు బయలుదేరినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. (రైలు బండి.. షరతులు ఇవేనండీ) బిలాస్పూర్(చత్తీస్గఢ్), దిబబ్రూగఢ్(అసోం), బెంగళూరు (కర్ణాటక) నుంచి మూడు రైళ్లు బయలు దేరాయి. దేశరాజధాని ఢిల్లీ నుంచి హౌరా(పశ్చిమ బెంగాల్), రాజేంద్రనగర్(బిహార్), ముంబై సెంట్రల్(మహారాష్ట్ర), అహ్మదాబాద్(గుజరాత్), బెంగళూరు నగరాలకు మరో ఐదు రైళ్లు వెళ్లాయి. ‘కోవిడ్-19 నేపథ్యంలో ప్రయాణికుల రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. పునరుద్ధరణ తర్వాత న్యూఢిల్లీ-బిలాస్పూర్ రాజధాని సూపర్ఫాస్ట్ రైలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి రైలు’ అని రైల్వే మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ రైలు ఢిల్లీ నుంచి మంగళవారం మధ్యాహ్నం 4 గంటలకు బిలాస్పూర్కు బయలుదేరింది. కాగా, సోమవారం సాయంత్రం నుంచి ఆన్లైన్లో టిక్కెట్ల అమ్మకాలను రైల్వే శాఖ ప్రారంభించింది. 24 గంటల్లో 1,69,039 టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు వెల్లడించింది. ఏడు రోజుల ముందువరకు మాత్రమే ఆన్లైన బుకింగ్లు స్వీకరిస్తున్నారు. మొట్టమొదటగా 15 మార్గాల్లో 15 జతల (30 రానుపోను ప్రయాణాలు) రైళ్లను ప్రారంభించారు. ఇతర రెగ్యులర్ ప్యాసింజర్ సర్వీసెస్, మెయిల్, ఎక్స్ప్రెస్, ప్యాసింజర్, సబ్ అర్బన్ సర్వీసులను ఇంకా ప్రారంభం కాలేదు. (లాక్డౌన్: కేజ్రీవాల్ వినూత్న నిర్ణయం) -
గుడ్న్యూస్: రేపట్నుంచి రైలు కూత
సాక్షి, న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడు సొంతూళ్లకు వెళ్లాలా అని ఎదురుచూస్తున్న వారికి భారతీయ రైల్వే.. ‘కూత’ పెట్టి మరీ తీపికబురు చెప్పింది. ఈ నెల 12 (మంగళవారం) నుంచి రైల్వే సర్వీసులను పునరుద్ధరించనున్నట్టు ఆదివారం ప్రకటించింది. అయితే ఇది క్రమపద్ధతిలో ఉంటుందని, తొలుత 15 జతల (30 తిరుగు ప్రయాణాలు) ఏసీ రైళ్లను ప్రారంభించనున్నట్టు తెలిపింది. న్యూఢిల్లీ నుంచి దిబ్రూగఢ్, అగర్తల, హౌరా, పట్నా, బిలాస్పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రా బాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడగావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావి స్టేషన్లను కలుపుతూ ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. తదుపరి మరిన్ని కొత్త మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు తెలిపింది. కరోనా కేర్ సెంటర్లుగా ఇప్పటికే 20 వేల కోచ్లను భారతీయ రైల్వే వినియోగిస్తోంది. అలాగే రోజుకు 300 వరకు రైళ్లను వలస కూలీల కోసం ప్రత్యేకంగా శ్రామిక్ ఎక్స్ప్రెస్ల పేరుతో నడుపుతోంది. ఇవిపోను అందుబాటులో ఉన్న రైళ్లను తదుపరి మరిన్ని కొత్త మార్గాల్లో నడపనున్నట్టు తెలిపింది. (చదవండి: ‘కరోనా’ వాహకులు వీరే) నేటి సాయంత్రం నుంచి బుకింగ్ సోమవారం సాయంత్రం 4 గంటలకు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా బుకింగ్ ప్రారంభించనున్నట్టు భారతీయ రైల్వే శాఖ తెలిపింది. రైల్వే స్టేషన్లలో టికెట్ బుకింగ్ కౌంటర్లు ఉండవని, ప్లాట్ఫాం టికెట్ కోసం కూడా కౌంటర్లు ఉండవని తెలిపింది. కన్ఫర్మ్ టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే స్టేషన్లోకి అనుమతించనున్నట్టు తెలిపింది. ప్రయాణికులు ముఖాన్ని కవర్ చేసుకోవాలని, రైలు ఎక్కేటప్పుడు స్క్రీనింగ్కు వెళ్లాల్సి ఉంటుందని, కరోనా లక్షణాల్లేని వారినే రైలులోకి అనుమతించనున్నామని తెలిపింది. రైలు షెడ్యూలు, తదుపరి వివరాలను మరో ప్రకటన ద్వారా తెలియపరచనున్నట్టు వెల్లడించింది. (చదవండి: ఇండో–చైనా సరిహద్దులో ఉద్రిక్తత) ఇదీ కరోనా ప్రొటోకాల్.. స్క్రీనింగ్, నిమిత్తం ప్రయాణికులు గంట ముందుగా స్టేషన్కు చేరుకోవాలి. రైళ్లలో మునుపటి మాదిరిగా దుప్పట్లు అందించరు. నిబంధనలకు అనుగుణంగానే ఏసీ సదుపాయం. తాజా గాలినే గరిష్టంగా వినియోగించుకునేలా ఏర్పాటు. ఈ రైళ్లలో ప్రయాణించే వారు ఆరోగ్యసేతు యాప్ను తప్పక ఇన్స్టాల్ చేసుకోవాలి. తాజాగా నడిచే రైళ్లలో సూపర్ఫాస్ట్ రైలు చార్జీలను వసూలు చేస్తారు. చార్జీల్లో రాయితీలుండవు. ప్రతి బోగీలో 72 మందికి బదులుగా 54 మందినే అనుమతిస్తారు. -
రైలు ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: లాక్డౌన్ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఈనెల 12వ తేదీ నుంచి ప్రయాణికుల రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే శాఖ స్పష్టం చేసింది. న్యూ ఢిల్లీ నుంచి దేశంలోని 15 ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లను (మొత్తం 30 సర్వీసులు) నడపనున్నారు. చదవండి: ఆ మార్కెట్కు వెళ్లే వర్తకులు అప్రమత్తంగా ఉండాలి న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్, దిబ్రూగఢ్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్ పూర్, రాంచీ, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావీ రైల్వే స్టేషన్లకు ప్రయాణికుల రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే ప్రకటించింది. ఈనెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఐఆర్సీటీసీలో టికెట్లను బుక్ చేసుకోవచ్చు. కాగా.. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని, రైల్వే స్టేషన్లలో స్క్రీనింగ్ నిర్వహించి కరోనా లక్షణాలు లేవని తేలితేనే రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతిస్తామని రైల్వే శాఖ తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. రాబోయే రోజుల్లో పరిస్థితులకు అనుగుణంగా దేశంలోని మరిన్ని ప్రాంతాలకు రైళ్ల సర్వీసులను పునరుద్ధరిస్తామని కేంద్రం ప్రకటించింది. చదవండి: ‘కరోనా’ ప్రూఫ్ కారును చూశారా? -
న్యూఇయర్కు వినూత్న స్వాగతం
పశ్చిమగోదావరి ,నిడదవోలు రూరల్: నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామస్తులు ఏటా నూతన సంవత్సర వేడుకలు వినూత్నంగా నిర్వ స్తున్నారు. స్థానిక ఓల్డ్ క్రిస్టియన్ పేటకు చెందిన వైఎంసీఏ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో 81 ఏళ్లుగా జనవరి 1న నిడదవోలు–భీమవరం ప్యాసింజర్ రైలుకు ఘన స్వాగతం పలుకుతున్నారు. దీనిలో భాగంగా బుధవారం శెట్టిపేట రైల్వే గేటు వద్ద కొద్దిసేపు రైలును నిలుపుదల చేసి దాని ఇంజిన్కు అరటి బొంతలు, రంగుల జెండాలు కట్టి అలంకరించారు. రైలు డ్రైవర్లతో పాటు ప్రయాణికులకు స్వీట్స్, పండ్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు చెప్పారు. గ్రామ పెద్దల నుంచి ఏటా రైలులో న్యూఇయర్ వేడుకలు నిర్వహించడం ఆనవా యితీగా వస్తోంది. దీంతో యూత్ సభ్యులు, గ్రామస్తులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. -
నాడు నిలిపివేసి..నేడు ప్రయాణం సా..గదీసి
సాక్షి, కొత్తగూడెం : భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) రైల్వే స్టేషన్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్ వరకు వెళ్లే సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ రైలు ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఈ బండి తెల్లవారుజామున 05:45 గంటలకు కొత్తగూడెం నుంచి బయల్దేరేది. ప్రస్తుతం ఉదయం 06:45 గంటలకు షురూ అవుతోంది. డోర్నకల్ సమీపంలోని స్టేషన్ల మధ్యలో జరుగుతున్న రైల్వే ట్రాక్ పనులు, సాంకేతిక లోపాల మరమ్మతుల కారణంగా రైలు నడిచే సమయాల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అయితే..ఈ ఆలస్యంతో నిత్యం రాకపోకలు సాగించేవారు చాలా అసౌకర్యం చెందుతున్నారు. ఈ రైలు ఎక్కి డోర్నకల్ స్టేషన్కు వెళ్లి..అక్కడి నుంచి హైదరాబాద్, విజయవాడలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో 05:45 గంటలకు రైలు వెళ్లినప్పడు డోర్నకల్ స్టేషన్లో హైదరాబాద్, విజయవాడలకు వెళ్లే రైళ్లు ఉండేవి. ప్రస్తుతం మార్పు చేసిన సమయంతో..ఆ ట్రెయిన్లు దొరకట్లేదు. ముఖ్యంగా శాతవాహన, గోల్కొండ, చార్మినార్ ఎక్స్ప్రెస్ రైళ్లు..అందట్లేదని వాపోతున్నారు. కొందరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి వెళ్లేందుకు ప్రయాస పడాల్సి వస్తోంది. రైల్వే అధికారులు చర్యలు చేపట్టి, పాత సమయంలోనే సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ రైలును కొనసాగించాలని పలువురు కోరుతున్నారు. మార్చి దాకా ఇంతేనా? డోర్నకల్ సమీపంలో రైల్వే ట్రాక్ పనులు, సాంకేతిక లోపాల మరమ్మతులు చేస్తున్నారు. అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం 2020 మార్చి వరకు అని భావిస్తున్నారు. అయితే..మే వరకు కూడా పనులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రయాణీకుల ఇబ్బందులు సింగరేణి కార్మికులు ఉండే ప్రాంతాలను కలుపుతూ నడిచే సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ను ఈ ఏడాది మార్చి 26న రద్దు చేశారు. దీని స్థానంలో పుష్పుల్ రైలును వేశారు. అందులో టాయిలెట్లు లేక, సామగ్రి పెట్టుకునే ఏర్పాట్లు లేక ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, అఖిలపక్ష నాయకులు చేసిన పోరాటాలు, రైల్వే అధికారులకు ఇచ్చిన వినతుల ఫలితంగా మళ్లీ గత అక్టోబర్ 8వ తేదీన సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ను అధికారులు పున:ప్రారంభించారు. తాజాగా గంట ఆలస్యం ఆంక్షలతో ప్రయాణికులు మళ్లీ మదన పడుతున్నారు. ఇతర రైళ్లను సరైన సమయంలో అందుకోలేకపోతున్నామని అంటున్నారు. రైల్వే ట్రాక్ పనులతో ఆలస్యం.. డోర్నకల్ సమీప ప్రాంతాల్లో ప్రస్తుతం నడుస్తున్న రైల్వే ట్రాక్ పనుల వలన సింగరేణి ప్యాసింజర్ గంట ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే టైం షెడ్యూల్ 2020 మార్చి వరకు కొనసాగనుంది. అయితే ఆ తర్వాత కూడా ఉన్నతాధికారులు కొనసాగించమంటే..అదే షెడ్యూల్ను కొనసాగిస్తాం. – కనకరాజు, రైల్వే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, కొత్తగూడెం ఇబ్బంది పడుతున్నాం.. సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ రైలు ప్రయాణ సమయాన్ని గంట లేటు చేయడంతో మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం. గతంలో తెల్లవారుజామున 5:45కు బయల్దేరినప్పుడు సరైన టైంకు చేరేవాళ్లం. ఇప్పుడు అలా వెళ్లలేకపోతున్నాం. – బొల్లం రమేష్, ప్రయాణికుడు చాలా క్రాసింగ్లు పెట్టారు.. రైల్వే అధికారులు చేసిన మార్పుల వలన సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్కు చాలా క్రాసింగ్లు ఎదురవుతున్నాయి. సింగరేణి రైలును ఆపి, ఎదురుగా వచ్చే ఇతర ట్రెయిన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. డోర్నకల్లో ఇతర రైళ్లను అందుకోలేకపోతున్నాం. – రఘు, ప్రయాణికుడు -
దయచేసి వినండి.. ఈ రైలు ఎప్పుడూ లేటే !
సాక్షి, గుంతకల్లు: తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు కష్టాలు తప్పడం లేదు. తిరుపతి ప్యాసింజర్ రైలును కదిరిదేవరపల్లి వరకు పొడిగించడంతో ఈ సమస్య మరింత జఠిలంగా మారింది. కదిరిదేవరపల్లి – తిరుపతి – కదిరిదేవరపల్లి ప్యాసింజర్ రైలు (నం–57477/78)కు అత్యంత చౌక ధరతో తిరుపతి వెళ్లేవారికి ఎంతో అనుకూలం. దీంతో ఈ రైలు ప్రయాణం పట్ల వెంకన్న భక్తులు ఎక్కువగా మక్కువ చూపుతుంటారు. ఈ ప్యాసింజర్ రైలు గుంతకల్లు జంక్షన్కు సాయంత్రం 5.45 వచ్చి 6.00 గంటలకు వెళ్లాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో ఈ రైలు ఏ రోజూ కూడా సరైన సమయానికి రాలేదు. గుంతకల్లు జంక్షన్కు సాయంత్రం 7.00లకు పైగా చేరుకుంటుంది. దీంతో నిత్యం వందల మంది తిరుపతికి వెళ్లే ప్రయాణికులతో పాటు విధులు ముగించుకొని అనంతపురం వెళ్లే రైల్వే ఉద్యోగులు కూడా ఈ రైలు సమయానికి రాకపోవడంతో పడిగాపులు కాస్తున్నారు. గడిచిన మంగళవారం, బుధ, గురు, శుక్రవారల్లో ఈ రైలు గుంతకల్లు జంక్షన్కు రాత్రి 7.00 గంటల నుంచి 8.00 గంటలకు చేరుకొని అనంతపురానికి రాత్రి 10.30 గంటలపైనే చేరుతోంది. దీంతో నిత్యం వందలాది మంది తిరుపతికి వెళ్లే ప్రయాణికులు, విధులు ముగించుకొని అనంతపు రం వెళ్లే ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు ప్రతి రోజూ ఆలస్యంగా ఇళ్లకు చేరుకుంటున్నామని రైల్వే ఉద్యోగులు వాపోతున్నారు. అలాగే గుంటూరు – విజయవాడ రైలు పరిస్థితి కూడా ఇలాగే మారింది. గుంతకల్లుకు సాయంత్రం 5.00 గంటలకు చేరుకోవాల్సి ఉండగా ఏరోజూ సమయానికి రావడం లేదు. ఇలా గుంతకల్లు మీదుగా నడిచే ప్రతి ప్యాసింజర్ రైలు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణించడానికి ప్రయాణికులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రైల్వే అధికారులు కూడా ప్యాసింజర్ రైళ్ల పట్ల శ్రద్ధ చూపకపోవడం వల్ల ఈ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. ప్యాసింజర్ రైలులో ప్రయాణించి ఆలస్యంగా గమ్యస్థానాలను చేరుతుంటే ప్రత్యామ్నయంగా బస్సు ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. ప్రయాణమంటేనే బేజారు ! మాది డోన్ . తిరుపతి వెంకన్నస్వామి దర్శనానికి కదిరిదేవరపల్లి–తిరుపతి ప్యాసింజర్ రైలు ఎంతో అనుకూలమాని ఎప్పడూ ఈ రైలులోనే వెళ్తుంటా. అయితే ఎప్పుడు తిరుపతికి వెళ్తినా ఈ రైలు మాత్రం సమయానికి రావడం లేదు. దీంతో ఈ రైలులో ప్రయాణించాలంటేనే బేజారొస్తోంది. ఎప్పుడూ ఇది ఆలస్యంగానే వస్తుంది. – అనంతరాములు, ప్రయాణికుడు,డోన్ ఆలస్యంగా ఇంటికి చేరుతున్నా నేను డీఆర్ఎం కార్యాలయంలో పని చేస్తున్నా. ప్రతిరోజూ అనంతపురం నుండి గుంతకల్లుకు వస్తుంటా. సాయంత్రం పని ముగించుకొని అనంతపురం వెళ్లేందుకు కదిరిదేవరపల్లి–తిరుపతి ప్యాసింజర్కు వెళ్తా. అయితే ఈ మధ్య కాలంలో రైలు సమయానికి రావడం లేదు. దీంతో రోజూ రాత్రి 10.30 గంటలకు ఇంటికి చేరాల్సి వస్తోంది. – వెంకటేశ్వర్లు, రైల్వే ఉద్యోగి -
రైలుబండి.. జగమొండి
గుంతకల్లు: ఆ రైలుకు అర్ధరాత్రి అంటే ఎంతో ఇష్టమున్నట్లుంది. అందుకే సాయంత్రం 7.20 గంటలకు గుంతకల్లు జంక్షన్ చేరుకోవాల్సిన ఈ రైలు... తన జీవిత కాలంలో ఏనాడూ సమయానికి గమ్యం చేరిన దాఖలాలు లేవు. విసిగి వేసారిన ప్రయాణీకులు అసహనంతో ఆ రైలుకు ఓ ముద్దు పేరు పెట్టారు. అదే దెయ్యాల బండి. ఈ బండిని ఎక్కాలంటే ప్రయాణీకులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కాచిగూడ రైల్వేస్టేషన్లో ఉదయం 10.00 గంటలకు బయలుదేరే ఈ ప్యాసింజర్ రైలు... అనేక స్టేషన్లు దాటుకొని సాయంత్రం 7.20 గంటలకు గుంతకల్లు చేరాల్సి ఉంది. అయితే స్టేషన్లో ప్లాట్ఫాంల కొరత, క్రాసింగ్లు, చైను లాగడాలు తదితర కారణాల వల్ల ఏనాడూ ఈ రైలు అనుకున్న సమయానికి గుంతకల్లుకు చేరలేదు. ఎటు తిరిగి సరిగ్గా అర్ధరాత్రి సమయానికి గుంతకల్లు రైల్వే జంక్షన్ చేరి ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతుంది. దీంతో ముఖ్యంగా మహిళలు ఈ రైలు ఎక్కాలంటేనే భయపడిపోతారు. సిగ్నల్స్ అందక స్టేషన్ బయట పొలాల్లో గంటల తరబడి నిలిచిపోతుండటంతో ప్రయాణికులు ఊరి బయట చిమ్మచీకట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అసలే భద్రత కరువైన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రైలులో ప్రయాణించే అరకొర ప్రయాణికులు రాత్రివేళ ఒకే పెట్టెలోకి చేరుకొని పరస్పర దైర్యం చెప్పుకునే ఘటనలు సర్వసాధారణంగా మారాయి. } గుంతకల్లు రైల్వే జంక్షన్ ఔటర్లో నిలిచిపోయిన కాచిగూడ ప్యాసింజర్ ఔటర్లోనే ఆగిపోతుంది కాచిగూడ నుంచి ఇప్పుడా..అప్పుడా అన్నట్లు పరిగెత్తుకు వచ్చే ఈ ప్యాసింజర్...గుంతకల్లు సమీపించే కొద్ది మారాం చేస్తుంది. సిగ్నల్స్ అందక గంటల కొద్దీ (డీఆర్ఎం కార్యాలయ సమీపంలో) ఔటర్లోనే నిలిచిపోతుంది. నిరీక్షించే ఓపిక నశించిన ప్రయాణికులు రైలు దిగి ముళ్లకంపల మధ్య నడుచుకుంటూ ఇళ్లకు వెళుతుంటారు. ట్రాక్పై కంకర మధ్య నడుచుకుంటూ జారిపడిన ఘటనలు కూడా అనేకంగా ఉన్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి కూడా 9.00 గంటలకు గుంతకల్లు సమీపానికి చేరుకున్న ఈ రైలు ఔటర్ నుంచి జంక్షన్లోకి 11.00 గంటలకు చేరింది. సుమారు 2 గంటలపాటు ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ చిమ్మచీకట్లోనే గడిపారు. నరకం అనుభవించాం డోన్ నుంచి గుంతకల్లుకు ఈ రైలులో ప్రయాణం చేశా. సాయంత్రం 7.00 గంటలకు డోన్లో కదిలితే గుంతకల్లు ఔటర్కు 9.15 గంటలకు చేరుకుంది. మరో 10 నిమిషాల్లో ఇంటికెళ్లొచ్చు అని అనుకున్నా..కానీ గంటల కొద్దీ రైలును నిలిపి వేశారు. – రాజు, ప్రయాణికుడు ముళ్లపొదల్లో నడిచా కాచిగూడ ప్యాసింజర్ రైలును గుంతకల్లు పట్టణ సమీపాన నిలిపి వేశారు. గంటల కొద్దీ కదలకపోవడంతో రైలు దిగి మొనతేలిన కంకర రాళ్ల మధ్య నడుచుకుంటూ ముళ్ల కంపలను దాటుకుంటూ రోడ్డున పడ్డాను. –లక్ష్మీదేవి, ప్రయాణికురాలు -
రైల్లో ఆత్మహత్య చేసుకున్న యువతి గుర్తింపు
సాక్షి, కావలిరూరల్: విజయవాడ నుంచి బిట్రగుంటకు వస్తు న్న ప్యాసింజర్ రైల్లో బుధవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన యువతి నెల్లూరుకు చెం దిన రాసాల నరసింహా రావు కుమార్తె రాసాల స్వాతిశ్రీ (25)గా గుర్తిం చారు. యువతి ఆత్మహత్యపై ‘సాక్షి’లో వచ్చిన ఫొటోతో పాటు ప్రచురితమైన వార్తను చూసి ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. గురువారం కావలి జీఆర్పీ పోలీసులను సంప్రదించారు. ప్రభుత్వ ఏరియా వైద్యశాల మార్చురీలో ఉన్న యువతి మృతదేహాన్ని చూసి స్వాతిశ్రీగా నిర్ధారించుకున్నారు. స్వాతిశ్రీ తల్లిదండ్రులు ఇద్దరికీ పక్షవాతం ఉండటంతో కుటుంబం ఇబ్బందుల్లో ఉంది. దీంతో బీటెక్ చదువు మధ్యలో ఆపేసింది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఆమె పోటీ పరీక్షలు రాసేందుకు గత 2 నెలల నుంచి నెల్లూరులోని ఒక కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటుంది. ఈ నెల 9న కోచింగ్ కోసమని ఇం టి నుంచి వచ్చిన ఆమె తిరిగి ఇంటికి వెళ్లలేదు. ఈ క్రమంలో 10న స్వాతిశ్రీ కుటుంబ సభ్యులు నెల్లూరు రెండో నగర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 11వ తేదీ రాత్రి ఆమె విజయవాడ–బిట్రగుంట ప్యాసింజర్ రైల్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి, శుక్రవారం స్వాతిశ్రీ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని జీఆర్పీ పోలీసులు తెలిపారు. -
వేరే స్టేషన్ చేరిన రైలు.. ప్యాసింజర్స్ షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: ఇంత వరకు రైలు ప్రమాదాల గురించి, రైలు ఆలస్యం, రద్దు వంటి విషయాల గురించి విని ఉంటారు. కానీ ఒక స్టేషన్ వెళ్లాల్సిన రైలు.. మరో స్టేషన్కు చేరడం ఎప్పుడైనా విన్నారా? ఈ అరుదైన సంఘటన మన దేశ రాజధానిలోనే జరిగింది. రైల్వే లాగ్ ఆపరేటర్ తప్పిదం వల్ల మంగళవారం ఉదయం ఓల్డ్ ఢిల్లీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో బిత్తరపోవడం ప్రయాణికుల వంతైంది. న్యూఢిల్లీకి చేరాల్సిన రైలు ఏకంగా స్టేషన్ మారి.. ఓల్డ్ ఢిల్లీకి చేరింది. ప్రమాదం ఏమి జరగకపోవడం.. చివరకు ఏదొక స్టేషన్కు చేర్చడంతో ప్రయాణికులు ఒకరకంగా ఊపిరిపిల్చుకున్నారు. ఈ తప్పిదానికి కారణమైన లాగ్ ఆపరేటర్ను రైల్వే అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. రైలు నంబర్ల విషయంలో తికమక పడ్డ లాగ్ ఆపరేటర్ న్యూఢిల్లీ వెళ్లాల్సిన పానిపట్ రైలును ఏకంగా ఓల్డ్ ఢిల్లీ స్టేషన్ వైపు మళ్లించాడు. ఢిల్లీలోని సర్దార్ బజార్ రైల్వే స్టేషన్కు రెండు ప్యాసింజర్ రైల్లు 7.38 నిమిషాలకు చేరుకున్నాయని, దాంతో తికమక పడ్డ లాగ్ ఆపరేటర్ న్యూఢిల్లీ చేరాల్సిన పానిపట్ రైలును ఓల్డ్ ఢిల్లీ స్టేషన్కు మళ్లించాడని రైల్వే అధికారులు తెలిపారు. తప్పును గ్రహించిన అధికారులు దాన్నివెంటనే న్యూఢిల్లీ స్టేషన్కు పంపడంతో ఆలస్యంగా గమ్యానికి చేరుకున్న ప్రయాణికులు రైల్వే తీరుపై అసహనం వ్యక్తం చేశారు. -
కొడుకుతో కలసి మహిళ ఆత్మహత్య
నవీపేట: ఐదు నెలల కొడుకుతో సహా రైలులోంచి ఓ మహిళ దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శనివారం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ వద్ద గోదావరి బ్రిడ్జికి సమీపంలో జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉమ్రి మండల కేంద్రానికి చెందిన హంగిర్గ సునీత(25), భర్త రాజు, కొడుకులు కేశవ్, శివశంభులతో కలసి ఉపాధి నిమిత్తం శనివారం పుణే ప్యాసింజర్లో నిజామాబాద్కు బయలుదేరారు. రాజు, కేశవ్ నిద్రిస్తున్న సమయంలో సునీత కొడుకు శివశంభుతోపాటు ఒక్కసారిగా రైలులో నుంచి కిందికి దూకింది. దీంతో తోటి ప్రయాణికులు పోలీసులకు సమాచారమందించారు. నవీపేట ఎస్ఐ నరేశ్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదన్నారు. -
పట్నా ప్యాసింజర్ రైల్లో మంటలు...
పట్నా : బిహార్ లోని మొకామాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొకామా రైల్వేస్టేషన్ యార్డ్లో నిలిపి ఉన్న పట్నా-మొకామా ప్యాసింజర్ రైలు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అయిదు బోగీ అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో జరిగింది. ముందుగా రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగానే మంటలు మరో రెండు మూడు బోగీలకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది అయిదు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికీ బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద కారణాలపై రైల్వే భద్రతా అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికి గాయాలు కాలేదు. -
రైలులో 25 తులాల బంగారు చోరీ
-
సైకో.. దెబ్బకు రైల్ రోకో
గుంతకల్లు: ఓ సైకో తన విపరీత చేష్టలతో రైల్వే పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. అతని చేష్టల కారణంగా గుంతకల్లు రైల్వే జంక్షన్ నుంచి మూడు ప్యాసింజర్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. సికింద్రాబాద్ నుం చి బయల్దేరిన ప్యాసింజర్ రైలు మంగళవారం రాత్రి 10.30 గంటలకు గుంతకల్లు జంక్షన్ చేరింది.ఈ రైలును యార్డులో క్లీనింగ్ నిమిత్తం నిలిపారు. బోగీలు, బాత్రూంలను శుభ్రపరచడానికి వెళ్లిన క్లీనింగ్ బాయ్స్ ఓబోగీలోని బాత్రూం లోపలివైపున గడియ వేసుకొని ఓ వ్యక్తి కేకలు పెడుతుండటాన్ని గుర్తించారు. అతని చేతిలో ఇనుపరాడ్, కత్తి ఉండటాన్ని గుర్తించి.. వెంటనే జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచా రమిచ్చారు. వారు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి సైకో ఉన్న లావెట్రీ తలుపులు తీయడానికి ప్రయత్నించారు. స్పందన రాలేదు. దీంతో పోలీసులు కిటికీ వద్దకు చేరుకొని అతని వివరాలు ఆరా తీశారు. తన పేరు నరసింహ అని, సికింద్రాబాద్లోని కొత్తపేట అని చెప్పాడు. బుధవారం ఉదయం కూడా అదే పరిస్థితి ఉండడంతో చివరకు ఓ పోలీసును బోగీ వద్ద కాపలా ఉంచి వెళ్లిపోయారు. అతనికి ఆకలిగా ఉందని చెప్పడంతో టిఫిన్ తీసుకొచ్చి కిటికీలో నుంచి సైకోకు అందించాడు. టిఫిన్ తిన్నాక... కానిస్టేబుల్ ఒక్కరే ఉన్నారని గుర్తించిన సైకో బాత్రూమ్ తలుపు తీసుకొని బయటికి వచ్చాడు. అప్పటికే బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న కర్ణాటక ఎక్స్ప్రెస్ ఎక్కి ఉడాయించాడు. -
ఫలించిన వైఎస్ అవినాష్రెడ్డి కృషి
► ఈ నెల 20 నుంచి ఐదు స్టేషన్లలో నంద్యాల ► ప్యాసింజర్ రైలు ఆపేందుకు అనుమతి కడప కార్పొరేషన్: కడప– నంద్యాల మీదుగా నడుస్తున్న ప్యాసింజర్ రైలును జిల్లాలోని పలుచోట్ల ఆపాలని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డి చేసిన కృషి ఫలించింది. ఈనెల 20వ తేదీ నుంచి ఐదు చోట్ల ఈ రైలును ఆపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్కుమార్ వెల్లడించారు. సోమవారం రైల్వే జీఎంను కలిసిన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి ఆయన ఈ విషయాన్ని తెలిపారు. కడప– నంద్యాల ప్యాసింజర్ రైలును జిల్లాలోని ఎర్రగుంట్ల, ఎర్రగుడిపాడు, కమలాపురం, గంగాయపల్లె, కృష్ణాపురం స్టేషన్లలో నిలుపుదల చేయాలని స్థానిక ప్రజల విన్నపం మేరకు ఎంపీ అవినాష్రెడ్డి రైల్వే మంత్రి సురేష్ప్రభుతోపాటు, కేంద్ర రైల్వే అధికారుల, సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్, గంతకల్ డివిజన్ డీఆర్ఎంను కలిసి విన్నవించారు. ఆ విషయంపై బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఇప్పటివరకూ ప్యాసింజర్ రైలును ఆపే విషయంలో అధికారులు నిర్ణయం తీసుకోలేదు. సోమవారం ఎంపీ హైదరాబాద్కు వెళ్లి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ను కలిసి మరోసారి విన్నవించడంతో ఆయన స్పందించి ఈనెల 20వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని పలు రైల్వేస్టేషన్లలో ఉన్న సమస్యలను కూడా ఎంపీ ఆయన దృష్టికి తీసుకుపోయారు. -
పరుగులు పెట్టిన రైలు
రాయదుర్గం–కళ్యాణదుర్గం మార్గంలో 110 కిలోమీటర్ల స్పీడ్తో ట్రయల్ రన్ విజయవంతం వారం రోజుల్లోగా సౌత్ వెస్ట్రన్ రైల్వే జీఎంకు నివేదిక నెలాఖరులోనే ప్యాసింజర్ రైలు నడిపే అవకాశం? రాయదుర్గం టౌన్: రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం వరకు నిర్మించిన కొత్త రైలు మార్గంలో ప్రత్యేక తనిఖీ రైలు శుక్రవారం అధికారికంగా పట్టాలెక్కింది. ఈ మార్గంలో 110 కిలోమీటర్ల వేగంతో రైలును ప్రయోగాత్మకంగా నడిపి పరీక్షించారు. ట్రయల్ రన్ ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతమైనట్లు రైల్వే సేఫ్టీ అధికారులు తెలిపారు. 40 కిలోమీటర్ల మధ్య దూరం గల ఈ మార్గంలో తొలుత రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గానికి ఉదయం 9.30 గంటలకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రత్యేక రైలు కళ్యాణదుర్గం స్టేషన్కు చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి మధ్యాహ్నం 2.20 గంటలకు అదే వేగంతో ఎలాంటి టెక్నికల్ సమస్యలు లేకుండా విజయవంతంగా రాయదుర్గం స్టేషన్కు వెళ్లింది. మొదటి రోజు ఆరు మోటార్ ట్రాలీలలో సీఆర్ఎస్ తనిఖీలు నిర్వహించిన సౌత్ వెస్ట్రన్ రైల్వే, రైల్వే సేఫ్టీ ఉన్నతాధికారులు రెండో రోజైన శుక్రవారం ట్రయల్ రన్ను పూర్తి చేశారు. అనంతరం ఇంజినీర్లను, రైలు గార్డులు, డ్రైవర్లు, అధికారులను అభినందించారు. రాయదుర్గం చేరుకున్న తరువాత విలేకర్లతో రైల్వే చీఫ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి అశోక్ గుప్తా, చీఫ్ సేఫ్టీ కమిషనర్ మనోహర్, ఏడీఆర్ఎం పునిత్ మాట్లాడారు. ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేశామని, ఆథరైజేషన్ నివేదికను వారం రోజుల్లోగా సౌత్వెస్ట్రన్ రైల్వే జనరల్ మేనేజర్కు అందజేస్తామన్నారు. సేఫ్టీ తనిఖీల్లో అన్ని పారా మీటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత ట్రయల్ రన్ విజయవంతమైందన్నారు. మార్గంలో రైలు నడిపేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. అన్ని రకాలుగా ట్రాక్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. నెలాఖరులో లేదా జనవరిలో ఒక ప్యాసింజర్ రైలు నడిపించే అవకాశం ఉందన్నారు. రాయదుర్గం నుంచి టుంకూరుకు 207 కిలోమీటర్లకు గాను ఇప్పటి వరకు 40 కిలోమీటర్ల మేర కళ్యాణదుర్గం వరకు రైలు నిర్మాణం పూర్తయినట్లు చెప్పారు. ఆంధ్రా పరిధిలోని 94 కిలోమీటర్లకు గాను ఇంకా 23 కిలోమీటర్ల పరిధిలో భూమి అక్విజేషన్ కార్యక్రమం కొనసాగుతోందని, కర్ణాటక పరిధిలోనూ ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. -
ఐసీడీఎస్కు ఆడశిశువు అప్పగింత
మహబూబ్నగర్ క్రైం : ఓ రైలులో గుర్తుతెలియని వ్యక్తులు తొమ్మిది నెలల ఆడశిశువును వదిలిపెట్టి వెళ్లారు. రైల్వే ఎస్ఐ రాఘవేందర్గౌడ్ కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం గుంటూరు నుంచి కాచిగూడ వరకు వెళుతున్న ఫ్యాసింజర్ రైలు మహబూబ్నగర్ స్టేషన్లో ఆగింది. అదే సమయంలో తొమ్మిది నెలల ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. కొద్దిసేపటికి అక్కడి ప్రయాణికులు గమనించి వెంటనే రైల్వేపోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు ముస్తాక్, షర్మిల పాల్గొన్నారు. -
ఒంగోలు-తెనాలి పాసింజర్లో మంటలు
ఒంగోలు నుంచి తెనాలి వెళుతున్న పాసింజర్ రైలులో సోమవారం మధ్యాహ్నం సమయంలో ఇంజన్లో మంటలు లేచాయి. రైలు చిన్నగంజాం రైల్వే స్టేషన్కు చేరుకున్న సమయంలో వెనుకనున్న ఇంజన్లో బ్యాటరీలు వేడెక్కి మంటలు లేచాయి. దీంతో స్టేషన్లోని సిబ్బంది వెంటనే పౌడర్ చల్లి మంటలను ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. అయితే, రైలులోని ప్రయాణికులు గంటన్నరపాటు ఎండ వేడికి తీవ్ర అవస్థలు పడ్డారు. పాసింజర్ రైలులోపల మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. గంటన్న వ్యవధిలో తెనాలి వైపు వెళ్లే మరొక రైలులో ప్రయాణికులను పంపించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. -
పాసింజర్ రైలులో మహిళ మృతదేహం
గుంటూరు- కాచిగూడ పాసింజర్ రైలులో ఓ గుర్తు తెలియని మహిళ మృత దేహం వెలుగు చూసింది. మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు గోనెసంచిలో కుక్కి రైలు బాత్రూమ్లో వదిలేసి వెళ్లినట్టు తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి కాచిగూడ చేరుకున్న రైలులో ప్రయాణికులు దిగిపోయిన తర్వాత సిబ్బంది తనిఖీ చేయగా మృతదేహం బయటపడింది. రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. -
జీఎం వస్తున్నారని రైలును ఆపేశారు
శావల్యాపురం (గుంటూరు) : దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో గుంటూరు నుంచి డోన్ వెళ్లే ప్యాసింజర్ రైలును ఆకస్మికంగా నిలిపివేశారు. దీంతో గుంటూరు జిల్లాలోని శావల్యాపురం స్టేషన్లో శుక్రవారం మధ్యాహ్నం 45 నిముషాలకు పైగా రైలు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జీఎం రవీంద్రగుప్తా నరసారావుపేట స్టేషన్ను సందర్శించారు. అలాగే అచ్చంపల్లి రైల్వే గేట్ను పరిశీలించారు. -
ప్యాసింజర్ రైలుకు తప్పిన ప్రమాదం
-
ఇంజిన్ ఫెయిలై నిలిచిన రైలు
ములకలచెరువు (చిత్తూరు) : ప్యాసింజర్ రైలు ఇంజిన్ లోపంతో గంటలపాటు నిలిచిపోయింది. సాయంత్రం 5 గంటలకు రైలు తిరిగి కదిలే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే...గుంతకల్లు నుంచి తిరుపతి వెళ్లే ప్యాసింజర్ రైలు ఇంజిన్లో లోపంతో ములకలచెరువు మండలం బత్తలాపురం వద్ద నిలిచిపోయింది. అయితే అదే మార్గంలో రావాల్సిన తిరుపతి- గుంతకల్లు రైలును తుమ్మనగుట్ట వద్ద ఆపేశారు. ఆ ఇంజిన్ను బత్తలాపురం వద్దకు తీసుకెళ్లి అక్కడ నిలిచిన రైలు బోగీలను బత్తలాపురం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం రైలు గుంతకల్లు వైపు వెళ్లిపోయింది. కాగా తిరుపతి రైలు అక్కడే ఉంది. హిందూపురం నుంచి మరో ఇంజిన్ను తెప్పించి నిలిచిపోయిన రైలును సాయంత్రం 5 గంటల సమయంలో గమ్యస్థానం వైపు నడిపిస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా ప్రయాణికులు అందుబాటులో ఉన్న వాహనాల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. -
ప్యాసింజర్ రైలులో మంటలు
మహబూబ్నగర్: కాచిగూడ నుంచి కర్నూలు వెళ్తున్న ప్యాసింజర్ రైలులో ఆదివారం మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది ఏనుగొండ వద్ద నిలిపివేసి మరమత్తులు చేశారు. అనంతరం మథావిథిగా రైలు కర్నూలుకు బయలుదేరింది. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
పాసింజర్ ట్రైన్లో బాంబు కలకలం
ఫరుక్కాబాద్: ఉత్తరప్రదేశ్లో ఓ పాసింజర్ ట్రైన్లో బాంబు ఉండటం కలకలం సృష్టించింది. యూపీలోని ఫరుక్కాబాద్లో మెయిన్పురి పాసింజర్ ట్రైన్లో బాంబు ఉందని పోలీసులు గుర్తించారు. ట్రైన్ బయలుదేరడానికి 20 నిమిషాల ముందు సంబంధిత సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వెంటనే వారు ట్రైన్లో పెట్టిన బాంబును తొలిగించడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. -
పట్టాలు తప్పిన ప్యాసింజర్
జైపూర్: రాజస్థాన్లో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. జైపూర్ జంక్షన్లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. చెన్నై నుంచి జైపూర్ మధ్య నడిచే రైలు సరిగ్గా జైపూర్ ప్లాట్ ఫాం వద్దకు చేరుకునే సమయంలో రైలు ఇంజిన్ పట్టాలు తప్పిపోయింది. దీంతో దాదాపు అర్థగంటపాటు రైల్వే సిబ్బంది కష్టపడి తిరిగి ఇంజిన్ను పట్టాలెక్కించారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ఇంజిన్కు చెందిన రెండు చక్రాలు పట్టాలు తప్పడం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. -
కుంగిన ప్యాసింజర్ బోగీ
ఉంగుటూరు : పుష్కరాల సందర్భంగా రద్దీగా వెళుతున్న ఓ ప్యాసింజర్ రైలులో బోగీ అకస్మాత్తుగా విరిగిపోరుు కుంగిపోవడంతో ప్రయూణికులు భీతిల్లారు. పెద్ద శబ్ధం రావడంతో హాహాకారాలు చేస్తూ రైలు నుంచి దిగిపోయూరు. డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమా దం తప్పింది. ఉంగుటూరు రైల్వేస్టేషన్ వద్ద శనివారం వేకువజామున జరిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నారుు.. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళుతున్న పాసిం జర్ రైలు ఉదయం 5.15 గంటల సమయంలో ఉంగుటూరు రైల్వేస్టేషన్లో ఆగింది. ప్రయాణికులను ఎక్కించుకుని విజయవాడ వైపు బయలుదేరిన రెండు నిమిషాల అనంతరం ఓ బోగీ మధ్యభాగంలో విరిగిపోయింది. వాక్యూమ్ పైప్ తెగిపోయి రైలు పట్టాల కిందకు దిగబడిపోయింది. ఈ సమయంలో పెద్ద శబ్ధం రావడంతో ప్రయాణికులంతా భీతావహులయ్యారు. విషయాన్ని గ్రహించిన రైలు డ్రైవర్లు కల్యాణ్, వీరభద్రరావు వెంటనే రైలును నిలిపివేశారు. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు రైలు నుంచి కిందకు దిగిపోయారు. అదే సమయంలో రాజమండ్రి వైపు ఓ ఎక్స్ప్రెస్ రైలు రావటాన్ని గ్రహించిన పాసింజర్ రైలు డ్రైవర్లు దానిని నిలుపుదల చేయించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రైళ్ల రాకపోకలు ఆలస్యం రైలు బోగీ విరిగిపోవటంతో విజయవాడ వైపు వెళ్లే రైళ్ల రాకపోకలను రెండు గంటలకు పైగా ఎక్కడికక్కడ నిలిపివేశారు. రాజమండ్రి నుంచి హూటాహుటిన ప్రత్యేక రైలులో సిబ్బంది తరలివచ్చారు. విరిగిపోయిన బోగీని తొలగించి మిగిలిన బోగీలను చేబ్రోలు రైల్వే స్టేషన్కు తరలించారు. పాసింజర్ రైలులోని ప్రయాణికులను సింహాద్రి ఎక్స్ప్రెస్లో, రాయగడ పాసింజర్లో తరలించారు. చాలామంది ప్రయాణిలు రోడ్డుపైకి వేర్వేరు వాహనాల్లో గమ్య స్థానాలకు వెళ్లారు. రోడ్లపైనే నిద్ర ప్రయూణికుల్లో పలువురు రైల్వేస్టేషన్ ఆవరణలో, రోడ్డుపై, జాతీయ రహదారి చెంతన నిద్రించారు. పుష్కర రద్దీతో ఈ రైలు ఎక్కేందుకు ఇబ్బంది పడ్డామని ప్రయూణికులు సత్యనారాయణ, వరలక్ష్మి వాపోయారు. రైల్వే శాఖ ఏర్పాట్లు సరిగా లేవన్నారు. బ్రేక్ పైపు ఒత్తిడే కారణం ఏడీఆర్ఎం ఎన్ఎస్ఆర్ ప్రసాద్ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నామని విజయవాడ డివిజన్ ఏడీఆర్ఎం ఎన్ఎస్ఆర్ ప్రసాద్ చెప్పారు. ఆయన ఘటనాస్థలిని పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. బ్రేక్ పైపు ఒత్తిడి అధికమవ్వడం వల్ల బోగీ విరిగి కుంగిపోరుుందన్నారు. కొన్నిసార్లు లోడు ఎక్కువగా ఉన్నా బోగీలు విరిగిపోయే ప్రమాదం ఉం దన్నారు. ఎలక్ట్రికల్ ఇంజినీర్ వరప్రసాద్, మెకానిక ల్ ఇంజినీర్ ప్రదీప్కుమార్, స్టేఫీ అధికారి ప్రసాద్ నేతృత్వంలో సిబ్బంది మరమ్మతులు జరిపి రెండు గంటలలో రైలును పునరుద్ధరించారు. -
రైలులో రేషన్ బియ్యం పట్టివేత
ఒంగోలు క్రైం : ప్యాసింజర్ రైలులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఒంగోలు రైల్వే జీఆర్పీ పోలీసులు శనివారం పట్టుకున్నారు. విజయవాడ-ఒంగోలు (ట్రైన్ నంబర్-67263) ప్యాసింజర్లో రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారం ఒంగోలు రైల్వే జీఆర్పీ సీఐ కె.వెంకటేశ్వరరావుకు అందింది. దీంతో ఆయన తన సిబ్బందిని అప్రమత్తం చేశారు. మధ్యాహ్నం ఒంగోలు రైల్వేస్టేషన్కు ప్యాసింజర్ రైలు రాగానే ఎస్సై పి.భావనారాయణ రైలు బోగీలన్నీ కానిస్టేబుళ్లతో తనిఖీ చేయిం చారు. రైలు పెట్టెకు ఒక బస్తా చొప్పున 11 రేషన్ బియ్యం బస్తాలు ఉన్నాయి. ఒక్కో బియ్యం బస్తా బరువు సుమారు 40 నుంచి 50 కేజీల వరకు ఉంది. అంటే దాదాపు అరటన్ను బియ్యమన్నమాట. వెంటనే ఆ బియ్యాన్ని ఒంగోలు రైల్వేస్టేషన్లో దించి వాటిని జీఆర్పీ పోలీస్స్టేషన్కు తరలించారు. బియ్యం పట్టుకున్న వారిలో ఎస్సైతో పాటు హెడ్కానిస్టేబుల్ వీఆర్కే రెడ్డి, స్టేషన్ రైటర్ చలపతిరావుతో పాటు సిబ్బంది ఉన్నారు. సమాచారాన్ని ఒంగోలు సివిల్ సప్లయిస్ అధికారులకు అందజేశారు. బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకొని గోడౌన్కు తరలిస్తారు. అయితే ఈ బియ్యం తమవని ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. -
వ్యాన్ - రైలు ఢీ : ఐదుగురి మృతి
లక్ష్మీపూర్: ఉత్తరప్రదేశ్ లక్ష్మీపూర్లోని మయిగల్గంజి ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న వాహనాన్ని సీతాపూర్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జుమాయి నుంచి షాజహాన్పూర్ వెళ్తున్న పెళ్లి బృందం వ్యాన్ .. కాపలా లేని రైల్వే క్రాసింగ్ దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సీతాపూర్ జిల్లా ఆస్పుత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. రైలు వస్తున్న సంగతి వ్యాన్ డ్రైవర్ గుర్తించకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. -
చెన్నై- గూడూరు ప్యాసింజర్ రైలులో మంటలు
-
ఎర్రగుంట్ల - నొస్సం.. రైలు వచ్చేస్తోంది..
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల-నొస్సం మధ్య మరో రెండు నెలల్లో ప్యాసింజర్ రైలు తిరగనుంది. ఈ మార్గంలో ఇప్పటికే రైల్వే లైను కూడా పూర్తయింది. ఆదివారం ఎర్రగుంట్ల నుంచి నొస్సం వరకు, అక్కడి నుంచి తిరిగి సంజామల, కోవెలకుంట్ల మీదుగా బనగానపల్లె వరకు ట్రాక్ పరిశీలన నిమిత్తం రైలు ఇంజన్ నడిపారు. ఈ ఇంజన్లో రైల్వే సాంకేతిక నిపుణులు బయలుదేరి రైల్వే ట్రాక్ను పరిశీలించారు. ఏప్రిల్ నెలలలో కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ(సీఆర్ఎస్) పరిశీలించి ట్రాక్ పటిష్టతపై క్లియరెన్స్ ఇస్తే ఎర్రగుంట్ల - నొస్సం మధ్య రైలు తిరుగుతుంది. మొదటి దశలో ఎర్రగుంట్ల నుంచి నొస్సం వరకు రైలును నడపనున్నారు. రెండవ దశలో అంటే డిసెంబరు నుంచి బనగానపల్లి వరకు రైలు నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ త ర్వాత పెండింగ్ పనులన్నీ పూర్తికాగానే ఎర్రగుంట్ల నుంచి నంద్యాల వరకు పూర్తిస్థాయిలో రైలు నడుస్తుంది. ఎర్రగుంట్ల నుంచి బనగానపల్లి వరకు సుమారు 123 కిలో మీటర్లు ఉంటుంది. ఇప్పటికే అధికారులు ట్రాక్ పనులు పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. ఏప్రిల్లో రానున్న సీఆర్ఎస్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ(సీఆర్ఎస్) ఎర్రగుంట్లకు ఏప్రిల్ నెలలో వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈయన ఎర్రగుంట్ల- నొస్సం మార్గంలో రైల్వే లైన్ పరిశీలించి ధ్రువీకరిస్తే రైలు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఈ లైన్పై అధికారులు పరిశీలన చేశారు. రోలింగ్ ఇంజన్ కూడా ఆదివారం నడిపారు. ఈ ఇంజన్ నొస్సం నుంచి రాత్రి 9 గంటలకు తిరిగి ఎర్రగుంట్లకు చేరుకుంది. ఈ విషయంపై ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ మాస్టర్ శంకర్రెడ్డి మాట్లాడుతూ ఆదివారం ఎర్రగుంట్ల-నొస్సం మధ్య రోలింగ్ పనుల కోసం రైల్వే ఇంజన్ పంపించినట్లు తెలిపారు. నొస్సం నుంచి సంజామల, బనగానపల్లి వరకు ఇంజన్ వెళ్లిందన్నారు. ఏప్రిల్ నెలలో సీఆర్ఎస్ పరిశీలన పూర్తయితే ఈ మార్గంలో రైలు నడుపుతామని స్పష్టం చేశారు. -
రైలు కింద పడి వృద్ధురాలు మృతి
గుంటూరు: రెంటచింతల మండలంలోని పాలువాయి గేటు గ్రామం వద్ద శనివారం రైలు కింద పడి ఒక వృద్ధురాలు మృతి చెందింది. వివరాలు...పాలువాయి గేటు గ్రామంలో కొంతకాలంగా భిక్షాటనం చేసుకుంటూ జీవిస్తున్న అంకమ్మ(70) బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా గుంటూరు నుంచి మాచర్ల వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలు కిందపడి మృతిచెందింది. ఈమెకు కుటుంబసభ్యులు,బంధువులు ఎవరూ లేరని గ్రామస్తులు తెలిపారు. (రెంటచింతల) -
గుణుపూర్ రైలుకు పచ్చజెండా
పట్టాలెక్కనున్న గుణుపూర్-విశాఖ రైలు 9న ప్రారంభించనున్న రైల్వే మంత్రి విశాఖపట్నం సిటీ: గుణుపూర్-విశాఖపట్నం-గుణుపూర్(58505/06)ప్యాసింజర్ రైలు పట్టాలపై పరుగులు తీసేందుకు తూర్పు కోస్తా రైల్వే శుక్రవారం పచ్చజెండా ఊపింది. గత రైల్వే బడ్జెట్లో ప్రకటించిన ఈ రైలు నడిపేందుకు ఇప్పటి వరకూ అనుమతి ఇవ్వలేదు. గతంలోనే ఈ రైలుకు చెందిన రేక్లు వచ్చినా ఆ రేక్లను ప్యాసింజర్, ఎక్స్ప్రెస్లకు వినియోగించారు. ఎట్టకేలకు ఈ కొత్త రైలును పట్టాలెక్కించడంతో ఉత్తరాంధ్ర వాసులు ఊపిరి తీసుకున్నారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు రైల్వే మంత్రి సురేష్ ప్రభాక ర్ ప్రభు న్యూఢిల్లీలో రిమోట్ జెండా ఊపి గుణుపూర్ నుంచి విశాఖ రైలును ప్రారంభిస్తారు. ఆ రోజు ప్రత్యేక రైలుగా నడుస్తుంది. ఆ మరుసటి రోజు నుంచీ రెగ్యులర్గా నడిచేందుకు ఏర్పాట్లు చేశారు. విశాఖ-గుణుపూర్(58506) ప్యాసింజర్ రోజూ విశాఖలో ఉదయం 7 గంటలకు బయల్దేరి నౌపడ జంక్షన్కు 10. 50 గంటలకు చేరుతుంది. అక్కడి నుంచి బయల్దేరి అదే రోజు మధ్యాహ్నం 1.55 గంటలకు గుణుపూర్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో గుణుపూర్-విశాఖ(58505) ప్యాసింజర్ రోజూ గుణుపూర్లో మధ్యాహ్నం 2.25 గంటలకు బయల్దేరి నౌపడ జంక్షన్కు సాయంత్రం 5 గంటలకు చేరుతుంది. తిరిగి 5.25 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 9.40 గంటలకు విశాఖకు చేరుతుంది. ఈ రైలు సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, గరివిడి, చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళం రోడ్, తిలారు, కోటబొమ్మాళి, నౌపడ, గుణుపూర్ స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైల్లో మొత్తం 12 బోగీలుంటాయి. అన్నీ జనరల్ బోగీలేనని ప్రయాణికులు ఈ రైలును వినియోగించుకోవాల్సిందిగా వాల్తేరు సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ ఎం.ఎల్వేందర్యాదవ్ తెలిపారు. -
రైలు కూత పెట్టేదెన్నడు?
మోర్తాడ్ : ‘ నీవు ఎక్కాల్సిన రైలు.. జీవిత కాలం లేటు’ అన్న ఓ సినీ కవి మాటలు నిజామాబాద్, పెద్దపల్లిల మధ్య ప్రయాణం చేయాలనుకునే వారికి అచ్చంగా సరిపోతాయి. నిజామాబాద్ ప్రాంతంలో పూర్తి కావల్సిన రైల్వే ట్రాక్ నిర్మాణానికిఅవసరం అయిన భూమి సేకరణ సక్రమంగా జరుగక పోవడంతో రైలు కూతకు ఇంకా మోక్షం లభించడం లేదు.నిజామాబాద్, పెద్దపల్లిల మధ్య 177.49 కిలోమీటర్ల పొడవునా రైల్వే నిర్మాణానికి నిజాం ప్రభువు కాలంలోనే ప్రతిపాదనలు జరిగాయి. 1993-94లో ఈ రైల్వే లైన్కు మోక్షం లభించింది. కాగా ప్రతి బడ్జెట్లో తక్కువగా నిధులు కేటాయించడంతో ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. పెద్దపల్లి, జగిత్యాల్ మధ్యన రైలు ప్రయాణం జరుగుతోంది. మోర్తాడ్ వరకుట్రాక్ పూర్తి కాగా స్టేషన్ నిర్మాణం కూడా పూర్తయ్యింది. దీంతో మోర్తాడ్ నుంచి మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల్ల మీదుగా పెద్దపల్లి వరకు ప్యాసింజర్ రైలును నడపాలని గత మార్చిలోనే అధికారులు ప్రతిపాదనలు చేశారు. మోర్తాడ్, లక్కోర వరకు జగిత్యాల్ నుంచి రైలింజన్ ట్రయల్న్న్రు పూర్తి చేశారు. చిన్న చిన్న లోపాలు తలెత్తగా వాటిని సరిదిద్దారు. రైల్వే సేఫ్టీ బృందం తనిఖీలను నిర్వహించి సర్టిఫై చేస్తే జగిత్యాల్, మోర్తాడ్ల మధ్య ప్యాసింజర్ రైలును నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. 28 కిలో మీటర్ల రైల్వే లైన్ పూర్తి అయితే... నిజామాబాద్, పెద్దపల్లిల మధ్య రైల్వే ట్రాక్ నిర్మాణం మొత్తం 177.49 కిలో మీటర్లు. ఇప్పటివరకు 149.49 కిలో మీటర్ల ట్రాక్ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. అక్కడక్కడ వంతెనల నిర్మాణ పనులు కొంత పెండింగ్లో ఉన్నాయి. నిజామాబాద్ పరిసరాల్లో 28 కిలో మీటర్ల పరిధిలో ట్రాక్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ఇంకా పూర్తి కావడం లేదు. రూ. 200 కోట్ల నిధులు ఉంటే రైల్వే లైన్ నిర్మాణం, స్టేషన్ల పనులు, వంతెనల పనులు పూర్తి చేయవచ్చని ఉన్నతాధికారులు అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం బడ్జెట్లో రూ. 35 కోట్లు కేటాయించింది. అవసరం ఉన్న నిధుల్లో కనీసం సగం కేటాయించినా పనులు ఒక కొలిక్కి వచ్చేవి. నిధుల కేటాయింపులో మొదటి నుంచి నిర్లక్ష్యం కనిపిస్తూనే ఉంది. నిధుల కేటాయింపు విషయంలో ఎంపీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుక రావడం లేదని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో హడావుడి... సాధారణ ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న అప్పటి నాయకుల ఒత్తిడితో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొంత హడావుడి చేశారు. మార్చి 29న జగిత్యాల్ నుంచి మోర్తాడ్, లక్కోర వరకు రైలింజన్ ట్రయల్న్ నిర్వహించారు. త్వరలోనే సేఫ్టీ బృందంతో తనిఖీలు పూర్తి చేయించి ప్యాసింజర్ రైలును నడుపుతామని ప్రకటించారు. అప్పటి అధికార పార్టీ నాయకులు ఒత్తిడి మేరకు రైల్వే అధికారులు హడావుడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు సేఫ్టీ బృందం తనిఖీలను నిర్వహించక పోవడాన్ని పరిశీలిస్తే ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసమే ట్రయల్న్ ్రఒక ఎత్తుగడ అని స్పష్టం అవుతోంది. చివరకు ఎన్నికల ఫలితాలు కూడా అప్పటి నాయకులకు ప్రతికూలంగానే వచ్చాయి. కాగా ఇప్పటి ప్రజాప్రతినిధులు స్పందించి తనిఖీలను పూర్తి చేయించి ప్యాసింజర్ రైలును ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. -
స్కూల్ బస్సును ఢీకొన్నరైలు:ఐదుగురు మృతి
మావ్(యూపీ): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. గురువారం ఉదయం విద్యార్థులతో వెళుతున్న స్కూల్ బస్సును ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో ఐదుగురు చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో్ మరో 20 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్కూల్ బస్సు మావ్ లో రైలు పట్టాలు దాటుతున్న సమయంలో ఆకస్మికంగా వచ్చిన ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. -
స్టువర్టుపురం దొరలు
తపాలా అది 2004వ సంవత్సరం. బ్యాంకు ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు బదిలీ అవుతూ, తెనాలిలో ఉంటున్న రోజులు. ఆ సమయంలో బంధువులమ్మాయికి బీఈడీ అప్లికేషన్ కోసం నన్ను సంప్రదిస్తే, నేను అవి తెచ్చివ్వటానికి సరేనన్నాను. ఆ అమ్మాయికొచ్చిన ర్యాంకు, ప్రభుత్వ కాలేజీలో అడ్మిషన్కు తృటిలో తప్పిపోయిన ర్యాంకు. మైనార్టీ కళాశాలలో తప్పక సీటు వచ్చే ర్యాంకు. అప్పుడు బీఈడీ యేడాది మాత్రమే. రాబోయే రోజుల్లో దీన్ని రెండేళ్లు చేస్తారనే వార్తలు రావడంతో, ఎట్లయినా ఆ యేడాదే జాయిన్ చేయాలనే దృఢ నిశ్చయంతోటి, నేను మైనార్టీ కళాశాలల వివరాలు తెలుసుకుని, అప్లికేషన్లు తీసుకురావడానికి బయల్దేరాను. గుంటూరు, ఒంగోలు, తర్లుబాడు మొదలైన ప్రాంతాల్లో ఉన్న కాలేజీలకు వెళ్లడానికి ప్యాసింజర్ రైల్లో ఒంగోలు వెళ్లాను. ప్యాసింజరే ఎందుకంటే, కొత్త ప్రాంతాన్ని ఇందులోనైతే చూస్తూ పోవచ్చని! ప్రతి స్టేషన్లో ఆగుతుంది కాబట్టి. వెళ్తుండగా దారిలో ‘స్టువర్ట్ పురం’ స్టేషన్ తగిలింది. అక్కడా ఇక్కడా చదవడం, వినడం వల్ల అచేతనంగా నా చేతులు జేబులు తడమడం, ‘హమ్మయ్య పర్స్ ఉన్నది’ అనుకోవడం జరిగిపోయింది. నా చర్యకు నాకే నవ్వొచ్చింది. ఆ తర్వాత, క్షేమంగా వెళ్లడం, తిరిగి రావడం జరిగింది. మరుసటిరోజు నా ప్రయాణం తర్లుబాడు గ్రామం. మామూలుగానే ప్యాసింజర్లో బయల్దేరాను. ఆ కొత్త ప్రాంతాలు పరిశీలిస్తూ సమయం తెలియకుండా సాగిపోయింది ప్రయాణం. తిరుగు ప్రయాణంలో కాలేజీ దగ్గరలోని కాఫీ హోటల్లో టీ, టిఫిన్ తీసుకుని బిల్లు పే చేయడానికి జేబులో చెయ్యి పెట్టి హతాశుడనయ్యాను. అన్ని జేబులూ ఒకటికి రెండుసార్లు తడుముకున్నాను. పర్సు లేదు, డబ్బులు లేవు అనుకొన్నంతనే ఒక విధమైన టెన్షన్! ఏం చేయాలో పాలుపోలేదు. ఆలోచించి మెల్లగా సర్వర్ చెవిలో వేశాను విషయం. ‘‘మీ బిల్లే కాదు, నేను తిరిగి ఇంటికి చేరడానికి కూడా డబ్బుల్లేవు. ఈ నా వాచీని పెట్టుకుని, ఓ వంద రూపాయలు మీ సేఠ్తో ఇప్పించు’’ అన్నాను. అతను చెప్పడం, నాకు సైగ చేయడం, నేవెళ్లి వాచీని ఇవ్వడం, ఓసారి వాచీని కిందా మీదా చూసి వంద రూపాయలు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఇక వాచీ గురించి చింత మొదలైంది నాకు. మరలా దీనికోసం ఇంకో రోజు తిరిగి రావాలిక్కడకు. ఎంత లేదన్నా రాను పోను నాలుగైదు గంటలపైనే. ‘ఏం చేద్దాం’ అని ఆలోచించి, రైల్వేస్టేషన్లో నాతోపాటు ప్యాసింజర్కు ఎదురుచూస్తున్న నా ఇంటి దగ్గర ప్రాంతం వాళ్లని ఒకరిద్దరిని కదిపి విషయాన్ని చెప్పాను - ‘ఓ వంద సర్దితే, నా వాచీ తెచ్చేసుకుని వారికి వెళ్లిన వెంటనే ఇస్తా’నని! ఓ ఒక్కరూ సహాయానికి రాలేదు. ఇంకా మరికొందరితో పంచుకుని పలుచన అయ్యేకంటే రేపు మళ్లీ రావడమే మంచిదనుకొని నిశ్చింతగా ఇంటికి చేరాను. చేరానే గాని, నా మది నిండా నా వాచీ తలంపే. తీరా వెళ్లిన తర్వాత తీసుకున్నతనే ఉంటాడా, మరొకరు ఉంటారా? తెల్లారింది. ఎప్పుడెప్పుడా అనుకుంటూ ప్యాసింజర్ పట్టుకుని వెళ్లాను. వెళుతూనే హోటల్లో అదే వ్యక్తి కౌంటర్లో ఉండటం, నేను వంద నోటు కౌంటర్పై పెడుతూ ‘వాచీ’ అనడం, అతను వంద నోటు గల్లాపెట్టెలో వేసుకుని, అదే పెట్టె నుండి నా వాచీని తీసివ్వడం... నా మనసు కుదుటపడింది. అక్కడే టిఫిన్, టీ సేవించి, మరొక్కసారి అతడికి కృతజ్ఞతలు చెప్పి తిరుగుప్రయాణమయ్యాను. నన్ను సమయానికి ఆదుకొన్న నను వీడని నా వాచీ తిరిగి నా చేతిని చిద్విలాసంగా అలంకరించింది.1984లో కొన్న నా ఆల్విన్ వాచీ ఇప్పటికీ తిరుగుతూ, నాతోనే తిరుగుతూ ఉంటుంది. ఒకే ఒక్కసారి రిపేరుకు వచ్చింది. అప్పుడు రిపేరులో సరైన మెటీరియల్ వాడకపోవడం చేతనో, ఆ మెటీరియల్ దొరకకపోవడం చేతనోగానీ రోజుకు ఓ పది నిమిషాలు వేగంగా తిరుగుతూ ఇంకా తిరుగుతూనే ఉంటాను అన్నట్లుగా ఉంటుంది. అంతా బాగుండి అది ఇంకో 30 యేళ్లు నాతోనే ఉండాలని కోరుకుంటున్నా. ఇంతకీ, ‘స్టువర్ట్ పురం’లో మాయమవుతుందనుకున్న పర్సు, తర్లుబాడులో ఎలా మాయమైందన్న విషయం ఇప్పటికీ అర్థం కాలేదు. - ప్రభాకర్, ఓరుగల్లు ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు, మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి. మా చిరునామా: తపాలా, ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com డిజైన్: కుసుమ -
‘ప్యాసింజర్’కు కోపమొచ్చింది
‘కాకినాడ’ రైలు ఆలస్యంపై ఆగ్రహం రెండు గంటలకుపైగా రైళ్ల నిలిపివేత గోపాలపట్నం ఆర్ఆర్ఐ పాత కేబిన్వద్ద ఆందోళన విశాఖపట్నం : రైలు ప్రయాణికులు ఆగ్రహించారు. ప్యాసింజర్ రైలంటే అంత లోకువా? టికెట్ తక్కువయినంత మాత్రాన గంటల తరబడి బండిని కదలనీయరా..అంటూ ఆగ్రహించి పట్టాల మీద బైఠాయించటంతో బుధవారం పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కాకినాడ నుంచి విశాఖ వచ్చే ప్యాసింజర్ ప్రయాణికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గంటలో గమ్యానికి చేరాల్సిన రైలు రెండు గంటల తర్వాతే చేరుతుండడంపై నిరసన వెల్లువెత్తింది. చివరకు రైల్వే పోలీసుల హెచ్చరికలతో రైళ్లు బలవంతంగా కదిలాయి. వివరాలిలా ఉన్నాయి. కాకినాడ నుంచి విశాఖకు రోజూ ప్యాసింజరు రైలు నడుస్తోంది. ఇది అనకాపల్లి వరకూ బాగానే వస్తున్నా తర్వాత నత్తనడకే. గోపాలపట్నం ఆర్ఆర్ఐ పాత కేబిన్ వద్ద గంట వరకూ నిలిచి పోతోంది. ఇలా బుధవారం కూడా జరగడంతో రైల్లో ఉన్న ప్రయాణికులు వేడెక్కిపోయారు. విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులూ, ఇతర ప్రయాణికులు రైలు దిగి పట్టాలపై బైఠాయించారు. తమ కళ్ల ముందే రైళ్లన్నీ వెళ్లి పోతున్నా ఇక్కడి రైలు మాత్రం రోజూ ఆలస్యంగానే నడుస్తోందని మండిపడ్డారు. నిరసన విరమించాలని రైల్వేభద్రతాధికారులు కోరినా ప్రయాణికుల్లో వేడి చల్లారలేదు. డీఆర్ఎం వచ్చి దీనికి సమాధానం వచ్చి చెబితే కానీ ఇక్కడి నుంచి కదిలేదని లేదని హెచ్చరించారు. దాదాపు రెండు గంటలకుపైగా వాగ్వాదాలు జరిగాయి. ఈ కారణంగా వెనుక వెళ్లవలసి ఉన్న చెన్నయ్ ఎక్స్ప్రెస్, తిరుమల ఎక్స్ప్రెస్, రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు ఎదురుగా వెళ్లాల్సిన యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైలు కూడా నిలిచిపోయింది. రైల్వే అధికారుల తీరుపై ప్రయాణికుల ఆగ్రహావేశాలు పెరగడం, పరిస్థితి తీవ్రంగా మారడంతో భద్రతాధికారులు అడుగు ముందుకేసి రైలు కూత శబ్దన్ని పెద్దగా వినిపించారు. ప్రయాణికులను చెదరగొట్టి బలవంతంగా రైలును కదిలించారు. దీంతో రైలు గం. 11.40 సమయంలో వెళ్లింది. దీంతో పాటు నిలిచిపోయిన రైళ్లన్నీ కదిలాయి. ఇక్కడ రైళ్లు హటాత్తుగా నిలిచి పోవడంతో పలువురు ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
కలకలం రేపిన బాంబు వదంతి
సాక్షి, ముంబై: బాంబు వదంతి ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. రోహా రైల్వేస్టేషన్లో జరిగిన ఈ పరిణామంతో రోహా-దివా ప్యాసింజర్ రైలు సుమారు నాలుగున్నర గంటల ఆలస్యంగా బయలుదేరింది. రోహా-దివాల మధ్య నడిచే రోహా-దివా పా్యిసంజర్ రైలు ఉదయం 5.15 గంటలకు బయల్దేరాల్సి ఉంది. అయితే గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి బాంబు ఉందని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా కలకలంరేగింది. ఈ విషయం తెలుసుకున ్న పోలీసులు, సంబంధిత అధికారులు ప్రయాణికులందరినీ రైలులో నుంచి బయటికి పంపించారు. బాంబు తనిఖీ బృందం ఈలోగా అలీబాగ్ నుంచి రోహా రైల్వేస్టేషన్కు చేరుకుంది. అన్ని బోగీలను తనిఖీ చేసింది. అయితే బాంబులుగానీ లేదా పేలుడు పదార్థాలుగానీ లభించలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
రైలు ప్రమాదంలో 21 మంది మృతి
మహారాష్ట్రలో ఆదివారం సంభవించిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. తొలుత ఈ ప్రమాదంలో 18 మంది మరణించినట్లు భావించగా మరో ముగ్గురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. బాధితులు చికిత్స పొందుతున్న వివిధ ఆస్పత్రుల నుంచి ఈ మరణాల సమాచారం అందినట్లు రాయగఢ్ పోలీసు అధికారి పి.కె. పాటిల్ తెలిపారు. రైలు పట్టాలు తప్పడంతో తీవ్రంగా గాయపడిన 120 మంది ప్రయాణికులను నాగోథానె, రోహా, అలీబాగ్ ఆస్పత్రులకు తరలించారు. మరీ విషమంగా ఉన్నవారిని ముంబైకి తరలించారు. కొంకణ్ రైల్వే పరిధిలో రైళ్ల రాకపోకలను సోమవరం తెల్లవారుజామున పునరుద్ధరించారు. ఆదివారం ఉదయం 9.40 గంటలకు దివా- సావంత్వాడీ ప్యాసింజర్ రైలు ఇంజన్, నాలుగు బోగీలు ముంబైకి 100 కిలోమీటర్ల దక్షిణంగా ఉన్న నాగోథానె వద్ద పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. రైలుపట్టా ఒకటి విరిగిపోవడం వల్లే ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రైల్వే భద్రత కమిషనర్ చేతన్ బక్షి ఈ ప్రమాదంపై విచారణ నిర్వహిస్తారు. -
పట్టాలు తప్పిన రైలు:19 మంది దుర్మరణం
132 మందికి గాయూలు కొంకణ్ రూట్లో ఘటన.. రైళ్ల రాకపోకలకు అంతరాయం ప్రమాదంపై విచారణకు రైల్వేశాఖ ఆదేశం సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లాలోని కొంకణ్ రైలు మార్గంలో ఆదివారం ఉదయం ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించగా 132 మంది గాయపడ్డారు. దీంతో ఈ రూట్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మృతుల కుటుంబాలకు రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే రూ.2 ల క్షల చొప్పున ఎక్స్గ్రేషియూ ప్రకటించారు. రైల్వే అధికారులు, రాయ్గఢ్ పోలీసుల కథనం ప్రకారం మొత్తం 20 బోగీలతో కూడిన దివా (ఠాణే-ముంబై)-సావంత్వాడి ప్యాసింజర్ ఆదివారం ఉదయం దివా నుంచి బయలుదేరింది. 10 గంటల సమయంలో నాగోఠాణే, రోహా రైల్వేస్టేషన్ల మధ్య నిది గ్రామానికి సమీపంలోని భిసెఖిండ్ సొరంగ మార్గం దాటగానే.. భారీ శబ్దంతో రైలు ఇంజిన్తో పాటు ప్రయూణికులతో నిండిన నాలుగు బోగీలు ఒకదాని వెంట మరొకటిగా పట్టాలు తప్పారుు. ప్రయూణికులు అనేకమంది బోగీల్లో ఇరుక్కుపోయూరు. ఒకరిపై మరొకరు పడిపోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమీప గ్రామ ప్రజలు ప్రమాద స్థలికి చేరుకుని ప్రయూణికులను బయటకు తీసేందుకు సహకరించారు. మారుమూల ప్రాంతం కావడం, మరోవైపు కొండ వాలు ఉండటంతో సహాయ కార్యక్రమాలు చేపట్టడం కష్టసాధ్యమైంది. సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారులతోపాటు కుర్లా నుంచి బ్రేక్డౌన్ వ్యాన్, కళ్యాణ్ నుంచి మెడికల్ వ్యాన్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారుు. 12 అంబులెన్స్లతో కూడిన డాక్టర్ల బృందం గాయపడిన వారికి చికిత్సనందించడంతో పాటు తీవ్రంగా గాయపడినవారిని నాగోఠాణే, రోహాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ముంబైకి తరలించింది. తొలుత 13గా నమోదైన మృతుల సంఖ్య సాయంత్రానికి 18కి చేరింది. సంఘటన స్థలంలోనే మరణించిన వారిని పోస్టుమార్టం నిమిత్తం నాగోఠాణే ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. పమాదస్థలిలో చిక్కుకుపోరుున ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో సమీప రైల్వేస్టేషన్లకు చేరవేశారు. ప్రమాద నేపథ్యంలో కొంకణ్ రూట్లో పలు రైళ్లను రద్దు చేశారు. కొన్నిటిని దారి మళ్లించారు. ప్రమాదంపై రైల్వే మంత్రి ఖర్గే విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్పగాయూలైనవారికి రూ.10 వేలు పరిహారంగా ప్రకటించారు. ప్రయూణికుల సమాచారం కోసం రైల్వేశాఖ హెల్ప్లైన్ (ఠాణే: 022-25334840) ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్, రైల్వే ఉన్నతాధికారులు ఘటనాస్థలాన్ని సందర్శించారు. అతివేగమే కారణమా? ప్రమాదం జరిగిన భిసెఖిండ్.. ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలోని మారుమూల ప్రాంతంలో ఉంది. వేసవి సెలవులు కావడంతో రైలు రద్దీగా ఉంది. ప్రమాదానికి రైలు అతివేగమే కారణమని ప్రయూణికులు తెలిపారు. ముఖ్యంగా టన్నెల్తో పాటు పెద్ద మలుపు ఉన్నప్పటికీ వేగంగా వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని రైలు ఆరవ బోగీలో ప్రయాణించిన నామ్దేవ్ కాటకర్ తెలిపారు. పట్టాలు తప్పిన తొలి నాలుగు బోగీల్లోని ప్రయాణికులే ఎక్కువగా మృతి చెందినట్టు ఆయన చెప్పారు. గత నెల ఓ గూడ్స్ రైలు కూడా ఈ మార్గంలో పట్టాలు తప్పింది. అంతకుముందు కూడా ప్రమాదాలు జరిగారుు. అరుునప్పటికీ ఈ విషయంలో కొంకణ్ రైల్వే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. -
‘ఆశ’ దూరమై...‘లక్ష్మి’ కనబడక..
ఆరేళ్లుగా భార్యకోసం,ఐదునెలలుగా కూతురి కోసం వెదుకులాట.. తిరుపతిలో కర్ణాటకవాసి ఆవేదన సాక్షి, తిరుపతి: తాళికట్టిన భర్తను, పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను కాదనుకుని ఆమె వెళ్లిపోయింది. ఐదు నెలల బిడ్డకోసం భార్య తప్పక తిరిగి వస్తుందని భావించాడు. ఆమె తిరిగి వచ్చేలా చూడమని వేంకటేశ్వరుని వేడుకున్నాడు. ఏడాదిలో కనీసం మూడుసార్లు తిరుమలకు బిడ్డతో పాటు వచ్చి వెంకన్నకు తనగోడు మొరపెట్టుకునేవాడు. భార్యను ఎలాగైనా రప్పించమని, తన బిడ్డకు తల్లి దగ్గరుండేలా చూడమని వేడుకునేవాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. ఆరేళ్లు గడిచాయి. భార్య ఆచూకీ దొరకకపోగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఆరేళ్ల కూతు రు తిరుపతిలో తప్పిపోయింది. ఇప్పుడు ఆ బిడ్డకోసం ఐదునెలలుగా తిరుపతిలో వెదుకులాడుతూనే ఉన్నాడు. బస్టాండ్, రైల్వేస్టేషన్ ఇతర రద్దీ కూడళ్లలో ఉన్నవారికి తన కూతురి ఫొటో చూపించి ఆచూకీ తెలి సిందా అని అడుగుతున్నాడు. భార్యపోయిన బాధకు, కూతురు కనిపిం చని దుఃఖం తోడుకావడంతో తల్లడిల్లిపోతున్నాడు. వివరాలిలా.. కర్ణాటక రాష్ట్రం చిక్బళ్లాపూర్లోని బాపూజీనగర్కు చెందిన పీ. వెంకటేష్ ఫ్లవర్ డెకరేటర్గా పనిచేసేవాడు. ఇతనికి ఏడేళ్ల కిందట సమీప బంధువుల అమ్మాయి ఆశతో వివాహం జరిగింది. వివాహమైన ఏడాదికి వారికి ఓ పాప పుట్టింది. ఆ పాపకు వరలక్ష్మి అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకోవడం మొదలుపెట్టారు. పాపకు ఐదు నెలల వయసు ఉన్నప్పుడు ఆశ ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచీ వెంకటేష్ కూతురికి తల్లిలేని లోటు లేకుండా చూసుకుంటూనే, భార్యకోసం వెతుకులాడ్డం మొదలు పెట్టాడు. ఇతనికి వెంకటేశ్వరస్వామి అంటే అమితమైన భక్తి. వెంకటేష్ తరచూ తిరుమలకు వచ్చి స్వామిరిని దర్శించుకునేవాడు. బిడ్డకు తల్లిని దగ్గర చేయమని స్వామిని వేడుకునే వాడు. ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబర్ చివరి వారంలో ఆరేళ్ల కూతురు వరలక్ష్మిని తీసుకుని తిరుమల వచ్చాడు. నాలుగు రోజులు తిరుమలలోనే ఉండి స్వామని దర్శించుకున్నాడు. అక్టోబర్ ఒకటో తేదీన చిక్బళ్లాపూర్ తిరుగు ప్రయాణమయ్యాడు. తిరుపతి రైల్వేస్టేషన్కు చేరుకుని మైసూరు ప్యాసింజర్ రైలుకు టిక్కెట్ తీసుకున్నాడు. రైలు వచ్చేందుకు మూడు గంటల సమయం ఉండటంతో బిడ్డకు ఇడ్లీ తినిపించి, తానూ తిన్నాడు. ఇద్దరూ స్టేషన్ ఆవరణలో నిద్రపోయారు. కాసేపటి తర్వాత ఊడ్చేందుకోసం స్వీపర్ వెంకటేష్ను నిద్ర లేపాడు. లేచి చూడగా పక్కన బిడ్డ లేదు. ఆందోళనకు గురైన వెంకటేష్ రైల్వేస్టేషన్తో పాటు చుట్టుపక్కలా గాలించాడు. బిడ్డ ఆచూకీ లభించలేదు. ఈ మేరకు తిరుపతి రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి బిడ్డకోసం కోసం తిరుపతిలో వెదుకులాడుతూనే ఉన్నాడు. తన కూతురి ఫొటో చూపించి వచ్చీరాని తెలుగులో ‘మా వరలక్ష్మి ఎక్కడైనా కనిపించిందా?’ అని అడుగుతున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ బిడ్డ కనిపిస్తుందన్న ఆశతో వెంకటేష్ తిరుపతి నగరంలోనే ఉంటున్నాడు. చేతిలో డబ్బు లేక నానా అవస్థలు పడుతున్నాడు. తిరుచానూరు దేవాలయంలో అన్నదానంలో భో జనం చేయడం అదీ లేదంటే నగరంలోని దేవాలయాల్లో ప్రసాదాలతో కడుపు నింపుకుంటున్నాడు. మిగిలిన సమయాల్లో బిడ్డను వెతుక్కుం టూ తిరుగుతున్నాడు. రాత్రివేళ ప్లాట్ఫాంపై నిద్రిస్తున్నాడు. ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య ‘ఆశ’కోసం వచ్చి, బిడ్డ వరలక్ష్మిని పోగొట్టుకున్న వెంకటేష్ ఆవేదన అంతా ఇంతా కాదు. వెంకటేశ్వర స్వామి ఏ రోజుకైనా భార్యబిడ్డను తన దగ్గరకు చేరుస్తాడనే నమ్మకంతో ఉన్నాడు. -
పట్టాలపై ఆగిన కారును ఢీకొన్న రైలు
ఇద్దరు మహిళలు, చిన్నారి మృతి కలికిరి/వాల్మీకిపురం: పట్టాలపై ఆగిపోయిన కా రును రైలు ఢీకొన్న ప్రమాదంలో శనివారం ముగ్గురు దుర్మరణం చెందారు. చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం రామాపురానికి చెందిన షేక్ టిప్పుసుల్తాన్ కుటుంబ సభ్యులతో కలసి కారులో కలికిరి మండలం అచ్చిపిరెడ్డివారిపల్లెకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఇట్లంవారిపల్లె దాటిన తర్వాత గేటులేని రైల్వే క్రాసు వద్ద పట్టాలపై కారు ఆగిపోయింది. అందులో చిన్నారులతో కలిపి పదిమంది ఉన్నారు. ఆదే సమయంలో తిరుపతి నుంచి గుంతకల్లు వెళ్తున్న ప్యాసింజర్ రైలు వేగంగా వస్తోంది. దీంతో అప్రమత్తమై కారులో ఉన్న పిల్లలను బయటకు విసిరేశారు. మిగిలిన వారిని తప్పించేలోపే రైలు కారును ఢీకొంది. సల్మా(30), ముంతాజ్(25), రాఫియా(2) మృతి చెందారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. టిప్పుసుల్తాన్ కారులోనే ఇరుక్కుపోగా ఆయనను బయటకు తీసేందుకు రెండు గంటలకు పైగా శ్రమించాల్సి వచ్చింది.