గుంటూరు: రెంటచింతల మండలంలోని పాలువాయి గేటు గ్రామం వద్ద శనివారం రైలు కింద పడి ఒక వృద్ధురాలు మృతి చెందింది. వివరాలు...పాలువాయి గేటు గ్రామంలో కొంతకాలంగా భిక్షాటనం చేసుకుంటూ జీవిస్తున్న అంకమ్మ(70) బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా గుంటూరు నుంచి మాచర్ల వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలు కిందపడి మృతిచెందింది. ఈమెకు కుటుంబసభ్యులు,బంధువులు ఎవరూ లేరని గ్రామస్తులు తెలిపారు.
(రెంటచింతల)
రైలు కింద పడి వృద్ధురాలు మృతి
Published Sat, Feb 28 2015 2:46 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement