ఒడిశా: ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాలో మావోయిస్టులు మరో ఘాతుకానికి ఒడిగట్టారు. బుధవారం అర్ధరాత్రి కన్నగూడలో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు హత్య చేశారు. సదరు గిరిజన యువకులు పోలీసులకు మావోయిస్టుల సమాచారం అందజేస్తున్నట్లుగా భావించారు. ఆ క్రమంలో వారని అదుపులోకి తీసుకున్ని ప్రశ్నించారు. తమకు ఏమీ తెలియదని వారు మావోయిస్టులకు చెప్పారు. కానీ మావోయిస్టులు గత అర్థరాత్రి వారిద్దరిని నరికి చంపారు.