![కరాచీ సదస్సుకు ఐజేయూ ప్రతినిధులు](/styles/webp/s3/article_images/2017/09/3/41430337779_625x300.jpg.webp?itok=1o-9G5uW)
కరాచీ సదస్సుకు ఐజేయూ ప్రతినిధులు
హైదరాబాద్: ‘వన్ వరల్డ్-వన్ మీడియా’ అనే అంశంపై పాకిస్తాన్లోని కరాచీలో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ప్రతినిధులు హాజరుకానున్నారు. అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాలంటూ పాకిస్తాన్ ఫెడరల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (పీఎఫ్యూజే) నుంచి ఐజేయూకు ఆహ్వానం అందింది.
దీంతో ఈ సదస్సుకు ఐజేయూ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్, కోశాధికారి షబీనా ఇందర్జీత్లను పంపాలని నిర్ణయించినట్లు యూనియన్ నాయకుడు కె. అమర్నాథ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే నెల 1 నుంచి 4 వరకు జరిగే ఈ సదస్సుకు ఆసియా, ఆఫ్రికా, యూరోప్, అమెరికాతో పాటు దాదాపు 15 దేశాలకు చెందిన జర్నలిస్టు ప్రతినిధులు, వివిధ యూనియన్ల నేతలు పాల్గొంటారు.