లదాఖ్‌లో భారత్, చైనా బాహాబాహీ | Indian, Chinese soldiers get into scuffle in Ladakh | Sakshi

లదాఖ్‌లో భారత్, చైనా బాహాబాహీ

Sep 13 2019 4:59 AM | Updated on Sep 13 2019 4:59 AM

Indian, Chinese soldiers get into scuffle in Ladakh - Sakshi

ఫైల్‌ ఫొటో

న్యూఢిల్లీ: లదాఖ్‌లో వాస్తవ నియంత్రణ రేఖ వద్ద భారత్, చైనా బలగాల మధ్య బుధవారం ఉద్రిక్తత తలెత్తింది.  అయితే, చర్చల అనంతరం సాయంత్రానికి ఉద్రిక్తత సమసింది. పాంగోంగ్‌ త్సో సరస్సు ఒడ్డున బుధవారం ఉదయం భారత్‌ బలగాలు పహారా కాస్తుండగా చైనా సైనికులు అభ్యంతరం తెలిపారు. తర్వాత, చైనా బలగాలు పోట్లాటకు దిగాయి. దీంతో రెండు వైపులా పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతంలో బలగాలను మోహరించాయి. దీంతో రెండు దేశాల సైనిక ప్రతినిధులు చర్చించి ఓ అంగీకారానికి వచ్చారు. సాయంత్రానికి ఎవరికి వారు     బలగాలను ఉపసంహరించుకోవడంతో    ఉద్రిక్తత సడలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement