India-China
-
ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన చైనా.. భారత్ వైపు చూపు
బీజింగ్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దిగుమతి సుంకాలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ప్రధానంగా కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం చొప్పున, చైనా ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించబోతున్నామని, మంగళవారం నుంచే ఇది అమల్లోకి వస్తుందని ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే దేశాలు సుంకాలు చెల్లించాల్సిందేనని తెలిపారు.దీనికి చైనా కూడా అంతే ఘాటుగా స్పందించింది. తమ దేశంలోకి దిగుమతి అయ్యే అమెరికా వస్తువులపై అదనంగా 15 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. చికెన్, గోధుమలు, మొక్కజొన్న, పత్తి తదితర దిగుమతులపై ఈ టారిఫ్ వసూలు చేస్తామని, అలాగే జొన్న, సోయాబిన్, పోర్క్, బీఫ్, సముద్ర ఉత్పత్తులు, పండ్లు, కూరగాయాలు, పాడి ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించనున్నట్లు వెల్లడించింది.అయితే చైనా ప్రస్తుత చూపులు భారత్ వైపు పడ్డాయి. భారత్ తో గతంలో ఉన్న విరోధాన్ని పూర్తిగా పక్కన పెట్టేందుకు సిద్ధమైంది చైనా. భారత్ తో శత్రుత్వం కంటే మిత్రత్వమే మేలనే భావనకు వచ్చింది చైనా.-భారత్ తో కలిసి పని చేయాలని చూస్తోంది., ఈ మేరకు ఇప్పటికి ఓ మెట్టు దిగి భారత్ సహకారం కావాలంటోంది డ్రాగన్.ఇద్దరం కలిసి పని చేద్దాం: చైనా విదేశాంగ మంత్రిభారత్ తో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి స్పష్టం చేశారు. ఒకరిని ఒకరు కించ పరుచుకోవడం కంటే కలిసి పని చేస్తే అద్భుతాలు స్పష్టించవచ్చాన్నారు వాంగ్ యి. ఆ దేశ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మీట్ తర్వాత వాంగ్ యి మాట్లాడుతూ.. ‘ ఢిల్లీ, బీజింగ్ కలిసే పని చేసే సమయం ఆసన్నమైంది. డ్రాగన్, ఎలిఫెంట్ డ్యాన్స్ కలిసి చేస్తే బాగుంటుంది. ఇరుదేశాలు ఒకరికొకరు సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. సహకారంతో పోయేదేమీ ఉండదు. సహకారం ఇచ్చి పుచ్చుకుంటే మరింత బలోపేతం అవుతాం. ఇది దేశ ప్రజలకు, దేశాలకు మంచిది’ అని పేర్కొన్నారు.ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ తో వాంగ్ యి భేటీ అయ్యారు. అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2020లో గల్వాన్ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పట్నుంచి నిన్న మొన్నటి వరకూ ఇరు దేశాలు పెద్దగా సమావేశం అయ్యింది కూడా తక్కువే. ఆపై 2024లో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీ తరువాత .ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కాస్త చల్లబడింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్న చోట నుంచి ఇరు దేశాలు తమ బలగాలను వెనక్కి పిలపించడంతో అప్పట్నుంచీ సామరస్య వాతావరణం కనిపిస్తోంది. -
ఆ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం: జైరాం రమేష్
న్యూఢిల్లీ: భారత్ కు చైనా శత్రువు కాదంటూ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా(sam pitroda) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తమకేమీ సంబంధం లేదని అంటోంది ఈ వ్యవహారంపై జాతీయ కాంగ్రెస్ పార్టీ. దీనిపై కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్చార్జి జై రాం రమేష్(Jairam Ramesh స్పందించారు. అది శామ్ పిట్రోడో వ్యక్తిగత అభిప్రాయమని, దానితో పార్టీకి సంబంధం లేదన్నారు. శామ్ పిట్రోడో చేసిన వ్యాఖ్యలు పార్టీపై ఎటువంటి ప్రభావం చూపదని జై రాం రమేష్ క్లారిటీ ఇచ్చారు.చైనా(China)పై శామ్ పిట్రోడా వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఖచ్చితంగా భారత జాతీయ కాంగ్రెస్ అభిప్రాయాలు కావన్నారు. చైనా అతిపెద్ద విదేశాంగ, భద్రత విధానంతో పాటు మనకు ఆర్థిక సవాలుగా మిగిలిపోయింది అని జైరాం రమేష్ పేర్కొన్నారు. దీనికి తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్లో పోస్ట్ పెట్టారు జై రాం రమేష్కాగా, పొరుగు దేశం చైనాను శత్రువులా చూడొద్దని సంచలన వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడో.. లేదంటే చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించని విధంగా ఉంటుందని హెచ్చరించారు.భారత్ తన వైఖరి మార్చుకొని చైనాను శత్రువులా చూడటం మానుకోవాలని సూచించారు. తొలినుంచి చైనాతో భారత్ అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరి ఇరుదేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచుతోందని శామ్ పిట్రోడా తాజాగా ఓ వార్తాసంస్థకు ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. చైనా నుంచి భారత్కు ఏం ముప్పుందో తనకు అర్థం కావడం లేదన్నారు.చైనా పట్ల మన దేశ వైఖరి మొదటిరోజు నుంచి ఘర్షణాత్మకంగానే ఉందన్నారు. ఇప్పటికైనా భారత్ వైఖరిని మార్చుకోవాలని సూచించారు.ఇది కేవలం చైనా విషయంలోనే కాదని, ఇతర దేశాలకు కూడా వర్తిస్తుందని చెప్పారు. అమెరికా కూడా చైనాను శత్రువులా చూస్తూ భారత్కు కూడా అదే అలవాటు చేస్తోందని విమర్శించారు.గతంలో కూడా పలు అంశాలపై పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తాను ఇరకాటంలో పడి కాంగ్రెస్ పార్టీని కూడా ఇరకాటంలో పడేశారు. కాగా, భారత్,చైనా సంబంధాలు అంతంత మాత్రమే ఉన్న వేళ పిట్రోడా చైనాను ఎక్కువ చేసి చూపిస్తూ మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నేతలు పిట్రోడాపై ఫైర్ అవుతున్నారు. దాంతో కాంగ్రెస్ దిగివచ్చింది. తమ పార్టీకి శామ్ పిట్రోడో వ్యాఖ్యలతో ఎటువంటి సంబంధం లేదంటూ జై రాం రమేష్ వ్యాఖ్యానించడం అందుకు ఉదాహరణ. -
45 ఏళ్ల తర్వాత మరణాలు.. చైనాపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: భారత్-చైనా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు విదేశాంగ మంత్రి జైశంకర్. గత కొద్ది నెలలుగా రెండు దేశాల మధ్య నిరంతర దౌత్య చర్చల ఫలితంగా సంబంధాలు మెరుగైనట్టు ఆయన తెలిపారు. భారత సరిహద్దుల విషయంలో కూడా కీలక పురోగతి నెలకొందని చెప్పుకొచ్చారు.ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సమావేశాల్లో భాగంగా విదేశాంగ మంత్రి జైశంకర్..‘భారత్-చైనా సంబంధాల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా జైశంకర్ పార్లమెంట్లో మాట్లాడుతూ..‘చైనా చర్యల కారణంగా 2020లో సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతకు భంగం వాటిల్లింది. అప్పటినుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, నిరంతర దౌత్య చర్చల ఫలితంగా ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఇటీవల కొంత మెరుగుదల కనిపించిందని తెలిపారు.2020 ఏప్రిల్లో తూర్పు లడఖ్లోని కొన్ని ప్రాంతాలలో రెండు దేశాల సైన్యం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గడిచిన 45 సంవత్సరాల కాలంలో మొదటిసారిగా రెండు వైపులా మరణాలకు ఈ ఘర్షణ దారితీసింది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. సరిహద్దు సమస్యకు న్యాయమైన, సహేతుకమైన.. పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారానికి రావడానికి ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. ఇందుకు కోసం భారతదేశం కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఇటీవలి కాలంలో లడఖ్లోని భారత సరిహద్దుల నుంచి చైనా బలగాలు, భారత సైన్యం వెనక్కి వెళ్లినట్టు ఆయన తెలిపారు. గతంలో 38 వేల చదరపు కిలోమీటర్ల భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించింది. వాస్తవాధీన రేఖకు సంబంధించి కొన్ని ప్రాంతాలలో ఇరుదేశాలకు ఏకాభిప్రాయం లేదు. పరస్పరం అంగీకరించిన యంత్రాంగం ద్వారా శాంతియుతంగా సరిహద్దు సెటిల్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాం. ఇటీవల జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో కూడా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పలు విషయాలపై చర్చించారు’ అని చెప్పుకొచ్చారు. లాజిస్టికల్ సవాళ్లు, కొవిడ్ పరిస్థితులు ఉన్నప్పటికీ.. మన బలగాలు వేగంగా, సమర్థవంతంగా స్పందించి చైనాను కట్టడి చేశాయి. ఇలా తమ సామర్థ్యాలతో ఓ వైపు దీటుగా ప్రతిస్పందిస్తూనే, ఉద్రిక్తతలు తగ్గించడం కోసం పొరుగు దేశంతో దౌత్యపరమైన చర్చలకు ప్రయత్నాలు చేశాం. సరిహద్దులో శాంతి, స్థిరత్వం లేకుండా ఇరు దేశాల సంబంధాలు సాధారణంగా ఉండలేవని మన ప్రభుత్వం స్పష్టంగా పేర్కొందన్నారు. వీటికి సంబంధించి భారత్కు స్పష్టమైన వైఖరి ఉందన్నారు. న్యాయమైన, సహేతుక, పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం కోసం చైనాతో చర్చలు జరిపేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు.#WATCH | In the Lok Sabha, EAM Dr S Jaishankar says "I rise to apprise the House of some recent developments in the India-China border areas and their implications for our overall bilateral relations. The House is aware that our ties have been abnormal since 2020 when peace and… pic.twitter.com/gmE3DECobq— ANI (@ANI) December 3, 2024 -
లద్ధాఖ్లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ పూర్తి!
న్యూఢిల్లీ: తూర్పు లద్ధాఖ్లోని దెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. గతవారం భారత్-చైనా దేశాల మధ్య జరిగిన కీల ఒప్పందంలో భాగంగా.. కీలక ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైనికులు తమ మౌలిక సదుపాయాలను, ఇతర సామగ్రిని వెనక్కి తీసుకున్నట్లు తాజాగా ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. భారత్, చైనా సైన్యాలు ఒకరి స్థావరాలను మరొకరు పరస్పరం తనిఖీ చేసుకుంటున్నాయని పేర్కొంది.కాగా తూర్పు లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట పెట్రోలింగ్, దళాలుప సంహరణకు ఇటీవల భారత్, చైనా మధ్య ఇటీవల గస్తీ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. దీని ప్రకారం 2020 నాటి యథాస్థితి ఎల్ఏసీ వెంబడి ఇక కొనసాగనుంది. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చు. ఈ క్రమంలో మూడురోజుల కిందట ఎల్ఏసీ వెంట బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలయ్యింది. అక్టోబర్ 29 లోగా బలగాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించాయి.2020 జూన్ 15న తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది. ఘర్షణల నేపథ్యంలో ఇరు దేశాలు ఎల్ఏసీ వెంబడి భారీ స్థాయిలో బలగాలను మోహరించాయి. అప్పటినుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
భారత్-చైనా సరిహద్దు వివాదం.. స్పందించిన రష్యా
మాస్కో: వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంట సైనికులను ఉపసంహరణపై భారత్, చైనాల మధ్య జరిగిన అవగాహనను రష్యా స్వాగతించింది. సరిహద్దు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఇరు దేశాల నుంచి సంకల్పం, విశ్వాసం అవసరమని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ సోమవారం అన్నారు.‘‘ ఐదేళ్ల విరామం తర్వాత కజాన్లో చైనా, భారత్ల నేతల మధ్య తొలి సమావేశం జరగడాన్ని మేం (రష్యా) స్వాగతిస్తున్నాం. ఆనందం వ్యక్తం చేస్తున్నాం. భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో ఇది.. చాలా సానుకూల పరిణామం. భారత్-చైనా సరిహద్దు వివాదం చాలా సంక్లిష్టమైన సమస్య.దీనికి సుదీర్ఘమైన చర్చల ప్రక్రియ అవసరం. భారత్, చైనా తమ మధ్య ఉన్న సరిహద్దు సమస్యలపై చివరికి విజయం సాధిస్తాయనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు.దానికి సంకల్పం, సహృదయం, నమ్మకం అవసరం. సామరస్యానికి ఇవి చాలా అవసరం’’ అని అలిపోవ్ తెలిపారు.అక్టోబరు 23న రష్యాలోని కజాన్ నగరంలో జరిగే బ్రిక్స్ సమ్మిట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ల భేటీకి రెండు రోజుల ముందే ఎల్ఏసీ వెంట పెట్రోలింగ్ ఏర్పాట్లపై చైనాతో భారత్ ఒప్పందాన్ని ప్రకటించింది. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడం ద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సాధారణ స్థితికి వచ్చాయి. చదవండి: 2100 నాటికి ఉష్ణోగ్రతలో... 3.1 డిగ్రీల పెరుగుదల! -
Rahul Gandhi: చైనాను అడ్డుకోలేకపోయారు
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో పలు అంశాలపై పదునైన వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చైనా అంశాన్ని ప్రస్తావించారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక నేషనల్ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆయన పత్రికాసమావేశంలో మాట్లాడారు. ‘‘ 4,000 చదరపు కి.మీ.ల భారత భూభాగంలో చైనా బలగాలు తిష్టవేసిన ఉదంతంలో మోదీ సమర్థవంతంగా వ్యవహరించారా అంటే కాదు అనే చెప్తా. లద్దాఖ్లో ఢిల్లీ అంత పరిమాణంలో భూభాగాన్ని చైనా బలగాలు ఆక్రమించాయి. ఇది తీవ్ర వైఫల్యం. ఒక వేళ అమెరికాకు చెందిన 4వేల చదరపు కి.మీ.ల భూభాగాన్ని పొరుగుదేశం ఆక్రమిస్తే అమెరికా ఊరుకుంటుందా? ఎలా స్పందిస్తుంది?. ఈ విషయాన్ని అద్భుతంగా చక్కదిద్దానని అమెరికా అధ్యక్షుడు చేతులు దులిపేసుకుంటాడా?. అందుకే ఈ కోణంలో చూస్తే మోదీ చైనా విషయంలో విఫలమయ్యారు’’అని అన్నారు. ‘‘ అమెరికా– భారత్ సంబంధాల విషయంలో మోదీని సమరి్థస్తా. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో అనుసరించిన విధానాలనే ఇప్పుడు మోదీ కొనసాగిస్తున్నారు. అయితే భారత అంతర్గత అంశాల్లో అమెరికా ప్రమేయాన్ని నేను ఏమాత్రం ఒప్పుకోను. భారత్లో ప్రజాస్వామ్యం మెరుగు కోసం దేశీయంగా జరుగుతున్న పోరు ఇండియా సొంత విషయం. దీనిని మేమే పరిష్కరించుకుంటాం’’ అని రాహుల్ అన్నారు. నిరాధార ఆరోపణలు: రాజ్నాథ్ భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న రాహుల్ వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ స్పందించారు. ‘‘ లోక్సభలో విపక్షనేత హోదాలో ఉన్న వ్యక్తి ఇలా తప్పుడు, నిరాధార, అబద్దపు వ్యాఖ్యానాలు చేయడం నిజంగా సిగ్గుచేటు. అసంబద్ధంగా మాట్లాడి విదేశీ గడ్డపై భారత పరువు తీస్తున్నారు. గురుద్వారాకు వెళ్లే సిక్కులు తలపాగా ధరించడానికి కూడా పోరాడాల్సి వస్తోందని రాహుల్ సత్యదూరమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రేమ దుకాణాలు తెరిచానని చెప్పుకుని తిరిగే రాహుల్ .. అబద్ధాల దుకాణాలు నడుపుతున్నారు’’ అనిరాజ్నాథ్ అన్నారు. -
భారత్లోకి చైనా చొచ్చుకొస్తుంటే.. మోదీ నిద్రపోతున్నారు: ఖర్గే
న్యూఢిల్లీ: భారత సరిహద్దు విషయంలో చైనాతో వివాదం కొనసాగుతున్న వేళ ఏఐసీసీ చైర్మన్ మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారత భూభాగంలోకి డ్రాగన్ దేశం(చైనా) చొచ్చుకువస్తుంటే ప్రధాని మోదీ నిద్రపోతున్నారని విమర్శించారు. అయితే వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న అరుణాచల్ ప్రదేశ్లోని 30 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టిన విషయం తెలిసిందే. అక్కడి ప్రాంతాలకు డ్రాగన్ ఇలా పేర్లు పెట్టడం ఇది నాలుగోసారి. ఈ క్రమంలోనే మోదీపై ఖర్గే విమర్శలు గుప్పించారు. రాజస్థాన్లోని చిత్తోర్గఢ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్లాగొన్న ఖర్గే.. మోదీని అబద్దాల సర్దార్గా విమర్శించారు. ప్రధాని దృష్టి అంతా సంక్షేమంపై కాకుండా గాంధీ కుటుంభాన్ని దూషించడంపేనే ఉందని దుయ్యబట్టారు. మోదీ దేశం కోసం ఆలోచించడం పక్కకు పెట్టి గాంధీ కుటుంబంపై దుర్భాషలాడటం పనిగా పెట్టుకున్నాడని మండిపడ్డారు. 'నాకు 56 అంగుళాల ఛాతీ ఉంది, నేను భయపడను' అని మోదీ అంటున్నారు. మీకు భయం లేకుంటే మన ప్రాంతంలోని భూభాగాన్నంతా చైనాకు ఎందుకు విడిచిపెట్టారు? వారు భారత్లోకి చొచ్చుకువస్తున్నారు. మీరేమో నిద్రపోతున్నారు. నిద్రమాత్రలు వేసుకున్నారా? దేశ ప్రజలను చిత్రహింసలకు గురిచేసి తన వెంట తీసుకెళ్లాలని అనుకొంటున్నారన్నారు. 1989 నుంచి గాంధీ కుటుంబంల ఎవరూ ప్రధానమంత్రి, మంత్రి పదవిని చేపట్టలేదని, అయినప్పటికీ ప్రధానమంత్రి వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. గాంధీ కుటుంబ సభ్యులు ఈ దేశం కోసం తమ ప్రాణాలనే త్యాగం చేశారన్నారు. ప్రధాని మోదీ విదేశాల్లో పర్యటిస్తారు. ఎన్నికల సమయంలో దేశమంతా తిరుగుతారు గానీ, అల్లర్లతో అట్టుడికిన మణిపుర్కు మాత్రం ఇంతవరకు వెళ్లలేదు’ అని మండిపడ్డారు. కాగా అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని చాలా ఏళ్లుగా చైనా వాదిస్తున్న సంగతి తెలిసిందే. చైనా తీరును గతంలోనే భారత్ పలుమార్లు ఖండించింది. అయినప్పటికీ అరుణాచల్ ప్రదేశ్కు చైనీస్ పేరు, ఈ ప్రాంతం దక్షిణ టిబెట్లో భాగమని బీజింగ్ తెలిపింది. వీటిల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం, కొంత భూభాగం ఉంది. అయితే పేర్లు మార్చినంత మాత్రాన ఆ ప్రాంతాలు భారత్లో భాగం కాకుండా పోవని, నిజాన్ని మార్చలేరని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ తమ దేశ అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. -
సవాల్ విసిరితే.. దేనికైనా సిద్ధమే: రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: భారత్- చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో డ్రాగన్ కంట్రీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ . భారత్ ఇప్పటి వరకు ఏ దేశంపై దాడి చేయలేదని తెలిపిన కేంద్ర మంత్రి.. ఏ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోలేదని పేర్కొన్నారు. అదే ఒకవేళ ఏ దేశమైన భారత్కు సవాల్ విసిరితే.. తాము ధీటైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చైనా సరిహద్దులో కొంతకాలంగా ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రక్షణమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ మేరకు ఓ జాతీయ మీడియా నిర్వహించిన ‘ఢిఫెన్స్ సమ్మిట్’లో గురువారం రాజ్నాథ్ సింగ్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్ల కాలంలో భారత రక్షణ రంగంలో చోటుచేసుకున్న మార్పులను, అభివృద్ధి వంటి అంశాలపై సైతం చర్చించారు. భూమి, గగనతలం, సముద్రం నుంచి ఎవరైనా భారత్పై దాడికి దిగితే తమ బలగాలు ధీటుగా బదులిస్తాయని హెచ్చరించారు. తాము ఏ దేశంపైనా దాడి చేయలేదని.. ఎవరి భూభాగాన్ని అంగుళం కూడా ఆక్రమించలేదన్నారు. కానీ, ఎవరైనా తమపై కన్నెత్తి చూస్తే, తప్పించుకునే పరిస్థితి లేదన్నారు. భారత్పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తే తగిన సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉన్నామని చెప్పారు. 2014లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, రక్షణ రంగానికి తాము ప్రాధాన్యత పెంచామని కేంద్రమంత్రి తెలిపారు. ముఖ్యంగా రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను (స్వయంశక్తి) ప్రోత్సహించామని, స్వదేశీ ఉత్పత్తితోపాటు రక్షణ పరికారల ఎగుమతి, సైనిక ఆధునికీకరణపై దృష్టి సారించామని చెప్పారు.దీని వల్ల భారతదేశ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమైందని పేర్కొన్నారు. చదవండి: విమానంలో సీట్ కుషనింగ్ మాయం! - ఏం జరిగిందంటే.. -
తూర్పు లద్దాఖ్పై భారత్, చైనా సైనిక చర్చలు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లో మూడున్నరేళ్ల క్రితం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను సడలించేందుకు భారత్, చైనా 21వ విడత సైనిక చర్చలు జరిపాయి. చర్చల్లో ఎలాంటి కీలకమైన ఉమ్మడి నిర్ణయాలు తీసుకోలేకపోయారు. వాస్తవా«దీన రేఖ వెంబడి ఛుషుల్–మోల్డో బోర్డర్ పాయింట్ వద్ద చైనా వైపు భూభాగంలో ఫిబ్రవరి 19వ తేదీన ఈ చర్చలు జరిగాయి. భారత్ తరఫున లేహ్ కేంద్రంగా ఉన్న 14వ కోర్ లెఫ్టినెంట్ జనరల్ రషీమ్ బాలీ, చైనా తరఫున దక్షిణ గ్జిన్జియాంగ్ సైనిక జిల్లా కమాండర్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. కోర్ కమాండర్ స్థాయిలో జరిగిన ఈ చర్చల్లో ఇరు దేశాల సైనికుల మొహరింపును ఉపసంహరించుకోవడంపై ప్రధానంగా చర్చించారు. ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే సైనిక, దౌత్య కమ్యూనికేషన్లను ఇకమీదటా కొనసాగించాలని నిర్ణయించారు. స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిగాయని భారత విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది. దెస్పాంగ్, దెమ్చోక్ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ అంశమూ చర్చకొచి్చందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్టోబర్లో 20వ విడత చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్లో సరిహద్దు వెంట సున్నితమైన పరిస్థితులు నెలకొన్నాయని జనవరిలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వ్యాఖ్యానించడం తెల్సిందే. 2020 ప్రథమార్ధంలో తూర్పు లద్దాఖ్లో ఉన్న సాధారణ స్థాయికి ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరుదేశాలు ప్రయతి్నస్తున్నాయి. -
సరిహద్దులు సురక్షితం.. కానీ కొంత సున్నితం
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లో వాస్తవాదీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి భారత్–చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ప్రస్తుతం సాధారణంగా, స్థిరంగానే ఉన్నప్పటికీ, కొంత సున్నితమైనవేనని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే చెప్పారు. సరిహద్దుల్లో ఎప్పుడు ఎలాంటి సవాలు ఎదురైనా గట్టిగా తిప్పికొట్టడానికి మన సైనిక దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఉన్నతస్థాయి సన్నద్ధతను పాటిస్తున్నాయని వెల్లడించారు. తగినన్ని సైనిక రిజర్వ్ దళాలు సరిహద్దుల్లో మోహరించాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో భద్రతాపరమైన వైఫల్యాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. సైనిక దినోత్సవం నేపథ్యంలో జనరల్ మనోజ్ పాండే గురువారం మీడియాతో మాట్లాడారు. సరిహద్దు వివాదం సహా ఇతర అంశాలకు పరిష్కారం కనుగొనడానికి భారత్, చైనా మధ్య సైనిక, దౌత్యవర్గాల స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇక భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి చొరబాట్లను కట్టడి చేస్తున్నామని తెలిపారు. జమ్మూకశీ్మర్లో హింసాకాండ తగ్గుముఖం పట్టిందని, రాజౌరీ–పూంచ్ సెక్టార్లో మాత్రం హింసాత్మక సంఘటనలు కొంతమేరకు పెరిగాయని వివరించారు. సరిహద్దుకు అవతలివైపు ఉగ్రవాద సంస్థలు చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నాయని చెప్పారు. జమ్మూకశీ్మర్లో కాల్పుల విరమణ కొనసాగుతోందన్నారు. సరిహద్దు అవతలి వైపు నుంచి భారత్లోకి ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన యాంటీ డ్రోన్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇండియా–మయన్మార్ సరిహద్దులో.. రెండు దేశాల నడుమ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకొనే దిశగా భూటాన్–చైనా మధ్య కొనసాగుతున్న చర్చలపై జనరల్ మనోజ్ పాండే స్పందించారు. ఈ పరిణామాన్ని నిశితంగా గమనిస్తున్నామని చెప్పా రు. భూటాన్తో భారత్కు బలమైన సైనిక సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇక ఇండియా–మయన్మార్ సరిహద్దులో పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని అంగీకరించారు. అక్కడి పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని అన్నారు. -
భారత – చైనా బంధం బలపడేనా?
సరిహద్దు సమస్యను పూర్తి స్థాయి సంబంధాలలో ఒక అంశంగా మాత్రమే ఉంచాలనీ, అది సంబంధాల మొత్తం స్వభావాన్ని నిర్వచించకూడదనీ చైనీయులు పట్టుబట్టడం కొనసాగిస్తున్నారు. సరిహద్దులో పరిస్థితి ‘అసాధారణం’గా ఉందనీ, ఇది ద్వైపాక్షిక సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నదనే భారత వైఖరిని ఇది పరోక్షంగా తిరస్కరించడమే! అయితే గల్వాన్ ఘర్షణలు చైనా ప్రణాళికాబద్ధంగా జరిపినవన్న భారత్ అభిప్రాయం తప్పు అనీ, అది కేవలం ‘అనుకోని ఘటన’ అనీ పీఎల్ఏ అధికారి చెప్పిందే నిజమైతే, మరి యథాతథ స్థితిని ఎందుకు పునరుద్ధరించకూడదు? అయితే ఎల్ఏసీ అమరిక గురించి భారత్కు కచ్చితమైన ఆలోచన ఉంది. ఎల్ఏసీ గురించి సందేహం ఉందని మనం పరోక్షంగా కూడా సూచించకూడదు. వార్షిక వరల్డ్ పీస్ ఫోరమ్లో పాల్గొనడానికి నేను ఈ నెల ప్రారంభంలో బీజింగ్లో ఉన్నాను. ఆ సమావేశంలోనే అదనంగా భారత్–చైనా సరిహద్దు సమస్యపై ఒక ఆంతరంగిక చర్చ జరిగింది. దీనికి పలువురు చైనా విద్వాంసులు హాజరయ్యారు. ప్రస్తుత, మాజీ చైనా అధికారులు కొందరితో సంభాషణకు కూడా వీలు కలిగింది. ఇవి భారత్–చైనా సంబంధాలకు సంబంధించిన అవకాశాల గురించి చైనా అవగాహన విష యంలో ఒక కొత్త గవాక్షాన్ని అందించాయి. సరిహద్దు సమస్యను పూర్తి స్థాయి సంబంధాలలో ఒక అంశంగా మాత్రమే ఉంచాలనీ, అది సంబంధాల మొత్తం స్వభావాన్ని నిర్వచించకూడదనీ చైనీయులు పట్టుబట్టడం కొనసాగిస్తున్నారు. సరిహద్దులో పరిస్థితి ‘అసాధారణం’గా ఉందనీ, ఇది ద్వైపాక్షిక సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నదనే భారత వైఖరిని ఇది పరోక్షంగా తిరస్కరించడమే. చైనీయుల ప్రకారం, సరిహద్దు పరిస్థితి ‘స్థిరీకరించబడింది’. ఘర్షణకు సంబంధించిన కొన్ని అంశాలను పరిష్కరించడంలో పురోగతి సాధించామనీ, అయితే మరికొన్ని మిగిలి ఉన్నా యనీ భారతదేశం గుర్తిస్తోంది. 2020 జూన్లో తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణలకు ముందు ఉన్న యథాతథ స్థితికి తిరిగి రావడానికి చైనా సుముఖంగా ఉన్నట్లు ఎవరూ భావించడం లేదు. భారత–చైనా సరిహద్దు ప్రశ్న (2005) పరిష్కారానికిగానూ రాజకీయ పారామితులు, మార్గదర్శక సూత్రంతో సహా – వాస్తవాధీన రేఖను (ఎల్ఏసీ) స్పష్టం చేయడం కోసం ఉమ్మడి కసరత్తును చేపట్టేందుకు – అనేక శాంతి భద్రతల ఒప్పందాలను ఇరుపక్షాలు అంగీకరించినప్పటికీ, చైనీయులు అలా చేయడానికి నిరాకరించారు. భూభా గాన్ని ‘కొద్దికొద్దిగా కొరుక్కు తింటూ’ చైనాను భారతదేశం దూరంగా నెడుతోందని ఒక ఆరోపణ వచ్చినప్పుడు, భారత్ చేపట్టడానికి సిద్ధంగా ఉన్న ఎల్ఏసీ స్పష్టీకరణ ద్వారా అటువంటి కబళింపును కచ్చి తంగా నిరోధించవచ్చని ఎత్తి చూపడం ద్వారా ఒకరు దీనిని ప్రతిఘటించారు. దీనికి సమాధానం ఏమిటంటే, 2004లో జరిగిన సమా వేశంలో ఈ కసరత్తు ప్రారంభమైనప్పుడు, చైనా ప్రాదేశిక క్లెయిమ్లను బలహీనపర్చగల ‘అతిశయోక్తి’ క్లెయిమ్లను భారతదేశం పశ్చిమ సెక్టార్లో ముందుకు తెచ్చింది. ఎల్ఏసీని సరిగా స్పష్టం చేయకపోవడం వల్ల భారత్ అధీనంలో ఉన్న భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి సందిగ్ధతలను ప్రదర్శించగల వీలు చైనాకు కలుగుతుంది. అయితే ఎల్ఏసీ అమరిక గురించి భారత్కు కచ్చితమైన ఆలోచన ఉంది. కొన్ని అంశాల్లో ఎల్ఏసీకి సంబంధించి ‘భిన్నమైన అవగాహనలు’ ఉన్నాయని మనం చెప్పు కోకూడదు. భారత్ పేర్కొన్నట్లుగా ఎల్ఏసీపై పోటీ పడటంలో చైనా పక్షానికి కొంత సమర్థన ఉందని ఇది పరోక్షంగా అంగీకరిస్తుంది. ఎల్ఏసీ అమరికలో మనం పరిగణించే వాటిపై చైనీస్ పక్షాన్ని పోటీ పడనివ్వండి. ఎల్ఏసీ ఎక్కడ ఉందనే దాని గురించి మనకు సందేహం ఉందని మనం పరోక్షంగా కూడా సూచించకూడదు. మొత్తంమీద, సరిహద్దు వద్ద ప్రతిష్టంభన కొనసాగే అవకాశం ఉంది. అయితే రెండు వైపులా భారీ సైన్యాన్ని మోహరించే అవకాశం లేదు. ఎల్ఏసీ వైపు చైనా నిర్మించిన తాజా శాశ్వత, పాక్షిక–శాశ్వత నిర్మాణాలను కూల్చి వేయడం, తొలగించడం కూడా అసంభవం. భారత్ అలవర్చుకోవా ల్సిన మెరుగైన సామర్థ్యానికి ఇవి సూచికలా పనిచేస్తాయి. భవిష్యత్లో ఏం జరగవచ్చో సూచించే రెండు ఘటనలు కూడా ఉన్నాయి. సరిహద్దు సమస్యపై తరచూ వ్యాఖ్యానించే చైనా మాజీ పీఎల్ఏ అధికారి ఒకరు, గల్వాన్ ఘర్షణలు చైనా బలగాలు ముంద స్తుగా, ప్రణాళికాబద్ధంగా జరిపిన ఆపరేషన్ అని భారత్ భావిస్తున్న అభిప్రాయం తప్పు అనీ, అది కేవలం ‘అనుకోని ఘటన’ అనీ నాతో అన్నారు. నేను ఇంతకు ముందు ఇది వినలేదు. పీఎల్ఏ అధికారి చెప్పిందే నిజమైతే, మరి యథాతథ స్థితిని ఎందుకు పునరుద్ధరించకూడదు? ప్రస్తుతం చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కమిషన్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ ఆఫీస్ డైరెక్టర్గా ఉన్న వాంగ్ యీ(జూలై 25నే తిరిగి విదేశాంగ మంత్రి అయ్యారు) ఇటీవల జకార్తాలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో జరిపిన భేటీలో, ‘నిర్దిష్ట సమస్యలు మొత్తం సంబంధాన్ని నిర్వచించనివ్వకుండా, సరిహద్దు సమస్యకు ఇరు పక్షాలు పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలి’ అన్నారు. ఇది చైనా వైఖరికి పునఃప్రకటన. అయితే, ‘భారత పక్షం చైనాతో సంబంధాలు మెరుగుపర్చుకునేలా, సరిహద్దు సమస్యకు ఇరుపక్షాలకు ఆమోద యోగ్యమైన పరిష్కారాన్ని కనుగొంటుందని ఆశిస్తున్నట్లు’ ఆయన కొనసాగించారు. ఆ ప్రాంతం చైనా సార్వభౌమ భూభాగమనీ, దానిని కాపాడు కుంటామనీ చైనా ప్రకటనలు పేర్కొంటున్నాయి కాబట్టి గల్వాన్ సంఘటన నేపథ్యంలో, ఇది సాపేక్షంగా సామరస్యపూర్వకమైన భాషగా కనిపిస్తోంది. దీంతో సంబంధాలు ‘మెరుగుపర్చుకునే’ అవ కాశం లేకుండా పోయింది. మారిన భాషను మనం అతిగా వ్యాఖ్యా నిస్తున్నామేమో! కాలమే దీన్ని తేల్చి చెబుతుంది. ప్రధాని మోదీ వాషింగ్టన్ లో ఉన్నత స్థాయి అధికారిక పర్యటన విజయవంతంగా ముగించిన తర్వాత వెంటనే బీజింగ్లో నా సంభాషణలు జరిగాయి. భారత్–అమెరికా సంబంధాల్లో పురోగతిపై చైనా ఆందోళన స్పష్టంగా కనిపించింది. చైనాను నిలువరించే అమెరికా వ్యూహంలో భారత్ భాగమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆసియాలో ‘నాటో’ పాత్రకు భారతదేశం మద్దతు ఇస్తుందా అనేది నాకు వారు సంధించిన ఒక ప్రశ్న. నా అభిప్రాయం ప్రకారం, నాటో అనేది యూరోపియన్ భద్రతకు సంబంధించినదనీ, ఆసియాన్ నేతృత్వంలోని యంత్రాంగాలతో సహా ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి ఆసియా అనేక యంత్రాంగాలను కలిగి ఉందనీ నేను చెప్పాను. గ్లోబల్ సౌత్ నుండి చైనాను మినహాయించాలని భారతదేశం ప్రయత్నిస్తున్నదా అనే ఆందోళన కూడా వారిలో ఉంది. తాము గ్లోబల్ సౌత్లో భాగమా, కాదా అనేది నిర్ణయించుకోవాల్సింది చైనాయేనని నేను చెప్పాను. త్వరలో జరగనున్న జీ20 సదస్సు సన్నాహాల్లో భాగంగా, గ్లోబల్ సౌత్ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు మోదీ చొరవ తీసుకోవడం చైనాను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆర్థికపరమైన చిక్కులను కలిగించవచ్చు కాబట్టి, చైనాకు ‘అభివృద్ధి చెందుతున్న దేశం’ హోదాను నిరాకరించే అమెరికా ప్రయత్నాల గురించి వారు ప్రస్తావించారు. చైనా చేసిన మరొక ఫిర్యాదు ఏమిటంటే, ‘షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్’ (ఎస్సీఓ) సమావేశాన్ని భారత్ వ్యక్తిగత స్థాయిలో కాకుండా, క్లుప్తంగా ఆన్ లైన్ సదస్సును నిర్వహించడం ద్వారా దాని ‘స్థాయిని తగ్గించింది’ అని. ఇది అమెరికా ప్రభావంతో జరిగిందనే అనుమానం చైనాకు ఉంది. మొత్తంమీద, చైనా తన గురించి తాను అస్పష్టంగానే ఉందనే భావన కలుగుతుంది. అదే సమయంలో భారత్ తన ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రావీణ్యతనూ, చురుకుదనాన్నీ ప్రదర్శించిందనే అభిప్రాయం ఉంది. పెట్టుబడి, సాంకేతికత ప్రవాహానికి భారతదేశం కొత్త గమ్యస్థానంగా మారినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో, ఇది చైనా ఆర్థిక అవకాశాల గురించి గుర్తించిన ఒక నిర్దిష్ట నిరాశా వాదానికి సంబంధించినది కావచ్చు. ఇది భారతదేశం పట్ల చైనా వైఖరిలో మార్పును సూచిస్తుందా? ఇకపై సంఘటనలు ఎలా వెల్లడవుతాయో చూద్దాం. శ్యామ్ శరణ్ వ్యాసకర్త విదేశాంగ మాజీ కార్యదర్శి,ఆనరరీ ఫెలో, సీపీఆర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
చైనాను నమ్మలేం... అప్రమత్తతే రక్ష!
2020 జూన్ 15, 16 తేదీలలో జరిగిన గాల్వాన్ ఘర్షణ 21వ శతాబ్దంలో భారత్–చైనా సంబంధాలలో మూలమలుపు లాంటిది. ఈ ఘటనతో భారత్ చేదు పాఠం నేర్చుకుంది. ఈ సున్నితమైన సరిహద్దు పోస్ట్లలో పెట్రోలింగ్కు ఎక్కువ మంది సిబ్బందిని నియమించింది. ఇప్పుడు సరిహద్దులో ఐదు పాయింట్ల వద్ద ఇరు సైనికుల ఉనికి లేదు. ఈ ప్రదేశాలలో సైనికరహిత బఫర్ జోన్లను ఏర్పాటు చేశారు. కానీ ఈ బఫర్ జోన్లు సరికొత్త వివాదానికి తెర తీశాయి. ఇలా బఫర్ జోన్లకు అంగీకరించడమంటే భారత్ తన భూభాగాన్ని కోల్పోవడమే తప్ప మరొకటి కాదని భారత వ్యూహాత్మక సంస్థ పేర్కొనడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో రెండు దేశాలూ సరిహద్దుల సమీపంలో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చుకోవటం ఆందోళనకరం. భారతదేశం, అమెరికా, చైనా అంతర్జాతీయ యవనికపై మూడు ముఖ్యమైన పాత్ర ధారులు. వీటి ఆసక్తులు పరస్పరం లోతుగా పొందుపర్చుకుని ఉన్నాయి. ఈ వాస్తవం క్రమానుగత వ్యవధిలో ఇతరులతో పోలిస్తే వారి ఎంపికలను తూకం వేసి చూసుకునేలా వారిని బలవంతం చేస్తోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా ఎదుగుదలకు చెక్ పెట్టేందుకు అమెరికా ఆసక్తితో ఉంది. కాగా, భారతదేశం చైనాతో 4000 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును, దాంతోపాటు 61 ఏళ్ల సరిహద్దు వివాదాన్ని పంచుకుంటోంది. ఇక చైనా విషయానికి వస్తే 2049 నాటికి నంబర్ వన్ అగ్రరాజ్యం కావాలని కోరుకుంటోంది. అది జననేత మావో సేటుంగ్ నేతృత్వంలో చైనాలో కమ్యూనిస్టు విప్లవం విజయం పొందిన శతాబ్ది సంవత్సరం మరి. ఆసియాలో చైనాకు ప్రత్యక్ష పొరుగు దేశమైన భారతదేశం, చైనా ప్రాదేశిక ఆకాంక్షల గురించి ఎల్లప్పుడూ ఆందోళన చెందుతూ ఉంది. ఇన్ని దశల చర్చలు జరిగినా నేటికీ భారత్–చైనా సరిహద్దు వివాదం పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. మూడేళ్ల క్రితం గాల్వాన్ ప్రాంతంలో చైనాతో భారత్కు తీవ్ర వైరం ఏర్పడింది. ఇటీవల 2023 జూన్లో గాల్వాన్ ప్రతిష్టంభన మూడవ వార్షికోత్సవం సందర్భంగా, చాలామంది పండితులు, మాజీ దౌత్యవేత్తలు... దురాశాపూరిత చైనా పట్ల ఎప్పటికీ అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 1950ల నాటి నుండి భారత్ – చైనా సరిహద్దు వివాదం ప్రజర్విల్లుతోంది. ‘హిందీ–చినీ భాయ్ భాయ్’ అని భారత ప్రజలు నినదిస్తున్న వేళ, భారత భూభాగాల్లోకి చైనా సైనికులు కవాతు చేస్తున్నప్పుడు మనదేశం అకస్మాత్తుగా మేల్కొంది. భారత సైన్యం చవిచూసిన ఘోర పరాభవం ఇది. అప్పటి నుండి సరిహద్దు వివా దాన్ని పరిష్కరించడానికి లెక్కలేనన్ని ప్రయత్నాలు, చర్చలు జరి గాయి. కానీ ఫలించలేదు. ఇక 2020 జూన్ దగ్గరకు వద్దాం. వాస్తవ నియంత్రణ రేఖ వద్ద ఉన్న గాల్వాన్ లోయలో చైనా సైన్యం చేతిలో 20 మంది భారతీయ సైనికులు మరణించారు. చైనా సేనలను తమ ట్రాక్లో నిలిపివేసి నప్పటికీ, వారు యథాతథ స్థితితో సంతోషంగా లేరనీ, తమకు అనుకూలమైన మార్పు కోసం ఆసక్తిగా ఉన్నారనీ చైనా వైపు నుండి సందేశం స్పష్టంగా కనబడుతోంది. 2020లో అవకాశాన్ని కోల్పోయి నప్పటికీ, వారు తమ ప్రణాళికను కచ్చితంగా వదులుకున్నారని దీని అర్థం కాదు. సరిహద్దు సమస్యను చైనా ఎప్పటికప్పుడు లేవనెత్తుతోంది. 2022 డిసెంబర్ లో, చైనా తవాంగ్లో ఒక ఫార్వర్డ్ పోస్ట్ను ప్రారంభించింది. కానీ ఈ ప్రయత్నాన్ని కూడా భారతీయ సైనికులు అడ్డుకున్నారు. 2020 జూన్ 15, 16 తేదీలలో జరిగిన గాల్వాన్ ఘర్షణ 21వ శతాబ్దంలో భారత్–చైనా సంబంధాలను మూలమలుపు తిప్పిన ఘటన. నిజానికి ఇరు దేశాల సైనికులు పరస్పరం ఘర్షణ పడడం ఇదే తొలిసారి. 1975 అక్టోబరులో చివరగా వాస్తవిక ఘర్షణ జరిగింది. ఆయుధాల వినియోగ నిషేధ ఒప్పందం ఒకటి భారత్, చైనాల మధ్య ఉంది. గాల్వాన్లో చైనా సైనికులు మేకులున్న కర్రలను ఉపయోగించారు. భారతీయులు ఫైబర్గ్లాస్ లాఠీలతో ప్రతిస్పందించారు. కొన్ని సందర్భాల్లో రాళ్లను కూడా ఉపయోగించారు. భారతీయుల కంటే చైనీయులు ఎక్కువ మంది సైనికులను కోల్పోయారని కొన్ని స్వతంత్ర నివేదికలు నొక్కి చెప్పాయి. ఈ ఘటనతో భారత్ చేదు పాఠం నేర్చుకుంది. ఈ సున్నితమైన పోస్ట్లలో పెట్రోలింగ్కు ఎక్కువ మంది సిబ్బందిని నియమించింది కూడా! ఇప్పుడు ఐదు పాయింట్ల వద్ద ఇరు సైనికుల ఉనికి లేదు. ఈ ప్రదేశాలలో సైనికరహిత బఫర్ జోన్లు ఏర్పాటయ్యాయి. కానీ ఈ బఫర్ జోన్లు కొత్త వివాదాస్పద అంశంగా మారాయి. వీటి ఏర్పాటుకు ఒప్పుకోవడం అంటే భారత్ తన భూభాగాన్ని కోల్పోవడమే తప్ప మరొకటి కాదని భారత వ్యూహాత్మక సంస్థ పేర్కొనడం ఇక్కడ గమనార్హం. ఇది చాలదన్నట్లు సైనికులనూ, సైనిక సామగ్రినీ సులభంగా తరలించడానికి చైనా తన వైపు రెండు వంతెనలను కలిగి ఉన్న ప్రాంతంలో మౌలిక సదుపాయాలను నిర్మించడంలో బిజీగా ఉంది. భారత దేశం కూడా రోడ్లు, వంతెనలు, సొరంగాలు, హెలిప్యాడ్లు వంటివి ఉన్న తన భూభాగం వైపున మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తోంది. ఏదేమైనప్పటికీ, ఇది ఈ ప్రాంతంలో శాంతికి శుభ సూచన కాదు. ఇంత ఘర్షణపూరిత వాతావరణం ఉన్నప్పటికీ, చైనా–భారత్ల మధ్య వాణిజ్యం వృద్ధి చెందుతోంది. భారతదేశం హిమాలయ పొరుగు దేశం నుండి ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. భారత – చైనా బంధం విషయంలో ఎల్లప్పుడూ నిరంతర పరిశీలన అవసర మని భారత నాయకులు గమనించాలి. చైనా తన వ్యూహాత్మక ప్రయోజనాలకు, దీర్ఘకాలిక ఆకాంక్షలకు సరిపోయే దానికంటే తక్కువగా దేనితోనూ సమాధానపడదని గుర్తుంచుకోవాలి. 21వ శతాబ్దంలో, అమెరికా కూడా చైనా ఎదుగుదల, దాని ఆకాంక్షల గురించి ఆందోళన చెందుతోంది. పైగా చైనాను సవాలు చేయడానికి భారతదేశాన్ని తన విలువైన భాగస్వామిగా చూస్తోంది. అందుకే ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీకి అమెరికా ఎర్ర తివాచీ పరిచింది. జపాన్ లాగా, ఇప్పుడు భారత దేశం... అమెరికా వ్యూహాత్మక చింతనలో ముఖ్యమైన స్థానాన్ని పొందింది. ఒబామా వైట్హౌస్లో ఉన్న రోజుల నుండి, యూఎస్ –ఇండియా సంబంధాల సంగతి ‘21వ శతాబ్దాన్ని నిర్వచించే సంబంధాల’లో ఒకటిగా అమెరికా మాట్లాడుతోంది. 2023 జూన్ మొదటి వారంలో, అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన 2016 నుండి అమెరికా ‘ప్రధాన రక్షణ భాగస్వామి’గా ఉంటున్న భారతదేశం గురించి మాట్లాడారు. ‘క్వాడ్’ సభ్యులందరిలో, చైనాతో భారీ భూ–సరిహద్దు కలిగి ఉన్న ఏకైక దేశం భారతదేశం మాత్రమే అని అమెరికా ప్రభుత్వ యంత్రాంగానికి బాగా తెలుసు. 2023 జూన్ మొదటి వారంలో దాని 20వ ఎడిషన్ను ముగించిన వార్షిక ‘షాంగ్రి–లా డైలాగ్ ’... ఆసియాలో మారుతున్న ఈ ధోరణులను గుర్తించింది. అయితే భారతదేశం ఈ ప్రాంతంలో యూఎస్ క్లయింట్ స్టేట్గా ఉండలేదు. లేదా దిగ్గజ చైనాపై ఒక స్థాయికి మించి భారత్ ఆగ్రహం ప్రదర్శించలేదు. దూకుడుకు, అతివాగుడుకు చోటు లేని ఉన్నత స్థాయి దౌత్య నైపుణ్యం దీనికి అవసరం. చైనాతో సంబంధాలు భారతదేశంలో అంతర్–పార్టీ స్పర్థ కోణాన్ని జోడించాయి. 1962 అక్టోబరులో చైనా భారతదేశంపై దాడి చేసినప్పుడు, బీజేపీని అసహ్యించుకునే పండిట్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలో ఉండేది. కాబట్టి నెహ్రూను ఢీకొట్టే ఒక్క అవకాశాన్ని కూడా కాషాయ పార్టీ వదులుకోదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంటూండగా, బీజేపీ అధికారంలో ఉంది. ఈ 2023 జూన్ 20వ తేదీ సోమవారం, వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనాతో సరిహద్దు పరిస్థితిపై కాంగ్రెస్ శ్వేతపత్రాన్ని డిమాండ్ చేయడంలో ఆశ్చర్యం లేదు. 2020 జూన్ 19 నాటి అఖిలపక్ష సమావేశంలో ‘ఎవరూ మన సరిహద్దులోకి ప్రవేశించలేదు లేదా ఏ సరిహద్దు ప్రాంతం కూడా ఇతరుల అధీనంలో లేదు’ అని మోదీ చేసిన వ్యాఖ్యలను తరచుగా ప్రస్తావించడం ద్వారా ప్రధానిని మరింత ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. అవన్నీ పక్కన పెడితే, చైనాను నిరంతరం పరిశీలిస్తూండటం మనకు ఎంతో అవసరం. భారత్ అప్రమత్తంగా మెలుగుతూ ఉండాలి. అవినాష్ కోల్హే వ్యాసకర్త రిటైర్డ్ ప్రొఫెసర్, ముంబయ్ -
సరిహద్దులో సాధారణ స్థిరత్వం: చైనా విదేశాంగ మంత్రి
బీజింగ్: భారత్–చైనా సరిహద్దులో ప్రస్తుతం సాధారణ స్థిరత్వం నెలకొని ఉందని చైనా విదేశాంగ మంత్రి జనరల్ లీ షాంగ్ఫు చెప్పారు. ఇరు దేశాల సైనిక, దౌత్య మార్గాల్లో కమ్యూనికేషన్ కొనసాగిస్తున్నాయని వివరించారు. ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు భారత్కు వచ్చిన లీ షాంగ్ఫు శుక్రవారం భారత విదేశాంగ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్–చైనా సరిహద్దు వద్ద ప్రస్తుత పరిస్థితి, ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు 45 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘిస్తే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఉన్న మొత్తం ఆధారం చెరిగిపోతుందని చైనాకు రాజ్నాథ్ సింగ్ తేల్చిచెప్పారు. సరిహద్దుకు సంబంధించిన ఏ వివాదమైనా ప్రస్తుతం అమల్లో ఉన్న ఒప్పందాల ప్రకారమే పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ నేపథ్యంలో జనరల్ లీ షాంగ్ఫు ఆచితూచి స్పందించారు. -
గల్వాన్ లోయలో క్రికెట్ ఆడిన భారత జవాన్లు..
న్యూఢిల్లీ: 2020 జూన్ 15. తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయ. భారత్, చైనా సరిహద్దులోని పెట్రోలింగ్ పాయింట్(పీపీ)–14. సరిగ్గా అక్కడే ఇరు దేశాల సైనికుల నడుమ భీకర స్థాయిలో ఘర్షణ జరిగింది. పదునైన ఆయుధాలతో చైనా జవాన్లు దాడి చేయగా, దెబ్బకు దెబ్బ అన్నట్లుగా భారత సైనికులు దీటుగా బదులిచ్చారు. ఈ కొట్లాటలో తమ జవాన్లు ఎంతమంది బలయ్యారో చైనా ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టలేదు. 40 మందికిపైగానే చనిపోయి ఉంటారని అంచనా. భారత్ వైపు నుంచి దాదాపు 20 మంది చనిపోయారు. రణక్షేత్రంగా రక్తంతో తడిసిపోయిన పీపీ–14 ఇప్పుడు క్రికెట్ మైదానంగా మారింది. పటియాలా బ్రిగేడ్కు చెందిన త్రిశూల్ డివిజన్ క్రికెట్ పోటీ నిర్వహించింది. సైనికులు సరదాగా క్రికెట్ ఆడారు. పీపీ–14కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఈ పోటీ జరిగింది. జవాన్లు క్రికెట్ ఆడుతున్న ఫొటోలను భారత సైన్యం శుక్రవారం ట్విట్టర్లో పోస్టు చేసింది. గడ్డ కట్టించే తీవ్రమైన చలిలో పూర్తి ఉత్సాహంతో ఈ పోటీ జరిగిందని వెల్లడించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని ఉద్ఘాటించింది. జీ20 విదేశాంగ మంత్రుల సదస్సు సందర్భంగా గురువారం ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. ఆ మరుసటి రోజే గల్వాన్లో భారత సైనికులు క్రికెట్ పోటీ నిర్వహించుకోవడం విశేషం. -
చైనా దూకుడుకు కారణాలెన్నో!
చైనాకు లదాఖ్ ఎందుకంత ముఖ్యం అన్న ప్రశ్నకు సమాధానం వెతకగలిగితే సరిహద్దు సమస్యలకు సమాధానం దొరుకుతుంది. టిబెట్ అటానమస్ రీజియన్ను క్సిన్జియాంగ్ అటానమస్ రీజియన్తో అనుసంధానించే ప్రాంతంలో లదాఖ్లోని అక్సాయ్ చిన్ ఉంది. చైనా తన పశ్చిమ, ఉత్తర, నైరుతి దిక్కుల్లో ఉన్న సరిహద్దులకు సైన్యాన్ని తరలించడానికి ఉన్న మార్గాలు ఇవి మాత్రమే. చైనా ఉత్పత్తి చేసే 157 రకాల ఖనిజాల్లో దాదాపు 138 రకాల ఖనిజాలు ఈ ప్రాంతంలో దొరుకుతాయి. ఈ పరిస్థితుల్లో భారత్తో ఉన్న సరిహద్దులపై చైనా ఇంకా దృష్టి పెడుతుంది. అతి నిర్ణయాత్మకమైన ధోరణిని అవలంబించే బలమైన ప్రభుత్వం మాత్రమే చైనా దూకుడును ఎదుర్కోగలదు. ఈ సంవత్సరం జనవరి 20–22 తేదీల్లో ఢిల్లీలో ‘కంచె లేని భూసరిహద్దుకు సంబంధించిన భద్రతా సమస్యలు’ అనే అంశంపై ఇంటలిజెన్స్ బ్యూరో నిర్వహించిన సమావేశంలో లదాఖ్లో చైనాతో ఉన్న సరిహద్దుకు సంబంధించిన విషయాలు చర్చకు వచ్చి, అవి మీడియాలో కూడా అనేక చర్చలకు దారితీశాయి. ప్రధాని, హోంమంత్రి, జాతీయ భద్రతా సలహాదారు పాల్గొన్న ఈ సమావేశంలో ముందుకు వచ్చిన ఒక నివేదిక ప్రకారం– ఈ ప్రాంతంలో కారకోరం పాస్ నుండి చుమూర్ గ్రామం వరకు ప్రస్తుతం ఉన్న 65 పాట్రోలింగ్ పాయింట్స్లో 26 పాయింట్స్ అంటే పాయింట్ నంబర్ 5 నుండి 17, 24 నుండి 32, 37, 51, 52, 62 అనే పాయింట్స్ ఇండియా కోల్పోయిందనీ, చైనా పాటించే సలామి స్లైస్ వ్యూహంలో(చిన్న దాడులతో పెద్ద ఫలితం రాబట్టడం) ఇవి చిక్కుకున్నాయనీ వెల్లడయిన విషయాలు ఆందోళన కలిగించేవే! అయినప్పటికీ ఈ ప్రాంతంపై చైనాకు ఉన్న ఆర్థిక రాజకీయ వ్యూహాత్మక భద్రతా ప్రయోజనాల దృష్ట్యా ఇది ఊహించదగ్గదే. ఇండియా, చైనా మధ్య 2020 ఏప్రిల్ నుండి ఇప్పటివరకూ సుమారు 17 రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ, వాటి ఫలితాలు ఏమాత్రం అనుకూలంగా రాలేదు. రెండు దేశాల సైన్యాలు బాహాబాహీకి దిగుతున్న సంఘటనలు, నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలు, రహదారులు, మిలిటరీ స్టేషన్స్, జనావాసాలు... ఎన్ని రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ 2020 సంవత్సరానికి పూర్వం ఉన్న పరిస్థితులు పునరుద్ధరించడం కష్టమేనన్న భావన కలిగిస్తున్నాయి. దానికి తోడు జనవరి 20వ తేదీన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ లదాఖ్ ప్రాంతంలోని చైనా సైనికులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన సమావేశంలో ఎల్లవేళలా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చాడు. చైనాకు ఈ ప్రాంతం ఎందుకంత ముఖ్యం అన్న ప్రశ్నకు సమాధానం వెతకగలిగితే ఈ సరిహద్దు సమస్యలకు సమాధానం దొరుకుతుంది. గత మూడు దశాబ్దాల్లో చైనా విదేశీ విధానంలో, దాని రూపకల్పనలో సైన్యం పోషించే పాత్రలో చాలా మార్పులు వచ్చాయి. తొంభయ్యో దశకంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించకుండా అతిగోప్యతను పాటించడం, ఇతర దేశాల్లో ఎలాంటి జోక్యం చేసుకోకపోవడం ముఖ్యమైన విధానంగా ఉంటే, కొత్త సహస్రాబ్దిలో చైనా సాధించిన ఆర్థిక విజయాలు ఈ విధానంలో సమూల మార్పులకు దోహద పడ్డాయి. అందులో భాగంగా తన ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవడానికి సైన్యం కీలక పాత్ర పోషించవలసిన అవసరం ఉందని గుర్తించింది. దూకుడైన విధానాలు, బలమైన, టెక్నాలజీ సపోర్ట్తో కూడిన రక్షణ వ్యవస్థలను నిర్మించడంపై దృష్టి పెట్టింది. జిన్పింగ్ కాలంలో విదేశీ విధానాల రూపకల్పనలో సైన్యం పాత్ర మరింత పెరగటం గమనించవచ్చు. జిన్పింగ్ అధికారంలోకి వచ్చాక 2013లో చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా వాణిజ్యం పెంచే ఎగుమతులు దిగుమతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా కొనసాగించడానికి రక్షణ చర్యలు తీసుకొనవలసిన అవసరం ఏర్పడింది. 2016 నుండి తన పశ్చిమ సరిహద్దుల్లో ముఖ్యంగా సెంట్రల్ అసియా, అఫ్గానిస్తాన్లో పెరుగుతున్న తీవ్రవాదం ప్రభావం తన ఉగెర్, క్సిన్జియాంగ్ ప్రాంతాల్లో పడకుండా ఉండడానికి ఆ ప్రాంతాల్లో మిలిటరీ ఉనికిని పెంచడమే కాకుండా, తన వెస్ట్రన్ కమాండ్ను మొత్తంగా పునరుద్ధరించింది. ఈ చర్యలు అటు క్సిన్జియాంగ్ ప్రోవిన్సుతో పాటు, టిబెట్ ప్రావిన్స్ లలో సైన్యం కదలికలు పెరిగి ఎన్నడూ లేని విధంగా ఆ ప్రాంతాల్లోని సరిహద్దులపై దృష్టి పెట్టేందుకు దోహదపడ్డాయి. గత రెండు దశాబ్దాల్లో చైనా విధానాల్లో వచ్చిన మరొక ముఖ్యమైన మార్పు, తాను నిర్దేశించుకున్న ‘మూల ప్రయోజనాలు’. తొంభయ్యో దశకం వరకు ఆర్థిక అభివృద్ధి, దేశ సమగ్రత ముఖ్య లక్ష్యాలయితే, అది కొత్త మిలీనియంలో విదేశాల్లో ఆర్థిక ప్రయోజనాలతో పాటు, ఆయా దేశాల్లో ఉన్న సహజ వనరులను ఉపయోగించుకునేందుకు, అందుకు అవసరమైతే మిలిటరీ తదితర శక్తుల ప్రదర్శన చేయడంగా రూపాంతరం చెందింది. అయితే ఢిల్లీలో జరిగిన సమీక్ష సమావేశంలో చైనాకు లదాఖ్ ప్రాంతంలో ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నట్టు పేర్కొన్నప్పటికీ, అవి ఏమిటన్నది వెల్లడించలేదు. ఈ ప్రాంత భౌగోళిక స్వరూపాన్ని పరిశీలిస్తే చైనాకు ఇది అత్యంత కీలకమైన ప్రాంతమని గోచరిస్తుంది. చైనాకు ఈ ప్రాంతంతో మూడు రకాల ప్రయోజనాలున్నాయి. ఒకటి: చైనాలో ఉన్న టిబెట్ అటానమస్ రీజియన్ను క్సిన్జియాంగ్ అటానమస్ రీజియన్తో అనుసంధానించే ప్రాంతంలో లదాఖ్లోని అక్సాయ్ చిన్ ఉంది. ఈ ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న నగరి డ్యామ్ ద్వారా సింధు నదీ జలాల ప్రవాహాన్ని నియంత్రించడమే కాకుండా, వాటిని తన రక్షణ దళాల అవసరాలకు మళ్ళించుకోవడానికీ, ఆప్రాంతానికి కావలసిన విద్యుత్ ఉత్పత్తి చేయడానికీ అక్సాయ్ చిన్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలపై చైనాకు పూర్తి నియంత్రణ అవసరం. రెండు: క్సిన్జియాంగ్ ప్రావిన్స్ను టిబెట్ ప్రావిన్స్తో కలిపే ఎ219 హైవే, కషుగర్ నగరాన్ని సెంట్రల్ చైనా నుండి బీజింగ్తో కలిపే ఎ314 హైవే... ఈ రెండింటి భద్రతకు అక్సాయ్ చిన్, లదాఖ్ ప్రాంతాలు చైనాకు అతి ముఖ్యమైనవి. చైనా తన పశ్చిమ, ఉత్తర, నైరుతి దిక్కుల్లో ఉన్న సరిహద్దులకు సైన్యాన్ని తరలించడానికి ఉన్న మార్గాలు ఇవి మాత్రమే. ఈ ప్రాంతంలో ఇండియా నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా రహదారులు, దౌలత్ ఓల్డ్ బేగ్ లాంటి వైమానిక స్థావరాలతో చైనా భద్రతకు, అందునా చైనా– పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను కషుగర్ సిటీతో కలిపే కారకోరం హైవేకు ప్రమాదం ఏర్పడుతుందని చైనా అంచనా. మూడు: ఈ ప్రాంతంలో 1913లో జరిగిన డి ఫిలిపె ఎక్స్పెడీషన్, ఆ తర్వాత సోవియెట్ యూనియన్ జరిపిన భౌగోళిక సర్వేలో అత్యంత విలువైన థోరియం, యురేనియం, బోరోక్స్, సల్ఫర్, నికెల్, పాదరసం, ఇనుము, బంగారం, బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. 2019లో చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ ప్రచురించిన నివేదికలో చైనా ఉత్పత్తి చేసే 157 రకాల ఖనిజాల్లో దాదాపు 138 రకాల ఖనిజాలు ఈ ప్రాంతంలో దొరుకుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే వీటి వెలికితీత కార్యక్రమాలు, శుద్ధిచేసే ప్లాంట్ల నిర్మాణాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ ఖనిజ సంపదతో తన తూర్పు ప్రాంతానికి సమానంగా పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చనీ, ఉగెర్ ప్రాంతంలో నెలకొని ఉన్న పేదరికాన్ని, వేర్పాటువాదాన్ని ఎదుర్కొనవచ్చనీ చైనా వ్యూహం. ఈ పరిస్థితుల మధ్య భారత్తో ఉన్న సరిహద్దులపై చైనా ఇంకా దృష్టి పెడుతుందనీ, భవిష్యత్తులో మరింత దూకుడుగా ఉంటుందనీ అంచనా వేయవచ్చు. ఇంతకు ముందులా కాకుండా భారత్ కూడా లదాఖ్ నుండి అరుణాచల్ వరకు ఉన్న తన సరిహద్దుల వెంబడి అనేక మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, సైనిక దళాలకు కావలసిన వసతులను వేగంగా అభివృద్ధి చేసుకుంటున్నది. చైనాకు ఉన్న ప్రయోజనాల దృష్ట్యా, అది వ్యవహరిస్తున్న తీరును బట్టి, భవిష్యత్తులో మరిన్ని ఘర్షణలు తలెత్తవచ్చని చెప్పవచ్చు. అతి నిర్ణయాత్మకమైన ధోరణిని అవలంబించే బలమైన ప్రభుత్వం మాత్రమే చైనా దూకుడును ఎదుర్కోగలదు. వ్యాసకర్త సహాయ ఆచార్యులు, సిక్కిం సెంట్రల్ యూనివర్సిటీ డాక్టర్ గద్దె ఓంప్రసాద్ -
భారత భూభాగం ఆక్రమించిన చైనా.. కేంద్రానికి సంచలన నివేదిక!
భారత్ సరిహద్దుల్లో చైనా కారణంగా ఎప్పుడూ ఉద్రిక్తత చోటుచేసుకుంటూనే ఉంటుంది. డ్రాగన్ కంట్రీ భారత్కు చెందిన సరిహద్దులపై కన్నేసి ఆక్రమణలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా భారత్కు సంబంధించిన భూమిని చైనా ఆక్రమించుకున్నట్టు స్వయంగా దేశానికి చెందిన సీనియర్ అధికారి ఓ నివేదికలో చెప్పడం సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. జమ్మూ కాశ్మీర్లోని తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనా కొంత భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఈ ప్రాంతంలోని 65 పాయింట్లలో భారత్ గస్తీ నిర్వహించాల్సి ఉండగా.. మన బలగాలు 26 చోట్లకు మాత్రమే ప్రవేశించగలుగుతున్నాయి. పలు చోట్ల భారత్ గస్తీ నిర్వహించడం లేదని ఈ క్రమంలోనే ఆక్రమణ జరిగినట్టు లేహ్ ఎస్పీ నిత్య కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందించారు. ఈ నివేదికను ఆమె.. ఢిల్లీలో జరిగిన పోలీసుల సదస్సులో కేంద్రానికి సమర్పించారు. కాగా, ఆ ప్రాంతం కారాకోరం శ్రేణుల్లో నుండి చమూరు వరకు విస్తరించి ఉన్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. ఇక, ఈ ప్రాంతాల్లో భారత్ గస్తీ నిర్వహించకపోవడంతో చైనా.. ఆయా ప్రాంతాలను ఆక్రమించుకుంటున్నట్టు తెలిపారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో కొన్ని చోట్ల బఫర్ జోన్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అయితే, బఫర్ జోన్లను ఆసరాగా తీసుకుని భారత్కు చెందిన ప్రాంతాలను చైనా ఆక్రమిస్తున్నట్టు నివేదికలో చెప్పుకొచ్చారు. అలాగే, భారత్ బలగాల కదలికలను సైతం గుర్తించేందుకు అక్కడి ఎత్తైన శిఖరాలపై చైనా.. కెమెరాలను అమర్చినట్టు తెలిపారు. ఇలా, బఫర్ జోన్లోకి భారత సైన్యం వెళ్లిన వెంటనే ఆ ప్రదేశం తమ దేశానికి చెందినదే అని చైనా దూకుడగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు. కొద్దిరోజులుగా ఇలా చైనా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని నివేదికలో స్పష్టం చేశారు. ఇక, ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కూడా ఉన్నారు. Did India lose access to 26 patrolling points in Eastern Ladakh? Become a Youturn Supporter: https://t.co/6cvL9b8072#Youturn | #FactCheck | #IndiaBorder | #Ladakh pic.twitter.com/kHY6nsLBcY — Youturn English (@Youturn_media) January 25, 2023 -
అక్కడ రష్యా.. ఇక్కడ చైనా..
న్యూఢిల్లీ: యుద్ధంలో మునిగిన ఉక్రెయిన్, రష్యాలతో భారత్, చైనా సరిహద్దు వివాదాన్ని పోలుస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ‘ ఉక్రెయిన్ను ఆక్రమిస్తూ రష్యా ఆ దేశంతో ఉన్న సరిహద్దులను మార్చేస్తోంది. అదే తరహాలో భారత్తో ఉన్న సరిహద్దును మార్చేందుకు చైనా తన సైన్యం చొరబాట్లతో దుస్సాహసానికి తెగబడుతోంది’ అని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్తో చర్చాగోష్టి తాలూకూ సుదీర్ఘ వీడియోను రాహుల్ గాంధీ సోమవారం ట్వీట్ చేశారు. ‘బలహీన ఆర్థిక వ్యవస్థ, దమ్ములేని నాయకత్వంలో దార్శనికత కొరవడిన ప్రజలు, విద్వేషం, ఆగ్రహం కలగలిసిన ఈ పరిస్థితులను చైనా తనకు అనువుగా మలచుకుంటోంది. లద్దాఖ్లోకి వస్తామంటోంది. అరుణాచల్లో అడుగుపెడతామంటోంది’ అని రాహుల్ ఆందోళన వ్యక్తంచేశారు. ఉత్తరప్రదేశ్లో ఈనెల 3వ తేదీ నుంచి మొదలయ్యే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలంటూ ఆహ్వానం పంపిన రాహుల్ గాంధీకి ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతి కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి కాంగ్రెస్ ప్లీనరీ ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఫిబ్రవరి 24 నుంచి 26 దాకా.. మూడు రోజులపాటు తమ పార్టీ 85వ ప్లీనరీ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం తెలియజేశారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)కి సైతం ప్లీనరీ సందర్భంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది.. కేంద్రం ఈ నిజాన్ని దాస్తోంది: రాహుల్ ఫైర్
జైపూర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. చైనా విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చైనా నుంచి వచ్చే ముప్పును తక్కువ అంచనా వేస్తుందని విమర్శించారు. డ్రాగన్ దేశం యుద్ధానికి కాలు దువ్వుతుంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దీనిని అంగీకరించడం లేదని ఆరోపించారు. భారత్ జోడో యాత్ర భాగంగా రాజస్థాన్లోని దౌసాలో రాహుల్గాంధీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆయన వెంట రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కూడా ఉన్నారు, కాగా డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వాస్తవాధీన రేఖవద్ద భారత్, చైనా మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే. భారత్ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన చైనా ఆర్మీని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ ఘటన నేపథ్యంలోనే రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుపడ్డారు ‘చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని చొరబాటు కోసం కాదు. వారి ఆయుధాల సరళి, వాడకం చూస్తే అర్థమవుతోంది.. అది యుద్ధం కోసమేనని. కానీ మన ప్రభుత్వం దానిని గుర్తించడం లేదు. భారత ప్రభుత్వం వ్యూహాలపై కాదు, సంఘటనలపై పనిచేస్తోంది. చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది. మన సైనికులపై దాడి చేసింది. దీంతో డ్రాగన్తో వచ్చే ముప్పు స్పష్టంగా అర్థమవుతోంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ నిజాన్ని దాచేస్తోంది. మోదీ చైనా బెదిరింపులను విస్మరిస్తున్నారు. ఓవైపు లడఖ్, అరుణాచల్ ప్రదేశ్లో చైనా దాడికి సిద్ధమవుతుంటే.. భారత ప్రభుత్వం దీనిని పట్టించుకోకుండా నిద్రపోతుంది’ అని రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చదవండి: రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్ రాజధానిలో నీటి సరాఫరా బంద్ -
నమ్మలేని పొరుగు దేశం
భారత–చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తత మరోమారు పార్లమెంట్ సహా దేశమంతటినీ కుదిపి వేస్తోంది. డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ వద్ద యాంగ్సే ప్రాంతంలో చొచ్చుకొని రావడానికి చైనా సైన్యం చేసిన ప్రయత్నాన్ని భారత సైనికులు గట్టిగా తిప్పికొట్టిన తీరుపై వైనవైనాలుగా కథనాలు వస్తున్నాయి. అక్కడ నిజంగా జరిగిందేమిటో తెలుసుకొని, పరిస్థితిని సమీక్షించి, లోటుపాట్లను సరిదిద్దుకొని, రక్షణ దళాలను బలోపేతం చేసే పనిలో భారత ప్రభుత్వం ఇప్పటికే ఉంది. అయితే, సరిహద్దు వెంట శాంతి నెలకొనాలనీ, అనేక ఇతర అంశాల్లో సహకారం వెల్లివిరియాలనీ – ఇరుదేశాల మధ్య ఉన్న ఒప్పందాన్ని దశాబ్ద కాలంగా పొరుగుదేశం పదే పదే ఉల్లంఘించడం కీలకాంశం. పొరుగునే పొంచివున్న పాము పట్ల అప్రమత్తత అనివార్యం. రెండేళ్ళ క్రితం 2020 జూన్ 15 నాటి గల్వాన్ ఘర్షణల్లోనూ, తాజా తవాంగ్ ఘటనలోనూ చైనా తన తప్పేమీ లేదనే భావన కలిగించడానికి శతవిధాల ప్రయత్నించింది. వాస్తవాలు వెలికి రావడంతో డ్రాగన్ పాచిక పారలేదు. భారత – చైనాల మధ్య సైనిక ఘర్షణ 1962 నుంచి 60 ఏళ్ళుగా సాగుతోంది. లద్దాఖ్ పరిసర పశ్చిమ ప్రాంతం – టిబెట్తో మన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్ల సరిహద్దుతో కూడిన మధ్యప్రాంతం – అరుణాచల్ ప్రదేశ్ వద్ద సరిహద్దుతో కూడిన తూర్పు ప్రాంతం... ఈ మూడూ భారత–చైనా సరిహద్దులో ప్రధాన ప్రాంతాలు. అరుణాచల్తో ఉన్న 1126 కి.మీల తూర్పు సరిహద్దుపై చైనా ఎప్పుడూ పేచీ పెడుతూనే ఉంది. అరుణాచల్ తనదేనంటోంది. అధిక భాగాన్ని ‘దక్షిణ టిబెట్’ అని ప్రస్తావిస్తూ, అక్కడి ప్రదేశాలకు తన పేర్లు పెట్టి పిలుస్తోంది. అరుణాచల్పై రచ్చ రేపి, చివరకు పశ్చిమాన భారత్ అధీనంలో ఉన్న కీలక అక్సాయ్చిన్ని తమకు వదిలేస్తే, అరుణాచల్పై పట్టు వీడతామని బేరం పెట్టడం డ్రాగన్ వ్యూహమని ఓ విశ్లేషణ. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) తూర్పు ప్రాంతంలో వ్యూహాత్మక తవాంగ్ వద్ద చైనాకు ఎప్పుడూ పట్టు లేదు. 17వేల అడుగుల ఎత్తైన పర్వతప్రాంతాన్ని వశం చేసుకుంటే, ఎల్ఏసీకి ఇరువైపులా స్పష్టంగా చూడవచ్చు. ఆ గుట్టపై ఆధిక్యం సంపాదించి, భారత్కు చోటు లేకుండా చేయాలన్నది చైనా పన్నాగం. అలాగే అరుణాచల్లో వివాదాస్పద సరిహద్దు వెంట భారత దళాల బలమెంతో అంచనా వేయడానికీ తాజా చర్యకు దిగింది. అది ఫలించకపోవడంతో తవాంగ్లో ప్రస్తుతానికి భారత్దే పైచేయి. కానీ, మరోపక్క సిక్కిమ్ సరిహద్దులో 2017లో ఘర్షణ సాగిన కీలక డోక్లామ్ ప్రాంతంలో కొన్నేళ్ళుగా చైనా ఊళ్ళకు ఊళ్ళు కడుతోంది. వంతెనలు నిర్మిస్తోంది. ఇది ఆందోళనకరం. తవాంగ్లో 13 వేల అడుగుల ఎత్తైన చోట, మైనస్ 15 డిగ్రీల్లోనూ భారత్ నిర్మిస్తున్న సేలా సొరంగ మార్గం పూర్తి కావచ్చింది. ఇటు ప్రజలకూ, అటు ఆర్మీకీ పనికొచ్చే ఇలాంటివి చైనాను చీకాకుపరుస్తున్నాయి. ఆసియాపై ఆధిక్యం చూపాలంటే, హిమాలయ ప్రాంతంపై పట్టు బిగించడం చైనాకు కీలకం. పైగా, భవిష్యత్ దలైలామా తవాంగ్ ప్రాంతంలో జన్మిస్తారని ఓ నమ్మకం. అలా ధార్మికంగానూ ఆ ప్రాంతం తమకు కీలకమనీ, అదీ తమ దేశంలో భాగమైపోవాలనీ చైనా తాప త్రయం. మరోపక్క బ్రహ్మపుత్రా నదిపై ప్రాజెక్ట్లు కడుతూ, ఆ జలాలపై ఆధారపడ్డ ఇతర పొరుగు దేశాలను అడకత్తెరలో బిగిస్తోంది. ఇక, తవాంగ్ ఘటనలో భారత్ను అమెరికా సమర్థించడంతో పుండు మీద కారం రాసినట్టయింది. భారత, అమెరికాల బంధం బలోపేతమైతే తన ప్రాంతీయ ఆధిపత్యానికి గండి పడుతుందని చైనా భావన. అందుకే, ఢిల్లీ, వాషింగ్టన్లు దగ్గరవుతున్న కొద్దీ కవ్వింపు పెంచుతోంది. ప్రపంచవేదికలు శాంతివచనాలు పలుకుతున్నా, వాటి ప్రభావం శూన్యం. జాతీయ భద్రత, ప్రాదేశిక సమగ్రతపై మన దేశమంతా ఏకతాటిపై ఉందని చాటాల్సిన సమ యమిది. కానీ తవాంగ్ ఘటన సైతం రాజకీయమవుతోంది. తమనూ విశ్వాసంలోకి తీసుకొని, సరిహద్దు రక్షణపై పార్లమెంట్లో చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతుంటే, కారణాలేమైనా అధి కార బీజేపీ అంగీకరించట్లేదు. 1962 చైనా యుద్ధవేళ నెహ్రూ విధానాన్ని కాషాయధ్వజులు తప్పు పడున్నారు. అప్పట్లో నెహ్రూ సభలో చర్చించి, ఏకంగా 165 మంది ఎంపీలకు మాట్లాడే అవకాశ మిచ్చి, ఆపైనే నిర్ణయం తీసుకున్నారని విస్మరిస్తే ఎలా అని కాంగీయులు ప్రతిదాడి చేస్తున్నారు. వెరసి, అప్పట్లో గల్వాన్ ఘటనలోనూ, ఇప్పుడీ తవాంగ్పైనా ఈ రాజకీయ వాగ్వాదపర్వం కీలకమైన దేశభద్రతలో లోటుపాట్లపై లోతైన చర్చకు దారి తీయకపోవడమే విచారకరం. సరిహద్దు వెంట చైనా లాగానే, టిబెట్, దక్షిణ మంగోలియా, హాంకాంగ్, తవాంగ్ లాంటి చోట్ల చైనాపై మనమూ దూకుడు చూపాలనేది కొందరి వాదన. అయితే, మన పాలకులు ‘ఆత్మనిర్భరత’ అంటూ రొమ్ము విరుచుకుంటున్నా, ఇవాళ్టికీ బొమ్మలు (86 శాతం), ఎలక్ట్రానిక్ విడిభాగాలు (37 శాతం), ఆటో విడిభాగాలు (30 శాతం) సహా అనేక అంశాల్లో మనం చైనా దిగుమతులపైనే ఆధార పడ్డాం. వస్తూత్పత్తిలో స్వీయపురోగతికి దీర్ఘకాలం పడుతుంది. అలా చూస్తే పొరుగున ఉన్న చైనాతో బద్ధశత్రుత్వంతో రోజులు గడవవు. దౌత్యపరమైన ఒత్తిడి పెడుతూనే, నేటికీ స్పష్టంగా అంగీకారం లేని సరిహద్దు రేఖపై చర్చించి, శాశ్వత పరిష్కారానికి ప్రయత్నించాలి. సరిహద్దుల్లో జరగనున్న భారత వైమానికదళ విన్యాసాలతో తోక తొక్కిన తాచులా చైనా బుసలుకొట్టవచ్చు. రానున్న రోజుల్లో ఉద్రిక్తతలూ పెరగవచ్చు. ఇటీవల ఢిల్లీ ఎయిమ్స్లో సర్వర్లను స్తంభింపజేసిన సైబర్ దాడీ చైనా పనేనట. ఈ పరిస్థితుల్లో సైన్యం, భారత గూఢచారి దళాల అప్రమత్తతే మనకు రక్షాకవచం. -
చైనా ఆర్మీని తరిమికొట్టిన భారత బలగాలు.. వీడియో వైరల్
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టర్లోని వాస్తవాధీన రేఖ వద్ద ఇటీవల భారత్ చైనా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్9న భారత్ భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా ఆర్మీ ప్రయత్నించిందని.. డ్రాగన్ చర్యను భారత బలగాలు ధీటుగా అడ్డుకున్నాయని మంగళవారం లోక్సభలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. అయితే చైనా, భారత్ దళాల దాడి ఘటనను కేంద్రం ధృవీకరించిన మరుసటి రోజే ఓ వీడియో బయటకు వచ్చింది. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. చైనా దళాలు భారత భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.భారత్ భూభాగంలోకి చొచ్చుకు వస్తున్న చైనా జవాన్లను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పి కొట్టాయి. సరిహద్దు దాటాలనుకుంటున్న చైనా ఆర్మీని.. భారత సైనికులు ధైర్యంగా అడ్డుకున్నారు. గుంపుగా వచ్చిన చైనా దళాలపై ఇండియన్ ఆర్మీ లాఠీలతో మూకుమ్మడిగా దాడి చేసింది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో డిసెంబర్ 9 జరిగిన ఘటనకు సంబంధించినది కాదని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. 2020లో తూర్పు లడఖ్లోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత ఈ దాడి ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. -
తవాంగ్ ఘర్షణ: రాజ్నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికల నడుమ తలెత్తిన ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, త్రివిద ధళాల అధిపతులు, విదేశాంగ శాఖ ప్రధాన కార్యదర్శి సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిసెంబర్ 9న జరిగిన ఘటనపై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. సరిహద్దులో ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్లమెంట్లోనూ ఈ అంశంపై రాజ్నాథ్ మాట్లాడనున్నారు. తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద యాంగ్త్సే సమీపంలో భారత్, చైనా సైనికల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నెల9న జరిగిన ఈ సంఘటన వివరాలను భారత సైన్యం సోమవారం బహిర్గతం చేసింది. ఘర్షణలో ఇరు దేశాల జవాన్లు కొందరు స్వల్పంగా గాయపడ్డారని ఒక ప్రకటనలో వెల్లడించింది. కయ్యానికి కాలుదువ్విన చైనా జవాన్లను మన సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారని, గట్టిగా తిప్పికొట్టారని తెలియజేసింది. ఇదీ చదవండి: భారత్-చైనా సరిహద్దు ఘర్షణ.. ప్రతిపక్షాలకు పార్లమెంట్లో గట్టి కౌంటర్ పడేనా? -
‘మీకేం వీటో పవర్ ఇవ్వలేదు’.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)కి 100 కిలోమీటర్ల దూరంలో భారత్- అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న 18వ విడత ‘యుద్ధ అభ్యాస్’ సైనిక ప్రదర్శనను చైనా వ్యతిరేకించటాన్ని తిప్పికొట్టింది భారత్. ఇలాంటి విషయంలో మూడో దేశానికి తాము ‘వీటో’ అధికారం ఇవ్వలేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్-అమెరికా ప్రతిపాదనకు చైనా ‘వీటో’ పవర్ ఉపయోగించి అడ్డుకున్న విషయాన్ని సూచిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్లోని ఔలి ప్రాంతంలో భారత్-అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘యుద్ధ అభ్యాస్’ మిలిటరీ ప్రదర్శనను బుధవారం వ్యతిరేకించింది చైనా విదేశాంగ శాఖ. భారత్-చైనా మధ్య 1993,1996లో జరిగిన సరిహద్దు నిర్వహణ ఒప్పందాన్ని ఉల్లంఘస్తున్నట్లు పేర్కొంది. దానికి కౌంటర్ ఇచ్చారు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి. 1993, 96 ఒప్పందాలు ఈ మిలిటరీ ప్రదర్శనకు వర్తించవని స్పష్టం చేశారు. 2020, మేలో చైనా బలగాలు చేసిన ఉల్లంఘనలను గుర్తు చేసుకోవాలన్నారు. సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించటం, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయటం ద్వారా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తు చేశారు. ఇదీ చదవండి: వీడియో: గుజరాత్ భారీ రోడ్షో మధ్యలో ఆగిన ప్రధాని మోదీ కాన్వాయ్! ఎందుకంటే.. -
భారత్, శ్రీలంక.. ఒక చైనా నౌక
భారత్ అభ్యంతరాలు, ఆందోళనలు బేఖాతర్ చేస్తూ చైనా హైటెక్ నిఘా నౌక యువాన్ వాంగ్ 5 శ్రీలంకలోని హంబన్టొట రేవు పట్టణంలోకి మంగళవారం ఉదయం ప్రవేశించింది. ఈ విషయాన్ని పోర్టు అధికారులు వెల్లడించారు. ఇంధనం నింపుకోవడానికే ఈ రేపులో ఆగినట్టుగా చైనా బయటకి చెబుతున్నప్పటికీ మన దేశ రక్షణ కార్యకలాపాలపై నిఘా వేయడం కోసమే డ్రాగన్ ఈ నౌకను పంపినట్టుగా అనుమానాలు వెలువడుతున్నాయి. ఆగస్టు 11వ తేదీనే ఈ నౌక శ్రీలంకకు రావాల్సి ఉంది. అయితే ఈ నౌక రాకను అడ్డుకోవాల్సిందిగా శ్రీలంకలోని రణిల్ సింఘె ప్రభుత్వానికి భారత్ విజ్ఞప్తి చేసింది. భారత్ అభ్యంతరాలను చైనా దృష్టికి తీసుకువెళుతూ చైనా ఆ నౌక రావడానికి తొలుత అనుమతి నిరాకరించింది. కానీ చైనా నుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి ఆఖరి నిమిషంలో అనుమతినిచ్చింది. 2020లో లద్ధాఖ్లోని గల్వాన్ లోయలో ఘర్షణలతో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు రాజుకుంటూనే ఉన్నాయి. ఈ నిఘా నౌకతో అవి మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు భారత్ ఆందోళనల్ని చైనా కొట్టి పారేస్తోంది. తమ నౌక కార్యకలాపాలు ఏ దేశ భద్రతకు ముప్పు కావని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ అన్నారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడే సర్వసాధారణంగా జరిగే పరిశోధనలనే యువాన్ వాంగ్ 5 చేస్తుందని అంటున్నారు. భారత రక్షణ ప్రమాదంలో పడుతుందా ? యువాన్ వాంగ్ 5 ఒక పరిశోధన నౌక అని చైనా చెప్పుకుంటోంది. కానీ ఇది పరిశోధనలు, సర్వేలతో పాటు నిఘా కూడా పెట్టగలదు. భారత్ మిలటరీ ప్రాంతాలన్నింటిపైనే నిఘా ఉంచే సామర్థ్యం ఈ నౌకకి ఉంది. యువాన్ వాంగ్ సిరీస్లో మూడో జనరేషన్కు చెందిన ట్రాకింగ్ నౌక ఇది. ఖండాంతర క్షిపణులు, ఉపగ్రహాలు, రాకెట్లను ట్రాక్ చేసే ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఈ నౌకలో ఉంది. 750 కి.మీ. దూరంలో ఉన్నవన్నీ ఈ నౌక రాడార్ పరిధిలోకి వస్తాయి. శ్రీలంకలోని హంబన్టొట రేవులోకి ఈ నౌక ప్రవేశించడం వల్ల భారత్లోని తూర్పు కోస్తా రేవు పట్టణాల్లో జరిగే వ్యూహాత్మక కార్యకలాపాలన్నీ ఈ నౌక రాడార్ పరిధిలోకి వస్తాయి. శ్రీలంక తీరంలో ఆ నౌక ఉన్న సమయంలో భారత్ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తే వాటి గురించి మొత్తం ఆ నౌక ద్వారా తెలుసుకోవచ్చు. శ్రీలంక రేవులో యువాన్ వాంగ్5 ఉన్నంతవరకు తమిళనాడులో ఉన్న 1,076 కి.మీ. తీర ప్రాంతంపై నిఘా పెట్టొచ్చు. కల్పకం, కూడంకుళం వంటి అణు విద్యుత్ కేంద్రాలు ఈ నౌక రాడార్లోకి రావడం వల్ల భారత్లో ఆందోళన పెరుగుతోంది. ఇంధనం నింపుకోవడానికే హంబన్టొటలో ఆగుతున్నామని చైనా చెబుతోంది. అయితే జూలై 14న చైనా నుంచి బయల్దేరిన ఈ నౌక ఇప్పటివరకు ఏ రేవు పట్టణంలోనూ ఆగకపోవడంతో మన దేశ మిలటరీ కార్యకలాపాలను పసిగట్టడం కోసమే వచ్చిందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి సముద్ర గర్భంలో సర్వేలు నిర్వహించే సత్తా కూడా ఈ నౌకకి ఉంది. దీనివల్ల జలాంతర్గాముల గుట్టు మట్లు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. చైనా కంపెనీ అధీనంలో హంబన్టొట పోర్టు శ్రీలంక రేవు పట్టణంలో చైనా నౌక ఉన్నంతవరకు ఎలాంటి శాస్త్రీయమైన పరిశోధనలు జరపడానికి తాము అనుమతించబోమని శ్రీలంక పోర్ట్ అథారిటీ చెబుతోంది. నౌకకు సంబంధించిన ఆటోమేటిక్ ఐడెంటిఫికేసన్ సిస్టమ్ని ఆఫ్లో ఉంచాలన్న నిబంధన పైనే నౌక రావడానికి అనుమతిచ్చామని అంటోంది. అయితే హంబన్టొట పోర్టు చైనా కంపెనీ చేతిలో లీజులో ఉంది. ఈ ఓడరేవు నిర్మాణానికి చైనాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ 120 కోట్ల డాలర్లు రుణంగా ఇచ్చింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక ఆ రుణాలు తీర్చలేకపోవడంతో చైనా మర్చంట్ పోర్టు సంస్థ 2017లో 99 ఏళ్ల పాటు ఈ పోర్టుని లీజుకి తీసుకుంది. ఈ కంపెనీయే రేవు పట్టణంలో రోజు వారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఇది భారత్కు మరింత ఆందోళన పెంచుతోంది.. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కనుసన్నల్లోనే ఈ నౌక నడుస్తుందని అమెరికా రక్షణ శాఖ కూడా ధ్రువీకరించింది. వ్యూహాత్మక ప్రాంతంలో పోర్టు అంతర్జాతీయ నౌకలు ప్రయాణించే మార్గంలో తూర్పు, పశ్చిమ సముద్ర ప్రాంతాలు కలిసే చోటుకి 10 నాటికల్ మైళ్ల దూరంలో హంబన్టొట ఉంది. ఆసియా, యూరప్ మధ్య నిత్యం 36 వేల రవాణా నౌకలు తిరుగుతూ ఉంటాయి. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చే చమురులో 50% ఈ మార్గం ద్వారానే సరఫరా అవుతుంది.ఈ రేవు ద్వారా వెళ్లడం ద్వారా ఆసియా, యూరప్ మధ్య మూడు రోజుల ప్రయాణం కలిసొస్తుంది. ఆ మేరకు చమురు ఆదా అవుతుంది. డ్రాగన్ కొత్త ఎత్తులు ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న దేశాల అవసరాలను తీరుస్తామన్న చెప్పుకొని డ్రాగన్ దేశం తమ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకుంటోంది. శ్రీలంక ఆర్థికంగా కుంగిపోయి అధ్యక్షుడు మహీందా రాజపక్స దేశం విడిచిపోయిన పారిపోయిన పరిస్థితుల్లో భారత్ ఆ దేశాన్ని ఎన్నో విధాలుగా ఆదుకుంది. 350 కోట్ల డాలర్లను అప్పుగా ఇవ్వడంతో పాటు ఆహారం, మందులు, చమురు పంపించింది. అటు చైనా నుంచి కూడా శ్రీలంక చాలా అప్పులు చేసింది. 2005–2017 మధ్యలో 1500 కోట్ల డాలర్లను అప్పుగా ఇచ్చింది. ఇప్పుడు భారత్ కూడా సాయం చేస్తూ ఉండడంతో లంకపై భారత్ పట్టు పెరిగిపోతుందన్న భయం చైనాకు పట్టుకుంది. అందుకే శ్రీలంకలో భారత్ ప్రాభవాన్ని తగ్గించడం కోసం వ్యూహాలు పన్నుతోంది. ఆ దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు, రోడ్డు, రైలు, విమానాశ్రయాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. శ్రీలంక కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి అప్పు తేవడానికి కావల్సిన మాట సాయాన్ని చైనా నుంచి ఆశిస్తోంది. దీనిపై ఇరు దేశాల మధ్య చర్చలు సాగుతున్నాయి. ఎవరినీ నొప్పించకూడదన్న లక్ష్యంతో శ్రీలంక ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్నా చైనా నుంచి వస్తున్న ఒత్తిళ్లే ఆ దేశంపై అధికంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. యువాన్ వాంగ్ 5 ► చైనాలోని జియాంగ్నన్ షిప్యార్డ్లో నిర్మాణం ► 2007 నుంచి విధుల్లోకి ► పొడవు 222 మీటర్లు – ► వెడల్పు 25.2 మీటర్లు ► నౌకలో అత్యంత ఆధునిక సాంకేతిక నిఘా వ్యవస్థ ► నింగి నేల నీరు అన్నింటిపై నిఘా పెట్టే సామర్థ్యం ► గత నెలలో చైనా లాంగ్ మార్చ్ ► 5బీ రాకెట్ ప్రయోగంపై నిఘా – నేషనల్ డెస్క్, సాక్షి -
భారత్ – చైనా చర్చలు
China-India: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద 22 నెలల క్రితం తలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకోవడానికి భారత–చైనాల మధ్య శుక్రవారం మరోసారి చర్చలు జరిగాయి. వరసక్రమంలో ఇవి 15వ దఫా చర్చలు. రెండు నెలల క్రితం జరిగిన చర్చల వల్ల ఎలాంటి ఫలితమూ కనబడకపోవడం కారణంగా ఈ చర్చల ప్రక్రియపై కొంత నిరాశా నిస్పృహలు ఏర్పడిన మాట వాస్తవమే. అయితే చర్చలకు వేరే ప్రత్యామ్నాయం ఉండదు కనుక ఇవి కొనసాగక తప్పదు. 2020 మే నెల మొదటి వారంలో ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య తొలిసారి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రెండు దేశాలూ భారీయెత్తున సైన్యాన్నీ, ఆయుధ సామగ్రినీ తరలించాయి. ఆ ఏడాది జూన్ నెలలో చైనా సైనికులు రాళ్లు, ఇనుపరాడ్లతో దాడికి దిగినప్పుడు మన జవాన్లు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మన సైనికుల ఎదురుదాడిలో చైనా సైన్యం కూడా తీవ్రంగా నష్టపోయిందన్న కథనాలు వెలువడ్డాయి. సైన్యం స్థాయిలోనూ, దౌత్యపరంగానూ చర్చోపచర్చలు జరిగాక నిరుడు ప్యాంగాంగ్ ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో రెండు దేశాలూ సైన్యాలను ఉపసంహ రించుకున్నాయి. గోగ్రాలో కూడా ఇది పూర్తయింది. హాట్ స్ప్రింగ్స్ (పెట్రోలింగ్ పాయింట్–15) ప్రాంతాలనుంచి ఉపసంహరణ విషయంలో చైనా నానుస్తోంది. అలాగే డెస్పాంగ్ బల్జ్, డెమ్చోక్ లతో సహా మరికొన్న చోట్ల కూడా ఉపసంహరణ మొదలుకావాల్సి ఉంది. దశాబ్దాల తరబడి ఎల్ఏసీపై ఏకాభిప్రాయం కుదరక ఇరు దేశాల మధ్యా అడపాదడపా ఉద్రిక్తతలు అలుముకుంటున్నాయి. మాస్కోలో 2020లో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సమావేశాల సందర్భంగా మన విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి సమావేశమయ్యాక ఇరు దేశాల మధ్యా పరస్పరం చర్చలు జరగాలని నిర్ణయించారు. విభేదాలు వివాదాలుగా మారకుండా చూడాలనీ, ఇప్పటికే కుదిరిన ఒప్పందాలను గౌరవించాలనీ అవగాహన కుదిరింది. కానీ ఆ నిర్ణయానికి భిన్నంగా వ్యవహరిస్తున్నది చైనాయే. సరిహద్దుల్లో దీర్ఘకాలం సైన్యాలను మోహ రించడం వల్ల అనుకోని సమస్యలు వచ్చిపడతాయి. ఉద్రిక్తతలు పెరుగుతాయి. అవి ఘర్షణలకు దారితీస్తాయి. వర్తమాన రష్యా–ఉక్రెయిన్ యుద్ధమే అందుకు తార్కాణం. ఇరుగు పొరుగు దేశాలు రెండూ భాగస్వాములుగా మెలగాలితప్ప ప్రత్యర్థులుగా కాదని చైనా విదేశాంగమంత్రి గతంలో అన్నారు. కానీ ఆచరణలో అందుకు సంబంధించిన జాడలు కనబడవు. అమెరికా రూపొందించి అమలు చేస్తున్న ఇండో–పసిఫిక్ వ్యూహం సారాంశం ఆసియాలో మరో నాటో రూపకల్పన తప్ప మరేమీ కాదని ఆయన ఈమధ్య చేసిన వ్యాఖ్య కీలకమైనది. ఇండో–పసిఫిక్ వ్యూహంలో భాగంగా అమెరికా చొరవతో ఏర్పాటైన చతుర్భుజ కూటమి (క్వాడ్)లో భారత్ భాగస్వామి. దీంతోపాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా మధ్య నిరుడు సెప్టెంబర్లో ‘ఆకస్’(ఆస్ట్రేలియా, యూకే, అమెరికా) ఒప్పందం కుదిరింది. ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గా ములు సమకూర్చడంతోపాటు ఇతరత్రా అంశాల్లో సైతం హామీ ఇవ్వడం ఈ ఒప్పందం సారాంశం. ఇది కూడా ఇండో–పసిఫిక్ వ్యూçహానికి సంబంధించిందే. ఇదికాక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, బ్రిటన్, అమెరికా భాగస్వాములుగా ‘ఫైవ్ ఐస్’ పేరుతో రక్షణ సంబంధమైన నిఘా, అంతరిక్ష నిఘా వగైరాలకు సంబంధించి మరో ఒప్పందం ఉంది. ఇవన్నీ తనను చుట్టుముట్టి కట్టడి చేయడానికేనని చైనా బలంగా విశ్వసిస్తోంది. అయితే చైనా ఆరోపిస్తున్నట్టు ఇప్పటికైతే క్వాడ్ సైనిక కూటమి కాదు. ఇండో–పసిఫిక్ ప్రాంత దేశాలు కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, వాతావరణ మార్పులు, కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తి వంటి అంశాలకు మాత్రమే అది పరిమిత మైంది. ఇది ముందూ మునుపూ ఏమవుతుందన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సైనిక కూటములు ఏర్పడటం, కయ్యానికి కాలుదువ్వడం వంటి పరిణామాలు ఎవరికీ మంచిది కాదు. అందుకు ప్రస్తుత ఉక్రెయిన్ ప్రత్యక్ష ఉదాహరణ. సామరస్య పూర్వకంగా సంప్రదింపులు జరుపుకోవడం, ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని అన్వేషించడం ఉత్తమమైన మార్గం. కానీ సమస్యలో భాగమైన అన్ని పక్షాలూ అందుకు నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. అవతలి పక్షానికి విశ్వాసం కల్పించాలి. కానీ ఎల్ఏసీ విషయంలో మాత్రమే కాదు... బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ) పేరిట రూపకల్పన చేసిన బృహత్తర ప్రాజెక్టులో సైతం చైనా మన వ్యూహా త్మక ప్రయోజనాలను దెబ్బతీసే ఎత్తుగడలు అనుసరించింది. ఇండో–పసిఫిక్ వ్యూహం తన కట్టడి కోసమే ఉనికిలోకొచ్చిందన్న సందేహం చైనాకు ఉండటం వల్లే ఎల్ఏసీ వద్ద యధాతథ స్థితిని దెబ్బతీసి, మన దేశాన్ని చికాకుపరచడం మొదలుపెట్టింది. ఇది తెలివితక్కువ పని. నిజానికి వివాదంలో మూడో పక్షం ప్రయోజనం పొందాలని ప్రయత్నిస్తున్నట్టు అనుమానం కలిగితే సత్వరం ఆ వివాదాన్ని పరిష్కరించుకోవడం విజ్ఞుల లక్షణం. చైనాకు అది కొర వడింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇరుగుపొరుగుతో సఖ్యంగా ఉండాలని చైనా నిజంగా కోరుకుంటే అందుకు సంబంధించిన సంకేతాలు కనబడాలి. చర్చల్లో విశాల దృక్పథంతో వ్యవహ రించడం, అక్కడ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా తదుపరి చర్యలుండటం అవసరం. భారత్ –చైనా మధ్య జరుగుతున్న చర్చలు సాధ్యమైనంత త్వరలో ముగిసి ఒక సానుకూల ఫలితం వస్తుం దనీ, అది రెండు దేశాల మధ్య మెరుగైన సంబంధాలకు మార్గం సుగమం చేస్తుందనీ ఆశించాలి. -
చైనాతో వివాదం: మా మద్దతు భారత్కే.. స్పష్టం చేసిన అమెరికా
వాషింగ్టన్: గాల్వాన్ ఘర్షణలో పాల్గొన్న సైనికాధికారిని బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ టార్చ్బేరర్గా ఎంపిక చేయడంపై చైనాతో ఏర్పడ్డ వివాదంలో తమ మద్దతు భారత్కేనని అమెరికా పేర్కొంది. పొరుగు దేశాలను బెదిరించే, ఇబ్బంది పెట్టే చైనా చర్యలను గతంలో కూడా తప్పుబట్టామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ప్రైస్ అన్నారు. ఇలాంటి విషయాల్లో భారత్ వంటి మిత్ర దేశాలకు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తామని చెప్పారు. భారత్, చైనా సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే తమ ఉద్దేశమన్నారు. సీనియర్ యూఎస్ సెనేటర్లు మార్కో రూబియో, జిమ్ రిచ్ కూడా చైనా చర్యను దుయ్యబట్టారు. వింటర్ ఒలింపిక్స్కు చైనా రాజకీయ రంగు పూస్తున్న తీరుకు ఇది మరో నిదర్శనమని రూబియో విమర్శించారు. భారత దళాలపై దొంగచాటున దాడికి దిగిన సైనిక బృందంలోని అధికారిని టార్చ్బేరర్గా ఎంపిక చేయడం కచ్చితంగా రెచ్చగొట్టే ప్రయత్నమేనని ట్వీట్ చేశారు. ఈ విషయంలో చైనా తీరు సిగ్గుచేటని రిచ్ ట్వీట్ చేశారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు చేసే అన్ని ప్రయత్నాలకూ అమెరికా మద్దతుంటుందన్నారు. 2020 జూన్లో లడఖ్లోని గాల్వాన్ లోయ వద్ద మన దళాలపై చైనా జరిపిన దొంగచాటు దాడిలో పాల్గొన్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారిని శుక్రవారం నాటి ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల టార్చిబేరర్ల బృందంలోకి చైనా ఎంపిక చేయడంపై దుమారం రేగింది. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకలను బహిష్కరించాలని నిర్ణయించింది. దూరదర్శన్ కూడా ప్రారంభ, ముగింపు వేడుకలను ప్రత్యక్షప్రసారం చేయబోదని ప్రసారభారతి వెల్లడించింది. -
కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర పురస్కారం
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో వీర మరణం పొందిన కల్నల్ బిక్కమల్ల సంతోష్బాబుకు(37) మహావీర్చక్ర పురస్కారం లభించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా సంతోష్ భార్య, తల్లి ఈ అవార్డును స్వీకరించారు. కాగా యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు అందజేసే రెండో అత్యున్నత పురస్కారమే మహావీర్ చక్ర. చదవండి: సిద్దిపేట లాల్ కమాన్పై ఉన్నట్టుండి వెలసిన కేసీఆర్ విగ్రహం కాగా భారత్, చైనా సైనికుల మధ్య తూర్పు లద్దాఖ్లోని గాల్వాన్ లోయ ప్రాంతంలో 2020 జూన్ 15వ తేదీ రాత్రి జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది బిహార్ రెజిమెంట్కు చెందినవారు. 16-బిహార్ రెజిమెంట్లో కమాండింగ్ ఆఫీసర్ సంతోష్ బాబు నేతృత్వం వహిస్తున్న దళంతోనే గల్వాన్ లోయలో చైనా సైనికులు ఘర్షణకు దిగారు. సంతోష్ బాబుది తెలంగాణలోని సూర్యాపేట. సంతోష్ 1982లో జన్మించారు. సంతోష్ బాబుకు భార్య మంజుల, కూతురు అభిజ్ఞ, కుమారుడు అనిరుధ్ ఉన్నారు. ఆయన చైనా సరిహద్దుల్లో ఏడాదిన్నరగా విధుల్లో ఉన్నారు. -
సరిహద్దులో చైనా దూకుడు!
న్యూఢిల్లీ: భారత్తో సరిహద్దు వెంట చైనా పెద్ద ఎత్తున సైనికులను మోహరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సైనికుల కోసం కొత్తగా శిబిరాలను ఏర్పాటుచేస్తోంది. తూర్పు లద్దాఖ్లో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో కంటైనర్ ఆధారిత స్థావరాలను నిర్మిస్తోంది. తషిగాంగ్, మాంజా, హాట్ స్ప్రింగ్స్, చురుప్సహా మరి కొన్ని ప్రాంతాల్లో వీటిని సిద్ధంచేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సైనిక మోహరింపుతోపాటు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్లో సరిహద్దు వెంట గతంలో ఎన్నడూ తాము వినియోగించని భూభాగాల్లోనూ సైన్యాన్ని మోహరించాలని యోచిస్తోంది. గల్వాన్ ఘర్షణల తర్వాత మరిన్ని ‘ఫార్వర్డ్’ ప్రాంతాల్లో తమ సైన్యాన్ని మోహరించనుంది. ‘ గతంలో దిష్టవేయని సముద్ర మట్టానికి అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో ఉండటమనేది చైనా సైనికులకు కష్టమైన పని. చైనా సేనలకు కొత్త కష్టం వచ్చి పడింది’ అని భారత సైన్యానికి సంబంధించిన ఒక అధికారి వ్యాఖ్యానించారు. భారత్ సైతం చైనాకు ధీటుగా స్పందిస్తోంది. -
సరిహద్దు ఉద్రిక్తత: 50 వేల అదనపు బలగాల మోహరింపు
న్యూఢిల్లీ: గల్వాన్ ఘర్షణ అనంతరం భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో ఎన్నడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వం చైనా సరిహద్దు వెంబడి సుమారు 50వేల అదనపు బలగాలను మోహరించినట్లు సమాచారం. బ్లూంబర్గ్ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత కొద్ది నెలలుగా చైనా సరిహద్దు వెంబడి మూడు ప్రాంతాలకు దళాలను, స్క్వాడ్రాన్ ఫైటర్ జెట్లను చేరవేసినట్లు తెలిపింది. గతేడాదితో పోల్చుకుంటే.. ఇండియా ఈ ఏడాది 40 శాతం అదనంగా అనగా 20 వేల దళాలలను సరిహద్దులో మోహరించినట్లు నివేదిక వెల్లడించింది. గతేడాది తూర్పు లద్ధాఖ్లో నెలకొన్న ఘర్షణల తర్వాత కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ లోయ నుంచి అత్యుత్తన్న శిఖర ప్రాంతాలకు సైనికులను చేరవేయడం కోసం ఎక్కువ సంఖ్యలో హెలికాప్టర్లతో పాటు ఎం777 హోయిట్జర్ వంటి అత్యాధునిక ఆయుధాలను తరలించిందని బ్లూమ్బర్గ్ నివేదిక పేర్కొంది. ఇక భారత సరిహద్దు సమీపంలో చైనా ఇప్పటివరకు ఎన్ని దళాలను మోహరించిందో స్పష్టంగా తెలియదు. కానీ హిమాలయాల వెంబడి వివాదాస్పద ప్రాంతాలలో పెట్రోలింగ్ బాధ్యత వహించే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఇటీవల టిబెట్ నుంచి జిన్జియాంగ్ మిలిటరీ కమాండ్కు అదనపు బలగాలను తరలించినట్లు తెలిసింది. చదవండి: శాంతి బోధకులమే కానీ, మా జోలికొస్తే ఊరుకోం.. -
ఆ వ్యూహం మా దగ్గర పని చేయదు: నరవాణే
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు ముగింపు దశకు చేరుకున్నాయి. వాస్తవాధీన రేఖ వద్ద భారత్–చైనా సైనిక బలగాలను ఉపసంహరించుకున్నాయి. ఈ క్రమంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎం ఎం నరవాణే బలగాల ఉపసంహరణ ఇరు దేశాల సమిష్టి విజయం అన్నారు. అంతేకాక దళాల తొలగింపు, విస్తరణ వంటి తదుపరి చర్యలకు చాలా సమయం పడుతుందన్నారు. లద్దాఖ్ ఉద్రిక్తతల సమయంలో చైనా, పాకిస్తాన్ల మధ్య బహిరంగ కలయిక సంకేతాలు లేవని స్పష్టం చేశారు నరవాణే. కానీ ఇండియా మాత్రం ఈ రెండు ప్రధాన శత్రువులతో పాటు అంతర్గత భద్రత అనే మరో సగం సమస్యను ఎదుర్కొవడానికి సిద్దంగా ఉందని.. ఈ మేరకు ఈ రెండున్నర శత్రువులతో తలపడేందుకు దీర్ఘకాలిక వ్యూహ రచన చేస్తోందని వెల్లడించారు. దళాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత మరికొన్ని అంశాల మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు నరవాణే. "మనం ఏమి చేస్తున్నామో, దాని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మేం ఎల్లవేళలా గుర్తుంచుకుంటాము. మేము చాలా జాగ్రత్తగా ఉంటాము. ఇరు దేశాల మధ్య విశ్వాస లోపం ఉంది. దాన్ని తొలగించే వరకు మే చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎల్ఏసీ వద్ద ఇరువైపులా జరిగే ప్రతి కదలికను జాగ్రత్తగా గనిస్తాం’’ అని తెలిపారు నరవాణే. సరిహద్దు వివాదాల సమస్యలకు హింస ఎన్నటికి పరిష్కారం కాదన్నారు నరవాణే. చైనాకు ప్రారంభం నుంచి ముందుకు పాకే అలవాటు ఉందని.. దాని వల్ల కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి అన్నారు నరవాణే. అయితే ప్రతి మార్పుకు సంబంధించి ఎక్కువగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఇక దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ అనుసరించిన వ్యూహం భారత్తో పని చేయదని స్పష్టం చేశారు. ఇక ఉద్రికత్తలు ప్రారంభమైన నాటి నుంచి ప్రభుత్వం, ఆర్మీ అందరు కలిసి సమిష్టిగా పని చేశారని.. వాటి ఫలితమే ఈ రోజు మనం చూస్తున్న బలగాల ఉపసంహరణ అన్నారు నరవాణే. చదవండి: భారత్-చైనా యుద్ధం కాస్తలో తప్పింది..! తూర్పు లద్దాఖ్ నుంచి వెనక్కి మళ్లుదాం -
తూర్పు లద్దాఖ్ నుంచి వెనక్కి మళ్లుదాం
న్యూఢిల్లీ: పాంగాంగ్ సరస్సు నుంచి బలగాల ఉపసంహరణ పూర్తి కావడంతో తూర్పు లద్దాఖ్లోని హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, డెస్పాంగ్పై భారత్, చైనా ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఆయా ప్రాంతాల్లో విధుల్లో ఉన్న బలగాలను వెనక్కి తీసుకోవడంపై ఇరు దేశాలు సంప్రదింపులు ప్రారంభించాయి. భారత్, చైనా మధ్య పదో దఫా కమాండర్ స్థాయి చర్చలు శనివారం ఎల్ఏసీ వద్ద మోల్డో బోర్డర్ పాయింట్లో జరిగాయి. ఉదయం 10 గంటలకు మొదలైన ఈ సంప్రదింపులు రాత్రి 9.45 గంటల వరకు కొనసాగాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల సైనిక అధికారులు హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, డెస్పాంగ్ నుంచి బలగాల ఉపసంహరణపైనే ప్రధానంగా చర్చించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా ఈ ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై అభిప్రాయాలు పంచుకున్నారు. సైనిక బలగాలను వెనక్కి మళ్లించే ప్రక్రియ చాలా వేగంగా జరగాలని భారత్ నొక్కి చెప్పింది. చైనా కూడా అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
గల్వాన్ ఘర్షణ: వీడియో విడుదల చేసిన చైనా
బీజింగ్: భారత్-చైనా మధ్య గత 10 నెలలుగా తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగిన సంగతి తెలిసిందే. పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి ఇరు దేశాల బలగాలను మోహరించాయి. పలు దఫాల చర్చల అనంతరం ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్నాయి. ఈ క్రమంలో చైనా గతేడాది జరిగిన గల్వాన్ ఘర్షణలో తమ సైనికులు కేవలం నలుగురు చనిపోయినట్లు అధికారికంగా వెల్లడించింది. వారి త్యాగాలను స్మరించుకుంటూ సెంట్రల్ మిలటరీ కమిషన్ ఆఫ్ చైనా వారికి మరణానంతరం శౌర్య పురస్కారలను ప్రదానం చేయనున్నట్లు ఎల్ఏసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా 2020 జూన్లో గల్వాన్ లోయలో భారత, చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణ వీడియో ఫుటేజ్ను చైనా ప్రభుత్వ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ విడుదల చేసింది. అప్పుడు జరిగిన ఘర్షణల్లో భారత సైన్యానికి చెందిన 20 మంది సైనికులు చనిపోయారు. ఈ గొడవల్లో తమ సైనికులు నలుగురు చనిపోయారని చైనా అంగీకరించింది. చైనా తరఫున విడుదలైన ఈ వీడియోలో చనిపోయిన నలుగురు సైనికులకు చైనా ఆర్మీ గౌరవ వందనం చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియోలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ, ఇరు సైన్యాల అధికారులు మాట్లాడుకోవడం కూడా కనిపిస్తుంది. ఈ వీడియోలో చైనా పరోక్షంగా భారత్ను ఉద్దేశిస్తూ ‘‘ఏప్రిల్ నుంచి విదేశీ శక్తులు పాత ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నాయి. వంతెనలు, రోడ్డు వేయడం కోసం వాళ్లు సరిహద్దును దాటారు. త్వరత్వరగా నిఘా పూర్తి చేశారు" అని ఆరోపించింది. "విదేశీ శక్తులు యధాతథ స్థితిలో మార్పు తెచ్చేందుకు ఏకపక్షంగా ప్రయత్నించారు. ఫలితంగా సరిహద్దుల్లో వేగంగా ఉద్రిక్తతలు పెరిగాయి, ఒప్పందాలను గౌరవిస్తూ మేం చర్చల ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని ప్రయత్నించడానికి చూశాం’’ అని పేర్కొంది. ఈ వీడియో ఫుటేజిలో భారత, చైనా సైనికులు రాత్రి చీకట్లో ఒకరిపై ఒకరు కాల్పులు జరపడం కనిపిస్తోంది. అందులో చైనా సైనికులు గాయపడ్డ తమ సైనికుడిని తీసుకెళ్లడం కూడా ఉంది. అందులోనే చనిపోయిన తమ సైనికులకు చైనా ఆర్మీ గౌరవ వందనం చేయడం కూడా వీడియోలో కనిపిస్తుంది. మా సైనికులు చనిపోయారు: చైనా అంతకు ముందు చైనా ఆర్మీ అధికారిక పత్రిక పీఎల్ఏ డెయిలీని ప్రకారం ఒక వార్త ప్రచురించిన గ్లోబల్ టైమ్స్ "చైనా తన సార్వభౌమత్వాన్ని రక్షించుకోడానికి త్యాగాలు చేసిన సైనికులకు నివాళిగా వారి పేర్లు, వివరాలను మొదటిసారి వెల్లడించింది" అని తెలిపింది. కారాకోరమ్ పర్వతాల్లో చైనా సైన్యంలోని నలుగురు అధికారులు, సైనికులను చైనా సెంట్రల్ మిలిట్రీ కమిషన్ గుర్తించిందని వారిని తగిన పదవులతో సత్కరిస్తామని పీఎల్ఏ డెయిలీ శుక్రవారం తన రిపోర్ట్లో చెప్పుకొచ్చింది. ఆ రిపోర్టులో చైనా ఆర్మీ మొదటిసారి గల్వాన్ ఘర్షణ గురించి వివరణాత్మక కథనం ఇచ్చింది. "భారత సైన్యం అక్కడికి పెద్ద సంఖ్యలో సైనికులను పంపించింది. వారంతా దాక్కున్నారు. చైనా సైన్యం వెనక్కు వెళ్లేలా బలవంతం చేశారు అని చెప్పింది. ఆ దాడుల సమయంలో చైనా సైనికులు స్టీల్ రాడ్లు, మేకులు ఉన్న రాడ్లు, రాళ్లతో తమ సౌర్వభౌమాధికారాన్ని ఎలా రక్షించుకున్నారో కూడా చైనా ఆర్మీ ఆ రిపోర్టులో వెల్లడించింది. చదవండి: భారత్-చైనా యుద్ధం కాస్తలో తప్పింది..! గల్వాన్ ఘటన: తొలిసారి వివరాలు వెల్లడించిన చైనా -
భారత్-చైనా యుద్ధం కాస్తలో తప్పింది..!
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లో భారత్-చైనాల మధ్య గత తొమ్మిది నెలలుగా తీవ్ర ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. సరిహద్దు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పలు దఫాలుగా చర్చలు నడిచాయి. తాజాగా సరిహద్దులో ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్నాయి. గతేడాది జూన్లో ఇరు దేశాల మధ్య మొదలైన ప్రతిష్టంభన ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. అయితే ఈ తొమ్మిది నెలల కాలంలో సరిహద్దులో ఇరు దేశాల మధ్య కొన్ని సార్లు యుద్ధ వాతావరణం నెలకొన్నదని.. ఒకానొక సమయంలో ఇక యుద్ధ భేరి మోగించడమే తరువాయి అనే పరిస్థితులు తలెత్తాయి అని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి తెలిపారు. ఈ సందర్భంగా వైకే జోషి మాట్లాడుతూ.. ‘‘గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య ఎర్ర గీత గీశారు. దీని తర్వాత కేంద్రం మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. డ్రాగన్ తోక జాడిస్తే.. దాన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి ఆపరేషన్ అయినా చేపట్టవచ్చని మాకు ఆదేశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో గతేడాది ఆగస్టు 29, 30న మన సైన్యం దక్షిణాన ఉన్న కైలాష్ రేంజ్ శిఖరాలను స్వాధీనం చేసుకుంది. ఈ చర్యలను చైనా ఏ మాత్రం ఊహించలేకపోయింది.. సహించలేకపోయింది. దీనికి ప్రతీకారంగా కౌంటర్ ఆపరేషన్ మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఆగస్టు 31న పీఎల్ఏ దళాలు మనకు అతి సమీపంలోకి వచ్చాయి. పరిస్థితి చూస్తే ఏ క్షణంలోనైనా యుద్ధం తప్పదన్నట్లుగా ఉంది’’ అన్నారు. ‘‘ఇక ఇటువైపు మన ట్యాంక్ మ్యాన్, గన్నర్, రాకెట్ లాంచర్ అందరూ సిద్ధంగా ఉన్నారు. ట్రిగ్గర్ వదిలితే చాలు.. దీనికి ధైర్యంతో పని లేదు. ఇక్కడ అత్యంత కష్టమైన పని ఏంటంటే కాల్పులు జరగకుండా చూడటం.. రక్తం చిందకుండా.. ప్రాణాలు కోల్పోకుండా చూడటం. ఈ పరిస్థితి తలెత్తకుండా చూడాలంటే ఎంతో ధైర్యం కావాలి. మాకు స్పష్టంగా అర్థం అవుతుంది యుద్ధం చేసే సందర్భం వచ్చిందని. మన జవాన్లు చాలా నిబద్ధతతో వ్యవహరించారు. మొత్తానికి డ్రాగన్ను కట్టడి చేయగలిగాం. యుద్ధం తప్పించగలిగాం’’ అని నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు’’ వైకే జోషి. 45 మంది చనిపోయి ఉండొచ్చు గల్వాన్ ఘర్షణ సందర్భంగా 45 మంది చైనా జవాన్లు మరణించారని ఓ రష్యన్ ఏజెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. జోషి కూడా నేరుగా నంబర్ చెప్పకపోయినా.. అదే అయి ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. చైనా వైపు చనిపోయిన వాళ్ల గురించి మన ఆర్మీ నుంచి ఇలాంటి ప్రకటన రావడం ఇదే తొలిసారి. ‘‘గల్వాన్ ఘర్షణలో ఎంత మంది మరణించి ఉంటారనే దాని గురించి నేను ఎలాంటి అంచనా వేయను. కానీ ఆ ఘటన జరిగినప్పుడు మా వైపు ఆబ్జర్వేషన్ పోస్ట్లు ఉన్నాయి. చాలా మందిని స్ట్రెచర్లలో తీసుకెళ్లడం కనిపించింది. 60మందికి పైగానే ఇలా తీసుకెళ్లారు. అందులో అందరూ చనిపోయారా లేదా తెలియదు. రష్యన్ ఏజెన్సీ చెప్పినట్లు మరణించిన చైనా సైనికుల సంఖ్య 45 లేదా అంతకంటే ఎక్కువే ఉండొచ్చు’’ అన్నారు జోషి. చైనాకు కార్గిల్ హీరో సలహా కార్గిల్ యుద్ధ హీరో అయిన జోషి.. తన కెరీర్లో చాలా వరకూ లద్ధాఖ్ శిఖరాల్లోనే గడిపారు. ఆయనకు చైనా భాష మాండరిన్ చాలా బాగా తెలుసు. ఇక గల్వాన్ ఘర్షణ వల్ల చైనాకు చెడ్డపేరు రావడం తప్ప వాళ్లు సాధించింది ఏమీ లేదన్నారు జోషి. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రముఖ మాండరిన్ సామెతను గుర్తు చేసుకున్నారు. ‘‘దూరంగా ఉన్న బంధువు, దగ్గరగా ఉన్న పొరుగువారు ఎప్పటికీ సమానం కారు’’ అనే సామెత చెప్పారు. అంటే పొరుగు వాళ్లతో మంచి సంబంధాలు నెలకొల్పడం ముఖ్యం కానీ.. దూరంగా ఉన్న బంధువుపై ఆధారపడటం సరికాదు అని దీని అర్థం అన్నారు జోషి. ఇదే సామెతను తాను చైనాకు చెబుతానని అన్నారు. ‘‘మేము(భారత్) వాళ్లతో మంచి పొరుగువారిగా ఉంటాము కానీ రెండు వైపులా ఆ నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకాన్ని కలిగించే బాధ్యత ఇప్పుడు చైనాపైనే ఉంది’’ అని జోషి స్పష్టం చేశారు. చదవండి: మాటకి కట్టుబడి వెనుదిరిగిన చైనా సైన్యం గల్వాన్ ఘర్షణపై సంచలన విషయాలు బహిర్గతం.. -
హర్షించదగ్గ పరిణామం
భారత్–చైనాల మధ్య వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద సరిహద్దు తగాదా మొదలై పది నెలలు కావస్తుండగా ఇరు దేశాలూ వివాదం తలెత్తిన ప్రాంతాల్లోవున్న తమ తమ దళాలను వెనక్కి పిలవాలని నిర్ణయించుకున్నాయి. ఈ విషయంలో ఒప్పందం కుదిరిందని గురువారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. వివాదాలపై పరస్పరం చర్చించుకోవటం, సామరస్యంగా పరిష్కరించుకోవటం మంచిదే. ఘర్షణ వాతావరణం దీర్ఘకాలం కొనసాగితే ఏదో ఒకరోజు అది కట్టుదాటే ప్రమాదం వుంటుంది. అయితే వైరి పక్షాలు హేతుబద్ధంగా వాదనలు వినిపించాలి. వాస్తవాలను అంగీకరించాలి. అప్పుడే ఆ చర్చలు ఫలవంతమవుతాయి. గత నెలలో అరుణాచల్ ప్రదేశ్కు అయిదు కిలోమీటర్ల దూరంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో హఠాత్తుగా మూడు గ్రామాలు వెలిశాయి. ఒకపక్క లద్దాఖ్లో రేగిన వివాదం గురించి అంతకు ఏడెనిమిది నెలల ముందు నుంచీ సైనిక కమాండర్ల స్థాయి చర్చలు జరుగుతున్నాయి. మన దేశం తన వాదనకు మద్దతుగా పాత, కొత్త ఉపగ్రహ ఛాయా చిత్రాలను చైనాకు ఇచ్చింది. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు కూడా మాట్లాడుకున్నారు. అయినా చైనా వెనక్కు తగ్గిన దాఖలా కనబడలేదు. సరిగదా... రెచ్చ గొట్టేవిధంగా గ్రామాలే నిర్మించింది. పొరుగు దేశాన్ని రెచ్చగొట్టి, దాంతో గిల్లికజ్జాలు పెట్టు కోవాలన్న ఉద్దేశం తప్ప ఇందులో వేరే పరమార్థం కనబడదు. ఎందుకంటే చైనా ఆక్రమణలో వున్న ప్రాంతం... ప్రత్యేకించి కొత్తగా వెలిసిన గ్రామాలున్న ప్రాంతం సాధారణ జన జీవనానికి పనికొచ్చేది కాదు. దశాబ్దాలుగా అక్కడ లాంఛనంగా కొనసాగే సైనిక దళాల గస్తీ తప్ప మరేమీ లేదు. 3,440 కిలోమీటర్ల నిడివున్న ఎల్ఏసీ వద్ద ఇరు దేశాల మధ్యా ఇంతవరకూ సరిహద్దులు ఖరారు కాలేదు. అందుకే అక్కడక్కడ తమ దళాలను అవి వున్న చోటు నుంచి ముందుకు తోయటం... ఆ ప్రాంతం తనదేనని వాదనకు దిగటం చైనాకు అలవాటుగా మారింది. వెనక్కి వెళ్లాలని కోరినా కదలకపోవటం రివాజైంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ తీరువల్ల మనదైన 38,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఇప్పుడు చైనా దురాక్రమణలో వున్నదని సైనిక నిపుణులు చెబుతున్నారు. ఇందుకు ప్రతిగా చైనా ఏకంగా తమకు చెందిన 90,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం భారత్ స్వాధీనంలో వున్నదని చెప్పుకుంటోంది. ఇరు దేశాల మధ్యా 1962లో జరిగిన యుద్ధం తర్వాత చాన్నాళ్లు దౌత్య, వాణిజ్య సంబంధాలు నిలిచిపోయాయి. పొరపొచ్చాలకు సరిహద్దు తగాదా కారణమన్న అభిప్రాయం అందరికీ కలుగుతున్నా, నిజానికి అంతకన్నా లోతైన సమస్యలున్నాయని తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఒకసారి అన్నారు. ఆసియాలో రెండూ రెండు పెద్ద దేశాలు కావటంతో... అంత ర్జాతీయంగా తమను అవతలి పక్షం అధిగమిస్తుందేమోనన్న శంకతోనే చైనా ఈ వృధా వివాదాన్ని పదే పదే తెరపైకి తెస్తోందని ఆయన అభిప్రాయం. ఏమైతేనేం చైనాలో డెంగ్ జియావో పెంగ్ పెత్తనం వచ్చాక రెండు దేశాల మధ్యా స్నేహపూర్వక భేటీలుగా మొదలై దౌత్య సంబంధాల వరకూ వచ్చాయి. వివాదాలను ఒకపక్క చర్చించుకుంటూనే, వాటి పర్యవసానాలతో సంబంధం లేకుండా వాణిజ్య సంబంధాలను నెలకొల్పుకుందామన్న ప్రతిపాదన చైనాయే చేసింది. అందుకు మన దేశం కూడా అంగీకరించింది. వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలు పెరగవలసినంతగా పెరగ కపోయినా క్రమేపీ మెరుగుపడుతున్న సూచనలైతే కనబడేవి. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చాక చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ రెండుసార్లు ఇక్కడికి రావటం, మోదీ అక్కడకు వెళ్లటం జరిగాయి. బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్(బీఆర్ఐ) పేరిట బృహత్తరమైన ఆధునిక సిల్క్ రూట్ను నిర్మించి సెంట్రల్ ఆసియా, యూరప్, ఆఫ్రికాలతో పటిష్టమైన వాణిజ్య బంధాన్ని ఏర్పర్చుకోవాలన్న చైనా ప్రతిపాదనకు మన దేశం పెద్దగా సుముఖత చూపలేదు. బీఆర్ఐలో భాగంగా నిర్మించ తలపెట్టిన చైనా–పాక్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టులో ఆక్రమిత కశ్మీర్ భూభాగం వుండటం అందుకు ఒక కారణం. మరోపక్క అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో మన దేశానికి బల పడుతున్న బంధం... దాని పర్యవసానంగా రూపుదిద్దుకుంటున్న క్వాడ్ తనకు వ్యతిరేకంగా ఎక్కు పెట్టిందే నన్న శంక చైనాకుంది. వీటన్నిటివల్లా సరిహద్దుల్లో మనల్ని చికాకు పరిచేందుకు చైనా ప్రయ త్నించింది. ఏమైతేనేం ఇరు దేశాల మధ్యా ఇప్పటికి ఎనిమిది దఫాలు చర్చలు జరిగాయి. గతంలో వేరే దేశాలతో వున్న తగాదాల విషయంలో వ్యవహరించిన తీరుకు భిన్నంగా చైనా వెనక్కి తగ్గటం సంతోషించదగ్గదే. అయితే గత అనుభవాలరీత్యా మన దేశం జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు. నిరుడు జూన్లో ఎల్ఏసీ వద్ద గల్వాన్ లోయలో చొరబడి, ఆ తర్వాత రెండు పక్షాలూ వెనక్కి తగ్గాలన్న అవగాహన కుదిరాక హఠాత్తుగా దాడికి తెగబడి కల్నల్ సంతోష్బాబుతో సహా 20 మంది భారత జవాన్ల ప్రాణాలు బలితీసుకున్న ఉదంతాన్ని మరిచిపోలేం. ప్యాంగాంగ్ సో సరస్సు ప్రాంతం నుంచి బలగాల ఉపసంహరణ సజావుగా ముగిసి, అక్కడ ఉద్రిక్తతలు సడలాలని కోరుకుంటూనే సమస్యాత్మకంగా వున్న ఇతర ప్రాంతాల విషయంలో కూడా చర్చలు ఫలించి, సాధ్యమైనంత త్వరగా యధాపూర్వ స్థితి ఏర్పడాలని ఆశించాలి. ఈ మొత్తం వ్యవహారంలో చైనా తన తీరు తెన్నులను సమీక్షించుకుని లోటుపాట్లను సరిదిద్దుకోవాలి. -
చైనా వక్రబుద్ధి: భారత జవాన్లకు గాయాలు
గ్యాంగ్టక్: సందు దొరికితే చాలు భారత భూభాగంలో చొచ్చుకొచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది చైనా. కన్ను మూసి తెరిచేలోగా దొరికిన కాడికి దోచుకునేందుకు గుంటనక్కలా కాచుకుని కూర్చుంటుంది. భారత సైన్యం ఎన్నిసార్లు హెచ్చరించినా డ్రాగన్ ఆర్మీ తన వక్రబుద్ధిని పోనిచ్చుకోలేదు. తాజాగా చైనా సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా అలర్ట్ అయిన భారత సైనికులు వారిని వెనక్కు వెళ్లగొట్టి డ్రాగన్ తోక ముడిచేలా చేశారు. గతవారం సిక్కింలోని నాకులా లోయలో సుమారు 20 మంది చైనా సైనికులు సరిహద్దు దాటి రహస్యంగా భారత్లోకి వచ్చేందుకు కుట్ర పన్నారు. వీరి ఎత్తుగడ అర్థమైన జవాన్లు వెంటనే వారిని వెళ్లిపొమ్మని హెచ్చరించారు. మాట చెవికెక్కించుకోని డ్రాగన్ ఆర్మీ ఆయుధాలు బయటకు తీసింది. (చదవండి: 63 సంవత్సరాల మహిళకు 43 ఏళ్ల జైలు శిక్ష..!) ఈ క్రమంలో భారత్-చైనా సైనికుల మధ్య మరోసారి ఘర్షణ జరగ్గా సైనికులు ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు. ఈ దాడిలో నలుగురు భారత జవాన్లు గాయాలపాలయ్యారు. పైగా అక్కడి వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ తీవ్రంగా పోరాడిన సైనికులు వారిని విజయవంతంగా వెనక్కు వెళ్లగొట్టారు. జనవరి 20న జరిగిన ఈ ఘర్షణ లోకల్ కమాండర్ల చర్చలతో సద్దుమణిగిందని ఇండియన్ ఆర్మీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా భారత్- చైనా ఆర్మీ అధికారులు సమావేశమైన మరుసటి రోజే ఈ ఘర్షణ జరగడం గమనార్హం. గతేడాది జూన్ 15న కూడా లద్దాఖ్లోని గల్వాన్ లోయలో భారత్-చైనా మధ్య ఘర్షణ తలెత్తగా.. 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. (చదవండి: బలగాల మోహరింపు.. ఒప్పందానికి చైనా తూట్లు) -
చైనాకు గట్టి కౌంటరిచ్చిన భారత్..!
న్యూఢిల్లీ : చైనా పౌరులను భారత్ విమానాల్లోకి అనుమతించవద్దని అన్ని విమానయాన సంస్థలను కేంద్రం అనధికారికంగా కోరింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనధికారిక ఆదేశాన్ని అందుకున్నట్లు విమానయాన వర్గాలు ధృవీకరించాయి. కాగా గతంలో కరోనా వైరస్ వ్యాప్తిస్తున్న తరుణంలో భారత్ చైనాతో విమాన సర్వీసులను నిలిపివేసింది. అయితే కరోనా లాక్డౌన్ తర్వాత అంతర్జాతీయ విమాన ప్రయాణాల కోసం పలు దేశాలతో భారత్ 2ఎయిర్ బబూల్స్’ తెరచడంతో ఆ దేశాల్లో నివసించే చైనా పౌరులు వ్యాపార, ఉద్యోగ పనుల కోసం భారత్ రావడానికి అవకాశం ఏర్పడింది. దీంతో చైనా పౌరులు భారతదేశంతో ఎయిర్ బబుల్ ఉన్న దేశాల ద్వారా పర్యాటక వీసాలను మినహాయించి నిర్దిష్ట రకాల వీసాలపై ఇండియకు రాకపోకలను కొనసాగిస్తున్నారు. నవంబర్ నుంచి భారత పౌరులను తమ దేశంలోకి ప్రవేశించకుండా చైనా కూడా నిషేధం విధించింది. కరోనా కారణంగా భారత్ సహా విదేశీ పౌరులకు వీసాలను నిలిపివేస్తూ అప్పటికే మంజూరు చేసిన వాటిని రద్దుచేసింది. ‘చైనా రాయబార కార్యాలయం / కాన్సులేట్లలో పైన పేర్కొన్న వర్గాలకు వీసా లేదా నివాస అనుమతులకు సంబంధించి ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయబోం’ అని భారత్లోని చైనా రాయబార కార్యాలయం నవంబర్ 5న తన వెబ్సైట్లో పేర్కొంది. చదవండి: 2021 నుంచి అయినా ఫిట్గా ఉందాం : రాష్ట్రపతి మరో వైపు చైనా పౌరులు తమ విమానాల్లో భారత్లోకి ప్రయాణించవద్దని గతవారం రోజులుగా స్వదేశీ, విదేశీ విమానయాన సంస్థలు చెబుతున్నాయి. టూరిస్ట్ వీసాలను తాత్కాలికంగా రద్దు చేయగా.. వ్యాపార, ఇతర విభాగాలకు చెందిన విదేశీ వ్యక్తులను నాన్-టూరిస్ట్ వీసాలపై అనుమతిస్తోంది. ఐరోపాలోని ఎయిర్ బబూల్స్ దేశాల నుంచి చాలా మంది చైనీయులు భారత్కు వస్తున్నట్టు విమానయా సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం భారత్కు టిక్కెట్లు బుక్ చేసుకున్న చైనా పౌరులకు బోర్డింగ్ నిరాకరించడానికి కారణం చెప్పడానికి తమకు లిఖితపూర్వకంగా ఏదో ఒక ఉత్తర్వులు ఇవ్వాలని కొన్ని విమానయాన సంస్థలు అధికారులను కోరుతున్నాయి. అయితే ఇటీవల చైనాలోని వివిధ ఓడరేవులలో భారతీయులు చిక్కుకున్నప్పుడు, వారిని తమ తీరంలో దిగడానికి చైనా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో అంతర్జాతీయ వాణిజ్య ఓడల్లో పనిచేస్తున్న దాదాపు 1,500 మంది భారతీయ సిబ్బంది స్వదేశానికి చేరుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో చైనా పాల్పడుతున్న చర్యలకు ధీటుగా సమాధానం చెప్పాలని భావిస్తోన్న భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: దేశంలో విస్తరిస్తున్న కొత్తరకం కరోనా -
పథకం ప్రకారమే గల్వాన్ ఘర్షణలు
న్యూఢిల్లీ: భారత్ను లక్ష్యంగా చేసుకొని చైనా చేసే కుట్రలు, కుతంత్రాలు మరోసారి బట్టబయలయ్యాయి. గత జూన్లో భారత్కు చెందిన 20 మంది సైనికుల్ని బలి తీసుకున్న గల్వాన్ ఘర్షణల్ని డ్రాగన్ దేశం పక్కాగా కుట్ర పన్ని పాల్పడినట్టుగా అమెరికా–చైనా ఆర్థిక, భద్రత రివ్యూ కమిషన్ అమెరికన్ కాంగ్రెస్కి సమర్పించిన నివేదికలో వెల్లడించింది. దీనికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది. భారత్, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు గత కొన్ని దశాబ్దాలుగా సరిహద్దుల్లో నెలకొన్న అత్యంత తీవ్రమైన సంక్షోభాల్లో ఒకటిగా అభివర్ణించింది. లద్దాఖ్లోని గల్వాన్ లోయలో జూన్ 15న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ), భారత సైనికుల మ««ధ్య హోరాహోరీ జరిగిన పోరులో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోతే, చైనా తరఫున ఎంత ప్రాణ నష్టం జరిగిందో డ్రాగన్ దేశం ఇప్పటికీ వెల్లడించలేదు. చైనా ఒక పథకం ప్రకారమే సరిహద్దుల్లో భారత్తో కయ్యానికి కాలు దువ్విందని ఆ నివేదిక స్పష్టం చేసింది. వారాల ముందు నుంచే... గల్వాన్ ఘర్షణలకు కొద్ది వారాల ముందే చైనా రక్షణ మంత్రి తమ సైన్యం సరిహద్దుల్లో ఘర్షణలకు దిగేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకే చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్.. అమెరికా, చైనా మధ్య జరిగే పోరులో భారత్ కల్పించుకుంటే చైనాతో ఆర్థిక, వాణిజ్య బంధాలు తెగిపోతాయని హెచ్చరించింది. ఘర్షణకు ముందే చైనా ఆర్మీకి చెందిన వెయ్యి మంది సైనికులు గల్వాన్ లోయను చుట్టుముట్టడం శాటిలైట్ ఇమేజ్లో కనిపించింది. భారీగా ఆయు«ధాల మోహరింపు దృశ్యాలు కూడా ఆ చిత్రాల్లో కనిపించాయని ఆ నివేదిక ప్రస్తావించింది. -
చైనాతో ఉద్రిక్తతలకు చెక్!
న్యూఢిల్లీ: భారత్–చైనాల సరిహద్దుల్లో 6 నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభన త్వరలోనే ముగింపునకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్రిక్తతలను తొలగించుకునే క్రమంలో ఇరు దేశాల సైనికాధికారులు ఇప్పటి వరకు 8 దఫాలుగా చర్చలు జరిపారు. వారం క్రితం కోర్ కమాండర్ల స్థాయిలో జరిగిన 8వ విడత చర్చల్లో సరిహద్దుల్లో శాంతి స్థాపన సాధన దిశగా కీలక ముందడుగు పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీటిపై త్వరలోనే జరిగే 9వ విడత కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల సందర్భంగా సంతకాలు జరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగా, ఘర్షణాత్మక ప్రాంతాల్లో మోహరించిన సైన్యాన్ని, ఆయుధ సామగ్రిని నిర్ణీత కాల వ్యవధిలో మూడు విడతలుగా ఉపసంహరించుకునేందుకు స్థూలంగా ఒక అంగీకారం కుదిరింది. ఇది అమల్లోకి వస్తే వాస్తవ ఆధీన రేఖ(ఎల్ఏసీ) వెంట తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఏప్రిల్ నాటి పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయని బుధవారం అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం మొదటి దశలో ఒప్పందం కుదిరిన మూడు రోజుల్లోనే రోజుకు 30 శాతం చొప్పున బలగాలను రెండు దేశాలు ఉపసంహరించుకోవాలి. -
అరుణాచల్ సరిహద్దులో చైనా కొత్త రైల్వేలైన్
బీజింగ్: సరిహద్దు విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే.. మరోవైపు భారత్ను రెచ్చగొట్టే చర్యలకు చైనా పాల్పడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తోంది. సిచువాన్–టిబెట్ రైల్వే మార్గంలో భాగంగా నైరుతి సిచువాన్ ప్రావిన్స్లోని యాన్ నుంచి టిబెన్లోని లింజీ వరకు ఈ కొత్త లైన్ నిర్మిస్తారు. ఇది సరిగ్గా అరుణాచల్ సరిహద్దు నుంచే వెళ్లనుంది. చదవండి: పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉంది.. ఈ రైల్వే లైన్లో రెండు సొరంగాలు, ఒక బ్రిడ్జి, ఒక విద్యుత్ సరఫరా ప్రాజెక్టు తదితరాలు నిర్మిస్తారు. ఈ మేరకు బిడ్డింగ్ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు చైనా రైల్వే వర్గాలు తెలిపాయి. నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నాయి. సిచువాన్–టిబెట్ రైల్వే లైన్ చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డూలో మొదలవుతుంది. లాసాలో ముగుస్తుంది. ఈ రైల్వేలైన్తో రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం చాలా తగ్గిపోతుంది. చదవండి: చైనా వెళ్లిన భారతీయుల్లో 19 మందికి పాజిటివ్ -
సరిహద్దు సమస్యను గమనిస్తున్నాం!
వాషింగ్టన్: భారత్, చైనా మధ్య జరుగుతున్న సరిహద్దు సమస్యను నిశితంగా గమనిస్తున్నామని, ఈ సమస్య ముదరకూడదని కోరుతున్నామని ట్రంప్ ప్రభుత్వంలో సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. భారత్కు తమ ప్రభుత్వం ఆయుధాల విక్రయాలు, సంయుక్త మిలటరీ విన్యాసాలు, సమాచార పంపిణీలాంటి పలు రూపాల్లో సహకరిస్తోందన్నారు. కేవలం హిమాలయ ప్రాంత సమస్యల విషయంలోనే కాకుండా భారత్కు అన్ని అంశాల్లో తాము సహకరిస్తున్నామని చెప్పారు. లద్దాఖ్ తదితర సరిహద్దు ప్రాంతాల్లో భారత్, చైనా మధ్య టెన్షన్లు పెరిగిన సంగతి తెలిసిందే. ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో అన్ని వ్యవహారాల్లో భారత్ మరింత పాత్ర పోషించాలని తాము భావిస్తున్నట్లు అమెరికా అధికారి చెప్పారు. ఈ ప్రాంతంలో చైనా దూకుడుకు అడ్డుకట్టవేసేందుకు క్వాడ్ పేరిట భారత్, యూఎస్తోపాటు ఆస్ట్రేలియా, జపాన్లు జట్టుకట్టాయి. చైనా ఇటీవల కాలంలో దక్షిణ, తూర్పు సముద్రాల్లో అన్ని పొరుగుదేశాలతో వివాదాలు పడుతోంది. తన ద్వీపాల్లో భారీగా మిలటరీ మోహరింపులు చేస్తోంది. ఈ సముద్ర జలాల్లో యూఎస్కు ఎలాంటి వాటా లేకున్నా, చైనా ఆధిపత్యం పెరగకుండా ఉండేందుకు ఆయా దేశాలకు సాయం చేస్తోంది. చైనాకు సవాలు విసురుతున్నట్లుగా ఈ సముద్ర జలాల్లో అమెరికా వార్షిప్పులు, ఫైటర్ జెట్లను మోహరిస్తోంది. అంతర్జాతీయ స్వేచ్ఛా నౌకాయానానికి భంగం కలగకుండా ఉండేందుకే తాము ఈ జలాల్లో ప్రవేశిస్తున్నామని అమెరికా చెబుతోంది. -
మలబార్ డ్రిల్లో ఆస్ట్రేలియా
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లో భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం రగులుతున్న నేపథ్యంలో ఇదొక అత్యంత కీలక పరిణామం. కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు చెక్ పెట్టడానికి భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ఒక్కతాటిపైకి వస్తున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో నవంబర్లో జరగనున్న మలబార్ విన్యాసాల్లో అమెరికా, జపాన్తోపాటు ఆస్ట్రేలియా పొల్గొంటుందని భారత్ సోమవారం ప్రకటించింది. ఉమ్మడి శత్రువైనా చైనాకు వ్యతిరేకంగా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు చతుర్భుజ కూటమి(క్వాడ్) పేరిట జట్టు కట్టిన సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం జరిగే ఈ విన్యాసాల్లో భారత్, అమెరికా, జపాన్ నావికా దళాలు పాల్గొనడం పరిపాటి. తాజాగా ఇందులో ఆస్ట్రేలియా కూడా చేరింది. క్వాడ్లోని నాలుగు సభ్య దేశాలు సైనిక స్థాయిలో ఒకే వేదికపైకి రానుండడం ఇదే మొదటిసారి. తూర్పు లద్దాఖ్లో భారత్లో చైనా తరచుగా ఘర్షణకు దిగుతున్న నేపథ్యంలో నాలుగు దేశాల డ్రిల్ ప్రాధాన్యం సంతరించుకుంది. దీని ద్వారా చైనాకు బలమైన హెచ్చరికలు పంపినట్లవుతుందని నిపుణులు చెబుతున్నారు. మలబార్ ఎక్సర్సైజ్ ద్వారా నాలుగు దేశాల నావికా దళాల మధ్య సహకారం మరింత పెరుగుతుందని భారత రక్షణశాఖ పేర్కొంది. -
యుద్ధానికి సిద్ధంకండి!
వాషింగ్టన్: భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సైన్యాన్ని యుద్ధానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మీకున్న శక్తియుక్తులన్నింటినీ యుద్ధంపైనే నిమగ్నం చేయండని చైనా ఆర్మీతో జిన్పింగ్ చెప్పినట్టుగా సీఎన్ఎన్ ఒక కథనాన్ని ప్రచురించింది. గాంగ్డాంగ్లో మంగళవారం ఒక సైనిక స్థావరాన్ని సందర్శించిన జిన్పింగ్ అక్కడ సైనికులతో మాట్లాడుతూ దేశం పట్ల విశ్వసనీయంగా వ్యవహరించండంటూ వారికి హితబోధ చేశారు. ‘‘మీకున్న శక్తిని, మేధస్సుని యుద్ధ వ్యూహ రచనపై కేంద్రీకరించండి. అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండండి. యుద్ధానికి సిద్ధంగా ఉండండి ’’అని జిన్పింగ్ చెప్పినట్టుగా సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది. అయితే ఏ దేశంపైన, ఎప్పుడు దండెత్తడానికి జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారన్న దానిపై స్పష్టత లేదు. తూర్పు లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్తో ఉద్రిక్తతలు, అగ్రరాజ్యం అమెరికాతో విభేదాలతో పాటుగా దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి సంబంధించి ఇతర దేశాలతో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) నావికాదళ జవాన్లతో జిన్పింగ్ మాట్లాడారు. మరోవైపు చైనా మీడియా మాత్రం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మరింత బలోపేతం కావడానికి, సైనికుల్లో ఆత్మ విశ్వాసాన్ని నెలకొల్పడానికి జిన్పింగ్ సైనిక స్థావరాన్ని సందర్శించారని చెబుతోంది. ఇప్పటివరకు భారత్, చైనా ఏడు రౌండ్లు చర్చలు జరిగినప్పటికీ ఉద్రిక్తతల నివారణకు చర్యలు అమలు చేయడంలో చైనా వెనుకడుగ వేస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో జిన్పింగ్ నోటి వెంట యుద్ధం ప్రస్తావన తేవడం మరింత ఆందోళనని పెంచుతోంది. -
చర్చలతో చైనా దారికి రాదు
వాషింగ్టన్: భారత్, చైనా మధ్య గత అయిదారు నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతలకు చర్చలతో పరిష్కారం లభించదని అమెరికా అభిప్రాయపడింది. డ్రాగన్ దేశంతో చర్చలు జరిపి ఇక లాభం లేదని భారత్కు హితవు పలికింది. ఇరుదేశాల మధ్యనున్న వాస్తవాధీన రేఖను చైనా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని స్పష్టం చేసింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రియెన్ చైనాతో ఒప్పందాలు, చర్చలు అంటూ కాలయాపన చేయొద్దని, చర్చలతో పరిష్కారం దొరకదన్న విషయాన్ని భారత్ అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా చైనా వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. భారత్ సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉత్తరంగా చైనా 60 వేల మందికి పైగా సైనికుల్ని మోహరించి కయ్యానికి కాలు దువ్వుతోందని అన్నారు. చైనాది దురాక్రమణ బుద్ధి కమ్యూనిస్టు పార్టీ దురాక్రమణ బుద్ధితో భారత్, తైవాన్ దేశాల సరిహద్దుల్ని ఆక్రమించుకోవడానికి కుట్రలు పన్నుతోం దని రాబర్ట్ ఓ బ్రియెన్ అన్నారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తైవాన్ సరిహద్దుల్లో నిరంతరాయంగా సైనిక విన్యాసాలకు దిగుతోందని అన్నారు. చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ (ఓబీఓఆర్) ప్రాజెక్టు కూడా ఇతర దేశాల ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని దెబ్బ తీయడానికేనని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యులైన కంపెనీలకు చైనా బలవంతంగా రుణాలు తీసుకునే పరిస్థితి కల్పిస్తుందని వాటిని చెల్లించలేక అవన్నీ డ్రాగన్ దేశానికి దాసోహం అంటాయని అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కల్పించే మౌలిక సదుపాయాలు అంతిమంగా చైనాకే ప్రయోజనం చేకూరుస్తున్నాయని ఆయన అన్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని భారత్ ఇకనైనా చర్చలతో చైనా దారికి రాదు అన్న విషయాన్ని గ్రహించుకోవాలన్నారు. క్వాడ్ దేశాలకు డ్రాగన్తో ముప్పు డ్రాగన్ దేశం అత్యంత హీనంగా వ్యవహరిస్తూ క్వాడ్ దేశాలకు ముప్పుగా మారిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ సరిహద్దుల్లో 60 వేల మందికి పైగా సైనికుల్ని మోహరించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంద న్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో చైనాకు చెక్ పెట్టడానికి ఇండో పసిఫిక్ దేశాలు అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియా క్వాడ్ గ్రూపుగా ఏర్పడ్డాయి. ఇటీవల ఈ దేశాల విదేశాంగ మంత్రులు టోక్యోలో సమావేశమై చర్చించారు. భారత్ విదేశాంగ మంత్రి జై శంకర్తో ఫలప్రదమైన చర్చలు జరిపానని టోక్యో నుంచి వాషింగ్టన్కు తిరిగి వచ్చిన అనంతరం ఒక టీవీ చానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. -
చైనాకు మరోసారి గట్టి హెచ్చరికలు పంపిన భారత్
-
సయోధ్య దిశగా...
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఉద్రిక్తతల నివారణకు భారత్, చైనా మధ్య బుధవారం జరిగిన మరో దఫా చర్చల్లో ముందడుగు పడింది. ఇరు పక్షాలు అపార్థాలను, అనుమానాలను పక్కన పెట్టి సుస్థిరత నెలకొల్పే దిశగా సామరస్యంగా అడుగులు ముందుకు వేయాలని నిర్ణయించాయి. అయిదు నెలలుగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్ని నివారించడానికి సెప్టెంబర్ 10న మాస్కోలో ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రుల మధ్య కుదిరిన అయిదు అంశాల ఒప్పందం అమలుకు సంబంధించి చర్చలు జరిపారు. సరిహద్దు వ్యవహారాలపై వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (డబ్ల్యూఎంసీసీ) మార్గదర్శకాలకు అమలుకి చేపట్టాల్సిన చర్యలపై ఇరు దేశాలకు చెందిన దౌత్య ప్రతినిధులు ఆన్లైన్ ద్వారా చర్చించారు. వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యాన్ని వెంటనే ఉపసంహరించడం, సరిహద్దు నిర్వహణలో అన్ని ప్రోటోకాల్స్ని పాటించడం, శాంతి స్థాపన వంటి అంశాలపై దృష్టి సారించారు. సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితుల్ని కూడా సమీక్షించారు. ఈ చర్చల అనంతరం విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. -
సరిహద్దుల్లో క్షిపణుల మోహరింపు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, చైనాలు ఆధునిక ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేస్తున్నాయి. 2 వేల కి.మీల వరకు లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను, భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణులను జిన్జియాంగ్, టిబెట్ ప్రాంతాల్లో చైనా మోహరించింది. ప్రతిగా బ్రహ్మోస్, నిర్భయ్, భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల ఆకాశ్ క్షిపణులను భారత్ సిద్ధం చేసింది. బ్రహ్మోస్ది 500 కి.మీల రేంజ్ కాగా, నిర్భయ్ది 800 కి.మీ.ల రేంజ్. 40 కి.మీ.ల దూరంలోని శత్రు లక్ష్యాలను ఆకాశ్ ఛేదించగలదు. చైనా తన ఆయుధ వ్యవస్థలను ఆక్రమిత అక్సాయ్ చిన్ ప్రాంతంలోనే కాకుండా, వాస్తవాధీన రేఖ వెంట కస్ఘర్, హోటన్, లాసా, నింగ్చి.. తదితర ప్రాంతాల్లోనూ మోహరించింది. ఆకాశం నుంచి ఆకాశంలో ఉన్న లక్ష్యాలను, ఆకాశం నుంచి భూమిపైన ఉన్న లక్ష్యాలను ఛేదించగల అత్యంత శక్తివంత బ్రహ్మోస్ క్షిపణి 300 కి.మీ.ల వార్హెడ్ను మోసుకుని వెళ్లగలదు. టిబెట్, జిన్జియాంగ్ల్లోని చైనా వైమానిక స్థావరాలను బ్రహ్మోస్ క్షిపణి లక్ష్యంగా చేసుకోగలదు. లద్దాఖ్ ప్రాంతంలో ఈ క్షిపణులను అవసరమైనంత సంఖ్యలో భారత్ సిద్ధంగా ఉంచింది. ఎస్యూ30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి దీన్ని ప్రయోగించవచ్చు. హిందూ మహా సముద్రంలోని కార్ నికోబార్ ద్వీపంలో ఉన్న భారత వైమానిక కేంద్రం నుంచి కూడా దీన్ని ప్రయోగించే వీలుంది. కార్నికోబార్లోని వైమానిక కేంద్రం నుంచి బ్రహ్మోస్, నిర్భయ్ క్షిపణులను ప్రయోగించి మలక్కా జలసంధి నుంచి లేదా సుందా జలసంధి నుంచి వచ్చే చైనా యుద్ధ నౌకలను సమర్ధంగా ఎదుర్కోవచ్చు. ప్రస్తుతం భారత్ వద్ద నిర్భయ్ క్షిపణుల సంఖ్య పరిమితంగా ఉంది. నిర్భయ్ క్షిపణి భూమిపై నుంచి భూమిపై ఉన్న లక్ష్యాలను మాత్రమే ఛేదించగలదు. లద్దాఖ్ ప్రాంతంలో ఆకాశ్ క్షిపణులను కూడా అవసరమైన సంఖ్యలో భారత్ మోహరించింది. భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను చేధించే ఈ క్షిపణి వాస్తవాధీన రేఖ దాటి వచ్చే చైనా విమానాలను లక్ష్యంగా చేసుకోగలదు. ఆకాశ్ క్షిపణిలోని రాడార్ ఏకకాలంలో 64 లక్ష్యాలను గుర్తించగలదు. అందులో 12 లక్ష్యాలపై దాడి చేయగలదు. ఆకాశంలోనే శత్రుదేశ యుద్ధవిమానాలు, క్రూయిజ్ మిస్సైల్స్, బాలిస్టిక్ మిస్సైల్స్ను కూల్చివేయగలదు. ఈ మధ్యకాలంలో అక్సాయ్చిన్ ప్రాంతంలో చైనా వైమానిక దళ విమానాల కార్యకలాపాలు కొంత తగ్గాయి కానీ, కారాకోరం పాస్ దగ్గరలోని దౌలత్బేగ్ ఓల్డీ ప్రాంతంలో పెరిగాయి. రూ. 2,290 కోట్లతో రక్షణ కొనుగోళ్లు డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ను ఆవిష్కరించిన రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల కోసం రూ. 2,290 కోట్ల విలువైన ఆయుధాలు, ఇతర సాయుధ వ్యవస్థల కొనుగోలు ప్రతిపాదనకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో అమెరికా నుంచి కొనుగోలు చేసే 72 వేల ఎస్ఐజీ సావర్ తుపాకులు ఉన్నాయి. ఆర్మీ కోసం వీటిని రూ. 780 కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రక్షణ శాఖకు చెందిన అత్యున్నత నిర్ణయ మండలి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సోమవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన సమావేశమై ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ రూ. 2,290 కోట్లలో రూ. 970 కోట్లతో నౌకాదళం, వైమానిక దళం కోసం ‘స్మార్ట్ ఎయిర్ఫీల్డ్ వెపన్(ఎస్ఏఏడబ్ల్యూ)’ వ్యవస్థలను కొనుగోలు చేయనున్నారు. ఆర్మీ, ఎయిర్ఫోర్స్ క్షేత్రస్థాయి దళాల మధ్య అడ్డంకులు లేని సమాచార పంపిణీ కోసం రూ. 540 కోట్లతో హెచ్ఎఫ్ రేడియో సెట్స్ను సమకూర్చాలని నిర్ణయించారు. భారత్ను అంతర్జాతీయ మిలటరీ వ్యవస్థల తయారీ కేంద్రంగా మార్చడం, సాయుధ సామగ్రిని సమకూర్చుకోవడంలో అనవసర జాప్యాలను నివారించడం, అత్యవసర కొనుగోలు నిర్ణయాలను త్రివిధ దళాలే సులభమైన విధానం ద్వారా తీసుకునే అవకాశం కల్పించడం.. లక్ష్యాలుగా ‘డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్(డీఏపీ)’ని రాజ్నాథ్ ఆవిష్కరించారు. ఈ కొత్త విధానం ప్రకారం, భారత్లో ఉత్పత్తి చేసే సంస్థలకు డిఫెన్స్ కొనుగోళ్లలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆధునిక సమాచార సాంకేతికతల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలైన డీఆర్డీఓ, డీపీఎస్యూలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని డీఏపీని రూపొందించామని రాజ్నాథ్ చెప్పారు. -
ప్రతికూల వాతావ‘రణ’మైనా రెడీ!
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు చెలరేగుతున్న తూర్పు లద్దాఖ్లో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి భారత్ సమాయత్తమైంది. చైనా కవ్వింపు చర్యల్ని దీటుగా ఎదుర్కోవడానికి గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేని విధంగా భారీగా యుద్ధ ట్యాంకులను, ఇతర సామగ్రిని తరలించింది. వచ్చే నాలుగు నెలలు శీతాకాలంలో ఎత్తయిన పర్వత ప్రాంతమైన లద్దాఖ్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొని ఉంటాయి. అక్టోబర్ నుంచి జనవరి మధ్య కాలంలో చలి మైనస్ 25 డిగ్రీల వరకు వెళుతుంది. ఆ సమయంలో డ్రాగన్ దేశం ఎలాంటి కుయుక్తులు పన్నినా దీటుగా ఎదుర్కోవడానికి ఇండియన్ ఆర్మీ ఈ భారీ తరలింపు ప్రక్రియ చేపట్టింది. యుద్ధ ట్యాంకులు, భారీగా ఆయుధాలు, ఇంధనాన్ని తరలించినట్టు ఆర్మీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. వాటితో పాటు సైనికులకు అవసరమైన ఆహారం దుస్తులు, బూట్లు తదితర సామగ్రిని చేరవేయడం దాదాపుగా పూర్తయింది. ఈ భారీ తరలింపు కసరత్తుని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎంఎం నారవాణే, మరికొందరు కమాండర్లతో బృందంగా ఏర్పడి స్వయంగా పర్యవేక్షించారు. జూలై నుంచి మొదలు పెట్టిన ఈ ప్రక్రియని పకడ్బందీ ప్రణాళికతో నరవాణె రూపొందించి అమలయ్యేలా చూశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా ఆయుధాలు తూర్పు లద్దాఖ్లోని సమస్యాత్మక ప్రాంతాలైన చుషుల్, డెమ్చోక్లకు టీ–90, టీ–72 ట్యాంకులు, గన్స్, పదాతిదళానికి అవసరమయ్యే వాహనాలు ఇప్పటికే చేరుకున్నాయి. ఈ ఆపరేషన్లో భాగంగా 16 వేల అడుగుల ఎత్తైన పర్వత ప్రాంతంలోని శిబిరాల్లో ఉండే జవాన్ల కోసం భారీగా ఆహార పదార్థాలు, దుస్తులు, టెంట్లు, కమ్యూనికేషన్ పరికరాలు, చమురు, చలి నుంచి రక్షణకి హీటర్లు తరలించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత లద్దాఖ్లో సైనిక శిబిరాలకు ఈ స్థాయిలో సామగ్రిని చేరవేయడం ఇదే మొదటిసారి. ఈ తరలింపు అత్యంత భారీ స్థాయిలో జరిగింది’’అని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. రక్తం గడ్డ కట్టే చలి నుంచి రక్షణ కోసం యూరప్ దేశాల నుంచి దుస్తుల్ని తెప్పించి ఇప్పటికే సైనికులకి అందించారు. ఈ సామగ్రిని తరలించడానికి వైమానిక దళానికి చెందిన సి–130జే సూపర్ హెర్క్యులస్, సీ–17 గ్లోబ్మాస్టర్ హెలికాప్టర్లను వినియోగించారు. తూర్పు లద్దాఖ్లో ఉద్రిక్తతల నివారణ కోసం చైనాతో జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి రాకపోవడం, సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవడానికి ఆ దేశం అంగీకరించకపోవడంతో ముందు జాగ్రత్తగా భారత్ అన్ని రకాలుగా సిద్ధమైంది. అదనంగా మూడు సైనిక శిబిరాలను ఏర్పాటు చేసింది. అక్కడ సైనికులకి అన్ని సదుపాయాలు కల్పించింది. -
చైనా కుట్రతో పాక్ కుతంత్రం..
జమ్మూ కశ్మీర్: భారత్-చైనా సరిహద్దు ప్రతిష్టంభన కొనసాతున్న నేపథ్యంలో డ్రాగన్ దేశం దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. లద్దాఖ్ సరిహద్దు వద్ద భారత వ్యకతిరేక కార్యకాలాపాలు, అశాంతిని రెచ్చగొట్టడానికి పాకిస్తాన్తో పన్నాగం పన్నుతున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. జమ్మూ కశ్మీర్లో పెద్ద ఎత్తును ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పెలుడు పదార్థాలను మోహరించాలని చైనా పాకిస్తాన్కి ఆదేశించినట్లు తెలిపారు. జమ్మూకు పెద్ద ఎత్తును ఆయుధాలు తరలించాలనే ప్రణాళికను అమలు చేయాలని డ్రాగన్ దేశం పాక్కి సూచించిందని భారత ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ వర్గాలు నివేదికలు అందించాయి. ఇటీవల భద్రతా ధళాలు స్వాధీనం చేసుకున్న ఆయుధాల ద్వారా భారత్లో హింస, ఆశాంతిని పెంచడానికి చైనా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఆయుధాలపై చైనా దేశానికి సంబంధించిన గుర్తులు ఉన్నట్లు గుర్తించారు. (దక్షిణ కొరియాకు సారీ చెప్పిన కిమ్) భారత భద్రతా దళాలు ఏర్పాటు చేసిన చొరబాటు నిరోధక గ్రిడ్ కారణంగా కశ్మీర్ లోయలో పాకిస్తాన్ ఉగ్రవాదులు, ఆయుధాల మోహరింపు తగ్గిందని తెలిపారు. ఇంటలిజెన్స్ నివేదికలు వెలువడిన నేపథ్యంలో భారత భద్రతా దళాలు నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు నిరోధక గ్రిడ్ను మరింత బలోపేతం చేశాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్ రాకేశ్ అస్థానా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ చీఫ్ ఏపీ మహేశ్వరి, భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్లో పర్యటించి గత పది రోజుల నుంచి చోటుచేసున్న పరిస్థితులను సమీక్షించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆర్మీ చీఫ్ ఎంఎం నారావణే ఆదేశించారు. (భారత్కు భయపడుతున్న చైనా జవాన్లు!) రెండు రోజుల క్రితం జమ్మూ నుంచి దక్షిణ కాశ్మీర్కు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అనుమానితులను భద్రతా దళాలు అరెస్టు చేశారు. వారి వద్ద చైనా గుర్తులు ఉన్న నోరిన్కో / ఈఎంఇఐ టైప్ 97 ఎన్ఎస్ఆర్ రైఫిల్, 190 రౌండ్లతో నాలుగు మ్యాగజైన్స్, 21 ఎ రౌండ్లు, మూడు గ్రెనేడ్లతో నాలుగు మ్యాగజైన్స్ కలిగిన ఏకే 47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత భద్రతా బలగాలు సరిహద్దు వద్ద అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. -
విస్తృత బంధాల్లో సరిహద్దు ఒక భాగం
న్యూఢిల్లీ: భారత్, చైనాలు పరస్పరం మునుపెన్నడూ ఎరగని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని సరిహద్దు వివాదాన్ని ప్రస్తావిస్తూ విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. అయితే, ఇరుదేశాల మధ్య ఉన్న విస్తృత ద్వైపాక్షిక సంబంధాల్లో సరిహద్దు సమస్య ఒక భాగం మాత్రమేనని స్పష్టం చేశారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో గురువారం వర్చువల్గా ఆయన పాల్గొన్నారు. అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో రెండు దేశాలు సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే వివాద పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. ‘మునుపెన్నడూ లేని పరిస్థితిని రెండు దేశాలు ఎదుర్కొంటున్నాయన్నది వాస్తవం. అయితే, దీర్ఘకాలిక దృష్టితో చూస్తే.. ఇరు దేశాల మధ్య నెలకొన్న విస్తృత ద్వైపాక్షిక సంబంధాల్లో సరిహద్దు సమస్య ఒక భాగం మాత్రమేనని అర్థమవుతుంది’ అని జైశంకర్ వ్యాఖ్యానించారు. మరోవైపు, చైనాతో సరిహద్దు వివాదం ముగిసేందుకు ముందుగా, క్షేత్రస్థాయిలో శాంతి, సుస్థిరత నెలకొనాల్సిన అవసరం ఉందని భారత్ స్పష్టం చేసింది. తూర్పు లద్దాఖ్లోని సరిహద్దుల్లో ఉన్న అన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియ కొంత సంక్లిష్టమైందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం పేర్కొన్నారు. ఇందుకు పరస్పర ఆమోదనీయ నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలను విరమించుకోవాల్సి ఉందన్నారు. ఇరు దేశాల మధ్య ‘వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్’ కింద మరో విడత చర్చలు త్వరలో జరుగుతాయని తెలిపారు. తదుపరి రౌండ్ కమాండర్ స్థాయి చర్చల కన్నా ముందే అవి ఉంటాయన్నారు. ఇరుదేశాల కమాండర్ స్థాయి 6వ విడత చర్చలు సోమవారం జరిగిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లోని పరస్పర సమీప ప్రాంతాల వద్దకు మరిన్ని బలగాలను పంపకూడదని, ఉద్రిక్తతలు పెరిగే చర్యలు చేపట్టవద్దని ఆ చర్చల్లో నిర్ణయించారు. చైనా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతోంది: తైవాన్ తైపీ: తమ దేశ ఎయిర్ డిఫెన్సు జోన్లోకి చైనా నిఘా విమానాలు అక్రమంగా ప్రవేశించడంతో తైవాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా తమను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతోందని తైవాన్ డిప్యూటీ మినిస్టర్ చియ్ చుయ్ షెంగ్ వ్యాఖ్యానించారు. తమకు వ్యతిరేకంగా సైనిక శక్తిని ప్రయోగించాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. భావసారుప్యత ఉన్నదేశాలతో కలిసి పని చేస్తామని అన్నారు. ద్వీప దేశమైన తైవాన్కు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. కానీ, తైవాన్ తమ దేశంలో అంతర్భాగమేనని చైనా వాదిస్తోంది. -
చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్-చైనాల మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఆరవ రౌండ్ కార్పస్ కమాండర్-స్థాయి చర్చలు చైనా భూభాగంలోని మోల్డోలో సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మొదలై రాత్రి 9 గంటల వరకు కొనసాగాయి. దాదాపు 12 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ చర్చల్లో భారత్ ప్రధానంగా ఘర్షణాత్మక ప్రాంతాల్లో నుంచి చైనా బలగాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. రెండు దేశాల మధ్య కుదిరిన ఐదు అంశాల ఒప్పందం అమలు లక్ష్యంగా చర్చలు జరిగాయి. చైనా మొదట తన దళాలను వెనక్కి రప్పించాలని భారత్ కోరినట్లు సమాచారం. చైనానే మొదట చొరబాటుకు ప్రయత్నించింది కనుక.. ముందు అదే వెనక్కి తగ్గాలని భారత్ ఆశిస్తున్నట్లు తెలిసింది. (చదవండి:అంతర్జాతీయ సంకేతాలే కీలకం...) ప్యాంగ్యాంగ్ త్సో, హాట్స్ప్రింగ్స్, డెప్సాంగ్, ఫింగర్ ఏరియాలో తక్షణమే చైనా దళాలు ఉపసంహరించుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. ఒకవేళ చైనా యథాతథ స్థితిని పునరుద్ధరించకపోతే.. భాతర దళాలు సుదీర్ఘకాలం మోహరిస్తాయని హెచ్చరించింది. ఇప్పటి వరకు జరిగిన ఐదు దఫాలుగా సుదీర్ఘ చర్చలు జరిగినా చెప్పుకోదగ్గ పురోగతి ఏమీ లేకుండానే ముగిసిన విషయం తెలిసిందే. ఇక నిన్నటి చర్చల్లో భారత ప్రతినిధి బృందానికి లేహ్ ఆధారిత 14 కార్పస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నాయకత్వం వహించగా.. చైనా వైపు సౌత్ జిన్జియాంగ్ మిలిటరీ కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ నేతృత్వం వహించినట్లు తెలిసింది. -
భారత్, చైనా సుదీర్ఘ చర్చలు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్, చైనాల మధ్య చర్చలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. చైనా భూభాగంలోని మోల్డోలో ఉదయం 9 గంటల ప్రాంతంలో మొదలైన ఆరో విడత చర్చలు రాత్రి 9 గంటల తర్వాత కూడా ఒక కొలిక్కి రాలేదు. రెండు దేశాల మధ్య కుదిరిన ఐదు అంశాల ఒప్పందం అమలే లక్ష్యంగా జరుగుతున్న ఈ చర్చల్లో భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్తోపాటు మొదటిసారిగా విదేశాంగ శాఖ తరఫున జాయింట్ సెక్రటరీ నవీన్ శ్రీవాస్తవ కూడా పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీన మాస్కోలో రెండు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య కుదిరిన ఒప్పందంలోని ఐదు అంశాల అమలుకు కాలపరిమితిని ఖరారు చేయడంపైనే భారత బృందం దృష్టి పెట్టిందని అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఘర్షణాత్మక ప్రాంతాల్లో మోహరించిన చైనా బలగాలను సాధ్యమైనంత త్వరలో, పూర్తిగా వెనక్కి తీసుకోవాలని ఈ బృందం కోరుతోంది. ఇప్పటి వరకు జరిగిన ఐదు దఫాలుగా సుదీర్ఘ చర్చలు జరిగినా చెప్పుకోదగ్గ పురోగతి ఏమీ లేకుండానే ముగిసిన విషయం తెలిసిందే. -
అంతర్జాతీయ సంకేతాలే కీలకం...
ప్రధాన ఆర్థిక గణాంకాలేమీ లేకపోవడంతో ఈ వారం మార్కెట్కు అంతర్జాతీయ సంకేతాలే కీలకమని నిపుణులంటున్నారు. వీటితో పాటు చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, కరోనా కేసులు, కరోనా టీకా సంబంధిత వార్తలు, డాలర్తో రూపాయి మారకం విలువ, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి... ఈ అంశాలు కూడా తగినంత ప్రభావం చూపుతాయని వారంటున్నారు. సెప్టెంబర్ సిరీస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) కాంట్రాక్టులు ఈ వారమే ముగియనున్నందున ఒడిదుడుకులు తప్పవని విశ్లేషకులంటున్నారు. దేశీయంగా ప్రధాన ట్రిగ్గర్లు ఏమీ లేకపోవడంతో అనిశ్చితి కొనసాగుతుందని, అందుకే ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని వారు సూచిస్తున్నారు. ప్రపంచ పీఎమ్ఐ గణాంకాలు.... అమెరికా ఫెడరల్ రిజర్వ్ తక్షణ తాయిలాలేమీ ఇవ్వకపోవడం గత వారం ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ను కూడా దెబ్బతీసింది. సున్నా స్థాయి రేట్లు మరో మూడేళ్ల పాటు కొనసాగుతాయని సంకేతాలిచ్చిన ఫెడరల్ రిజర్వ్ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ రికవరీపై అనిశ్చితిని వ్యక్తం చేయడం ప్రతికూల ప్రభావం చూపింది. ఇక అంతర్జాతీయంగా చూస్తే, అమెరికా, ఇంగ్లాండ్, యూరోజోన్ల పీఎమ్ఐ(పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) గణాంకాలు ఈ వారం విడుదలవుతాయి. ఈ వారం మూడు ఐపీఓలు.... ఈ వారంలో మూడు కంపెనీల ఐపీఓలు వస్తున్నాయి. క్యామ్స్(కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్), కెమ్కాన్ స్పెషాల్టీ కెమికల్స్, ఏంజెల్ బ్రోకింగ్ కంపెనీలు తమ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లతో సందడి చేయనున్నాయి. విదేశీ పెట్టుబడులు రూ.3,944 కోట్లు పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉండటంతో ఈ నెలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) మన క్యాపిటల్ మార్కెట్లో రూ.3,944 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. వీటిల్లో నికర పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్లో రూ.1,766 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.2,178 కోట్ల చొప్పున ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ జోరుగా బాండ్లను కొనుగోలు చేస్తుండటంతో బాండ్ల రాబడులు తక్కువగా ఉండటం, అంతర్జాతీయంగా అధికంగా లభిస్తున్న లిక్విడిటీ... ఈ కారణాల వల్ల మన మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వస్తున్నాయని నిపుణులంటున్నారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను సున్సా స్థాయిల్లోనే మరో మూడేళ్ల పాటు కొనసాగించాలని ఫెడరల్ రిజర్వ్ సంకేతాలివ్వడంతో భారత్ వంటి వర్ధమాన మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల జోరు కొనసాగుతుందని వారంటున్నారు. ఐపీఓల సందడి చాలా రోజుల తర్వాత ఈ నెలలో ప్రైమరీ మార్కెట్లో ఐపీఓల సందడి కనిపిస్తోంది. ఇప్పటికే ఈ నెలలో హాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్, రూట్ మొబైల్స్ తమ ఐపీఓలతో దుమ్ము రేపాయి ఇక ఈ వారం మూడు కంపెనీలు–క్యామ్స్(కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్), కెమ్కాన్ స్పెషాల్టీ కెమికల్స్, ఏంజెల్ బ్రోకింగ్ కంపెనీలు తమ ఐపీఓలతో సందడి చేయనున్నాయి. ఈ ఐపీఓలకు సంబంధించిన తేదీలు, ప్రైస్బాండ్, జీఎమ్పీ తదితర వివరాలు..... -
తూర్పులద్దాఖ్లో పీఎల్ఏపై ఆర్మీ పైచేయి
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లోని సరిహద్దుల్లో భారత ఆర్మీ చైనా పీఎల్ఏపై పైచేయి సాధించింది. ఒక వైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే గడిచిన మూడు వారాల్లో కీలకమైన 20 పర్వత ప్రాంతాలను భారత సైన్యం ఆధీనంలోకి తీసుకుంది. భారత్ ఇచ్చిన షాక్తో దిమ్మెర పోయిన చైనా ఆర్మీ అరుణాచల్ప్రదేశ్తో గల సరిహద్దుల్లో మోహరింపులు పెంచి, కయ్యానికి కాలుదువ్వుతోంది. ఈ నేపథ్యంలో భారత్, చైనా కమాండర్ స్థాయి ఆరో విడత చర్చలు సోమవారం జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ సమావేశంలో భారత బృందంలో విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారి కూడా పాలు పంచుకునే అవకాశముంది. ఈ చర్చలు తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖకు చైనావైపున్న మోల్దోలో జరగనున్నాయి. లద్దాఖ్ గగనతలంపై రఫేల్ యుద్ధ విమానాలు పహారా కాస్తున్నాయి.‘ఆగస్టు 29 మొదలు సెప్టెంబర్ రెండో వారం వరకు భారత సైన్యం 20 ప్రధాన పర్వత ప్రాంతాలను ఆక్రమించింది. ఆర్మీ ఆధీనంలోకి తీసుకున్న వాటిలో మగార్ హిల్, గురుంగ్ హిల్, రెచెన్ లా, రెజంగ్ లా, మొఖ్పరితోపాటు ఫింగర్ 4కు సమీపంలోని పర్వతప్రాంతం ఉన్నాయి’ ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. ‘ఇంతకుముందు ఈ ప్రాంతాల్లో చైనా ఆర్మీ పీఎల్ఏ ఆధిపత్యం ఉండేది. తాజా పరిణామంతో మన బలగాలు ఈ ప్రాంతంలో శత్రువుపై పైచేయి సాధించినట్లయింది’అని ఆ వర్గాలు తెలిపాయి. భారత భూభాగం వైపున పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణం వైపు ఉన్న ఈ పర్వత భాగాలను ఆక్రమించుకునే క్రమంలో చైనా ఆర్మీ ప్రతిఘటించిందనీ, ఈ సందర్భంగా మూడు పర్యాయాలు గాల్లోకి కాల్పులు కూడా జరిగాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత ఆర్మీ కదలికలతో ఇప్పటికే ఉన్న బలగాలకు తోడు మరో 3,000 బలగాలను చైనా అదనంగా రెజంగ్ లా, రెచెన్ లా పర్వత ప్రాంతాలకు సమీపంలోకి రప్పించిందని తెలిపాయి. దీంతోపాటు మోల్డో సైనిక స్థావరంలోకి అదనపు బలగాలను తరలించిందని వివరించాయి. అరుణాచల్ సరిహద్దుల్లో చైనా కుట్ర తూర్పు లద్దాఖ్ అనంతరం చైనా దృష్టి అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులపై పడింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశాలతో అప్పర్ సుబన్సిరిలోని అసపిలా, లాంగ్జు, బిసా, మఝా ప్రాంతాల్లోకి పీఎల్ఏ మోహరింపులు పెరిగాయి. దీంతోపాటు ఎల్ఏసీకి సమీపంలోని బిసాలో ఒక రోడ్డును కూడా నిర్మించింది. భారత సైన్యం కూడా దీటుగా స్పందించింది. ఆరు సమస్యాత్మక ప్రాంతాలు, 4 సున్నిత ప్రాంతాల్లో గస్తీని పెంచింది. ఎలాంటి దురాక్రమణనైనా తిప్పికొట్టేందుకు సర్వం సన్నద్ధమైంది. -
మన గస్తీని ఏ శక్తీ అడ్డుకోలేదు
న్యూఢిల్లీ: భారత సైన్యం లద్దాఖ్ ప్రాంతంలో సరిహద్దు గస్తీ నిర్వహించకుండా ఏ శక్తీ అడ్డుకోలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్æ స్పష్టం చేశారు. తూర్పులద్దాఖ్లో పరిస్థితిపై గురువారం రక్షణ మంత్రి రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. చైనా తన సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించిందని, భారత్ తదనుగుణంగా బలగాలను సిద్ధంగా ఉంచిందని తెలిపారు. చైనా చెప్పే మాటలకు, చేతలకూ పొంతన ఉండటం లేదని అన్నారు. గల్వాన్ లోయపై గతంలో ఎన్నడూ చైనాతో వివాదం తలెత్తలేదని, ఫింగర్ పాయింట్–8 వరకు మన బలగాలు గస్తీ చేపట్టేవని రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ అన్నారు. ఆయన ప్రశ్నకు రాజ్నాథ్ వివరణ ఇస్తూ.. చైనాతో గొడవంతా గస్తీ విషయంలోనేనని తెలిపారు. గస్తీ విధానం విస్పష్టంగా ఉందని, చాలా కాలంగా కొనసాగుతున్నదేనని చెప్పారు. సరిహద్దు వివాదాల్లాంటి సున్నితమైన అంశాలపై చర్చ వద్దన్న అంశంపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు అంగీకరించిన తరువాత రాజ్నాథ్æ రాజ్యసభలో ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో సభ్యులు కొన్ని అంశాలపై కోరిన వివరణకు రక్షణ మంత్రి స్పందించారు. చైనా సరిహద్దుల్లో ఏప్రిల్ నాటి పరిస్థితులను పునరుద్ధరించాలని అంతకుముందు ప్రతిపక్షం డిమాండ్ చేసింది. తూర్పు లద్దాఖ్లో చైనా సైన్యంతో ప్రతిష్టంభన కొనసాగుతున్న ఈ సమయంలో పార్టీల కతీతంగా సభ సైన్యానికి మద్దతు, సంఘీభావం ప్రకటించింది. భారత భూభాగాన్ని ఆక్రమించింది లద్దాఖ్ ప్రాంతంలో సుమారు 38 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుందని, పాక్ ఆక్రమిత కశ్మీర్లోనూ 5,180 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కలిగి ఉందని రాజ్నాథ్ తెలిపారు. భారత్, చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి అతితక్కువ సైనిక బలగాల మోహరింపు ఉండాలని 20 ఏళ్ల క్రితమే ఒప్పందాలు జరిగాయని గుర్తు చేశారు. పార్లమెంట్ ఆవరణలో రైతు బిల్లు ప్రతులు దహనం కేంద్రం ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదించిన రైతుల బిల్లులపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో నిరసన తెలిపారు. పంజాబ్కు చెందిన ఆ పార్టీ ఎంపీలు బిల్లుల ప్రతులను పార్లమెంట్ ఆవరణలో తగులబెట్టి, మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. కేంద్రం తప్పుడు విధానాల కారణంగా రైతులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని లోక్సభలో కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధురి ఆరోపించారు. సాయుధ సంపత్తికి బిలియన్ డాలర్లువాస్తవాధీన రేఖ వెంట ప్రస్తుతం మోహరించిన బలగాలను చలికాలం ముగిసేవరకు కొనసాగించాలని చైనా నిర్ణయించిన నేపథ్యంలో.. ఈ నెలాఖరులో జరగనున్న ఇరుదేశాల మిలటరీ స్థాయి చర్చల్లో ప్రాదేశిక మార్పులకు సంబంధించి గొప్ప ఫలితాలేవీ రాకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింతకాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తుండటంతో.. సుమారు బిలియన్ డాలర్ల(రూ. 7,361 కోట్లు) విలువైన మిలటరీ సాయుధ సంపత్తిని అత్యవసరంగా సమకూర్చుకునేందుకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించాయి. ఒకవేళ నెలరోజులకు పైగా యుద్ధం కొనసాగే పరిస్థితే ఉంటే.. అందుకు అవసరమైన సాయుధ సంపత్తిని సమకూర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలిపాయి. ఇందులో టీ–72, టీ–90 యుద్ధ ట్యాంకులకు అవసరమైన పేలుడు పదార్ధాలు, ఇజ్రాయెల్ తయారీ క్షిపణులు, హెరోన్ డ్రోన్లు, ఎస్ఐజీ 716 రైఫిల్స్, ఇతర యుద్ధ సామగ్రి ఉన్నాయని వెల్లడించాయి. అలాగే, సుమారు 50 వేల మంది జవాన్లకు అవసరమైన.. తీవ్ర చలిని తట్టుకోగల దుస్తులు, హీటర్లు, టెంట్స్ను సమకూర్చుకోవాల్సి ఉందని తెలిపాయి. మరోవైపు, చైనా పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధపడకపోవచ్చని, భారత దళాలను నెలలు, లేదా సంవత్సరాల తరబడి సరిహద్దుల్లో ఎంగేజ్ చేయడం ద్వారా భారత్ను దెబ్బతీయాలనే లక్ష్యంతో పనిచేయవచ్చని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు మనోజ్ జోషి వ్యాఖ్యానించారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను దృష్టిలో పెట్టుకుంటే, భారత్కు ఇది భారమే అవుతుందన్నారు. మరోవైపు, ఆర్మీ చీఫ్ నరవాణే గురువారం శ్రీనగర్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కశ్మీర్లోని సరిహద్దు వెంట పరిస్థితులను స్వయంగా సమీక్షిస్తున్న ఆర్మీ చీఫ్ నరవాణే -
ఉద్రిక్తంగానే సరిహద్దు.. రాజ్నాథ్ ప్రకటన
న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దు వివాదంపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో గురువారం మరోసారి ఆసక్తికర ప్రకటన చేశారు. సరిహద్దు వివాదంపై ఎంపీలు లేవనెత్తిన ప్రశ్నలకు రాజ్నాథ్ సమాధానమిచ్చారు. చైనాతో ఎలాంటి పరిస్థితులున్నా తాము ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లు మరోసారి స్పష్టం చేశారు. మన సాయుధ బలగాలతో చైనాకు ఇప్పటికే గట్టిగా సమాధానమిచ్చామని.. ఇరుదేశాల మధ్య ఉన్న ఒప్పందాలను చైనా బహిరంగంగానే ఉల్లఘింస్తుందని మరోసారి గుర్తుచేశారు. కాగా మంగళవారం చైనా సరిహద్దు వివాదంపై రాజ్నాథ్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని సమస్య ఇంకా పరిష్కారం కాలేదని స్పష్టం చేశారు. మన బలగాలు దేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నాయని, చైనా దూకుడుకు చెక్ పెట్టేందుకు భారత దళాలు అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. చైనా మొండిగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది మే నుంచి సరిహద్దుల్లో భారీగా సాయుగాధ బలగాలను మొహరించిందని వివరించారు. (చదవండి : సరిహద్దు వివాదం : రక్షణ మంత్రి కీలక ప్రకటన) -
చైనా నుంచి చొరబాట్లు లేవు
న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల నుంచి గత ఆరునెలల్లో ఎలాంటి చొరబాట్లు లేవని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో పాక్ సరిహద్దుల నుంచి 47 చొరబాటు యత్నాలు చోటు చేసుకున్నాయని బుధవారం రాజ్యసభకు తెలిపింది. గత మూడేళ్లలో పాక్ నుంచి కశ్మీర్లోకి జరిగిన చొరబాటు యత్నాల సంఖ్య 594 అని, వాటిలో 312 విజయవంతమయ్యాయని వెల్లడించింది. మూడేళ్లలో అక్కడ 582 మంది ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయని హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఆరు నెలలుగా చైనా సరిహద్దుల్లో ఎలాంటి చొరబాట్లు లేవని ప్రభుత్వం ప్రకటించడంపై కాంగ్రెస్ మండిపడింది. ఆ ప్రకటన గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో ప్రాణాలర్పించిన వీర జవాన్లను అవమానించడమేనని పేర్కొంది. చైనా దురాక్రమణపై ప్రధాని మోదీ, రక్షణ మంత్రి చేసిన వేర్వేరు ప్రకటనలను వరుసగా ప్రస్తావిస్తూ.. ‘మోదీ ప్రభుత్వం మన సైనికుల పక్షాన ఉందా? లేక చైనా వైపు ఉందా?’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. నేడు రాజ్నాథ్ ప్రకటన తూర్పు లద్దాఖ్లో చైనాతో సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై నేడు రక్షణ మంత్రి రాజ్నాథ్ రాజ్యసభలో ప్రకటన చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజ్నాథ్ ప్రకటన అనంతరం, విపక్ష సభ్యులను మాట్లాడే అవకాశం ఇస్తారని, ఆ తరువాత అవసరమైతే, రాజ్నాథ్ సభ్యుల అనుమానాలకు వివరణ ఇస్తారని వెల్లడించాయి. రాష్ట్రపతి, ప్రధాని కూడా.. చైనా టెక్నాలజీ కంపెనీ డేటా చౌర్యం అంశాన్ని బుధవారం కాంగ్రెస్ పార్లమెంట్ ఉభయసభల్లో లేవనెత్తింది. దాదాపు 10 వేల మంది ప్రముఖుల సమాచారంపై నిఘా వేశారన్న వార్త ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీతో, చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న షెంజెన్ కేంద్రంగా ఉన్న ఒక టెక్నాలజీ కంపెనీ 10 వేల మంది భారతీయ ప్రముఖుల డిజిటల్ డేటాను ట్రాక్ చేస్తోందని పత్రికల్లో కథనం వచ్చిందని కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ వివరించారు. ఆ ప్రముఖుల్లో భారత రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, ఆర్మీ చీఫ్, ముఖ్యమంత్రులు ఉండడం షాక్కు గురిచేస్తోందన్నారు. డేటా చౌర్యంపై నిపుణుల కమిటీ భారత్లోని దాదాపు 10 వేల మంది ప్రముఖులపై చైనా టెక్నాలజీ సంస్థ నిఘాపెట్టి డేటా చౌర్యం చేస్తోందన్న ఆరోపణలపై కేంద్రం ఒక నిపుణుల కమిటీని నియమించింది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ కో ఆర్డినేటర్ నేతృత్వంలో ఈ కమిటీ ఈ ఆరోపణల్లోని నిజానిజాలను నిర్ధారిస్తుంది. -
మళ్లీ చైనా కాల్పులు
న్యూఢిల్లీ/జమ్మూ: భారత సైనికులను బెదిరించే ఉద్దేశంతో ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర తీరం వద్ద చైనా సైనికులు గతవారం మరోసారి గాలిలో కాల్పులు జరిపారు. భారత్, చైనా దేశాల విదేశాంగ మంత్రులు జైశంకర్, వాంగ్ యిల మధ్య రష్యా రాజధాని మాస్కోలో చర్చలు జరగడానికి ముందు ఫింగర్ 4 రిడ్జ్లైన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. వ్యూహాత్మకంగా కీలకమైన ఆ ప్రాంతంలో ఉన్న భారత జవాన్ల వైపు భారీ సంఖ్యలో చైనా సైనికులు దూకుడుగా వచ్చారని, అయితే, భారత జవాన్లు దీటుగా ఎదుర్కోవడంతో వెనక్కు వెళ్లారని వివరించాయి. వెనక్కు వెళ్తూ.. భారత సైనికులను బెదిరించేందుకు గాలిలో 100 నుంచి 200 రౌండ్లు కాల్పులు జరిపారని వెల్లడించాయి. 45 ఏళ్ల తరువాత తొలిసారి సెప్టెంబర్ 7న తూర్పు లద్దాఖ్లోని చైనా సరిహద్దుల్లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోని రెజాంగ్ లా రిడ్జ్లైన్ వద్ద ఉన్న భారత జవాన్లను బెదిరించే లక్ష్యంతో చైనా సైనికులు గాలిలో పలు రౌండ్లు కాల్పులు జరిపారు. మనవాళ్లే మెరుగు తూర్పు లద్దాఖ్లో ప్రతికూల వాతావరణం ఉండే చలి కాలంలో కూడా.. చైనాతో పూర్తి స్థాయి యుద్ధానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ రిటైర్డ్ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. యుద్ధం తప్పని పరిస్థితులనే చైనా కల్పిస్తే.. సుశిక్షితులైన, సంసిద్ధంగా ఉన్న, మానసికంగా ధృఢంగా ఉన్న భారత బలగాలను వారు ఎదుర్కోవాల్సి ఉంటుందని బ్రిగేడియర్(రిటైర్డ్) హేమంత్ మహాజన్ హెచ్చరించారు. మానసికంగా, శారీరకంగా చైనా సైనికుల కన్నా.. భారత జవాన్లు దృఢమైనవారన్నారు. చైనా సైనికులు ప్రధానంగా పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన సున్నితమైన వారని, విధుల్లో భాగంగా సంక్లిష్ట క్షేత్ర పరిస్థితుల్లో ఎక్కువకాలం ఉన్నవారు కాదని వివరించారు. మొదట బుధవారం ఉదయం ఈ ప్రకటన భారత సైన్యం నార్తర్న్ కమాండ్ ప్రజా సంబంధాల అధికారి(పీఆర్ఓ) నుంచి మీడియాకు వచ్చింది. కానీ, ఆ తరువాత ఆ ప్రకటనలోని అంశాలు నార్తర్న్ కమాండ్ లేదా ఇండియన్ ఆర్మీ అభిప్రాయాలు కావని ఆ పీఆర్ఓ వివరణ ఇచ్చారు. ఈ వివరాలన్నీ పదవీ విరమణ చేసిన బ్రిగేడియర్ హేమంత్ మహాజన్వని వివరించారు. శాంతి, సుస్థిరతకు కట్టుబడి ఉన్నాం భారత్ సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతకు కట్టుబడి ఉన్నామని చైనా ప్రకటించింది. భారత్తో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవిస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో తమ దేశ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభలో చేసిన ప్రకటనపై స్పందించాలన్న మీడియా ప్రశ్నకు.. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ బుధవారం పై విధంగా స్పందించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తాము కారణంకాదని చైనా తెలిపింది. దీర్ఘకాల మోహరింపునకు సిద్ధం బ్రిగేడియర్(రిటైర్డ్) హేమంత్ మహాజన్ వాదన ప్రకారం.. సరిహద్దుల్లో దీర్ఘకాలం మోహరించేందుకు భారత దళాలు సిద్ధమై ఉన్నాయి. లద్దాఖ్ అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలున్న ప్రాంతం. ఇక్కడ నవంబర్ తరువాత 40 అడుగుల వరకు మంచు పేరుకుపోయే పరిస్థితి ఉంటుంది. మైనస్ 30 నుంచి మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఇక్కడ సర్వసాధారణం. దానికి తోడు చలిగాలులు పరిస్థితిని మరింత దిగజారుస్తాయి. రోడ్లను మంచు కమ్మేస్తుంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ.. భారత్కు ఉన్న సానుకూల అంశం సుశిక్షితులైన మన సైనికులే. చలి కాలంలో యుద్ధం సాగించేందుకు అవసరమైన అనుభవం మన సైనికులకు ఉంది. స్వల్ప వ్యవధిలోనే రంగంలోకి దిగగల మనోస్థైర్యం కూడా మనవారికి ఉంది. చైనా సరిహద్దుల కన్నా దారుణమైన వాతావరణ పరిస్థితులు ఉండే సియాచిన్లో నెలల తరబడి ఉన్న అనుభవం మన సైనికులకు ఉంది. లద్దాఖ్కు చేరుకునేందుకు ఇప్పటివరకు రెండు మార్గాలు ఉన్నాయి. తాజాగా ‘దార్చా టు లేహ్’ మార్గం అందుబాటులోకి రావడంతో యుద్ధ, సహాయక సామగ్రి తరలింపు మరింత సులభమైంది.పెద్ద సంఖ్యలో ఎయిర్బేస్లు ఉండటం భారత్కు కలసివచ్చే అంశం. -
సరిహద్దు వివాదం : రక్షణ మంత్రి కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దు సమస్యపై పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ప్రకటన చేశారు. సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని సమస్య ఇంకా పరిష్కారం కాలేదని స్పష్టం చేశారు. మన బలగాలు దేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నాయని, చైనా దూకుడుకు చెక్ పెట్టేందుకు భారత దళాలు అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. చైనా మొండిగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది మే నుంచి సరిహద్దుల్లో భారీగా సాయుధ బలగాలను మోహరించిందని వివరించారు. చైనాతో తాము స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నా డ్రాగన్ దూకుడుతో శాంతి ఒప్పందంపై ప్రభావం పడుతోందని, ద్వైపాక్షిక చర్చలపైనా ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పారు. చైనాతో సరిహద్దు వివాదం ఎప్పటినుంచో అపరిష్కృతంగా ఉందని, 1962లో చైనా లడ్డాఖ్లో 90 వేల కిలోమీటర్ల భూభాగం ఆక్రమించిందని అన్నారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడేది లేదని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నామని చెప్పారు. సరిహద్దుల నిర్ణయానికి చైనా అంగీకరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్ఏసీని ఇరు దేశాలు గౌరవించాలని అన్నారు. చైనా ఏకపక్ష చర్యలను భారత్ ఖండిస్తోందని, డ్రాగన్ కదలికలను పసిగడుతున్నామని మన సైన్యం కూడా అప్రమత్తంగా ఉందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. భారత్ శాంతినే కోరుకుంటోందని, సామరస్య చర్చలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. చైనా రక్షణ మంత్రితో తాను చర్చలు జరిపానని, యథాతథ స్థితికి భంగం కలిగించే చర్యలు చేపట్టవద్దని ఆయనతో స్పష్టం చేశానని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లడ్డాఖ్కు వెళ్లి సైనికులను కలిశారని గుర్తు చేశారు. చైనాతో చర్చలకు భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. చర్చలు కొనసాగిస్తామని చైనా హామీ ఇస్తున్నా సరిహద్దుల విషయంలో మొండిగా వాదిస్తోందని దుయ్యబట్టారు. తాజాగా ఇరుదేశాల విదేశాంగ మంత్రులు అవగాహనకు వచ్చారని చెప్పారు.ఇక చైనాతో ఉద్రిక్తతలపై పార్లమెంట్లో చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల డిమాండ్ను ప్రభుత్వం తోసిపుచ్చగా ఈ అంశంపై సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేశారు. చదవండి : రఫేల్ రాక.. చైనాకు స్ట్రాంగ్ కౌంటర్ -
మార్కెట్ అక్కడక్కడే...
కొనుగోళ్లకు పురికొల్పే తాజా ట్రిగ్గర్లు ఏమీ లేనందున శుక్రవారం స్టాక్ మార్కెట్ అక్కడక్కడే ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటంతో స్టాక్ సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలో లాభ, నష్టాల మధ్య దోబూచులాడాయి. భారత్–చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నివారణకు ఐదు సూత్రాల ఒప్పందం కుదరడం ఒకింత సానుకూల ప్రభావం చూపించింది. డాలర్తో రూపాయి మారకం విలువ 7 పైసలు తగ్గి 73.53కు చేరింది. సెన్సెక్స్ 14 పాయింట్లు లాభపడి 38,855 పాయింట్ల వద్ద, నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 11,464 పాయింట్ల వద్ద ముగిశాయి. సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. ఈ వారంలో సెన్సెక్స్లో 497 పాయింట్లు, నిఫ్టీ 131 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఆరు గంటలు పరిమిత శ్రేణిలోనే... ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా మన మార్కెట్ లాభాల్లోనే మొదలైంది. ఆ తర్వాత వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. దాదాపు ఆరుగంటల పాటు సూచీలు చాలా పరిమిత శ్రేణిలో లాభ,నష్టాల మధ్య కదలాడాయి. చివరి అరగంటలోనే నిలకడగా పెరిగాయి. సెన్సెక్స్ ఒక దశలో 128 పాయింట్లు పతనం కాగా, మరో దశలో 139 పాయింట్లు పెరిగింది. మొత్తం మీద రోజంతా 267 పాయింట్ల రేంజ్లో కదలాడింది. టీసీఎస్, హిందుస్తాన్ యూనిలివర్, ఇన్ఫోసిస్ లాభాలను హెచ్డీఎఫ్సీ జోడీ, భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్ హరించి వేశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ► ఎస్బీఐ 2.3% లాభంతో రూ.203 వద్ద ముగి సింది. సెన్సెక్స్లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో ఐటీ షేర్లు లాభపడ్డాయి. ► దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఎస్బిఐ కార్డ్స్, లారస్ ల్యాబ్స్, ఇమామి, జుబిలంట్ ఫుడ్వర్క్స్, విప్రోలు ఈ జాబితాలో ఉన్నాయి. ► దాదాపు 250కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. ఫ్యూచర్ రిటైల్, యస్బ్యాంక్, డిష్ టీవీ తదితర షేర్లు జాబితాలో ఉన్నాయి. -
చైనా చిత్తశుద్ధి ప్రదర్శించాలి
భారత–చైనా సంబంధాల్లో అయిదు అంకె ప్రాధాన్యం బాగానే వున్నట్టుంది. ఇరుదేశాల మధ్యా వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద దాదాపు అయిదు నెలలుగా అలుముకున్న ఉద్రిక్తతలను ఉపశ మింపజేయడానికి గురువారం మాస్కోలో షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సమావేశాల సందర్భంగా మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి సమావేశమయ్యారు. రెండు గంటలకుపైగా చర్చలు జరిగాక ఇరు దేశాల మధ్యా అయిదు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని మంత్రులు ప్రకటించారు. రెండు దేశాల మధ్యా 1954లో ఈ మాదిరే అయిదు అంశాలతో కూడిన పంచశీల ఒప్పందం కుదిరింది. అనంతరకాలంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఎనిమిదేళ్ల తర్వాత ఇరు దేశాలమధ్యా యుద్ధం సంభవించింది. ఆ పరిస్థితి మళ్లీ పునరావృతం కారాదని అందరూ కోరుకుంటున్న వేళ గత శుక్రవారం మాస్కోలో రెండు దేశాల రక్షణ మంత్రులు భేటీ కావడం, అది జరిగిన అయిదురోజుల తర్వాత ఇప్పుడు విదేశాంగ మంత్రులమధ్య చర్చలు చోటుచేసుకోవడం హర్షించదగ్గది. మరోపక్క రెండు దేశాల మధ్యా సైనిక కమాండర్ల స్థాయి చర్చలు సాగుతూనేవున్నాయి. మధ్యలో ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులూ సంభాషించుకున్నారు. అయితే ప్రస్తుతం కుదిరిందంటున్న ఏకాభిప్రాయం సమస్యల్ని స్థూలంగా స్పృశించిందే తప్ప నిర్దిష్టమైన అంశాల జోలికి పోలేదు. రెండు దేశాలూ చర్చల్ని కొనసాగించాలని, సరిహద్దుల్లో ఇరుపక్షాలూ వెనక్కి తగ్గాలని, గతంలో ఇరు దేశాలూ కుదుర్చుకున్న ఒప్పందాలను గౌరవించాలని, విభేదాలు వివాదాలుగా మారకుండా చూడాలని, విశ్వాస పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఇరు దేశాలూ అంగీకారానికొచ్చాయి. ప్రస్తుతం ఎల్ఏసీ వద్ద కనీవినీ ఎరుగని స్థాయిలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. జూన్లో చైనా సైనికులు మన భూభాగంలోకి చొరబడే ప్రయత్నం చేయడం, దాన్ని అడ్డుకోవాలని చూసిన మన సైనికులపై వారు ఇనుపరాడ్లు, కర్రలతో దాడి చేసి 21మంది జవాన్ల ప్రాణాలు తీయడం అత్యంత విషాదకరమైన ఘటన. ఆ తర్వాత రెండు దేశాల మధ్యా సైనిక కమాండర్ల స్థాయి చర్చలు అడపా దడపా జరుగుతూనే వున్నాయి. అయినా కూడా ఆ ఉద్రిక్తతలు అలాగేవున్నాయి. మూడు రోజులక్రితం తొలిసారి అక్కడ కాల్పులు కూడా చోటుచేసుకున్నాయి. 45 ఏళ్లలో ఎల్ఏసీ వద్ద కాల్పులు జరగడం ఇదే తొలిసారి. పరిస్థితి ఇంత విషమించాక చైనా తీరుపై మన దేశం గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేయాలి. చర్చల సందర్భంగా జైశంకర్ ఆ పనే చేశారని అంటున్నారు. తూర్పు లద్దాఖ్లో చైనా సైన్యం దురాక్రమణ పోకడలను వాంగ్ యి దృష్టికి తీసు కొచ్చి, దానిపై నిరసన వ్యక్తం చేయడంతోపాటు ఎల్ఏసీ వద్ద శాంతి సామరస్యాలను పునరుద్ధ రించడానికి కృషి చేయడం తక్షణ కర్తవ్యమని చెప్పారు. మన జవాన్లు గత నెలాఖరున సరిహద్దులు అతిక్రమించారన్న చైనా వాదనను ఆయన తిరస్కరించారని చెబుతున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అసాధారణ రీతిలో వున్నాయి. రెండు వైపులా సైన్యం మోహరింపు ఎక్కువైంది. పోటాపోటీగా యుద్ధ సామగ్రి అక్కడికి తరలుతోంది. కనుక ఎల్ఏసీ వద్ద యధాపూర్వ స్థితి నెలకొల్పడం తక్షణావసరం. ఏ వైపున ఎవరు ఆవేశపడినా అది చివరకు యుద్ధానికే దారితీస్తుంది. ఇప్పుడు ప్యాంగాంగ్ సో వద్ద మన సైనికుల అధీనంలోకొచ్చిన శిఖరాగ్రాల్లో కొన్నిటినైనా చేజిక్కించు కునేందుకు చైనా సైనికులు వ్యూహరచన చేస్తున్నారని అక్కడి నుంచి వెలువడుతున్న కథనాలు చెబుతున్నాయి. యుద్ధంలో ఎప్పుడూ ఎత్తయిన ప్రాంతాల్లో వున్న సైనికులకు అనుకూలమైన పరిస్థితులుంటాయని యుద్ధ రంగ నిపుణులు అంటారు. కనుకనే ఆ శిఖరాగ్రాలపై చైనా సైన్యం కన్నేసింది. ఇరు దేశాలమధ్యా చాన్నాళ్ల తర్వాత తొలిసారి జనతాపార్టీ హయాంలో సామరస్యత ఏర్పడింది. మైత్రికి బీజాలు పడ్డాయి. అప్పటి విదేశాంగ మంత్రి వాజపేయి చైనాను సందర్శించారు. వివా దాస్పద అంశాలపై పరస్పరం చర్చించుకుందామని, వాణిజ్య రంగంలో సహకరించుకుంటూ ఎదుగుదామని చైనా చేసిన ప్రతిపాదనకు మన దేశం అంగీకరించింది. మన దేశంతో వాణిజ్యం మొదలయ్యాక ఆ రంగంలో అత్యధికంగా లాభపడింది చైనాయే. మన దేశం నుంచి ప్రపంచ దేశాలకు అయ్యే ఎగుమతుల్లో చైనా వాటా 5 శాతం కాగా, మనకొచ్చే దిగుమతుల్లో వారి వాటా 14 శాతం. ఇలా మనవల్ల అనేకవిధాల లాభపడుతూ పాకిస్తాన్తో మనకు పేచీ వచ్చిన ప్రతిసారీ అంతర్జాతీయ వేదికలపై చైనా ఆ దేశాన్నే సమర్థిస్తూ వచ్చింది. ఎల్ఏసీ పొడవునా తరచుగా ఉల్లం ఘనలు సరేసరి. ఒకపక్క ఇరు దేశాల అధినేతలూ పరస్పరం పర్యటనలు జరుపుకోవడం, చర్చలు సాగించడం వంటివి కొనసాగిస్తున్నా ఇది రివాజే. నిరుడు జమ్మూ–కశ్మీర్ ప్రతిపత్తిని మన దేశం మార్చాక చైనాలో మరింత గుబులు బయలుదేరింది. పర్యవసానంగా ఏప్రిల్ నెలాఖరు నుంచి ఎల్ఏసీ వద్ద ఉద్రిక్తతలున్నాయి. పరిస్థితి ఇంతవరకూ వచ్చింది కనుక మన దేశం యధాపూర్వ స్థితిపై గట్టిగా పట్టుబట్టాలి. వాణిజ్యం, సరిహద్దు వివాదం దేని దారి దానిదే అనే పాత విధానం చెల్లదని, ఎవరి హద్దుల్లో వారు వున్నప్పుడే సామరస్య సంబంధాలు ఏర్పడతాయని చెప్పాలి. దేశాల మధ్య వివాదం ఏర్పడినప్పుడు అధికారిక, అనధికారిక స్థాయిల్లో పరస్పరం చర్చలు జరుగుతాయి. అయితే రెండు పక్షాలూ చిత్తశుద్ధితో వున్నప్పుడే మంచి ఫలితాలనిస్తాయి. ఇప్పుడు ఉద్రిక్తతల ఉపశమననానికి మంత్రుల స్థాయి భేటీలు జరగడం మంచి పరిణామమే. వచ్చే నెల్లో ఎస్సీఓ శిఖరాగ్ర చర్చల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల మధ్య చర్చలు జరిగే అవకాశం వుందంటున్నారు. అందులో సరిహద్దు వివాదంపై ఒక అవగాహన కుదరడం ఉభయ దేశాలకూ మంచిది. అందుకు అనువైన వాతావరణం ఏర్పర్చవలసింది చైనాయే. -
త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రక్షణ దళాల చీఫ్ (సీడీఎస్)తో పాటు త్రివిధ దళాల అధిపతులతో శుక్రవారం సమావేశమయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరైన ఈ భేటీలో నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి పరిస్థితిని సమీక్షించారు. తూర్పు లడఖ్లో సుదీర్ఘంగా సాగుతున్న సరిహద్దు ప్రతిష్టంభనకు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వి మధ్య గురువారం మాస్కోలో కీలక భేటీ అనంతరం రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో సరిహద్దు వెంబడి పరిస్థితితో పాటు చైనా విదేశాంగ మంత్రితో విదేశాంగ మంత్రి జై శంకర్ చేపట్టిన చర్చల సారాంశాన్ని సమీక్షించారు. భారత్-చైనా సైనిక కమాండర్ల స్ధాయి చర్చల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. సరిహద్దు ప్రతిష్టంభనను తొలగించేందుకు ఐదు సూత్రాల ప్రణాళికను అనుసరించడంపై గురువారం ఇరు దేశాలు అంగీకారానికి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఒప్పందాలు, ప్రొటోకాల్స్ అన్నిటికీ కట్టుబడాలని, ఉద్రిక్తతలు పెంచే చర్యలకు దూరంగా ఉంటూ శాంతి సామరస్యం కొనసాగేలా చూడాలని పంచసూత్ర ప్రణాళికలో నిర్ణయించారు. మరోవైపు తూర్పు లడఖ్లో డ్రాగన్ సేనలు భారీగా మోహరించడంతో భారత దళాలూ అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలను దీటుగా తిప్పికొట్టేందుకు సన్నద్ధమయ్యాయి. ఎల్ఏసీ వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతున్నా ఇరు దేశాల మధ్య సైనిక కమాండర్ల స్ధాయి చర్చలు చుషుల్లో శుక్రవారం కొనసాగాయి. చదవండి : భారత్, చైనా మధ్య ‘యుద్ధాటకం’ -
అమ్ములపొదిలోకి కొత్త అస్త్రాలు
అంబాలా: భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ మన దేశ వాయుసేన మరింత బలోపేతమైంది. భారత్ అమ్ములపొదిలోకి అయిదు రఫేల్ యుద్ధ విమానాలు వచ్చి చేరాయి. హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో అధికారికంగా వాయుసేనలోకి ఐదు అధునాతన రఫేల్ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా తదితరుల సమక్షంలో ఈ యుద్ధ విమానాలను వాయుసేనలోని 17 స్క్వాడ్రన్ ఆఫ్ ది గోల్డెన్ ఏరోస్కి అప్పగించారు. దీనికి సంబంధించిన ఒక పత్రాన్ని గ్రూప్ కెప్టెన్ హర్కీరత్ సింగ్కు రాజ్నాథ్ అందించారు. రఫేల్ అప్పగింత సమయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించడంతో పాటు విమానాలకు వాటర్ కెనాన్లతో సెల్యూట్ చేశారు. ఆ తర్వాత జరిగిన వైమానిక విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కొత్త పక్షులకు స్వాగతం అని భారత వైమానిక దళం ట్వీట్ చేసింది. రూ.59 వేల కోట్లతో 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్తో నాలుగేళ్ల క్రితమే భారత్ ఒప్పందం చేసుకుంది. గత జూలై 29న మొదటి విడతగా 5విమానాలు హరియాణాలో అంబాలా వైమానికి స్థావరానికి వచ్చాయి. సార్వభౌమాధికారంపై కన్నేస్తే ఊరుకోం: రాజ్నాథ్ రఫేల్ యుద్ధ విమానాలను వాయుసేనలో ప్రవేశపెట్టాక రాజ్నాథ్ మాట్లాడారు. లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని నేరుగానే ప్రస్తావించారు. మన దేశ సార్వభౌమాధికారంపై కన్ను వేసే వారందరికీ ఈ యుద్ధ విమానాల ద్వారా అతి పెద్ద , గట్టి సందేశాన్ని ఇస్తున్నామన్నారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, భౌగోళిక సమగ్రతను కాపాడుకోవడానికి ఎంతవరకైనా వెళతామని ఇదివరకే స్పష్టం చేశానని చెప్పారు. ‘సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో యుద్ధ విమానాలు మన అమ్ములపొదిలోకి చేరడం అత్యంత కీలకంగా మారింది. మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా మనమూ సన్నద్ధం కావాల్సి ఉంది. ప్రధాని మోదీ దేశ భద్రతకే పెద్ద పీట వేస్తారని చెప్పడానికి గర్విస్తున్నాను’అని రాజ్నాథ్ అన్నారు. ప్రపంచంలో రఫేల్ యుద్ధ విమానాలే అత్యుత్తమమైనవని, వాటిని కొనుగోలు చేయడం గేమ్ ఛేంజర్ అని అభివర్ణించారు. దేశ రక్షణ వ్యవస్థని బలోపేతం చేస్తున్నప్పటికీ తాము శాంతిని కాంక్షిస్తామని స్పష్టం చేశారు. భారత్, ఫ్రాన్స్ బంధాల్లో కొత్త అధ్యాయం రఫేల్ యుద్ధ విమానాలు వైమానిక దళంలోకి చేరికతో భారత్, ఫ్రాన్స్ మధ్య స్నేహ సంబంధాలు మరింత పటిష్టమయ్యాయని ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ అన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పారు. భారత రక్షణ వ్యవస్థ బలోపేతం కావడానికి తాము పూర్తిగా సహకరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. గోల్డెన్ ఏరోస్కే ఎందుకు ? మొదటి బ్యాచ్లో వచ్చిన 5 రఫేల్ యుద్ధ విమానాలు 17 స్క్వాడ్రన్ గోల్డెన్ ఏరోస్ ద్వారా సేవలు అందిస్తాయి. వాయుసేనలో గోల్డెన్ ఏరోస్కి ప్రత్యేక స్థానముంది. అంబాలాలో 1951 అక్టోబర్ 1న లెఫ్ట్నెంట్ జనరల్ డీఎల్ స్ప్రింగెట్ నేతృత్వంలో ఈ ప్రత్యేక దళం ఏర్పడింది. ఎలాంటి సంక్లిష్టమైన ఆపరేషన్లయినా ఈ దళమే చేపడుతుంది. పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల నుంచి గత ఏడాది బాలాకోట్ దాడుల వరకు ఎన్నో ఆపరేషన్లలో 17 స్క్వాడ్రన్ గోల్డెన్ ఏరోస్ అద్భుతమైన ప్రతిభని చూపించింది. హార్వార్డ్ 2బీ, హాకర్ హంటర్, మిగ్ 21 వంటి యుద్ధ విమానాలన్నింటినీ తొలుత గోల్డెన్ ఏరోస్ దళం నడిపింది. గత ఏడాది సెప్టెంబర్ 10న రఫేల్ యుద్ధ విమానాల కోసం ఈ దళాన్ని మళ్లీ పునరుద్ధరించారు. ఈ యుద్ధ విమానం నడపడంలో ఇప్పటికే కొందరు పైలట్లు, టెక్నీషియన్లు, ఇంజనీర్లు ఫ్రాన్స్లో శిక్షణ తీసుకున్నారు. -
ముదురుతున్న వివాదం
సరిహద్దు వివాదాన్ని నెలల తరబడి నానిస్తే ఏమవుతుందో భారత–చైనాల మధ్య వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితిని గమనిస్తే అర్ధమవుతుంది. 45 ఏళ్ల తర్వాత తొలిసారి ఆ ప్రాంతంలో తుపాకులు గర్జించాయని వార్తాసంస్థల కథనం. సోమవారం ఈ ఉదంతం చోటుచేసుకుందని మన సైన్యం వివరించింది. చైనా సైనికులు మన సేనల్ని బెదిరించడానికి గాల్లోకి కాల్పులు జరిపాయని అంటున్నారు. కానీ ఈ ఉద్రిక్తతల్ని తగ్గించడానికి తక్షణం ప్రయత్నాలు చేయక పోతే చివరికిది యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే ఎంతో ఆలస్యమైందని చెప్పాలి. అక్కడ మొన్న ఏప్రిల్ నుంచి ఉద్రిక్తతలు రాజుకోవడం మొదలైంది. గాల్వాన్లోయలో భారత్ సైన్యం గస్తీ కాసే ప్రాంతంలోకి వందలాదిమంది సైనికుల్ని తరలించి చైనా భారీ సంఖ్యలో శిబిరాలు ఏర్పాటుచేసుకుంటున్నదని, బంకర్లు నిర్మిస్తున్నదని అప్పట్లో మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ తర్వాత ఇరు దేశాల మధ్యా సైన్యం స్థాయిలో సంప్రదింపులు జరుగుతూనే వున్నాయి. కానీ అవి పెద్దగా ఫలితాన్నిచ్చిన దాఖలా లేదు. ఆ క్రమంలో జూన్లో రెండు దేశాల సైనికుల మధ్యా ఘర్షణలు జరిగాయి. చైనా సైనికులు రాళ్లు, ఇనుపరాడ్లతో దాడికి దిగినప్పుడు మన జవాన్లు 21మంది మరణించారు. మన సైనికుల ఎదురుదాడిలో చైనాకూడా తీవ్రంగా నష్టపోయిందన్న వార్తలొచ్చాయి. గత నెలాఖరున ప్యాంగాంగ్ సో దక్షిణ ప్రాంతంవైపు చొచ్చుకు రావడానికి ప్రయత్నించిన వేయి మంది చైనా సైనికుల్ని మన సేనలు విజయవంతంగా అడ్డుకోగలిగాయి. పర్వతప్రాంత యుద్ధంలో ప్రత్యేక నైపుణ్యం వున్న దళాలు చుశాల్ సెక్టార్లోని కైలాస్ సెక్టార్తోసహా వివిధ చోట్ల అప్రమత్తంగా వుండటం వల్ల ఇది సాధ్యమైందంటున్నారు. ఈ దళాలు ఆ సెక్టార్లోని దాదాపు అన్ని పర్వత ప్రాంతాలనూ ప్రస్తుతం పహారా కాస్తున్నాయి. బహుశా ఈ పరిణామాలతో ఆగ్రహించే చైనా సైన్యం కాల్పులు జరిపివుండొచ్చునని నిపుణులు చెబుతున్న మాట. సరిగ్గా 45 ఏళ్లక్రితం 1975లో చైనా సైనికులు అరుణాచల్ప్రదేశ్లోని వాయువ్య ప్రాంతంలో తులంగ్ పాస్ వద్ద హఠాత్తుగా దాడి చేసి అస్సాం రైఫిల్స్కు చెందిన నలుగురు జవాన్లను కాల్చిచంపారు. మరో ఇద్దరిని చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీశారు. ఎల్ఏసీ వద్ద చైనా తాజాగా అనుసరిస్తున్న ధోరణి ఆంతర్యమేమిటో అందరికీ తెలుసు. ఆక్సాయ్చిన్, లద్దాఖ్ ప్రాంతాల్లో చైనా దాదాపు 38,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆక్రమించిందని మన దేశం చెబుతోంది. కానీ తమ భూభాగమే 90,000 చదరపు కిలోమీటర్లు భారత్ అధీనంలో వుందన్నది చైనా వాదన. జమ్మూ–కశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టినప్పటినుంచీ ప్రస్తుతం తమ అధీనంలోని ఆక్సాయ్చిన్ను భారత్ స్వాధీనం చేసుకోవ డానికి ప్రయత్నిస్తుందన్న బెంగ చైనాకు పట్టుకుంది. గాల్వాన్ సెక్టార్లో ప్యాంగాంగ్ సో, గాల్వాన్ లోయ, హాట్ స్ప్రింగ్, దస్పాంగ్ల వద్ద పైచేయి సాధిస్తే ఆక్సాయ్చిన్వైపు భారత సైన్యం కదలికలను అడ్డుకోవడానికి వీలుంటుందన్న ఆశతోనే గత కొన్ని నెలలుగా ఎల్ఏసీ వద్ద అది చికాకులు సృష్టి స్తోంది. ఇప్పుడు లద్దాఖ్లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఆమధ్య డోక్లామ్ వద్ద వేసిన ఎత్తుగడలనే చైనా ఇక్కడ కూడా ప్రయోగిస్తోందని అర్ధమవుతుంది. డోక్లామ్ వద్ద భూటాన్ భూభా గాన్ని ఆక్రమించుకుని చైనా రోడ్డు నిర్మాణం దాదాపు పూర్తిచేసింది. అక్కడ శాశ్వత కట్టడాలు నిర్మిం చింది. మరింత భూభాగాన్ని ఆక్రమించడానికి కూడా ప్రయత్నిస్తోంది. ఆ ఎత్తుగడే ఎల్ఏసీలోనూ కొనసాగించవచ్చని అనుకుంటున్న వేళ మన సైన్యం దూకుడు దానికి సహజంగానే చికాకు తెప్పి స్తుంది. కానీ ఒకసారంటూ తుపాకులు పేలడం మొదలయ్యాక అది ఏ పరిణామాలకు దారితీస్తుందో ఎవరూ చెప్పలేరు. ముఖ్యంగా సైనిక, దౌత్య, రాజకీయ స్థాయిల్లో ఇరు దేశాల మధ్యా చర్చలు జరు గుతున్నప్పుడు ఇది చోటుచేసుకోవడం సమస్యను మరింత జటిలం చేస్తుంది. మాస్కోలో ప్రారంభమైన షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సమావేశం సందర్భంగా మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కూ, చైనా రక్షణమంత్రి వీ ఫెంఘే కూ మధ్య మొన్న శుక్రవారం జరిగిన దౌత్య స్థాయి సంభాషణలు పరిస్థితిని చక్కదిద్దగలదని అందరూ ఆశించారు. కానీ ఇరు దేశాల మంత్రులూ ఆ తర్వాత విడుదల చేసిన ప్రకటనలు అందుకు అనువుగా లేవు. రాజ్నాథ్ సింగ్ ప్రకటనలో సామరస్య ధోరణి కనబడింది. ఇరు పక్షాలూ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్నదే భారత్ ఉద్దేశమని ఆయన చెప్పారు. కానీ వీ ఫెంఘే ప్రకటనలో ఈ మాదిరి భాష లేదు. మే నెలలో జరిగిన ఘర్షణలకు పూర్తిగా భారత్దే బాధ్యతని ఆయన చెప్పుకొచ్చారు. తమ సేనలు ఎంతో సహనంతో వున్నాయని సమర్థించుకున్నారు. భారత్ సైనికులు వెంటనే వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేశారు. ఇరు దేశాల మధ్యా రాజుకున్న ఉద్రిక్తతలు ఉప శమించడానికి దౌత్యం ఒక్కటే మార్గమని మన విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ చెబుతున్న మాటల్లో నిజముంది. రెండు దేశాల వద్దా అణ్వస్త్రాలున్న ప్రస్తుత పరిస్థితుల్లో సాయుధ ఘర్షణలు ఎంత మాత్రం మంచిది కాదు. ఈ ఉద్దేశంతోనే ఎస్సీఓ విదేశాంగమంత్రుల సమావేశంలో పాల్గొంటున్న సందర్భంగా జైశంకర్ గురువారం చైనా విదేశాంగ మంత్రితో భేటీ కాబోతున్నారు. చూడటానికి రెండు దేశాల సైన్యాల మధ్య తలెత్తిన ఘర్షణలుగా ఇవి కనబడినా వాటి వెనక ప్రధానంగా రాజకీయ కారణాలే వుంటాయి. పరస్పర అపనమ్మకం, భవిష్యత్తు గురించిన శంకలు సైనిక ఉద్రిక్తతలకు దారితీస్తాయి. కనుక చైనా ఇప్పటికైనా వివేకంతో వ్యవహరించి ఎల్ఏసీ వద్ద ఉద్రిక్తతలను సడలించడానికి అరమరికలు లేకుండా మాట్లాడాలి. తన ఉద్దేశాలేమిటో తేటతెల్లం చేయాలి. దబాయింపులకు దిగితే, ఇష్టానుసారం వ్యవహరిస్తే అంతర్జాతీయంగా ఏకాకి అవుతానని గ్రహించాలి. -
వ్యూహాత్మక మోహరింపు
న్యూఢిల్లీ: అదనపు బలగాలను తరలించడం ద్వారా తూర్పు లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సు దక్షిణతీరంలో మూడు వ్యూహాత్మక పర్వత ప్రాంతాలపై భారత్ పట్టుబిగించింది. ఈ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా దుస్సాహం చేయగా... భారత్ సమర్థంగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద భారత భూభాగంలో పాంగాంగ్ సరస్సుకు ఉత్తరవైపు కూడా బలగాల మోహరింపులో వ్యూహాత్మక మార్పులు చేసినట్లు రక్షణశాఖ వర్గాలు బుధవారం తెలిపాయి. తూర్పు లద్దాఖ్లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడిన నేపథ్యంలో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు భారత్, చైనా చూశుల్లో వరుసగా మూడోరోజు బుధవారం మిలిటరీ కమాండర్ స్థాయి చర్చలు జరిపినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. భారత బలగాలు కొన్ని కీలక పర్వత ప్రాంతాలపై మోహరించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఈ ప్రాంతాలన్నీ తమ భూభాగంలోనే ఉన్నాయని, బలగాలను ఉపసంహరించే ప్రసక్తే లేదని భారత్ తేల్చిచెప్పింది. చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకునేందుకు సిద్ధమని, ఒకవేళ చైనా వాస్తవాధీన రేఖ వద్ద ఎలాంటి అతిక్రమణలకు పాల్పడినా దీటుగా బదులిస్తామని రక్షణవర్గాలు పేర్కొన్నాయి. గత కొద్ది రోజుల్లో భారత్ తూర్పు లద్దాఖ్లోని కొన్ని కీలక పర్వత ప్రాంతాల్లో బలగాలను మోహరించి వ్యూహాత్మక ఫలితాలు సాధించిందని చెప్పాయి. 3,400 కిలోమీటర్ల పొడవున్న వాస్తవధీన రేఖ వెంబడి 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని భారత బలగాలను ఆదేశాలు వెళ్లాయి. కాగా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం అత్యున్నత సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద సున్నిత ప్రాంతాల్లో చైనా దుస్సాహసానికి పాల్పడితే భారత్ దూకుడుగానే స్పందించాలని ఈ భేటీలో నిర్ణయించారు. పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలో మరిన్ని బలగాలను మోహరించడంతోపాటు, క్షిపణి నిరోధక ట్యాంకులను, ఇతర ఆయుధాలను తరలించాలని నిర్ణయించారని సంబంధిత వర్గాలు చెప్పాయి. స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ బెటాలియన్ కూడా ఇప్పటికే రంగంలోకి దిగింది. తూర్పువైపు బలగాలు సరిహద్దులో డ్రాగన్ దేశం కవ్వింపునకు పాల్పడుతుండటంతో భారత్ అప్రమత్తమైంది. పశ్చిమ హిమాలయాల వైపు చైనా బలగాలు దురాక్రమణకు యత్నించి ఉద్రిక్తత సృష్టించిన నేపథ్యంలో తూర్పు వైపు అరుణాచల్ప్రదేశ్, సిక్కింలలో సరిహద్దు వెంబడి భద్రతను మరింత పెంచింది. పెద్ద ఎత్తున బలగాలను తరలించింది. సరిహద్దులో అరుణాచల్ప్రదేశ్లోని అంజా జిల్లాలో భారత బలగాలు కదలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతం తనదేనని చైనా చెప్పుకుంటుండటంతో ఇరుదేశాల బలగాల మధ్య ఘర్షణ చెలరేగుతుందనే ఆందోళనలు మొదలయ్యాయి. అయితే బలగాల బాహాబాహీకి ఎంతమాత్రం అవకాశం లేదంటూ ప్రభుత్వ, మిలిటరీ వర్గాలు దీన్ని కొట్టిపారేస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ జరగని రీతిలో గత జూన్లో లద్దాఖ్లో ఘర్షణ జరిగింది. ఇప్పడిప్పడే పరిస్థితులు కుదుటపడుతున్నాయనుకుంటున్న సమయంలో చైనా బలగాలు మరోసారి పాంగాంగ్ దక్షిణ తీరంలో దురాక్రమణకు యత్నించి మరింత అగ్గిని రాజేశాయి. దీంతో చైనా సరిహద్దులో తూర్పువైపునకు భారత్ బలగాలను తరలించిందని ఓ అధికారి చెప్పారు. పెద్ద ఎత్తున ఆర్మీ బెటాలియన్లు మోహరించాయి. అయితే దాడులకు సంబంధించి ఎలాంటి నిర్దేశిత ఆధారాలు లేవు అని అంజా జిల్లా సీనియర్ అధికారి ఆయుషి సుడాన్ చెప్పారు. జూన్లో గల్వాన్లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన తర్వాత భారత బలగాల మోహరింపు మాత్రం చాలా పెరిగిందన్న విషయాన్ని ఆమె స్పష్టంచేశారు. ఆయా గ్రామాల్లోని వారికి మరిన్ని సదుపాయాలు, అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఆందోళన అక్కర్లేదు 1962లో అరుణాచల్ప్రదేశ్ (ఈ ప్రాంతాన్ని చైనా దక్షిణ టిబెట్ అని పిలుస్తుంది) లో భారత్, చైనా మధ్య యుద్ధం జరిగిందని, ఇక్కడ మళ్లీ ఇరు దేశాల మధ్య ఘర్షణ జరగవచ్చని భద్రతారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత బలగాల పెంపు ప్రాధాన్యం సంతరించుకుంది. తూర్పు వైపు భద్రంగా ఉంచేందుకే ఈ చర్య అని భావిస్తున్నారు. భారత మిలటరీ అధికార ప్రతినిధి లెఫ్ట్నెంట్ కల్నల్ హర్షవర్దన్ పాండే మాత్రం బలగాల మోహరింపు సాధారణంగా జరిగే రొటేషన్ ప్రక్రియ అని అన్నారు. దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. సాధారణంగా ఆర్మీ యూనిట్లు మారుతుంటాయి. ఇది నిరంతం జరిగే ప్రక్రియ అని పేర్కొన్నారు. చైనా బలగాలు మాత్రం భారత్లోకి చొరబడుతూనే ఉన్నాయని అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తపిర్ గవో అన్నారు. అంజా జిల్లాలోని వలోంగ్, ఛగ్లాగామ్లు చాలా సున్నితమైన ప్రాంతాలని పేర్కొన్నారు. -
సరిహద్దు ఉద్రిక్తత.. దోవల్ సమీక్ష
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో మంగళవారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నతాధికారులతో సమవేశమయ్యి.. పరిస్థితులను సమీక్షించారు. అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీరితో భేటీ కానున్నారు. ఆగస్టు 29న ఎల్ఏసీ వెంబడి యథాతథ స్థితిని మార్చడానికి గాను 150-200 మంది చైనా సైనికులు ప్రయత్నించినట్లు భారత సైన్యం గుర్తించింది. వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ దళాలు.. డ్రాగన్ చర్యలను తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో ప్రస్తుతం చుషుల్ వద్ద బ్రిగేడ్ కమాండర్ స్థాయిలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.(చదవండి: చైనా కుట్ర: దోవల్ ఆనాడే హెచ్చరించినా..) ఈ నేపథ్యంలో దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే చర్చల ద్వారా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలికే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారత్, చైనా మధ్య ఈ ఏడాది ఏప్రిల్, మే నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనా ఆర్మీ భారత్కు చెందిన ప్యాంగ్యాంగ్ త్సో, ఫింగర్ ఏరియా, గల్వాన్ వ్యాలీ, హాట్ స్ప్రింగ్స్, కొగ్రుంగ్ నాలా ప్రాంతాల్లోకి వచ్చాయి. -
చైనాను వణికిస్తోన్న సమాధి ఫోటో..
న్యూఢిల్లీ: ఇండియా-చైనా దళలా మధ్య జూన్ 15న గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. వీరందరికి మన ప్రభుత్వం సైనిక లాంఛనాలతో అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించింది. దేశం యావత్తు మన జవాన్ల త్యాగాన్ని కొనియాడింది. ఈ ఘర్షణలో చైనా సైనికులు 40 మంది వరకు చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కానీ చైనా నుంచి మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ క్రమంలో తాజాగా ఓ సమాధి రాయి ఫోటో ఇంటర్నెట్లో వైరలవుతుంది. చైనా సైనికులు మరణించారు అనే దానికి ఇదే నిదర్శనం అంటున్నారు నెటిజనులు. చైనీస్ ఇంటర్నెట్ వీబో అకౌంట్లో సైనికుడి సమాధి రాయికి సంబంధించిన ఫోటో ప్రత్యక్షమయ్యింది. క్షణాల వ్యవధిలోనే ఆ ఫోటో మన దేశంలోని చాలా ట్విట్టర్ యూజర్ల అకౌంట్లలో ప్రత్యక్షమయ్యింది. (చదవండి: మారని చైనా తీరు.. మళ్లీ కొత్త నిర్మాణాలు!) ఈ సమాధి రాయి చైనా సైనికుడు చెన్ జియాంగ్రాంగ్కు చెందినదిగా తెలుస్తోంది. సమాధి రాయిపై మాండరిన్ భాషలో ‘69316 దళాల సైనికుడు, పింగ్నాన్, ఫుజియాన్ నుంచి’ అని రాసి ఉంది. అంతేకాక ‘చెన్ జియాంగ్రో సమాధి. జూన్ 2020లో భారత సరిహద్దు దళాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఆయన ప్రాణ త్యాగం చేశారు. మరణానంతరం కేంద్ర సైనిక కమిషన్ జ్ఞాపకం చేసుకుంది’ అని తెలుపుతుంది. 2020 ఆగస్టు 5న దక్షిణ జిన్జియాంగ్ మిలిటరీ రీజియన్లో ఈ సమాధిని నిర్మించినట్లు ఫోటో చూపిస్తోంది. మరణించిన సైనికుడు 19 సంవత్సరాల వయస్సు వాడని.. అతడు 2001 డిసెంబర్లో జన్మించినట్లు సమాధి మీద రాసి ఉంది. అయితే దీనిపై ఇంకా చైనా అధికార యంత్రాంగం స్పందించలేదు. తూర్పు లద్ధాఖ్ సరిహద్దు ప్రాంతంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు రెండు దేశాల సైనిక కమాండర్ల మధ్య పలు దఫాల చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. డ్రాగన్ దేశం సరిహద్దులో భారీ ఎత్తున బలగాలను మోహరిస్తున్న సంగతి తెలిసిందే. -
45 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే ప్రాణనష్టం
న్యూఢిల్లీ: తూర్పు లద్ధాఖ్ సరిహద్దు ప్రాంతంలో భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. గత 45 ఏళ్లలో ఇంత తీవ్రమైన పరిస్థితిని ఇంతవరకు ఎప్పుడు చూడలేదని తెలిపారు. 1962 ఇండో-చైనా యుద్ధాన్ని ప్రస్తావిస్తూ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ ఆంగ్ల వెబ్సైట్కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘1962 యుద్ధం తర్వాత ఎల్ఏసీ వెంబడి ఇంతటి ఉద్రిక్తతను గతంలో ఎన్నడూ చూడలేదు. 45 సంవత్సాల తర్వాత ఈ ఏడాది సరిహద్దులో సైనిక ప్రాణనష్టం జరిగింది. ఎల్ఏసీ వెంట ఇంత భారీ ఎత్తున దళాలు మోహరించడం 45 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం’ అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతితో పాటు పొరుగు దేశాలతో మంచి సంబంధాలే భారత్కు ముఖ్యమని ఇప్పటికే చైనాకు స్పష్టంగా తెలిజశామన్నారు. గతంలో ఇరుదేశాల మధ్య తలెత్తిన సరిహద్దు సమస్యలను దౌత్యంపరంగానే పరిష్కరించుకున్నామన్నారు. ఇప్పుడు కూడా భారత్ శాంతియుతంగానే వ్యవహరిస్తుందని.. సరిహద్దులో యథాతథ స్థితి పునరుద్దరణ కోసం కృషి చేస్తోందన్నారు జైశంకర్. (చదవండి: సాయుధులుగానే ఉన్నారు) అయితే ఇది ఏకపక్షంగా సాధ్యం కాదని.. చైనా కూడా సహకరించాలన్నారు జైశంకర్. ఇరు దేశాల చర్చల ద్వారా ఒక పరిష్కారానికి రావాలని కోరారు. ఎల్ఏసీ వెంట అతిక్రమణలు, దళాల మోహరింపు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అతిక్రమణలను నిరోధించేందుకు రక్షణ దళాలు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. వీటిని నిరోధించడానికి ప్రభుత్వం శాంతియుత పరిష్కారం కోరుతోంది. ఈ ఏడాది ఏప్రిల్-మే నుంచి భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదంకొనసాగుతుంది. ఇక జూన్ 15న చైనా- భారత్ సరిహద్దుల్లో చెలరేగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులను డ్రాగాన్ దేశం పొట్టనపెట్టుకుంది. దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్, జాతీయ సలహాదారు అజిత్ దోవల్ నిరంతరం ప్రయత్నిస్తున్నారు. -
భారత్తో విభేదాల పరిష్కారానికి సిద్ధం
బీజింగ్: ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి, విభేదాల ను సామరస్యంగా పరిష్కరించుకోవ డానికి, పరస్పర రాజకీయ విశ్వాసాలను అభివృద్ధి చేసుకొనేందుకు భారత్తో కలిసి పనిచేయ డానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా ప్రకటించింది. భారత దేశ సార్వభౌమాధికారానికి సవాల్ విసురుతోన్న శక్తులకు భారత సాయుధ దళాలు తగు రీతిలో బుద్ధిచెప్పాయని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ పై విధంగా వ్యాఖ్యానించారు. ఎర్రకోటపై నుంచి 74వ స్వాతంత్య్రదినోత్సవ సందేశాన్నిస్తూ ఎల్ఓసీ నుంచి ఎల్ఏసీ వరకు మా దేశంపై సవాల్ విసురుతోన్న వారికి బుద్ధి చెప్పామని పాకిస్తాన్, చైనాలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. తూర్పు లద్ధాఖ్ సరిహద్దు ప్రాంతంలో చైనాతో ఉన్న ఘర్షణ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని, పాకిస్తాన్ పదే పదే కాల్పుల విరమణని అతిక్రమిస్తూ ఉండడంతో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ఉపన్యాసాన్ని మేము గమనించాం. మేం ఇరుగుపొరుగు దేశాల వాళ్ళం. వందకోట్లకుపైగా జనాభాతో అభివృద్ధి చెందుతోన్న దేశాలు మావి. ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల ఇరు దేశాల ప్రజల ప్రయోజనాలకే కాకుండా, ఈ ప్రాంతపు శాంతి, అభివృద్ధి, స్థిరత్వం యావత్ ప్రపంచానికే మేలు చేస్తుందని ఝావో అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా, ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవడం, సహకరించు కోవడం, సరైన మార్గమని ఝావో ఈ సందర్భంగా అన్నారు. -
గల్వాన్ వీరులకు మరింత గౌరవం
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో భారత్-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణలో మన సైనికులు 20మంది అమరులైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం వారికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. జవాన్ల త్యాగాన్ని దేశం వేనోళ్ల కొనియాడింది. తాజాగా ఈ అమరవీరులకు మరింత గౌరవం ఇవ్వడం కోసం కేంద్రం సిద్ధమయినట్లు సమాచారం. నాటి ఘర్షణలో అసవులు బాసిన ఈ 20 మంది సైనికుల పేర్లను ‘నేషనల్ వార్ మెమోరియల్’పై చెక్కేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి కొద్ది నెలల్లో ఇది ప్రారంభం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. (చైనా సరిహద్దుల్లో కీలక నిర్మాణాల వేగవంతం) జూన్ 15న లద్దాఖ్ గల్వాన్ వ్యాలీలో పెట్రోలింగ్ పాయింట్ 14 చుట్టూ చైనా ఒక నిఘా పోస్టును నిర్మించడాన్ని భారత సైనికులు వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఇరు దేశాల దళాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈ దాడిలో చైనా సైనికులు.. రాళ్లు, మొలలు దిగిన కర్రలు, ఇనుప రాడ్లతో మన సైనికులపై దాడి చేశారు. నాటి ఘటనలో 16 బిహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బీ సంతోష్ బాబుతో సహా 20 మంది సైనికులు మరణించారు. ఈ ఘర్షణలో చైనా సైనికులు 35 మంది చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. చైనా వారికి ప్రభుత్వ లంఛనాలతో అంత్యక్రియలు కాదు కదా కనీసం అమరులైనా సైనికుల పేర్లు కూడా వెల్లడించలేదు. కానీ భారత్ మాత్రం మన సైనికుల త్యాగాన్ని గర్వంగా వెల్లడించింది. -
అక్కడ బలగాల ఉపసంహరణకు చైనా నిరాకరణ
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసి) వెంట బలగాల ఉపసంహరణకు భారత్-చైనా ఇరు దేశాలు అంగీకరించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఈ అంశంపై చైనా మాటమారుస్తోంది. ఈ క్రమంలో ఎంతో ముఖ్యమైన పాంగాంగ్ త్సో సరస్సు ప్రాంతం, గోగ్రా పోస్ట్ నుంచి బలగాల ఉపసంహరణకు చైనా నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు కీలకమైన పాయింట్ల నుంచి ఇంతవరకు ఎలాంటి ఉపసంహరణ జరగలేదని విశ్వసనీయ సమాచారం. పాంగాంగ్త్సో ప్రాంతంలో పూర్తిగా ప్రతిష్టంభన ఏర్పడగా.. గోగ్రా పోస్ట్ ప్రాంతంలో ఉపసంహరణ తాజాగా నిలిచిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో సమస్య మళ్లీ మొదటికొచ్చేలా ఉందంటున్నారు అధికారులు. ఇదిలా ఉండగా చైనా కీలకంగా భావించిన హాట్స్ర్పింగ్ ప్రాంతం నుంచి బలగాల ఉపసంహరణ ఈ రోజు మొదలైనట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు ఈ ప్రాంతంలో చైనా అదనంగా 40 వేల మంది సైనికులను మోహరించినట్లు వార్తలు వచ్చాయి. (వెనక్కి తగ్గిన చైనా) భారత్-చైనా సైనిక కమాండర్ల మధ్య ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయి. జూన్ 15న లద్దాఖ్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించి కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకుంది. దాంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. వీటిని తగ్గించుకునేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం కొన్ని పాయింట్ల నుంచి బలగాల ఉపసంహరణ జరిగింది. (చైనాపై ‘విసర్జికల్ స్ట్రైక్’) -
చైనా వక్ర బుద్ధి.. సరిహద్దుల్లో 40 వేల సైన్యం
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంట భారత్-చైనాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించుకునేందుకు కార్ప్స్ కమాండర్ల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు సైనిక ఉపసంహరణ గురించి చర్చలు జరిగాయి. కానీ చైనా వీటిని ఏమాత్రం లెక్కపెట్టడం లేదు. తాజాగా చైనా ఎల్ఏసీ వెంబడి 40 వేల మంది సైనికులను మోహరించింది. డ్రాగన్ దేశం చర్యలను చూస్తే.. ఉద్రిక్తతలను తగ్గించే ఆలోచన ఏమాత్రం లేనట్లు అర్థమవుతుంది అంటున్నారు అధికారులు. వాయు రక్షణ వ్యవస్థలు, సాయుధ సిబ్బంది, సుదూర ఫిరంగిదళాలు వంటి భారీ ఆయుధాల మద్దతు ఉన్న దాదాపు 40,000 మంది సైనికులను మోహరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.(బెదిరించైనా బహిష్కరించైనా గెలవగలమా?) గత వారం జరిగిన రెండు కార్ప్స్ కమాండర్ల మధ్య చివరి రౌండ్ చర్చలు కూడా ఫలితాన్ని ఇవ్వలేదని అధికారులు భావిస్తున్నారు. ఎల్ఏసీ వెంబడి పరిస్థితుల్లో ఎలాంటి పురోగతి లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అలానే చైనా ఫింగర్ 5 ప్రాంతం నుంచి వెళ్లడానికి సిద్దంగా లేదు. అంతేకాక ఇక్కడ ఒక పరిశీలన పోస్ట్ ఏర్పాటు చేయాలని అనుకుంటుంది. అందువల్ల చైనా తన శాశ్వత స్థానం సిర్జాప్కు వెళ్లడానికి సిద్ధంగా లేదు. అంతేకాక తూర్పు లద్దాఖ్లోని రెండు ప్రధాన ఉద్రిక్త ప్రాంతాలైన హాట్ స్ప్రింగర్స్, గోర్జా పోస్ట్ ప్రాంతాల్లో చైనా భారీ మొత్తంలో నిర్మాణాలు చేస్తోంది. ఈ రెండు ప్రాంతాల నుంచి తాము వెనక్కి వెళ్తే భారత్ సరిహద్దు వెంబడి తమ ప్రాంతాలను ఆక్రమించే అవకాశం ఉందనే సాకును ముందు పెడుతుంది చైనా. -
సంతోష్ బాబు కుటుంబంతో కేసీఆర్ భోజనం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల భారత్-చైనా సరిహద్దుల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం, రూ. 5 కోట్ల నగదు.. ఆయన భార్యకు గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంతోష్ బాబు భార్య సంతోషికి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు బుధవారం ప్రగతి భవన్లో సంతోషికి అందించారు. ఆమెకు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సంతోషికి సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో కుదరుకునే వరకు తోడుగా ఉండాలని సీఎం తన కార్యదర్శి స్మితా సభర్వాల్ను కోరారు. సంతోషితో పాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. అలానే ఇంటి స్థలానికి సంబంధించి షేక్పెట్ మండలంలో మూడు స్థలాల్లో ఇష్టం వచ్చిన ప్లేస్ను కోరుకోవాలని కేసీఆర్ గతంలోనే వారికి సూచించారు. ఈ క్రమంలో సంతోష్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు వారికి బంజారాహిల్స్లో స్థలం కేటాయించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో కేబీఆర్ పార్కుకు ఎదురుగా రూ.20 కోట్ల విలువైన 711 గజాల స్థలం కేటాయించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఉదయం ఈ స్థలాన్ని పరిశీలించారు. మంత్రి జగదీష్ రెడ్డి చేతులు మీదుగా స్థలం కాగితాలను సంతోష్ కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దీపికా యుగంధర్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
‘మోదీ చైనా ఒత్తిడికి లొంగిపోయారు.. అందుకే ఇలా’
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దు వివాదంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల ముందు మోదీ జనంలో తాను చాలా బలమైన నేతననే అభిప్రయాన్ని ఏర్పర్చరని అన్నారు. కానీ ఆ ఇమెజ్ నేడు భారత్కు అతి పెద్ద బలహీతగా మారిందని రాహుల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తన ట్విట్టర్లో ఈ రోజు ఓ వీడయోను పోస్ట్ చేశారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో రాహుల్ మోదీని విమర్శించడమే కాక.. చైనా వక్ర బుద్ధిని దుయ్యబట్టారు. వీడియోలో రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చేందుకు మోదీ తానో బలవంతుడినన్న బూటకపు ఇమేజ్ను క్రియేట్ చేశారని విమర్శించారు. కానీ ఇప్పుడు అది భారత్కు బలహీనంగా మారిందన్నారు. మోదీ ప్రతిష్టకు, చైనా ప్రణాళికలకు ఏ రకంగా సంబంధం ఉంటుందో రాహుల్ తన వీడియోలో వివరించారు. ('ఆ దాడి ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది') యావత్ భూమండలాన్ని చేజిక్కించుకోవాలని చైనా ఎత్తుగడలు వేస్తున్నట్లు రాహుల్ తన వీడియోలో ఆరోపించారు. ప్రణాళిక లేకుండా చైనీయులు ఏమీ చేయరని, వారు తమ మధిలో ఓ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నారన్నారు. దానికి తగినట్లుగా వాళ్లు ఆ ప్రపంచాన్ని తయారు చేసుకుంటున్నారన్నారు రాహుల్. గదార్, బెల్ట్ రోడ్ దానిలో భాగమే అన్నారు. వాళ్లు పూర్తిగా భూగ్రహాన్ని మార్చేస్తున్నట్లు రాహుల్ విమర్శించారు. అయితే ఇలాంటి వ్యూహాత్మక సమయంలో.. కీలకమైన గల్వాన్, డెమ్చోక్, పాన్గాంగ్ సరస్సుల వద్ద చైనా తన ప్రాభవాన్ని పెంచుకున్నట్లు రాహుల్ తెలిపారు. మన హైవేల వల్ల చైనీయులు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. చైనా.. పాకిస్తాన్తో కలిసి కశ్మీర్లో హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తుందని రాహుల్ ఆరోపించారు. (మేడిన్ చైనా రామాయణం) PM fabricated a fake strongman image to come to power. It was his biggest strength. It is now India’s biggest weakness. pic.twitter.com/ifAplkFpVv — Rahul Gandhi (@RahulGandhi) July 20, 2020 భారత్, చైనా మధ్య ఉన్న ఉద్రిక్తలు కేవలం సరిహద్దు సమస్యగా చూడరాదన్నారు రాహుల్. బోర్డర్ సమస్యతో ప్రధాని మోదీపై ఒత్తిడి తెస్తున్నారని, మోదీ ప్రతిష్టపై చైనీయులు దాడి చేస్తున్నారన్నారు రాహుల్. తాము చెప్పినట్లు చెప్పకుంటే, మోదీ బలమైన నేత అన్న భావాన్ని రూపుమాపే విధంగా వ్యవహరిస్తామని చైనా మోదీని బెదిరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం మోదీ తన ప్రతిష్ట పట్ల ఆందోళన చెందుతున్నట్లు అర్థమవుతుందన్నారు. చైనీయులు మన భూభాగంలోకి ప్రవేశించారన్నారు రాహుల్. కానీ మోదీ మాత్రం మన దేశంలోకి ఎవరు రాలేదని అంటున్నారు. దీన్నిబట్టే మోదీ, చైనా ఒత్తిడికి తలొగ్గతున్నట్లు అర్థమవుతుందన్నారు. చైనా చెప్పినట్లు మోదీ వింటే, ఆయన ఈ దేశానికి ప్రధాని కాదు అని రాహుల్ వీడియోలో విమర్శలు చేశారు.(మేక్ ఇన్ ఇండియా అంటూ చైనావే కొంటోంది) -
22 నుంచి వైమానిక ఉన్నతాధికారుల భేటీ
న్యూఢిల్లీ: తూర్పు లద్ధాఖ్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్–చైనా సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితిని పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు, చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు వైమానిక దళం ఉన్నతాధికారులు ఈ నెల 22వ తేదీ నుంచి మూడు రోజులపాటు సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా, ఏడుగురు కమాండర్ ఇన్ చీఫ్లు పాల్గొంటారని భారత వైమానిక దళం ప్రతినిధి తెలిపారు. చైనా సరిహద్దుల్లో వైమానిక దళం ఇప్పటికే మోహరించింది. మిరేజ్–2000, సుఖోయ్–30, మిగ్–29 తదితర అత్యాధునిక యుద్ధ విమానాలను పలు బేస్ స్టేషన్లలో సిద్ధంగా ఉంచింది. మరోవైపు మొదటి దశ రఫేల్ ఫైటర్లు జెట్లు ఈ మాసాంతంలోనే ఫ్రాన్స్ నుంచి భారత్కు చేరుకోనున్నాయి. ఈ ఫైటర్ జెట్లను లద్ధాఖ్ సెక్టార్లో మోహరించాలని యోచిస్తున్నారు. ఉన్నతాధికారుల సమావేశంలో దీనిపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. -
లద్దాఖ్లో రాజ్నాథ్ సింగ్ పర్యటన
-
‘ఏ శక్తి అంగుళం భూమిని కూడా తీసుకోలేదు’
లద్దాఖ్: సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్-చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి పరిస్థితులను సమీక్షించేందుకు ఆయన పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్నాథ్ వెంట త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు రాజ్నాథ్ సింగ్. ‘భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి చర్చలు జరుగుతున్నాయి. అయితే దీని వల్ల సమస్య ఎంత వరకు పరిష్కారమవుతుంది అనే దానికి మాత్రం నేను హామీ ఇవ్వలేను. కానీ ఒక్కటి మాత్రం నమ్మకంగా చెప్పగలను. ప్రపంచంలోని ఏ శక్తి కూడా మన భూమిని అంగుళమైనా తీసుకోలేదు’ అని రాజ్నాథ్ స్పష్టం చేశారు. (నిబంధనలు పాటించాల్సిందే!) రాజ్నాథ్ మాట్లాడుతూ.. ‘ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చిన ఏకైక దేశం భారతదేశం. మేము ఎప్పుడూ ఒక దేశంపై దాడి చేయలేదు. ఏ దేశ భూములను ఆక్రమించుకోలేదు. ‘వసుదైక కుటుంబం’ (ప్రపంచమంతా ఒకే కుటుంబం) సందేశాన్ని మేము నమ్ముతాం. మాకు హింస కాదు శాంతి కావాలి. ఇతర దేశాల గౌరవాన్ని దెబ్బతీయడం మా స్వభావం కాదు. అలా అని మా దేశ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే సహించం. తగిన సమాధానం చెప్తాం’ అన్నారు. అంతేకాక ‘మా సైన్యం గురించి గర్వపడుతున్నాము. నేడు మా జవాన్ల మధ్య నిలబడటం గర్వంగా ఉంది. మా జవాన్లు దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు. మొత్తం 130 కోట్ల మంది భారతీయులు మీకు కలిగిన నష్టానికి బాధపడుతున్నారు’ అని ఆయన అన్నారు. అనంతరం వారికి మిఠాయిలు పంపిణీ చేశారు. గల్వాన్ లోయ వద్ద చైనాతో జరిగిన ఘర్షణలో పాల్గొన్న సైనికులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. (ధీటుగా బదులివ్వండి.. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ!) -
లద్దాఖ్లో పర్యటించనున్న రాజ్నాథ్ సింగ్
సాక్షి, న్యూడిల్లీ : భారత్-చైనా సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం లద్దాఖ్లో పర్యటించనున్నారు. ఆయతో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే కూడా లద్దాఖ్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వాస్తవధీనరేఖ(ఎల్ఏసీ) వద్ద పరిస్థితిని రాజ్నాథ్ సమీక్షించనున్నారు. అలాగే సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులను మంత్రి కలవనున్నారు. అలాగే ఆ మరుసటి రోజు రాజ్నాథ్ సింగ్ శ్రీనగర్లో పర్యటిస్తారు. నియంత్రణ రేఖ, శ్రీనగర్ లోయలో నెలకొన్న పరిస్థితిని ఆయన సమీక్షించనున్నారు. (‘నైపుణ్యాలే స్వావలంబన భారతావనికి శక్తి’) కొద్ది రోజులే కిందటే రాజ్నాథ్ సింగ్ లద్దాఖ్ పర్యటను వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. అది కాస్త వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈలోపే ప్రధాని మోదీ లద్దాఖ్లో ఆకస్మిక పర్యటన చేపట్టారు. విస్తరణ కాంక్షతో ఉన్న శక్తులు పరాజయం పాలవడమో, పలాయనం చిత్తగించడమో జరిగిందని చరిత్ర చెబుతోందని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరులైన సైనికుల త్యాగాలను కొనియాడారు. వారి ధైర్య సాహసాలకు సెల్యూట్ చేశారు.(కశ్మీర్లో కలకలం.. బీజేపీ కార్యకర్త కిడ్నాప్) మరోవైపు తూర్పు లద్దాఖ్లోని వివాదస్పద ప్రాంతాల నుంచి ఇరు దేశాల బలగాలు ఎప్పటిలోగా వెనక్కి వెళ్లాలన్న దానిపై ప్రణాళిక రూపొందించేందుకు భారత్-చైనా మిలటరీ కమాండర్లు మంగళవారం సమావేశమై 10 గంటలపాటు సుధీర్ఘంగా చర్చించారు. లెఫ్టినెంట్ జనరల్ అధికారుల స్థాయిలో జరిగిన ఈ నాలుగో సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ వెంట ఉన్న సాయుధ బలగాలు, ఆయుధాలను సాధ్యమైనంత త్వరగా వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు.(సెల్యూట్.. బ్రేవ్ హార్ట్స్!) -
‘ట్రంప్ భారత్కు మద్దతిస్తాడని గ్యారెంటీ లేదు’
వాషింగ్టన్: భారత్-చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా జాతీయ భద్రతా మాజీ సలహాదారు జాన్ బోల్టన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగితే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు మద్దతు ఇస్తారనే గ్యారెంటీ లేదని అన్నారు. ఒక టెలివిజన్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోల్టన్ ఈ విషయం చెప్పారు.(గల్వాన్ దాడి; విస్తుగొలిపే నిజాలు!) చైనా తన అన్ని సరిహద్దుల్లో దూకుడుగా ప్రవర్తిస్తున్నదని ఈ కారణంగా.. జపాన్, ఇండియా, ఇతర దేశాలతో దాని సంబంధాలు క్షీణించాయని అన్నారు బోల్టన్. చైనా-భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ట్రంప్, భారత్ వైపు నిలుస్తాడనేది అనుమానమే అని తెలిపారు. నవంబర్ ఎన్నికల తరువాత ట్రంప్ ఇంకా ఏం చేస్తారో చెప్పలేమన్నారు. చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని తిరిగి కొనసాగించినా ఆశ్చర్యపోవద్దని సూచించారు. రాబోయే కొద్ది నెలల్లో ట్రంప్ ఇలాంటి అన్ని విషయాల నుంచి పక్కకు తప్పింకుంటారన్నారు. ఈ సారి తనను ఎన్నుకోవడం కష్టమని తెలిసినందున ట్రంప్ సరిహద్దులో శాంతినే కోరుకుంటారని బోల్టన్ పేర్కొన్నారు. ట్రంప్ పరిపాలనలో 2018 ఏప్రిల్ నుంచి 2019 సెప్టెంబర్ వరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా బోల్టన్ సేవలందించారు. -
భారత్, చైనా శాంతి మంత్రం
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి పూర్తిస్థాయిలో శాంతి నెలకొనేలా చర్యలు తీసుకోవాలని భారత్, చైనా ఒక అంగీకారానికి వచ్చాయి. తూర్పు లద్దాఖ్లో సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. ఇరు దేశాల దౌత్య ప్రతినిధులు మరోసారి శుక్రవారం ఆన్లైన్ ద్వారా చర్చలు జరిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిస్థాపన కోసం సరిహద్దుల్లో సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవడానికి ఇరు దేశాల ప్రతినిధులు అంగీకరించారు. ఎల్ఏసీ వెంబడి సైనికుల ఉపసంహరణ పురోగతిపై సమీక్షించారు. భారత్, చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం అమెరికా రక్షణ మంత్రి మార్క్ టీ ఎస్పర్తో చర్చలు జరిపారు. తూర్పు లద్దాఖ్లో పరిస్థితిపై రాజ్నాథ్ సమీక్ష తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి చైనా బలగాల ఉపసంహరణ అనంతర పరిస్థితులపై శుక్రవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష జరిపారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియాతోపాటు పలువురు సీనియర్ సైనికాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒప్పందం ప్రకారం సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణలో మొదటి దశ పూర్తయినట్లేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్ అమ్ముల పొదిలో మరిన్ని ‘అపాచీ’లు భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్కు 22 అపాచీ, 15 చినూక్ హెలికాప్టర్ల అందజేత పూర్తి చేసినట్లు అమెరికా విమానయాన సంస్థ బోయింగ్ ప్రకటించింది. ఒప్పందం ప్రకారం అపాచీ యుద్ధ హెలికాప్టర్లలోని చివరి ఐదింటిని ఇటీవల భారత వైమానిక దళానికి అందజేసినట్లు బోయింగ్ సంస్థ వెల్లడించింది. (చైనా హెచ్చరికలు.. ఖండించిన కజకిస్థాన్!) -
చైనాపై మోదీ ట్వీట్; ‘సమాధానం చెప్పాల్సిందే’
న్యూఢిల్లీ : గతంలో చైనాపై మోదీ చేసిన ట్వీట్ను గుర్తు చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు శశిథరూర్, రణదీప్ సింగ్ సుర్జేవాలా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. అప్పటి కేంద్రాన్ని ఉద్ధేశిస్తూ మోదీ స్వయంగా చేసిన తన ట్వీట్పై ప్రస్తుతం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా 2013లో చైనా-భారత్ బలగాలను ఉద్ధేశించి గుజరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ ఓ ట్వీట్ చేశారు. ‘లడఖ్ నుంచి చైనా తన బలగాలను ఉపసంహరించుకుంది. కానీ తమ సొంత భూభాగం నుంచి భారత బలగాలు ఎందుకు వైదొలుగుతున్నాయి. మనం ఎందుకు వెనక్కి తగ్గాము’. అని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. (సీఎం నివాసాన్ని తాకిన కరోనా) ఈ ట్వీట్ ప్రస్తుతం సరిహద్దుల్లో గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతకు దగ్గరగా ఉంది. గల్వన్ లోయ వద్ద పెట్రోలింగ్ పాయింట్స్ ప్రాంతంలో ఇరు దేశ సైన్యాలు తాత్కాలిక నిర్మాణాలు నిలిపివేసి, వెనక్కు వెళ్లేందుకు ఇరు వర్గాలు అంగీకరించినట్లు అధికార వర్గాలు ఆధివారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఇరు దేశాల ముఖ్య నేతల మధ్య జరిగిన ఒప్పందం మేరకు తమ బలగాలను వెనక్కి పిలిపించాయి. ఈ క్రమంలో ఒకప్పటి మోదీ ట్వీట్ను ప్రస్తావిస్తూ ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు చర్చకు దారీతీశారు. (‘ప్రభుత్వ అసమర్థతకు పోలీసులు బలి’) కాంగ్రెస్ నేత శశి థరూర్.. నరేంద్ర మోదీ2013 ట్వీట్ను రీట్వీట్ చేస్తూ.. ‘మోదీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. ప్రధాని తన ప్రశ్నకు సమాధానం చెప్పాలి’. అని ప్రశ్నించారు. ఇదే క్రమంలో రణదీప్ సుర్జేవాలా కూడా స్పందించారు. ‘ప్రధాని.. మీ మాటలు మీకు గుర్తుందా? ఈ పదాలకు ఏమైనా విలువ ఉందా? భారత బలగాలు తమ భూభాగంలో ఎందుకు ఉపసంహరించుకుంటున్నాయో మీరు చెబుతారా? దేశం సమాధానం కోరుకుంటుంది’. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
చైనా సరిహద్దుల్లో కీలక నిర్మాణాల వేగవంతం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో లడఖ్లో 20,000 కోట్ల రూపాయల విలువైన రహదారి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. రహదారుల ప్రాజెక్టులపై సమీక్షలో భాగంగా కీలక ప్రాజెక్టులన్నింటినీ వేగవంతం చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారులకు సూచించారు. ప్రస్తుతం భారత్-చైనా ప్రతిష్టంభనకు కారణమైన దర్బక్-శ్యోక్-దౌలత్ బేగ్ ఓల్దీ రోడ్ నిర్మాణ పనులనూ వేగవంతం చేయాలని చెప్పారు. ఈ రోడ్డు నిర్మాణాన్ని రెండు నెలల కిందటే భారత్ చేపట్టిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రోడ్డు నిర్మాణ పనులతో పాటు వాస్తవాధీన రేఖతో అనుసంధానించేలా 30 వంతెనల నిర్మాణాన్నీ వేగవంతం చేయనున్నారు. 30 శాశ్వత వంతెనలు ఇప్పటికే నిర్మాణంలో ఉండగా 20,000 కోట్ల రూపాయల విలువైన రహదారి నిర్మాణ పనులను ముందుకు తీసుకువెళ్లాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. వీటిలో పలు హైవేలు, సొరంగ మార్గాలు వివిధ నిర్మాణ దశల్లో ఉండగా మరికొన్ని ప్రాజెక్టులకు ప్రణాళికలు చేపట్టాల్సి ఉందని చెప్పారు. చైనా సరిహద్దు వెంబడి ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో లేహ్, తోస్, కార్గిల్ ఎయిర్ఫీల్డ్ల్లో వైమానిక దళ కార్యకలాపాలూ ఊపందుకున్నాయి. ఫార్వర్డ్ స్ధావరాలకు దళాలను, సామాగ్రిని తరలించేందుకు మెరుగైన కనెక్టివిటీ అవసరమని అధికారులు చెబుతున్నారు. సరిహద్దు వెంబడి ప్రాంతాల్లో నివసించే సైనికులతో పాటు పౌరులకూ సౌకర్యంగా ఉండేలా రోడ్ కనెక్టివిటీని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చదవండి : రష్యాకు రాజ్నాథ్.. కీలక చర్చలు -
భారత్ సవాళ్ళేంటి?
-
వెనక్కి తగ్గిన చైనా
న్యూఢిల్లీ: దాదాపు రెండు నెలలుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న చైనా సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్లో శాంతి, సంయమనం దిశగా తొలి అడుగులు పడ్డాయి. ఉద్రిక్తతలకు కేంద్ర స్థానమైన గల్వాన్లోయ నుంచి సోమవారం చైనా దళాలు వెనక్కు వెళ్లాయి. పెట్రోలింగ్ పాయింట్(పీపీ) 14 వద్ద నిర్మించిన తాత్కాలిక శిబిరాలు, ఇతర నిర్మాణాలను తొలగించాయి. దాదాపు కిలోమీటరుకు పైగా చైనా బలగాలు వెనక్కు వెళ్లాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే, ఎంత దూరం వెనక్కు వెళ్లాయో కచ్చితంగా తెలియదన్నాయి. ఇరుదేశాల కమాండర్ స్థాయి ఆర్మీ అధికారుల మధ్య జరిగిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల మేరకు చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభమైందని వెల్లడించాయి. అయితే, భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ రంగంలోకి దిగిన తరువాతే ఈ ప్రక్రియ వేగవంతమైనట్లు తెలుస్తోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో ధోవల్ ఆదివారం ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. బలగాల ఉపసంహరణను వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఈ చర్చల సందర్భంగా నిర్ణయించారు. సరిహద్దుల్లో శాంతి నెలకొనాలంటే ముందు బలగాల ఉపసంహరణ జరగాలని, అభిప్రాయభేదాలు ఘర్షణలుగా మారకుండా జాగ్రత్త పడాలని ఇరువురు అంగీకారానికి వచ్చారు. ధోవల్, వాంగ్ యి భారత్, చైనాల తరఫున సరిహద్దు చర్చల్లో ప్రత్యేక ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. రెండు దేశాల ఆర్మీలకు భారీగా ప్రాణనష్టం సంభవించిన జూన్ 15 నాటి గల్వాన్ ఘర్షణల తరువాత ఈ ఇద్దరు చర్చించుకోవడం ఇదే ప్రథమం. సరిహద్దుల్లో ఇటీవలి పరిణామాలపై ఆదివారం నాటి చర్చల్లో ధోవల్, వాంగ్ నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారని భారత విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటించింది. వాస్తవాధీన రేఖను ఇరుదేశాలు గౌరవించాలని, య«థాతథ స్థితిని ఏకపక్షంగా ఎవరూ ఉల్లంఘించరాదని అంగీకారానికి వచ్చారని తెలిపింది. సరిహద్దుల్లో పూర్తి స్థాయిలో శాంతి నెలకొనేవరకు దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగించాలని ధోవల్, వాంగ్ యి నిర్ణయించారని పేర్కొంది. వేగంగా, దశలవారీగా వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకునే విషయంపై అంగీకారానికి వచ్చినట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఇరు దేశాల ఆర్మీ కమాండర్ స్థాయి చర్చల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని నిర్ణయించారని పేర్కొంది. ద్వైపాక్షిక సంబంధాలు మరింత సానుకూలంగా ముందుకు సాగాలంటే సరిహద్దుల్లో శాంతి నెలకొనడం ఆవశ్యకమని ఇరువురు ఏకాభిప్రాయానికి వచ్చారని తెలిపింది. ధోవల్, వాంగ్ యి మధ్య జరిగిన చర్చలపై చైనా విదేశాంగ శాఖ కూడా ప్రకటన విడుదల చేసింది. ఇరువురి మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించి లోతైన చర్చ జరిగిందని పేర్కొంది. భారత్, చైనాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 సంవత్సరాలు అవుతున్న విషయాన్ని వాంగ్ చర్చల్లో ప్రస్తావించారని వెల్లడించింది. పీపీ 14, పీపీ 15, పీపీ 17ల నుంచి వెనక్కు.. పీపీ 14, పీపీ 15, పీపీ 17ల నుంచే కాకుండా, గొగ్రా హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల నుంచి కూడా చైనా బలగాలు, వాహనాలు సోమవారం వెనక్కు వెళ్లాయి. పాంగాంగ్ సొ నుంచి వెనక్కు వెళ్లాయా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా భారత్కు పెరిగిన మద్దతు, ఇటీవల లేహ్ పర్యటనలో ప్రధాని మోదీ ఇచ్చిన స్పష్టమైన సందేశం.. చైనా తాజా నిర్ణయానికి దోహదపడి ఉండొచ్చని పేర్కొన్నాయి. సరిహద్దు వివాదంపై చైనాతో దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. చర్చలే ప్రారంభం కానట్లయితే, పరిస్థితి మరింత దారుణంగా మారేదని వ్యాఖ్యానించారు. ‘కరోనా మహమ్మారి సమయంలో దౌత్య సంబంధాలు’ అనే అంశంపై జరిగిన వెబినార్లో సోమవారం ఆయన పాల్గొన్నారు. ‘దేశాలు పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలి. చర్చలు జరగాలి. అలా జరగని పక్షంలో, సమస్యలు, ఘర్షణలు పెరుగుతాయి. ఉదాహరణకు, చైనాతో సరిహద్దు వివాదానికి సంబంధించి చర్చలు జరగనట్లయితే, పరిస్థితి మరింత దారుణంగా మారేది’ అని వివరించారు. -
వెనక్కి తగ్గిన చైనా బలగాలు
-
గల్వాన్ దాడి; విస్తుగొలిపే నిజాలు!
న్యూఢిల్లీ/బీజింగ్: ఓ వైపు చర్చల్లో పాల్గొంటూనే మరోవైపు సరిహద్దులో బలగాలను మెహరిస్తూ చైనా కుయుక్తులు ప్రదర్శిస్తోంది. భారత భూభాగాన్ని తమ ప్రాంతంగా ప్రకటించుకుంటూ భారత్ను రెచ్చగొట్టింది. గల్వాన్లో సైనికులను దొంగదెబ్బ తీసి దారుణానికి పాల్పడింది. ఈ నేపథ్యంలో మన దేశంలో చైనాపై ఎంత విముఖత ఏర్పడిందో, పర్యవసానంగా భారత్.. చైనాపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా గల్వాన్ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు అమర వీరులయ్యారు. ఇనుప చువ్వలు బిగించి ఉన్న రాడ్లతో చైనా సైనికులు భారత సైనికులపై దాడి చేసి కొట్టి చంపారు. అయితే వారితో ఘర్షణ సందర్భంగా భారత సైనికులు ఆయుధాలు వాడలేదన్న విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. (చైనాకు చెక్ : మరోసారి మోదీ మార్క్) ఐదుగురు జవాన్ల మృతదేహాలపై గాయాల గుర్తులు నిరాయుధులైన సైనికులను చైనా ఆర్మీ చుట్టుముట్టి దాడికి తెగబడిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అమరుల కుటుంబాలకు జారీ చేసిన డెత్ సర్టిఫికెట్లలో విస్తుగొలిపే నిజాలు వెలుగు చూశాయి. ముగ్గురు సైనికుల మెడ దగ్గర లోతైన గాయాలు కావడంతో రక్తనాళాలు పూర్తిగా చిట్లిపోయి మరణించారని తేలింది. మరో ఇద్దరు పదునైన, మొనదేలి ఉన్న వస్తువులతో దాడి చేయడం వల్ల మరణించినట్లు తెలిసింది. వీరందరీ తల, మెడపై గాయాల గుర్తులు ఉన్నట్లు మరణించిన సైనికుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇక చీకట్లో సైనికులు రక్షిత ప్రాంతానికి వెళ్లలేకపోయారని ఇదే అదనుగా భావించిన డ్రాగన్ ఆర్మీ వారిపై కర్కశంగా దాడికి దిగిందని కొందరు ఆర్మీ సైనికులు తెలిపారు. ఈ క్రమంలో కొందరిని గల్వాన్ నదిలోకి తోసేయగా గడ్డకట్టిన మృతదేహాలను తరువాతి రోజు ఉదయం బయటకు తీసినట్లు ఢిల్లీ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. (చైనా ముప్పును ఎదుర్కొందాం) సైనికులను లోయలోకి తోసేసి.. చైనా ఇచ్చిన మాట ప్రకారం తన బలగాలను వెనక్కు తీసుకెళ్లిందా, నిర్మాణాలను కూల్చివేసిందా లేదా అనేది ధ్రువీకరించడానికి జూన్ 15న అర్ధరాత్రి గల్వాన్లో బిహార్ రెజిమెంట్ కమాండింగ్ అధికారి కల్నల్ సంతోష్ కుమార్ పెట్రోల్ పాయింట్ 14 దగ్గరకు వెళ్లి చూడగా వివాదం మొదలైంది. చైనా సైనికులు మాటకు బదులుగా చేతికి దొరికిన ఆయుధాలతో (ఇనుప రాడ్లు, మేకులతో కూడిన గదల్లాంటి ఆయుధాలను) భారత సైనికులపై మెరుపువేగంతో దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన భారత ఆర్మీ వెన్నుపోటు పొడిచిన చైనా ఆర్మీపై విజృంభించింది. ఈ ఘర్షణలో 40 మంది చైనా సైనికులు మరణించినట్టు వార్తలు వచ్చినా డ్రాగన్ ధ్రువీకరించలేదు. (లద్దాఖ్కు క్షిపణి వ్యవస్థ) -
గల్వాన్పై ఎందుకు చైనా కన్ను?
న్యూఢిల్లీ/బీజింగ్: భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం మూడు దఫాలు చర్చలు జరిగినా సమసిపోలేదు. చైనా మరో అడుగు ముందుకు వేసి తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయ తమదేనని సార్వభౌమాధికారం ప్రకటించుకొని మరింత అగ్గి రాజేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలకు గల్వాన్ ప్రాంతమే ఎందుకంత కీలకం? 1962 యుద్ధంలో గల్వాన్ లోయ ఎందుకు ప్రాధాన్యంగా మారింది? పర్వత సానువుల్లో భారత్ బలగాలు పటిష్టంగా ఎలా ఉన్నాయి? ఎవరి సైనిక సత్తా ఎంత? వంటివన్నీ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. రెండు పక్షాలకీ వ్యూహాత్మక ప్రాంతం భారత్, చైనా దేశాలకు వ్యూహాత్మకంగా గల్వాన్ లోయ అత్యంత కీలకం. సబ్ సెక్టార్ నార్త్ (ఎస్ఎస్ఎన్)లో గల్వాన్ లోయ ఉంది. వివాదాస్పద ప్రాంతమైన ఆక్సాయిచిన్ నుంచి భారత్లోని లద్దాఖ్ దాకా గల్వాన్ నది ప్రవహిస్తూ ఉంటుంది. లేహ్కు చెందిన అన్వేషకుడు గులామ్ రసూల్ గల్వాన్ పేరునే ఈ నదికి పెట్టారు.వాస్తవాధీన రేఖ వెంబడి పశ్చిమాన నదీ పరివాహక ప్రాంతాల్లో గల్వాన్ లోయ ప్రాంతం ఎత్తు తక్కువగా ఉంటుంది. భారత్ బలగాలు ఆక్సాయిచిన్ చేరుకోవాలంటే గల్వాన్ లోయ గుండా చేరుకోవడం సులభం. అంతేకాకుండా పాకిస్తాన్, చైనాలోని జిన్జియాంగ్, లద్దాఖ్ సరిహద్దులతో గల్వాన్ లోయ కలిసి ఉంది. గల్వాన్ నది టిబెట్ నుంచి ప్రవహిస్తూ షివోక్ నదిలో కలుస్తుంది. ఈ నదికి సమీపంలో ఉత్తర లద్దాఖ్ను కలుపుతూ ప్రధాన రహదారి ఉంది. చైనా బలగాలు దీనిని ఆక్రమిస్తే మనకి రోడ్డు ఉండదు. అందుకే గల్వాన్ ప్రాంతం భారత్కు అత్యంత కీలకం. ఈ ప్రాంతంలో భారత్ మౌలిక సదుపాయాల కల్పన, షియోక్ నది వీదుగా వంతెన నిర్మాణం, లేహ్, దౌలత్ బేగ్ ఓల్దీలను కలుపుతూ 255 కి.మీ. పొడవున రోడ్డు నిర్మాణం వంటివి చైనాకు కంటగింపుగా మారాయి. లద్దాఖ్ని కేంద్ర పాలిత ప్రాంతం చేసిన దగ్గర్నుంచి డ్రాగన్ దేశం సరిహద్దుల్లో విషం చిమ్ముతూనే ఉంది. దేశం కోసం ప్రాణత్యాగానికి జవాన్లు సిద్ధం భారత సైన్యం అత్యంత ఉత్సాహంతో ఉందనీ, గతంలో మాదిరిగానే జవాన్లు దేశం కోసం జీవితాలను త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఇండో టిబెటన్ బోర్డర్ పోలిస్ (ఐటీబీపీ)డైరెక్టర్ జనరల్ ఎస్.ఎస్.దేశ్వాల్ పేర్కొన్నారు. చైనాతో సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ప్రధాని మోదీ ఇటీవల లద్దాఖ్లో పర్యటించడం, నిములో చేసిన ప్రసంగంతో సరిహద్దుల్లో ఉన్న సైన్యంలో ధైర్యం ఇనుమడించిందని అన్నారు. పర్వత శ్రేణుల్లో మనకి లేరు పోటీ ! ప్రపంచంలో అత్యధిక సైనికులున్న మన బలగానికి ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనే, పోరాడే శక్తి ఉంది. సైనిక బలగాల సంఖ్యలో భారత్, ఉత్తర కొరియా తర్వాత స్థానమే చైనాకు దక్కుతుంది. అయితే ఆయుధాల పరంగా చైనా అత్యంత బలంగా ఉంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఏప్రిల్ నుంచి చెలరేగుతున్న ఘర్షణల్లో మన సైనికులు చైనాకు గట్టిగానే బుద్ధి చెబుతున్నారు. పర్వత శ్రేణుల్లో, పీఠభూముల్లో భారత్ సైనికులకు మించిన వారు లేరని స్వయంగా చైనా నిపుణులే కితాబు ఇచ్చిన సందర్భాలున్నాయి. ‘‘ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యంత అనుభవమైన, పటిష్టమైన సైనిక బలగాలున్న దేశం అమెరికా, రష్యా, యూరప్ కానే కాదు. అది భారత్’’అని చైనాలో మోడర్న్ వెపనరీ మ్యాగజైన్ సీనియర్ ఎడిటర్ హాంగ్ ఘాజి ఇటీవల తాను రాసిన ఆర్టికల్లో ప్రశంసించారు. వాస్తవాధీన రేఖ వెంబడి మొత్తం 12 డివిజన్లలో 2 లక్షలకుపైగా మన సైనికులు రేయింబగళ్లు గస్తీ తిరుగుతున్నారు. 1970 నుంచి భారతీయ ఆర్మీ తన పరిధిని విస్తరిస్తూ పర్వతాల్లో పెద్ద ఎత్తున సైనికుల్ని మోహరిస్తోంది. భారతీయులెవరైనా సైన్యంలో చేరాలంటే పర్వతారోహణ చెయ్యడం తప్పనిసరి. ప్రపంచం లోనే అత్యంత ఎత్తైన ప్రాంతమైన సియాచిన్లో వందలాది శిబిరాలను భారత్ ఏర్పాటు చేసిందని హాంగ్ తన వ్యాసంలో వివరించారు. నాటి యుద్ధంలోనూ... 1962లో భారత్, చైనా యుద్ధం కూడా గల్వాన్ లోయ ప్రాంతంలోనే జరిగింది. అప్పట్లో చైనా జిన్జియాంగ్ నుంచి టిబెట్కు 179 కి.మీ. పొడవున రోడ్డు నిర్మించింది. ఈ రోడ్డు భారత్కు చెందిన ఆక్సాయిచిన్ ప్రాంతం గుండా వెళుతుంది. భారత్ అనుమతి లేకుండానే ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడమే అప్పట్లో ఇరుపక్షాల మధ్య అగ్గి రాజేసింది. యుద్ధం తర్వాత కూడా చైనా ఎన్నో ప్రాంతాలను ఆక్రమించింది. ఆక్సాయిచిన్ తమదేనని ప్రకటించుకుంది. గల్వాన్ ప్రాంతంపై పట్టు సాధిస్తే భారత్ బలగాలు ఆక్సాయిచిన్ చేరే అవకాశం లేదని భావిస్తున్న చైనా పథకం ప్రకారమే దాడులకు తెగబడుతోంది. పీఠభూముల్లోనూ, పర్వత శ్రేణుల్లో భారత్ సైనికులు బలంగా ఉంటే, ఆక్సాయిచిన్ ప్రాంతంలో చైనా బలంగా ఉంది. అత్యాధునికమైన ఆయుధాలు కూడా ఆ దేశం దగ్గర ఉండడం కలవర పెట్టే అంశం. అయితే 1962తో పోల్చి చూస్తే భారత్ అన్ని రకాలుగా బలమైన దేశంగా అవతరించింది. ‘‘ఆక్సాయిచిన్లో చైనా బలంగా ఉంది. అయితే కరోనా వైరస్తో చైనా అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ దౌత్యపరంగా బలహీనంగా ఉండటం మనకు లాభం చేకూరే అంశం’’ అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు ఎస్డీ ముని వ్యాఖ్యానించారు. -
దేనికైనా సిద్ధం!
-
ఎల్ఏసీలో సంసిద్ధంగా వైమానిక దళం
న్యూఢిల్లీ: తూర్పులద్దాఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంట చైనా సైనిక సంపత్తిని తరలించడంతో భారత్ దీటుగా చర్యలు తీసుకుంటోంది. అమెరికా, రష్యా తయారీ యుద్ధ, రవాణా విమానాలను ఈ ప్రాంతంలో వాడుతోంది. కీలకప్రాంతాల్లో నిఘా విధులతోపాటు ఫార్వర్డ్ పోస్టులకు జవాన్లను, ఇతర ముఖ్యమైన పరికరాలు, సామగ్రిని ఇవి తరలిస్తున్నాయి. రష్యా తయారీ అత్యాధునిక సుఖోయ్–30 ఎంకేఐలు, ఎంఐజీ–29 యుద్ధ విమానాలు ఇప్పటికే గగనతలంలో పహారాకాస్తున్నాయి. సరిహద్దులకు సమీపంలోని ఈ వైమానిక కేంద్రంలో అమెరికా తయారీ రవాణా వాహనాలు సీ–17, సీ–130జేతోపాటు రష్యా తయారీ ఇల్యుషిన్–76, ఆంటొనొవ్–32లు కూడా ఇక్కడ మోహరించారు. తూర్పు లద్దాఖ్ సెక్టార్లో యుద్ధ విధుల కోసమే ప్రత్యేకించిన అపాచీ యుద్ధ విమానాలను వినియోగించుకుంటున్నారు. ఆర్మీ, ఐటీబీపీ బలగాలను సరిహద్దుల సమీపంలోకి తరలించేందుకు చినూక్, ఎంఐ–17వీఐ హెలికాప్టర్లను రంగంలోకి దించారు. మొత్తమ్మీద ఈ ఎయిర్ బేస్ విమానాల రాకపోకలతో సందడిగా మారింది. ‘ఈ ప్రాంతంలో ఈ ఎయిర్ బేస్ చాలా కీలకమైంది. యుద్ధ విధులతోపాటు, ఇతర అవసరాలకు కూడా ఇక్కడి నుంచే సరఫరాలు అందుతుంటాయి. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది’ ఓ అధికారి అన్నారు. -
‘చైనా వైపు రెండింతలు చనిపోయారు’
న్యూఢిల్లీ : భారత్కు చెడు చేయాలని చూసేవారికి దీటైన సమాధానం చెబుతామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణ త్యాగం చేశారని.. కానీ చైనా వైపు ఆ సంఖ్య రెండింతలుగా ఉంటుందని చెప్పారు. గురువారం పశ్చిమ బెంగాల్లోని వర్చువల్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. సరిహద్దుల్లో గత కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న పరిస్థితులపై స్పందించారు. ప్రస్తుతం మనం రెండు ‘సీ’ ల గురించి వింటున్నామని.. అందులో ఒకటి కరోనా వైరస్ అని, మరోకటి చైనా అని అన్నారు. భారత ప్రభుత్వం శాంతిపై నమ్మకంతో.. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాలని చూస్తుందని వెల్లడించారు. (చదవండి : ఆ అక్కాచెల్లెళ్లు.. నిత్యానంద ‘కైలాస’లో) గల్వాన్ ఘర్షణ తర్వాత వారివైపు జరిగిన ప్రాణ నష్టంపై చైనా ఎలాంటి స్పష్టత ఇవ్వని విషయాన్ని గుర్తించాలన్నారు. గతంలో పాక్ భూభాగంలోకి వెళ్లి చేసిన సర్జికల్ స్ట్రైక్స్ను ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. అలాగే గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగం వృథా కానివ్వమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్న మాటలను గుర్తుచేశారు. మరోవైపు 59 చైనీస్ యాప్ల నిషేధంపై స్పందిస్తూ.. భారతీయులు డేటా రక్షించేందుకు డిజిటిల్ స్ట్రైక్ ప్రారంభించామని చెప్పారు. కాగా, గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో భారత్ తమవైపు 20 మంది జవాన్లు మృతిచెందినట్టుగా ప్రకటించగా.. చైనా మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయని సంగతి తెలిసిందే. -
డ్రాగన్ కుతంత్రం
-
భారత్ వ్యతిరేకత.. చైనా ఆశ్చర్యం
న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం డోక్లాంలో భారత సైన్యం.. ఇండియా-చైనా-భూటాన్ ట్రై జంక్షన్ ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంది. అయితే భారత్ చర్యలకు చైనా ఆశ్చర్యపోయిందని.. ఇండియా తమను సవాలు చేయడం ఏంటని చైనా షాక్కు గురయ్యిందని ఆ దేశ నిపుణురాలు, అమెరికాలోని స్టిమ్సన్ సెంటర్లో ఈస్ట్ ఆసియా ప్రోగ్రాం సహ డైరెక్టర్ యున్ సన్ తెలిపారు. మన దేశానికి చెందిన ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు. అంతేకాక అప్పటి నుంచి చైనా వ్యూహాల్లో మార్పు వచ్చిందని.. భారత్తో పరస్పరం చర్చలు జరపడానికి ముందుకు రావడం దానిలో భాగమే అన్నారు యున్ సన్. భారత్, చైనా మధ్య 2017లో డోక్లాం ప్రతిష్టంభన గురించి యున్ సన్ మాట్లాడుతూ.. ‘2017లో డోక్లాం వివాదం చైనాని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే భారతదేశం తనను వ్యతిరేకిస్తుందని.. దాదాపు 72-73 రోజుల పాటు వివాదం నడుస్తుందని చైనా ఊహించలేదు. అది కూడా భూటాన్ సమీపంలోని బంజరు భూమి కోసం భారత్ తనను వ్యతిరేకిస్తుందని అస్సలు అనుకోలేదు. నిజంగా ఇది చైనాకు షాక్ లాంటిదే’ అన్నారు యున్ సన్. (నిషేధంతో చైనా గుబులు) వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట తూర్పు లడాఖ్లో కొనసాగుతున్న చైనా తాజా దురాక్రమణ గురించి యున్ సన్ను ప్రశ్నించగా.. ‘సరిహద్దు సమీపంలో భారతదేశం కార్యకలాపాలపై స్పందించాల్సిన అవసరం ఉందని చైనా అధికారులు భావించారు. దీని గురించి మీరు ఒక చైనా ప్రభుత్వ అధికారిని అడిగితే .. వారి సమాధానం ఎలా ఉంటుందంటే.. ‘వాస్తవ నియంత్రణ రేఖ వెంట భారతదేశం చర్యలు మాకు అంగీకారం కావు. వాటిపై చైనా స్పందిస్తోంది’ అని సమాధానమిస్తారు’ అన్నారు యున్ సన్. ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన ఎల్ఏసీ వెంబడి ఉన్న ప్రదేశాల గురించి ఎన్నో ఏళ్లుగా వివాదం కొనసాగుతుందని తెలిపారు. (సరిహద్దుల్లో ఉద్రిక్తత.. సై అంటే సై!) అంతేకాక ‘భారతదేశం తమ ప్రాంతంలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మిస్తోందని చైనీయులు గుర్తించినప్పుడు ఎలా స్పందించాలి అనేది వారి ఇష్టం. భారతదేశం తమను వెన్నుపోటు పొడిచిందని చైనీయులు భావించారు. ప్రస్తుతం భారతదేశం చైనాను ఒక అసాధారణస్థితిలో పెడుతోంది. అలాంటప్పుడు చైనా దూకుడుగా స్పందించి భారతదేశంపై దాడి చేయాలి.. లేదా ఏమి చేయకుండా భూభాగాన్ని వదులుకోవాలి’ అని యున్ సన్ అన్నారు. -
రాహుల్పై ప్రజ్ఞా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు
భోపాల్: చైనాతో ఘర్షణ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజుకున్న మాటల యుద్ధానికి ఇప్పట్లో తెరపడేటట్టు లేదు. తాజాగా బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్.. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ... వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తి మాత్రమే ఈ దేశాన్ని రక్షించగలడని చాణక్య చెప్పారు. ఒక విదేశీ మహిళకు జన్మించిన వ్యక్తి ఎప్పటికి దేశభక్తుడు కాలేడు’ అంటూ ప్రజ్ఞా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ‘మీకు రెండు దేశాల పౌరసత్వం ఉంటే, మీలో దేశభక్తి భావాలు ఎలా ఉంటాయి’ అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి నైతికత, నీతి, దేశభక్తి లేదని ఆరోపించారు. ‘ఒకసారి కాంగ్రెస్ పార్టీ లోపలికి చూడాలి. వారికి ఎలా మాట్లాడాలో తెలియదు. ఆ పార్టీకి నీతి, ధైర్యం, దేశభక్తి లేవు’ అని ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ విరుచుకుపడడ్డారు. అయితే ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ విదేశీ మూలాలు గురించి బీజేపీ తరచుగా విమర్శలు చేయడం సాధారణమే. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వ్యాఖ్యల పట్ల మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జేపీ ధనోపియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఎమ్పీ పదవికి అవమానానన్ని తెచ్చిపెట్టారని ఆరోపించార. ఉగ్రవాద కేసులో చిక్కుకున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ గురించి.. రాహుల్ గాంధీ గురించి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజ్ఞా మతిసస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని.. ఆమెకు వెంటనే తగిన చికిత్స అందించాలని ధనోపియా తెలిపారు. -
చైనా ముప్పును ఎదుర్కొందాం
వాషింగ్టన్: ఇండియా, మలేసియా, ఇండోనేíసియా, ఫిలిప్పైన్స్ తదితర దేశాలకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) నుంచి ముప్పు పెరుగుతోందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో చెప్పారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆయా దేశాలకు మద్దతుగా తమ సేనలను పంపించే విషయం ఆలోచిస్తున్నామని తెలిపారు. గురువారం జర్మన్ మార్షల్ ఫండ్కు చెందిన బ్రసెల్స్ ఫోరమ్–2020 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆసియాలో పలు దేశాలకు ముప్పుగా పరిణమించిన పీఎల్ఏకు దీటైన సమాధానం చెప్పాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను బట్టి తాము సరైన రీతిలోనే స్పందిస్తామని వ్యాఖ్యానించారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు వనరులను ఉపయోగిస్తామని చెప్పారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్గదర్శకత్వంలో తమ వ్యూహం ఉంటుందని, అందులో భాగంగానే జర్మనీలో తమ సైనిక బలగాలను 52,000 నుంచి 25,000కు తగ్గిస్తున్నట్లు తెలిపారు. జర్మనీ నుంచి తరలించే తమ బలగాలను నిర్దేశిత ప్రాంతాల్లో మోహరిస్తామన్నారు. ఇండియా, వియత్నాం, మలే సియా, ఇండోనేసియా, ఫిలిప్పైన్స్, దక్షిణ చైనా సముద్రంలో తమ సేనల అవసరం ఉందన్నారు. మనమంతా కలిసికట్టుగా పని చేయాలి శత్రువు విసురుతున్న సవాళ్ల నుంచి మన స్వేచ్ఛాయుత సమాజాలను, మన శ్రేయస్సు, మన భవిష్యత్తును కాపాడుకోవడానికి మనమంతా కలిసికట్టుగా పని చేయాలని మైక్ పాంపియో పిలుపునిచ్చారు. అదంత సులభం కానప్పటికీ మన కృషిని కొనసాగించాలని అన్నారు. చైనా వల్ల ప్రయోజనాలు పొందుతున్న వ్యాపార వర్గాలు భిన్నమైన వాదన వినిపిస్తున్నాయని గుర్తుచేశారు. స్వేచ్ఛ, నియంతృత్వం మధ్య ఎప్పుడూ రాజీ కుదరదని స్పష్టం చేశారు. చైనా ఇతర దేశాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. మన భవిష్యత్తును చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్దేశించడం ఏమిటని ప్రశ్నించారు. దక్షిణ చైనా సముద్రంలో, ఇండియాతో సరిహద్దు విషయంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని తప్పుపట్టారు. చైనాపై ఇండియన్ అమెరికన్ల నిరసన తూర్పు లద్దాఖ్లో చైనా సైనికులు తిష్టవేయడాన్ని నిరసిస్తూ షికాగోలోని చైనా కాన్సులేట్ వద్ద పలువురు ఇండియన్ అమెరికన్లు చైనా వ్యతిరేక నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులు చేతబూని ప్రదర్శన చేపట్టారు. చైనా దుందుడుకు చర్యలపై తాము మౌనంగా ఉండబోమని వారు స్పష్టం చేశారు. అలా చేస్తే పర్యవసానాలు తీవ్రం సరిహద్దుల్లో యధాతథ స్థితిని మార్చే ప్రయత్నాలు చేయవద్దు చైనాకు భారత్ హెచ్చరిక బీజింగ్: సరిహద్దుల్లో యధాతథ స్థితిని మార్చాలని ప్రయత్నిస్తే పరిణామాలు, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని భారత్ చైనాను ఘాటుగా హెచ్చరించింది. అలాంటి ప్రయత్నాలు చేస్తే సరిహద్దుల్లో శాంతికి విఘాతం కలగడమే కాకుండా, విస్తృతమైన ద్వైపాక్షిక సంబంధాలపై పెను ప్రతికూల ప్రభావం పడుతుందని స్పష్టం చేసింది. తూర్పు లద్దాఖ్లో కార్యకలాపాలను నిలిపేయాలని చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్త్రీ శుక్రవారం స్పష్టం చేశారు. సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలతో ఆ దేశంపై విశ్వాసం సన్నగిల్లిందన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు సజావుగా ఉండాలంటే.. సరిహద్దుల్లో శాంతి నెలకొనడం అత్యంతావశ్యకమన్న విషయం చైనా గుర్తించాలని మిస్త్రీ హితవు పలికారు. గల్వాన్ లోయ తమదేనని చైనా పదేపదే చెప్పడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు. వాస్తవాధీన రేఖపై భారత్కు పూర్తిగా అవగాహన ఉందని, ఎల్ఏసీకి ఇటువైపు, ఇండియన్ ఆర్మీ పెట్రోలింగ్ చాన్నాళ్లుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతోందని గుర్తు చేశారు. జూన్ 15 నాటి ఘర్షణకు కారణం భారత సైనికులేనన్న చైనా వాదనను విక్రమ్ మిస్త్రీ తోసిపుచ్చారు. ‘ఏప్రిల్, మే నెలల్లో గల్వాన్ లోయలో చైనా కార్యకలాపాలు పెరిగాయి. భారత పెట్రోలింగ్ను పదేపదే అడ్డుకున్నారు. అందుకే ఘర్షణలు చోటు చేసుకున్నాయి’ అని స్పష్టం చేశారు. రాజ్నాథ్తో ఆర్మీ చీఫ్ భేటీ న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్లో వాస్తవ పరిస్థితిని, భారత సైన్యం సన్నద్ధతను ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె శుక్రవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు వివరించారు. జూన్ 23, 24 తేదీల్లో జనరల్ నరవణె లద్దాఖ్లో పర్యటించి, క్షేత్ర స్థాయి పరిస్థితిని సమీక్షించిన విషయం తెలిసిందే. రాజ్నాథ్ కూడా 22 నుంచి 24 వరకు రష్యాలో పర్యటించి వచ్చారు. సరిహద్దుల రక్షణ బాధ్యత సర్కారుదే: సోనియా న్యూఢిల్లీ: భారత సరిహద్దులను కాపాడే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. లడ్దాఖ్ పరిస్థితుల విషయంలో దేశప్రజల అభిప్రాయాలను విశ్వాసంలోకి తీసుకోవాలని ప్రధాని మోదీకి సూచించారు. భారత్ చైనా సరిహద్దుల్లోని లడ్దాఖ్లో ప్రాణత్యాగాలు చేసిన సైనిక అమరవీరుల స్మారకార్థం కాంగ్రెస్ చేపట్టిన ‘స్పీక్ అప్ ఫర్ అవర్ జవాన్స్’కార్యక్రమంలో సోనియా వీడియో సందేశం ఇచ్చారు. ప్రధాని మోదీ చెప్పినట్టు భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొని రాకపోతే, 20 మంది భారత సైనికులు ఎందుకు ప్రాణాలు కోల్పోయారని ప్రశ్నించారు. మన సైన్యానికి సంపూర్ణ సహకారాన్ని, శక్తిని అందించడమే నిజమైన దేశభక్తి అవుతుందని సోనియా అన్నారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకోలేదని ప్రధాని చెప్పడం పొరుగు దేశానికి మేలు చేయడమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తన వీడియో సందేశంలో ఆయన..తూర్పు లడ్దాఖ్లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని ఉపగ్రహ చిత్రాలు, రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. -
గల్వాన్పై చైనాలో అసమ్మతి సెగ!
బీజింగ్: గల్వాన్ ప్రాంతంలో దురాక్రమణకు పాల్పడటం ద్వారా పొరుగుదేశం చైనా ఏం బావుకుందో ఏమో తెలియదుగానీ.. దేశంలోనే కాకుండా.. విదేశాల్లోని స్వదేశీయుల నుంచి అసమ్మతిని మాత్రం మూటగట్టుకుంటోంది. చైనాలో ప్రభుత్వం కనుసన్నలలో నడిచే మీడియా, సామాజిక మాధ్యమాల్లో భారత వ్యతిరేక వ్యాఖ్యానాలు చర్చలు కొనసాగుతున్నా.. ఇతర మాధ్యమాల్లో, విదేశాల్లోని చైనీయుల మధ్య జరుగుతున్న ఆన్లైన్ సంభాషణల్లోనూ గల్వాన్ లోయలో చైనా వ్యవహారంపై పలువురు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే పూర్తయి వివరాలు వెల్లడి కావాల్సిన ఓ ఆన్లైన్ సర్వే ద్వారా ఈ విషయం తెలుస్తోందని జాతీయ స్థాయి టెలివిజన్ చానల్ ఒకటి ఒక కథనాన్ని ప్రచురించింది. సుమారు 75 వేల మంది సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్లను విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు సెక్ల్యాబ్ అండ్ సిస్టమ్స్ అనే సంస్థ చెబుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చైనా ప్రభుత్వం మద్దతుతో నడిచే కొన్ని వ్యూహాత్మక సంస్థల్లో పనిచేసే వారు కూడా ప్రభుత్వం తీరు సరికాదని వ్యాఖ్యానించడం. సెక్ ల్యాబ్ అండ్ సిస్టమ్స్ సోషల్మీడియా నెట్వర్క్లను గణిత శాస్త్ర సూత్రాల ఆధారంగా విశ్లేషించింది. ప్రవాస చైనా జర్నలిస్టుల సోషల్ మీడియా పోస్టుల్లో గల్వాన్ విషయంలో చైనా వైఖరిపై అసంతృప్తి వ్యక్తమవుతూండగా.. అదృశ్య శక్తి ఒకటి ఒకటి వీటన్నింటి వెనుక ఉందని చైనా ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని వీరు భావిస్తున్నారు. వీరే కాకుండా.. హాంకాంగ్, తైవాన్లలో ప్రజాస్వామ్యానికి మద్దతుగా ఆందోళనలు నిర్వహిస్తున్న వారు, ఇతర మద్దతుదారుల్లోనూ ఇదే తరహా సెంటిమెంట్లు నడుస్తున్నాయి. ట్విట్టర్లో సుమారు 34 వేల మంది ఫాలోయర్లు ఉన్న జర్నలిస్ట్, చైనీస్ కుమిన్టాంగ్ విప్లవ కమిటీ సభ్యుడు డెంగ్ యూవెన్ భారత్తో సరిహద్దు గొడవలు చైనా నేతలకు ఏమాత్రం తగని పని అని ఒక కథనంలో వ్యాఖ్యానించారు. భారత్ చైనాల మధ్య యుద్ధం అసాధ్యమని గతంలో అనుకునేవాళ్లమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని యూవెన్ వ్యాఖ్యానిస్తున్నారు. ట్విట్టర్లో రెండు లక్షల కంటే ఎక్కువమంది ఫాలోయర్లు ఉన్న హు పింగ్ కూడా యూవెన్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చైనాలోనే కొంతమంది పౌరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేస్తూండటం గమనార్హం. ప్రభుత్వ పెద్దల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని, కమ్యూనిస్టు పార్టీ అంతర్గత సమావేశాల రికార్డింగ్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వాంగ్ కియాన్కిన్ ఒక ట్వీట్ చేశారు. కొంత కాలానికే ఈ ట్వీట్ డెలిట్ కావడం గమనార్హం. భారత్ అత్యవసరంగా రష్యా నుంచి 33 యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తూండటం వారి సంబంధాలు చైనా కంటే ఆ దేశంతోనే బాగున్నాయని నిరూపిస్తున్నాయని ట్వీట్ ద్వారా వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు, ట్వీట్లు, ఆలోచనలు ఒక పద్ధతి ప్రకారం వస్తున్నవి ఏమీ కావని, ప్రస్తుతానికి వీటిని గుసగుసలుగానే పరిగణించాలని సెక్ల్యాబ్స్ నిర్వహించిన సర్వే చెబుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఊపిరిపోసుకుని ఆ తరువాత ఓ వ్యవస్థీకృత ఉద్యమంగా మారిన పలు ఉద్యమాలు కూడా ఇలాంటి చెదురుమదురు అసంతృప్తికర వ్యాఖ్యలతోనే మొదలైన విషయాన్ని గుర్తించాలని చెబుతోంది. -
చైనా మైండ్ గేమ్
న్యూఢిల్లీ: భారత్, చైనా ఘర్షణల్లో డ్రాగన్ దేశం చేసిన అరాచకాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. జూన్ 15 రాత్రి హింసాత్మక ఘటనల తర్వాత గాయపడిన మన దేశ జవాన్లను అప్పగించడంలో చైనా తన కుటిల బుద్ధిని బయటపెట్టింది. మొత్తం 10 మంది సైనికుల్ని తమ నిర్బంధంలో ఉంచుకున్న చైనా భారత్కు అప్పగించడానికి మీన మేషాలు లెక్కించింది. చివరికి మూడు రోజుల తర్వాత వారిని అప్పగించింది. ఈ వివరాలను ఆర్మీ అధికారి ఒకరు జాతీయ చానెల్తో పంచుకున్నారు. జూన్ 15 రాత్రి ఇరు దేశాల మధ్య భీకరమైన పోరాటం జరిగాక అక్కడంతా శ్మశాన నిశ్శబ్దం నెలకొంది. అప్పటికింకా వెలుగు రేఖలు విచ్చుకోలేదు. ఒకవైపు గల్వాన్ నదిలో నిర్జీవంగా మారిన అమరవీరులు, మరోవైపు తీవ్రంగా గాయపడి నేలకొరిగిన జవాన్లతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఆ చీకట్లోనే ఇరువైపులా సైనికులు తమ తోటివారి కోసం వెతుకుతున్నారు. కల్నల్ స్థాయి అధికారి సహా ఇతర చైనా సైనికుల్ని మరుక్షణంలోనే భారత్ ఆ దేశానికి అప్పగించింది. కానీ చైనా వారి భూభాగంలో గాయపడిన 50 మంది భారత్ సైనికుల్ని 24 గంటల తర్వాతే అప్పగించింది. మరో నలుగురు అధికారులు సహా 10 మంది సైనికుల్ని తమ దగ్గర నిర్బంధించింది. మూడు రోజులపాటు చర్చలు మన ఆర్మీ సిబ్బంది పదుగురిని క్షేమంగా వెనక్కి తెచ్చుకోవడానికి భారత్ ఎంతో శ్రమపడాల్సి వచ్చింది. మూడు రోజులు చైనా అధికారులతో సంప్రదింపులు జరిపింది. ఆ పది మంది సైనికులు తమ వద్దే ఉన్నారని చెప్పిన చైనా వారిని అప్పగించడానికి ఆలస్యం చేస్తూ వచ్చింది. చర్చల సందర్భంగా సైనికుల్ని అప్పగించడానికి ఏదో వంక చెప్పేది. చివరికి ఎలాగో జూన్ 18న విడుదల చేసింది. చైనా ఎందుకిలా చేసింది? మూడు రోజుల పాటు తమ దగ్గరే చైనా ఎందుకు వారిని ఉంచింది ? విడుదల చేయడంలో ఎందుకీ జాప్యం ? అన్న ప్రశ్నలకు మన ఆర్మీ సైనికులు అదంతా చైనా మైండ్ గేమ్లో భాగం అని అంటున్నారు. భారత్ అలా నిరీక్షిస్తే మానసికంగా బలహీనంగా మారుతుందని తద్వారా చర్చల్లో పైచేయి సాధించవచ్చునని చైనా కుయుక్తులు పన్నిందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికీ సరిహద్దుల్లో నివురుగప్పిన నిప్పులాగే పరిస్థితులు ఉన్నాయి. పాంగాంగ్ లేక్ ద్వారా చైనా ఏ క్షణమైనా మనపై విరుచుకుపడే అవకాశాలున్నాయి. చైనా ఏ రకమైన కుట్ర పన్నినా ఎదుర్కోవడానికి భారత్ బలగాలు అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నట్టుగా ఆర్మీ వర్గాలు వివరించాయి. -
మే నుంచే మోహరింపు
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి మే నెల తొలి వారం నుంచే చైనా పెద్ద ఎత్తున బలగాలను, ఆయుధాలను, వాహనాలను మోహరిస్తోందని భారత్ ఆరోపించింది. సరిహద్దుల వద్ద చైనా తీరు గతంలో ఏకాభిప్రాయంతో కుదిరిన ఒప్పందాలను ఉల్లంఘిస్తూ బలగాల మోహరింపు సాగిందంది. తూర్పు లద్దాఖ్లో ఇరుదేశాల జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఇటీవలి ఘర్షణలకు కారణం చైనా వ్యవహరించిన తీరేనని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం ఆన్లైన్ ప్రెస్మీట్లో తేల్చిచెప్పారు. ‘మే నెల మొదట్లోనే గల్వాన్ లోయలో భారత్ సాధారణంగా నిర్వహించే పెట్రోలింగ్ విధులను అడ్డుకునేందుకు చైనా ప్రయత్నించింది. వెస్ట్రన్ సెక్టార్లోని ఇతర ప్రాంతాల్లోనూ య«థాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించింది’ అని శ్రీవాస్తవ వివరించారు. ఆ క్రమంలోనే జూన్ 6న ఇరుదేశాల సీనియర్ కమాండర్లు సమావేశమై, బలగాల ఉపసంహరణపై ఒక అంగీకారానికి వచ్చారన్నారు. ‘అయితే, దీన్ని ఉల్లంఘించిన చైనా, గల్వాన్ లోయలో ఎల్ఏసీ పక్కనే నిర్మాణాలు చేపట్టింది. వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో చైనా జవాన్లు హింసకు దిగారు. ఆ క్రమంలో చోటుచేసుకున్న ఘర్షణల్లో ప్రాణనష్టం చోటు చేసుకుంది. ఆ తరువాత చర్చలు కొనసాగుతుండగానే.. రెండు దేశాలు ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించాయి’ అని వివరించారు. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేందుకు కుదిరిన కీలక 1993 ఒప్పందం సహా పలు ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తూ మే తొలి వారం నుంచే చైనా ఎల్ఏసీ వెంట భారీగా బలగాలు, సైనిక సామగ్రిని తరలిస్తోందన్నారు. దాంతో, భారత్ కూడా బలగాల మోహరింపు చేపట్టిందని, ఆ క్రమంలోనే ఘర్షణలు చోటుచేసుకున్నాయన్నారు. భారత్ పైనే బాధ్యత గల్వాన్ లోయలో జూన్ 15న చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణలకు భారత సైనికులే కారణమని భారత్లో చైనా రాయబారి సున్ వీడన్ పేర్కొన్నారు. ఉద్రిక్తత తగ్గించే బాధ్యత ప్రాథమికంగా భారత్పైననే ఉందన్నారు. ‘భారత సైనికులే ఎల్ఏసీని దాటి వచ్చి చైనా జవాన్లపై దాడి చేశారు. ద్వైపాక్షిక ఒప్పందాలను భారత దళాలే ఉల్లంఘించాయి. మరో గల్వాన్ తరహా ఘటనను చైనా కోరుకోవడం లేదు’ అన్నారు. ‘దశాబ్దాలుగా గల్వాన్ లోయలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. 2020 నుంచి క్షేత్రస్థాయిలో యథాతథ స్థితిని మారుస్తూ భారత్ పలు నిర్మాణాలు చేపట్టింది’ అని ఆరోపించారు. అనుమానం, ఘర్షణలు సరైన మార్గం కాదని.. అది రెండు దేశాల ప్రజల ప్రాథమిక ఆకాంక్షలకు విరుద్ధమని పేర్కొన్నారు. పరస్పర విశ్వాసం, సహకారం రెండు దేశాలకు ప్రయోజనకరమన్నారు. సరిహద్దు వివాదాన్ని సరైన రీతిలో పరిష్కరించుకునేందుకు చైనా సిద్ధంగా ఉందన్నారు. -
డ్రాగన్తో కటీఫ్ సాధ్యమేనా
చేతిలో రెడ్మి స్మార్ట్ఫోన్... ఓపెన్ చేస్తే టిక్టాక్ వీడియో... చెవిలో షియోమి ఇయర్ ఫోన్... అలీ ఎక్స్ప్రెస్లో నచ్చిన వస్తువుకు ఆర్డర్... పేటీఎంలో ఫ్రెండ్కి క్షణాల్లో నగదు బదిలీ... ఇలా ఒకటేమిటి చేతికి తొడుక్కునే వాచీ నుంచి కాలికి వేసుకునే చెప్పుల వరకూ అన్నింటికీ ఒకటే లింకు.. అరే ఠక్కున భలే చెప్పేశారే! అదేమరి చైనా ‘చౌక’ మహిమ!! భారతీయులను తన చౌక ఉత్పత్తులతో బానిసలుగా మార్చేసిన డ్రాగన్... అదును చూసి మనపైనే బుసలు కొడుతోంది. సరిహద్దుల్లో భారతీయ సైనికులను దొంగదెబ్బతీస్తూ... తన ఉత్పత్తులను మాత్రం రాజమార్గంలో ఎడాపెడా అమ్ముకుంటోంది. దేశంలో ఇప్పుడు ఇదే హాట్టాపిక్. చైనా వస్తువులను బహిష్కరించి డ్రాగన్తో వాణిజ్య యుద్ధం చేయాలంటూ సోషల్ మీడియాలో ఒకటే హల్చల్. మరి ఇది సాధ్యమయ్యే పనేనా? అసలు చైనాతో మనకున్న ఆర్థిక, వాణిజ్య బంధం ఏ స్థాయిలో ఉంది. దీన్ని తెంచుకుంటే మనకొచ్చే ఇబ్బందులేంటి? దిగుమతులు, ఎగుమతులు ఆగిపోతే మన కంపెనీలు పడే అవస్థలు ఎలా ఉంటాయి? వీటన్నింటినీ వివరించే ‘సాక్షి బిజినెస్ డెస్క్’ ప్రత్యేక కథనమిది... చైనా–భారత్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండుమూడేళ్లుగా ముదురుతూ వస్తున్న సరిహద్దు ఉద్రిక్తతలు... తాజాగా గల్వాన్ లోయలో 20 మంది భారతీయ సైనికుల ఊచకోతతో మరింత తీవ్రరూపం దాల్చాయి. గడిచిన 40 ఏళ్లలో ఇరు దేశాల మధ్య ఇంత ఘోరమైన ఘర్షణ చోటుచేసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీనికితోడు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్కు మూలం కూడా చైనాయే కావడంతో భారతీయులు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. చైనా ఉత్పత్తులు, కంపెనీలను బహిష్కరించాలంటూ నినాదాలు మిన్నంటుతున్నాయి. అయితే, ప్రపంచీకరణ నేపథ్యంలో దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ ఇప్పుడు ఒకదానితో మరొకటి పెనవేసుకుపోయాయి. మరీ ముఖ్యంగా చైనా లాంటి బాహుబలి ఎకానమీతో అంటీముట్టనట్టుగా ఉండటం మనకేకాదు అమెరికాలాంటి అగ్రదేశానికీ సాధ్యంకాని పరిస్థితి. 14.14 లక్షల కోట్ల డాలర్ల స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)తో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా అంతకంతకూ విస్తరిస్తోంది. భారత్ జీడీపీ 2.94 లక్షల కోట్లు మాత్రమే (ఆసియాలో నంబర్–3, ప్రపంచంలో నంబర్–5). పారిశ్రామిక యంత్రాలు, విడిభాగాలు, ముడి పదార్థాల సరఫరా నుంచి స్టార్టప్లు, టెక్నాలజీ సంస్థల్లో పెట్టుబడుల వరకూ అమెరికా తర్వాత భారత్కు చైనా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. చైనా ముడి పదార్థాలు, విడిభాగాలపై అత్యధికంగా ఆధారపడిన మన పరిశ్రమలకు అంత చౌకగా ప్రపంచంలో మరేదేశం కూడా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో కేవలం సరిహద్దు ఘర్షణ, కరోనా కారణంగా చైనాతో వాణిజ్య, ఆర్థిక బంధాన్ని తెంచుకోవడం అంత సులువేమీ కాదనేది నిపుణుల అభిప్రాయం. ద్వైపాక్షిక వాణిజ్యం @ రూ.7.3 లక్షల కోట్లు 2019–20 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతుల్లో 5.33 శాతం అంటే దాదాపు రూ.1.8 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు చైనాకు వెళ్లాయి. అయితే, చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల విలువ ఎంతో తెలుసా? రూ.5.5 లక్షల కోట్లు. అంటే మూడు రెట్లు ఎక్కువ. మన మొత్తం దిగుమతుల్లో ఇది ఏకంగా 14 శాతం. భారత్కు చైనాయే అతిపెద్ద దిగుమతిదారు కూడా. 2000 సంవత్సరం నుంచి 2018–19 నాటికి చూస్తే చైనా నుంచి బారత్కు దిగుమతులు 45 రెట్లు ఎగబాకి 70 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. డ్రాగన్ మన దేశంలోకి చౌక వస్తువులను ఎలా కుమ్మరిస్తోందో... అదేవిధంగా చైనా దిగుమతులపై మనం ఎంతగా ఆధారపడిపోయామో చెప్పేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు అంతకంతకూ తీవ్రమవుతోంది. మొబైల్స్, కన్సూమర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, విద్యుత్ ఉపకరణాలు, పవర్ ప్లాంట్ పరికరాలు, ఎరువులు, వాహన విడిభాగాలు, ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తులు, టెలికం పరికరాలు, మెట్రో రైలు కోచ్లు ఇతరత్రా యంత్ర పరికరాలు, ఔషధ ముడిపదార్థాలు, రసాయనాలు మరియు ప్లాస్టిక్స్, ఇంజినీరింగ్ గూడ్స్... ఇలా చెప్పుకుంటూ పోతే చైనా నుంచి మనం దిగుమతి చేసుకునే ఉత్పత్తుల లిస్టు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలా వెళ్తూనే ఉంటుంది. చైనా ముడి వస్తువులపై ఆధారపడిన మన కంపెనీలు, పరిశ్రమలకు వాటి సరఫరా నిలిచిపోతే లక్షలాది మందికి ఉపాది కరువయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. మరోపక్క, చైనాకు ఎగుమతులు నిలిచిపోతే వాటిపై ఆధారపడిన మన కంపెనీలకూ తీవ్ర నష్టమే. ప్రధానంగా భారత్నుంచి చైనాకు ఆర్గానిక్ రసాయనాలు, ముడి ఖనిజం, మినరల్ ఆయిల్స్, మినరల్ ఫ్యూయెల్స్ ఇతర పారిశ్రామిక ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల జోరు... భారత్లోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో(ఎఫ్డీఐ) చైనా జోరు గడిచిన రెండుమూడేళ్లుగా పుంజుకుంది. ముఖ్యంగా లోహ సంబంధ పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధనం (సోలార్ ప్యానెల్స్), విద్యుత్ పరికరాలు, వాహన రంగం మరియు రసాయన పరిశ్రమల్లోకి చైనా నుంచి ఎఫ్డీఐలు భారీగా వస్తున్నాయి. ఇప్పటిదాకా భారత్లోకి వచ్చిన, ప్రణాళికల్లో ఉన్న చైనా ఎఫ్డీఐల విలువ 2600 కోట్ల డాలర్లుగా (దాదాపు రూ.1.98 లక్షల కోట్లు) అంచనా. భారత్లో చైనాకు చెందిన 75 తయారీ ప్లాంట్లు ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఒప్పో, షావోమి, వివో, ఫోసున్, హేయర్, ఎస్ఏఐసీ, వంటివి భారత్లో ప్లాంట్లున్న అతిపెద్ద బ్రాండ్స్లో కొన్ని. ఇక చైనాలో కార్యకలాపాలున్న తయారీ సంస్థల్లో అదానీ గ్లోబల్, డాక్టర్ రెడ్డీస్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, బీఈఎంఎల్, బీహెచ్ఈఎల్, గోద్రేజ్ అండ్ బాయ్స్, అరబిందో వంటివి ఉన్నాయి. స్టార్టప్స్లోకి నిధుల వరద... భారతీయ స్టార్టప్ సంస్థలకు నిధుల తోడ్పాటును అందించడంలో చైనా కంపెనీలు ముందువరుసలో నిలుస్తున్నాయి. ప్రధానంగా చైనా ఫండ్స్, కంపెనీలు తమ సింగపూర్, హాంకాంగ్, మారిషస్లోని సంస్థల ద్వారా భారత్లోని స్టార్టప్లకు నిధులను మళ్లిస్తున్నాయి. ఉదాహరణకు చైనాకు చెందిన ఈ–కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ పేటీఎంలో పెట్టుబడిని అలీబాబా సింగపూర్ హోల్డింగ్స్ ద్వారా వెచ్చించింది. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ పెట్టుబడి నేరుగా చైనా నుంచి వచ్చినట్లు కాదు, సింగపూర్ ఖాతాలోకి వెళ్తుంది. ఇలా మారువేషంలో చైనా నుంచి భారత్లోకి వస్తున్న పెట్టుబడులు చాలానే ఉన్నాయని ‘గేట్వే హౌస్’ నివేదిక చెబుతోంది. మొత్తంమీద భారత్లోని 30 స్టార్టప్ యూనికార్స్న్(బిలియన్ డాలర్లకు మించి విలువ కలిగినవి)కు ఈ ఏడాది మార్చివరకూ చైనా టెక్ ఇన్వెస్టర్ల నుంచి లభించిన మొత్తం పెట్టుబడులు 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 30,000 కోట్లు) పైనే ఉంటుందని అంచనా. బల్క్ డ్రగ్స్... చైనాయే ఆధారం! పరిమాణం పరంగా భారత ఫార్మా పరిశ్రమ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. విలువ పరంగా చూస్తే 14 ర్యాంకు మాత్రమే. 2018–19లో భారత్ 1400 కోట్ల డాలర్లకు పైగా విలువైన ఔషధాలను ఎగుమతి చేసింది. అదేసమయంలో ఔషధాల తయారీలో అత్యంత కీలకమైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రేడియంట్స్(ముడి పదార్థాలు–ఏపీఐ) దిగుమతుల్లో మూడింట రెండు వంతులు చైనా నుంచే నమోదవడం గమనార్హం. ఇప్పుడు ఉన్నపళంగా చైనా దిగుమతులను తగ్గించుకుంటే... ఆమేరకు మనకు సరఫరా చేసేందుకు ఇతరదేశాలేవీ సిద్ధంగా లేవని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. చైనా గనుక సరఫరా తగ్గిస్తే మన ఔషధ రంగానికి చాలా నష్టం వాటిల్లుతుందనేది ఫార్మా సంస్థల ఆందోళన. స్మార్ట్ ఫోన్స్లో ఆధిపత్యం.. భారత్లో అమ్ముడవుతున్న ప్రతి 100 స్మార్ట్ఫోన్స్లో 72 చైనావే అంటే నమ్ముతారా? అవును ఇది ముమ్మాటికీ నిజం! అంతగా మనం చైనా చౌక మొబైల్స్కు అలవాటుపడిపోయాం. షావోమీ, వివో, ఒప్పో, వన్ప్లస్ వంటి బ్రాండ్స్ మొత్తం కలిపి భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో 72% వాటాను కొల్లగొట్టాయని గేట్వే హౌస్ నివేదిక పేర్కొంది. చైనా మొబైల్స్ దెబ్బకి శాంసంగ్, యాపిల్ అట్టడుగుకు పడిపోయాయి. టిక్ ‘టాప్’...: భారత్లో చైనా మొబైల్ యాప్ టిక్టాక్కు ఉన్న ప్రాచుర్యం గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. 2016 సెప్టెంబర్లో అందుబాటులోకి వచ్చిన టిక్టాక్కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 80 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు(నెలవారీ) ఉన్నారు. దాదాపు 200 కోట్ల మేర డౌన్లోడ్స్ అయ్యాయి. ఇందులో సుమారు 50 కోట్ల డౌన్లోడ్స్ భారత్ నుంచే ఉండటం గమనార్హం. టిక్టాక్ వాడకంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానం(తర్వాత స్థానాల్లో చైనా–18 కోట్ల డౌన్లోడ్స్, అమెరికా–13 కోట్ల డౌన్లోడ్స్) ఉంది. చైనా ప్రతీకారం.. న్యూఢిల్లీ: భారత్లో స్వదేశీ ఉద్యమం ఊపందుకుంటున్న నేపథ్యంలో చైనా ప్రతీకార చర్యలకు దిగుతోంది. తమ కన్సైన్మెంట్లను హాంకాంగ్, చైనా కస్టమ్స్ అధికారులు నిలిపివేస్తున్నారంటూ ఎగుమతిదారులు తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నై పోర్టులో చైనా నుంచి వచ్చిన దిగుమతులకు సంబంధించి భారత అధికారులు తీసుకున్న చర్యలకు ప్రతిగా ఆ దేశం ఇలాంటి చర్యలకు దిగుతోందని ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్ఐఈవో పేర్కొంది. ‘చైనా దిగుమతులన్నింటినీ కస్టమ్స్ శాఖ భౌతికంగా ఒక్కో దాన్నీ తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా దిగుమతుల వ్యయం పెరిగిపోతోంది. దీంతో హాంకాంగ్, చైనా కస్టమ్స్ అధికారులు కూడా భారత్ నుంచి వచ్చే కన్సైన్మెంట్ల పై ఇలాంటి వైఖరే చూపిస్తున్నారు‘ అని వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాధ్వాన్కు రాసిన లేఖలో ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్కె సరాఫ్ పేర్కొన్నారు. కింకర్తవ్యం..? చైనాతో సరిహద్దు వివాదం ముదిరింది కాబట్టి ఆ దేశంతో పూర్తిగా తెగదెంపులు చేసుకునే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా చేస్తే చైనా కంటే భారత్కే అధిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నాయి. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్(స్వయం సమృద్ధి)తో దేశీయంగా తయారీకి ప్రోత్సాహం లభించినప్పటికీ.. చైనా కంపెనీలు, చైనా దిగుమతులను పూర్తిగా లేకుండా చేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు. మేకిన్ ఇండియానే చూసుకుంటే... భారత్లో తయారీ ప్లాంట్లను పెట్టాలని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు షావోమీ, వివో, ఒప్పో, హేయర్ తదితర అనేక చైనా కంపెనీలు సైతం భారత్లో ప్లాంట్లు నెలకొల్పాయి. భారీగా పెట్టుబడులు, ఉపాధిని కల్పిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సరిహద్దు వివాదాలను సాకుగా చూపి వాటిని వెళ్లగొట్టగలమా? అలాచేస్తే అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘన కింద మనం భారీగా నష్టపరిహారాన్ని చెల్లించాల్సి రావడంతోపాటు ఇన్వెస్టర్లలో అభద్రతా భావం నెలకొనేందుకు దారితీస్తుంది. దిగుమతుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తే ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. అయితే, చైనా నుంచి క్రమంగా దిగుమతులను తగ్గించుకోవచ్చని.. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్కు తైవాన్, మలేషియా, జపాన్, కొన్ని యూరప్ దేశాలను ప్రత్యామ్నాయంగా మార్చుకోవచ్చని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. మేకిన్ ఇండియాలో చైనాకు క్రమంగా ప్రాధాన్యం తగ్గించి ఇతర దేశాలను ప్రోత్సహించేలా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లడం మంచిదనేది వారి సూచన!! సాక్షి బిజినెస్ విభాగం -
‘చాలా కోపంగా ఉన్నాం.. చైనా వాళ్లకు ఇవ్వం’
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు వ్యతిరేకంగా దేశంలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా దేశస్థులకు వసతి కల్పించబోమని తాజాగా ఢిల్లీ హోటల్ అండ్ రెస్టరెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ (డీహెచ్ఆర్ఓఏ) ప్రకటించింది. తమ హోటళ్లు, అతిథి గృహాల్లో చైనీయులకు చోటు కల్పించబోమని గురువారం స్పష్టం చేసింది. డీహెచ్ఆర్ఓఏలో సభ్యత్వం కలిగిన దాదాపు 3 వేల బడ్జెట్ హోటళ్లలో మొత్తం 75 వేల వరకు గదులు అందుబాటులో ఉన్నాయి. కాగా, చైనా వస్తువులు, సరుకులు విక్రయించబోమని భారత వర్తకుల సంఘం(సీఏఐటీ) ఇప్పటికే ప్రకటించింది. ఈనెల 15న సరిహద్దులో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవానులు అమరులు కావడంతో చైనా వ్యతిరేక నిరసనలు దేశవ్యాప్తంగా మిన్నంటుతున్నాయి. చైనా ఉత్పత్తులు ఉపయోగించం కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ ప్రభావం అన్ని రంగాలతో పాటు హోటళ్ల వ్యాపారంపైనా పడింది. దేశ రాజధానిలో హోటళ్లు, అతిథి గృహాలు పూర్తిస్థాయిలో ఇంకా తెరుచుకోలేదు. చైనా పౌరులకు గదులు అద్దెకు ఇవ్వకూడదన్న తమ నిర్ణయాన్ని అన్ని హోటళ్లు పాటిస్తాయన్న విశ్వాసాన్ని డీహెచ్ఆర్ఓఏ ప్రధాన కార్యదర్శి మహేంద్ర గుప్తా వ్యక్తం చేశారు. ‘భారత్ పట్ల చైనా వ్యవహరించిన తీరు పట్ల ఢిల్లీ హోటల్ వ్యాపారవేత్తలలో చాలా కోపం ఉంది. దేశవ్యాప్తంగా చైనా వస్తువులను బహిష్కరించాలని సీఏఐటీ సాగిస్తున్న ప్రచారంలో ఢిల్లీ హోటళ్లు, గెస్ట్హౌస్ల యజమానులు భాగస్వాములు అయ్యారు. నగరంలోని బడ్జెట్ హోటళ్లు, గెస్ట్హౌస్లలో చైనా జాతీయులకు వసతి ఇవ్వకూడదని మేము నిర్ణయించుకున్నామ’ని గుప్తా తెలిపారు. తమ హోటళ్లలో చైనా ఉత్పత్తులను ఉపయోగించకూడదని నిర్ణయించినట్టు వెల్లడించారు. (చైనా మైండ్ గేమ్కు ఇదే నిదర్శనం) డీహెచ్ఆర్ఓఏ తీసుకున్న నిర్ణయాలను సీఏఐటీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ స్వాగతించారు. చైనా వస్తువులను బహిష్కరించాలన్న ప్రచారానికి వివిధ రంగాలకు చెందిన వారంతా మద్దతు పలుకుతున్నారని దీని ద్వారా స్పష్టమైందన్నారు. రవాణాదారులు, రైతులు, హాకర్లు, చిన్న తరహా పరిశ్రమలు, వినియోగదారులకు చెందిన జాతీయ సంఘాలను కూడా ఈ ప్రచారంలో భాగస్వాములను చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. (చైనా ఆక్రమణ: మౌనం వీడని నేపాల్!) -
కాంగ్రెస్పై కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ : ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలోని రాజీవ్ ట్రస్ట్కు చైనా ఎంబసీ నుంచి నిధులు అందుతున్నాయని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీలోని మేధావులు చైనాకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. చైనాకు కాంగ్రెస్ పార్టీకి మధ్య సంబంధాలు ఉన్నాయని.. అక్కడి నుంచి వచ్చే నిధులతోనే ఆ పార్టీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై అధికార బీజేపీపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు కాంగ్రెస్కు ధీటుగా బదులిస్తున్నారు. (చదవండి : ఆ రాజవంశం ప్రతిపక్షంతో సమానం కాదు) మరోవైపు ఎమర్జెన్సీకి సంబంధించి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, కాంగ్రెస్ పార్టీలపై రవిశంకర్ ప్రసాద్ పలు విమర్శలు చేశారు. ‘1975 జూన్ 25 అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రధాని సీటును కాపాడుకోవడానికే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ కాలంలో జయప్రకాశ్ నారాయణ్, అటల్బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, చంద్రశేఖర్ వంటి ప్రముఖ నాయకులతో పాటు లక్షలాది మంది ప్రజలు అరెస్ట్ అయ్యారు. ఎమర్జెన్సీ తర్వాత 1977 జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పారు. కేంద్రంలో తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారం చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక ప్రవర్తనకు వ్యతిరేకంగా భారత ప్రజలు చేసిన త్యాగాలను గుర్తుచేసుకునే రోజు ఇది. వారి వారసత్వం ఇప్పటికీ కొనసాగుతోంది. జయప్రకాశ్ నారాయణ్ సారథ్యంలో బిహార్ నుంచి ఓ కార్యకర్తగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం నా అదృష్టం’ అని ట్విటర్లో పేర్కొన్నారు. On 25th June 1975 draconian Emergency was imposed by the Congress Govt led by PM Indira Gandhi. Major opposition leaders including Lok Nayak Jai Prakash Narayan, Bharat Ratna Atal Behari Vajpayee, L. K. Advani, Chandrashekhar and lakhs of people of India were arrested. — Ravi Shankar Prasad (@rsprasad) June 25, 2020 -
చైనా మైండ్ గేమ్కు ఇదే నిదర్శనం
న్యూఢిల్లీ: జూన్ 15 రాత్రి గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణ అనంతరం చైనా సైన్యం 10మంది భారతీయ సైనికులను అపహరించి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. వీరిలో 4గురు అధికారులు ఉన్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఘర్షణలు జరిగిన తరువాత రోజు ఉదయమే భారత్ మన అధీనంలో ఉన్న డజనుకు పైగా చైనా సైనికులను వారికి అప్పగించింది. కానీ డ్రాగన్ మాత్రం మన సైనికులను తిరిగి పంపించడంలో ఆలస్యం చేస్తూనే ఉంది. గాల్వన్ వ్యాలీలో హింసాత్మక ఘర్షణల్లో గాయపడి ఎల్ఏసీకి అవతలి వైపు ఉన్న 50 మంది భారతీయ సైనికులను తిరిగి పంపించడానికి చైనాకు 24 గంటలు పట్టింది. (చైనా చెర నుంచి సైనికులు విడుదల..!) ఈ క్రమంలో వీరిలో కొందరికి స్వల్ప గాయాలు కాగా... మరి కొందరు తీవ్రంగా గాయపడ్డట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అయితే ఘర్షణలు జరిగిన మరుసటి రోజే చైనా, భారత సైనికులందరిని తిరిగి అప్పగించలేదని.. నలుగురు అధికారులతో సహా పది మంది భారత సైనికులను విడిచిపెట్టలేదని తర్వాత తెలిసింది. వారిని క్షేమంగా తీసుకురావడం కోసం తరువాత మూడు రోజుల పాటు భారత్-చైనా మధ్య తీవ్రమైన చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. మన సైనికులు వారి వద్ద ఉన్నారనే విషయాన్ని చైనా ఖండించలేదు. పైగా వారంతా సురక్షితంగా ఉన్నారని చైనా హామీ ఇచ్చింది. అయితే వారిని వెంటనే విడుదల చేయకుండా.. భారతీయుల సహానానికి పరీక్ష పెట్టింది. ఇది చైనా మైండ్ గేమ్కు నిదర్శనం అని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. జూన్ 16, 17,18 తేదీలలో ఇరు దేశాల మధ్య పెద్ద ఎత్తున జనరల్-స్థాయి చర్చలు జరిగాయి. వీటిలో ప్రధానంగా భారతీయ సైనికుల విడుదల గురించి చర్చించారు. చివరకు జూన్ 18న చైనా.. 10 మంది భారత సైనికులను విడుదల చేసింది. అయితే ఈ 10 మందిని పీఎల్ఏ కస్టడీలోనే ఉంచారా లేదా అనే దాని గురించి రెండు దేశాలు స్పష్టత ఇవ్వలేదు. (వారు పోరాడటానికి జన్మించారు..) లడఖ్లోని గాల్వన్ వ్యాలీలోని పెట్రోల్ పాయింట్ 14(పీపీ14) వద్ద జూన్ 15 రాత్రి నెత్తుటి ఘర్షణ ప్రారంభమైంది. చైనా ఏర్పాటు చేసిన టెంట్పై భారత సైన్యం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇరు దళాల మధ్య తీవ్రమైన ఘర్షణలు చెలరేగాయి. ఇనుప చువ్వలు కల రాడ్లు, రాళ్లతో చైనా సైనికులు మన దళాల మీద దాడి చేశాయి. 16 బీహార్ రెజిమెంట్కు చెందిన భారత దళాలు ఈ దాడిని తీవ్రంగా ప్రతిఘటించాయి. కాని దురదృష్టవశాత్తు కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బి సంతోష్ బాబు ఈ దాడిలో మరణించారు. ఈ ఘర్షణలో మొత్తం 20 మంది భారతీయ సైనికులు మరణించారు. చైనా వైపు అనేక మరణాలు సంభవించాయని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలుపుతున్నాయి. కానీ చైనా మాత్రం చనిపోయిన సైనికుల సమాచారాన్ని వెల్లడించలేదు. -
‘గల్వాన్ లోయ మాదే.. చైనా అద్భుత డిమాండ్’
న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. గల్వాన్ లోయ ఘర్షణ అనంతరం పొరుగు దేశం చైనా తన వంకర బుద్ధిని మార్చుకోవడం లేదు. ఓ వైపు చర్చల పేరుతో శాంతియుతంగా ఉద్రిక్తలను తగ్గించుకుందాం అని చెబుతూనే మరోవైపు కయ్యానికి కాలు దువ్వుతోంది. బుధవారం లడఖ్లోని గల్వాన్ లోయ తమదేనని చైనా మరోసారి వ్యాఖ్యలు చేసింది. కాగా దీనిపై గురువారం కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం స్పందించారు.(అమెరికా: వారి నుంచి అధిక రుసుం వసూలు) ఏప్రిల్- జూన్ నెలలో చైనా బలగాలు భారత స్థితిని మార్చాయనే విషయం కాదనలేనిదన్నారు. భారత్ను యథాతథా స్థితిని పునరుద్ధరించడంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఏన్డీఏ ప్రభుత్వం విజయం సాధిస్తుందా అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విటర్లో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ, పీఎల్ఏఎ గల్వాన్ లోయ తమదేనని నొక్కి చెప్పాయి. భారత్ గల్వాన్ లోయను ఖాళీ చేయాలని డిమాండ్ చేసింది. అద్భుత డిమాండ్ అంటూ ట్వీట్ చేశారు. (6 లక్షల డాలర్లు లూటీ; ఎన్నారై డాక్టర్ అరెస్ట్) -
మళ్లీ చైనా కయ్యం?
న్యూఢిల్లీ: చైనా ఇంకో చోట మళ్లీ కయ్యానికి కాలుదువ్వుతోందంటున్నారు మిలటరీ విశ్లేషకులు. తూర్పు లద్దాఖ్లో చైనా సైనికుల కదలికలను పరిశీలిస్తే దౌలత్ బేగ్ ఓల్డీ, డెప్సాంగ్ సెక్టార్లలో తాజాగా వివాదాలు లేవనెత్తే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. దౌలత్ బేగ్ ఓల్డీకి తూర్పు ప్రాంతంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైన్యం చురుకుగా కదులుతోందని, ఆ ప్రాంతంలో క్యాంపులు ఏర్పాటు కావడమే కాకుండా.. వాహనాల కదలికలు కూడా ఎక్కువయ్యాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 2016 ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ సైనిక స్థావరం వద్దనే ఈ క్యాంపులు ఏర్పాటు కావడం గమనార్హం. ఈ నెలలో తీసిన కొన్ని ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా కొత్త క్యాంపుల గురించి తెలియగా.. స్థానిక నిఘా వర్గాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. చైనా కదలికలకు అనుగుణంగా భారత్ మే నెల చివరిలోనే డెప్సాంగ్ ప్రాంతానికి తన బలగాలను తరలించిందని సమాచారం. 2013లో చైనా ఇదే డెప్సాంగ్ ప్రాంతంలో భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. గల్వాన్లో బల ప్రదర్శన తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయలో భారత్ చైనాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు చైనా సైనికులు గల్వాన్ ప్రాంతంలోనే తిష్టవేయగా.. భారత్ తన యుద్ధ విమానాలతో ఆ ప్రాంతంలో విన్యాసాలు చేయించింది. జూన్ 15న ఈ ప్రాంతంలో ఇరు దేశాల సైనికులు బాహాబాహీకి దిగడం మేకులతో కూడిన గదలు, కర్రలతో చైనా సైనికులు జరిపిన దాడిలో భారత సైనికులు 20 మంది వీరమరణం పొందడం తెలిసిన విషయమే. ఈ ఘటన తరువాత ఇరు పక్షాలు అక్కడికి మరిన్ని బలగాలను తరలించి బలప్రదర్శనకు దిగాయి. (వేగంగా బలగాలు వెనక్కి) తాజాగా బుధవారం లేహ్లోని ఓ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అయిన భారత యుద్ధ విమానాలు 240 కి.మీ.ల దూరంలోని సరిహద్దుల వరకూ ప్రయాణించాయి. రోడ్డుమార్గంలో చెక్పాయింట్లు ఏర్పాటు కావడమే కాకుండా లేహ్లో మిలటరీ కార్యకలాపాలు ఒక్కసారిగా ఊపందుకున్నట్లు సమాచారం. లేహ్ రహదారులపై మిలటరీ వాహనాలు క్యూలు కట్టాయని స్థానికులు తెలపగా.. భారత సైనికులు ఇప్పుడు చెప్పుకోదగ్గ స్థాయిలో ఈ ప్రాంతంలో ఉన్నారని మిలటరీ అధికారి ఒకరు తెలిపారు. పాకిస్థాన్, చైనాలు రెండింటికీ సరిహద్దు అయిన ఈ ప్రాంతంలో మిలటరీ కార్యకలాపాలు మనుపెన్నడూ లేనంత స్థాయిలో చోటు చసుకోవడంలో స్థానికుడు ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. గల్వాన్ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలేవీ కనిపించడం లేదని, అదే సమయంలో చైనా ఆక్రమించినట్టుగా చెబుతున్న భూభాగాన్ని భారత్ మళ్లీ చేజిక్కించుకునే అవకాశాలు తక్కువేనని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్కు చెందిన హర్‡్ష పంత్ వ్యాఖ్యానించడం గమనార్హం. జూన్ 22 నాటి ఉపగ్రహచిత్రం -
వేగంగా బలగాలు వెనక్కి
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లోని ఘర్షణాత్మక సరిహద్దు ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించడానికి సంబంధించి జూన్ 6న ఇరుదేశాల సైన్యాధికారుల మధ్య కుదిరిన ఒప్పందాల అమలును వేగవంతం చేయాలని భారత్, చైనా నిర్ణయించాయి. తద్వారా సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొంటాయని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను రెండు దేశాలు విధిగా గౌరవించాలని నిర్ణయించినట్లు తెలిపింది. భారత్, చైనా బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి దౌత్య చర్చలు జరిపాయి. ఈ చర్చల్లో భారత్ తరఫు విదేశాంగ శాఖలోని తూర్పు ఆసియా వ్యవహారాల సంయుక్త కార్యదర్శి నవీన్ శ్రీవాస్తవ, చైనా తరఫున ఆ దేశ విదేశాంగ శాఖలోని డైరెక్టర్ జనరల్ వూ జియాంఘావో పాల్గొన్నారు. దౌత్య, మిలటరీ మార్గాల్లో సంప్రదింపులను కొనసాగించాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ చర్చల్లో తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో పరిస్థితిని విపులంగా చర్చించారని, గల్వాన్ లోయలో జూన్ 15న జరిగిన హింసాత్మక ఘర్షణల విషయమై భారత్, చైనాను నిలదీసిందని వెల్లడించింది. అయితే, ఒక వైపు చర్చలు సాగిస్తూనే, మరోవైపు, తూర్పు లద్దాఖ్తో పాటు సిక్కిం, ఉత్తరాఖండ్, అరుణాచల్ప్రదేశ్ల్లోని ఎల్ఏసీ వెంబడి ఉన్న కీలక ప్రాంతాలకు మరిన్ని బలగాలకు చైనా పంపిస్తుండటం గమనార్హం. చైనా నోట మళ్లీ అదే మాట.. గల్వాన్లో ఇరుదేశాల సైనికులు మృతి చెందడానికి భారత్దే బాధ్యత అని చైనా మరోసారి వ్యాఖ్యానించింది. చైనా రక్షణ, విదేశాంగ శాఖల అధికారులు బుధవారం వేర్వేరుగా ఇదే విషయాన్ని వక్కాణించారు. భారత్, చైనాలు ముఖ్యమైన పొరుగు దేశాలని, ప్రస్తుత సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రెండు దేశాలు కృషి చేయాలని రక్షణ శాఖ అధికార ప్రతినిధి వూ క్వియాన్ పేర్కొన్నారు. జూన్ 15 నాటి గల్వాన్ లోయ ఘర్షణకు భారత దేశమే కారణమని, భారత సైనికులు రెచ్చగొట్టడం వల్లనే ఆ ఘర్షణలు జరిగాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ అన్నారు. భారత విదేశాంగ శాఖ, భారత మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడంపై మీడియా ప్రశ్నించగా.. తాను వాస్తవాలు చెబుతున్నానన్నారు. ఆర్మీ చీఫ్ పర్యటన తూర్పు లద్దాఖ్లోని చైనా సరిహద్దుకు సమీపంగా ఉన్న సైనిక కేంద్రాలను ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె బుధవారం సందర్శించారు. చైనాతో ఇటీవలి ఘర్షణల సమయంలో అత్యంత ధైర్య సాహసాలు చూపిన ఐదుగురు సైనికులకు ప్రశంసాపూర్వక బ్యాడ్జెస్ను అందించారు. లద్దాఖ్లోని సరిహద్దుల్లో సైనిక బలగాల సన్నద్ధతను వరుసగా రెండోరోజు జనరల్ నరవణె పరిశీలించారు. ఫార్వర్డ్ పోస్ట్ల్లో విధుల్లో ఉన్న సైనికులతో మాట్లాడారు. ఆర్మీ చీఫ్కు 14 కార్ప్స్ కమాండర్ లెఫ్ట్నెంట్ జనరల్ హరీందర్ సింగ్, నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్ట్నెంట్ జనరల్ యోగేశ్ కుమార్ జోషి క్షేత్రస్థాయిలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను వివరించారు. -
అందుకే చైనాతో పదేపదే ఘర్షణలు
సాక్షి, న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదం ద్వైపాక్షిక చర్చలతోనే పరిష్కారం అవుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సత్తా మిలటరీకి ఉందని ఆయన అన్నారు. బుధవారం ఢిల్లీలో మురళీధర్ రావు ’సాక్షి’ తో మాట్లాడుతూ ‘ కాంగ్రెస్ హయాంలో చైనా బలగాలు దేశంలో భూభాగాన్ని ఆక్రమించిన విషయం అందరికీ తెలుసు. గతానికి భిన్నంగా మన మిలటరీ చైనా సైన్యాన్ని గట్టిగా ఎదిరిస్తుంది. దాని కారణంగా చైనాతో పదేపదే ఘర్షణలు జరుగుతున్నాయి. భారీ ఎత్తున చైనా సరిహద్దులో మౌలిక సదుపాయాలు ఏర్పాటు అవుతున్నాయి. (జనరల్ ఆదేశాలతో చైనా దుస్సాహసం) దేశరక్షణ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకతాటిపై నిలబడాలి. వైఎస్సార్ కాంగ్రెస్ సహా అనేక రాజకీయ పార్టీలు చైనా విషయంలో కేంద్రానికి మద్దతు ఇవ్వడం ప్రపంచ దేశాలకు ఒక గట్టి సంకేతాన్ని పంపింది. వాస్తవాధీన రేఖ సరిహద్దు ( (ఎల్ఏసీ) అంశం నిర్థారణ అసాధ్యమైన పనేమీ కాదు. చైనా వస్తువులను బహిష్కరించడం ప్రజల అభిమతం. దేశ స్వావలంబనకు ఇది శుభ పరిణామం. చైనా వస్తువుల బహిష్కరణ అసాధ్యమేమీ కాదు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థకు నష్టమేమీ జరగదు’ అని స్పష్టం చేశారు. కాగా గల్వాన్ లోయలో ఈనెల 15న హింసాత్మక ఘటన చెలరేగిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. లద్దాఖ్ రీజియన్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఇరు దేశాలు సైనికులను తరలించడంతో సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. (ఆ వార్త అవాస్తవం: చైనా) -
చైనా దూకుడుకు కళ్లెం: వ్యూహాలకు పదును
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువుతున్న చైనాను నిలువరించేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన వ్యూహాలను సిద్ధం చేస్తోంది. భారత భూభాగాల దురాక్రమణకు దూకుడుగా వ్యవహరిస్తున్న డ్రాగన్ ఎత్తుగడలను తిప్పికొట్టాలని ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా చైనాతో తీవ్రస్థాయిలో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాల సరిహద్దుల్లో నిర్మిస్తున్న 73 రోడ్డు ప్రాజెక్టుల పురోగతిపై కేంద్రం సోమవారం సమీక్ష జరిపింది. వాటిలో 32 ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా లద్దాక్ రీజియన్లో పొరుగుదేశంతో ఎక్కువగా ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో పెడింగ్లో ఉన్న ప్రాజెక్టులను వీలైనంత త్వరగా ముగించాలని పేర్కొంది. రోడ్డు నిర్మాణల ద్వారా చైనా దూకుడును అడ్డుకోవచ్చని కేంద్రం భావిస్తోంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో బలగాలను సరిహద్దుకు చేర్చేందుకు ఉపయోగకరంగా ఉంటుందని సైనిక వర్గాలు కేంద్రానికి నివేదించాయి. (నోరువిప్పిన చైనా.. కమాండర్ మృతి) సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్లతో కేంద్ర హోం శాఖ ఈ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షలో సరిహద్దు నిర్వహణ కార్యదర్శి సంజీవ్ కుమార్తో పాటు పలువురు ముఖ్య సైనికాధికారులు పాల్గొన్నారు. గల్వాన్ లోయలో చైనా ఆర్మీ అనుసరిస్తున్న దుందుడుకు చర్యకు సరైన రీతిలో సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అలాగే వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి గస్తీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే సరిహద్దు వెంబడి విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు ఇకనుంచి ‘పూర్తి స్వేచ్ఛ’ ఇవ్వాలన్న ఆర్మీ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఇకపై సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న జవాన్లు అత్యవసర పరిస్థితుల్లో సరైన గుణపాఠం చెప్పేందుకు ఆయుధానుల వాడుకునేలా స్వేచ్ఛను ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. (గల్వాన్లో బయటపడ్డ చైనా కుట్రలు) కాగా ఇరు దేశాల నడుమ ఏర్పడిన సరిహద్దు ప్రతిష్టంభనపై కమాండర్ స్థాయి అధికారుల మధ్య చర్చలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల తొలి విడత చర్చల్లో కుదిరిన ఒప్పందాల అమలు సహా ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం పెరిగేందుకు చేపట్టాల్సిన పలు చర్యలపై ఈ భేటీలో చర్చించారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఓవైపు ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్న క్రమంలోనే సిక్కిం సరిహద్దుల్లో నుంచి భారత్లోకి చొరబడేందుకు చైనా బలగాలు ప్రయత్నించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, చైనా సరిహద్దుల వద్ద నెలకొన్న క్షేత్ర స్థాయి పరిస్థితులపై ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె, ఇతర ఉన్నతాధికారులు సమీక్ష జరిపారు. వాస్తవాధీన రేఖ వెంట చైనా సైన్యం కదలికలు, భారత సైన్య సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించారు. -
‘చైనా.. మోదీని ఎందుకు ప్రశంసిస్తుంది’
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో భారత్-చైనాల మధ్య జరిగిన ఘర్షణలపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ.. కేంద్రంపై విమర్శల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని ‘సరెండర్ మోదీ’ అంటూ విమర్శించిన రాహుల్ గాంధీ తాజాగా.. మరిన్ని విమర్శలు చేశారు. లడాఖ్ వివాదంపై చైనా.. ప్రధానిని ఎందుకు ప్రశంసిస్తుందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ క్రమంలో చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్లో ‘లడాఖ్ అంశంలో మోదీ తీసుకున్న చర్యలను ప్రశంసించింది’ అంటూ చెన్నై డేట్లైన్తో భారత్కు చెందిన ఓ ఆంగ్ల మీడియా కథనాన్ని వెలువరించింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ సదరు పత్రికలో వచ్చిన వార్తను ట్వీట్ చేస్తూ.. ‘చైనా మన సైనిలకులను చంపేసింది. మన భూభాగాన్ని ఆక్రమించింది. ఇప్పుడు ఈ వివాదంలో చైనా మన ప్రధానిని ప్రశంసిస్తుంది ఎందుకు’ అని ఆయన ప్రశ్నించారు. అఖిలపక్ష భేటీ జరిగిన నాటి నుంచి రాహుల్ గాంధీ, ప్రధాని పై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. (ఆయన ‘సరెండర్’ మోదీ: రాహుల్) China killed our soldiers. China took our land. Then, why is China praising Mr Modi during this conflict? pic.twitter.com/iNV8c1cmal — Rahul Gandhi (@RahulGandhi) June 22, 2020 సోమవారం చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్లో ‘చైనాతో యుద్ధం చేయలేమని భారత్కు తెలుసు. అందుకే నరేంద్ర మోదీ పరిస్థితి తీవ్రతరం కాకుండా మాటలతో మభ్యపెడుతున్నారు. సైనిక పరంగానే కాకుండా.. మొత్తం అంతర్జాతీయ సమాజంలో చైనా సామర్థ్యం భారత్ కన్నా అధికం’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాక ‘చైనాతో సరిహద్దు వివాదం అంశంలో.. మోదీ భారత సైన్యం అవసరమైన అన్ని చర్యలు తీసుకోగలదని తెలపడం కేవలం ఆ దేశ ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి, భారత దళాల ధైర్యాన్ని పెంచడానికి మాత్రమే’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. -
చైనాతో యుద్ధానికి నేను సైతం.. రాష్ట్రపతికి రక్తంతో..
సాక్షి, కర్ణాటక: ప్రస్తుతం భారత్–చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో యుద్ధంలో పాల్గొనడానికి తాను సిద్ధమని పేర్కొంటూ హోంగార్డ్ లక్ష్మణ్ మడివాళ రాష్ట్రపతికి రక్తంతో కూడిన లేఖను రాసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. రాయచూరు జిల్లా మస్కి ప్రాంతంలో హోంగార్డ్గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ మడివాళ విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్, కన్నడ వ్యాకరణం, గణితం, సైన్స్ వంటి విషయాలను బోధించడంతో పాటు గ్రామీణ పిల్లలకు క్రీడా మనోభావం, దేశభక్తి గురించి వివరించే లక్ష్యం ఏర్పరచుకున్నాడు. శనివారం వైద్యుల సలహాతో భారత్–చైనాల మధ్య యుద్ధం వస్తే దేశ రక్షణే కర్తవ్యంగా భావించానని, తనకు యుద్ధంలో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరుతూ మూడు పేజీలతో లేఖను రాశారు. చదవండి: వంట మాస్టర్కు కరోనా.. క్వారంటైన్కు పెళ్లి బృందం -
పర్యవసానాలపై అవగాహన ఉండాలి
న్యూఢిల్లీ: గల్వాన్ ఘటన, తదనంతర పరిణామాలపై ప్రభుత్వం, ప్రధాన విపక్షం కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి మాటలు.. చైనా తన చర్యలను సమర్ధించు కునేందుకు ఉపయోగపడేలా ఉండవద్దని మాజీ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యానించారు. అత్యంత బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తికి తన వ్యాఖ్యల పర్యవసానాలపై కచ్చితంగా అవగాహన ఉండాలన్నారు. ‘దేశానికి నాయకత్వం వహిస్తున్న వారిపై పవిత్రమైన బాధ్యత ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఆ బాధ్యత ప్రధానిపై ఉంటుంది’ అన్నారు. ‘దేశ ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం అనేది దౌత్య నీతికి, సమర్ధ నాయకత్వానికి ప్రత్యామ్నాయం కాబోదు’ అని తేల్చిచెప్పారు. ‘చైనా భారత భూభాగంలో అడుగుపెట్టలేదు. భారత పోస్ట్లను స్వాధీనం చేసుకోలేదు’ అని ఇటీవల అఖిలపక్ష భేటీలో మోదీ చేసిన వ్యాఖ్యలపై మన్మోహన్ పై విధంగా స్పందించారు.సరిహద్దుల రక్షణలో ప్రాణాలు అర్పించిన జవాన్లకు సరైన న్యా యం జరగాలని పేర్కొన్నారు. ‘అందులో ఏమా త్రం లోపం జరిగినా అది ప్రజల విశ్వాసాలకు చేసిన చరిత్రాత్మక ద్రోహం అవుతుంది’ అన్నారు. -
తెరపైకి మరో ఘర్షణ వీడియో
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకునే దిశగా భారత్, చైనాల మధ్య దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగుతున్న సమయంలోనే.. సరిహద్దుల్లో భారత, చైనా సైనికుల ఘర్షణకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. మంచు కొండల నేపథ్యంలో భారత సైనికులు చైనా జవాన్లను వెనక్కు నెడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. అయితే, ఆ వీడియో ఏ రోజు తీసిందనే వివరాలు అందులో లేవు. భారత సైనికుల బృందం చైనా ఆర్మీ అధికారులు, జవాన్లు ఉన్న మరో బృందంతో ఘర్షణ పడుతూ, వారిని వెనక్కు నెట్టివేస్తూ ఉన్న దృశ్యాలు అందులో ఉన్నాయి. అలాగే, వెనక్కు వెళ్లిపోవాలంటూ చైనా జవాన్లను భారత సైనికులు గట్టిగా చెబుతున్న మాటలు కూడా వినిపించాయి. ఆ తరువాత వారు బాహాబాహీకి దిగినట్లుగా కనిపించింది. భారత సైనికుల మాటను వినకుండా, చైనా జవాన్లు అక్కడే ఉండటం, పైగా, భారత సైనికులపై వారు దాడి చేయడం 5.30 నిమిషాలున్న ఆ వీడియోలో కనిపించింది. ఆ వీడియో దృశ్యాల్లో డేట్, టైమ్ లేవు కానీ, సైనికులు మాస్క్లు ధరించి ఉండటం కనిపించింది. దాన్నిబట్టి ఆ వీడియో కరోనా ముప్పు ప్రారంభమైన తరువాత తీసిన వీడియోగానే భావించవచ్చు. అక్కడి భౌగోళిక పరిస్థితులను పరిశీలిస్తే.. ఆ ఘటన సిక్కింలో జరిగి ఉండొచ్చని ఆర్మీ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. అక్కడ కూడా మే తొలి వారం నుంచి ఇరు దేశాల జవాన్ల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. మే 9న సిక్కింలోని నకూ లా ప్రాంతంలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ అయి ఉండవచ్చనుకుంటున్నారు. ये सही था सर पहले पटक के चीनियों को बलभर कचर दिए फिर बोले Don't fight... don't fight 😂 https://t.co/sDoSZVjqI3 — Abhinav Pandey (@AbhinavABP) June 22, 2020 -
గల్వాన్ ఘటనతో వణికిన చైనా సైన్యం
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో జూన్ 15న భారత సైనికులు చూపిన తెగువకు చైనా సైన్యం వణికిపోయిం దని సమాచారం. చైనా సైన్యం చేతుల్లో బందీలుగా ఉండి.. సైనికాధికారుల చర్చల అనంతరం విడుదలైన భారతీయ సైనికుల ద్వారా ఈ విషయం స్పష్టమైనట్లు తెలుస్తోంది. సుమారు 60 గంటలపాటు చైనా సైనికుల అదీనంలో ఉన్న కారణంగా భారతీయ సైనికాధికారులు, జవాన్లకు వివిధ పరీక్షలు నర్విహించారు. ఈ క్రమంలో చైనా సైన్యం మానసిక స్థితిపై ఉన్నతాధికారులు ఒక అంచనాకు రాగలిగారు. బందీలుగా ఉండి విడుదలైన ఇద్దరు మేజర్లు, ఇద్దరు కెప్టెన్లు చాలా ఉత్సాహపూరితంగా కనిపించారని, శత్రుదేశపు బందీలుగా ఉన్నా ఇలా ఉండటం ఆశ్చర్యకరమని నిపుణులు చెబుతున్నారు. జూన్ 15న తమ కంటే ఎక్కువ సంఖ్యలో చైనీయులు విరుచుకుపడుతున్నా భారత సైన్యం వెనక్కు తగ్గకపోగా చైనీయుల చేతుల్లోని ఇనుప రాడ్లు, మేకులతో కూడిన గదల్లాంటి ఆయుధాలను లాక్కుని ప్రతిదాడికి దిగారని, ఈ క్రమంలో పెట్రోల్ పాయింట్ 14 వద్ద కనీసం 40 మంది చైనీయులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ఈ సాహసం కారణంగానే భారతీయ సైనికులు ఉత్సాహంగా కనిపించారని, చైనీయులను తరుముకుంటూ వారి ఆధిపత్యంలోని ప్రాంతాల్లోకి చొచ్చుకుపోవడం వల్లనే భారతీయులు బందీలుగా చిక్కారని ఓ అధికారి తెలిపారు. కల్నల్ సంతోష్బాబు మరణించిన సమాచారం తెలుసుకున్న చైనీయులు వెనుతిరిగి పారిపోయారని... వారిని వెంటాడుతూ భారతీయ సైనికులు వెళ్లారని చెప్పారు. షాక్లో చైనా సైనికులు జూన్ 15 నాటి ఘటనతో చైనా సైనికులు ఒక రకమైన షాక్కు గురైనట్లు చైనా నిర్బంధం నుంచి విడుదలైన సైనికుల ద్వారా తెలిసింది. భారతీయ సైనికులు తెగబడి పోరాడటమే కాకుండా ప్రతీకార దాడులకు పాల్పడతారని చైనీయులు భయపడ్డారని కొన్ని గంటల వ్యవధిలో మరింత మంది భారతీయ సైనికులు తమ మాదిరిగానే దాడి చేస్తారని వారు అంచనా వేశారని అధికార వర్గాల ద్వారా తెలిసింది. మొత్తమ్మీద చైనా దశాబ్దాలపాటు అసలైన యుద్ధంలో పాల్గొనక పోవడం కేవలం సన్నాహక విన్యాసాల్లో పాల్గొనటం సైనికులపై ప్రభావం చూపుతున్నట్లు భారతీయ అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ 15 నాటి ఘటనతో చైనీయులు భారతీయ సైన్యం అసలు రూపాన్ని చూశారని సంఖ్యాబలంలో తక్కువైనా ప్రత్యర్థులను చంపగలగడం వారిని భీతవహులను చేసిందని అధికారి ఒకరు తెలిపారు. కాగా, గల్వాన్ ఘటనపై చైనా సోషల్మీడియాలో అసంతృప్తి వ్యక్తమైంది. వాట్సప్ తరహా సామాజిక మాధ్యమం వీబోలో పీఎల్ఏ సైనికులు ఎంత మంది మరణించారన్న విషయంపై ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. -
చైనా బలగాలు వెనుదిరగాలి
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా భారత్, చైనాల మధ్య రెండో విడత లెఫ్ట్నెంట్ జనరల్ స్థాయి చర్చలు సోమవారం జరిగాయి. తూర్పు లద్దాఖ్లోని చూశుల్ సెక్టార్లో చైనా భూభాగంలోని మోల్డో వద్ద ఉదయం 11.30 గంటలకు ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. జూన్ 6న జరిగిన తొలి విడత చర్చల్లో కుదిరిన ఒప్పందాల అమలు సహా ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం పెరిగేందుకు చేపట్టాల్సిన పలు చర్యలపై ఈ భేటీలో చర్చించారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. అలాగే, అన్ని ప్రాంతాల నుంచి మే 4 నాటి యథాతథ స్థితికి చైనా బలగాలు వెనుదిరగాలని భారత్ డిమాండ్ చేసిందని వెల్లడించాయి. ఏ రోజు నాటికి వెనక్కు వెళ్తారో వివరిస్తూ.. టైమ్లైన్ కూడా చెప్పాలని భారత్ కోరినట్లు తెలిపాయి. అయితే, ఆ భేటీలో గల్వాన్ ఘర్షణల అంశం చర్చించారా? లేదా అనే విషయంపై స్పష్టత లేదన్నాయి. ఈ చర్చల్లో భారత ప్రతినిధి బృందానికి 14 కారŠప్స్ కమాండర్ లెఫ్ట్నెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా బృందానికి టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ నేతృత్వం వహించారు. దళాల ఉపసంహరణకు విధి విధానాలను రూపొందించే దిశగా చర్చలు జరిగినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. గల్వాన్ లోయ సహా అన్ని వివాదాస్పద ప్రాంతాల నుంచి దళాలను ఉపసంహరించుకోవాలని జూన్ 6న ఇదే ప్రదేశంలో జరిగిన చర్చల్లో ఇరుదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అయితే, ఆ తరువాత జూన్ 15న గల్వాన్ లోయలో ఇరుదేశాల జవాన్ల మధ్య తీవ్రస్థాయిలో హింసాత్మక ఘర్షణలు జరిగి, భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఆ ఘర్షణల్లో కల్నల్ సహా 20 మంది భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తమ సైనికుల మరణాలపై చైనా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ 35 మంది చైనా సైనికులు చనిపోయారని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. తాజాగా, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కు చెందిన కమాండింగ్ ఆఫీసర్ స్థాయి అధికారి ఆ ఘర్షణల్లో చనిపోయినట్లు తెలుస్తోంది. ఆర్మీ చీఫ్ సమీక్ష మరోవైపు, చైనా సరిహద్దుల వద్ద నెలకొన్న క్షేత్ర స్థాయి పరిస్థితులపై సోమవారం జరిగిన సదస్సులో ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె, ఇతర ఉన్నతాధికారులు సమీక్ష జరిపారు. వాస్తవాధీన రేఖ వెంట చైనా సైన్యం కదలికలు, భారత సైన్య సన్నద్ధతపై చర్చించారు. రెండు రోజుల పాటు ఈ సదస్స కొనసాగనుంది. ఈ సందర్భంగా లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ల్లో సరిహద్దుల వెంట భారత సైన్యం సన్నద్ధతపై సమగ్ర సమీక్ష జరిపారు. ఆ సమాచారం తెలియదు: చైనా గల్వాన్ లోయలో చోటు చేసుకున్న జూన్ 15 నాటి ఘర్షణల్లో భారత సైనికుల చేతిలో 40 మంది చైనా జవాన్లు చనిపోయారని కేంద్ర మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు చైనా నిరాకరించింది. ఆ సమాచారం తమ వద్ద లేదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ సోమవారం మీడియా అడిగిన ఒక ప్రశ్నకు జవాబిచ్చారు. భారత్లో సరిహద్దు వివాద పరిష్కారానికి దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయని మరోసారి చెప్పారు. -
మార్కెట్లకు ‘ఔషధం’!
కరోనా వైరస్ చికిత్సలో ఉపయోగపడే ఔషధాలకు ఆమోదం లభించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీనికి ఆర్థిక రంగ షేర్ల జోరు జత కావడంతో సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లు పతనమైనా, మన సూచీలు ముందుకే దూసుకుపోయాయి. సరిహద్దు ఉద్రిక్తతల నివారణ నిమిత్తం భారత్, చైనాల మధ్య సంప్రదింపులు ప్రారంభం కావడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, డాలర్తో రూపాయి మారకం విలువ 17 పైసలు పుంజుకొని 76.03కు చేరడం.. సానుకూల ప్రభావం చూపించాయి. 3 రోజుల లాభాలతో సెన్సెక్స్, నిఫ్టీలు 3 నెలల గరిష్ట స్థాయికి చేరాయి. అయితే చివర్లో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో ఆరంభ లాభాలు తగ్గాయి. ఇంట్రాడేలో 482 పాయింట్ల మేర ఎగసిన సెన్సెక్స్ చివరకు 180 పాయింట్ల లాభంతో 34,911 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 67 పాయింట్లు ఎగసి 10,311 పాయింట్లకు చేరింది. ఐటీ సూచీకే నష్టాలు...: ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా, మన మార్కెట్ లాభాల్లోనే ఆరంభమైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 35,000 పాయింట్లపైకి ఎగబాకగా, నిఫ్టీ 10,400 పాయింట్ల సమీపంలోకి వచ్చింది. ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిశాయి. హెచ్ 1–బీ వంటి నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాలపై అమెరికా నిషేధం విధించే అవకాశాలున్నాయన్న ఆందోళనతో ఐటీ షేర్లు నష్టపోయాయి. ► బజాజ్ ఆటో 7 శాతం లాభంతో రూ.2,860 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా లాభపడిన షేర్ ఇదే. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ వంటి ఇతర బజాజ్ గ్రూప్ షేర్లు 5 శాతం మేర పెరిగాయి. ► కరోనా వైరస్ చికిత్స కోసం యాంటీ వైరల్ డ్రగ్, ఫావిపిరవిర్ను ఫాబిఫ్లూ పేరుతో అందుబాటులోకి తేవడంతో గ్లెన్మార్క్ ఫార్మా షేర్ 27 శాతం లాభంతో రూ.520 వద్ద ముగిసింది. ఈ షేర్ ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. ఇంట్రాడేలో ఈ షేర్ 40 శాతం లాభంతో రూ.573ను తాకింది. ► కరోనా చికిత్సలో ఉపయోగపడే రెమిడెసివిర్ తయారీకి ఆమోదం లభించడంతో సిప్లా షేర్ 3% లాభంతో రూ.656 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది గరిష్ట స్థాయి, రూ.696ని తాకింది. ► దాదాపు 140 షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. బేయర్ క్రాప్ సైన్స్, డిక్సన్ టెక్నాలజీస్, రుచి సోయా, ఆర్తి డ్రగ్స్, అలెంబిక్ ఫార్మా, అదానీ గ్రీన్ ఎనర్జీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► మోర్గాన్ స్టాన్లీ వాటా కొనుగోళ్ల వార్తలతో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ 20 శాతం లాభంతో రూ.242 వద్ద ముగిసింది. ► స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ కావాలన్న ప్రతిపాదనకు అదానీ పవర్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. షేరు కనీస కొనుగోలు ధర రూ.33.82 కాగా, ఈ ప్రతిపాదన విలువ రూ.3,264 కోట్లు. రిలయన్స్ మార్కెట్ క్యాప్ @ 15,000 కోట్ల డాలర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ జోరు కొనసాగుతోంది. ఆరంభంలోనే 3 శాతం మేర ఎగసి జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,804ను తాకింది. చివరకు 0.7 శాతం నష్టంతో రూ.1,747 వద్ద ముగిసింది. మార్కెట్ క్యాప్ రూ.11,81,429 కోట్లకు(15,000 కోట్ల డాలర్లకు మించి) పెరిగింది. ఈ స్థాయి మార్కెట్ క్యాప్ను సాధించిన తొలి భారత కంపెనీ ఇదే. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, అత్యధిక మార్కెట్ క్యాప్ గల కంపెనీల జాబితాలో రిలయన్స్ 57వ స్థానంలో నిలిచింది. వచ్చే నెల 15న వర్చువల్ ఏజీఎమ్(వార్షిక సాధారణ సమావేశం)ను నిర్వహిస్తామని రిలయన్స్ వెల్లడించింది. -
ఎలక్ట్రానిక్స్కు ప్రత్యామ్నాయ మార్కెట్లున్నాయ్..
ముంబై: చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం నుంచి ఎలక్ట్రానిక్స్ దిగుమతులను భారత్ నిజంగానే తగ్గించుకోదల్చుకుంటే ప్రత్యామ్నా య మార్కెట్లు చాలానే ఉన్నాయని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ముంబై (డబ్ల్యూటీసీ) వెల్లడించింది. సింగపూర్, మలేసియా, తైవాన్, అమెరికా నుంచి దిగుమతులను పెంచుకునే అంశం పరిశీలించవచ్చని పేర్కొంది. డబ్ల్యూటీసీ గణాంకాల ప్రకారం చైనా నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ గూడ్స్లో ఎక్కువగా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, టీవీ సెట్లు ఉంటున్నాయి. చమురుయేతర ఉత్పత్తుల దిగుమతుల్లో చైనాకు 14% వాటా ఉంటోంది. ‘2019 ఏప్రిల్ నుంచి 2020 ఫిబ్రవరి మధ్య కాలం లో మొత్తం ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగుమతుల విలువ రూ.3.59 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో చైనా నుంచి దిగుమతుల విలువ సుమారు రూ. 1.42 లక్షల కోట్లు.. అంటే దాదాపు మొత్తం దిగుమతుల్లో 40% వాటా’ అని డబ్ల్యూటీసీ తెలిపింది. ప్రస్తుతం చైనా నుంచి దిగుమతుల్లో అత్యధిక వాటా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులదే (కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక దిగుమతులు, కంప్యూటర్, ఐటీ హార్డ్వేర్, మొబైల్ ఫోన్స్ మొదలైనవి) ఉంటోంది. మొబైల్ దిగుమతులు తగ్గినా.. చైనాదే హవా.. గత ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఫోన్ల దిగుమతులు మొత్తం మీద తగ్గినప్పటికీ చైనా వాటా మాత్రం పెరగడం గమనార్హం. 2019 ఏప్రిల్ – 2020 ఫిబ్రవరి మధ్య కాలంలో సెల్ ఫోన్ దిగుమతులు సగానికి సగం పడిపోయాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలోని రూ. 11,304 కోట్ల నుంచి రూ. 6,313 కోట్లకు క్షీణించాయి. దేశీయంగా తయారీ పెరగడం, హ్యాండ్సెట్స్పై దిగుమతి సుంకాలు పెంచడం ఇందుకు కారణం. అయితే, చైనా నుంచి కూడా దిగుమతులు తగ్గినప్పటికీ మొత్తం దిగుమతుల్లో దాని వాటా 55 శాతం నుంచి 75 శాతానికి పెరిగింది. దేశీయంగా ఉత్పత్తికి ఊతం... కేంద్రం ఇటీవల కొన్నాళ్లుగా దేశీయంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకోవడంతో పలు స్కీములను అమలు చేస్తోంది. దీంతో 2014–2020 మధ్య కాలంలో దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ 20.6 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది. 2013–14 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.73 లక్షల ఓట్లుగా ఉన్న స్థానిక ఉత్పత్తి 2019–20లో రూ. 5.33 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్ పరిస్థితులు చూస్తే ఇది మరింత వేగంగా వృద్ధి చెందనుందని డబ్ల్యూటీసీ అంచనా వేసింది. అయితే, దేశీయంగా ఉత్పత్తి గణనీయంగా పెరిగే దాకా చైనా నుంచి దిగుమతులను తగ్గించుకునే క్రమంలో ఇతర మార్కెట్లవైపు చూడవచ్చని తెలిపింది. సింగపూర్, అమెరికా, మలేసియా, జపాన్ నుంచి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, కలర్ టీవీ సెట్లను, సింగపూర్, తైవాన్, జర్మనీ, ఇజ్రాయెల్, జపాన్ నుంచి టెలికం పరికరాలను దిగుమతి చేసుకోవచ్చని పేర్కొంది. -
నోరువిప్పిన చైనా.. కమాండర్ మృతి!
బీజింగ్ : భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఈనెల 15న చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై చైనా నోరువిప్పింది. ఘర్షణకు సంబంధించి తొలిసారి ఓ మరణాన్ని అధికారికంగా ప్రకటించింది. గల్వాన్ ఘటనలో తమ సైన్యానికి చెందిన సీనియర్ కమాండింగ్ అధికారి మృతిచెందినట్లు తెలిపింది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య జరుగుతున్న కమాండర్ స్థాయి అధికారుల చర్చల సందర్భంగా చైనా ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. అయితే మొత్తం ఎంతమంది సైనికులకు మృతి చెందారన్న దానిపై మాత్రం స్పందించేందుకు విముఖత వ్యక్తం చేసింది. అంతేకాకుండా గల్వాన్ లోయకు సంబంధించి పలు కీలక విషయాలను డ్రాగన్ పంచుకున్నట్లు తెలుస్తోంది. (సరిహద్దుల్లో సైన్యం మోహరింపు) భారత సైనిక వర్గాల సమాచారం ప్రకారం గల్వాన్ హింసాత్మక ఘర్షణలో భారత్కు చెందిన 20 మంది సైనికులు మృతిచెందగా.. చైనాకు చెందిన 40 మంది జవాన్లు మరణించారు. అయితే భారత ఆర్మీ ప్రకటనను ఇప్పటికే చైనా తోసిపుచ్చింది. కాగా రెడ్ ఆర్మీ దాడిలో గాయపడిన 76 మంది భారత సైనికులు చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వీరంతా త్వరలోనే కోలుకుని విధుల్లో చేరుతారని సైనిక వర్గాలు ప్రకటించాయి. ఇదిలావుండగా ఓ వైపు ఇరు దేశాల సైనిక అధికారుల మధ్య చర్చలు సాగుతున్నా.. వాస్తవాధీన రేఖ వెంట మాత్రం చైనా దురాక్రమణ కొనసాతూనే ఉంది. తాజాగా అస్సాం సరిహద్దు ప్రాంతంలో చైనా సైన్యం చొరబాట్లకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడిని భారత సైనికులు తీవ్రంగా ప్రతిఘటించినట్లు తెలుస్తోంది. తాజా ప్రతిష్టంభన నేపథ్యంలో ఇరు దేశాల నడుమ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. (భారత్- చైనా మధ్య చర్చలు ప్రారంభం) -
సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం
సాక్షి, న్యూఢిల్లీ : గల్వాన్ లోయలో ఈనెల 15న హింసాత్మక ఘటన చెలరేగిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. లద్దాఖ్ రీజియన్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఇరు దేశాలు సైనికులను తరలించడంతో సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. సైనిక వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. ఎల్ఏసీ వెంట భారత్-చైనా భారీగా జవాన్లు తరలిస్తున్నాయి. ఎల్ఏసీని అతిక్రమించకుండా ఎవరి భూభాగాల్లో వారు సైనిక కార్యక్రమాలను నిర్వహించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గల్వాన్ లోయ సెక్టార్లోని పెట్రోల్ పాయింట్ 14 వద్ద ప్యాంగాంగ్ సరస్సుకు సమీపంలో ఇరు వైపులా సైన్యం భారీగా మోహరించింది. కాగా 15 నాటి హింసాత్మక ఘటన అనంతరం మరోసారి ఎలాంటి ఘర్షణ చోటుచేసుకోనప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు సరిహద్దు ప్రతిష్టంభనపై మరోసారి ఇరుదేశాలకు చెందిన కమాండ్ స్థాయి అధికారుల చర్చలు సోమవారం ప్రారంభం అయ్యాయి. (దుస్సాహసానికి దిగితే ఆయుధాలు వాడొచ్చు) కాగా సరిహద్దు వెంబడి విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రత్యర్థి సైనికులు ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే సరైన గుణపాఠం చెప్పే స్వేచ్ఛను సైన్యానికి ఇచ్చింది. దానిలో భాగంగా తప్పనిసరి సందర్భాల్లో ఆయుధాలను సైతం ఉపయోగించే వెసులుబాటును కల్పించింది. సరిహద్దుల్లో చైనా దురాక్రమణను అడ్డుకునేందుకు ఆయుధాలు వాడకం తప్పనిసరని కేంద్ర రక్షణ శాఖ అధికారులు, ఆర్మీ వర్గాలు కేంద్రానికి నివేధించిన సందర్భంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. భారత్ నిర్ణయం నేపథ్యంలో చైనా కూడా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీపీఏ)కు అదే రీతిలో స్వేచ్ఛను ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య 1996, 2005ల్లో కుదిరిన ఒప్పందాలకు ముందు పరిస్థితి మరోసారి పునరావృత్తం కానుంది. కాగా ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి విధితమే. -
ఆయన ‘సరెండర్’ మోదీ: రాహుల్
న్యూఢిల్లీ: భారత భూభాగాన్ని చైనాకు అప్పగించారు(సరెండర్ చేశారు) అంటూ ప్రధాని మోదీపై శనివారం నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం మరో అడుగు ముందుకేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసలు పేరు సరెండర్ మోదీ అని ఎద్దేవా చేశారు. అయితే, ఇంగ్లిష్ పదం సరెండర్ స్పెల్లింగ్ను surrenderకు బదులు surender అని ఆయన పేర్కొనడం గమనార్హం. ఈ మేరకు ఆయన ‘చైనాతో భారత్ బుజ్జగింపు విధానం బట్టబయలు’అనే శీర్షికతో ఉన్న విదేశీ పత్రికలోని కథనాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. భారత భూభాగాన్ని ఎవరూ ఆక్రమించుకోలేదని ప్రధాని చెబుతున్నప్పటికీ పాంగాంగ్ త్సో సమీపంలోని భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడవుతోందని చెప్పారు. ఇందుకు సంబంధించిన టీవీ వార్తా కథనం క్లిప్పింగ్ను కూడా జత చేశారు. -
భారత్, చైనాలతో మాట్లాడుతున్నాం: ట్రంప్
వాషింగ్టన్: భారత్, చైనాల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం పేర్కొన్నారు. గల్వాన్ ఘటన నేపథ్యంలో.. రెండు దేశాల మధ్య నెలకొన్న తీవ్రస్థాయి ఉద్రిక్తతలను తగ్గించేందుకు సహాయపడే ఉద్దేశంతో తమ ప్రభుత్వం భారత్, చైనాలతో మాట్లాడుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘పరిస్థితి సీరియస్ గానే ఉంది. మేం భారత్తో, చైనాతో మాట్లాడుతున్నాం. వాళ్లు పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. వాళ్లు ముఖాముఖి తలపడ్డారు. అక్కడేం జరిగిందో చూసాం. వివాద పరిష్కారంలో వారికి సాయం చేయాలని ప్రయత్నిస్తున్నాం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘చైనా సైన్యమైన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారత్తో సరిహద్దు ఉద్రిక్తతలను పెంచుతోంది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో కూడా తనవి కాని ప్రాంతాలను తనవేనని ప్రకటిస్తూ ఉద్రిక్తతలను రాజేస్తోంది’ అని యూఎస్ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. చైనాలోని అధికార కమ్యూనిస్ట్ పార్టీని ధూర్త వ్యవస్థగా అభివర్ణించారు. ట్రంప్ ప్రభుత్వం గల్వాన్ ఘటనపై భారత్కు మద్దతిస్తోంది. -
ఆయుధాలు వాడొచ్చు: కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: చైనాతో ఉన్న దాదాపు 3500 కి.మీ.ల పొడవైన సరిహద్దు వెంబడి విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు ఇకనుంచి ‘పూర్తి స్వేచ్ఛ’ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. చైనా సైనికులు ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే సరైన గుణపాఠం చెప్పే స్వేచ్ఛను సైన్యానికి ఇచ్చింది. అందులో భాగంగా, అరుదైన, తప్పనిసరి సందర్భాల్లో ఆయుధాలను సైతం ఉపయోగించే వెసులుబాటును కల్పించింది. సీడీఎస్, త్రివిధ దళాల ఉన్నతాధికారులతో కలిసిన తూర్పు లద్దాఖ్లోని క్షేత్రస్థాయి పరిస్థితిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం సమీక్షించారు. ఈ సందర్భంగా.. చైనా దురాక్రమణను అడ్డుకునేందుకు తప్పని సరైతే ఆయుధాలను కూడా ఉపయోగించే నిర్ణయం క్షేత్రస్థాయి కమాండర్లు తీసుకునేందుకు అనుమతించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని త్వరలో చైనాకు అధికారికంగా తెలియజేయనున్నట్లు చెప్పాయి. సరిహద్దుల్లో సైనికుల మధ్య నెలకొనే ఘర్షణల్లో ఆయుధాలను ఉపయోగించకూడదని పేర్కొంటూ భారత్, చైనాల మధ్య 1996, 2005ల్లో కుదిరిన ఒప్పందాలను పక్కనబెడుతూ ఈ నిర్ణయం తీసుకున్నారన్నాయి. ‘ఇకనుంచి మన తీరు మారనుంది. పరిస్థితిని బట్టి స్వయంగా నిర్ణయం తీసుకునేందుకు క్షేత్రస్థాయి కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ లభించింది’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని సైన్యాధికారి ఒకరు వెల్లడించారు. తూర్పు లద్దాఖ్తో పాటు అరుణాచల్ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ల్లోని సరిహద్దుల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులను రాజ్నాథ్ ఈ భేటీలో లోతుగా సమీక్షించారని వెల్లడించాయి. ఈ భేటీలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బధౌరియా పాల్గొన్నారు. సరిహద్దుల్లో చైనా కార్యకలాపాలను నిశిత దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా త్రివిధ దళాలకు రక్షణ మంత్రి ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలన్నారు. సరిహద్దుల్లో కఠిన వైఖరి అవలంబించాలని సూచించారు. ఆయుధాలకు అదనంగా రూ. 500 కోట్లు ఆయుధ వ్యవస్థ, మందుగుండు తదితర యుద్ధ సన్నద్ధతకు అవసరమైన సామగ్రి కొనుగోలు కోసం రూ.500 కోట్ల వరకు అదనంగా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం త్రివిధ దళాలకు అనుమతినిచ్చింది. సైనిక వ్యవహారాల విభాగంతో సంప్రదించి, అత్యవసర ప్రాతిపదికన ఈ నిధులను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. అవసరమైన ఆయుధ వ్యవస్థ, ఇతర సామగ్రి జాబితాను రూపొందించే పనిని ఇప్పటికే త్రివిధ దళాలు ప్రారంభించాయని సమాచారం. ఇప్పటికే చైనా సరిహద్దుల వెంబడి ఉన్న వాస్తవాధీన రేఖ సమీప సైనిక కేంద్రాల్లోకి భారత్ భారీగా బలగాలను మోహరించింది. ఆయుధాలను, వాహనాలను ఇతర సామగ్రిని తరలించింది. లేహ్, శ్రీనగర్ సహా పలు కీలక వైమానిక కేంద్రాలకు సుఖోయి 30 ఎంకేఐ, జాగ్వార్, మిరేజ్ 2000 యుద్ధ విమానాలను, అపాచీ చాపర్లను ఎయిర్ ఫోర్స్ తరలించింది. -
వారు పోరాడటానికి జన్మించారు..
న్యూఢిల్లీ: భారత సైన్యం దేశాన్ని కాపాడటానికి సరిహద్దుల్లో చేస్తున్న పోరాటాలను.. బిహార్ రెజిమెంట్లోని సైనికుల దైర్యానికి, శౌర్యానికి నమస్కరిస్తూ చేసిన ఓ వీడియోను ఇండియన్ ఆర్మీ ట్విటర్ ద్వారా పంచుకుంది. అందులో 'వారు పోరాడటానికి జన్మించారు. అలా అని గబ్బిలాలు కాదు. బ్యాట్మాన్. ప్రతి సోమవారం తర్వాత మంగళవారం ఉంటుంది. బజరంగ్ బలి కి జై' అంటూ వ్యాఖ్యానిస్తూ.. నార్తరన్ కమాండ్ ఇండియన్ ఆర్మీ ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఇండో–చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య గత సోమవారం రాత్రి జరిగిన హింసాత్మక ఘర్షణల్లో రెండు దేశాలకు భారీగా ప్రాణ నష్టం జరిగింది. బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ బాబుతో సహా ఇరవై మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా.. గల్వాన్ వ్యాలీ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రోజున బిహార్ ప్రజలతో మాట్లాడుతూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించిన ధైర్యవంతులకు నేను నివాళులర్పిస్తున్నాను. యుద్ధంలో ధైర్య, సాహసాలతో పోరాడిన సైనికులను భారతదేశం స్మరించుకుంటోందని తెలిపారు. బిహార్ రెజిమెంట్ సైనికులు అన్నింటినీ సవాల్ చేస్తూ విభిన్న పరిస్థితుల్లోనూ ధైర్యంగా పోరాడారని భారత సైన్యం ప్రశంసించింది. ఈ వీడియోలో 21 సంవత్సరాల క్రితం కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన వారిని కూడా గుర్తుచేసింది. కాగా అప్పట్లో బిహార్ రెజిమెంట్ కార్గిల్ చొరబాటుదారులకు ధీటైన సమాధానం చెప్పింది. 1941లో స్థాపించబడిన ఈ రెజిమెంట్ భారతదేశపు పురాతన కంటోన్మెంట్. దీనిని మూలాలు బ్రిటీష్ ఇండియన్ ఆర్మీనాటి నుంచే ఉండటం గమనార్హం. చదవండి: గల్వాన్ వంతెన నిర్మాణం విజయవంతం -
గల్వాన్లో బయటపడ్డ చైనా కుట్రలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించి చైనా కుట్రలు ఒక్కొక్కటిగా బయపడుతున్నాయి. ప్రణాళికా బద్ధంగానే భారత సైనికులపై దాడికి పాల్పడినట్లు తాజా సమాచారం ద్వారా స్పష్టమవుతోంది. దాడికి వారం ముందే గల్వాన్ లోయలో చైనా 200 బుల్డోజర్లు, యుద్ధ ట్యాంకులు, ఆయుధ సామాగ్రిని తీసుకెళ్లే ట్రక్కులను తరలించినట్లు తెలిసింది. ఈ మేరకు జూన్ 6 నుంచి 16 మధ్య చిత్రీకరించిన శాటిలైట్ చిత్రాల్లో చైనా జిత్తులు బయటపడ్డాయి. ఈ వాహనాలను తరలిస్తున్న ఉపగ్రహ దృశ్యాలు ఓ జాతీయ మీడియా ఆదివారం ప్రచురించిన కథనంలో పేర్కొంది. కాగా ఇరు దేశాల మధ్య చోటుచుసుకున్న ఘర్షణలో భారత్కు చెందిన 20 మంది సైనికులు మరణించిన విషయం తెలిసిందే. (గల్వాన్ వంతెన నిర్మాణం విజయవంతం) ఆ చిత్రాల ప్రకారం జూన్ 9 నుంచే వివాదాస్పద ప్రాంతాల్లో చైనా సైన్యాన్ని మోహరించింది. గుట్టుచప్పుడు కాకుండా ఒక్కో వాహనాన్ని తరలిస్తూ జూన్ 15 నాటికి భారీగా ఆయుధ సామాగ్రి, బుల్డోజర్ వాహనాలను గల్వాన్ లోయకు చేర్చింది. పై చిత్రం ప్రకారం వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)కి 2.8 కిమీ దూరంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)కి చెందిన 127 వాహనాలు మోహరించబడ్డాయి. (చైనా కాఠిన్యంపై అమెరికా ఆగ్రహం) వివాదాస్పద గల్వాన్ ప్రాంతంలో చైనా ఏర్పాటు చేసిన ఆర్మీ క్యాంపు. ఇది వాస్తవాధీన రేఖకు 2.9 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రకారం చైనా అక్కడేదో నిర్మాణం చేపడుతున్నట్లు తెలుస్తోంది. జూన్ 16 నాటికి చైనా మరింత దూకుడు పెంచింది. ఎల్ఏసీకు కేవలం 1.3 కిలోమీటర్ల దూరంలో (భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో) ఏకంగా 79 వాహనాలను చేర్చింది. భారత్ చెబుతున్నట్లు ఇదంతా కూడా ఎల్ఏసీకి ఇవతలి వైపు (భారత్వైపు) ఉన్న ప్రాంతం. అయినప్పటికీ చైనా సైన్యం సరిహద్దును ఉల్లంఘించి భారత భూభాగంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే ఇరు పక్షాల మధ్య చెలరేగిన హింసలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. -
గల్వాన్ ఘటన: ఏం జరుగుతుందో చూడాలి!
వాషింగ్టన్ : భారత్- చైనా సరిహద్దు మధ్య సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దీన్ని చాలా పెద్ద సమస్యగా అభివర్ణించారు. సరిహద్దులో ఘర్షణలు తగ్గించేందుకు ఇటు భారత్తోపాటు అటు చైనాతో కూడా మాట్లాడుతున్నామని తెలిపారు. కరోనా వైరస్ సంక్షోభం తర్వాత శనివారం తొలిసారిగా ఓక్లహోమాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొనడానికి వెళ్తున్న సమయంలో ఆయన వైట్హౌస్ దగ్గర మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉందని, మున్ముందు ఏం జరుగుతుందో చూడాలన్నారు. (రాయని డైరీ : జో బైడెన్ (ట్రంప్ ప్రత్యర్థి)) ఇక ఈ సమస్య నుంచి బయటడపడేందుకు అమెరికా తనవంతు సాయం చేస్తుందని ప్రకటించారు. కాగా జూన్ 15న సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికులు ముఖాముఖి తలపడటం తెల్సిందే. ఈ ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరవీరులవగా అమెరికా అంచనా ప్రకారం 35 మంది చైనా సైనికులు మరణించారు. ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి భారత్కు మద్దతిస్తూ చైనా వైఖరిని ఎండగడుతున్నారు. (ఆ హక్కు చైనాకు లేదు : యూఎస్) -
గల్వాన్ వంతెన నిర్మాణం విజయవంతం
చైనా కంటగింపునకు, గల్వాన్ ఘటనకు ప్రధాన కారణమైన గల్వాన్ వంతెన నిర్మాణాన్ని భారత సైన్యం విజయవంతంగా పూర్తి చేసింది. గల్వాన్ ఘటనతో ఏమాత్రం వెనుకంజ వేయని భారత సైనికాధికారులు మంగళవారం ఉదయం.. ఆర్మీ కంబాట్ ఇంజనీర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ‘గల్వాన్ నదిపై తలపెట్టిన వంతెన నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలి’ అనేది ఆ ఉత్తర్వుల సారాంశం. వెంటనే రంగంలోకి దిగిన ఇంజనీర్లు, సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు. (చైనా కాఠిన్యంపై అమెరికా ఆగ్రహం) ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా ఆ పనులను ఏకబిగిన 72 గంటల పాటు కొనసాగించి, గురువారం మధ్యాహ్నం కల్లా పూర్తి చేశారు. వంతెనపై రెండు గంటలపాటు వాహనాలను నడిపి విజయవంతంగా పరీక్షించి చూశారు. జూన్ 15వ తేదీన రెండు బలగాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన ‘పెట్రోల్ పాయింట్ 14’కు ఈ వంతెన కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. 60 మీటర్ల పొడవైన ఈ బెయిలీ(ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే వీలున్న) వంతెనపై ఫిరంగి దళ వాహనాలతోపాటు ఇతర అన్ని రకాల వాహనాలు రాకపోకలు సాగించవచ్చు. (చైనా ఆక్రమించినవి స్వాధీనం చేసుకుంటాం) వాస్తవ నియంత్రణ రేఖ వద్దకు బలగాలు వేగంగా చేరుకునేందుకు ఈ వంతెన కీలకంగా మారనుంది. ఈ వంతెనతో దర్బాక్ నుంచి దౌలత్ బేగ్ ఓల్దీ వరకు 255 కిలోమీటర్ల మేర రహదారిని భారత్ కాపాడుకోగలదు. భారత్, చైనాలకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన గల్వాన్ నది పరీవాహక ప్రాంతంలో మన దేశం చేపట్టిన నిర్మాణాల్లో ఈ వంతెన కూడా ఒకటి. సరిహద్దు ప్రాంతాల్లో భారత ఆర్మీ ఇంజనీర్ల సాయంతో బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్(బీఆర్వో) తలపెట్టిన మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు.. చైనా ఎన్ని కుట్రలు పన్నినా కొనసాగుతాయని ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. (చైనా దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి..) -
ఐక్యతను, సాయుధ దళాల పట్ల సంఘీభావాన్ని చాటాల్సిన సమయమిది
సాక్షి, అమరావతి: భారత్–చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంపై వక్రభాష్యాలు చెప్పే ప్రయత్నాల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం రాత్రి ట్వీట్ చేశారు. ‘ఇది మనం ఐక్యతను, మన సాయుధ దళాల పట్ల సంఘీభావాన్ని చాటాల్సిన సమయం. అంతేగానీ.. ఒకరి పట్ల మరొకరు వేలెత్తి చూపించుకోవడమో లేక తప్పులను ఎత్తి చూపించుకోవడమో చేసుకునే సమయం కాదు. అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి, ఇతర మంత్రులు చాలా ఆమోద యోగ్యమైన, విశ్వసనీయమైన సమాధానాలు చెప్పారు. ఈ విషయమై జాతి యావత్తు ఏకతాటిపై నిలబడాలి. ఐక్యత బలాన్ని ఇస్తుంది. విభజన బలహీనతను ప్రదర్శిస్తుంది’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
సర్వే: చైనా వస్తువుల బ్యాన్కే మొగ్గు!
న్యూఢిల్లీ : గల్వాన్ లోయ వద్ద చైనా సైనికుల దాడి ఘటన తరువాత భారత్లో చైనా వస్తువుల బహిష్కరణ నినాదం ఊపందుకుంది. చైనా వస్తువులను ఇండియా బహిష్కరిస్తే ఆ దేశానికి ఆర్థికంగా నష్టం వస్తుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈనెల 16న జరిగిన చైనా-భారత్ సంఘటనలో 20 మంది భారత జవాన్లు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో చైనా తయారు చేసిన వస్తువులను, ఉత్పత్తులను బహిష్కరించాలని కేంద్ర పిలుపునివ్వడంతో అనేక రాష్ట్రాల్లో చైనా వస్తువులకు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో చైనాపై భారత్ ప్రజల అభిప్రాయాలను అంచనా వేయడానికి న్యూస్ 18 నెట్వర్క్ డిజిటల్ తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో కలిసి ఆన్లైన్ పోల్ను నిర్వహించింది. ఇది శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నం(24 గంటలు) వరకు చేపట్టింది. తొమ్మిది ప్రశ్నలతో కూడిన ఈ సర్వేలో సుమారు 6,000 వేల మంది తమ స్పందనలను తెలియజేశారు. ఇందులో కనీసం 70 శాతం మంది భారతీయులు చైనా వస్తువులను బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తేలింది. వీరు చైనా వస్తువులకు బదులు ఎక్కువ మొత్తంలో చెల్లించి వేరే వస్తువులను కొనేందుకు సైతం ఆసక్తి చూపుతున్నారు. వీరిలో 91 శాతం మంది చైనా యాప్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించడం మానేస్తామని తెలిపినట్లు వెల్లడైంది. అంతేగాక ఇతరులను ఇందుకు ప్రోత్సాహిస్తామని తేలింది. 92 శాతం మంది చైనా ఉత్పత్తులపై తమకు నమ్మకం లేదని తెలిపారు. కాగా వీరిలో ఎక్కువ మందికి చైనాపై వ్యతిరేక వాదన ఉంది. ఎక్కువగా 97 శాతం ప్రజలు చైనా ఉత్పత్తులను భారతీయ సెలబ్రిటీలు ఉపయోగించడం మానేయాలని సూచించారు. 92 శాతం మంది భారత్కు పాకిస్తాన్ కంటే చైనా భారత్కు పెద్ద ముప్పుగా తయారైందని భావిస్తున్నారు. అలాగే 52 శాతం మంది భారత్కు మిత్రదేహాలు లేవని దేశం తనను తాను రక్షించుకోవాల్సి ఉందని హితవు పలికారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (18.12 శాతం) కంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (19.32 శాతం) భారత్కు మంచి సన్నిహితుడిగా పేర్కొన్నారు. చైనీయుల ఆహారం మరియు రెస్టారెంట్లను బహిష్కరించాలని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే ఇంతకుముందు పిలుపునిచ్చినప్పటికీ, చాలా మంది భారతీయులు దీని గురించి ఇంకా తెలియదన్నారు. 43 శాతం మంది తాము చైనీస్ ఆహారాన్ని తినబోమని, 31 శాతం మంది ఆ ఆహారంతో తమకు సంబంధం లేదని చెప్పారు. కాగా గత 15 రోజుల్లో చైనాపై మనోభావాలను అంచనా వేయడానికి న్యూస్ 18 నిర్వహించిన రెండవ పోల్ ఇది. మొదటి పోల్ ఫలితాలు జూన్ 5న వెల్లడించింది. -
రాహుల్పై మండిపడ్డ జవాన్ తండ్రి
‘భారత సైన్యం పూర్తి శక్తి సామర్థ్యాలతో పనిచేస్తోంది. చైనా చర్యలను భారత్ సమర్ధవంతంగా ఎదుర్కోగలదు. రాహుల్.. ఈ విషయంలో రాజకీయాలు చెయ్యొద్దు’ అని గల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణలో గాయపడిన భారత సైనికుడు సురేంద్ర సింగ్ తండ్రి బల్వంత్ సింగ్ అన్నారు. తన కొడుకు ఇప్పటి వరకు సైన్యంలో పోరాడడని.. ఇక ముందు కూడా పోరాటం కొనసాగిస్తాడని రాహుల్ గాంధీని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. గాయాల నుంచి తన కొడుకు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు బల్వంత్ సింగ్ శనివారం వీడియో రూపొందించి మాట్లాడారు. (మోదీ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ చిదంబరం) కాగా గల్వాన్ లోయ వద్ద భారత్- చైనా సైనికుల మధ్య జరిగిన ఘటనపై రాహుల్ గాంధీ స్పందిస్తూ చైనా దురాక్రమణకు తలొగ్గిన నరేంద్ర మోదీ భారత భూభాగాన్ని చైనాకు అప్పజెప్పారని ఆరోపించారు. అలాగే ప్రధాని మోదీని కాపాడేందుకు కేంద్ర మంత్రులు అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇందుకు బల్వంత్ ఇంతకముందు మాట్లాడిన ఓ వీడియోను రాహుల్ తన ట్విటర్లో షేర్ చేశారు. (రాహుల్-అమిత్ షా మధ్య ట్విటర్ వార్) అయితే అదే బల్వంత్ తాజాగా మరో వీడియో తీసి భారత సైన్యం బలమైనదని, చైనాలను ఓడించగలదన్నారు. రాహుల్.. గల్వాన్ ఘటనను రాజకీయం చేయొద్దు అంటూ సూచించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక బల్వంత్ సింగ్ మాట్లాడిన వీడియోను హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం షేర్ చేశారు. సైనికుడి తండ్రి రాహుల్కు స్పష్టమైన సందేశం ఇచ్చారని, అంతేగాక ఇలాంటి చిల్లర రాజకీయాల నుంచి ఎదగాలని హితవు పలికారు. దేశమంతా ఏకతాటిపై నిలిచిన ఈ సమయంలో రాహుల్ మరింత సంఘీభావంతో మెలగాలని సూచించారు. ('చైనా దురాక్రమణకు మోదీ లొంగిపోయారు) -
చైనాను ఆర్థికంగా దెబ్బకొట్టాలి: సీఎం
భోపాల్: భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నెల 15న గాల్వన్లో లోయలో ఇరు దేశాల రక్షణ దళాల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 20మంది భారత సైనికులు మరణించారు. ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రజలు చైనాకు సంబంధించిన వస్తువులను వాడకూడదని పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘బాయ్కాట్ చైనా’ నినాదం మార్మోగుతోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ‘బాయ్కాట్ చైనా’కు మద్దతిచ్చారు. చైనాను ఆర్థికంగా దెబ్బకొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చైనాలో తయారయిన వస్తువులను బహిష్కరించాల్సిందిగా మధ్యప్రదేశ్ ప్రజలను కోరుతున్నాను. మన సైన్యం వారికి తగిన సమాధానం చెప్పింది. అలానే మనం కూడా వారిని ఆర్థికంగా దెబ్బతీయాలి’ అని చౌహాన్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చైనా దురాక్రమణకు నిరసనగా ప్రజలు తమ ఫ్లాట్ టీవీలను బాల్కనీల నుంచి బయటకు విసిరేయడం.. చైనాలో తయారయిన ఎలక్ట్రానిక్స్ను దహనం చేస్తున్న దృశ్యాలు తెగ వైరలవుతున్నాయి. (చైనా 'బే'జార్) मैं प्रदेशवासियों से अपील करता हूं कि देशभक्ति के भाव से भरकर चीन में बने सभी सामानों का बहिष्कार करें। अपने यहां निर्मित सामानों को प्राथमिकता दें। हमारी सेना भी चीन को जवाब देगी, लेकिन आर्थिक रूप से भी हम उसको तोड़ेंगे। भारत चीन को मुंहतोड़ जवाब देगा। pic.twitter.com/saaqQd2Z7F — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) June 19, 2020 సరిహద్దులో ఘర్షణ నేపథ్యంలో భారత్లో చైనా ఆహార పదార్థాలను అమ్ముతున్న అన్ని రెస్టారెంట్లు, హోటళ్లను మూసేయాలంటూ కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన ఆహారాన్ని బహిష్కరించాలన్నారు. రోజూవారీ కార్యకలాపాల్లో చైనా ఉత్పత్తుల వాడకాన్ని బహిష్కరించాలంటూ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. (బాయ్కాట్ చైనా) -
చైనాకు హెచ్చరికలు జారీ చేయండి : సీఎం
చండీగఢ్ : ముగ్గురు జవాన్ల మృతదేహాలకు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ నివాళులు అర్పించారు. గాల్వాన్లో చైనా, భారత జవాన్లకు మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లేహ్ నుంచి చండీగఢ్ ఎయిర్ఫోర్స్ స్టేషన్కు చెరుకున్న ముగ్గురు ఆర్మీ జవాన్ల మృతదేహాలకు అమరీందర్సింగ్ శుక్రవారం నివాళులు అర్పించారు. (మణిపూర్లో బీజేపీ పడిపోతుందా లేదా!?) భారత భూభాగాన్ని వెంటనే ఖాళీ చేసి వెళ్లకపోతే, ధీటుగా ప్రతి దాడి చేస్తామని చైనాకు హెచ్చరికలు జారీ చేయాలని కేంద్ర ప్రభాత్వాన్ని అమరీందర్ సింగ్ కోరారు. దీని వల్ల ఎలాంటి పర్యావసనాలు ఎదురైనా, అవి శాశ్వతంగా ఉండవన్నారు. 60 ఏళ్ల దౌత్యం విఫలమయిందని, 20 మంది జవాన్లను దారుణంగా దాడిచేసి హతమార్చారని పేర్కొన్నారు. 60 ఏళ్ల దౌత్యం పనిచేయలేదు, చైనా అగ్రదేశం అయితే, భారత్ కూడా అందుకు సమానమే అని పేర్కొన్నారు. ఇప్పుడు కాదు 1962 నుంచి చైనా ఆక్రమణలు చేస్తూనే ఉన్నారని అమరీందర్ తెలిపారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ 1963-1966 మధ్య ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. (ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రకు ప్లాస్మా థెరఫీ) -
మోదీ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ చిదంబరం
న్యూఢిల్లీ : అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం ధ్వజమెత్తారు. భారత సరిహద్దుల్లోకి ఎవ్వరూ చొరబడలేదన్న మోదీ వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు. ఈ మేరకు శనివారం చిదంబరం స్పందిస్తూ.. ‘మోదీ వ్యాఖ్యలు ఇంతకముదు ఆర్మీ చీఫ్, రక్షణ, విదేశాంగ శాఖ మంత్రులు చేసిన ప్రకటనలకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రధాని వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ కలవరపరిచాయి. మే 5,6న చైనా బలగాలు మన భూభాగంలోకి ప్రవేశించకపోతే, మన సైనికులు ఎక్కడ గాయపడ్డారు, ఎందుకు అమరులయ్యారు’ అని ప్రశ్నించారు. ('చైనా దురాక్రమణకు మోదీ లొంగిపోయారు') కాగా భారత భూభాగంలో ఎవరూ ప్రవేశించలేదని శుక్రవారం ప్రధానమంత్రి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. భారత్ వైపు కన్నెత్తి చూసిన వారికి సైనికులు గుణపాఠం నేర్పారని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా ఈ నెల 16న గల్వాన్ లోయలో చైనా- భారత్ బలగాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఇక ఇదే విషయంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ప్రధాని వ్యాఖ్యలపై ప్రశ్నలు సంధించారు. చైనా దురాక్రమణకు తలొగ్గిన ప్రధాన భారత భూభాగాన్ని చైనాకు అప్పగించారని ఆరోపించారు. ఒకవేళ ఆ భూభాగం చైనా వారిది అయితే భారత జవాన్లు ఎందుకు మరణించారని ప్రధానిని ప్రశ్నించారు. (రాహుల్-అమిత్ షా మధ్య ట్విటర్ వార్) -
వాయుసేన.. సిద్ధంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్ : సరిహద్దుల్లో భారత్ ఎప్పుడూ శాంతి మంత్రాన్ని పాటిస్తుందని భారత వైమానిక దళాధిపతి ఆర్కేఎస్ భదౌరియా స్పష్టం చేశారు. భారత సైనికులపై కవ్వింపులకు దిగితే మాత్రం అదే రీతిలో సమాధానం చెప్పగల సత్తా మన సైన్యం వద్ద ఉందని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగిన గ్రాడ్యుయేషన్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా విధుల్లో చేరబోతున్న క్యాడేట్లను ఉద్దేశించి భదౌరియా ప్రసంగించారు. భారత్-చైనా సరిహద్దుల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటననను ఆయన గుర్తుచేశారు. చైనా ఆగడాలను ఎల్లప్పుడూ తిప్పుకొడుతున్న భారత జవాన్ల పోరాట పటిమను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. (చైనా కాఠిన్యంపై అమెరికా ఆగ్రహం) పరేడ్ సందర్భంగా భదౌరియా మాట్లాడుతూ.. ‘చైనా సరిహద్దుల్లో అమరవీరుడైన కల్నల్ సంతోష్ బాబుతో పాటు 19 మందికి నివాళులు అర్పిస్తున్నాం. వారి ధైర్యం సాహసాలను ఆదర్శంగా తీసుకోవాలి. లడఖ్లో ప్రస్తుత పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. చర్చలు అని చెప్పి చైనా దాడులకు పాల్పడుతుంది. దేనికైనా సరే మనం సిద్ధంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాయుసేన సిద్ధంగా ఉంది. ఎలాంటి ప్రతికూల వాతావరణం లో అయినా దేశ సేవ ప్రధానం. పీపుల్ సేఫ్టీ ఫస్ట్.. మిషన్ ఆల్ వేస్... ఎప్పటికి మరిచిపోవద్దు. తమ పిల్లల కళను సాకారం చేసిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు. గాల్వాన్ అమరుల త్యాగాలను వృథా కానివ్వం.’ అని పేర్కొన్నారు. కాగా పరేడ్ సందర్భంగా క్యాడేట్ల చేత గౌరవ వందన్నాన్ని చీఫ్ మార్షల్ స్వీకరించారు. కోవిడ్ 19 నేపధ్యంలో పరేడ్ తిలకించడానికి క్యాడేట్ల కుటుంబ సభ్యులకు అనుమతి నిరాకరించారు. కాగా మొత్తం 123 మంది క్యాడేట్లలో 19 మంది బాలికలు ఉన్నారు. వీరందరికీ చీఫ్ మార్షల్ అభినందనలు తెలిపారు. -
చైనా కాఠిన్యంపై అమెరికా ఆగ్రహం
వాషింగ్టన్ : భారత్-చైనా సరిహద్దుల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఘాటుగా స్పందించింది. పొరుగు దేశాలతో చైనా వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టింది. ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ శాంతిని కోరుతుంటే డ్రాగన్ మాత్రం సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలుదువ్వడం సరైనది కాదని ఆక్షేపించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి డెన్మార్క్తో నిర్వహించిన ఓ వీడియో కాన్ఫరెన్స్ సదస్సులో అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్ పాంపియో కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో చైనా అవలంభిస్తున్న విధానం అంత సహేతుకమైనది కాదని విమర్శించారు. (చైనా వ్యతిరేక బాటలో మరో తరం) తాజాగా భారత సైనికులపై ఆ దేశ ఆర్మీ పాల్పడిన కాఠిన్యాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రెండు అత్యధిక జనాభాగల దేశాల మధ్య ఘర్షణపూరితమైన వాతావరణం ఇరుపక్షాలకు నష్టం చేకూర్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా సరిహద్దు దేశాలతో డ్రాగన్ అవలంభిస్తున్న తీరును మైక్ పాంపియా తప్పుబట్టారు. హాంకాంగ్ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలపై చైనా గుత్తాధిపత్యం ఆ దేశ పౌరులకు పెను ప్రమాదమని హెచ్చరించారు. పక్క దేశ పౌరుల స్వేచ్ఛను హరించే హక్కు చైనాకు లేదని స్పష్టం చేశారు. అలాగే దక్షిణ చైనా సముద్రం, జపాన్, మలేషియా దేశాలతో చైనా వివాదాలను ఆయన తీవ్రంగా ఖండించారు. (చైనాకు వ్యతిరేకంగా ఒక్కటైన నెటిజన్లు!) కాగా చైనా-అమెరికా మధ్య ఇప్పటికే వాణిజ్యం యుద్ధం తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ప్రాణాంతక కరోనా వైరస్ను డ్రాగన్ కుట్రపూరితంగానే లీక్ చేసిందనే ఆరోపణలు ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాయి. ఇక ఈ ఏడాది చివరిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో తనను ఓడించేందుకు చైనా పరోక్షంగా కుట్రలు పన్నుతోందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. చైనా విషయంలో మైక్ పాంపియా మొదటి నుంచీ చురుకుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ దేశ కుట్రలు, కుతంత్రాలను ఎప్పటికప్పుడు ట్రంప్కు చేరవేస్తూ.. యూఎస్ విదేశాంగ విధానంలో కీలకంగా మారారు. -
మన సరిహద్దు క్షేమం
న్యూఢిల్లీ: మన భూభాగంలోకి ఎవరూ రాలేదని, సరిహద్దు క్షేమమని, మన ఆర్మీ పోస్ట్లను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. చైనా సాగించిన దురాగతానికి యావద్దేశం గాయపడిందని, ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు. భారత్ శాంతిని, స్నేహ సంబంధాలనే కోరుకుంటుందని, అదే సమయంలో, దేశ సార్వభౌమత్వం విషయంలో రాజీ లేదని, అదే మనకు సర్వోన్నతమని స్పష్టం చేశారు. సరిహద్దులను కాపాడే విషయంలో సైన్యం సమర్ధంగా వ్యవహరిస్తోందన్నారు. అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చామన్నారు. వాస్తవాధీన రేఖకు సంబంధించి భారత్ విధానాన్ని దౌత్య మార్గాల ద్వారా చైనాకు స్పష్టం చేశామని ప్రధాన రాజకీయ పార్టీల అగ్రనేతలతో పేర్కొన్నారు. తూర్పు లద్దాఖ్లో చైనాతో సరిహద్దు ఘర్షణల్లో 20 మంది భారతీయ జవాన్లు అమరులై, చైనాతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని∙మోదీ శుక్రవారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు. ప్రభుత్వానికి అండగా ఉంటామని భేటీలో పాల్గొన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రకటించాయి. రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర ప్రధాన పార్టీల అగ్రనేతలు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాల్వన్ లోయలో జూన్ 15 రాత్రి చైనా సైనికులతో చోటు చేసుకున్న ఘర్షణ తదనంతర పరిణామాలను, ప్రస్తుత పరిస్థితిని మంత్రులు రాజ్నాథ్ సింగ్, జై శంకర్ పార్టీల నేతలకు వివరించారు. చైనాతో వ్యవహరించాల్సిన తీరుపై దాదాపు 4 గంటల పాటు సాగిన ఈ భేటీలో వివిధ పార్టీల నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మొదట, చైనాతో సరిహద్దు ఘర్షణల్లో అమరులైన 20 మంది వీర జవాన్లకు ప్రధాని, మంత్రులు, పార్టీల నేతలు 2 నిమిషాల పాటు మౌనం పాటించి, నివాళులర్పించారు. జవాన్ల త్యాగం వృధా కాబోదని ప్రధాని పునరుద్ఘాటించారు. భారత్ వైపు చూసే ధైర్యం చేసినవారికి మన వీర జవాన్లు తగిన గుణపాఠం చెప్పారని ప్రధాని వ్యాఖ్యానించారు. గాల్వన్ లోయ, ప్యాంగ్యాంగ్ సరస్సు ప్రాంతాల్లోని భారత భూభాగాల్లోకి చైనా సైనికులు చొచ్చుకువచ్చారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని వివరణ ఇచ్చారు. మన భూభాగంలో ఒక అంగుళాన్నైనా ఎవరూ ఆక్రమించుకునే ధైర్యం చేయలేనంత స్థాయిలో సామర్థ్యాన్ని పెంపొందించుకున్నామన్నారు. ఈ భేటీలో ఎన్సీపీ నేత శరద్పవార్, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కే చంద్ర శేఖర రావు, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ, డీఎంకే నేత స్టాలిన్, బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే, సీపీఎం నేత సీతారాం యేచూరి పాల్గొన్నారు. చైనా పెట్టుబడులు వద్దు: మమత భారత్లోని మౌలిక వసతుల రంగంలో చైనా పెట్టుబడులను అంగీకరించవద్దని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ సూచించారు. ఈ సంక్షోభ సమయంలో తమ పార్టీ కేంద్రానికి మద్దతుగా నిలుస్తుందన్నారు. కమిటీ ఏర్పాటు చేస్తారా?: యేచూరి చైనాతో సరిహద్దుల్లో ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడ్డానికి, 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడానికి నిఘా వైఫల్యం కారణమా అని తేల్చేందుకు ఏదైనా కమిటీని నియమిస్తారా? అని సీపీఎం నేత సీతారాం యేచూరి ప్రశ్నించారు. గతంలో కార్గిల్ వార్ అనంతరం.. వైఫల్యాలపై విచారణ జరిపేందుకు అప్పటి ప్రధాని వాజ్పేయి ఒక కమిటీ వేసిన విషయాన్ని యేచూరి గుర్తు చేశారు. మీ సైనికులెవరూ మా ఆధీనంలో లేరు:చైనా బీజింగ్: భారతీయు సైనికులు ఎవరూ ‘ప్రస్తుతం‘తమ ఆధీనంలో లేరని చైనా శుక్రవారం స్పష్టం చేసింది. తూర్పు లడాఖ్ సరిహద్దుల్లో జూన్ 15న భారత్ చైనాల మధ్య ఘర్షణలో పొరుగుదేశం మన సైనికులను బందీలుగా చేసి తీసుకెళ్లిందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావ్ లిజియాన్ మీడియాకు ఈ విషయం తెలిపారు. నిఘా వైఫల్యమా?: సోనియా సరిహద్దుల్లో చైనాతో ఘర్షణల్లో 20 మంది భారత జవాన్ల మృతికి నిఘా వైఫల్యం కారణమా? అని సోనియాగాంధీ ప్రశ్నించారు. గాల్వన్ లోయలో యథాతథ స్థితి నెలకొంటుందని, చైనా వెనక్కు వెళ్తుందని హామీ ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరారు. భేటీ ప్రారంభంలో సోనియా పలు ప్రశ్నలను సంధించారు. చైనా దళాలు తూర్పు లద్దాఖ్లో భారత భూభాగంలోకి వచ్చాయా? వస్తే ఎప్పుడు వచ్చాయి? ఆ ప్రాంతంలో చైనా దళాల అసాధారణ కదలికలపై మన నిఘా సంస్థలు సమాచారం ఇవ్వలేదా? అని ఆమె ప్రశ్నించారు. తదుపరి కార్యాచరణ ఏమిటన్నారు. సైనికుల మధ్య ఘర్షణలు ప్రారంభమైన మే 5 నుంచి జూన్ 6 వరకు విలువైన కాలాన్ని ప్రభుత్వం వృధా చేసిందని ఆరోపించారు. మమ్మల్ని ఆహ్వానించరా? ఈ భేటీకి ఆహ్వానించకపోవడంపై ఆప్, ఆర్జేడీ, ఎంఐఎం ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరాయి. ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్యాదవ్, ఆయన కూతురు మీసాభారతి, ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. బిహార్లో తమది ప్రధాన ప్రతిపక్షమని, ఈ భేటీకి ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. అయితే, అన్ని గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, లోక్సభలో ఐదుగురు, లేదా ఆపై ఎంపీలున్న పార్టీలు, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు, కేబినెట్లో మంత్రులున్న పార్టీలను మాత్రమే భేటీకి ఆహ్వనించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లేహ్లో ఐఏఎఫ్ చీఫ్ భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో.. భారత వైమానిక దళాధిపతి చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా లేహ్, శ్రీనగర్ల్లో పర్యటించారు. ఎయిర్ఫోర్స్ సన్నద్ధతను పరిశీలించారు. -
‘ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం’
సాక్షి, తాడేపల్లి : గాల్వన్ సంక్షోభ సమయంలో దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సరైన మార్గంలో విజయవంతగా నడిపిస్తారని నమ్ముతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్ది తెలిపారు. భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై మోదీ శుక్రవారం సాయంత్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చైనాతో జరిగిన ఘర్షణలో మరణించిన 20 మంది వీరసైనికుల మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. వారి త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పారు. అమరులైన సైనికుల కుటుంబాలకు అందరం తోడుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సంక్షోభ సమయంలో ఏ వ్యుహాత్మక నిర్ణయం తీసుకున్నా దానిని తాము కట్టుబడి ఉంటామని మోదీకి చెప్పారు. -
చైనా వస్తువుల బ్యాన్ తొందరపాటు చర్య: కేసీఆర్
సాక్షి,హైదరాబాద్ : భారత-చైనా సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఏమాత్రం తొందరపాటు ఉండొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అదే సందర్భంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభంలో గాల్వన్ లోయ ఘటనలో మరణించిన సైనికులకు మౌనం పాటించి నివాళి అర్పించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ తన అభిప్రాయాలు చెప్పారు. ఈ నేపథ్యంలో చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని ప్రధానమంత్రికి సూచించారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పుడు కావల్సింది రాజకీయం (రాజ్ నీతి) కాదని, యుద్ధనీతి (రణ్ నీతి) కావాలని చెప్పారు. దేశంలో పరిపాలన సుస్థిరంగా ఉండడంతో పాటు, గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడం ఓర్వలేకనే చైనా కయ్యానికి కాలుదువ్వుతున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. గాల్వన్ లోయలో వీర మరణం పొందిన సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున అందించే సాయాన్ని కూడా కేసీఆర్ ప్రకటించారు. (నిమిషంలో అమ్ముడుపోయిన చైనా ఫోన్!) ‘చైనా, పాకిస్తాన్ దేశాలకు తమ దేశాల్లో అంతర్గత సమస్యలున్నప్పుడు సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం సృష్టించడం అలవాటు. ఇప్పుడు చైనాలో కూడా అంతర్గత సమస్యలున్నాయి. దక్షిణ చైనా సముద్ర తీర దేశాలైన మలేషియా, ఫిలిప్పీన్స్, జపాన్ తదితర దేశాలతో కూడా చైనా ఘర్షణలకు దిగుతోంది. భారతదేశంతో చైనా మొదటి నుంచి ఘర్షణ వైఖరి అవలంభిస్తోంది. గాల్వన్ లోయ లాంటి సంఘటనలు గతంలోనూ జరిగాయి. 1957లో సరిహద్దు వివాదం లేవనెత్తింది. 1962లో ఏకంగా భారత్ – చైనా మధ్య పూర్తిస్థాయి యుద్ధమే జరిగింది. 1967లో కూడా సరిహద్దులో ఘర్షణ జరిగింది. అప్పుడు 200 మంది మృతి చెందారు. ఇప్పుడు గాల్వన్ వద్ద మళ్లీ ఘర్షణలు జరిగాయి. అందులోనూ మన సైనికులు 20 మంది మరణించారు. వేల కిలోమీటర్ల సరిహద్దు కలిగిన దేశంతో ఎక్కడో ఓ చోట ఏదో ఓ గొడవ జరుగుతూనే ఉంది. చైనాతో భారతదేశానికి ఎప్పటికైనా ప్రమాదం పొంచి వుంది. కాబట్టి మనం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. (సంతోష్ బాబు కుటుంబానికి భారీ సాయం: కేసీఆర్ ) ‘ఆర్థికంగా ప్రబల శక్తిగా భారత్ మారుతున్నది. అమెరికా 21 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక శక్తి అయితే, చైనా 14 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో ఉంది. 5 ట్రిలియన్ డాలర్ల సంపద కలిగిన జపాన్ తో పాటుగా భారత్ కూడా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేయడం చైనా భరించలేక పోతున్నది. కరోనా వైరస్కు చైనాయే కారణమనే అపఖ్యాతి వచ్చింది. అందుకే చైనా నుంచి చాలా బహుళ జాతి సంస్థలు బయటకు వచ్చి, భారత్ వైపు చూస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు రిపోర్టు ప్రకారం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 142వ స్థానం నుంచి 63వ స్థానానికి భారతదేశం ఎదిగింది. 2014 నుంచి 2017 వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 36 బిలియన్ డాలర్ల నుంచి 61 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇంకా పెరగడానికి అవకాశాలున్నాయి. చైనా నుంచి వస్తువుల దిగుబడి ఆపాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది తొందరపాటు చర్య అవుతుంది. ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న వస్తువులు మన దేశంలోనే తయారు కావాలి. ప్రజలకు సరసమైన ధరల్లో వస్తువులు దొరకాలి. ముందుగా మనం ఈ విషయాలపై దృష్టి పెట్టాలి. రక్షణ వ్యవహారాలలో మిత్రదేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలి. బ్రిటన్ ప్రతిపాదించిన డి 10 గ్రూపులో కలవాలి. ఓరాన్ అలయెన్సులో చేరాలి. హువాయ్ కంపెనీ ఎత్తుగడను తిప్పికొట్టాలి. మనం వ్యూహాత్మకంగా వ్యవహరించాలి’. అని కేసీఆర్ స్పష్టం చేశారు. (చెప్పిన పంటలే వేయాలని సీఎం అనలేదు: కేటీఆర్) బయటపడ్డ చైనా కుట్ర.. తాజా ఫొటోలు! -
‘అనుమానాలున్నాయి.. హామీ ఇవ్వండి’
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని విపక్ష నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సోనియా గాంధీ దేశ ‘ప్రజలు యథాతథ స్థితి పునరుద్ధరించబడుతుంది అని.. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనా తన అసలు స్థానానికి తిరిగి వెళ్తుందని ఆశిస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం నుంచి హామీని కోరుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. అంతేకాక ఇప్పటికి కూడా ఈ సంక్షోభం గురించి తమకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ అంశం గురించి సోనియా కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించారు. ‘లడాఖ్లోని మన భూభాగంలోకి చైనా దళాలు ఏ తేదీన చొరబడ్డాయి? చైనా మన భూభాగంలోకి చేసిన అతిక్రమణలను ప్రభుత్వం ఎప్పుడు గుర్తించింది. మే 5 న లేదా అంతకుముందుగానా? భారత్-చైనా సరిహద్దుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను ప్రభుత్వం స్వీకరించలేదా?’ అని సోనియా వరుస ప్రశ్నలు సంధించారు. సోనియా గాంధీ మాట్లాడుతూ.. ‘మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఎల్ఏసీ వెంట చోటు చేసుకుంటున్న అసాధారణమైన కార్యకలాపాల గురించి ప్రభుత్వానికి నివేదించలేదా? మిలిటరీ ఇంటెలిజెన్స్ ఎల్ఏసీ వెంబడి భారత్, చైనా దళాలు చొరబడటం, భారీగా బలగాలను మోహరించడం గురించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయలేదా? ప్రభుత్వం అభిప్రాయంలో ఏదైనా వైఫల్యం ఉందా?’ అని సోనియా ప్రశ్నించారు. వీటికి ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉంది. -
‘ఒక్క ట్వీట్ చేస్తారు.. పూర్తిగా మర్చిపోతారు’
న్యూఢిల్లీ: గాల్వన్ లోయలో భారత్-చైనా దళాల మధ్య ఘర్షణ జరిగింది అనే వార్త తెలిసినప్పటి నుంచి రిటైర్డ్ బ్రిగేడియర్ సీకే సూద్ స్థిమితంగా ఉండలేకపోతున్నారు. 20 మంది సైనికులు చనిపోయారని తెలిసినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఎంత విలవిల్లాడిపోయారో.. సూద్ కూడా అలానే బాధపడ్డారు. ఈ ఘటన ఆయన కుమారుడిని గుర్తు చేసింది. సీకే సూద్ కుమారుడు మేజర్ అంజు సూద్ కూడా గత నెల 2న కశ్మీర్ హంద్వారా ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో అసువులు బాశారు. ఉగ్రవాదుల చేతిలో చిక్కుకున్న పౌరులను కాపాడే క్రమంలో అంజు సూద్ మరణించారు. ఈ ఘటనలో మొత్త ఐదుగురు చనిపోయారు. కొడుకు మరణించిన విషాదం నుంచి బయటపడక ముందే మరో 20 మంది సరిహద్దులో నెలకొరిగారనే విషయం ఆయనను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. (చైనా చెర నుంచి సైనికులు విడుదల..!) ఈ సందర్భంగా సీకే సూద్ మాట్లాడుతూ.. ‘నా కుమారుడు మరణించాడనే వార్త నాకు ఒక రోజు తర్వాత తెలిసింది. ఆలోపే ఈ వార్త అన్ని వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది’ అన్నారు. రాజకీయ నాయకులు అమర జవాన్ల మృతికి సంతాపంగా ఓ ట్వీట్ చేసి చేతులు దులుపుకుంటున్నారని.. ఆ తర్వాత వీరుల కుటుంబాలను పట్టించుకునే నాదుడు లేరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అమరుల కుటుంబాలకు తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సీకే సూద్ గత నెల 30న Change.org అనే ఆన్లైన్ పిటీషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీకే సూద్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం మన హీరోల త్యాగాన్ని ఎలా గుర్తిస్తుందో మీకు తెలుసా.. ఓ ట్వీట్తో. ఒక ట్వీట్ అంటే కేవలం 140 అక్షరాల్లో. వారు ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో ఐదుగురు వీర జవాన్లు మృతి చెందారని తెలుపుతారు. కానీ వారి పేర్లును వెల్లడించారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. (బాయ్కాట్ చైనా) ఈ పిటీషన్లో (Change.org/MartyrsOfIndia) సీకే సూద్ దేశ ప్రధాని / రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ.. అమరులైన జవాన్ల త్యాగాన్ని గుర్తు చేస్తూ వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరపున ఓ మెమోంటో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘ఒక బలమైన కారణం కోసం ప్రతి ఏడాది ఎందరో జవాన్లు అమరులవుతున్నారు. వారిని ఒక్క సారి స్మరించుకుని తర్వాత మర్చిపోతారు. వారి కుటుంబాలను అస్సలు పట్టించుకోరు. ఈ పద్దతి మారాలి’ అన్నారు. ఇందుకు జనాలు తనకు మద్దతివ్వాల్సిందిగా కోరారు. ఈ ఆన్లైన్ పిటీషన్ ఇప్పటికే 19,800 సంతకాలు సేకరించింది... వీటి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. -
చైనాపై కఠిన చర్యలు తీసుకోవాలి: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితిపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘మా పార్టీ.. దేశం, సైనిక బలగాల తరపున నిలబడుతుంది. చైనాపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. అయితే ఈ కీలక సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీకి ఆహ్వానం లభించలేదు. గాల్వన్ లోయ సంఘటన తర్వాత కేజ్రీవాల్ ‘ఎల్ఏసీలో మా వీర సైనికులు మృతి చెందారనే వార్త నన్ను తీవ్రంగా కలచి వేసింది. ఈ విషాద సమయంలో మేమంతా అమర జవాన్ల కుటుంబాలకు తోడుగా ఉన్నాం. ఈ త్యాగానికి మేం వందనం చేస్తున్నాము’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులపై దృష్టి సారించింది. జూన్ 19నాడు దేశ రాజధానిలో ఒకే రోజు 2000 పైగా కేసులు నమోదయ్యాయి. దాంతో ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 26,669కి పెరిగి కోవిడ్ కేసుల సంఖ్యలో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. -
‘అందుకు మూల్యం జవాన్లు చెల్లించారు’
న్యూఢిల్లీ: తూర్పు లడాఖ్ గాల్వన్ లోయలో భారత్-చైనా దళాల మధ్య జరిగిన ఘటనలో కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాహుల్ గాంధీ.. ‘చైనా పథకం ప్రకారమే దాడి చేసింది. ఇది తెలిసి కేంద్రం నిద్రపోతుంటే.. మన అమర జవాన్లు అందుకు మూల్యం చెల్లించారు’ అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గాల్వన్ లోయలో భారత్-చైనా మధ్య తలెత్తిన ఘర్షణలో 20 మంది ఇండియన్ సైనికులు అసువులు బాసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ట్విట్టర్లో ‘ఇది ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. గాల్వన్ వ్యాలీలో చైనా దాడి ముందస్తు ప్రణాళికతో జరిగింది. ఇది తెలిసి కేంద్ర ప్రభుత్వం నిద్ర పోయింది. ఈ హెచ్చరికలను ఖండించింది. ఫలితంగా మన అమర జవాన్లు మూల్యం చెల్లించారు’ అని ట్వీట్ చేశారు. అంతేకాక కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ వెల్లడించిన నివేదికను ట్వీట్తో పాటు షేర్ చేశారు. జూన్ 15న గాల్వన్ లోయలో జరిగిన దాడి గురించి శ్రీపాద నాయక్ ముందస్తు ప్రణాళిక ప్రకారమే చైనా దాడి చేసిందని వెల్లడించిన సంగతి తెలిసిందే. (మన సైనికుల్ని చంపడానికి వారికెంత ధైర్యం..?) గాల్వన్ లోయలో భారత్, చైనా దళాల మధ్య జరిగిన హింసాత్మక ఘటనపై కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటంతో రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. మన సైనికులను చంపడానికి వారికెంత ధైర్యం..? వారు మన భూమిని ఆక్రమించకునే దుస్సాహసానికి ఒడిగడతారా..? ఇప్పటి వరకు జరిగింది చాలు.. అక్కడ ప్రస్తుతం ఏమి జరుగుతోందో తెలియాలంటూ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అంతేకాక ఎలాంటి ఆయుధాలు లేకుండా భారత సైనికులను సరిహద్దుకు ఎందుకు పంపారని రాహుల్ ప్రశ్నించారు. -
చైనా చెర నుంచి సైనికులు విడుదల..!
సాక్షి, న్యూఢిల్లీ : గాల్వన్ లోయ వద్ద ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణ నేపథ్యంలో భారత్కు చెందిన సైనికులను చైనా అపహరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన భారత సైనిక అధికారులు గడిచిన రెండు రోజులుగా చైనా ఆర్మీ అత్యున్నత స్థాయి అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం చర్చల అనంతరం భారత్కు చెందిన పదిమంది సైనికులు, ఇద్దరు మేజర్ అధికారులను చైనా చెర నుంచి విడిపించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా పలు కథనాలు ప్రచురించింది. వారంత క్షేమంగా ఉన్నారని తెలిపింది. అయితే భారత సైనిక వర్గాలు మాత్రం దీనికి భిన్నంగా ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా దాడిలో 20 మంది జవాన్లు మృతి చెందగా.. మొత్తం 76 మంది గాయపడ్డారని ప్రకటించింది. ఇక చైనా కస్టడీలో ఎవరూ లేదని స్పష్టం చేసింది. (ఒక్క జవాను మృతికి ఐదుగురిపై ప్రతీకారం) కాగా డ్రాగన్ తొలిసారి 1962 యుద్ధం సమయంలో భారత సైనికులను బంధీలను చేసింది. డజన్ల కొద్ది సిబ్బందిని రోజుల తరబడి తన చెరలో ఉంచుకుంది. అనంతరం భారత ప్రభుత్వ శాంతియుతమైన చర్చలతో వారికి విముక్తి కల్పించింది. మరోవైపు తాజాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మేజర్ జనరల్ స్థాయి అధికారులు సరిహద్దు సమస్యలను చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు దాదాపు కొలిక్కి వచ్చినట్లు సైనిక వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. (76 మంది జవాన్లకు గాయాలు : భారత ఆర్మీ) -
చైనా ఆక్రమించినవి స్వాధీనం చేసుకుంటాం
సాక్షి, కశ్మీర్ : సరిహద్దు ప్రాంతాల్లో చైనా దుశ్చర్యలకు తగినబుద్ధి చెప్పే రోజులు ముందులోనే ఉన్నాయని బీజేపీ లద్దాక్ ఎంపీ జమ్యాంగ్ సెరింగ్ నంగ్యాల్ అన్నారు. చైనా ఆక్రమించిన ఆక్సియాచిన్ ప్రాంతం కూడా భారత్ సరిహద్దుకు అతి సమీపంలోనే ఉందని, ఒక్కప్పుడు అది లద్దాక్లో భాగమేనని స్పష్టం చేశారు. భారత సైనికులు శాంతిసూత్రాన్ని చైనా ఆర్మీ చేతగానితనంగా భావిస్తోందని, వారి ఆకృత్యాలకు కచ్చితంగా ప్రతీకారం తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ఇరు దేశాల సైనికల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో భారత్కు చెందిన 20 మంది సైనికులు అమరులైన నేపథ్యంలో నంగ్యాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. భారత జవాన్ల మృతి బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. (ఆయుధాలు లేకుండా సరిహద్దుల్లో ఎలా) ‘1962 నుంచి చైనా అనేకసార్లు భారత్పైకి దురాక్రమనకు దిగుతోంది. ఇప్పటికే మన దేశానికి చెందిన అనేక ప్రాంతాలను అక్రమంగా ఆక్రమించింది. ప్రస్తుతం చైనా ఆధీనంలోని ఆక్సియాచిన్ ముమ్మాటికీ భారత భూభాగమే. దానిని తిరిగి స్వాధీనం చేసుకోవడం అంతసులువైన అంశం కాదు. భారత సైన్యానికి అంత కష్టమైన పనికూడా కాదని అనుకుంటున్నా. చైనా ఆక్రమిత భూభాగాన్ని తిరిగి పొందుతామనే నమ్మకం నాకుంది. ఎందుకుంటే 1962 నాటి రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం మన దేశంలో లేవు. కేంద్రంలో బలమైన, సమర్థవంతమైన నాయకత్వంతో కూడిన ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇంతకుముందులా చైనా కయ్యానికి కాలుదువ్వడాని ఏమాత్రం అదునులేదు. లద్దాక్ ప్రజలు ఎప్పటికీ భారత ప్రభుత్వం, సైనికులు వెంటే ఉంటుంది’ అని సెరింగ్ నంగ్యాల్ పేర్కొన్నారు. (చైనా, భారత్ వ్యూహాలు ఏమిటి?) -
ఒక్క జవాను మృతికి ఐదుగురిపై ప్రతీకారం
చంఢీగఢ్ : గాల్వన్ లోయలో భారత్-చైనా మధ్య చోటుచేసుకున్న ఘర్ణణలో భారత జవాన్ల మృతిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చైనా దొంగదెబ్బకు ప్రతీకారం తీసుకోవాల్సిందేనని ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారు. డ్రాగన్ ఉద్దేశపూర్వకంగానే భారత జవాన్లపైకి దాడికి పాల్పడిందని, ఎలాంటి ప్రణాళికలు లేకుండా ఘర్షణకు దిగే ప్రయత్నం చేసేవీలులేదని మాజీ సైనికులు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులపై సైన్యంలో పనిచేసిన అనుభవమున్న పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ స్పందించారు. శుక్రవారం ఉదయంం ఓ జాతీయ మీడియాతో సీఎం మాట్లాడుతూ.. భారత్-చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఆయుధాలు లేకుండా భారత సైనికులను సరిహద్దుకు ఎందుకు పంపారని ప్రశ్నించారు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలో కేంద్రమే నిర్ణయించుకోవాలని అన్నారు. (చైనా కాఠిన్యం: భారత జవాన్లపై కర్కశం) భారత సైనికుల మృతికి చైనాపై తప్పనిసరిగా ప్రతీకారం తీసుకోవాల్సిందేనని, వారు ఒక్కళ్లు చంపితే మనం ఐదుగురిని చంపాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. పుల్వామా, బాలాకోట్ ఉగ్రదాడులకు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించిందో.. చైనా దుస్సాహాసాన్ని కూడా అదే రీతితో తిప్పికొట్టాలని అమరిందర్ సింగ్ స్పష్టం చేశారు. అయితే చైనాతో యుద్ధమంటే పాకిస్తాన్తో పోరాడినంత సులువు కాదని, చైనా ఆర్మీ ప్రత్యర్థిపై అత్యంత కాఠిన్యంగా వ్యవహరిస్తుందని తన అనుభవాలను పంచుకున్నారు. తాను సైన్యంలో చేరిన తొలినాళ్లలో చైనా సరిహద్దులో విధులు నిర్వర్తించానని, వారి ఆగడాలను ఎదుర్కొవడం అంత సమాన్యమైన విషయం కాదని గుర్తుచేసుకున్నారు. ఇప్పటికైనా కేంద్రం ప్రభుత్వం మేలుకోని పాకిస్తాన్, చైనా, నేపాల్ సరిహద్దుల్లో గస్తీకాస్తున్న జవాన్లకు అత్యాధునికమైన ఆయుధాలను అందించాలని కోరారు. (భారత్ను దెబ్బతీసేందుకు త్రిముఖ వ్యూహం) కాగా ఈనెల 16వ తేదీని ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారత్కు చెందిన 20 మంది చైనాకు చెందిన మరికొంత జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజా ఘటన నేపథ్యంలో భారత్-చైనా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు ఇరు పక్షాల జరనల్ స్థాయి అధికారులు చర్చలు జరుపుతున్నారు. -
చైనా కంపెనీ రైల్వే కాంట్రాక్టు రద్దు
న్యూఢిల్లీ: భారత–చైనా సరిహద్దుల్లోని గాల్వన్ ప్రాంతంలో 20 మంది భారత సైనికుల వీర మరణం నేపథ్యంలో రైల్వే శాఖ తీవ్ర నిర్ణయం తీసుకుంది. చైనా కంపెనీకి అప్పగించిన రూ.471 కోట్ల ప్రాజెక్టును రద్దు చేసింది. కాన్పూర్ నుంచి మొగల్సరాయి వరకు ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని 417 కి.మీ.ల మార్గంలో సిగ్నలింగ్, సమాచార వ్యవస్థ ఏర్పాటు కోసం చైనాకు చెందిన బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్, డిజైన్ ఇన్స్టిట్యూట్కు చెందిన సిగ్నల్,కమ్యూనికేషన్ గ్రూప్తో 2016లో రైల్వే శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్టును 2019కల్లా పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటిదాకా 20 శాతం పనులే పూర్తయ్యాయి. ఇంజినీర్ల పర్యవేక్షణ లేకుండానే పనులు జరుగుతున్నాయని, ఒప్పందం ప్రకారం లాజిక్ డిజైన్ వంటి సాంకేతిక పత్రాలను చైనా సంస్థ ఇప్పటి వరకు తమకు అందించలేదని రైల్వే శాఖ అధికారులు అన్నారు. కాంట్రాక్టును వేగవంతం చేయాలంటూ పలు దఫాలుగా ఆ సంస్థ అధికారులతో చర్చలు జరిపినా ప్రయోజనం కనిపించ లేదన్నారు. సకాలంలో పనులను పూర్తి చేయలేక పోవడంతోపాటు పనుల్లో పురోగతి చాలా స్వల్పంగా ఉండటం వల్లే చైనా సంస్థతో కాంట్రాక్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయమై ప్రపంచ బ్యాంకుకు ఇప్పటికే సమాచారం అందించినట్లు చెప్పారు. అయితే, సరిహద్దుల్లో చైనా పాల్పడుతున్న చర్యలకు ప్రతీకారంగానే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
బాయ్కాట్ చైనా
న్యూఢిల్లీ: సరిహద్దులో ఘర్షణ నేపథ్యంలో భారత్లో చైనా ఆహార పదార్థాలను అమ్ముతున్న అన్ని రెస్టారెంట్లు, హోటళ్లను మూసేయాలంటూ కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే పిలుపునిచ్చారు. చైనాకు చెందిన ఆహారాన్ని బహిష్కరించాలన్నారు. రోజూవారీ కార్యకలాపాల్లో చైనా ఉత్పత్తుల వాడకాన్ని బహిష్కరించాలంటూ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. చైనా వైఖరిని అందరం చూస్తున్నామని అందుకే చైనా ఉత్పత్తులను వాడరాదని ఆయన అన్నారు. చైనా నుంచి వచ్చే ఉత్పత్తులకు ఇకపై బీఐఎస్ నాణ్యత ఉండేలా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. చైనా నుంచి అక్రమంగా భారత్లోకి వచ్చే ఫర్నీచర్ వంటి వాటిలోనూ కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. -
చైనా దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి..
న్యూఢిల్లీ: చైనా, భారత్ మధ్య సరిహద్దుల్లో గాల్వన్ నదీలోయ సమీపంలో చైనా చేసిన దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చైనా భారీ సంఖ్యలో బుల్డోజర్లను తీసుకువచ్చి ఏకంగా గాల్వన్ నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను ఒక జాతీయ మీడియా సంస్థ బయటపెట్టింది. భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన ప్రాంతానికి అర కిలో మీటరు దూరంలోని ఈశాన్య లద్దాఖ్లో గాల్వన్ ప్రాంతంలో బుల్డోజర్లతో నదీ ప్రవాహాన్ని తగ్గించేందుకు, మళ్లించేందుకు చైనా యత్నించింది. (చైనా, భారత్ వ్యూహాలు ఏమిటి?) 5 కి.మీ. పైగా క్యూ కట్టిన చైనా వాహనాలు ఘర్షణలు జరిగిన ప్రాంతంలో చైనా తమ భూభాగం వైపు బుల్డోజర్లు, లారీలు, మిలటరీ రవాణా వాహనాలు 5 కి.మీ.ల పొడవునా నిలిపింది. కొందరు భారత్ సైనికులు గాల్వన్ నదిలో పడి కొట్టుకుపోవడం, పర్వతం నుంచి కింద పడడం వంటివి ఫొటోల ద్వారా వెలుగులోకి వచ్చాయి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా రెండు ప్రాంతాల్లో తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసుకుంది. అక్కడ్నుంచే పక్కాగా కుట్ర పన్ని మరీ ఇనుప రాడ్లతో భారతీయ సైనికులపై దాడి చేసినట్టు వెల్లడైంది. (భారత్పై మరోసారి విషం కక్కిన చైనా) రష్యా, చైనాలతో భారత్ త్రైపాక్షిక చర్చలు భారత్, చైనా, రష్యా విదేశాంగ మంత్రుల త్రైపాక్షిక వర్చువల్ చర్చలు 23న జరుగుతాయని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ చర్చల్లో భారత్ తరఫున విదేశాంగ మంత్రి జై శంకర్ పాల్గొననుండగా, చైనా, రష్యా విదేశాంగ మంత్రులు వాంగ్ యి, సెర్గీ లావ్రోవ్ ప్రాతినిధ్యం వహిస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ చెప్పారు. కరోనా, ప్రపంచ భద్రత, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలు వీరి మధ్య చర్చకు రానున్నాయి. త్రైపాక్షిక అవగాహన ప్రకారం.. భారత్, చైనా బలగాల ఘర్షణలు ద్వైపాక్షిక అంశం అయినందున ఇది చర్చకు వచ్చే అవకాశం లేదన్నారు. -
‘వివో’ వల్ల మనకే లాభం!
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదంతో భారత్లో చైనా వ్యతిరేక ఉద్యమం మొదలైంది. చైనా బ్రాండ్లు, ఉత్పత్తులు కొనుగోలు చేయవద్దని, యాప్లకు దూరంగా ఉండాలని డిమాండ్లు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి. అయితే భారత క్రికెట్కు బంగారు బాతులాంటి ఐపీఎల్ను ఒక చైనా కంపెనీ (వివో) స్పాన్సర్షిప్ చేస్తోంది. ఇటీవలి వరకు మరో కంపెనీ ‘ఒప్పో’ టీమిండియా ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించగా...ఇప్పుడున్న బైజూస్లో కూడా చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా కంపెనీలతో అనుబంధం కొనసాగించడంపై వస్తున్న ప్రశ్నలకు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ సమాధానమిచ్చారు. ‘వివో’ వల్లే మనకే లాభం తప్ప చైనాకు కాదని ఆయన స్పష్టం చేశారు. బోర్డు భావోద్వేగాలతో నిర్ణయం తీసుకోదని, వాస్తవాలు చూడాలని ఆయన అన్నారు. ‘ఇప్పుడంతా భావోద్వేగంతో స్పందిస్తున్నారు. దీన్ని పక్కనబెట్టి యథార్థంగా ఆలోచించండి. చైనా కంపెనీలకు మద్దతు ఇస్తున్నామా లేక అక్కడి నుంచి రాబడి అందుకుంటున్నామా అనే తేడా తెలుస్తుంది. చైనా కంపెనీల ఉత్పత్తుల్ని భారత్లో విక్రయించేందుకు అనుమతిస్తే మన వినియోగంతో వారికి డబ్బు వెళ్తుంది. అదే చైనా కంపెనీ వారి బ్రాండ్ ప్రమోషన్ కోసం మనకు చెల్లిస్తే అక్కడి నుంచి రాబడి వస్తుంది. అంటే భారత ఆర్థిక రంగానికి ఇది లాభించేది! ఎలాగంటే టైటిల్ స్పాన్సర్ కోసం వివో కంపెనీ బీసీసీఐకి సాలీనా రూ. 440 కోట్లు చెల్లిస్తుంది. ఇందులో 42 శాతం పన్నుల రూపంలో ప్రభుత్వానికి వస్తాయి. అంటే ఇది ఆర్థికంగా మనకు మేలు చేసే అంశమే’ అని వివరించారు. ఒక వేళ మనం వద్దనుకుంటే ఆ మొత్తం చైనాకు తరలిపోతుందన్నారు. మరో వైపు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) మాత్రం అవసరమైతే చైనా స్పాన్సర్లను బాయ్కాట్ చేస్తామని తెలిపింది. చైనా స్పోర్ట్స్ పరికరాల కంపెనీ ‘లి–నింగ్’ భారత ఆటగాళ్లకు కిట్ స్పాన్సర్గా ఉందని, టోక్యో ఒలింపిక్స్ వరకు ఈ కాంట్రాక్టు ఉన్నప్పటికీ జనరల్ బాడీ మీటింగ్లో అభ్యంతరాలుంటే రద్దు చేసుకునేందుకు వెనుకాడమని చెప్పారు. -
‘చైనా ప్రధాని కిమ్ జాంగ్ ఉన్’
కోల్కతా: భారత్-చైనా సరిహద్దులోని గాల్వన్ లోయ ప్రాంతంలో హింసాత్మక ఘర్షణల పట్ల భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనాకు సంబంధించిన ప్రతి దాన్ని బాయ్కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. డ్రాగన్ దేశ అధ్యక్షుడి దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లో ఓ పొరపాటు చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్త ఒకరు పొరపాటున కిమ్ జాంగ్ ఉన్ను చైనా అధ్యక్షుడిగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఈ సంఘటన అన్సోల్లో చోటు చేసుకుంది. ఈ వీడియోలో కొందరు వ్యక్తులు బీజేపీ మాస్క్ ధరించి చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి మాట్లాడుతూ.. చైనా ప్రధాని కిమ్ జాంగ్ ఉన్గా పేర్కొన్నాడు. దీనిపై నెటిజనులు తెగ కామెంట్ చేస్తున్నారు. ‘బీజేపీ ప్రకారం చైనా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అన్నమాట.. ఉత్తర కొరియా చైనాను స్వాధీనం చేసుకుందా ఏంటి’ అని కామెంట్ చేస్తున్నారు. 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/OlpjHDj1ej — Lavanya Ballal | ಲಾವಣ್ಯ ಬಲ್ಲಾಳ್ (@LavanyaBallal) June 18, 2020 -
ఆయన గొంతు విన్నాక.. కన్నీళ్లు ఆగలేదు!
పట్నా: ‘‘ఆయన గొంతు విన్నాక కన్నీళ్లు ఆగలేదు. ఆనందం పట్టలేకపోయాను. అవును.. అది రోషిణి వాళ్ల నాన్న గొంతే’’ అంటూ భారత ఆర్మీ జవాను సునీల్ కుమార్ భార్య మేనక ఉద్వేగానికి లోనయ్యారు. తన భర్త బతికే ఉన్నాడన్న వార్త తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. తూర్పు లడఖ్లోని గాల్వన్ లోయ ప్రాంతంలో సోమవారం రాత్రి చైనా బలగాలతో జరిగిన ఘర్షణల్లో 20 మంది సైనికులు వీర మరణం పొందిన విషయం విదితమే. తొలుత ఈ ఘటనలో కల్నల్ సహా ఇద్దరు జవాన్లు మరణించారని వెల్లడించిన ఆర్మీ.. ఆపై తీవ్రంగా గాయపడిన మరో 17 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని బుధవారం వారి పేర్లను విడుదల చేసింది. (విషం చిమ్మిన చైనా..) ఈ క్రమంలో బిహార్కు చెందిన సునీల్ కుమార్ అసువులు బాసినట్లుగా ఆర్మీ నుంచి ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారంతా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సునీల్ కుమార్ త్యాగాన్ని కీర్తిస్తూ స్థానికులంతా ఆయన నివాసానికి చేరుకుని కుటుంబాన్ని ఓదార్చారు. వీర జవానుకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఆర్మీ నుంచి వచ్చిన మరో ఫోన్ కాల్ వారి ముఖాల్లో ఆనందాన్ని నింపింది.(‘ఇద్దరు మనుమలనూ సైన్యంలోకి పంపుతా’) సరిహద్దు ఘర్షణలో మరణించిన వేరే జవాను కుటుంబానికి బదులు పొరబాటున సునీల్ గ్రామానికి ఫోన్ చేసినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ సునీల్ కుమార్ భార్య మేనక మాత్రం షాక్ నుంచి తేరుకోకపోవడంతో.. ఆర్మీలోనే పనిచేస్తున్న ఆయన సోదరుడు అనిల్ ద్వారా మరోసారి సమాచారాన్ని చేరవేశారు. బుధవారం మధ్యాహ్నమే తనకు ఈ విషయం తెలిసిందని ఆమెను ఓదార్చాడు. అనంతరం కాన్పరెన్స్ కాల్లో మేనక సునీల్తో మాట్లాడే విధంగా ఆర్మీ అధికారులు గురువారం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో వారి కుటుంబంలో అలుముకున్న విషాదం తొలగిపోయి.. ఆనందం వెల్లివిరిసిందని హిందీ డైలీ హిందుస్థాన్ తెలిపింది. -
‘చైనా రెస్టారెంట్లను బాయ్కాట్ చేయండి’
న్యూఢిల్లీ : గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై కేంద్ర మంత్రి రామ్ దాస్ అథావలే చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనీస్ ఫుడ్ను విక్రయించే రెస్టారెంట్లపై భారత్లో నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.(భారత సైన్యంపై చైనా నిందలు) అన్యాయంగా 20 మంది భారత జవాన్లను చైనా పొట్టనపెట్టుకుందని మండిపడ్డారు. ప్రజలంతా స్వచ్ఛందంగా చైనా ఆహార పదార్థాలను, వాటిని అమ్మే రెస్టారెంట్లను బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఆహార పదార్థాలే కాకుండా, చైనాలో తయారైన అన్ని రకాల వస్తువులను వదిలించుకోవాల్సిన సమయం వచ్చిందని ట్విటర్లో పేర్కొన్నారు.(చైనాతో దౌత్య యుద్ధం చేయాల్సిందే!) चीन धोका देनेवाला देश है.भारत मे चीन के सभी वस्तुओंका बहिष्कार करना चाहीये.चायनीज फूड और चायनीज फूड के हॉटेल भारत मे बंद करने चाहीये ! pic.twitter.com/ovL2sOLUo4 — Dr.Ramdas Athawale (@RamdasAthawale) June 17, 2020 लडाख के गलवाणमें भारतीय सीमापर चीन के साथ हुई हिंसक झडप मे भारत के 20 जवान शहीद हुये है. वीरगती प्राप्त भारतीय जवानोंको विनम्रतापूर्ण श्रद्धांजली! शहिद जवानोंकी शहादत व्यर्थ नही जायेगी. शहीद जवानोंके परिजन के साथ भारत सरकार और सारे भारतीय खडे है! pic.twitter.com/CGgmW0WE4e — Dr.Ramdas Athawale (@RamdasAthawale) June 17, 2020 -
చైనాతో దౌత్య యుద్ధం చేయాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత్ శాంతికాముక దేశం. అనవసరంగా ఎవరైనా కయ్యానికి కాలు దువ్వితే తగిన రీతిలో గుణపాఠం చెబుతాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. సైనిక సంపత్తితోపాటు ఆర్థికంగా భారత్కన్నా ఎన్నో రెట్లు బలమైన చైనా దేశానికి గుణపాఠం చెప్పడం ఎలా ? భారత్ భూభాగంలోకి కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న చైనా ఉత్పత్తులను బహిష్కరించడమే సరైన గుణ పాఠమని బీజేపీకి మిత్రులైన సంఘ్ వర్గాలతోపాటు పలు రంగాలకు చెందిన నిపుణులు కూడా సూచిస్తున్నారు. దాని వల్ల ఆశించిన ప్రయోజనం లభించక పోయినా దాన్ని ఓ ఆయుధంగా ఉపయోగించాల్సిందేనని ఆర్థిక నిపుణులు చెబున్నారు. భారత్లోని అనేక కంపెనీల్లో కూడా చైనా పెట్టుబడులు ఉన్నాయి. ముందుగా వాటి జోలికి పోకుండా చైనా నుంచి నేరుగా వచ్చి పడుతున్న ఉత్పత్తులను బహిష్కరించాలని వారు సూచిస్తున్నారు. ఆత్మాభిమానం నిలుపుకోవడానికి ఆ మాత్రం చర్య అవసరమని వారంటున్నారు. ఆత్మాభిమానం కన్నా పారదర్శకమైన దౌత్యపరమైన చర్యలు మరీ ముఖ్యం. (చైనా కాఠిన్యం: భారత జవాన్లపై కర్కశం) ‘వాస్తవాధీన రేఖ వద్ద సైనిక కదలికలను తగ్గించాలని జూన్ 6వ తేదీన చైనా, భారత్కు చెందిన ఉన్నత స్థాయి సైనిక అధికారుల మధ్య జరిగిన చర్చల్లో అవగాహన కుదిరింది. ఆ అవగాహనకు విరుద్ధుంగా చైనా అధికారులు వాస్తవాధీన రేఖను అతిక్రమించి ముందుకు చొచ్చుకు వచ్చారు. అక్కడ సైనిక గుడారం లాంటి నిర్మాణాన్ని నిర్మించబోగా భారత సైనికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన సైనికులు మరణించారు’ అంటూ భారత విదేశాంగ శాఖ బుధవారం స్పష్టం చేసింది. లద్ధాఖ్లోని గాల్వలోయలో అసలు ఏం జరిగిందీ, ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసిన పరిస్థితులేమిటీ ? అన్న అంశాలపై భారత్ కాస్త ఆలస్యంగా స్పందించినప్పటికీ స్పష్టమైన వివరణ ఇచ్చింది. మిత్ర దేశాలకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అంతటితో ఆగిపోకుండా ఇదే పారదర్శకమైన విధానంతో అంతర్జాతీయ సమాజం ముందుకు వెళ్లి చైనా నిజ నైజాన్ని చూపించాలి. కరోనా వైరస్ కూడా చైనా ల్యాబ్ సృష్టించేదంటూ ఆ దేశంపై మండిపడుతున్న అమెరికా కూటమి దేశాలతో కలిసి చైనాతో భారత్ దౌత్య యుద్ధం చేయాలని పలువురు వార్ వెటరన్స్ సూచిస్తున్నారు. (భారత సైన్యంపై చైనా నిందలు) -
చైనా కాఠిన్యం: భారత జవాన్లపై కర్కశం
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు దేశాలపై నిత్యం దురాక్రమణకు పాల్పడే జిత్తులమారి చైనా ప్రత్యర్థి సైన్యంపై ఎప్పుడూ కఠిన వైఖరినే అవలంభిస్తుంది. ఐదు శతాబ్ధాలకు పైగా సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పుతున్న భారత సైనికులపై డ్రాగన్ ఆర్మీ అత్యంత దారుణంగా దాడికి పాల్పడింది. ఎలాంటి తుపాకులు ఉపయోగించకుండా.. ఇసుక రాడ్లు, మారణాయుధాలతో దాడి చేసి అత్యంత కాఠిన్యం ప్రదర్శించింది. భారత్-చైనా సరిహద్దుల్లోని గాల్వనా లోయలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అసులుబాసిన విషయం తెలిసిందే. ఇరు వర్గాల మధ్య దాడి జరిగిన ప్రాంతంలో చైనా సైనికులు వాడిన ఇసుప రాడ్లు లభ్యమయ్యాయి. బలమైన రాడ్లకు కొండీలు అమర్చి భారత సైనికులపై దాడి చేసేందుకు ఆయుధంగా ఉపయోగించాయి. వాటితో దాడి చేయడం మూలంగానే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చని సైనిక వర్గాలు భావిస్తున్నాయి. (భారత్-చైనా మధ్య కీలక చర్చలు) ఉద్దేశపూర్వకంగా కయ్యానికి కాలుదువ్విన చైనా దుస్సాహసాన్ని భారత జవాన్లు పసిగట్టలేకపోయారు. గతకొంత కాలంగా సరిహద్దుల్లో గిల్లికజ్జాలు ఆడుతున్న ‘రెడ్ ఆర్మీ’ దొంగదెబ్బ తీయాలని అదునుచూసి ఘర్షణకు దిగింది. దాడికి ఎలాంటి ప్రణాళిలకు లేకపోయినప్పటికీ.. భారత ఆర్మీ చైనా బలగాలను బలంగా తిప్పిగొట్టగలిగారు. కాగా సరిహద్దుల్లో సమస్య సమసిపోయే విధంగా భారత్-చైనా చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. మేజర్ జనరల్ స్థాయి అధికారులు సరిహద్దు వివాదంపై చర్చించేందుకు గురువారం సమావేశమైనట్లు సైనిక వర్గాలు ప్రకటించాయి. (భారత్ను దెబ్బతీసేందుకు త్రిముఖ వ్యూహం) -
భారత్-చైనా మధ్య కీలక చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదంలో చెలరేగిన నేపథ్యంలో ఇరు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకునేందుకు ముందడుగా వేశాయి. గడిచిన మూడు రోజులుగా లద్దాఖ్ రీజియన్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో ఇరు దేశాల మేజర్ జనరల్స్ గురువారం చర్చలకు సిద్ధమయ్యారు. గాల్వన్లో ఉద్రిక్త పరిస్థితులపై ఉన్నతస్థాయి చర్చలు జరుపుతున్నట్లు సైనిక వర్గాలు ప్రకటించాయి. సరిహద్దులో శాంతిని నెలకొల్పే దిశగా చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తమైన పరిస్థితులు సద్దుమణిగే వరకు వివాదాస్పద ప్రాంతాల్లో ఎలాంటి సైనిక కార్యక్రమాలకు పాల్పడకుండా ఉండే విధంగా చర్చలు సాగుతున్నట్లు సమాచారం. అలాగే ఈనెల 15, 16 తేదీల్లో గాల్వన్లో జరిగిన హింసాత్మక ఘర్షణ కూడా చర్చకు వచ్చినట్లు సైనిక వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. (భారత్ను దెబ్బతీసేందుకు త్రిముఖ వ్యూహం) కాగా గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికలు మధ్య ఘర్ణణ చెలరేగడంతో 20 మంది భారత సైనికులు అసువులు బాయగా, కొందరు చైనా సైనికులు గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సరిహద్దుల మధ్య మరోసారి యుద్ధ వాతావరణం తలపించింది. చైనాపై ప్రతీకారం తీసుకోవాల్సిందేనని యావత్ భారత్ ముక్తకంఠంతో నినదిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సరిహద్దు దేశాల నడుమ యుద్ధం చోటుచేసుకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో చర్చలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. (సరిహద్దు ఘర్షణలో సరికొత్త సవాళ్లు) సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఈనెల 23న భారత్, రష్యా, చైనా విదేశాంగ మంత్రులు భేటీ కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీకానున్న విదేశాంగ మంత్రులు సమావేశం కానున్నారు. ఈ భేటీలో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
యుద్ధానికి దారితీసే అవకాశం చాలా తక్కువ..
కంటోన్మెంట్: లడక్లో భారత్ – చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో20 మంది భారత సైనికులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగాఉద్వేగానికి లోను చేసింది. ఈ ఘటనలో చైనా సైనికులు సైతంచనిపోయినట్లు చెబుతున్నప్పటికీ అధికారికంగా ధ్రువీకరించడం లేదు. మొత్తానికి ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదా అనే స్థాయిలో చర్చనీయాంశమైన గాల్వన్ ఉదంతం గురించి పెద్దగా ఆందోళనచెందాల్సిన అవసరం లేదని పలువురు రిటైర్డ్ ఆర్మీ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే గత 45 ఏళ్లలో భారత్ – చైనా మధ్య జరిగిన ఘర్షణల్లో సైనికులు మరణించడం ఇదే తొలిసారి కావడం దురదృష్టకరం అని అంటున్నారు. ఇరుదేశాల నడుమఅంతర్జాతీయ సరిహద్దు వివాదం 60 ఏళ్లుగా కొనసాగుతున్నప్పటికీ, యుద్ధ వాతావరణం ఏర్పడిన సందర్భాలు చాలా అరుదేననిఅంటున్నారు. అయితే అక్కడ చైనా సైన్యంతో పోరాటం కంటే కూడా ప్రకృతితో పోరాటమే కీలకమని గాల్వన్లో పనిచేసినఅధికారులు కొందరు అభిప్రాయపడుతున్నారు. పేరువెల్లడించడం ఇష్టపడని రిటైర్డ్ ఆర్మీ అధికారుల అభిప్రాయాలు... ఎప్పటి నుంచో వివాదాస్పద ప్రాంతం గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్– చైనా నడుమ సరిహద్దు నిర్ధారణ కాలేదు. ఇరు దేశాలు తమ ప్రాంతంగా పేర్కొనే వివాదాస్పద ప్రాంతానికి ఇరువైపులా ఆయా దేశాల సైనిక పోస్టులు ఉన్నాయి. అత్యంత ఎత్తయిన ప్రదేశం కావడంతో ఇక్కడ వాతావరణ పరిస్థితులు జనజీవనానికి ఏమాత్రం అనుకూలంగా ఉండవు. మంచు ఎడారిగా పేర్కొనే ఇలాంటి ప్రదేశాల్లో పనిచేసే సైనికులకు ముందస్తుగా ప్రత్యేకమైన తర్ఫీదు ఇస్తారు. కనీసం 15 రోజుల పాటు అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా శరీరాన్ని సంసిద్ధం చేస్తారు. ఆ తర్వాతే అక్కడ పోస్టింగ్కు పంపుతారు. అయినా ఎత్తయిన కొండలు, లోయలు, మంచు జలపాతాలతో కూడుకున్న ప్రాంతాల్లో గస్తీ చేయడం అత్యంత సాహసోపేతంగా ఉంటుంది. మౌలిక సదుపాయాలు ఏమాత్రం లేని ఈ ప్రాంతంలో ఎక్కువగా కాలినడకనే వెళ్లాల్సి ఉంటుంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా లోయలో పడిపోయే ప్రమాదముంటుంది. ఈ పరిస్థితుల్లో వివాస్పద స్థలంలో తరచూ తారసపడే చైనా సైనికులతో తోపులాటలు, ఘర్షణలు సహజమే. అయితే తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన సందర్భాలు చాలా అరుదు. – గాల్వన్లో పనిచేసిన ఓ రిటైర్డ్ బ్రిగేడియర్ మౌలిక సదుపాయాలు లేవు గాల్వన్ లోయ ప్రాంతంలో భారత సైనిక పోస్టుల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. కొన్నిచోట్ల కేవలం హెలీకాప్టర్ ద్వారా మాత్రమే చేరుకోవాల్సి ఉంటుంది. చైనా వైపు ఎత్తయిన ప్రదేశం ఉండగా, భారత్ వైపు లోయ ప్రాంతం ఎక్కువగా ఉంది. ఇటీవల భారత్ ఆధీనంలోని పోస్టులను చేరేందుకు రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన చేపట్టారు. అదే సమయంలో చైనా ఆధీనంలోని ప్రాంతంలోనూ వివిధ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే భారత్ చేపడుతున్న పనులపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అంతర్జాతీయంగా భారత్ను ఇరుకున పెట్టేలా ప్రయత్నిస్తోంది. ఇదే తాజా ఉద్రిక్తతలకు కారణమని తెలుస్తోంది. – 1967–68లో లడక్లో పనిచేసిన ఓ ఆర్మీ ఉన్నతాధికారి చైనాకు ధీటుగానే ఉన్నాం 1962తో పోలిస్తే భారత ఆర్మీ మరింత పటిష్టంగా ఉంది. చైనాకు ధీటుగా సమాధానం చెప్పే స్థాయిలోనే ఉన్నాం. సుమారు 800కు పైగా సైనికులకు కమాండర్గా కల్నల్ స్థాయి అధికారి కమాండింగ్ ఆఫీసర్గా ఉంటారు. మంగళవారం జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్బాబు బృందంలో 12 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి 20 మంది భారత సైనికులు మరణించగా, చైనీయులు సైతం 40మందికి పైగా మరణించి ఉండొచ్చు. ఈ మేరకు చైనా అధికారికంగా ధ్రువీకరించకపోయినా ఆ దేశ సైనికులు సైతం మరణించి ఉంటారు. తాజా పరిణామాలు యుద్ధానికి దారితీస్తుందని భావించలేం. భారత సైనిక సామర్థ్యం గురించి బాగా తెలిసిన చైనా అలాంటి దుస్సాహసానికి పాల్పడే అవకాశం లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితులే వచ్చినా భారత్ చైనాకు గట్టి సమాధానమే చెబుతుంది. – రిటైర్డ్ కల్నల్