ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలో ఘటన
ఇస్లామాబాద్/లాహోర్: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తలపెట్టిన ప్రతిపక్ష పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ వాహనంపై అధికార పీఎంఎల్-ఎన్ పార్టీ కార్యకర్తలు దాడికి దిగి కాల్పులు జరిపారు. దీంతో నిరసన ర్యాలీల్లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ను గద్దె దించడమే లక్ష్యంగా వేలాది మంది నిరసనకారులు రెండు వేర్వేరు కాన్వాయ్లలో దేశ రాజధాని ఇస్లామాబాద్వైపు సాగుతున్నారు. ఒక కాన్వాయ్కు ప్రతిపక్ష నాయకుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వం వహిస్తుండగా.. మరో కాన్వాయ్కు కెనడాకు చెందిన మతపెద్ద తహీరుల్ ఖాద్రీ నాయకత్వం వహిస్తున్నారు.
రెండు కాన్వాయ్ లూ ఇస్లామాబాద్లో ఏకమై.. ముందస్తు ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నది ప్రణాళిక. కాగా మధ్యలో గుర్జన్వాలా వద్ద తన వాహనంపై అధికార పీఎంఎల్-ఎన్ పార్టీ కార్యకర్తలు కాల్పులు జరిపారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. దీనికి సంబంధించి ఆయన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. 370 కిలోమీటర్లు సాగే ఈ మార్చ్ గురువారం ప్రారంభమైంది. రెండు కాన్వాయ్లలో కలిపి లక్ష మంది దాకా నిరసన ర్యాలీగా సాగుతున్నారు.
ఇమ్రాన్ వాహనంపై కాల్పులు
Published Sat, Aug 16 2014 1:45 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
షార్ట్ సర్క్యూట్తో ఇల్లు, పశువుల కొట్టం దగ్ధం
భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య
No Headline
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో సత్తా
తెలుగు–ఆంగ్లం సమేతంగా..
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
బోనమెత్తిన జగ్గాసాగర్
సమాజ సేవలో మున్నూరు కాపులు రాణించాలి
ధాన్యం సేకరణలో జిల్లా రెండోస్థానం
గ్రూప్–1 పరీక్ష ప్రశాంతం
తప్పక చదవండి
- గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు 74% హాజరు
- జేఈఈ అడ్వాన్స్డ్లో మనోళ్ల మెరుపులు
- ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రం
- మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
- అలాంటి సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
- దాయాదుల సమరానికి సర్వం సిద్దం.. అందరి కళ్లు పిచ్పైనే?
Advertisement