ప్రకృతి ప్రకోపం: 58 మంది జవాన్లు మృతి | Natural disasters took 58 jawans lifes between 2014 and 2016, says Defence ministry | Sakshi
Sakshi News home page

ప్రకృతి ప్రకోపం: 58 మంది జవాన్లు మృతి

Published Tue, Mar 21 2017 5:44 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

ప్రకృతి విపత్తుల వల్ల 2014-2016ల మధ్య 58 మంది సైనికులు మృతి చెందారు.

న్యూఢిల్లీ: ప్రకృతి ప్రకోపం వల్ల 2014-2016ల మధ్య 58 మంది సైనికులు మృతి చెందినట్లు మంగళవారం రాజ్యసభ వెల్లడించింది. రక్షణశాఖ సహాయమంత్రి సుభాష్‌ భామ్రే రాతపూర్వకంగా మంగళవారం సమాధానమిచ్చారు. 2014లో 12 మంది, 2015లో 24 మంది, 2016లో 22 మంది సైనికులు ప్రకృతి విపత్తుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణరేఖ వద్ద సైనికస్ధావరంపై మంచు తుపాను విరుచుకుపడిన కారణంగా 15 మంది జవానులు మరణించినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement