
బృందా కారత్
విశాఖపట్నం: సీపీఎంను విలీనం చేసేదిలేదని, అవసరమైతే బలోపేతం చేసుకుంటామని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు బృందా కారత్ చెప్పారు. స్థానిక పార్టీ కార్యాలయంలో 21వ సీపీఎం అఖిలభారత్ వెబ్సైట్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా, హుద్హుద్ తుపాను సాయం విషయంలో తమ పార్టీ సీరియస్గా ఉన్నట్లు తెలిపారు.
ప్రభుత్వాలు హామీలతోనే సరిపెట్టుకుంటున్నట్లు విమర్శించారు. ప్రజల విశ్వాసాలను, మనోభావాలను పరిగణనలోకి తీసుకోవడంలేదని విమర్శించారు.పార్లమెంటు సమావేశాలలో ఈ అంశాలను చర్చకు తీసుకువస్తామని బృందా కారత్ చెప్పారు.