స్వాతంత్య్ర సమరయోధులకు..రాష్ట్రపతి ఆహ్వానం | Presidential Invitation For Freedom Fighters | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర సమరయోధులకు..రాష్ట్రపతి ఆహ్వానం

Published Wed, Aug 8 2018 1:03 PM | Last Updated on Wed, Aug 8 2018 1:03 PM

Presidential Invitation For Freedom Fighters - Sakshi

స్వాతంత్య్ర సమరయోధులను సత్కరిస్తున్న ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌  

భువనేశ్వర్‌ : రాష్ట్రం నుంచి ముగ్గురు స్వాతంత్య్ర సమర యోధులకు  రాష్ట్రపతి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ఏటా ఆగస్టు 9వ తేదీన క్రాంతి దివస్‌ను పురస్కరించుకుని నిర్వహించే ఎట్‌ హోమ్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆ ముగ్గురు స్వాతంత్య్ర సమర యోధులకు దుశ్శాలువాలు కప్పి పుష్ప గుచ్ఛాలు సమర్పించి రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సత్కరించారు. ఈ సత్కారం అందుకున్న వారిలో భద్రక్‌ జిల్లా సూర్యాపూర్‌కు చెందిన రామ హరి గోస్వామి, నయాగడ్‌ జిల్లా సిందూరియా గ్రామస్తుడు ఈశ్వర్‌ బిసొయి, సంబల్‌పూర్‌ జిల్లా కల్మి గ్రామస్తుడు దేబేంద్ర గుప్తా ఉన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement