
విద్యార్థినిపై ప్రైవేటు ట్యూటర్ అత్యాచారం
రాజస్థాన్ రాజధాని జైపూర్లో దారుణం జరిగింది.
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్లో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ ట్యూటర్ 12వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం జరిపి.. ఆ ఘటనను మొత్తం మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు. మద్యం మత్తులో ఉన్న అతను బాలికను బలవంతంగా లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత ఈ వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో ఉంచి సర్క్యులేట్ చేశాడు. రామ్గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో కొన్ని రోజుల కిందట ఈ ఘటన జరిగింది.
ఈ వీడియో క్లిప్ను బాలిక కుటుంబసభ్యులు చూడటంతో దారుణం వెలుగుచూసింది. ఈ అఘాయిత్యం గురించి బయట చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్యూటర్ హెచ్చరించాడని, భయపడి తాను బయటకు చెప్పలేదని బాధిత బాలిక తెలిపింది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతని మీద ఐపీసీ ప్రకారం పలు అభియోగాలు మోపి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు ఇమ్రాన్ కోసం గాలిస్తున్నారు.