-
మా అభ్యర్థికి ఓటేయకండి: కాంగ్రెస్ ప్రచారం
జైపూర్: రాజస్థాన్లోని గిరిజనులు అధికంగా ఉండే బన్స్వారా-దుంగార్పూర్ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో విచిత్రంగా సాగుతోంది . ఇక్కడ కాంగ్రెస్ తన సొంత అభ్యర్థికి ఓటు వేయవద్దని ఓటర్లను అభ్యర్థిస్తోంది. అలాగని అక్కడి అభ్యర్థి రెబల్ అనుకుంటే పొరపాటే. వివరాల్లోకి వెళ్తే.. ఎస్టీ రిజర్వ్డ్ అయిన బన్స్వారా-దుంగార్పూర్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అరవింద్ దామోర్ను తన సొంత అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీకి ఒక రోజు ముందు భారత్ ఆదివాసీ పార్టీ (BAP) అభ్యర్థి రాజ్కుమార్ రోట్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది.బీఏపీకి మద్దతివ్వాలని పార్టీ చేసిన ప్రకటనకు అనుగుణంగా దామర్ తన నామినేషన్ ఉపసంహరించుకోవాల్సి ఉంది. కానీ నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ముగిసే వరకు ఆయన ఎక్కడా కనిపించలేదు. అనంతరం మీడియా ముందుకు వచ్చిన దామర్.. జరిగిన పరిణామాలేవీ తనకు తెలియనట్లు నటించి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.దీంతో బీజేపీ, కాంగ్రెస్-బీఏపీ కూటమి మధ్య ద్విముఖ పోటీ కాస్త త్రిముఖ పోరుగా మారింది. దామర్ పోటీ కాంగ్రెస్ ఓట్లను చీల్చే అవకాశం ఉంది. ఇది బీజేపీ అభ్యర్థి మహేంద్రజిత్ సింగ్ మాల్వియాకు ప్రయోజనం కలిగించనుంది. బన్స్వారా-దుంగార్పూర్ లోక్సభ నియోజకవర్గానికి రెండవ దశలో శుక్రవారం పోలింగ్ జరగనుంది.కాంగ్రెస్ స్థానిక నాయకత్వం తమ సొంత అభ్యర్థికి బదులు రోట్కు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేయగా, బీఏపీతో పొత్తుకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ నాయకులలోని ఒక వర్గం తనకు మద్దతు ఇస్తున్నట్లు దామోర్ పేర్కొన్నారు. జిల్లా స్థాయి నాయకుడు వికాస్ బమ్నియా, కాంగ్రెస్ ఎమ్మెల్యే అర్జున్ బమ్నియా కుమారుడు రోట్కు పార్టీ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు దక్షిణ రాజస్థాన్లో స్థాపించిన బీఏపీకి రోట్తో సహా ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. -
కూరగాయలు విక్రయిస్తున్న మాజీ సీఎం కోడలు!
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఏడు దశల్లో జరిగే ఓటింగ్కు ముందు అనేక వింతలు, విశేషాలు కనిపిస్తున్నాయి. ఇవి ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. జలోర్లో మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కోడలు కూరగాయలు అమ్ముతూ కనిపిస్తున్నారు. జలోర్ సిరోహి సీటుపై పోటీకి దిగిన భర్త వైభవ్ గెహ్లాట్కు మద్దతుగా అతని భార్య, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుమార్తె హిమాన్షి గెహ్లాట్ ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హిమాన్షి గెహ్లాట్ జలోర్లో కూరగాయలు అమ్ముతూ కనిపించారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్లో అనుభవజ్ఞుడైన నేతగా గుర్తింపు పొందారు. ఇప్పుడు అతని కుమారుడు వైభవ్ గెహ్లాట్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కోడలు హిమాన్షి గెహ్లాట్ జలోర్-జైసల్మేర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న తన భర్త వైభవ్ గెహ్లాట్ కోసం ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆమె గతంలో సిడ్నీలో చదువును పూర్తి చేశారు. ప్రస్తుతం క్యాన్సర్ రోగుల కోసం స్వ్ఛంద సంస్థను నడుపుతున్నారు. వైభవ్, హిమాన్షి దంపతులకు కాశ్వని అనే కుమార్తె ఉంది. హిమాన్షి లాగే కాశ్వనికి కూడా పెయింటింగ్ అంటే ఎంతో ఇష్టమట. -
దేశ రాజకీయాల్లో సంచలనం.. ఈ 26 ఏళ్ల కుర్రాడు!
దేశ రాజకీయాల్లో సంచలనంగా మారాడు రాజస్థాన్కు చెందిన ఓ 26 ఏళ్ల కుర్రాడు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈ యువకుడు.. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచాడు. చక్కని వాగ్ధాటి, అగర్గళమైన, చురుకైన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నాడు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గాలే కాదు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను చుట్టేస్తున్నాడు. బార్మర్- పశ్చిమ రాజస్థాన్, ముఖ్యంగా బార్మర్-జైసల్మేర్-బలోత్రా నియోజకవర్గం ప్రస్తుత లోక్సభ ఎన్నికలలో కేంద్ర బిందువుగా మారింది. ఇది దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. 1.9 మిలియన్ ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 7 లక్షల మంది జాట్లు, 2.5 లక్షల రాజ్పుత్ ఓటర్లు కీలకంగా ఉన్నారు. ఇక్కడ ఎన్నికల రణరంగం ముక్కోణపు పోటీని చూస్తోంది. వివిధ రాజకీయ వర్గాలకు చెందిన ప్రముఖ అభ్యర్థులు బరిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి కైలాష్ చౌదరి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమేరామ్ బేనివాల్ ప్రధాన అభ్యర్థులుగా ఉన్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థి 26 ఏళ్ల రవీంద్ర సింగ్ భాటి పోటీలో ఉండటంతో అందిరి దృష్టి ఈ నియోజక వర్గంపై పడింది. ఆకట్టుకునే ప్రసంగాలు బార్మర్ జిల్లాలోని షియో అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యేగా విజయాన్ని రుచి చూసిన రవీంద్ర, ఇప్పుడు మరోసారి బరిలోకి దిగి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే సాంప్రదాయ ద్విముఖ భావాన్ని మార్చేందుకు సిద్ధమయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా భాటి ప్రజాదరణ ఆయన సొంత నియోజకవర్గానికి మించి విస్తరించింది. ఈయన ఆకర్షణ, ప్రసంగాలు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించాయి. సోషల్ మీడియాలో సంచలనాన్ని రేకెత్తించాయి. ప్రచారం ముమ్మరం కావడంతో భాటి గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా వ్యూహాత్మక పర్యటనను ప్రారంభించారు. రవీంద్ర భాటి బెంగుళూరుకు వెళ్లినప్పుడు ఆయన ప్రసంగాన్ని వినడానికి అధిక సంఖ్యలో జనం గుమిగూడారు. అదేవిధంగా హైదరాబాద్లోనూ ప్రజాదరణ లభించింది. ఆయన విమానాశ్రయానికి రాకముందే జనాలను ఆకర్షించింది. గుజరాత్లోని సూరత్కు చేరుకున్నప్పుడు అతని పేరు కొన్ని మైళ్ల వరకు ప్రతిధ్వనించింది. రవీంద్ర భాటి నేపథ్యం రవీంద్ర సింగ్ భాటి బార్మెర్లోని దుధోడా అనే గ్రామానికి చెందిన రాజపుత్ర కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి న్యాయ విద్యను అభ్యసించిన రవీంద్ర భాటి తన పాఠశాల విద్యను ప్రభుత్వ స్కూల్లో పూర్తి చేశారు. జై నారాయణ్ వ్యాస్ యూనివర్శిటీలో 2019 విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా రవీంద్ర భాటి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంస్థ అయిన ఏబీవీపీ నుంచి మొదట టికెట్ను కోరినప్పటికీ, చివరికి తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికలలో అతని విజయం ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. విశ్వవిద్యాలయం 57 సంవత్సరాల చరిత్రలో విద్యార్థి సంఘం అధ్యక్ష పదవిని గెలుచుకున్న మొదటి స్వతంత్ర అభ్యర్థిగా రవీంద్ర సింగ్ బాటీ నిలిచాడు. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో భాటి రాజకీయ పథం మరో ముఖ్యమైన మలుపు తిరిగింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన అభ్యర్థులను ఎదుర్కొని భాటి విజయం సాధించారు. సుమారు 4 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో లోక్సభ బరిలో నిలిచారు. #संबोधन pic.twitter.com/4CU0fnZTwe — Ravindra Singh Bhati (@RavindraBhati__) April 9, 2024 -
17మందికి ఒకేసారి పెళ్లి..ఒకే శుభలేఖ.. హాట్ టాపిక్గా తాతగారు
ఒకరికి పెళ్లి చేయడమే చాలా ఖరీదైన మారిన ప్రస్తుత రోజుల్లో 17 పెళ్లిళ్లంటే మాటలా అనుకున్నాడో ఏమోగానీ రెండంటే రెండు రోజుల్లో వరుసపెట్టి మనవళ్లు, మనవరాళ్లకు సామూహిక వివాహ వేడుక జరిపించాడు. రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలో ఈ వివాహాలు జరిగాయి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పెద్దాయన పేరు రాజస్థాన్లోని నోఖా మండలం లాల్మదేసర్ గ్రామానికి చెందిన సుర్జారామ్. ఆయన గ్రామపెద్ద కూడా. సుర్జారామ్ వారసులు ఉమ్మడి కుటుంబంగా జీవించేవారు. ఈయనకు 17 మంది మనవళ్లు, పెళ్లికి ఎదిగి ఉన్నారు. వీరందరికీ విడివిడిగా పెళ్లి చేయడం ఖరీదవుతుందని భావించి కేవలం రెండు రోజుల్లో పన్నెండు మంది మనవరాలు, ఐదుగురు మనవళ్లు పెళ్లి చేశారు. వింతగా అనిపించినా ఇదే జరిగింది. వీరందరికి భాగస్వాములను వెతకడం కూడా విశేషమే. అంతేకాదు వీరందరికీ కే శుభలేఖను ముద్రించడం మరో విశేషం. బంధుమిత్రుల సమక్షంలో ఐదుగురు మనుమలకు ఏప్రిల్ 1న, 12 మంది మనుమరాళ్ల ముళ్ల వేడుక కాస్తా ముగించాడు.ఒకే ఇంట్లో, ఒకే వెడ్డింగ్ కార్డ్తో జరిగిన ఈ సామూహిక వివాహ తంతుకు అందరూ ఆశ్చర్యపోవడం గ్రామస్తుల వంతైంది. ఒకే కుటుంబంలో సామూహిక వివాహాలు జరగడం ఈ ప్రాంతంలో ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు. -
Lok sabha elections 2024: ‘రాజ’సం ఎవరిదో...!
రాజస్థాన్లో రాజకీయ పోరు దశాబ్దాలుగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే కొనసాగుతోంది. రాష్ట్రంలో అధికారమూ ఈ రెండు పార్టీల మధ్యే మారుతూ వస్తోంది. కమలనాథులు హిందుత్వ, ఆర్థికాభివృద్ధిపైనే ఫోకస్ చేస్తుండగా సంక్షేమ హామీలు, మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకతను కాంగ్రెస్ నమ్ముకుంటోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ రెట్టింపు ఉత్సాహంతో లోక్సభ బరిలోకి దిగుతోంది. గత రెండు లోక్సభ ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రంలో క్లీన్స్వీప్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా ఉంది. ఎంపీ ఎన్నికల్లో పుంజుకుని ఎలాగైనా సత్తా చాటే ప్రయత్నాల్లో కాంగ్రెస్ తలమునకలుగా ఉంది... పటిష్టమైన సంస్థాగత నిర్మాణం, హిందుత్వ సిద్ధాంత దన్నుతో రాజస్థాన్ బీజేపీ బలమైన పునాదులు వేసుకుంది. తొలుత భైరాన్సింగ్ షెకావత్, అనంతరం వసుంధరా రాజె సింధియా వంటివారి నాయకత్వమూ పారీ్టకి కలిసొచి్చంది. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి బాగా పట్టుంది. కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో బలమైన శక్తిగా కొనసాగుతోంది. అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ వంటి నాయకుల సారథ్యానికి తోడు గ్రామీణ ఓటర్ల మద్దతు పారీ్టకి పుష్కలంగా ఉంది. ఈ ఎడారి రాష్ట్రంలో 25 లోక్సభ సీట్లున్నాయి. 4 ఎస్సీలకు, 3 ఎస్టీలకు కేటాయించారు. బీజేపీకి బేనీవాల్ బెంగ! 2014 లోక్సభ ఎన్ని కల్లో మొత్తం 25 సీట్లనూ ఎగరేసుకుపోయిన బీజేపీ 2019లో సైతం క్లీన్స్వీప్ చేసింది. 24 సీట్లను బీజేపీ, మిగతా ఒక్క స్థానాన్ని ఎన్డీఏ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) గెలుచుకున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ చతికిలపడింది. గత డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను మట్టికరిపించి తిరిగి అధికారాన్ని దక్కించుకుంది. అదే ఊపులో లోక్సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి క్లీన్స్వీప్ చేయాలని తహతహలాడుతోంది. అందుకు తగ్గట్టే ప్రచారాన్ని మోదీ పీక్స్కు తీసుకెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సభలతో హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే వారసత్వ రాజకీయాలు, అవినీతికి పెట్టింది పేరంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణం బీజేపీకి ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదాలనూ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అయితే గత ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉన్న హనుమాన్ బేనీవాల్ సారథ్యంలోని ఆర్ఎల్పీ ఈసారి కాంగ్రెస్తో జతకట్టడం కమలం పార్టీకి కాస్త ప్రతికూలాంశమే. జాట్ నేత అయిన బేనీవాల్కు ఉన్న ఆదరణ షెకావతీ, మార్వార్ ప్రాంతాల్లో బీజేపీ అవకాశాలను ప్రభావితం చేయవచ్చంటున్నారు. పార్టీ తరఫున కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ (జోధ్పూర్), అర్జున్ రామ్ మేఘ్వాల్ (బికనేర్), లోక్సభ స్పీకర్ ఓం బిర్లా (కోట) వంటి హేమాహేమీలు పోటీ చేస్తున్నారు. నలుగురు సిట్టింగులకు బీజేపీ మొండిచేయి చూపడంతో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. దీనికి తోడు కాంగ్రెస్ నుంచి జంప్ చేసిన ఇద్దరు నేతలకు తొలి జాబితాలోనే చోటు దక్కింది. వీరిలో బలమైన గిరిజన నేతగా పేరున్న మహేంద్రజీత్సింగ్ మాలవీయ ఉన్నారు. పారాలింపిక్స్లో పసిడి సాధించిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత దేవేంద్ర ఝజారియాకు బీజేపీ అనూహ్యంగా చురు టికెటిచ్చింది. వసుంధరా రాజె కుమారుడు దుష్యంత్ సింగ్ ఝలావర్–బరన్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్లో అదే వర్గ పోరు ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్కు సార్వత్రిక సమరంలో నెగ్గుకురావడం సవాలే. మాజీ సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య వర్గ పోరు మళ్లీ రాజుకుంటుండటం తలనొప్పిగా మారుతోంది. ఎన్నికల్లో గహ్లోత్ ఓటమి నేపథ్యంలో రాష్ట్ర పారీ్టపై పూర్తిగా పట్టు బిగించే వ్యూహాల్లో పైలట్ వర్గం ఉంది. జాలోర్ నుంచి గహ్లోత్ కుమారుడు వైభవ్ బరిలో ఉన్నారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆరు న్యాయాలు, 25 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. కుల గణన, రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చట్టబద్ధత హామీల ద్వారా పేదలు, మధ్య తరగతి వర్గాలు, కారి్మకులు, రైతుల పక్షాన పోరాటం చేస్తున్నామని రాహుల్ చెబుతున్నారు. ఆర్ఎల్పీ ఈసారి ఇండియా కూటమిలోకి రావడం కాంగ్రెస్కు ఊరటనిచ్చే అంశం. జాట్లలో బాగా ఆదరణ ఉన్న బెనీవాల్ ప్రభావం షెకావతీ, మార్వార్ ప్రాంతాల్లో... ముఖ్యంగా నాగౌర్, సికర్, ఛురు, జుంఝును వంటి లోక్సభ స్థానాల్లో కలిసొస్తుందని పార్టీ ఆశలు పెట్టుకుంది. కుల సమీకరణాలు కీలకం రాజస్థాన్ రాజకీయాల్లో కులాలది కీలక పాత్ర. ప్రధానంగా జాట్లు, రాజ్పుత్లు, మీనాలు, గుజ్జర్లు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపుతున్నారు. 10% జనాభా ఉన్న జాట్ వర్గానికి మార్వార్, షెకావతీ ప్రాంతాల్లో గట్టి పట్టుంది. రాష్ట్ర జనాభాలో రాజ్పుత్ల వాటా 6–8%. రాజ కుటుంబీకులైన వసుంధరా రాజె, భైరాన్ సింగ్ షెకావత్ సీఎం పదవి చేపట్టినవారే. జాట్లు అప్పుడప్పుడూ ఊగిసలాడినా రాజ్పుత్ల మద్దతు కమలనాథులకు దండిగా ఉంటుందని గత ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. 5 శాతమున్న గుజ్జర్లు గతంలో కాంగ్రెస్కు మద్దతిచ్చారు. వారిప్పుడు బీజేపీ వైపు మళ్లవచ్చంటున్నారు. రాష్ట్రంలో బ్రాహ్మణ సామాజికవర్గం 8% దాకా ఉంది. అగ్రవర్ణ పార్టీగా పేరొందిన బీజీపీ అనూహ్యంగా బ్రాహ్మణుడైన భజన్లాల్ శర్మను సీఎం చేసింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీపీ జోషిదీ ఇదే సామాజికవర్గం. ఇక ఎస్టీ సామాజిక వర్గమైన మీనాలు జనాభాలో 5% ఉన్నారు. వీరికి తూర్పు రాజస్థాన్లో పట్టుంది. 18% ఉన్న ఎస్టీ సామాజిక వర్గంలోని ఉప కులాలు పరిస్థితులను బట్టి ఇరు పారీ్టలకూ మద్దతిస్తున్నారు. కాంగ్రెస్ కుల గణన హామీ ప్రభావం చూపవచ్చంటున్నారు. సర్వేలు ఏమంటున్నాయి... ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హిందీ బెల్ట్లో కీలకమైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో ఘన విజయం సాధించడం ఆ పార్టీలో ఫుల్ జోష్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ క్వీన్స్వీప్ చేస్తుందని, కాంగ్రెస్కు వైట్వాష్ తప్పదని తాజా సర్వేలు చెబుతున్నాయి. రాజస్థాన్లో 25 సీట్లనూ తన ఖాతాలో వేసుకోవడం ద్వారా బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందనేది మెజారిటీ ఒపీనియన్ పోల్స్ అభిప్రాయం. – సాక్షి, నేషనల్ డెస్క్
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement