Haryana: రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి | Big Accident in Haryana | Sakshi
Sakshi News home page

Haryana: రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి

Published Tue, Sep 3 2024 8:33 AM | Last Updated on Tue, Sep 3 2024 8:40 AM

Big Accident in Haryana

హర్యానాలోని జింద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 8 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం నర్వానాలోని బిధరానా గ్రామ సమీపంలో హిసార్-చండీగఢ్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

కురుక్షేత్రలోని మార్చేడి గ్రామం నుంచి రాజస్థాన్‌లోని గోగమేడికి  వెళ్తున్న టాటా ఏస్‌ను వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మార్చేడి గ్రామానికి చెందిన 15 మంది రాజస్థాన్‌లోని గోగమేడికి టాటా కారులో వెళుతున్నారు.

వీరి వాహనం నర్వానాలోని బిధరానా గ్రామం సమీపంలోకి చేరుకున్న సమయంలో హిసార్-చండీగఢ్ జాతీయ రహదారిపై బిధరానా- సిమ్లా మధ్య కలపతో కూడిన ట్రక్కు.. టాటా కారును వెనుక నుండి ఢీకొంది. దీంతో టాటా కారు ఒక గుంతలో బోల్తా పడింది. ఆ సమయంలో హైవే మీదుగా వెళుతున్న కొందరు డ్రైవర్లు బాధితులకు సహాయం అందించారు. అనంతరం నర్వాణ పోలీసులు ఏడు అంబులెన్సులను సంఘటనా స్థలానికి పంపారు. బాధితులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితులలో ఏడుగురు మరణించినట్లు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆగ్రోహ ఆస్పత్రికి తరలించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement