haryana
-
Delhi: సీఎంగా రేఖా గుప్తా ఎంపికతో హర్యానాలో సంబరాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ టిక్కెట్పై పోటీచేసి, గెలుపొందిన రేఖా గుప్తా(Rekha Gupta) ఢిల్లీకి నూతన ముఖ్యమంత్రి కానున్నారు. ఢిల్లీ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కేంద్ర పరిశీలకుల సమక్షంలో జరిగిన సమావేశంలో ఆమె పార్టీ శాసనసభా పక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేఖా గుప్తా ఢిల్లీలోని షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుండి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు.ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా పేరు ప్రకటించగానే హర్యానాలోని జింద్లో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. జింద్లోని జులానా ప్రాంతంలోని నంద్గఢ్ రేఖా గుప్తా పూర్వీకుల గ్రామం. హర్యానాలోని ఆల్ ఇండియా అగర్వాల్ సమాజ్(All India Agarwal Samaj) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్కుమార్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ఎన్నికవడం అగర్వాల్ సమాజానికి, జింద్కు గర్వకారణమని అన్నారు. కృషి, దృఢ సంకల్పం, సామాజిక సేవా స్ఫూర్తితో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని రేఖ గుప్తా నిరూపించారని గోయల్ పేర్కొన్నారు.రేఖా గుప్తా సారధ్యంలో ఢిల్లీ అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుకుంటుందని, ఆమె ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పూర్వీకుల గ్రామం కూడా హర్యానాలోనే ఉండటం, ఆయన కూడా అగర్వాల్ సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. రేఖా గుప్తా తండ్రి జై భగవాన్ బ్యాంక్ మేనేజర్గా పనిచేశారు. ఆయన గతంలో ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కుటుంబాన్ని కూడా ఆయన ఢిల్లీకి తీసుకువచ్చారు. దీంతో రేఖా గుప్తా పాఠశాల విద్య, గ్రాడ్యుయేషన్ ఎల్ఎల్బీని ఢిల్లీలోనే పూర్తిచేశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రేఖాగుప్తా ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా నేత వందన కుమారిని ఓడించారు.ఇది కూడా చదవండి: పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్?.. భగవంత్ మాన్ క్లారిటీ -
41వ శతకంతో మెరిసిన రహానే
హర్యానాతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ (Ranji Trophy Quarter Final) మ్యాచ్లో ముంబై కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) సూపర్ సెంచరీతో మెరిశాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో 200వ మ్యాచ్ ఆడుతున్న రహానేకు ఇది 41వ సెంచరీ. రహానే ఈ సెంచరీని 160 బంతుల్లో పూర్తి చేశాడు. ఇందులో 12 ఫోర్లు ఉన్నాయి. సెంచరీ తర్వాత కొద్ది సేపే క్రీజ్లో ఉన్న రహానే 108 పరుగుల వద్ద ఔటయ్యాడు. రహానే సూపర్ సెంచరీ కారణంగా ముంబై హర్యానా ముందు 354 పరుగుల భారీ లక్ష్యాన్ని (తొలి ఇన్నింగ్స్లో లభించిన 14 పరుగుల లీడ్ కలుపుకుని) ఉంచింది. ముంబై సెకెండ్ ఇన్నింగ్స్లో 339 పరుగులకు ఆలౌటైంది. రహానే.. సూర్యకుమార్ యాదవ్తో (70) కలిసి నాలుగో వికెట్కు 129 పరుగులు.. శివమ్ దూబేతో (48) కలిసి ఐదో వికెట్కు 85 పరుగులు జోడించాడు. ముంబై ఇన్నింగ్స్లో ఆయుశ్ మాత్రే (31), సిద్దేశ్ లాడ్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హర్యానా బౌలర్లలో అనూజ్ థక్రాల్ 4, సుమిత్ కుమార్, అన్షుల్ కంబోజ్, జయంత్ యాదవ్ తలో 2 వికెట్లు పడగొట్టారు.ఆరేసిన శార్దూల్అంతకుముందు హర్యానా తొలి ఇన్నింగ్స్లో 301 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అంకిత్ కుమార్ (136) సెంచరీ చేసి హర్యానాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అంకిత్ మినహా హర్యానా ఇన్నింగ్స్లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ముంబై బౌలర్ శార్దూల్ ఠాకూర్ 6 వికెట్లు తీసి హర్యానా పతనాన్ని శాశించాడు. షమ్స్ ములానీ, తనుశ్ కోటియన్ తలో రెండు వికెట్లు తీశారు.సెంచరీలు చేజార్చుకున్న ములానీ, కోటియన్ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 315 పరుగులకు ఆలౌటైంది. రహానే (310 మినహా ముంబై టాపార్డర్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆయుశ్ మాత్రే 0, ఆకాశ్ ఆనంద్ 10, సిద్దేశ్ లాడ్ 4, సూర్యకుమార్ యాదవ్ 9, శివమ్ దూబే 28, శార్దూల్ ఠాకూర్ 15 పరుగులకు ఔటయ్యారు. ఏడు, తొమ్మిది స్థానాల్లో బ్యాటింగ్కు దిగిన షమ్స్ ములానీ (91), తనుశ్ కోటియన్ (97) భారీ అర్ద సెంచరీలు సాధించి ముంబైకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వీరిద్దరూ లేకపోయుంటే ముంబై 200 పరుగలలోపే ఆలౌటయ్యేది. హర్యానా బౌలరల్లో అన్షుల్ కంబోజ్, సుమిత్ కుమార్ చెరో 3 వికెట్లు.. అనూజ్ థాక్రాల్, అజిత్ చహల్, జయంత్ యాదవ్, నిషాంత్ సంధు తలో వికెట్ పడగొట్టారు. -
ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్
గత కొంతకాలంగా ఫామ్లేమితో సతమతమవుతున్న భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. రంజీ ట్రోఫీలో (Ranji Trophy) భాగంగా హర్యానాతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 9 పరుగులకే ఔటైన స్కై.. రెండో ఇన్నింగ్స్లో 86 బంతుల్లో 70 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో తన జట్టు (ముంబై) కష్టాల్లో ఉన్నప్పుడు (100/3) బరిలోకి దిగిన స్కై.. కెప్టెన్ ఆజింక్య రహానేతో కలిసి నాలుగో వికెట్కు 129 పరుగులు జోడించాడు. అనూజ్ థక్రాల్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన స్కై.. ఆతర్వాతి బంతికే ఔటయ్యాడు. మూడో రోజు మూడో సెషన్ సమయానికి ముంబై 4 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. రహానేకు (71) జతగా శివమ్ దూబే (7) క్రీజ్లో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్లో లభించిన 14 పరుగుల ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం ముంబై ఆధిక్యం 252 పరుగులుగా ఉంది. ముంబై సెకెండ్ ఇన్నింగ్స్లో ఆయుశ్ మాత్రే 31, ఆకాశ్ ఆనంద్ 10, సిద్దేశ్ లాడ్ 43 పరుగులు చేసి ఔటయ్యారు. హర్యానా బౌలర్లలో అన్షుల్ కంబోజ్, సుమిత్ కుమార్, అనూజ్ థక్రాల్, జయంత్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.ఆరేసిన శార్దూల్అంతకుముందు హర్యానా తొలి ఇన్నింగ్స్లో 301 పరుగులకు ఆలౌటైంది.కెప్టెన్ అంకిత్ కుమార్ (136) సెంచరీ చేసి హర్యానాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అంకిత్ మినహా హర్యానా ఇన్నింగ్స్లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ముంబై బౌలర్ శార్దూల్ ఠాకూర్ 6 వికెట్లు తీసి హర్యానా పతనాన్ని శాశించాడు. షమ్స్ ములానీ, తనుశ్ కోటియన్ తలో రెండు వికెట్లు తీశారు.సెంచరీలు చేజార్చుకున్న ములానీ, కోటియన్ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 315 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రహానే సహా టాపార్డర్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆయుశ్ మాత్రే 0, ఆకాశ్ ఆనంద్ 10, సిద్దేశ్ లాడ్ 4, రహానే 31, సూర్యకుమార్ యాదవ్ 9, శివమ్ దూబే 28, శార్దూల్ ఠాకూర్ 15 పరుగులకు ఔటయ్యారు. ఏడు, తొమ్మిది స్థానాల్లో బ్యాటింగ్కు దిగిన షమ్స్ ములానీ (91), తనుశ్ కోటియన్ (97) భారీ అర్ద సెంచరీలు సాధించి ముంబైకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వీరిద్దరూ లేకపోయుంటే ముంబై 200 పరుగలలోపే ఆలౌటయ్యేది.చాలాకాలం తర్వాత హాఫ్ సెంచరీతో మెరిసిన సూర్యకుమార్భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్యాదవ్ చాలాకాలం తర్వాత హాఫ్ సెంచరీతో మెరిశాడు. స్కై.. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో.. అంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో దారుణంగా విఫలమయ్యాడు. టీ20ల్లో గత 9 ఇన్నింగ్స్ల్లో స్కై కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. గతేడాది అక్టోబర్లో బంగ్లాదేశ్తో జరిగిన టీ20లో స్కై చివరిసారి హాఫ్ సెంచరీ మార్కును తాకాడు. వన్డేల్లో కూడా స్కై పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. 2023 వన్డే వరల్డ్కప్కు ముందు ఆసీస్తో జరిగిన రెండో వన్డేలో స్కై చివరిసారి హాఫ్ సెంచరీ చేశాడు. మూడు మ్యాచ్ల ఆ సిరీస్లో స్కై.. వరుసగా రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలు చేశాడు. ఆ సిరీస్ అనంతరం జరిగిన వన్డే వరల్డ్కప్లో స్కై దారుణంగా విఫలమయ్యాడు. ఆ మెగా టోర్నీలో స్కై ఆడిన ఏడు మ్యాచ్ల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఆ టోర్నీలో ఇంగ్లండ్పై చేసిన 49 పరుగులే స్కైకు అత్యధికం. -
Ranji Trophy QFs: అంకిత్ శతకం.. అఖీబ్ నబీ ‘పాంచ్’ పటాకా
కోల్కతా: కెప్టెన్ అంకిత్ కుమార్ (206 బంతుల్లో 136; 21 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కడంతో ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో హరియాణా జట్టు దీటుగా బదులిస్తోంది. సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా... అంకిత్ కుమార్ ఒంటరి పోరాటం చేశాడు. ఫలితంగా ఆదివారం ఆట ముగిసే సమయానికి హరియాణా తొలి ఇన్నింగ్స్లో 72 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది.లక్షయ్ దలాల్ (34), యశ్వర్ధన్ దలాల్ (36) ఫర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో షమ్స్ ములానీ, తనుశ్ కొటియాన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 278/8తో ఆదివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై చివరకు 88.2 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది.తనుశ్ కొటియాన్ (173 బంతుల్లో 97; 13 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. హరియాణా బౌలర్లలో అన్షుల్ కంబోజ్, సుమిత్ కుమార్ చెరో 3 వికెట్లు తీశారు. చేతిలో 5 వికెట్లు ఉన్న హరియాణా ప్రస్తుతం... ముంబై తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 52 పరుగులు వెనుకబడి ఉంది. రోహిత్ శర్మ (22 బ్యాటింగ్), అనూజ్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.రాణించిన హర్ష్ దూబే, ఆదిత్య విదర్భ పేసర్ ఆదిత్య థాకరే (4/18) సత్తా చాటడంతో తమిళనాడుతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో విదర్భ జట్టు మంచి స్థితిలో నిలిచింది. నాగ్పూర్ వేదికగా జరుగుతున్న ఈ పోరులో ఆదివారం ఆట ముగిసే సమయానికి తమిళనాడు తొలి ఇన్నింగ్స్లో 46 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 18 ఏళ్ల సిద్ధార్థ్ (89 బంతుల్లో 65; 10 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకం సాధించగా... తక్కినవాళ్లు విఫలమయ్యారు.మొహమ్మద్ అలీ (4), నారాయణ్ జగదీశన్ (22), సాయి సుదర్శన్ (7), భూపతి కుమార్ (0), విజయ్ శంకర్ (22) విఫలమయ్యారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 264/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ... చివరకు 121.1 ఓవర్లలో 353 పరుగులకు ఆలౌటైంది. సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (243 బంతుల్లో 122; 18 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ అనంతరం అవుట్ కాగా... హర్ష్ దూబే (69; 9 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.తమిళనాడు బౌలర్లలో విజయ్ శంకర్, సోను యాదవ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న తమిళనాడు జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 194 పరుగులు వెనుకబడి ఉంది. కెపె్టన్ సాయి కిశోర్ (6 బ్యాటింగ్), ప్రదోశ్ రంజన్ పాల్ (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అఖీబ్ నబీ ‘పాంచ్’ పటాకా పేస్ బౌలర్ అఖీబ్ నబీ ఐదు వికెట్లతో మెరిపించడంతో... కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో జమ్మూ కశ్మీర్ జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. పుణే వేదికగా జరుగుతున్న పోరులో ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి కేరళ జట్టు 63 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. జలజ్ సక్సేనా (78 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... సల్మాన్ నజీర్ (49 బ్యాటింగ్; 8 ఫోర్లు), నిదీశ్ (30) రాణించారు.ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టిన అఖీబ్ను ఎదుర్కునేందుకు కేరళ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 228/8తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన జమ్మూకశీ్మర్ జట్టు చివరకు 95.1 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. యుధ్వీర్ సింగ్ (26), అఖీబ్ నబీ (32) కీలక పరుగులు జోడించారు. కేరళ బౌలర్లలో ని«దీశ్ 6 వికెట్లతో అదరగొట్టాడు. ప్రస్తుతం చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉన్న కేరళ జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 80 పరుగులు వెనుకబడి ఉంది. సల్మాన్ నజీర్ క్రీజులో ఉన్నాడు.మెరిసిన మనన్, జైమీత్బ్యాటర్లు రాణించడంతో సౌరాష్ట్రతో జరుగుతున్న జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. రాజ్కోట్ వేదికగా జరుగుతున్న పోరులో ఆదివారం ఆట ముగిసే సమయానికి గుజరాత్ 95 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. మనన్ హింగ్రాజియా (219 బంతుల్లో 83; 8 ఫోర్లు, 1 సిక్స్), జైమీత్ పటేల్ (147 బంతుల్లో 88 బ్యాటింగ్; 9 ఫోర్లు) అర్ధశతకాలతో మెరిశారు.అంతకుముందు సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్లో 216 పరుగులకు ఆలౌట్ కాగా... ప్రస్తుతం చేతిలో 6 వికెట్లు ఉన్న గుజరాత్ 44 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. జైమీత్తో పాటు వికెట్ కీపర్ ఉరి్వల్ పటేల్ (29 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. -
మళ్లీ ఫెయిలైన సూర్యకుమార్.. ఇప్పట్లో రీఎంట్రీ కష్టమే!
భారత పురుషుల టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) బ్యాటింగ్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఫార్మాట్ మారినా అతడి ఆట తీరులో మాత్రం మార్పరాలేదు. ఇటీవల ఇంగ్లండ్(India vs England)తో స్వదేశంలో పొట్టి సిరీస్లో సారథిగా అదరగొట్టిన ఈ ముంబైకర్.. బ్యాటర్గా మాత్రం పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. తాజాగా రంజీ ట్రోఫీ(Ranji Trophy) మ్యాచ్లోనూ సూర్య నిరాశపరిచాడు.ఫోర్తో మొదలుపెట్టిహర్యానాతో మ్యాచ్లో క్రీజులోకి రాగానే ఫోర్ బాది దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన సూర్యకుమార్.. మరుసటి ఓవర్లోనే వెనుదిరిగాడు. కేవలం తొమ్మిది పరుగులు చేసి నిష్క్రమించాడు. కాగా సూర్య చివరగా ఈ రంజీ సీజన్లో భాగంగా మహారాష్ట్రతో మ్యాచ్ సందర్భంగా బరిలోకి దిగాడు. అయితే, ఆ మ్యాచ్లో కేవలం ఏడు పరుగులే చేసి అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో టీ20 కెప్టెన్ ఇక టెస్టుల గురించి మర్చిపోవాల్సిందేనంటూ టీమిండియా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.కాగా దేశీ ఫస్ట్క్లాస్ క్రికెట్ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీ(Ranji Trophy) క్వార్టర్ ఫైనల్స్ శనివారం ఆరంభమయ్యాయి. ఇందులో భాగంగా.. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై- హర్యానా మధ్య క్వార్టర్ ఫైనల్-3 మొదలైంది. ఇందులో టాస్ గెలిచిన ముంబై తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, హర్యానా పేసర్ల ధాటికి అజింక్య రహానే సేనకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.సుమిత్ దెబ్బకు బౌల్డ్ఓపెనర్ ఆయుశ్ మాత్రే(0)ను అన్షుల్ కాంబోజ్ డకౌట్ చేయగా.. మరో ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ ఆకాశ్ ఆనంద్ను పది పరుగుల వద్ద సుమిత్ కుమార్ బౌల్డ్ చేశాడు. ఇక వన్డౌన్లో వచ్చిన సిద్ధేశ్ లాడ్(4) అన్షుల్ వేసిన బంతికి బౌల్డ్కాగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్ సుమిత్ దెబ్బకు క్లీన్బౌల్డ్ అయ్యాడు.ముంబై ఇన్నింగ్స్ ఏడో ఓవర్ మొదటి బంతికి సిద్ధేశ్ అవుట్ కాగా.. సూర్య క్రీజులోకి వచ్చాడు. అన్షుల్ బౌలింగ్లో ఫోర్ కొట్టి ఘనంగా ఆరంభించాడు. ఎనిమిదో ఓవర్లో సుమిత్ బౌలింగ్లోనూ తొలి బంతినే బౌండరీకి తరలించిన సూర్య.. ఆ మరుసటి రెండో బంతికి పెవిలియన్ చేరాడు. మొత్తంగా ఐదు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో తొమ్మిది పరుగులు చేసి ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అవుటయ్యాడు.ఈ క్రమంలో 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాలో పడిన ముంబై జట్టును కెప్టెన్ అజింక్య రహానే, ఆల్రౌండర్ శివం దూబే ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో సూర్యకుమర్ యాదవ్ తొలి మ్యాచ్లోనే డకౌట్ అయిన విషయం తెలిసిందే.ఇప్పట్లో టీమిండియా రీఎంట్రీ కష్టమేఆ తర్వాత కూడా వరుస మ్యాచ్లలో సూర్య నిరాశపరిచాడు. రెండో టీ20లో 12, మూడో టీ20లో 14 పరుగులు చేసిన అతడు.. నాలుగో టీ20లో మళ్లీ సున్నా చుట్టాడు. ఆఖరిదైన ఐదో టీ20లోనూ రెండు పరుగులే చేసి వెనుదిరిగాడు. అయితే, కెప్టెన్గా మాత్రం ఈ ఐదు టీ20ల సిరీస్లో 4-1తో సూర్య ఘన విజయం అందుకున్నాడు. ఇక ఇప్పటికే ఫామ్లేమి కారణంగా వన్డే జట్టులో ఎప్పుడో స్థానం కోల్పోయిన సూర్య.. రంజీల్లో వరుస వైఫల్యాలతో ఇప్పట్లో టెస్టుల్లోకి వచ్చే అవకాశం కూడా లేకుండా చేసుకుంటున్నాడు. కాగా 2023లో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా నాగ్పూర్ వేదికగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన సూర్య.. దారుణంగా విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో 8 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: Ind vs Eng: అద్భుతమైన ఆటగాడు.. అతడినే పక్కనపెడతారా?: ఆసీస్ దిగ్గజం -
చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలతో రైతుగా మారాడు..! కట్చేస్తే..
చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలు అతడిని నగర జీవితం నుంచి గ్రామం బాట పట్టేలా చేశాయి. అక్కడే వ్యవసాయం చేసుకుంటూ బతకాలనుకున్నాడు. చివరికి అదే అతడికి కనివిని ఎరుగని రీతిలో లక్షలు ఆర్జించేలా చేసి..మంచి జీవనాధారంగా మారింది. ఒకరకంగా ఆ ఆరోగ్య సమస్యలే ఆర్థిక పరంగా స్ట్రాంగ్గా ఉండేలా చేయడమే గాక మంచి ఆరోగ్యంతో జీవించేందుకు దోహదపడ్డాయి. ఇంతకీ అతడెవరంటే..అతడే హర్యానాకి చెందిన జితేందర్ మాన్(Jitender Mann). ఆయన చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో 20 ఏళ్లు టీసీఎస్ ఉద్యోగిగా పనిచేశారు. అయితే ఆ నగరాల్లో కాలుష్యం, శారీరక శ్రమ లేకపోవడం తదితర కారణాలతో నలభైకే రక్తపోటు, కీళ్ల నొప్పులు వంటి రోగాల బారినపడ్డారు. జస్ట్ 40 ఏళ్లకే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక రాను రాను ఎలా ఉంటుందన్న భయం ఆయన్ని నగర జీవితం నుంచి దూరంగా వచ్చేయాలనే నిర్ణయానికి పురిగొలిపింది. అలా ఆయన హర్యానాలోని సొంత గ్రామానికి వచ్చేశారు. అక్కడే తన భార్య సరళతో కలిసి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా రెండు ఎకరాల్లో సేంద్రియ మోరింగ ఫామ్(organic moringa farm)ని ప్రారంభించారు. అలాగే ఆకుల్లో పోషకవిలువలు ఉన్నాయని నిర్థారించుకునేలా సాంకేతికత(technology)ని కూడా సమకూర్చుకున్నారు. అలా అధిక నాణ్యత కలిగిన మోరింగ పౌడర్ని ఉత్పత్తి చేయగలిగారు ఈ జంట(Couple). వారి ఉత్పత్తులకు త్వరితగతిన ప్రజాదరణ పొంది..ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరు,ముంబై వంటి నగరాలకు వ్యాపించింది. ఈ పౌడర్కి ఉన్న డిమాండ్ కారణంగా నెలకు రూ. 3.5 లక్షల ఆదాయం తెచ్చిపెట్టింది ఆ దంపతులకు. అలా ఇప్పుడు నాలుగు ఎకరాలకు వరకు దాన్ని విస్తరించారు. అత్యున్నత నాణ్యతను కాపాడుకోవడమే ధ్యేయంగా ఫోకస్ పెట్టారిద్దరు. అందుకోసం ఆకులను కాండాలతో సహా కోసి రెండుసార్లు కడిగి ఏడు నుంచి తొమ్మిది కాండాలను కలిపి కడతామని అన్నారు. తద్వారా ఆకుని సులభంగా ఎండబెట్టడం సాధ్యమవుతుందని జితేందర్ చెబుతున్నారు. ఆకులను పెద్ద ఫ్యాన్ల కింద నియంత్రిత గ్రీన్హౌస్ సెటప్లో ఎండబెట్టడం జరుగుతుంది. అందువల్ల 12 గంటలలోనే ఆకులను కాండాల నుంచి తీసివేసి ముతక పొడిగాచేసి జాగ్రత్తగా ప్యాక్ చేస్తారు. అంతేగాదు ఈ దంపతులు తాము నేలను దున్నమని చెబుతున్నారు. తాము కలుపు మొక్కలు, ఇతర ఆకులనే రక్షణ కవచంగా చేసుకుంటారట. అలాగే హానికరమైన రసాయన ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులను ఉపయోగించమని చెబుతున్నారు. ఇలా జితేందర్ వ్యవసాయ రంగాన్ని ఎంచుకోవడంతోనే ఆయన లైఫ్ మారిపోయింది. ఇదివరకటిలా ఆరోగ్య సమస్యలు లేవు. మంచి ఆరోగ్యంతో ఉన్నాని ఆనందంగా చెబుతున్నాడు. అలాగే ప్యాకేజింగ్ కోసం పొడిని పంపే ముందే తాము కొన్ని జాడీలను తమ కోసం పక్కన పెట్టుకుంటామని చెప్పారు. ఈ మొరింగ పౌడర్ వినియోగం తమకు మందుల అవసరాన్ని భర్తీ చేసేస్తుందని అందువల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ధీమాగా చెబుతున్నారు. అలాగే జితేంద్ర దంపతులు తాము గ్రామానికి వెళ్లాలనుకోవడం చాలామంచిదైందని అంటున్నారు. "ఎందుకంటే మేము ఇక్కడ కష్టపడి పనిచేయడం తోపాటు ఆరోగ్యంగా ఉంటున్నాం. పైగా కాలుష్యానికి దూరంగా మంచి జీవితాన్ని గడుపుతున్నాం అని సంతోషంగా చెబుతోంది ఈ జంట. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: లెడ్లైట్ థెరపీ: అన్ని రోగాలకు దివ్యౌషధం..!) -
గుట్టలు, నదులు, అడవి దాటి అమెరికాలోకి.. ట్రంప్ దెబ్బకు ఆకాశ్ ఆవేదన
అమెరికాలోకి ప్రవేశించిన అక్రమ వలసదారులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపారు. అక్రమంగా నివసిస్తున్న ఎవరినీ ఉపేక్షించేది లేదని ట్రంప్ చెప్పిన విధంగానే పలువురిని తిరిగి తమ స్వదేశాలకు పంపుతున్నారు. దీంతో, భారతీయులు సైతం తిరిగి స్వదేశం బాట పట్టాల్సి వచ్చింది. ప్రత్యేక విమానంలో 104 మంది వరకూ భారత్కు తిరిగి వచ్చారు. ఈ క్రమంలో హర్యానాకు చెందిన ఆకాశ్ దీన గాథ చూసి అందరూ ఆవేదన చెందుతున్నారు. అక్రమ మార్గంలో అమెరికా వెళ్లేందుకు అతను ఎన్ని కష్టాలు అనుభవించాడో తన కుటుంబ సభ్యులు వీడియోలో చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా తాము ఎంతో కోల్పోయినట్టు కన్నీటి పర్యంతమయ్యారు.షేర్ చేసిన వీడియో ప్రకారం.. అమెరికా వెళ్లాలనే పిచ్చితో హర్యానాలోని కర్నాల్కు చెందిన ఆకాశ్(20) తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. తనకు ఉన్న 2.5 ఎకరాల భూమి అమ్మి రూ.65 లక్షలతో అక్రమ మార్గంలో అమెరికా చేరుకున్నాడు. ఈ క్రమంలో ఏజెంట్లకు మరో రూ.7లక్షలు చెల్లించాడు. పనామా, మెక్సికో మార్గంలో ఎన్నో కష్టాలు భరించి అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలో కొండలు, గుట్టలు, నదులు, వాగులు, అడవిలో చిత్తడి మట్టిలో నడుచుకుంటూ అక్కడికి చేరుకున్నాడు. అతను 10 నెలల క్రితం భారత్ నుండి బయలుదేరి జనవరి 26న మెక్సికో సరిహద్దు గోడను దాటి అమెరికాలోకి ప్రవేశించాడు.అనంతరం, అతను అమెరికాలోని చెక్ పాయింట్ వద్ద పోలీసులకు చిక్కాడు. కొంతకాలం నిర్బంధం తర్వాత ఆకాష్ను బాండ్పై విడుదల చేశారు. అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో బలవంతంగా బహిష్కరణ పత్రాలపై సంతకం చేయించారు. బహిష్కరణ పత్రాలపై సంతకం చేయకపోతే ఆకాశ్కు అమెరికాలో జైలు శిక్ష పడుతుందని చెప్పారని అతని కుటుంబం పేర్కొంది. అక్రమ వలసదారులను ఇంటికి పంపించి వేయడంతో ఆకాశ్.. ఫిబ్రవరి ఐదో తేదీన హర్యానాలోకి తన ఇంటికి చేరుకున్నాడు.Indian deportee’s video from Panama jungle shows ‘Donkey Route’ to enter the U.S.A video shared by his family shows 20-year-old Akash from Karnal camping with other illegal immigrants in Panama’s dense forests. Akash allegedly paid ₹72 lakh for the journey but was forced to… pic.twitter.com/UWgTFDlkZQ— Gagandeep Singh (@Gagan4344) February 7, 2025దక్షిణ సరిహద్దు నుండి అమెరికాలోకి ప్రవేశించేందుకు రెండు ప్రధాన అక్రమ ప్రవేశ మార్గాలు ఉన్నాయి. ఒకటి నేరుగా మెక్సికో ద్వారా, మరొకటి డంకీ మార్గం అని పిలుస్తారు. ఇందులో భాగంగా పలు దేశాలను దాటడం జరుగుతుంది. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, సముద్రాలు సహా ప్రమాదకరమైన భూభాగాలను నావిగేట్ చేయడం జరుగుతుంది. ఈ మార్గంలో వలసదారులు అమెరికాకు చేరుకునే ముందు విమానాలు, టాక్సీలు, కంటైనర్ ట్రక్కులు, బస్సులు, పడవల ద్వారా వెళ్తారు.ఎక్కడుందీ డంకీ రూట్?కొలంబియా-పనామాల మధ్య ఉన్న దట్టమైన అడవి ప్రాంతమే ఇది. 60 మైళ్లు (97కి.మీ) ఉండే ఈ అభయారణ్యంలో నిటారైన కొండలు, లోయలు, వేగంగా ప్రవహించే నదులు ఉంటాయి. విషపూరిత సర్పాలు, క్రూరమృగాలు, ఎల్లప్పుడూ ప్రతికూల వాతావరణం, చిత్తడి నేలలతో కూడిన ఈ ప్రాంతంలో రోడ్డు అనే మాటే ఉండదు. అందుకే ఈ ప్రాంతంలో మకాం వేసిన నేర ముఠాలు.. మాదకద్రవ్యాల వ్యాపారం, మానవ అక్రమ రవాణాతోపాటు వలసదారుల దోపిడీకి కేంద్రాలుగా మార్చుకున్నాయి.15 రోజుల సాహసం..అమెరికాలోకి అక్రమంగా తరలించే మానవ అక్రమ రవాణా ముఠాలు డేరియన్ గ్యాప్ను ప్రధాన మార్గంగా (Donkey Route) ఎంచుకుంటాయి. దీన్ని దాటేందుకు ఏడు నుంచి 15రోజుల సమయం పడుతుంది. వీసా తేలికగా వచ్చే పనామా, కోస్టారికా, ఎల్ సాల్వడార్, గ్వాటెమాల వంటి మధ్య అమెరికా దేశాలకు తొలుత తీసుకెళ్తాయి. మానవ అక్రమ రవాణా ముఠాల సాయంతో అక్కడి నుంచి మెక్సికో, అటునుంచి అమెరికాలోకి పంపించే ప్రయత్నం చేస్తాయి. అనారోగ్యం, దాడులు కారణంగా మార్గమధ్యంలో అనేకమంది ప్రాణాలు కోల్పోతుంటారు. మహిళలపై డ్రగ్స్ ముఠాల అఘాయిత్యాలు అనేకం. ఎదిరిస్తే ప్రాణాలు పోయినట్లే.ఏడాదిలో 5.2లక్షల మంది..కొన్ని దశాబ్దాల క్రితం అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు వేల సంఖ్యలో మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకునేవారు. కానీ ప్రస్తుతం ఏటా లక్షలాది మంది డేరియన్ గ్యాప్ను దాటుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2023లోనే దాదాపు 5.2లక్షల మంది దీన్ని దాటినట్లు అంచనా. గతేడాది మాత్రం కఠిన నిఘా కారణంగా ఈ సంఖ్య 3లక్షలకు తగ్గినట్లు తెలుస్తోంది. వెనెజువెలా, హైతీ, ఈక్వెడార్, పాకిస్థాన్, బంగ్లాదేశ్తోపాటు భారత్ నుంచి అక్రమంగా వలసవెళ్లే వారు ఈ మార్గాన్ని ఆశ్రయిస్తున్నట్లు సమాచారం.అంతా పోగొట్టుకున్నాం..ఇదిలా ఉండగా.. కొన్నేళ్ల క్రితమే ఆకాశ్ తండ్రి చనిపోయారు. అప్పటి నుంచి వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటోందని ఆకాశ్ సోదరుడు శుభమ్ పేర్కొన్నారు. అయితే, ఆకాశ్ తాను అమెరికా వెళ్లాలని పట్టుబట్టడంతో శుభమ్ తన సోదరుడిని యూఎస్ పంపాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. ఆకాష్కు మంచి భవిష్యత్తును అందించాలనే ఆశతో శుభమ్.. తమకు ఉన్న 2.5 ఎకరాల భూమిని అమ్మేసినట్టు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ.. సినిమాను తలపించే కథ -
Ranji Trophy QFs: ముంబై- హర్యానా మ్యాచ్ వేదికను మార్చిన బీసీసీఐ
ముంబై: డిఫెండింగ్ చాంపియన్ ముంబై(Mumbai), హరియాణా జట్ల మధ్య ఈనెల 8 నుంచి జరగాల్సిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్(Ranji Trophy Quarter Finals) వేదిక మారింది. హరియాణాలోని లాహ్లీలో జరగాల్సిన ఈ మ్యాచ్ను కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్కు మార్చారు. హరియాణాలో చలితీవ్రత అధికంగా ఉండటంతో పాటు... ఉదయం పూట పొగమంచు కప్పేస్తుండటంతో లాహ్లీలో నిర్వహించాల్సిన మ్యాచ్ను కోల్కతాకు మార్చినట్లు బీసీసీఐ నుంచి సమాచారం అందింది’ అని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) అధ్యక్షుడు అజింక్య నాయక్ బుధవారం పేర్కొన్నారు.కాగా 42 సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన ముంబై జట్టు ఈసారి కూడా ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే(Ajinkya Rahane) సారథ్యం వహిస్తున్న ముంబై జట్టులో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పేస్ ఆల్రౌండర్లు శివమ్ దూబే, శార్దుల్ ఠాకూర్ వంటి పలువురు స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. మిగిలిన మూడు క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. రాజ్కోట్ వేదికగా సౌరాష్ట్ర, గుజరాత్ క్వార్టర్ ఫైనల్... నాగ్పూర్ వేదికగా విదర్భ, తమిళనాడు పోరు... పుణేలో జమ్ముకశ్మీర్, కేరళ మ్యాచ్లు జరగనున్నాయి. మరిన్ని క్రీడా వార్తలుభారత బ్యాడ్మింటన్ జట్టులో జ్ఞాన దత్తు, తన్వీ రెడ్డి న్యూఢిల్లీ: డచ్ ఓపెన్, జర్మనీ ఓపెన్ అండర్–17 జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లలో పాల్గొనే భారత జట్లను ప్రకటించారు. జాతీయ జూనియర్ చాంపియన్, హైదరాబాద్ కుర్రాడు జ్ఞాన దత్తుతోపాటు హైదరాబాద్కే చెందిన మరో ప్లేయర్ తన్వీ రెడ్డి భారత జట్టులోకి ఎంపికయ్యారు. డచ్ ఓపెన్ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు... జర్మన్ ఓపెన్ మార్చి 5 నుంచి 9 వరకు జరుగుతాయి.మనుష్–దియా జోడీ ఓటమి న్యూఢిల్లీ: సింగపూర్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మనుష్ షా–దియా చిటాలె (భారత్) ద్వయం పోరాటం ముగిసింది. బుధవారం సింగపూర్లో జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మను‹Ù–దియా జోడీ 11–9, 4–11, 8–11, 8–11తో అల్వారో రాబెల్స్–మరియా జియో (స్పెయిన్) జంట చేతిలో ఓడిపోయింది. క్వార్టర్స్లో ఓడిన మనుష్–దియా జోడీకి 2000 డాలర్ల (రూ. 1 లక్ష 74 వేలు) ప్రైజ్మనీతోపాటు 350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. క్వార్టర్స్లో రియా–రష్మిక జోడీముంబై: ఎల్ అండ్ టి ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక–రియా భాటియా (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో రషి్మక–రియా ద్వయం 5–7, 6–2, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో మియా హొంటామా–క్యోకా ఒకమురా (జపాన్) జంటను ఓడించింది. 89 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో భారత జోడీ రెండు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేసింది.తమ సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. రుతుజా భోస్లే (భారత్)–అలీసియా బార్నెట్ (బ్రిటన్); ప్రార్థన తొంబారే (భారత్)–అరీన్ హర్తానో (నెదర్లాండ్స్) జోడీలు కూడా క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. నేడు జరిగే సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్లో అలెగ్జాండ్రా క్రునిక్ (సెర్బియా)తో రష్మిక; రెబెకా మరీనో (కెనడా)తో అంకిత రైనా; జరీనా దియాస్ (కజకిస్తాన్)తో మాయ రాజేశ్వరి తలపడతారు. -
ఢిల్లీ పోలింగ్.. కేజ్రీవాల్కు షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు షాక్ తగిలింది. యమునా నదిలో విషం కలిపారని చేసిన వ్యాఖ్యలకుగానూ ఆయనపై మంగళవారం హర్యానాలో ఓ కేసు నమోదైంది.ఢిల్లీకి వచ్చే యమునా నది నీటిలో హర్యానా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విషం కలిపిందని అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆరోపించిన సంగతి తెలిసిందే. దమ్ముంటే తన ఆరోపణలు తప్పని నిరూపించాలంటూ రాజకీయ ప్రత్యర్థులకు ఆయన సవాల్ కూడా విసిరారు. దీంతో హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ.. యమునా నీటిని తాగి మరీ కేజ్రీవాల్ విమర్శలను తిప్పికొట్టారు. అదే సమయంలో.. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాని మోదీ(PM Modi), కేజ్రీవాల్ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు ఈ అంశం కేంద్ర ఎన్నికల సంఘం దాకా కూడా చేరింది. అయితే.. అయితే.. ఈ అంశంపై తాజాగా షాబాద్(Shahbad)కు చెందిన జగ్మోహన్ మంచందా అనే లాయర్, కురుక్షేత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రకటనలతో కేజ్రీవాల్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఆయనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో జగ్మోహన్ పేర్కొన్నారు. దీంతో బీఎన్ఎస్ 192, 196(1),197(1),248(ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన కురుక్షేత్ర పోలీసులు విచారణ చేపట్టారు. -
భారమైన జీవనాన్ని పరుగులు తీయిస్తోంది
జీవితం ప్రతి దశలోనూ ఒక అడ్డంకిని సృష్టిస్తుంది. ఆ అడ్డంకిని ఎదుర్కొనే విధానంలోనే విజయమో, అపజయమో ప్రాప్తిస్తుంది. విజయాన్ని సాధించి, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది మూడు పదుల వయసున్న సంతోషి దేవ్ జీవన పోరాటం. హర్యానా వాసి సంతోషి దేవ్ ఒడిశాలోని కొయిడా మైనింగ్ గనుల నుండి ఇనుప ఖనిజాన్ని రవాణా చేసే వోల్వో ట్రక్కు నడుపుతోంది. ఈ రంగంలో పురుషులదే ప్రధాన పాత్ర. మరి సంతోషి మైనింగ్లో ట్రక్కు డ్రైవర్గా ఎలా నియమితురాలైంది?! ముందు ఆమె జీవనం ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలి. మలుపు తిప్పిన గృహహింస...పదహారేళ్ల వయసులో సంతోషి దేవ్ని ఒడిశాలోని హడిబంగా పంచాయతీ, బాదముని గ్రామంలోని ఒక వ్యక్తితో వివాహం జరిగింది. ఆ వివాహం ఆమె జీవితాన్ని భయంకరమైన మలుపు తిప్పింది. నిత్యం వరకట్న వేధింపులు, గృహహింసతో బాధాకరంగా రోజులు గడిచేవి. కన్నీటితోనే తన పరిస్థితులను తట్టుకుంటూ కొన్నాళ్లు గడిపింది. అందుకు కారణం తల్లిదండ్రులకు తొమ్మిదిమంది సంతానంలో తను ఆరవ బిడ్డ. ఎంతటి కష్టాన్నైనా సహనంతో సర్దుకుపొమ్మని పుట్టింటి నుంచి సలహాలు. కొన్నాళ్లు భరించినా, కఠినమైన ఆ పరిస్థితులకు తల వంచడానికి నిరాకరించి, పోరాడాలనే నిర్ణయించుకుంది. తిరిగి పుట్టింటికి వచ్చింది. కానీ, అక్కున చేర్చుకోవాల్సిన కన్నవారి నుంచి అవమానాల్ని ఎదుర్కొంది. అధైర్యపడకుండా, తన సొంత మార్గాన్ని ఎంచుకోవాలనుకుంది. స్కూల్ వయసులోనే డ్రాపౌట్ స్టూడెంట్. తెలిసినవారి ద్వారా స్పిన్నింగ్ మిల్లులో పని చేయడానికి జీవనోపాధి కోసం తమిళనాడుకు వలస వచ్చింది.కుదిపేసిన పరిస్థితుల నుంచి...భారీ వాహనాలు నడపడంలో శిక్షణ పొందింది. 2021లో క్యాపిటల్ రీజియన్ అర్బన్ ట్రాన్్సపోర్ట్ (సిఆర్యుటి) నిర్వహిస్తున్న సిటీ బస్ సర్వీస్ అయిన ‘మో’ బస్కు డ్రైవర్గా నియమితురాలైంది. ఒడిశాలో ఒంటరి మహిళా బస్సు డ్రైవర్గా మహిళా సాధికారతని చాటింది. అయితే ఆశ్చర్యకరంగా, ఆమె విజయగాథ అక్కడి నుంచి తొలగింపుతో ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. ‘తొలి మహిళా బస్సు డ్రైవర్ కావడంతో స్థానిక మీడియా నన్ను హైలైట్ చేసింది. ఒక నెల తరువాత, అధికారులు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారు. నా తప్పు ఏమిటో అర్థం కాలేదు. కానీ, మళ్ళీ జీవితం నన్ను పరీక్షించిందని అర్ధమైంది. దీంతో బతకడానికి మళ్లీ ఆటో రిక్షా డ్రైవింగ్కు వచ్చేశాను’ అని తన జీవిత ప్రస్థానాన్ని వివరించింది సంతోషి. ఆరు నెలల క్రితం ఓ మైనింగ్ కంపెనీ సంతోషి పట్టుదల, ధైర్యాన్ని గుర్తించింది. వోల్వో ట్రక్కును నడపడానికి ఆఫర్ చేసింది. ‘ఏ కల కూడా సాధించలేనంత పెద్దది కాదు. ఆరు నెలల నుంచి నెలకు రూ.22,000 జీతం పొందుతున్నాను’ అని గర్వంగా చెబుతోంది ఈ పోరాట యోధురాలు. జీవనోపాధిని వెతుక్కుంటూ...‘‘మా అత్తింటిని విడిచిపెట్టిన నాటికే గర్భవతిని. కొన్ని రోజులకు తమిళనాడులోని స్పిన్నింగ్ మిల్లులో పనిచేసే అవకాశం వచ్చింది. అక్కడే 2012లో కూతురు పుట్టింది. మూడేళ్లు నా తోటి వారి సాయం తీసుకుంటూ, కూతురిని పెంచాను. ఆమెకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని ప్రతి పైసా పొదుపు చేశాను. స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్నప్పుడు చెన్నైలో ఆటో రిక్షా నడుపుతున్న ఓ మహిళను చూశాను. ‘ఆమెలా డ్రైవింగ్ చేయలేనా?‘ అని ఆలోచించాను. నా దగ్గర ఉన్న కొద్దిపాటి పొదుపు మొత్తం, చిన్న రుణంతో ఆటో రిక్షా కొనుక్కుని ఒడిశాలోని కియోంజర్కి వచ్చేశాను. నా కూతురుకి మంచి భవిష్యత్తును అందించడానికి ఆమెను హాస్టల్ వసతి ఉన్న స్కూల్లో చేర్పించాను. ఒడిశాలోని అనేక మంది ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు అందుకున్నాను’ అని వివరించే సంతోషి ఆశయాలు అక్కడితో ఆగలేదు. -
వారెవ్వా!.. కరుణ్ నాయర్ ఐదో సెంచరీ.. సెమీస్లో విదర్భ
దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25)లో హరియాణా, విదర్భ జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో విదర్భ 9 వికెట్ల తేడాతో రాజస్తాన్పై విజయం సాధించగా... హరియాణా జట్టు 2 వికెట్ల తేడాతో గుజరాత్ జట్టును ఓడించింది.విదర్భతో జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. కార్తీక్ శర్మ (62; 2 ఫోర్లు, 4 సిక్స్లు), శుభమ్ గర్వాల్ (59; 5 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ శతకాలు సాధించగా... దీపక్ హుడా (45; 2 ఫోర్లు, 2 సిక్స్లు), దీపక్ చహర్ (14 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్స్లు), కెప్టెన్ మహిపాల్ లోమ్రోర్ (32) తలా కొన్ని పరుగులు చేశారు.విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అయితే సీనియర్ ప్లేయర్ కరుణ్ నాయర్ (82 బంతుల్లో 122 నాటౌట్; 13 ఫోర్లు, 5 సిక్స్లు) దూకుడు ముందు రాజస్తాన్ స్కోరు సరిపోలేదు. ‘శత’క్కొట్టిన ధ్రువ్ షోరేఈ సీజన్లో వరుస సెంచరీలతో రికార్డులు తిరగరాస్తున్న విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ రాజస్తాన్ బౌలింగ్ను ఓ ఆటాడుకున్నాడు. అతడితో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ధ్రువ్ షోరే(Dhruv Shorey- 131 బంతుల్లో 118 నాటౌట్, 10 ఫోర్లు, 3 సిక్స్లు) కూడా ‘శత’క్కొట్టడంతో విదర్భ జట్టు 43.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 292 పరుగులు చేసి గెలిచింది.కరుణ్ నాయర్ ఐదో సెంచరీటీమిండియా ప్లేయర్లు దీపక్ చహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ హుడా(Deepak Hooda) బౌలింగ్లో ధ్రువ్, కరుణ్ జంట పరుగుల వరద పారించింది. యశ్ రాథోడ్ (39) త్వరగానే అవుటవ్వగా... ధ్రువ్, కరుణ్ అబేధ్యమైన రెండో వికెట్కు 200 పరుగులు జోడించారు. తాజా సీజన్లో వరుసగా నాలుగు (ఓవరాల్గా 5) శతకాలు బాదిన కరుణ్ నాయర్... విజయ్ హజారే టోర్నీ చరిత్రలో ఒకే సీజన్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా నారాయణ్ జగదీశన్ (5 శతకాలు; 2022–23లో) సరసన చేరాడు.ఈ టోర్నీలో ఇప్పటి వరకు 664 పరుగులు చేసిన 33 ఏళ్ల కరుణ్ నాయర్ అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గురువారం జరగనున్న రెండో సెమీఫైనల్లో మహారాష్ట్రతో విదర్భ తలపడుతుంది. హరియాణా ఆల్రౌండ్ షో గుజరాత్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో హరియాణా సమష్టి ప్రదర్శనతో సత్తా చాటింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 45.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. హేమంగ్ పటేల్ (54; 2 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధ శతకంతో మెరవగా... చింతన్ గాజా (32; 4 ఫోర్లు), ఉర్విల్ పటేల్ (23; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆర్య దేశాయ్ (23; 5 ఫోర్లు), సౌరవ్ చౌహాన్ (23; 2 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు.కెప్టెన్ అక్షర్ పటేల్ (3) విఫలమయ్యాడు. హరియాణా బౌలర్లలో అనూజ్ ఠక్రాల్, నిశాంత్ చెరో 3 వికెట్లు పడగొట్టగా... అన్షుల్ కంబోజ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో హరియాణా 44.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి గెలిచింది. హిమాన్షు రాణా (66; 10 ఫోర్లు) టాప్ స్కోరర్. గుజరాత్ బౌలర్లలో టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ 4 వికెట్లు తీశాడు. అనూజ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. బుధవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో కర్ణాటకతో హరియాణా జట్టు తలపడనుంది. చదవండి: IPL 2025: కెప్టెన్ పేరును ప్రకటించిన పంజాబ్ కింగ్స్Karun Nair is the No 3 India deserves in ODI cricketThis was the reason Kohli never promoted him in cricket. pic.twitter.com/L9hmVtHGAE— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) January 12, 2025 -
వరుణ్ ఐదు వికెట్ల ప్రదర్శన వృధా.. క్వార్టర్ ఫైనల్లో రాజస్థాన్, హర్యానా
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో రాజస్థాన్, హర్యానా జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరాయి. ఇవాళ (జనవరి 9) జరిగిన ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్స్లో రాజస్థాన్, హర్యానా జట్లు విజయం సాధించాయి. తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 19 పరుగుల తేడాతో గెలుపొందగా.. బెంగాల్పై హర్యానా 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.వరుణ్ ఐదు వికెట్ల ప్రదర్శన వృధాప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్-2లో రాజస్థాన్, హర్యానా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 47.3 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవరి ఐదు వికెట్లు (9-0-52-5) తీసి రాజస్థాన్ను దెబ్బకొట్టాడు. సందీప్ వారియర్ (8.3-1-38-2), సాయి కిషోర్ (10-0-49-2), త్రిలోక్ నాగ్ (6-1-31-1) రాణించారు.రాజస్థాన్ ఇన్నింగ్స్లో ఓపెనర్ అభిజీత్ తోమర్ (125 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 111 పరుగులు) సెంచరీతో, కెప్టెన్ మహిపాల్ లోమ్రార్ (49 బంతుల్లో 60;3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో కదం తొక్కారు. తోమర్, లోమ్రార్తో పాటు కార్తీక్ శర్మ (35), సమర్పిత్ జోషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తమిళనాడు 47.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. రాజస్థాన్ బౌలర్లు తలో చేయి వేసి తమిళనాడు ఇంటికి పంపించారు. అమన్ సింగ్ షెకావత్ మూడు వికెట్లు పడగొట్టగా.. అనికేత్ చౌదరీ, అజయ్ సింగ్ తలో రెండు, ఖలీల్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నారు. తమిళనాడు ఇన్నింగ్స్లో ఎన్ జగదీశన్ (65) టాప్ స్కోరర్గా నిలువగా.. బాబా ఇంద్రజిత్ (37), విజయ్ శంకర్ (49), మహ్మద్ అలీ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.బెంగాల్ భరతం పట్టిన హర్యానాబెంగాల్తో జరిగిన మ్యాచ్లో (ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్-1) హర్యానా ఆటగాళ్లు కలిసికట్టుగా పోరాడారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో క్రమశిక్షణతో వ్యవహరించారు. ఫలితంగా సునాయాస విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. హర్యానా ఇన్నింగ్స్లో పార్థ్ వట్స్ (62), నిషాంత్ సంధు (64) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో సుమిత్ కుమార్ (41 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బెంగాల్ బౌలర్లలో మొహమ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్ రెండు, సుయాన్ ఘోష్, ప్రదిప్త ప్రమాణిక్, కౌశిక్ మైటీ, కరణ్ లాల్ తలో వికెట్ దక్కించుకున్నారు.299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగాల్ 43.1 ఓవర్లలో 226 పరుగులకు ఆలౌటైంది. బెంగాల్ ఇన్నింగ్స్లో అభిషేక్ పోరెల్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. కెప్టెన్ సుదిప్ కుమార్ ఘరామీ (36), మజుందార్ (36), కరణ్ లాల్కు (28) ఓ మోస్తరు ఆరంభాలు లభించినప్పటికీ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. పార్థ్ వట్స్ 3, నిషాంత్ సంధు, అన్షుల్ కంబోజ్ చెరో 2, అమన్ కుమార్, సుమిత్ కుమార్, అమిత్ రాణా తలో వికెట్ పడగొట్టి బెంగాల్ ఇన్నింగ్స్ను మట్టుబెట్టారు. -
Ind vs Eng: నేను సిద్ధం.. సెలక్టర్లకు మెసేజ్ ఇచ్చిన భారత పేసర్!
వెటరన్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) టీమిండియా పునరాగమనానికి సై అంటున్నాడు. ఇప్పటికే దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటిన ఈ బెంగాల్ బౌలర్.. వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆకట్టుకుంటున్నాడు. మధ్యప్రదేశ్తో ఇటీవల జరిగిన మ్యాచ్లో బ్యాట్తో(42 పరుగులు నాటౌట్)నూ సత్తా చాటిన షమీ.. తాజాగా ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో బంతితో రాణించాడు.వడోదర వేదికగా తొలి ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ - హర్యానా(Haryana vs Bengal) మధ్య గురువారం మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హర్యానాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు అర్ష్ రంగా(23), హిమాన్షు రాణా(14) తక్కువ స్కోర్లకే వెనుదిరగగా.. కెప్టెన్, వన్డౌన్ బ్యాటర్ అంకిత్ కుమార్(18) కూడా నిరాశపరిచాడు.రాణించిన మిడిలార్డర్ బ్యాటర్లుఅయితే, మిడిలార్డర్లో పార్థ్ వత్స్(62), నిశాంత్ సింధు(64) మాత్రం దుమ్ములేపారు. ఇద్దరూ అర్ధ శతకాలతో రాణించి.. జట్టును కష్టాల నుంచి గట్టెక్కించారు. మిగిలిన వాళ్లలో రాహుల్ తెవాటియా(29) ఫర్వాలేదనిపించగా.. ఎనిమిదో స్థానంలో వచ్చిన సుమిత్ కుమార్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 32 బంతుల్లో 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి హర్యానా 298 పరుగులు చేసింది.ఇక ఈ మ్యాచ్లో బెంగాల్ పేసర్ మహ్మద్ షమీ తన బౌలింగ్ కోటా పూర్తి చేయడంతో పాటు.. వికెట్లు తీయడం టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించింది. హర్యానాతో మ్యాచ్లో షమీ పది ఓవర్లు బౌల్ చేసి.. 61 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఆరంభంలో ఓపెనర్ హిమాన్షు రాణాను అవుట్ చేసిన షమీ.. డెత్ ఓవర్లలో దినేశ్ బనా(15), అన్షుల్ కాంబోజ్(4)లను వెనక్కి పంపాడు.సర్జరీ తర్వాత నో రీ ఎంట్రీఇలా ఓవరాల్గా తన ప్రదర్శన ద్వారా షమీ.. తాను పూర్తి ఫిట్గా ఉన్నాననే సంకేతాలు ఇచ్చాడు. మిగతా బెంగాల్ బౌలర్లలో ముకేశ్ కుమార్ రెండు, సయాన్ ఘోష్, ప్రదీప్త ప్రామాణిక్, కౌశిక్ మైటీ, కరణ్ లాల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. కాగా వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా షమీ టీమిండియాకు చివరగా ఆడాడు.స్వదేశంలో జరిగిన నాటి ఐసీసీ టోర్నీలో ఈ రైటార్మ్ పేసర్ 24 వికెట్లతో సత్తా చాటాడు. చీలమండ గాయం వేధిస్తున్నా ఈ మెగా ఈవెంట్లో కొనసాగిన షమీ.. అనంతరం శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన మహ్మద్ షమీ.. ఇంత వరకు భారత జట్టులో రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు.నేను సిద్ధం.. సెలక్టర్లకు మెసేజ్!కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తొమ్మిది మ్యాచ్లు ఆడి.. పదకొండు వికెట్లు తీసినా.. ఆస్ట్రేలియా పర్యటన నుంచి అతడిని పక్కనపెట్టారు. టెస్టుల్లో బౌలింగ్ చేసే స్థాయిలో ఫిట్నెస్ సాధించలేదన్న కారణంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయలేదు. అయితే, తదుపరి టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. జనవరి 22 నుంచి ఐదు టీ20, మూడు వన్డేలు ఆడనుంది. ఈ నేపథ్యంలో షమీ పది ఓవర్ల కోటా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసి.. తానూ రేసులో ఉన్నానని సెలక్టర్లకు గట్టి సందేశం ఇచ్చాడు. చదవండి: ‘చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు ఇదే.. వాళ్లిద్దరికి నో ఛాన్స్!’ -
విజయ్ హజారే టోర్నీ బరిలో ప్రసిధ్ కృష్ణ, పడిక్కల్, సుందర్
బెంగళూరు: ‘అంతర్జాతీయ మ్యాచ్లు లేకుంటే ప్రతి ఒక్కరూ దేశవాళీల్లో ఆడాల్సిందే’ అని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్న మాటలను భారత ఆటగాళ్లు సీరియస్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో పరాజయం అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన భారత ఆటగాళ్లలో పలువురు విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్ నాకౌట్ మ్యాచ్ల్లో పాల్గొననున్నారు. ఈ టోర్నీలో భాగంగా గురువారం జరుగనున్న ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో రాజస్తాన్తో తమిళనాడు, హరియాణాతో బెంగాల్ తలపడనున్నాయి. వీటితో పాటు ఇక మీద జరగనున్న మ్యాచ్ల్లో పలువురు భారత స్టార్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఇటీవల ఆ్రస్టేలియాలో పర్యటించిన ప్రసిధ్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, సుందర్ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లు ఆడనున్నారు. ఆ్రస్టేలియాతో సిరీస్లో ఐదు మ్యాచ్ల్లోనూ ఆడిన కేఎల్ రాహుల్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నాడు. అయితే ఆ తర్వాత ఈ నెలాఖరున తిరిగి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్ల్లో రాహుల్ పాల్గొనే అవకాశం ఉంది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన స్టార్ ఆటగాళ్లు రేపటి నుంచి వారివారి రాష్ట్రాల జట్లతో కలవనున్నారు. తమిళనాడు జట్టు విజయ్ హజారే ట్రోఫీ సెమీఫైనల్కు చేరితే స్పిన్ ఆల్రౌండర్ సుందర్ బరిలోకి దిగనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో మూడు మ్యాచ్లాడిన సుందర్ 114 పరుగులు చేసి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక సిడ్నీ వేదికగా కంగారూలతో జరిగిన చివరి టెస్టులో మెరుగైన ప్రదర్శన చేసిన ప్రసిధ్ కృష్ణ కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.రంజీ ట్రోఫీలో నితీశ్ రెడ్డి...‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో అద్వితీయ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి... రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్లు ఆడనున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర జట్టు నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోవడంతో అతడికి వన్డే టోర్నీలో ఆడే అవకాశం లేకుండా పోయింది. ఇక ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ రెండో దశలో పోటీల్లో ఆంధ్ర జట్టు మరో రెండు మ్యాచ్లు ఆడనుంది. వాటిలో నితీశ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నాడు. మెల్బోర్న్ టెస్టులో ప్రతికూల పరిస్థితుల మధ్య చక్కటి సెంచరీతో సత్తా చాటిన నితీశ్ రెడ్డి... ఈ నెల 23 నుంచి పుదుచ్చేరితో, 30 నుంచి రాజస్తాన్తో ఆంధ్ర జట్టు ఆడే మ్యాచ్ల్లో బరిలోకి దిగనున్నాడు. గ్రూప్ ‘బి’లో భాగంగా ఆంధ్ర జట్టు ఆడిన 5 మ్యాచ్ల్లో మూడింట ఓడి, మరో రెండు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని 4 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. -
మరింత క్షీణించిన దల్లేవాల్ ఆరోగ్యం
చండీగఢ్: పంజాబ్–హరియాణా సరిహద్దుల్లోని ఖనౌరీలో రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ దీక్ష(70) ఆదివారం 41వ రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఆయన సారథ్యంలోని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం–రాజకీయేతర) తీవ్ర ఆందోళన చెందింది. శనివారం స్ట్రెచర్ పైనుంచే మహా పంచాయత్ను ఉద్దేశించి ఆయన 11 నిమిషాలపాటు మాట్లాడారు. తిరిగి దీక్షా శిబిరంలోకి తీసుకెళ్లినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఆదివారం దల్లేవాల్ మగతలో ఉన్నారని, వాంతులు చేసుకున్నారని ఎన్జీవోకు చెందిన డాక్టర్ అవతార్ సింగ్ వెల్లడించారు. మూత్ర పిండాలు కూడా క్రమేపీ పనిచేయలేని స్థితికి చేరుకుంటున్నట్లు గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్(జీఎఫ్ఆర్)ను బట్టి తెలుస్తోందని చెప్పారు. దల్లేవాల్ కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నారని ఎస్కేఎం నేతలు తెలిపారు. ఆయన దీక్షను విరమించినా కీలక అవయవాలు వంద శాతం పూర్తి స్థాయిలో పనిచేస్తాయన్న గ్యారెంటీ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సరిగా నిలుచోలేని స్థితిలో ఉండటంతో బరువును కూడా కచ్చితంగా చెప్పలేకున్నామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైద్య సాయం అందించేందుకు పంజాబ్ ప్రభుత్వం ముందుకు రాగా ఆయన తిరస్కరించారు. దీంతో, పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలపై ధిక్కారం కింద చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. ఆదివారం దల్లేవాల్ను పటియాలా సీనియర్ సూపరింటెండెంట్ నానక్ సింగ్, మాజీ డిప్యూటీ డీఐజీ నరీందర్ భార్గవ్ కలిసి మాట్లాడారు. పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించడం వంటి డిమాండ్లతో నవంబర్ 26 నుంచి నిరశన దీక్ష సాగిస్తుండటం తెలిసిందే. -
భారత్లో కార్టర్ పేరిట గ్రామం!!
కార్టర్పురీ(గురుగ్రామ్): అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ పేరు మీద భారత్లో ఒక గ్రామం ఉందని చాలా మందికి తెలీదు. 46 సంవత్సరాల క్రితం అంటే 1978 జనవరి మూడో తేదీన హరియాణాలోని గురుగ్రామ్ సమీపంలోని దౌల్తాబాద్ నసీరాబాద్ గ్రామంలో జమ్మీ కార్టర్ దంపతులు పర్యటించారు. కార్టర్ పర్యటించిన ఆ గ్రామం పేరును నాటి భారత ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ సిఫార్సు మేరకు కార్టర్పురీగా నామకరణంచేశారు. అంతకుపూర్వం ఈ గ్రామాన్ని ఖేదాగానూ సమీప గ్రామస్తులు పిలిచేవారు. కార్టర్ మరణవార్త తెల్సి కార్టర్పురీ గ్రామస్థులు విచారం వ్యక్తంచేశారు. ‘‘మా గ్రామం సొంత కుమారుడితో సమానమైన కార్టర్ను కోల్పోయింది’’అని కార్టర్పురీ గ్రామ మాజీ సర్పంచ్ యద్రామ్ యాదవ్ వ్యాఖ్యానించారు. భారత్లో పర్యటించిన మూడో అమెరికా అధ్యక్షుడిగా కార్టర్ పేరు చరిత్రలో నిలిచిపోయింది. కార్టర్ తల్లి లిలియాన్ 1960వ దశకంలో శాంతిదళాలతో కలిసి భారత్లో ఆరోగ్యకార్యకర్తగా సేవలందించారు. జైల్దార్ సర్ఫరాజ్కు చెందిన ఒక భవనంలో ఉంటూ లిలియాన్ సామాజిక కార్యకర్తగా చిన్నారులకు సేవచేశారు. వైద్యసాయం అందించారు. ‘‘కార్టర్ మా గ్రామానికి వచ్చినపుడు ఆయన భార్య రోసాలిన్ సంప్రదాయ భారతీయ గ్రామీణ కట్టుబొట్టులో వచ్చి అందరితో కలిసిపోయారు. కార్టర్ దంపతులు గ్రామంలో కలియతిరిగారు. ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలని ఆశించారు. అయితే ఆ తర్వాతి ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోవడమే మానేశాయి. అయినా కార్టర్పై మాప్రేమ అలాగే ఉంది. 2003లో కార్టర్కు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినప్పుడు సంబరాలు చేసుకున్నాం. గతంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌజ్ నుంచి ప్రత్యేక బృందం మా గ్రామంలో సందర్శించింది’’అని గ్రామస్థులు చెప్పారు. భారత్లో ఎమర్జెన్సీ ఎత్తేశాక 1977లో జనతాపార్టీ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత కార్టర్ భారత్లో పర్యటించారు. ఎమర్జెన్సీ తర్వాత భారత్లో పర్యటించిన తొలి ప్రెసిడెంట్ ఈయనే. ఈ సందర్భంగా భారత పార్లమెంట్లోనూ కార్టర్ 1978 జనవరి రెండో తేదీన ప్రసంగించారు. 100 ఇళ్ల నిర్మాణంలో చేయూత మహారాష్ట్రలోని ముంబై సమీపంలోని పటాన్ గ్రామంలో దిగువ తరగతి వర్గాల కోసం 2006 ఏడాదిలో వంద ఇళ్ల నిర్మాణం కోసం కార్టర్ ఎంతో సాయపడ్డారు. ఆ ఏడాది అక్టోబర్లో ఒక వారంపాటు ఇక్కడే ఉండి పనుల్లో మునిగిపోయారు. స్వయంగా కార్పెంటర్గా పనిచేశారు. ఈ కార్యక్రమంలో 2,000 మంది అంతర్జాతీయ, స్థానిక వలంటీర్లు పాల్గొన్నారు. హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్, బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం తదితరులూ తమ వంతు కృషిచేశారు. 1984 ఏడాది తర్వాత ప్రతి ఏటా ఒక వారం పాటు సమాజసేవకు కార్టర్ కేటాయించారు. ‘‘67 ఏళ్ల తల్లి లిలియాన్తో కలిసి నేను విఖ్రోలీలో కుషు్టరోగుల కాలనీలో సేవచేశా’’అని కార్టర్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కార్పెంటరీ, లేబర్ పనుల్లో ఆరితేరిన కార్టర్ న్యూయార్క్లోనూ ఒక భవంతి ఆధునీకరణ పనుల్లో పాలుపంచుకున్నారు. -
దలేవాల్ బతికుండాలా? చనిపోవాలా?
న్యూఢిల్లీ: రైతాంగం సమస్యల పరిష్కారం కోసం గత నెల రోజులుగా పంజాబ్–హరియాణా సరిహద్దులో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పంజాబ్ రైతు సంఘం నాయకుడు జగ్జీత్ సింగ్ దలేవాల్ ఆరోగ్యం క్షీణిస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు వైద్య సాయం అందించడానికి అడ్డు తగులుతున్న రైతు సంఘాల నాయకులు, రైతులపై మండిపడింది. వారు నిజంగా దలేవాల్కు శ్రేయోభిలాషులు కాదని ఆక్షేపించింది. దలేవాల్ను ఆసుపత్రికి ఎందుకు తరలించడం లేదని పంజాబ్ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ నెల 31వ తేదీలోగా ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స ప్రారంభించాలని ప్రభుత్వానికి డెడ్లైన్ విధించింది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ నుంచి సాయం తీసుకోవచ్చని సూచించింది. దలేవాల్కు వైద్య చికిత్స అందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సుధాంశు ధూలియాతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ శనివారం విచారణ చేపట్టింది. పంజాబ్ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ గురీ్మందర్ సింగ్ వాదనలు వినిపించారు. దీక్షలో ఉన్న దలేవాల్ చుట్టూ రైతులు మోహరించారని, ఆయనను ఆసుపత్రికి తరలించకుండా అడ్డుకుంటున్నారని, తమ ప్రభు త్వం నిస్సహాయ స్థితిలో ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఇదంతా జరగడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? దలేవాల్ చుట్టూ కోట కట్టడానికి అనుమతి ఉందా? దీక్షా స్థలానికి భారీ సంఖ్యలో రైతు లు ఎలా చేరుకున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆరోగ్యం క్షీణించి తక్షణమే వైద్య చికిత్స అవసరమైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించకుండా చుట్టుముట్టడం ఏమిటి?’’ అని ప్రశ్నించింది. చికిత్స తీసుకోవడానికి దలేవాల్ అంగీకరించడం లేదని, ఎంత ఒప్పించినా ఫలితం ఉండడం లేదని, దీక్ష విరమిస్తే ఉద్యమం బలహీనపడుతుందని ఆయన భావిస్తున్నారని గుర్మీందర్ సింగ్ చెప్పారు. ఒకవేళ బలవంతంగా తరలిస్తే అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకొనే ప్రమాదం ఉందని, అందుకే వెనుకంజ వేస్తున్నామని వివరించారు. దీనిపై ధర్మాస నం అసంతృప్తి వ్యక్తం చేసింది. పంజాబ్ ప్రభు త్వం సక్రమంగా వ్యవహరించడం లేదని పేర్కొంది. రైతు సంఘాల నాయకుల తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అడ్డుకోవడం నేరమేనని, ఆత్మహత్యకు పురికొల్పినట్లే అవుతుందని తేల్చిచెప్పింది. దలేవాల్ విషయంలో చట్టప్రకారం ముందుకెళ్లాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘‘కొందరు రైతు సంఘాల నేతల ప్రవర్తనపై మేము ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు. ఒక మనిషి చనిపోయే పరిస్థితుల్లో ఉంటే వారు స్పందించడం లేదు. వారేం నాయకులు? దలేవాల్ బతికి ఉండాలని కోరుకుంటున్నారా? లేక దీక్ష చేస్తూ చనిపోవాలని కోరుకుంటున్నారా? వారి ఉద్దేశం ప్రశ్నార్థకంగా ఉంది’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం విరుచుకుపడింది. సెలవు రోజునా ప్రత్యేక విచారణ సుప్రీంకోర్టుకు సాధారణంగా సెలవుదినం. రైతు సంఘం నేత జగ్జీత్ సింగ్ దలేవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం శనివారం ప్రత్యేకంగా సమావేశమై విచారణ చేపట్టింది. -
హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూత
చండీగఢ్ : హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) నేత ఓం ప్రకాష్ చౌతాలా (89) శుక్రవారం గురుగ్రామ్లోని తన నివాసంలో మరణించారు.దేశానికి 6వ ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన చౌదరి దేవి లాల్ కుమారుడే ఈ ఓం ప్రకాష్ చౌతాలా. 1935లో చౌతాలాలో జన్మించారు. 1989లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. రికార్డు స్థాయిలో నాలుగు పర్యాయాలు హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన చివరి పదవీకాలం 1999 నుండి 2005 వరకు కొనసాగింది.ఆరురోజుల సీఎంఓం ప్రకాశ్ చౌతాలా... 1989- 2004 మధ్య 4సార్లు హర్యానా సీఎంగా పనిచేశారు. అయితే, అనివార్య కారణాల వల్ల 1990 జూలై 12 నుంచి జూలై 17 వరకు కేవలం ఆరు రోజుల పాటు మాత్రమే సీఎంగా ఉన్నారు. అదే విధంగా... మూడోసారి పదవి చేపట్టిన ఆయన 17 రోజుల పాటు సీఎంగా ఉన్నారు.టీచర్ల నియామకాల్లో అవినీతి.. పదేళ్లు జైలు శిక్షహర్యానా సీఎంగా ఎనలేని కీర్త ప్రతిష్టలు సంపాదించుకున్న ఓం ప్రకాష్ చౌతాలా రిక్రూట్మెంట్ స్కామ్తో సహా పలు కేసుల్లో జైలు జీవితాన్ని గడిపారు. ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో చౌతాలా పదేళ్లు జైలు శిక్ష అనుభవించారు. 2000 సంవత్సరంలో 3,206 మంది జూనియర్ ఉపాధ్యాయులను అక్రమంగా నియమించిన కేసులో చౌతాలా, అతని కుమారుడు అజయ్ చౌతాలా, ఐఏఎస్ అధికారి సంజీవ్ కుమార్ సహా 53 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో 2013లో చౌతాలా అరెస్టయ్యారు.అయితే కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ ప్రభుత్వం జైళ్లలో రద్దీని తగ్గించే ప్రయత్నంలో పదేళ్ల జైలు శిక్షలో కనీసం తొమ్మిదిన్నర సంవత్సరాల శిక్ష కాలం పూర్తి చేసిన వారికి 6నెలలు మినహాయింపును ఇచ్చింది. ప్రభుత్వం నిర్ణయంతో ఓం ప్రకాశ్ చౌతాలాకు ఆరు నెలల మినహాయింపు లభించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. इंडियन नैशनल लोकदल के प्रमुख चौधरी #OmPrakashChautala का निधन।pic.twitter.com/5rXmDjJaSR— कटाक्ष (@Kataksh__) December 20, 2024అక్రమ ఆస్తుల కేసులోఅక్రమ ఆస్తుల కేసులో హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు. 1993–2006 మధ్య కాలంలో ఆయన ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని ఆరోపణలు వచ్చాయి. 2005లో చౌతాలాపై కేసు నమోదు చేసిన సీబీఐ 2010 మార్చి 26న చార్జిషీటు దాఖలు చేసింది.హర్యానా సీఎంగా ఉన్న కాలంలో చౌతాలా తన పేరుతో, కుటుంబ సభ్యుల పేర్లతో భారీగా స్థిర, చరాస్తులెన్నిటినో కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఆయన వాస్తవంగా చూపిన ఆదాయం కంటే 189.11% ఎక్కువగా, అంటే రూ.6.09 కోట్ల ఆస్తుల్ని సమకూర్చుకున్నారని, ఇందుకు తగిన ఆధారాలను చూపలేకపోయారని సీబీఐ పేర్కొంది.పదో తరగతి ఫెయిల్చౌతాలా పదో తరగతిలో ఇంగ్లీష్ సబ్జెట్లో ఫెయిలయ్యారు. దీంతో చదువుకు పులిస్టాప్ పెట్టారు. అయితే లేటు వయస్సులో పదో తరగతి పరీక్ష రాసి పాసయ్యారు. 2021లో పదోతరగతి పరీక్షలు రాసి పాసయ్యారు. విచిత్రం ఏంటంటే? చౌతాలా అక్రమాస్తుల కేసులో తీహార్ జైలులో శిక్షను అనుభవించారు. ఆ సమయంలో పదోతరగతి పాస్ అవ్వకుండానే కరోనా తొలి దశలో ఓపెన్ స్కూల్లో చౌతలా ఇంటర్మీడియట్లో చేరారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు రాయకుండానే ఓపెన్ విద్యార్థులంతా పాసయ్యారు. ఆ క్రమంలో చౌతలా కూడా పాసయ్యాడు. అయితే పది పూర్తి చేయకుండానే ఇంటర్కు ఉత్తీర్ణత ఇవ్వడం కుదరకపోవడంతో అధికారులు ఫలితాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత జరిగిన పదో తరగతి ఇంగీష్ పరీక్ష రాశారు. విడుదలైన ఫలితాల్లో 100కు 88 మార్కులు సాధించి పదో తరగతి గండాన్ని దాటేశాడు.తీహార్ జైల్లో.. ఫస్ట్ క్లాస్లో ఇంటర్ పాస్సుప్రీం కోర్టు తీర్పుతో తీహార్ జైలులో శిక్ష అనుభవించే చౌతాలా డిగ్రీ చదవాలని నిర్ణయించుకున్నారు. అందుకే 82 ఏళ్ల వయసులో చౌతాలా ఇంటర్ చదివారు. తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల చదువు కోసం ఏర్పాటు చేసిన కేంద్రంలో నేషనల్ ఇన్స్టిస్ట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) ఇంటర్లో పరీక్షల్లో ఫస్ట్ క్లాస్లో పాసయ్యారు. -
తాతగారి సెన్సేషనల్ విడాకులు : భరణం ఎంతో తెలిస్తే అవాక్కే!
బెంగళూరు టెకీ ఆత్మహత్మ, భరణం కేసు ప్రకంపనలు రేపుతున్న తరుణంలో మరో ఆసక్తికరమైన విడాకుల కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన 70 ఏళ్ల రైతు ఒకటీ రెండూ కాదు, ఏకంగా 18 ఏళ్ల పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి, కోట్ల రూపాయల భరణం చెల్లించిన ఉదంతం నెట్టింట హల్చల్ చేస్తోంది. అదీ పెళ్లి అయిన 44 ఏళ్ల తరువాత పట్టువీడకుండా, శాశ్వత భరణంగా రూ.3.01 కోట్లు చెల్లించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.వివరాలు ఇలా ఉన్నాయి...హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన సుభాష్ చంద్ 1980, ఆగస్టు 27వ తేదీన సంతోష్ కుమారిని పెళ్లి చేసుకున్నాడు. ఉన్నన్ని రోజులు వీరి సంసారం సజావుగానే సాగింది. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అంతా బావుంది అనుకుంటున్న క్రమంలో ఈ జంట మధ్య విభేదాలు మొదలయ్యాయి. అవి చిలికి చిలికి గాలివానలా మారాయి. దీంతో 2006, మే 8వ తేదీ నుంచి విడిగా జీవించడం ప్రారంభించారు. భార్యనుంచి విడాకులు ఇప్పించాల్సిందిగా 2006లొనే కోర్టును ఆశ్రయించాడు. అయితే కర్నాల్ కోర్టు 2013 జనవరిలో అతని విడాకుల అభ్యర్థనను తిరస్కరించింది. అయినా పట్టువీడని సుభాష్ హైకోర్టులో అప్పీల్ చేశాడు.దాదాపు 11 సంవత్సరాల తరువాత రాజీ చేసుకోవాల్సిందిగా కోరిన హైకోర్టు, ఈ ఏడాది నవంబర్ 4వ తేదీన ఈ విషయాన్ని మధ్యవర్తిత్వం మరియు రాజీ కేంద్రానికి సూచించింది. ఈ ప్రక్రియలో భాగంగానే వీరికి మంజూరైనాయి. అయితే భార్యకు శాశ్వత భరణంగా మొత్తం 3.07 కోట్ల రూపాయలను చెల్లించేందుకు అంగీకరించాడు సుభాష్. దీనికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలు కూడా అంగీకరించారు. అయితే ఈ భరణం ఎలా చెల్లించాడు అనేదే హాట్ టాపిక్ అంత భరణం ఎలా?తన వ్యవసాయ భూమిని అమ్మి మరీ డిమాండ్ డ్రాఫ్ట్గా 2 కోట్ల 16 లక్షల రూపాయలను చెల్లించాడు. పంట అమ్మగా వచ్చిన సొమ్ముతో 50 లక్షల నగదు చెల్లించాడు. ఇక మిగిలిన 40 లక్షల రూపాయలను బంగారు, వెండి రూపంలో చెల్లించాడు. ముదిమి వయసులో , 18 ఏళ్ల సుదీర్ఘం న్యాయ పోరాటం తరువాత 44 ఏళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి పలకడం చర్చకు దారి తీసింది. ఒప్పందం ప్రకారం చంద్కు చెందిన ఆస్తిపై భార్యాపిల్లలు అన్ని హక్కులను వదులు కున్నారని చంద్కు చెందిన రాజిందర్ గోయెల్ పేర్కొన్నారు. ఈ పరస్పర నిర్ణయాన్ని కోర్టు అంగీకరించి గత వారం విడాకులు ఖరారు చేసిందని ఆయన వెల్లడించారు. -
అతనిది హర్యానా.. ఆమెది ఫ్రాన్స్.. ప్రేమ కలిపిందిలా..
పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని, బ్రహ్మదేవుని నిర్ణయం ప్రకారం ఎవరెవరి ఎప్పుడు, ఎవరితో వివాహం జరగాలో నిశ్చయమవుతుందని అంటారు. ఆలోచిస్తే ఇది కొందవరకూ నిజమేనని అనిపిస్తుంది. హర్యానావాసి అమిత్, ఫ్రాన్స్కు చెందిన సీసెల్ జంటను చూస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే..హర్యానాలోని పల్వాల్ జిల్లాలోని కలువా గ్రామానికి చెందిన అమిత్ నర్వార్(30) ఫ్రాన్స్ యువతి సీసెల్ను వివాహమాడటం ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 12న వీరి వివాహం పాల్వాల్లోని విష్ణు గార్డెన్లో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ సందర్భంగా విదేశీ వధువును చూసేందుకు ఊరిజనమంతా తరలివచ్చారు. ఈ సందడిలో సదరు విదేశీ యువతి తన భర్త, అత్తామామలతో కలసి నృత్యం చేసి అందరినీ అలరించారు. అమిత్ నర్వార్ ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో 2019లో యోగా టీచర్గా పనిచేసేవారు. ఆ సమయంలో అతని దగ్గర యోగా నేర్చుకునేందుకు ఫ్రాన్స్ నుంచి సీసెల్ మార్లీ వచ్చారు. ఈ కోర్సు రెండు నెలల పాటు సాగింది. ఈ నేపధ్యంలో అమిత్, సీసెల్ ప్రేమలో పడ్డారు. యోగా కోర్సు ముగిసిన అనంతరం సీసెల్ తిరిగి ఫ్రాన్స్ వెళ్లిపోయారు. ఆ తరువాత వారిద్దరూ ఫోన్లో మాట్లాడుకోసాగారు.ఇదిలా ఉండగా అమిత్ కుటుంబ సభ్యులు అతనికి మరో యువతితో వివాహం చేయాలనుకున్నారు. అయితే అమిత్ తన ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు ఈ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో అమిత్ చేస్తున్న ఉద్యోగాన్ని, ఇంటిని విడిచిపెట్టి 2022లో ఫ్రాన్స్కు వెళ్లారు. అప్పటికే సీసెల్ అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. డబ్బుకు ఇబ్బంది లేకపోవడంతో అమిత్, సీసెల్ లివ్ ఇన్ రిలేషన్ షిప్లో 2022 నుంచి 2024 వరకు ఉన్నారు. ఇదే సమయంలో సీసెల్ తండ్రి క్యాన్సర్తో మరణించారు. ఆ తర్వాత సీసెల్, అమిత్లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, ఇరు కుటుంబాలవారికీ చెప్పారు. వారు ఓకే చెప్పడంతో సీసెల్ తమ కుటుంబసభ్యులతో సహా భారతదేశానికి వచ్చారు. డిసెంబర్ 12న అమిత్, సీసెల్ల వివాహం ఘనంగా జరిగింది.ఇది కూడా చదవండి: Vallabhbahi Patel: ‘ఉక్కు మనిషి’ చివరి రోజుల్లో.. -
రణరంగంగా శంభు సరిహద్దు.. రైతులపైకి టియర్ గ్యాస్ ప్రయోగం
Live Updates..👉పంజాబ్-హర్యానా సరిహద్దులు రణరంగంలా మారాయి. రైతు సంఘాల ఢిల్లీ చలో కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. శంభు సరిహద్దు వద్ద రైతులను హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం, రైతులు ముందుకు కదలడంతో పోలీసులు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు. అలాగే, వాటర్ కెనాన్లను రైతులపైకి ప్రయోగించారు. టియర్ గ్యాస్ కారణంగా పలువురు రైతు సంఘాల నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని ఆసుపత్రులకు తరలించారు. #WATCH | Drone visuals from the Haryana-Punjab Shambhu Border where the farmers protesting over various demands have been stopped from heading towards DelhiPolice used water cannon, tear gas to disperse the farmers. pic.twitter.com/W54KhOMqZa— ANI (@ANI) December 14, 2024#WATCH | Police use tear gas and water cannon to disperse protesting farmers at the Haryana-Punjab Shambhu Border. The farmers have announced to march towards the National Capital-Delhi over their various demands. pic.twitter.com/lAX5yKFarF— ANI (@ANI) December 14, 2024 #WATCH | Police use tear gas and water cannon to disperse protesting farmers at the Haryana-Punjab Shambhu Border. The farmers have announced to march towards the National Capital-Delhi over their various demands. pic.twitter.com/tDMTy8iGXU— ANI (@ANI) December 14, 2024#WATCH | Farmers begin their 'Dilli Chalo' march from the Haryana-Punjab Shambhu Border; police personnel present at the spot pic.twitter.com/Uq8zTrbXjo— ANI (@ANI) December 14, 2024 👉పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం వంటి పలు డిమాండ్లతో రైతు సంఘాల ఢిల్లీ చలో కార్యక్రమంలో నేడు మళ్లీ కొనసాగనుంది. ఈ మేరకు రైతులు సన్నద్దమవుతున్నారు. ఢిల్లీ చేరుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. 👉ఇందులో భాగంగా రైతులు, రైతు సంఘాల నేతలతో కూడిన 101 మందితో కూడిన రైతు జాతా ఈరోజు మధ్యాహ్నం మరోసారి ఢిల్లీకి బయలుదేరనుంది. ఇక, రైతుల కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.#WATCH | Visuals from the Haryana-Punjab Shambhu Border where the farmers are protesting over various demands. According to farmer leader Sarwan Singh Pandher, a 'Jattha' of 101 farmers will march towards Delhi today at 12 noon. pic.twitter.com/Tfb1F8dSqE— ANI (@ANI) December 14, 2024👉 మరోవైపు.. రైతుల మార్చ్ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం అంబాలా జిల్లాలో తాత్కాలికంగా ఇంటర్నెట్ సేవలు, మొబైల్ ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేసింది. నేటి నుంచి ఈనెల 17వ తేదీ వరకు ఈ సేవలను నిలిపి వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అత్యవసర సేవలు కొనసాగుతాయని చెప్పుకొచ్చారు. 👉ఇదిలా ఉండగా.. రైతుల మార్చ్ నేపథ్యంలో రైతు సంఘాల నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ మాట్లాడుతూ.. రైతులు ఆందోళనలు చేపట్టి నేటి 307 రోజులు అవుతోంది. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని మేమందరం కేంద్రాన్ని కోరుతున్నాం. ఈ క్రమంలోనే మార్చ్ తలపెట్టాం. దేశం మొత్తం రైతులకు అండగా నిలుస్తోంది. కానీ, ప్రధాని మోదీ మాత్రం మౌనం వహిస్తున్నారు’ అని కామెంట్స్ చేశారు.ఇక, ఇప్పటికే రెండు సార్లు రైతులు ఢిల్లీ చలో కార్యక్రమానికి పిలుపునివ్వగా పోలీసులు వారిని అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ సందర్బంగా పలువురు రైతులు, రైతు సంఘాల నాయకులు గాయపడ్డారు. -
హరియాణాలో విడాకుల సంబరం
చండీగఢ్: ఆధునిక కాలంలో పెళ్లికి ముందు బ్యాచిలర్ పార్టీలు చూస్తున్నాం. పెళ్లి వేడుకలు తిలకిస్తున్నాం. పెళ్లి తర్వాత రిసెప్షన్ పేరిట జరిగే విందు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ఇలా వివాహం చుట్టూ ఎన్నో సంబరాలు ఉంటాయి. కానీ, విడాకుల సంబరం ఎప్పుడైనా చూశారా? హరియాణాలో ఇటీవల నిజంగా ఇలాంటి ఉత్సవం జరిగింది. మంజీత్ అనే యువకుడు తన భార్య నుంచి విడిపోయినందుకు చాలా సంతోషంగా తన బంధుమిత్రులకు విందు ఇచ్చాడు. కేక్ కట్ చేశాడు. డైవోర్స్ పార్టీ ఘనంగా నిర్వహించుకున్నాడు. ఈ సందర్భంగా వేదిక వద్ద తన పెళ్లి ఫొటో, పెళ్లి జరిగిన తేదీ, విడాకులు మంజూరైన తేదీ తదితర వివరాలతో ఒక ఫ్లెక్సీ ముద్రించి అతికించాడు. అంతేకాదు తన మాజీ భార్య విగ్రహం లాంటిది అక్కడే ఏర్పాటుచేశాడు. ఆ విగ్రహం పక్కనే నిలబడి ఫోటోలకు పోజులిచ్చాడు. ఈ వ్యవహారమంతా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి విడాకుల పారీ్టలు విదేశాల్లో ఎక్కువగా జరుగుతుంటాయని సమాచారం. ఇప్పుడు మన దగ్గర కూడా ఈ పాశ్చాత్య సంస్కృతి మొదలైట్లు తెలుస్తోంది. మంజీత్ 2020లో కోమల్ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ, వారి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. అభిప్రాయభేదాలతో నిత్యం కీచులాడుకోవడం కంటే విడిపోవడమే మేలని నిర్ణయానికొచ్చారు. ఈ ఏడాదే వారికి కోర్టు నుంచి విడాకులు మంజూరయ్యాయి. ఇప్పుడు తనకు అసలైన స్వాతంత్య్రం వచి్చందని మంజీత్ ఆనందంగా చెబుతున్నాడు. కానీ, ఇలాంటి విడాకుల వ్యవహారాలు, డైవోర్స్ పారీ్టలు మంచి పరిణామం కాదని పెద్దలు అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Manjeet Dhakad Dhakad (@m_s_dhakad_041) -
రైతుల ఢిల్లీ చలో వాయిదా..
farmers Protest Live Updates...👉ఢిల్లీ చలో కార్యక్రమాన్ని రైతులు వాయిదా వేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చల తర్వాత ఢిల్లీ మార్చ్పై రైతులు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో చర్చలు విఫలమైతే డిసెంబర్ 8న మార్చ్ చేస్తామని రైతులు తెలిపారు. ఢిల్లీ చలో నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఉదద్రిక్తకర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పలువురు రైతు సంఘాల నాయకులు గాయపడ్డారు. #WATCH | At the Shambhu border, farmer leader Sarwan Singh Pandher says, "Now 'Jattha' of 101 farmers will march towards Delhi on December 8 at 12 noon. Tomorrow's day has been kept for talks with the central government. They have said that they are ready for talks, so we will… pic.twitter.com/3llMjDGvsd— ANI (@ANI) December 6, 2024👉రైతుల సంఘాల నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ మాట్లాడుతూ.. మమ్మల్ని ఢిల్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు టియర్ ప్రయోగించడంతో ఆరుగురు రైతు నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. కాసేపు మేమేంతా సమావేశం కాబోతున్నాం. భవిష్యత్ ప్రణాళికపై చర్చిస్తామన్నారు. #WATCH | At the Shambhu border, Farmer leader Sarwan Singh Pandher says, "They (police) will not let us go (to Delhi). Farmer leaders have got injured, we will hold a meeting to decide the future strategy..." https://t.co/jpM65N22Po pic.twitter.com/rOnk0VXgcQ— ANI (@ANI) December 6, 2024 👉హర్యానా-పంజాబ్ సరిహద్దుల్లోని శంభు వద్ద నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో, టియర్ గ్యాస్ కారణంగా పలువురు రైతులు అస్వస్థతకు గురయ్యారు. పలువురు గాయపడ్డారు. దీంతో, వారికి ఆసుపతత్రికి తరలించారు. #WATCH | Police use tear gas to disperse protesting farmers at the Haryana-Punjab Shambhu Border. The farmers have announced to march towards the National Capital-Delhi over their various demands. pic.twitter.com/CMon3JDg3I— ANI (@ANI) December 6, 2024 👉దేశంలో రైతులు మరోసారి పోరుబాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు సరిహద్దు వద్ద ‘ఢిల్లీ చలో’ పేరుతో నిరసన చేపట్టారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్లను నెరవేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు.. అన్నదాతలను అడ్డుకోవడంతో ఉద్రికత్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ రైతును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.👉రైతులు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ శంభు సరిహద్దుకు చేరుకున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోకి రైతులు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బారికేడ్లతో రైతులను భద్రతా బలగాలు అడ్డుకున్నారు. మరోవైపు.. రైతులు నిరసనల నేపథ్యంలో హర్యానాలోని అంబాలా సహా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. గ్రేటర్ నోయిడాలోని పరి చౌక్ వద్ద ‘ఢిల్లీ చలో’ ఆందోళనలో పాల్గొంటున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.#WATCH | Drone visuals from the Shambhu border where the farmers protesting over various demands have been stopped from entering Delhi. pic.twitter.com/0aBiJTI7sS— ANI (@ANI) December 6, 2024ఇదిలా ఉండగా.. రైతుల మార్చ్ నేపథ్యంలో హర్యానా యంత్రాంగం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో కేంద్ర పారా మిలటరీ బలగాలను మోహరించారు. అదనంగా మూడంచెల బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు.#WATCH | At the Shambhu border, a police official says, "They (farmers) don't have permission to enter Haryana. The Ambala administration has imposed Section 163 of the BNSS..." https://t.co/zVSRcePdgO pic.twitter.com/NwkVbliejp— ANI (@ANI) December 6, 2024రైతు నాయకుడు, కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) సమన్వయకర్త శర్వణ్ సింగ్ పాంథేర్ మాట్లాడుతూ.. రైతులు ట్రాక్టర్లు, ట్రాలీలు తేకుండా కేవలం కాలినడకన పాదయాత్ర చేస్తారని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు శంభు సరిహద్దు నుంచి 101 మంది రైతులతో తమ పాదయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి మార్చ్ చేయాలని నిర్ణయించామని తెలిపారు.#WATCH | Farmers protesting over various demands have been stopped at the Shambhu border from heading towards Delhi. pic.twitter.com/Pm3HxgR2ie— ANI (@ANI) December 6, 2024 -
డాలర్ డ్రీమ్స్ వేటలో.. కటకటాల పాలు!
అమెరికా కలను సాకారం చేసుకునేందుకు భారతీయులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అమెరికాలోకి భారతీయుల అక్రమ వలసలు విపరీతంగా పెరిగినట్టు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (యూఎస్ సీబీపీ) తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు వాళ్లు ప్రధానంగా కెనడా సరిహద్దులను ఎంచుకుంటున్నారు. కెనడా గుండా అమెరికాలో ప్రవేశిస్తూ అరెస్టవుతున్న వారిలో భారతీయులే 22 శాతం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది! యూఎస్ సీబీపీ గణాంకాల ప్రకారం 2023 అక్టోబర్ నుంచి 2024 సెప్టెంబర్ మధ్య కెనడా సరిహద్దు గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2022లో కెనడా గుండా అక్రమంగా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన 1,09,535 మందిలో భారతీయులు 16 శాతం కాగా 2023లో వారి సంఖ్య ఇంకా పెరిగింది. ఆ ఏడాది 1,89,402 మందిలో 30,010 మంది భారతీయులున్నారు. 2024లో 1,98,929 మంది సరిహద్దు దాటేందుకు అక్రమంగా ప్రయత్నించగా వారిలో 43,764 మంది భారతీయులే. లాటిన్ అమెరికా, కరేబియన్ వలసదారులతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువే. అయినా గత నాలుగేళ్లలో కెనడా గుండా అక్రమంగా అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారిలో అతిపెద్ద సమూహం భారతీయులేనని వాషింగ్టన్కు చెందిన ఇమిగ్రేషన్ విశ్లేషకులు చెబుతున్నారు. భద్రతా దళాలకు చిక్కకుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయుల సంఖ్య తెలియదు. కెనడా సరిహద్దే ఎందుకు? అమెరికాలోకి అక్రమ చొరబాట్లకు భారతీయులు కెనడా సరిహద్దునే ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయి. కెనడా వీసా ప్రక్రియ సులువుగా ఉండటం వాటిలో ముఖ్యమైనది. కెనడా విజిటింగ్ వీసా ప్రాసెసింగ్ కేవలం 76 రోజుల్లో పూర్తవుతుంది. అదే అమెరికా వీసా ప్రాసెసింగ్ కోసమైతే కనీసం ఏడాది వేచి ఉండాల్సిందే. అమెరికాతో కెనడా సరిహద్దు చాలా పొడవైనది. దాంతో అక్కడ రక్షణ తక్కువ. దాంతో అంత సురక్షితమైన మార్గం కానప్పటికీ దీన్నే ఎంచుకుంటున్నారు. పంజాబ్ నుంచే ఎక్కువ ఇలా కెనడా గుండా అమెరికాలో చొరబడేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల్లో ఎక్కువ భాగం పంజాబ్, హరియాణాల వాళ్లే ఉంటున్నారు. తర్వాతి స్థానం గుజరాత్ది. విదేశాల్లో విద్య, ఉపాధి అవకాశాల కోసం పంజాబీ గ్రామీణ యువత బాగా ఆసక్తి చూపుతోంది. కానీ సరైన విద్యార్హతలు, ఆంగ్ల ప్రావీణ్యం లేని కారణంగా అమెరికా పర్యాటక, విద్యార్థి వీసాలు పొందడం వీరికి గగనంగా మారుతోంది. ప్రత్యామ్నాయంగా అక్రమంగా సరిహద్దులు దాటించే ముఠాలను ఆశ్రయిస్తున్నారు. ఈ ప్రయత్నంలో చాలామంది లక్షలకు లక్షలు పోగొట్టుకుంటున్నారు. మరికొందరు సరిహద్దులు దాటేందుకు అతి ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాల వ్యాపారంతో ఏడాదికి రూ.3 కోట్లు సంపాదన: రేణు విజయ గాథ
కొన్ని విజయాలను వ్యక్తిగత విజయాలుగా మాత్రమే పరిగణించలేము.రేణు సంగ్వాన్ సాధించిన విజయం అలాంటిదే.సంప్రదాయ విధానాలకు, ఆధునిక సాంకేతికత జోడిస్తే సాధించగల విజయం అది. పెద్దగా చదువుకోకపోయినా కష్టాన్ని నమ్ముకుంటే అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అని నిరూపించిన విజయం అది.హరియాణా రాష్టప్రాం ఝుజ్జర్ జిల్లాలోని ఖర్మన్ గ్రామానికి చెందిన రేణు సంగ్వాన్ డిసెంబర్ 3న న్యూదిల్లీలో ‘కృషి జాగరణ్ మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా’ అవార్డ్ అందుకోనుంది. పాడి పరిశ్రమకు ఆమె చేసిన అసాధారణ సేవలకు గుర్తింపుగా ఈ ప్రతిష్ఠాత్మకమైన పురస్కారానికి ఎంపికైంది రేణు సంగ్వాన్...తొమ్మిది దేశవాళీ ఆవులతో రేణు పాడిపరిశ్రమ ప్రయాణం పారంభం అయింది. ఇప్పుడు ఆమె ‘గోకుల్ ఫామ్ శ్రీకృష్ణ’ 280కి పైగా ఆవులకు నిలయంగా, సుస్థిర పాడి పరిశ్రమ అంటే ఇలా ఉండాలి అని చెప్పుకునేంతటి ఘన విజయం సాధించింది. మూడు కోట్ల టర్నోవర్తో దేశంలోని అత్యుత్తమమైన ఫామ్లలో ఒకటిగా పరిగణించబడుతోంది.సాహివాల్, గిర్, థార్పర్కర్లాంటి స్వదేశీ ఆవు జాతులపై ఆధారపడడం రేణు విజయంలో కీలక అంశం. ఈ జాతులు ఔషధ గుణాలు కలిగిన పాలను ఉత్పత్తి చేయడానికి ప్రసిద్ధి చెందాయి. అంతేకాదు...హైబ్రిడ్ జాతులతో పోల్చితే వాటి ఆలనాపాలనకు అయ్యే ఖర్చు చాలా తక్కువ.‘ఈ ఆవులు స్థానిక వాతావరణానికి బాగా సరిపోతాయి. వాటి పాలు అధిక పోషక విలువలు కలిగి ఉంటాయి. ఇవి హైబ్రిడ్ జాతుల కంటే భిన్నమైనవి. స్వదేశీ ఆవులను ప్రోత్సహించడం ద్వారా రైతులు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చు’ అంటుంది రేణు.‘గోకుల్ ఫామ్ శ్రీకృష్ణ’ తయారు చేస్తున్న నెయ్యికి మన దేశంలోనే కాకుండా పప్రాపంచవ్యాప్తంగా 24 దేశాల్లో డిమాండ్ ఉంది. ఈ ఫామ్ విజయానికి ఆధునిక పద్ధతులు అవలంబించడం కూడా ఒక కారణం. కుమారుడు వినయ్తో కలిసి ఫామ్లో ఆటోమేటిక్ మిల్కింగ్ యంత్రాలు, అధునాతన క్లీనింగ్ యంత్రాలు ఏర్పాటు చేసింది రేణు. (భార్యకోసం బంగారు గొలుసుకొన్నాడు.. దెబ్బకి కోటీశ్వరుడయ్యాడు!)‘గోకుల్ ఫామ్ శ్రీకృష్ణ’ దేశీయ ఎద్దుల వీర్యాన్ని ఉత్పత్తి చేసి విక్రయిస్తుంది.‘దేశవ్యాప్తంగా రైతులు స్వదేశీ ఆవులను దత్తత తీసుకొని, వాటి ఉత్పాదకతను పెంచడానికి ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఉపయోగించాలి. కేవలం పాలపైనే కాకుండా నాణ్యమైన పాల ఉత్పత్తుల ద్వారా ఆదాయ వనరులు పెంచుకోవచ్చు’ అంటుంది రేణు.సవాళ్లు లేకుండా ఏ విజయం సాధ్యం కాదు.రేణు పప్రాయాణం మొదలు పెట్టినప్పుడు అది నల్లేరుపై నడకలా కొనసాగలేదు. వనరుల కొరతతో సహా రకరకాల అడ్డంకులను ఎదుర్కోవలసి వచ్చింది. ఆవులు ఆరోగ్యంగా ఉండేలా, వ్యాధుల బారి నుంచి వాటిని రక్షించడం కూడా పెద్ద సవాలుగా మారింది. పాడిపరిశ్రమలో వ్యాక్సినేషన్, పరిశుభప్రాత ఎంతో కీలకం’ అంటున్న రేణు ఆవులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించడం నుంచి పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా ఎంతో సమయాన్ని వెచ్చించింది. ఆవులకు అధిక నాణ్యత గల పశుగ్రాసాన్ని అందించడంపై దృష్టి పెట్టేది. కఠోర శ్రమ, అంకితభావం, సృజనాత్మకతతో దేశవ్యాప్తంగా రైతులు, మహిళలకు ఆదర్శంగా నిలిచిన రేణు సంగ్వాన్ పప్రాతిష్ఠాత్మకమైన ‘జాతీయ గోపాల్ రత్న పురస్కార్–2024’ అందుకుంది.విజయం అంటే మైలురాళ్లను చేరుకోవడం, వ్యక్తిగత సంతోషం మాత్రమే కాదు. కలలు కనడానికి, వాటిని సాధించడానికి ఇతరులను ప్రేరేపించడం. – రేణు సంగ్వాన్ -
లెక్చరర్ కుర్చీ కింద బాంబు.. విద్యార్థుల ప్రతీకారం..
విద్యా బుద్ధులు నేర్పించే గురువు పట్ల ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. మహిళా లెక్చరర్ కూర్చునే కుర్చీ కింద బాంబును అమర్చారు. ఆ తర్వాత ఏమైందంటే?పోలీసుల కథనం ప్రకారం.. హర్యానాకు చెందిన కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 13 నుంచి 15 విద్యార్థుల్ని మహిళా సైన్స్ లెక్చరర్ మందలించారు. దీంతో కోపోద్రికులైన విద్యార్థులు లెక్చరర్పై ప్రాంక్ పేరుతో ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు.ఫైర్ క్రాకర్స్ తరహాలో పేలే రిమోట్ కంట్రోల్ బాంబును తయారు చేసిన లెక్చరర్ కూర్చునే కుర్చీ కింద బాంబు పెట్టి పేల్చాలని అనుకున్నారు. బాంబు తయారు చేసేందుకు యూట్యూబ్ వీడియోల్ని చూశారు. అనంతరం వీడియోల్లో చూపించినట్లుగా రిమోట్ కంట్రోల్ బాంబును తయారు చేశారు. ముందస్తు ప్లాన్ ప్రకారం.. పాఠాలు చెప్పేందుకు క్లాస్ రూమ్కి వచ్చే లెక్చరర్ చైర్లో కూర్చున్నప్పుడు బాంబు పేల్చేందుకు సిద్ధమయ్యారు. రిమోట్ కంట్రోల్తో బాంబు పేల్చే పనిని క్లాస్ రూమ్లో ఉన్న విద్యార్థికి అప్పగించారు. చైర్ కింద బాంబును అమర్చి సైలెంట్గా క్లాస్ రూమ్లో కూర్చున్నారు. లెక్చరర్ గదిలోకి రావడం.. అటెండెన్స్ తీసుకుని పాఠాలు చెప్పేందుకు చైర్లో కూర్చున్నారు. వెంటనే క్లాస్ రూమ్లో ఉన్న విద్యార్థి తన చేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్తో బాంబును పేల్చాడు. అదృష్టవశాత్తూ.. పేలుడు ఘటనలో మహిళా లెక్చరర్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.ఈ ఘటనపై బాధిత మహిళా లెక్చరర్కు తోటి లెక్చరర్లు మద్దతుగా నిలిచారు. ఇలాంటి ఆకతాయి పనులు పునరావృతం కాకుండా ఉండేలా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంబు తయారీ, ఎంతమంది విద్యార్థులు ఈ ఆకతాయి పనులు చేశారు వంటి వివరాల్ని సేకరించారు. అనంతరం మహిళా లెక్చరర్ తిట్టడం వల్లే విద్యార్థులు యూట్యూబ్ వీడియోలు చూసి బాంబును తయారు చేసినట్లు నిర్ధారణకు వచ్చారు.దీంతో విద్యార్థలుపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. బాంబు ఘటనలో ప్రమేయం ఉన్న 13 నుంచి 15 మంది విద్యార్థుల తల్లిదండ్రలుకు సమాచారం అందించారు. అయితే పిల్లలు చేసిన ఆకతాయి పనికి వారి తల్లిదండ్రులు సదరు మహిళా లెక్చరర్కు క్షమాపణలు చెప్పారు. మరోసారి ఇలాంటి ఆకతాయి పనులు చేయకుండా చూసుకుంటామని కోరారు. పిల్లల్ని హెచ్చరించారు.తల్లిదండ్రుల విజ్ఞప్తితో విద్యార్థులపై కేసులు, విచారణతో పేరుతో ఇబ్బంది పెట్టొద్దని విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆకతాయి విద్యార్థుల్ని వారం రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నరేష్ మెహతా తెలిపారు. -
రూ. 23 కోట్ల దున్న.. నెలకు రూ. 5 లక్షల ఆదాయం
కొందరు ఎవరినైనా తిట్టేటప్పుడు దున్నపోతులా ఉన్నావ్ అంటూ ఎగతాళి చేస్తుంటారు. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే దున్నపోతు గురించి తెలిస్తే ఇకపై అలాంటి మాట అనరు. ఎందుకంటే ఈ దున్నపోతు ధర, అది తినే తిండి, అంతకు మించి దీని ద్వారా వచ్చే ఆదాయం గురించి తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.ఆ దున్నపోతు ఖరీదు రూ.23 కోట్లు అని చెబితే ఎవరైనా నమ్ముతారా? అవును.. ఇది అక్షరాలా నిజం. అయితే దాని వలన వచ్చే ఆదాయం గురించి తెలిస్తే అంత ధర ఉండటంతో తప్పులేదంటాం. ఇప్పుడు ఆ దున్నపోతు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ దున్నపోతు వీర్యాన్ని అమ్మడంతో పాటు ఇతర మార్గాల ద్వారా దాని యజమాని నెలకు రూ.4 నుంచి రూ.5 లక్షల వరకూ సంపాదిస్తుండటం విశేషం. హర్యానాకు చెందిన ఆ దున్నపోతు పేరు అన్మోల్.హర్యానాలోని సిర్సాలో ఉంటున్న పల్వీందర్ సింగ్ అనే రైతు ఈ అన్మోల్ను పెంచుతున్నాడు. దాని వయసు ఎనిమిదేళ్లు. బరువు 1500 కిలోలు. ఈ దున్నపోతును రూ.23 కోట్లు ఇస్తానన్నా పల్వీందర్ సింగ్ ఎవరికీ అమ్మబోనని తెగేసి చెబుతున్నాడు. ఉత్తరాదిన జరిగే పుష్కర్ మేళా, ఆల్ ఇండియా ఫార్మర్స్ ఫెయిర్ వంటి ప్రదర్శనల్లో ఈ అన్మోల్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంటుంది. దీని భారీ ఆకారం ఎవరినైనా ఇట్టే కంగుతినేలా చేస్తుంది.ఇక ఈ అన్మోల్ ఎంత తిండి తింటుందో తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోకమానరు. ఇది అధిక కేలరీలు కలిగిన ఆహార పదార్థాలు, డ్రైఫ్రూట్స్ను తింటుంది. దాని తిండి కోసం యజమాని రోజూ రూ.1,500 ఖర్చు చేస్తుంటాడు. అంటే నెలకు దానిని మేపడానికి రూ.45 వేల వరకు ఖర్చవుతుందన్నమాట. అది ప్రతి రోజూ 250 గ్రాముల బాదాం, నాలుగు కిలోల దానిమ్మలు, 30 అరటిపండ్లు, ఐదు లీటర్ల పాలు, 20 గుడ్లను తింటుంది. వీటితోపాటు అది ఆయిల్ కేక్, పచ్చి గడ్డి, దేశీ నెయ్యి, సోయాబీన్, మొక్కజొన్నలను కూడా తింటుంది. అన్మోల్ దున్నపోతుకు దాని యజమాని పల్వీందర్ సింగ్ రోజూ స్నానం చేయిస్తుంటాడు. ఇందుకోసం బాదాం నూనె, ఆవ నూనెలను కూడా వినియోగించడం విశేషం.ఇది కూడా చదవండి: Pakistan: ఊపిరాడక వేల మంది ఆస్పత్రులకు పరుగులు -
భారత క్రికెట్లో సంచలనం.. ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు! 39 ఏళ్ల తర్వాత
రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో హర్యానా పేసర్ అన్షుల్ కాంబోజ్ చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో భాగంగా రోహ్తక్ వేదికగా కేరళతో జరుగుతున్న మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో కాంబోజ్ 10 వికెట్లతో చెలరేగాడు. మొదటి ఇన్నింగ్స్లో 30.1 ఓవర్లు బౌలింగ్ చేసిన కాంబోజ్.. 49 పరుగులిచ్చి మొత్తం 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.తొలి రోజు ఆటలో రెండు వికెట్లు పడగొట్టిన అన్షుల్.. రెండో రోజులో మిగితా 8 వికెట్లను నేలకూల్చాడు. తద్వారా రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో మొత్తం వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్గా అన్షుల్ రికార్డులకెక్కాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో కాంబోజ్ కంటే ముందు బెంగాల్ దిగ్గజం ప్రేమాంగ్షు ఛటర్జీ, రాజస్థాన్ మాజీ ప్లేయర్ ప్రదీప్ సుందరం ఉన్నారు. 1956-57 సీజన్లో అస్సాంపై ప్రేమాంగ్షు ఛటర్జీ ఈ ఫీట్ సాధించగా.. 1985-86 సీజన్లో విదర్భపై ప్రదీప్ సుందరం 10 వికెట్లు పడగొట్టాడు. మళ్లీ ఇప్పుడు 39 సంవత్సరాల తర్వాత అన్షుల్ కాంబోజ్ ఈ ఎలైట్ జాబితాలో చేరాడు. కాంబోజ్ బౌలింగ్ మ్యాజిక్ ఫలితంగా కేరళ తమ తొలి ఇన్నింగ్స్లో 291 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటివరకు 19 ఫస్ట్క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడిన కాంబోజ్.. 57 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అదేవిధంగా కాంబోజ్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు కూడా ప్రాతినిథ్యం వహించాడు.ఎవరీ అన్షుల్ కాంబోజ్..?23 ఏళ్ల అన్షుల్ కాంబోజ్ హర్యానా తరపున 2022 రంజీ సీజన్లో త్రిపురాపై ఫస్ట్క్లాస్ అరంగేట్రం చేశాడు. కాంబోజ్కు అద్బుతమైన ఫాస్ట్ బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఇప్పటివరకు 19 ఫస్ట్క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడిన కాంబోజ్.. 57 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.కాంబోజ్ ఐపీఎల్లో కూడా ఆడాడు. దేశీవాళీ టోర్నీల్లో సంచలన ప్రదర్శన కనబరుస్తుండడంతో ఐపీఎల్-2024 మినీ వేలంలో ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. అయితే ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు అతడిని ముంబై రిటైన్ చేసుకోలేదు. ఈ నెల 24, 25 తేదీల్లో జెడ్డా వేదికగా జరగనున్న మెగా వేలంలో ఈ హర్యానా పేసర్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశముంది.చదవండి: IND Vs AUS: 'కింగ్ తన రాజ్యానికి తిరిగొచ్చాడు'.. ఆసీస్ను హెచ్చరించిన రవిశాస్త్రి -
ఊచకోత.. ఒకే ఇన్నింగ్స్లో 426 పరుగులు! 46 ఫోర్లు, 8 సిక్స్లతో
కల్నల్ సికె నాయుడు ట్రోఫీ-2024లో హర్యానా ఓపెనర్ యశ్వర్ధన్ దలాల్ చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో భాగంగా గుర్గ్రామ్ వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో యశ్వర్ధన్ ఏకంగా క్వాడ్రపుల్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో ముంబై బౌలర్లను యశ్వర్ధన్ ఊచకోత కోశాడు. వన్డే తరహాలో ఈ హర్యానా బ్యాటర్ విరుచుకుపడ్డాడు. ఓవరాల్గా 463 బంతులు ఎదుర్కొన్న యశ్వర్ధన్ దలాల్ 46 ఫోర్లు, 12 సిక్స్లతో 426 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ అర్ష్ రంగతో కలిసి యశ్వర్ధన్ 410 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.అర్ష్ రంగ(151) కూడా సెంచరీతో మెరిశాడు. వీరిద్దరి విధ్వంసం ఫలితంగా హర్యానా తొలి ఇన్నింగ్స్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 748 పరుగుల భారీ స్కోరును సాధించింది.తొలి ప్లేయర్గా..ఇక ఈ మ్యాచ్లో క్వాడ్రపుల్ సెంచరీతో మెరిసిన యశ్వర్ధన్ పలు అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కల్నల్ సికె నాయుడు ట్రోఫీలో అత్యధిక స్కోర్ నమోదు చేసిన బ్యాటర్గా యశ్వర్ధన్ దలాల్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఉత్తరప్రదేశ్ స్టార్ ప్లేయర్ సమీర్ రిజ్వీ పేరిట ఉండేది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌరాష్ట్రపై సమీర్ రిజ్వీ(312) ట్రిపుల్ సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్తో రిజ్వీ ఆల్టైమ్ రికార్డును యశ్వర్ధన్ బ్రేక్ చేశాడు.చదవండి: ENG vs WI: సాల్ట్ విధ్వంసకర సెంచరీ.. విండీస్ను చిత్తు చేసిన ఇంగ్లండ్ -
డీఏపీకి ‘గాజా’ దెబ్బ
ఎక్కడో జరిగిన చర్య ఇంకెక్కడో ప్రతి చర్యకు కారణమవుతుందంటారు. హరియాణా రైతుల విషయంలో అది నిజమవుతోంది. ఏడాదిగా సాగుతున్న గాజా సంక్షోభం భారత్లో డీఏపీ కొరతకు దారి తీస్తోంది. హరియాణా రైతులు రోడ్డెక్కేందుకు కారణంగా మారుతోంది. హరియాణాలోని సిర్కా ప్రాంతంలో రైతులు వారం రోజులుగా రోడ్డెక్కుతున్నారు. రబీ సీజన్ వేళ తమకు సరిపడా డీఏపీ (డైఅమ్మోనియం ఫాస్ఫేట్) ఎరువు సరఫరా చేయాలంటూ ఆందోళనకు దిగితున్నారు. పలు ఇతర జిల్లాల్లో కూడా రైతులు ఎరువుల పంపిణీ కేంద్రాల వద్ద కొద్ది రోజులుగా బారులు తీరుతున్నారు. కొరత నేపథ్యంలో డీఏపీ మున్ముందు దొరుకుతుందో లేదోనని ఎగబడ్డారు. దాంతో పోలీసులు లాఠీచార్జీ చేసేదాకా వెళ్లింది. పంజాబ్, ఉత్తరప్రదేశ్ల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తుతోంది. ఆవాలు, గోధుమ పంటల దిగుబడి బాగా రావాలంటే డీఏపీ తప్పనిసరి. ఆ మూడు రాష్ట్రాల్లో పంటలకు డీఏపీని విరివిగా వాడుతారు. పంటల నత్రజని, సల్ఫర్ అవసరాలను డీఏపీ బాగా తీరుస్తుంది. ఆ రాష్ట్రాల రైతులను డీఏపీ కొరత ఇప్పుడు తీవ్రంగా వేధిస్తోంది. హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధంతో ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్తతలు డీఏపీ సరఫరాలో ఆలస్యానికి ప్రధాన కారణంగా మారాయి. గాజాలో ఏడాదికి పైగా సాగుతున్న యుద్ధం దెబ్బకు ప్రపంచ సరకు రవాణా గొలుసు అక్కడక్కడా తెగింది. దాంతో ఎరువుల దిగుమతిపై ఆధారపడిన భారత్ వంటి దేశాలకు కష్టాలు పెరిగాయి. ఏటా 100 లక్షల టన్నులు భారత్ ఏటా 100 లక్షల టన్నుల డీఏపీని వినియోగిస్తోంది. వీటిలో అధిక భాగం దిగుమతుల ద్వారానే వస్తోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణాలతో పాటు మధ్యప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్, కర్నాటకల్లోనూ డీఏపీ వాడకం ఎక్కువే. డీఏపీ లోటు ప్రస్తుతం ఏకంగా 2.4 లక్షల మెట్రిక్ టన్నులను దాటింది. దాంతో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో డీఏపీ కష్టాలు మరింత పెరిగాయి. హమాస్–ఇజ్రాయెల్ యుద్ధం పశ్చిమాసియాలో విస్తరించి ఇరాన్, లెబనాన్, హెజ్»ొల్లా, హూతీలు ఇందులో భాగస్వాములయ్యారు. దీంతో ఎర్రసముద్రంలో ఉద్రిక్తత పెరిగి అతి కీలకమైన ఆ అంతర్జాతీయ సముద్ర మార్గం గుండా సరకు రాకపోకలు బాగా తగ్గాయి. సరఫరాలపై హౌతీల దెబ్బ! సరకు రవాణా విషయంలో ఎర్రసముద్రం చాలా కీలకం. మద్యధరా సముద్రాన్ని సూయాజ్ కాల్వ ద్వారా హిందూ మహాసముద్రంతో కలిపేది అదే. అలాంటి ఎర్ర సముద్రంపై యెమెన్లోని హౌతీలు పట్టుసాధించారు. నౌకల రాకపోకలకు తీవ్ర ఆటంకంగా మారారు. వాటిపై తరచూ దాడులకు తెగబడుతుండటంతో ఎర్రసముద్రం మీదుగా సరకు రవాణా బాగా తగ్గిపోయింది. దగ్గరి దారి అయిన సూయాజ్ ద్వారా రావాల్సిన సరకు ఆఫ్రికా ఖండాన్నంతా చుడుతూ కేప్ ఆఫ్ గుడ్హోప్ మీదుగా తిరిగి రావాల్సి వస్తోంది. అలా ఒక్కో నౌక అదనంగా ఏకంగా 6,500 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది. ఫలితంగా సరకు డెలివరీ చాలా ఆలస్యమవుతోంది. కేంద్రం దీన్ని ముందుగానే ఊహించింది. సెప్టెంబర్–నవంబర్ సీజన్లో ఎక్కువ ఎరువును అందుబాటు ఉంచాలని భావించినా ఆ స్థాయిలో సరకు దిగుమతి కాలేదు. దాంతో డీఏపీ కొరత అధికమైంది. భారత్ 2019–20లో 48.7 లక్షలు, 2023–24లో 55.67 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీని దిగుమతి చేసుకుంది. ప్రత్యామ్నాయంగా ఎన్పీకే డీఏపీకి బదులు నైట్రోజన్, పాస్ఫరస్, పొటా షియం (ఎన్పీకే) ఎరువును వాడాలని రైతులకు కేంద్రం సూచిస్తోంది. హరియాణాకు 60,000 మెట్రిక్ టన్నుల ఎన్పీకే కేటాయించామని, అందులో 29,000 టన్నులు రైతులకు అందిందని చెబుతోంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణకు దిగినప్పుడే డీఏపీ కొరత తప్పదన్న భయాందోళనలు తలెత్తాయి. గాజా సంక్షోభం పుణ్య మా అని అవి తీవ్రతరమవుతున్నాయి.ధరాభారం కూడా... అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల వల్ల కూడా కేంద్రం భారీగా డీఏపీని కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. 2023 సెప్టెంబర్లో టన్ను డీఏపీ 589 డాలర్లుంటే ఈ సెప్టెంబర్కల్లా 632 డాలర్లకు ఎగబాకింది. అయినా కేంద్రం రాయితీ రూపేణా ఆ భారాన్ని భరిస్తూ వచ్చింది. 2020–21 సీజన్ నుంచి 50 కేజీల సంచి ధర రూ.1,350 దాటకుండా చూసింది. రష్యాతో పాటు సౌదీ అరేబియా, ఈజిప్్ట, మొరాకో, చైనాల నుంచి కూడా డీఏపీని దిగుమతి చేసుకుంటోంది. హరియాణా రైతులకు ఆందోళన అవసరం లేదని సీఎం నయాబ్ సింగ్ సైనీ చెప్పుకొచ్చారు. నవంబర్ కోటా కింద 1.1 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ సిద్ధంగా ఉందన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థి తులు అందుకు భిన్నంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. చాలా జిల్లాల్లో డీఏపీ సంచుల కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. కొందరు రైతులే డీఏపీని ముందస్తుగా భారీ పరిమాణంలో కొనేయడమే మిగతా వారికి సమస్యగా మారిందని హరియాణా సీఎం కార్యాలయం వివరణ ఇవ్వడం విశేషం.ధరాభారం కూడా... అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల వల్ల కూడా కేంద్రం భారీగా డీఏపీని కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. 2023 సెప్టెంబర్లో టన్ను డీఏపీ 589 డాలర్లుంటే ఈ సెప్టెంబర్కల్లా 632 డాలర్లకు ఎగబాకింది. అయినా కేంద్రం రాయితీ రూపేణా ఆ భారాన్ని భరిస్తూ వచ్చింది. 2020–21 సీజన్ నుంచి 50 కేజీల సంచి ధర రూ.1,350 దాటకుండా చూసింది. రష్యాతో పాటు సౌదీ అరేబియా, ఈజిప్ట్, మొరాకో, చైనాల నుంచి కూడా డీఏపీని దిగుమతి చేసుకుంటోంది. హరియాణా రైతులకు ఆందోళన అవసరం లేదని సీఎం నయాబ్ సింగ్ సైనీ చెప్పుకొచ్చారు. నవంబర్ కోటా కింద 1.1 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ సిద్ధంగా ఉందన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థి తులు అందుకు భిన్నంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. చాలా జిల్లాల్లో డీఏపీ సంచుల కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. కొందరు రైతులే డీఏపీని ముందస్తుగా భారీ పరిమాణంలో కొనేయడమే మిగతా వారికి సమస్యగా మారిందని హరియాణా సీఎం కార్యాలయం వివరణ ఇవ్వడం విశేషం. -
రైలులో అగ్ని ప్రమాదం.. ప్రయాణికులకు గాయాలు
చండీగఢ్:హర్యానాలోని రోహ్తక్లో కదులుతున్న రైలులో బాణసంచాకు మంటలంటుకున్నాయి.ఈ ప్రమాదంలో రైలులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. జింద్ నుంచి ఢిల్లీ వెళుతున్న రైలులో తొలుత మంటలు లేచాయని, తర్వాత రైలు మొత్తం పొగచూరిందని జీఆర్పీ పోలీసులు తెలిపారు.రైలులో షార్ట్సర్క్యూట్ కారణంగా తొలుత మంటలు లేచాయని, ఈ మంటలు రైలులో ఉన్న ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న బాణసంచాకు అంటుకోవడంతో అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదీ చదవండి: గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు -
దేశంలో కొత్తగా 10 అణు విద్యుత్కేంద్రాలు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా పది అణువిద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం జరుగుతోందని కేంద్రం వెల్లడించింది. సోమవారం శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల సంబంధ పార్లమెంటరీ స్థాయీ సంఘం భేటీలో ఈ వివరాలను సభ్యులకు అందజేసింది. 700 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో గుజరాత్, రాజస్తాన్, హరియాణాల్లో వీటిని నెలకొల్పారు. గుజరాత్లోని కాక్రపార్లో రెండు అణు విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి మొదలైందని కేంద్రం పేర్కొంది. అయితే వీటి నిర్మాణం చాలా ఆలస్యమవుతోందని కమిటీ సభ్యుడు జైరాం రమేశ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘2007లో ఆమోదం పొందిన ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తి కావస్తుండటం గ్రేట్. ‘సుప్రీం నేత’ కనుసన్నల్లో అభివృద్ధి వేగానికిది నిదర్శనం’’ అని ‘ఎక్స్’లో వ్యంగ్యంగా స్పందించారు. కాక్రపార్–3, కాక్రపార్–4 రియాక్టర్లు కాంగ్రెస్ హయాంలోనే ఆమోదం పొందాయన్నారు. -
అదిరిపోయే దీపావళి గిఫ్ట్: ఆనందంలో ఉద్యోగులు
దసరా, దీపావళి వస్తున్నాయంటే.. ఉద్యోగులకు సంబరపడిపోతుంటారు. ఎందుకంటే తాము పనిచేస్తున్న కంపెనీలు బోనస్లు లేదా గిఫ్ట్స్ వంటివి ఇస్తాయని. కొన్ని కంపెనీలు బోనస్ ఇచ్చి సరిపెట్టుకుంటే.. మరికొన్ని కంపెనీలు ఏకంగా ఊహకందని గిఫ్ట్స్ ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.ఇటీవల హర్యానాలోని పంచకులలోని ఫార్మాస్యూటికల్ కంపెనీ 15 మంది ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచింది. పంచకుల పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న మిట్స్కైండ్ హెల్త్కేర్ సంస్థలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందికి 13 టాటా పంచ్ వాహనాలు, రెండు మారుతి గ్రాండ్ విటారా కార్లను గిఫ్ట్ ఇచ్చింది.కంపెనీ యజమాని ఎంకే భాటియా స్వయంగా కార్ల తాళాలు ఉద్యోగులకు అందజేశారు. ఉద్యోగులు ఎంతో అంకితభావంతో పని చేశారని కొనియాడారు. ఉత్తమ పనితీరు కనపరిచిన అందరూ నాకు సెలబ్రిటీల వంటివారని, కంపెనీ విజయానికి వారి సహకారం చాలా ప్రశంసనీయమని భాటియా అన్నారు.ఇదీ చదవండి: ఆ కంపెనీలో జాబ్ ఆఫర్ వదులుకున్న రతన్ టాటాఎంకే భాటియా తన ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం కూడా 12 మంది ఉద్యోగులకు కారును గిఫ్ట్ ఇచ్చారు. ఈ ఏటా 15 మందికి కార్లను బహూకరించారు. ఇప్పటికి కంపెనీ మొత్తం 27 కార్లను ఉద్యోగులకు అందించింది. ఈ పద్దతిని మిట్స్కైండ్ హెల్త్కేర్ భవిష్యత్తులో కొనసాగించాలని యోచిస్తోంది. -
కాసేపట్లో హరియాణా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం
-
హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం
చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రిగా బీజేపీ నేత నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సైనీ చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. హర్యానాలో మూడోసారి బీజేపీ సర్కార్ కొలువుదీరింది.#WATCH | Nayab Singh Saini takes oath as Haryana CM for the second consecutive time, in PanchkulaPrime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, BJP national president JP Nadda, Defence Minister Rajnath Singh, UP CM Yogi Adityanath and other CMs, Deputy CMs, Union… pic.twitter.com/WK9ljGLwzd— ANI (@ANI) October 17, 2024 కంప్యూటర్ ఆపరేటర్ టు సీఎం..బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన సైనీ1996లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా చేరికమాజీ సీఎం ఖట్టర్ సాన్నిహిత్యంలో రాజకీయంగా ఎదిగిన సైనీ2014లో నారాయణ్ గఢ్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నిక మనోహర్ లాల్ ఖట్టర్ కేబినెట్లో హోంమంత్రిగా సేవలు 2019లో కురుక్షేత్ర నుంచి లోక్సభకు ఎన్నిక2023 అక్టోబర్లో హర్యానా బీజేపీ అధ్యక్షుడిగా నియామకం2024 మార్చిలో హర్యానా సీఎంగా బాధ్యతలు200 రోజుల్లో హర్యానా బీజేపీకి హ్యాట్రిక్ విజయంలో కీలక పాత్రపుట్టిన తేదీ: 1970 జనవరి 25సొంతూరు అంబాల జిల్లా మిర్జాపూర్ మజ్రా గ్రామంబీఏ, ఎల్ఎల్బీ, ఆర్ఎస్ఎస్తో సుదీర్ఘ అనుబంధం హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు పంచకుల సెక్టార్ 5లోని దసరా మైదానానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు.#WATCH | Prime Minister Narendra Modi reaches Dussehra Ground in Sector 5, Panchkula, for the swearing-in ceremony of Haryana CM-designate Nayab Singh Saini and the new Haryana government pic.twitter.com/pycGFJoZMY— ANI (@ANI) October 17, 2024 #WATCH | Haryana CM-designate Nayab Singh Saini to shortly take oath as Haryana CM, in Panchkula pic.twitter.com/2mzAKm0iGf— ANI (@ANI) October 17, 2024 హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు.#WATCH | Union Home Minister Amit Shah, BJP national president JP Nadda, Union Minister Nitin Gadkari, Maharashtra CM Eknath Shinde, UP CM Yogi Adityanath and other CMs, Deputy CMs, Union Ministers, NDA leaders present at the swearing-in ceremony of Haryana CM-designate Nayab… pic.twitter.com/evktPWkU7p— ANI (@ANI) October 17, 2024 హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చండీగఢ్ చేరుకున్నారు.#WATCH | Union Minister and BJP national president JP Nadda arrives in Chandigarh to attend the swearing-in ceremony of Haryana CM-designate Nayab Singh Saini pic.twitter.com/zTkoc24GC7— ANI (@ANI) October 17, 2024 పంచకులకు బీజేపీ, ఎన్డీయే పాలిత సీఎంలు చేరుకుంటున్నారు.ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అగ్రనేతలు హాజరుకానున్నారు. సైనీ రెండోసారి సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక.. బుధవారం పంచకులలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సైనీ.. బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.#WATCH | Panchkula: Haryana CM-designate Nayab Singh Saini says, "CMs, Deputy CMs and senior leaders of NDA will participate in the swearing-in ceremony today. After that, there will be a meeting of NDA leaders." pic.twitter.com/uSebe32S6s— ANI (@ANI) October 17, 2024 ఈనెల 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలు నెగ్గి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలన్నీ అంచనా వేసిన కాంగ్రెస్ 37 స్థానాల వద్దే నిలిచిపోయింది.Haryana CM-designate Nayab Saini offers prayers at Valmiki Temple, says double engine government will take state forward at fast paceRea @ANI story | https://t.co/Uidj8lvTvK#Haryana #NayabSaini #BJP #NDA pic.twitter.com/nUlUyWdSCh— ANI Digital (@ani_digital) October 17, 2024 -
పంట వ్యర్థాల దహనంపై సుప్రీం కన్నెర్ర
న్యూఢిల్లీ: శీతాకాలంలో దేశ రాజధానిని వాయకాలుష్య కోరల్లోకి నెట్టేస్తున్న పంట వ్యర్థాల దహనం ఘటనలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తమ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టకుండా అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైన పంజాబ్, హరియాణా ప్రభుత్వాలకు కోర్టు తిట్ల తలంటుపోసింది. వ్యర్థాలను తగలబెట్టిన వారికి నామామాత్రపు జరిమానాలు వేస్తూ వదిలేస్తున్న ప్రభుత్వాల తీరును ఎండగట్టింది. ఇలాంటి నిర్లక్ష్య ధోరణిపై అక్టోబర్ 23వ తేదీన తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కోర్టు బుధవారం సమన్లు జారీచేసింది. విధి నిర్వహణలో విఫలమైన ఆయా ప్రభుత్వాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాయు నాణ్యతా నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం)ను కోర్టు ఆదేశించింది. సంబంధిత కేసును సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాహ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ల ధర్మాసనం బుధవారం విచారించింది. దహనాలను నివారించేందుకు 2021 జూన్లో నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) ప్రాంతంలో అమలుచేయాల్సిన సీఏక్యూఎం నిబంధనలను గాలికొదిలేసిన ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఇదేం రాజకీయ అంశం కాదుగా: ‘‘తగలబెట్టడం వల్ల శీతాకాలంలో ఢిల్లీ మొత్తం పొగచూరుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులపై అధికారగణం ఒత్తిడి ఉంటే వారికీ మేం సమన్లు జారీచేస్తాం. రాష్ట్రాల వైఖరి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. పంజాబ్ ప్రభుత్వం గత మూడేళ్లలో నిబంధనలను అతిక్రమించిన వారిలో ఒక్కరిపై కూడా కేసులు నమోదుచేసి దర్యాప్తు చేపట్టలేదు. తప్పుచేసిన వారిని విచారించేందుకు ఎందుకంత భయపడుతున్నారు?. ఇదేం రాజకీయ అంశం కాదు. కమిషన్ నిబంధనలను ఖచి్చతంగా పాటించాల్సిందే. ఇందులో రాజకీయాలకు తావులేదు. మీరే నియమాలను ధిక్కరిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న రైతులను ప్రోత్సహిస్తున్నారు. నామామాత్రపు జరిమానాలు వేసి వదిలేస్తున్నారు. పంటభూముల్లో ఎక్కడెక్కడ పంటవ్యర్థాలను తగలబెడుతున్నారో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) మీకు లొకేషన్ పంపుతోంది. మీరే అది ఎక్కడుందో దొరకట్లేదని కుంటి సాకులు చెబుతున్నారు’’అని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి: పంజాబ్ కోర్టు ఎదుట పంజాబ్ తరఫున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గురీ్మందర్ సింగ్ వాదించారు. ‘‘పొలాల్లో వ్యర్థాలను కాలి్చన ఘటనలపై అధికారులు నమోదుచేసిన రెవిన్యూ రికార్డులు తప్పులతడకగా ఉంటున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం చాలా కష్టమవుతోంది. ఆదేశాలకు, వాస్తవ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి’’అని చెప్పారు. కేంద్రప్రభుత్వానికీ చీవాట్లు ‘‘కేంద్రప్రభుత్వం వాయు నాణ్యతా నిర్వహణ కమిషన్ను కోరలు పీకిన పాములా మార్చేసింది. ఆదేశాలు ఇవ్వడం తప్ప వాటిని అమలుచేసే బాధ్యత, సర్వాధికారాలు దానికి అప్పజెప్పలేదు. వాయుకాలుష్య సంబంధ నిపుణులను సీఏక్యూఎంలో ఎంపికచేయలేదు. సీఏక్యూఎం సభ్యుల విద్యఅర్హతలు అద్భుతంగా ఉన్నాయిగానీ అవి గాలినాణ్యత రంగానికి ఎందుకూ పనికిరావు’అని వ్యాఖ్యానించింది. దీనిపై కేంద్రప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి వాదించారు. సభ్యుల్లో ఒకరు గతంలో మధ్యప్రదేశ్ కాలుష్యనియంత్రణ మండలికి ఆరేళ్లు చైర్మన్గా ఉన్నారని గుర్తుచేశారు. ‘‘అక్కడ సారథిగా ఉండటమనేది అసలైన అర్హత కాబోదు. కాలుష్య నియంత్రణ మండలి ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా?. వాయుకాలుష్యరంగ నిపుణులతో కమిషన్ను పటిష్టంచేయాలి’అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘ఢిల్లీ ప్రాంతంలో సీఏక్యూఎం చట్టం, 2021 ప్రకారం సంక్రమించిన అధికారాలను ఉపయోగించటంలో సీఏక్యూఎం పూర్తిగా విఫలమైంది. దహనం ఘటనలను యద్దప్రాతిపదికన అడ్డుకోవాల్సిన బాధ్యత మీదే’అని కమిషన్పై కోర్టు ఆగ్రహం వెలిబుచ్చింది. -
హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో క్షీణిస్తున్న వాయు కాలుష్యం కేసులో పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్ధాల దహనం సమస్యను పరిష్కరించేందుకు ఆ రాష్ట్రాలు ఎలాంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది. ఈ మేరకు పంజాబ్, హర్యానా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 23వ తేదీన వ్యక్తిగతంగా హాజరై, పరిస్థితిని వివరించాలని సర్వోన్నత న్యాయస్థానం తమ ఆదేశాల్లో పేర్కొందిఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, అసానుద్దీన్ అమానుల్లా, ఆగస్టిన్ జార్జ్ మాషిస్లతో కూడిన ధర్మాసనం దేశాలు ఇచ్చింది. కాలుష్య నిరోధక చట్టాలను ఉల్లంఘించిన వ్యక్తులను విచారించాలంటూ జూన్ 2021న తాము జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని రెండు రాష్ట్రాలపై మండిపింది. తమ ఉత్తర్వులను పాటించకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తుందని హె చ్చరించిందికాగా దేశ రాజధాని దిల్లీలో ప్రతీ శీతాకాలం గాలి నాణ్యత దారుణంగా పడిపోతూ ఉంటుంది. దీనికి పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాల్లో పంట వ్యర్థాల దహనమే ప్రధాన కారణంగా మారుతోంది. దీనిపై కొంతకాలంగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.అనేకసార్లు చట్టాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం తనను తాను ‘నిస్సహాయతగా’ ప్రకటించుకోవాలని కోర్టు చీవాట్లు పెట్టింది. ‘ఇక మేము ఏం చేయలేము... మేము నిస్సహాయులమని వారిని వారే ప్రకటించుకోనివ్వండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే పంజాబ్, హర్యానా రెండూ గత మూడు సంవత్సరాలుగా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై, ముఖ్యంగా పంట వ్యర్థాలను కాల్చే రైతులపై చర్యలు తీసుకోలేదని, కేవలం నామమాత్రపు జరిమానాలు మాత్రమే విధించాయని కోర్టు పేర్కొంది.ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో వాయు న్యాణ్యతను పర్యవేక్షించి, నియంత్రించాల్సిన కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ను కూడా తీవ్రంగా విరుచుకుపడింది. పంట వ్యర్ధాల కాల్చివేతను నియంత్రించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారని సీఏక్యూఎంను సుప్రీం అడిగింది. ఇదేమీ రాజకీయ అంశం కాదని పేర్కొంది. ఉల్లంఘనల కట్టడిలో విఫలమైనందుకు గానూ పంజాబ్, హరియాణా ప్రభుత్వ అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. -
17న హర్యానా సీఎం ప్రమాణ స్వీకారం
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అమోఘ విజయం సాధించిన బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించింది. అక్టోబర్ 17న నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రులతో గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణం చేయించనున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం హర్యానాలోని పంచకుల సెక్టార్ 5లోని పరేడ్ గ్రౌండ్లో గురువారం ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. బీజేపీ నేత నయాబ్ సింగ్ సైనీ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. అక్టోబరు 17న పంచకులలో సీఎం, మంత్రి మండలి ప్రమాణస్వీకారం చేసేందుకు ప్రధాని ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు.త్వరలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశం జరుగుతుందని, అందులో శాసనసభా పక్ష నేతను ఎన్నుకుంటారని తెలుస్తోంది. నయాబ్ సింగ్ సైనీని ఎమ్మెల్యేలు అధికారికంగా తమ నేతగా ఎన్నుకోనున్నారని సమాచారం. తాము మళ్లీ అధికారంలోకి వస్తే నయాబ్ సింగ్ సైనీ ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించింది.ఇటీవల నయాబ్ సింగ్ సైనీ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా బీజేపీ సీనియర్ నేతలను కలుసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 37 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. #WATCH | Union Minister & former Haryana CM Manohar Lal Khattar says, "We have received the nod of the PM that on October 17, in Panchkula, the CM and council of ministers will take oath." pic.twitter.com/SLxvKGPWSq— ANI (@ANI) October 12, 2024ఇది కూడా చదవండి: ‘హిందువులు ఎక్కడున్నా ఐక్యంగా మెలగాలి’ -
హర్యానా ఫలితాలు: కాంగ్రెస్ నిజ నిర్ధరణ కమిటీ ఏర్పాటు!
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నిజ నిర్ధరణ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. హర్యానాలో ఊహించని ఫలితాలు రావడంతో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్గాంధీ, మల్లికార్జున ఖర్గే, అశోక్ గహ్లోత్ తదితరులు బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిజ నిర్ధరణ కమిటీ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి కాంగ్రెస్ నేతలు వచ్చినట్లు సమాచారం.Congress will form a fact-finding committee for poll loss in Haryana: Sources— ANI (@ANI) October 10, 2024 సమీక్ష అనంతరం.. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసీసీ అబ్జర్వర్, కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ మీడియాతో మాట్లాడారు.‘‘ మేము హర్యానా ఎన్నికల ఫలితాలపై సమీక్షా సమావేశం నిర్వహించాం. ఎన్నికల పోల్ ఫలితాలు చాలా అనూహ్యమైనవి. ఎగ్జిట్ పోల్స్, వాస్తవ ఫలితాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది.ఈ వ్యవహారంపై మేము ఏం చేయాలో నిర్ణయించుకున్నాం.దాని ప్రకారమే ముందుకు వెళ్తాం’’ అని అన్నారు.#WATCH | Delhi | AICC Observer for Haryana assembly elections, Congress leader Ajay Maken says, " We held a review meeting on HAryana election results. Poll results were unprecedented. There was a lot of difference between exit polls and actual results. We have decided what we… pic.twitter.com/bvYa34TZbD— ANI (@ANI) October 10, 2024 హర్యానా ఎన్నికలక ఏఐసీసీ సీనియర్ పరిశీలకుడు, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు.‘‘ మేము హర్యాలో పొందిన ఓటమిని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రజలు అభిప్రాయ పడినట్లు పలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అందుకే ఈ వ్యవహారంలో పూర్తిగా పరిశీలన జరపాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.#WATCH | Delhi | AICC senior observer for Haryana polls, Congress leader Ashok Gehlot says, "We are taking this loss very seriously. The exit polls, the public in one voice was saying that Congress would form govt (in Haryana). We need to go to the root of this..." pic.twitter.com/CPOncfICCy— ANI (@ANI) October 10, 2024ప్రతికూల ఫలితాల్చిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పద్ధతి, ఈవీఎంల పనితీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. కొన్ని జిల్లాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. ఇక.. హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అద్భుతమైన విజయం సాధించింది. కాంగ్రెస్ ఆశలు ఆవిరి చేస్తూ 90 అసెంబ్లీ స్థానాలకు గానూ 48 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 37 స్థానాల్లో గెలుపొందింది. 1966లో రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి బీజేపీ ఇన్ని సీట్లు సాధించడం ఇదే తొలిసారి. -
సరికొత్త అధ్యాయమయ్యేనా?!
అక్టోబర్ 8 నాటి ఎన్నికల ఫలితాలు కేంద్రంలోని అధికార ఎన్డీఏ కూటమికీ, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికీ సమాన స్కోర్లు అందించాయి. హర్యానాలో బీజేపీ, జమ్ము–కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) – కాంగ్రెస్ కూటమి విజయం సాధించడంతో లెక్క సమం అయింది. అయితే, ఈ ఫలితాల అసలు ప్రభావం ఈ అంకెల లెక్కకు మించినది. అన్ని అంచనాలనూ తలకిందులు చేస్తూ... హర్యానాలో వరుసగా మూడోసారి విజయంతో బీజేపీ రికార్డ్ సృష్టించడం ఒక ఎత్తయితే, జమ్ము–కశ్మీ ర్లో దాదాపు ఆరేళ్ళ పైచిలుకు తర్వాత మళ్ళీ ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కొలువు తీరనుండడం మరో ఎత్తు. కశ్మీర్ ఎన్నికల ఫలితాలు అనేక కారణాల రీత్యా అత్యంత కీలకమైనవి. వాటి ప్రకంపనలు, ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కావు. లెఫ్టినెంట్ గవర్నర్కు ప్రాధాన్యమిచ్చి, శాసనవ్యవస్థ అధికారానికి రెక్కలు కత్తిరించిన పరిస్థితుల్లో కశ్మీర్లో ప్రభుత్వాన్ని నడపడం కత్తి మీద సాము కానుంది. అదే సమయంలో రాష్ట్రహోదాను పునరుద్ధరించాలన్న ప్రజాకాంక్ష అక్కడి ఎన్నికల ఫలితాల్లోనూ ప్రతిఫలించడంతో ఎన్సీ కూటమి ఆ దిశగా కృషి చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర హోదాపై ఎన్నికల వేళ ఇచ్చిన హామీని కేంద్ర పెద్దలు, బీజేపీ అధినాయకులు నిలబెట్టుకుంటారా, లేక తమ పార్టీ అధికారంలోకి రాలేదు గనక ‘అంతా తూbŒ ’ అనేస్తారా అన్నది చర్చనీయాంశమైంది. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత, రాష్ట్రాన్ని జమ్ము – కశ్మీర్, లద్దాఖ్ అంటూ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జరిగిన తొట్టతొలి ఎన్నికలు ఇవే. ఆసక్తిగా చూస్తుండగా, పోటాపోటీగా, అదే సమయంలో శాంతియుతంగా ఈ ఎన్నికలు సాగడం విశేషం. ఇటీవలి లోక్సభ ఎన్నికల కన్నా 5 శాతం పైచిలుకు ఎక్కువగా, పెద్దయెత్తున 63.9 శాతం వరకు ఓటింగ్ జరగడం గమనార్హం. అంటే, ఎన్నికల ప్రజాస్వామ్యం వైపు ప్రజల మొగ్గు సుస్పష్టం. జనమిచ్చిన మెజారిటీతో కశ్మీర్లో ఇక ఎన్సీ – కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కొలువు తీరనుంది. అతి పెద్ద పార్టీగా అవతరించిన ఎన్సీ పక్షాన ఒమర్ అబ్దుల్లా సీఎం కానున్నారు. ఇలా కశ్మీర్లో ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వం తిరిగి రావడం ఒక శుభసూచన. ఎన్నికైన సర్కారుండడంతో స్థానిక ప్రజలు తమ కష్టనష్టాల పరిష్కారానికై ప్రజాప్రతినిధుల్ని ఆశ్రయించే వీలు చిక్కింది. అతివాద బీజేపీని ద్వితీయ స్థానానికే పరిమితం చేసి, మితవాద దృక్పథమున్న ఎన్సీకి పట్టం కట్టడం ద్వారా ప్రజాపాలనకై తాము తహతహలాడుతున్నట్టు కశ్మీరీలు చెప్పకనే చెప్పారు. ఒమర్ తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్సీ – కాంగ్రెస్ కూటమి కశ్మీర్ లోయ వరకు మొత్తం 47 సీట్లలో 42 స్థానాలను గెలవడం విశేషం. ముస్లిమ్ జనాభా అధికంగా ఉండే లోయలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల స్థానిక ప్రజల వ్యతిరేకతకు అది అద్దం పడుతోంది. ఇక లోయలో ఖాతా తెరవలేకపోయినా, హిందువులు ఎక్కువైన జమ్ములో మాత్రం పోటీ చేసిన 43 సీట్లలో 29 గెలిచి, బీజేపీ తన బలం నిరూపించుకుంది. కాంగ్రెస్ మొత్తం 6 సీట్లలో విజయంతో మూడో స్థానంలో నిలిచింది. మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ 3 సీట్లు, ‘ఇంజనీర్’ రషీద్ సారథ్యంలోని వేర్పాటువాద అవామీ ఇత్తెహాద్ పార్టీ ఒక సీటే గెలిచి, బరిలో చతికిలబడ్డాయి. ఒకప్పుడు ఉమ్మడి కశ్మీర్కు సీఎంగా పనిచేసిన ఒమర్ ఇప్పుడు లద్దాఖ్ను విడగొట్టిన తర్వాత ఏర్పడ్డ విభజిత కశ్మీర్కు తొలి సీఎం. కానీ, ప్రభుత్వాన్ని నడపడం సులభం కాదు. సవాళ్ళు తప్పవు. ఆ మాట అంగీకరిస్తూనే, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు పెట్టుకుంటామనీ, అదే సమయంలో రద్దయిన ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 370 పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూనే ఉంటామనీ ఒమర్ స్పష్టం చేశారు. అది ఆయన అనివార్యత, లోయ ప్రజల ఆకాంక్ష. అయితే అంతకన్నా ముఖ్యం... జనం వర్గాలుగా చీలి, ఓటేసిన నేపథ్యంలో జమ్మూను వేరుగా చూడకుండా కలుపుకొని పోతూ, అక్కడి ప్రజాప్రతినిధులకు క్యాబినెట్లో పెద్దపీట వేయడం! ఆ సంగతి ఒమర్కూ తెలుసు. జమ్ముతో పోలిస్తే కశ్మీర్ లోయలోనే ఎక్కువ స్థానాలొచ్చినా రెండు ప్రాంతాలూ తమకు సమానమే ననీ, అందరి ప్రభుత్వంగా ప్రాంతాల మధ్య అంతరాన్ని తొలగిస్తామనీ ఆయన ప్రకటించారు.ఆర్టికల్ 370 పాత చరిత్ర, తప్పొప్పుల మాట అటుంచితే, అంత కన్నా ముఖ్యమైనది జమ్ము – కశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం! ఎందుకంటే, కేంద్రపాలిత ప్రాంతమయ్యే సరికి 370 రద్దుకు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నన్ని అధికారాలు ఉండవు. చివరకు పోలీసులు సైతం కేంద్రం కనుసన్నల్లోనే ఉంటారు. ఎన్నికలు పూర్తయి, ప్రజాప్రభుత్వం వచ్చింది గనక, తక్షణమే రాష్ట్రహోదా దిశగా అడుగులేయాలి. గత డిసెంబర్లో సుప్రీమ్కోర్ట్ సైతం సత్వరమే పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని చెప్పిందన్నది గమనార్హం. అన్ని రాజకీయ పక్షాలూ కోరు తున్నట్టు ఆ విషయంలో కేంద్రం తన హామీని నిలబెట్టుకోవాలి. కశ్మీర్లో సైతం అన్ని రాష్ట్ర ప్రభు త్వాల తరహాలోనే కొత్త సర్కార్ పని చేసే వీలు కల్పించాలి. కశ్మీర్కి ప్రత్యేక భౌగోళిక, సాంస్కృతిక చరిత్ర ఉన్న మాట నిజమే కానీ, దాన్ని గుర్తిస్తూనే ఆ ప్రాంతం మిగతా దేశంతో కలసి అడుగులు వేసేలా కృషి సాగాలి. యువతరంలో నిరుద్యోగం దేశంలోనే అధికంగా ఉన్న ఆ ప్రాంత సామాజిక, ఆర్థిక పురోగతి అందుకు కీలకం. అలాగే గత అయిదేళ్ళలో స్థానిక ఆకాంక్షలకు భిన్నంగా తీసుకున్న మైనింగ్, భూసేకరణ లాంటి విధానాల పునఃసమీక్ష అవసరం. లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్రం సహకరిస్తేనే అది సాధ్యం. లేదంటే, ఢిల్లీలో ఆప్ సర్కార్ తరహా కథే కశ్మీర్లో పునరావృతమవుతుంది. ఎన్నికలు జరిపి కూడా ప్రజాతీర్పును తోసిపుచ్చినట్టే అవుతుంది. పైగా, సరిహద్దులో శత్రు వులు పొంచి ఉండే సున్నితమైన ప్రాంతంలో అలాంటి రాజకీయ క్రీడలు ప్రమాదకరం. -
విద్వేషాల ఫ్యాక్టరీ కాంగ్రెస్
నాగపూర్: దేశంలో కాంగ్రెస్తోపాటు అర్బన్ నక్సలైట్ల విద్వేషపూరిత కుట్రలను ప్రజలు ఎంతమాత్రం సహించడం లేదని, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అందుకు ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కుట్రలకు బలి కావాలని ప్రజలు కోరుకోవడం లేదన్నారు. హరియాణాలో బీజేపీ విజయం దేశ ప్రజల మూడ్ను ప్రతిబింబిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ బాధ్యత లేని పార్టీ, అది విద్వేషాలను వ్యాప్తి చేసే ఫ్యాక్టరీ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందువుల మధ్య విభజన తీసుకురావాలన్నదే కాంగ్రెస్ ప్రయత్నమని ఆరోపించారు. దేశంలో భిన్నవర్గాల మధ్య చిచ్చు పెడుతోందని కాంగ్రెస్పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ బుధవారం మహారాష్ట్రలో రూ.7,600 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. 10 నూతన మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మహారాష్ట్రలో విపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి అధికారం కోసం రాష్ట్రాన్ని బలహీనపర్చాలని చూస్తోందని విమర్శించారు. బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన అధికార మహాయుతి కూటమి రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేయడానికి అంకితభావంతో కృషి చేస్తోందని ప్రశంసించారు. రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని, ఇలాంటి పరిణామం గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో కేవలం అవినీతి అక్రమాల్లోనే వేగం కనిపించిందని ఎద్దేవా చేశారు హరియాణాలో కాంగ్రెస్కు గుణపాఠం విభజన రాజకీయాలు చేస్తూ స్వలాభం కోసం ఓటర్లను తప్పుదోవ పటిస్తున్న కాంగ్రెస్ పట్ల దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ముస్లిం వర్గంలో భయోత్పాతం సృష్టించి, వారిని ఓటుబ్యాంక్గా మార్చుకోవడానికి కాంగ్రెస్ ప్రయతి్నస్తోందని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం హిందువులను విభజించడమే లక్ష్యంగా కుల రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. హరియాణాలో చరిత్రాత్మక విజయం సాధించామని, మహారాష్ట్రలోనూ అంతకంటే పెద్ద విజయం సాధించబోతున్నామని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తంచేశారు. ముస్లిం కులాలపై మాట్లాడరా? ముస్లిం వర్గంలోనూ ఎన్నో కులాలు ఉన్నాయని ఇప్పటిదాకా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా చెప్పలేదని ప్రధానమంత్రి మండిపడ్డారు. ముస్లిం కులాల ప్రస్తావన వచి్చనప్పుడల్లా కాంగ్రెస్ నేతలు నోటికి తాళం వేసుకుంటున్నారని విమర్శించారు. హిందువుల విషయంలో మాత్రం కులం కోణంలో మాట్లాడుతుంటారని ధ్వజమెత్తారు. హిందువుల్లో ఒక కులంపైకి మరో కులాన్ని ఉసిగొల్పడమే కాంగ్రెస్ విధానమని ఆక్షేపించారు. హిందువులు ఎంతగా చీలిపోతే రాజకీయంగా అంత లాభమని ఆ పార్టీ భావిస్తోందన్నారు. హిందువుల మధ్య నిప్పు పెట్టి చలి కాచుకోవాలన్నదే కాంగ్రెస్ ఆలోచన అని నిప్పులు చెరిగారు. -
బీజేపీ గెలుపు కాదు.. కాంగ్రెస్ ఓటమి: ఆప్ సెటైర్లు
ఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ను తలకిందులు చేస్తూ.. అనూహ్యంగా బీజేపీ హ్యాట్రిక్ గెలుపు సొంతం చేసుకుంది. అయితే.. హర్యానా ఫలితాలపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సెటైర్లు వేశారు. హర్యానాలో బీజేపీ గెలుపును అంగీకరించలేనని అన్నారు. బీజేపీ విజయం అనటం కంటే.. కాంగ్రెస్ ఓటమే అధికమని అన్నారు. అధికార బీజేపీ పార్టీకి 39 శాతం ఓట్ల వస్తే.. 61 శాతం ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయని గుర్తు చేశారు.‘‘ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ బీజేపీకి వస్తే నేను ఆ పార్టీ విజయాన్ని అంగీకరించేవాడిని. కానీ, అలా జరగలేదు. హర్యానాలో ఓట్లు బీజేపీకి గెలుపు కోసం పడలేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వచ్చాయి. 39 శాతం ఓట్లు బీజేపీకి పడ్డాయి. అదే బీజేపీకి 61 శాతం వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారు. ఇది బీజేపీ గెలుపు కాదు.. కాంగ్రెస్ ఓటమి’’ అని అన్నారు. మరోవైపు.. జమ్ము కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్తో కలిసి కాంగ్రెస్ ఎన్నికల్లో కూటమిగా బరిలో దిగిందని, అందుకే బీజేపీని ఓడించగలిగిందని అన్నారు. ‘‘ జమ్ము కశ్మీర్లో ఇండియా కూటమి ఒక యూనిట్గా పోరాటం చేసింది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసి కూటమిగా బరిలో దిగటంతో బీజేపీ ఓడిపోయింది. కానీ, హర్యానాలో దురదృష్టవశాత్తు.. ఇండియా కూటమి పార్టీలు ఒంటరిగా బరిలో దిగటంతో ఫలితం కాంగ్రెస్కు వ్యతిరేకంగా వచ్చింది’’ అని అన్నారు.చదవండి: బీజేపీలో చేరిన కేరళ తొలి మహిళా ఐపీఎస్ -
పేపర్ బ్యాలెట్ వైపు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది
-
హర్యానా ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ కీలక ప్రకటన
-
హర్యానాలో ఆసక్తి రేపుతున్న జిలేబి పాలిటిక్స్
-
ఈవీఎం స్కాం బయటకు రాకుండ చంద్రబాబు వేసిన స్కెచ్ ఇది..
-
‘ఇలా ఆంధ్రా అంతా ఈవీఎంల ట్యాంపరింగ్’
ఎగ్జిట్పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ హర్యానా ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించగా.. కాంగ్రెస్ భంగపడింది. అయితే ఈ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. హర్యానా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో .. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై విజయసాయిరెడ్డి.. సీఎం చంద్రబాబుపై సెటైర్లు చేశారు. ‘ప్రపంచ బ్యాంకు జీతగాడు..చంద్రబాబు మోసగాడు’ అన్న కమ్యూనిస్టు పార్టీల పాత పాట గుర్తుకొస్తుందని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో విజయసాయిరెడ్డి ఇంకా ఏం అన్నారంటే?హర్యానా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో .......ఆంధ్రఎన్నికలకు సంబంధించి ........."ప్రపంచ బ్యాంకు జీతగాడు...చంద్రబాబు మోసగాడు"......అన్న కమ్యూనిస్టుపార్టీల పాత పాట గుర్తుకొస్తుంది. ~ఎలెక్షన్ కమిషన్ 3 నెలలు తర్వాత "ఫార్మ్ 20" వెబ్ సైట్ లో పెట్టింది . పోలింగ్ బూత్ వారీగా ఏ పార్టీకి…— Vijayasai Reddy V (@VSReddy_MP) October 9, 2024 ‘హర్యానా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో .. ఆంధ్రఎన్నికలకు సంబంధించి ..‘ప్రపంచ బ్యాంకు జీతగాడు..చంద్రబాబు మోసగాడు’ అన్న కమ్యూనిస్టుపార్టీల పాత పాట గుర్తుకొస్తుంది. ఎలెక్షన్ కమిషన్ 3 నెలలు తర్వాత ‘ఫార్మ్ 20’ వెబ్సైట్లో పెట్టింది . పోలింగ్ బూత్ వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో చూసుకోవచ్చు .ఎన్నికలు ఫలితాలు వెలువతున్నప్పుడు ఆ తర్వాత మొదటి రెండు వారాలు ఎవరూ కోర్టుకి వెళ్లకుండా ప్రజల్లో చర్చ జరగకుండా టీడీపీ గూండాలు అరాచకం చేశారు. ఫారం 20 వివరాలు బయటకి రాగానే లడ్డు వ్యవహారం వాళ్ళ కుట్రలో భాగంగా పక్కా స్కెచ్తో మొదలుపెట్టారు. చంద్రబాబుకు నిజానిజాలతో పనిలేదు. ఇది నెయ్యికోసమో భగవంతుడి కోసమో మొదలెట్టింది కాదు. ఈవీఎం మోసాలని కప్పిపెట్టటానికి మొదలెట్టిన అరాచకం. చంద్రబాబు సరిగ్గా గుజరాత్ వెళ్లి వచ్చిన 6 రోజుల తర్వాత కుట్రలో భాగంగానే ఈ తప్పుడు రిపోర్ట్ని ముందుగా గుజరాత్ నుండి తెప్పించి పెట్టుకుని టీటీడీకి పాలకమండలి వేయకుండా తాత్సారం చేస్తూ వచ్చాడు.ప్రజలెవ్వరూ..బూత్ వారీ లెక్కలు గురించి మాట్లాడుకోకుండా లడ్డు దీక్షలు, వగైరా..వగైరా ..ఇదీ స్థూలంగా జరుగుతున్న కుట్ర .. ఉదాహరణకు హిందూపురం ఒక వార్డులో వచ్చిన ఓట్లు ..( ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పెట్టారు ) అసెంబ్లీ -- వైఎస్సార్సీపీ - 1టీడీపీ - 95బీఎస్పీ - 5 కాంగ్రెస్ - 464 అదే వార్డులో పార్లమెంట్ వైస్సార్సీపీ - 472 కాంగ్రెస్ - 1 టీడీపీ - 8 బీఎస్పీ - 83 ఇది సాధ్యమా ?ఇలా ఆంధ్రా అంతా ఈవీఎంల ట్యాంపరింగే దేశం మొత్తం మీద మొదటి నాలుగు దశల పోలింగులో బీజేపీకి ఎదురుగాలి వీచిందని స్పష్టంగా అర్థమైంది . రిజల్ట్స్ కూడా అలాగే వచ్చాయి . కానీ అయిదు ఆరు దశలలో జరిగిన రాష్ట్రాలలో ముఖ్యంగా అసెంబ్లీకి పార్లమెంట్ కి కలిపి జరిగిన ఆంధ్రాలో ఈవీఎంలు (ట్యాంపరింగ్) మోసం చేశారు.ఇది చంద్రబాబు, లోకేష్, హరిప్రసాద్, టెర్రాసొఫ్ట్ మరి కొంతమంది కలిసి చేసిన కుట్ర. ఎన్నికల ముందు చంద్రబాబు జర్మనీ, దుబాయ్, లోకేష్ ఇటలీ, జర్మనీ, దుబాయ్ ప్రయాణాలు ఈ ఈవీఎంల టాంపరింగ్ మరియు డబ్బులు బదిలీ కోసమే అన్నది సుస్పష్టం.చంద్రబాబుకు,లోకేష్కు హిందూమతంపై కానీ, భగవంతుడిపై కానీ నమ్మకంలేదు. వారి కులమే ఒక మతం అని నమ్మే వ్యక్తులు. చంద్రబాబు ఈ మోసాలు వెన్నతో పెట్టిన విద్య. అందరూ కలిసి ఈ అరాచకానికి తెరదీశారు ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూ ఉంది. రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది ఈ దోపిడీదొంగల టీడీపీ’ అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు. -
హ్యాట్రిక్ పరాజయం.. రాహులో..రాహులా..!
-
ఓడినా.. ఆ విషయంలో సత్తా చాటిన హర్యానా కాంగ్రెస్
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ల ఓట్ల శాతం దాదాపు సమానంగా ఉంది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ తగిన మెజారిటీ సాధించింది.హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 39.94 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్కు 39.09 శాతం ఓట్లు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి రెండు పార్టీలకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయితే కాంగ్రెస్కు ఈసారి 11 శాతం ఓటింగ్ పెరిగింది. గతంతో పోలిస్తే బీజేపీకి ఓట్ల శాతంలో తగ్గుదల కనిపించింది. దీనిని గమనిస్తే ఓట్ల శాతం విషయంలో కాంగ్రెస్ మరింత మెరుగుపడింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకు గాను 40 స్థానాలను బీజేపీ గెలుచుకోగా, ఆ పార్టీ ఓట్ల శాతం 36.49 శాతంగా ఉంది. అదే సమయంలో 31 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్కు 28.08 శాతం ఓట్లు వచ్చాయి.2024 అసెంబ్లీ ఎన్నికల్లో 48 సీట్లు గెలుచుకోవడం ద్వారా బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుని, వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యింది. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోని వివరాల ప్రకారం కాంగ్రెస్ 37 సీట్లు గెలుచుకుంది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డి) రెండు స్థానాల్లో గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రెండూ ఎన్నికల్లో విజయానికి దూరమయ్యాయి. రెండు సీట్లు గెలుచుకున్న ఐఎన్ఎల్డీ 2019తో పోలిస్తే ఓట్ల శాతాన్ని మెరుగుపరుచుకుంది. ఇది కూడా చదవండి: 32 ఓట్లతో దక్కిన విజయం -
హర్యానా ఎన్నికల్లో ‘డేరా బాబా’ ప్రభావమెంత?
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా మూడోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించింది. సీఎం పదవికి నాయబ్ సింగ్ సైనీ పేరును బీజేపీ ఖరారు చేసింది. ఇదిలాఉండగా డేరా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీమ్కు బెయిల్ మంజూరు చేయడంపై అనేక విమర్శలు తలెత్తాయి. బీజేపీనే డేరా బాబాకు ఎన్నికలకు ముందు పెరోల్ ఇచ్చిందనే ఆరోపణలు వినిపించాయి.జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్కు అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు 20 రోజుల పెరోల్ లభించింది. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో మద్దతు కోసం రామ్రహీమ్కు పెరోల్ ఇచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇటువంటి పరిస్థితుల్లో రామ్రహీమ్ విడుదల ఏ పార్టీకి కలసివచ్చిందనే అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.డేరా మద్దతుదారులున్న 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 15, బీజేపీ 10, ఐఎన్ఎల్డీ రెండు, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు 53.57 శాతం, బీజేపీకి 35.71 శాతం, ఐఎన్ఎల్డీకి 7 శాతం, స్వతంత్రులకు 3.57 శాతం ఓట్లు వచ్చాయి. ఈ పరిణామాలు చూస్తే ఈ 28 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధికంగా ప్రయోజనం పొందింది.మీడియా కథనాల ప్రకారం హర్యానా ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని రామ్రహీమ్ సత్సంగ కార్యక్రమంలో తన అనుచరులను కోరాడు. ప్రతి అనుచరుడు కనీసం ఐదుగురు ఓటర్లను బూత్కు తీసుకురావాలని సత్సంగం సందర్భంగా ఈ సూచించినట్లు పలు వార్తలు వినిపించాయి. డేరా బాబా గతంలో శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్లకు మద్దతును అందించారు. 2007 హర్యానా ఎన్నికలు, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో డేరా బాబా బహిరంగంగా కాంగ్రెస్కు మద్దతు పలికారు. అయితే 2014లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు అందించారు. ఇది కూడా చదవండి: గుండెపోటుతో యూట్యూబర్ కన్నుమూత -
హర్యానాలో బీజేపీ విజయభేరి.. కాబోయే సీఎం ఎవరంటే?
-
హరియాణా శాసనసభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి బీజేపీ జయకేతనం... 90 స్థానాలకు గాను 48 స్థానాల్లో విజయం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
కమలం కమాల్!
హరియాణా. వివాదాస్పద మూడు సాగు చట్టాలపై రైతుల ఉద్యమానికి వేదికగా నిలిచిన రాష్ట్రం. అగ్నివీర్ పథకంతో ఆర్మీలో శాశ్వత నియామక అవకాశాలను కోల్పోతామని యువత తీవ్ర నిరాశంలో నిండిపోయిన రాష్ట్రం. ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ చూపిన దూకుడు, ఆపార్టీ అతి ఆత్మవిశ్వాసాన్ని కళ్లారా చూసిన రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రం పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతనూ కూడా పక్కనబెట్టి మళ్లీ కమలదళానికి అధికార పగ్గాలు అప్పజెప్పిన తీరు ఎగ్జిట్పోల్ సర్వేలనేకాదు రాజకీయ విశ్లేషకులనూ ఆశ్చర్యానికి గురిచేసింది. 1966లో రాష్ట్రంగా ఏర్పడ్డాక హరియాణాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఇదే తొలిసారి. ఏకమైన జాట్ వ్యతిరేక వర్గాలుఎగ్జిట్ పోల్ సర్వేలు సైతం తలకిందులైన ఈ బీజేపీ విజయం వెనుక జాట్యేతర వర్గం ఓటర్లు ఉన్నారని అర్థమవుతోంది. ‘‘జాట్లు కాంగ్రెస్కు ఓటేశారు. అయితే బలమైన జాట్లను ఎదుర్కొనేందుకు జాట్యేతర వర్గాలైన ఓబీసీలు, దళితులు, అగ్రవర్ణాల ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవడంలో బీజేపీ నేతలు సఫలీకృతులయ్యారు. జాట్లు పూర్తిగా ఒక్క కాంగ్రెస్కే ఓటేయకపోవడమూ బీజేపీకి లాభించింది’’ అని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్లో అధ్యయనకారుడు రాహుల్ వర్మ విశ్లేషించారు. బీజేపీ వెంటే అహిర్వాల్దక్షిణ హరియాణాలోని అహిర్వాల్ ప్రాంత ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఉంటారు. 2014, 2019లో బీజేపీ విజయానికి ఈ ప్రాంత ఓటర్ల మద్దతే ప్రధాన కారణం. ఈసారి కూడా అహిర్వాల్ ఓటర్లు బీజేపీ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో ఈసారీ అహిర్వాల్ ప్రాంతంలోని మెజారిటీ సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లోనూ 11 అసెంబ్లీ సెగ్మెంట్లలో 10 చోట్ల బీజేపీ ఘన విజయం సాధించడం గమనార్హం. హరియాణా సైబర్ కేంద్రంగా కీర్తికెక్కిన గురుగ్రామ్ సైతం బీజేపీ వెంటే నిలిచింది. ఫరీదాబాద్సహా చాలా పట్టణ ప్రాంతాల ప్రజలు మొదట్నుంచీ బీజేపీకి వెంటే నడవటం ఆ పార్టీ విజయాన్ని సులభతరం చేసింది.నాయబ్ సింగ్ సైనీ నాయకత్వంకేవలం 210 రోజుల క్రితమే సీఎంగా పగ్గాలు చేపట్టిన 54 ఏళ్ల నయాబ్ సింగ్ సైనీ తన ప్రజాకర్షక పాలనతో ఓటర్లను తన వైపునకు తిప్పుకున్నారు. గెలిస్తే ఈయననే మళ్లీ సీఎంను చేస్తానని బీజేపీ ప్రకటించడంతో ఖట్టర్ నిష్క్రమణ తర్వాత రాష్ట్రంలో పార్టీ అగ్రనేతగా అవతరించారు. హరియణా బీజేపీ మాజీ చీఫ్ అయిన సైనీ కేవలం ‘డమ్మీ సీఎం’ అంటూ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలు తప్పు అని నిరూపించారు.గ్రామపంచాయతీల వ్యయ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.21 లక్షలకు పెంచడం, గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లులో కనీసం చార్జీల రద్దు, ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన సహా పలు అభివృద్ది పథకాలు సైనీ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకాన్నిపెంచాయి. అగ్నివీర్లకు ఆర్మీ నుంచి బయటికొచ్చాక ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి యువతలో సైనీ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి..దాదాపు తొమ్మిదిన్నర ఏళ్ల పాటు సీఎంగా కొనసాగిన ఖట్టర్ పట్ల రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. దీనిని ముందే పసిగట్టిన బీజేపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అకస్మాత్తుగా ఆయనను తప్పించి సైనీని సీఎంను చేసింది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు ఖట్టర్ను పూర్తిగా పక్కనబెట్టింది. రాష్ట్రంలో ఎక్కడా పోస్టర్లలో కూడా ఖట్టర్ ఫొటో వేయలేదు. దీంతో సీఎం, ప్రభుత్వ వ్యతిరేకత చల్లబడిందని చెప్పొచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనబెట్టిన బీజేపీఏకంగా సీఎం ఖట్టర్ను పక్కనబెట్టిన కమలం పార్టీ తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేలపై దృష్టిపెట్టింది. ఏఏ స్థానాల్లో ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందో వారందరికీ టికెట్లు నిరాకరించింది. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులపై ఉన్న వ్యతిరేకతకు పోగొట్ట గలిగింది. దాదాపు 60 కొత్తముఖాలకు టికెట్ ఇచ్చి కొత్త ప్రయోగం చేసింది. రైతులను బుజ్జగించే యత్నం..వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలపై హరియాణా రైతులు ఉద్యమించిన నేపథ్యంలో రైతాంగం ఆగ్రహం పోలింగ్లో బయటపడకుండా ఉండేందుకు ఈ ఏడాది ఆగస్టులో మరో 10 పంటలను జోడించి మొత్తంగా 24 పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్రకటనతో రైతన్నలు ప్రభుత్వానికి అనుకూలంగా మారారని తెలుస్తోంది. రూ.500కే గ్యాస్ సిలిండర్రూ.500కే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఇస్తామని కమలనేతలు హామీ ఇచ్చారు. మహిళలకు నెలకు రూ.2,000 ఆర్థిక సాయం, యువతకు 2 లక్షల ఉద్యోగాలు వంటి వాగ్దానాలకు ఓటర్లు ఆకర్షితులయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హస్తం అస్తవ్యస్తం
హరియాణాలో ఈసారి కాంగ్రెస్ క్లీన్స్వీప్ చేయనుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, తీవ్రంగా నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకత, ఎలాగూ గెలిచేది మేమేనన్న కాంగ్రెస్ నేతల అతి ఆత్మవిశ్వాసం.. వెరసి హస్తం పార్టీని మరోసారి అధికారానికి దూరంచేశాయి. మోదీ–షా ద్వయం రాజకీయ చతురత ధాటికి కాంగ్రెస్ మూడోసారీ ఓటమిని మూటగట్టుకుంది. స్వీయ తప్పిదాలు సైతం కాంగ్రెస్ను విజయానికి ఆమడదూరంలో ఆపేశాయి. కేవలం జాట్ వర్గం పైనే గంపెడాశలు పెట్టుకోవడం, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత భూపీందర్ సింగ్ హూడా అడుగుజాడల్లో నడవడం, కుమారి సెల్జా వంటి దళిత నాయకురాలికి ప్రాధాన్యత తగ్గించడం, అగ్రనేతల మధ్య లోపించిన ఐక్యత వంటి అంశాలు కాంగ్రెస్ను పదేళ్ల తర్వాత అధికారం పీఠంపై కూర్చోనివ్వకుండా చేశాయి.ఏకమైన జాట్ వ్యతిరేక ఓట్లుమొదట్నుంచీ రాష్ట్రంలోని జాట్ ఓట్లనే కాంగ్రెస్ నమ్ముకుంది. జాట్యేతర దళితులు, ఓబీసీలు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారన్న సంకేతాలను కాంగ్రెస్ పసిగట్టలేకపోయింది. ఇది కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణం. బీజేపీ అత్యధిక టికెట్లను ఓబీసీలు, బ్రాహ్మణులకే ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ భూపీందర్ నిర్ణయాలపై ఆధారపడింది. దీన్ని అలుసుగా తీసుకున్న భూపీందర్ కేవలం తన అనుచరగణానికే పెద్దపీట వేశారు. ఎక్కువ మందికి టికెట్లు ఇప్పించుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాలను శాసించే భూపీందర్ పరోక్షంగా పార్టీ ఓటమికి కారణమయ్యారు.గెలుపు గుర్రాలా? కాదా? అనేది చూసుకోకుండా తన అనుచరవర్గానికే అత్యధికంగా పార్టీ టికెట్లు దక్కేలాచేశారు. రాష్ట్రంలో 90 స్థానాలుంటే 72 చోట్ల కాంగ్రెస్ టికెట్ పొందిన వాళ్లు భూపేందర్ మనుషులే. తాను గెలిచి తన వారినీ గెలిపించుకుంటానన్న భూపీందర్ అతివిశ్వాసమే కాంగ్రెస్ పుట్టి ముంచిందని తెలుస్తోంది. కుమారి సెల్జా తన అనుచరుల్లో 9 మందికి టికెట్ దక్కేలా చేశారు. రణ్దీప్ సూర్జేవాలా సైతం తన వారికి టికెట్లు ఇప్పించుకున్నారు. దీంతో గెలుపు గుర్రాలను పక్కనబెట్టిన కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుంది.దూరంగా ఉండిపోయిన సెల్జాబీజేపీకి దగ్గరవుతున్న దళితులను కాంగ్రెస్ వైపునకు తిప్పే సత్తా ఉన్న దళిత నాయకురాలు కుమారి సెల్జా. అయితే ఈమె ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించలేదు. సిర్సా ఎంపీ అయిన సెల్జాను పార్టీ అధిష్టా నమే హరియాణా ఎన్నికల్లో కలగజేసు కోవద్దని సూచించినట్లు సమాచారం. దీని వెనుక భూపీందర్ హస్తముందని వార్తలొచ్చాయి. పార్టీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలోనూ సెల్జా పాల్గొనలేదు. కీలక ప్రచార ఘట్టాల్లోనూ ఆమె జాడ లేదు. ఒకే పార్టీలో వేర్వేరుగా ప్రచారంరాష్ట్ర నేతలంతా కలిసి ఒకే ప్రచార కార్యక్రమం చేస్తే అది ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. అందుకు భిన్నంగా ముఖ్య నేతలు ఎవరికి వారే భిన్న కార్యక్రమాలు చేపట్టి దేనికీ అగ్రతాంబూలం దక్కకుండా చేసుకున్నారు. భూపీందర్ వర్గం విడిగా ‘ఘర్ ఘర్ కాంగ్రెస్’ అంటూ ఇంటింటికీ ప్రచారం మొదలెట్టింది. వీళ్లకు పోటీగా కాంగ్రెస్లోనే సెల్జా, రణ్దీప్ సూర్జేవాలాలు ‘కాంగ్రెస్ సందేశ్’ యాత్రను మొదలెట్టారు. హరియాణా జనాభాలో 26–28 శాతం మంది జాట్లు ఉంటారు. ఇక్కడ 17 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. మెజారిటీ మార్కును చేరుకోవడానికి అవకాశాలను పెంచే ఈ ఎస్సీ స్థానాలపై కాంగ్రెస్ పెద్దగా దృష్టిపెట్టలేదు. దెబ్బకొట్టిన ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులుప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. దీనిని ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు అవరోధంగా తయారయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్తోపాటు ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులకు మళ్లాయి. దీంతో ఎవరికీ సరైన మెజారిటీ రాలేదు. ఇది బీజేపీకి లాభం చేకూర్చింది. చాలా స్థానాల్లో గెలుపు మార్జిన్లు చాలా స్వల్పంగా ఉండటం చూస్తుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బాగా చీలినట్లు అర్థమవుతోంది. బీజేపీకి, కాంగ్రెస్కు మధ్య ఓట్ల తేడా కేవలం 0.85 శాతం కాగా, ఒంటరిగా పోటీ చేసిన ఆప్కు 1.79 శాతం ఓట్లు రావడం గమనార్హం.మరోవైపు దళితుల ఓట్లు పెద్దగా కాంగ్రెస్కు పడలేదు. జననాయక్ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్దళ్, ఆజాద్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు ప్రధానంగా దళితుల ఓట్లపై దృష్టిపెట్టాయి. దీంతో దళితులు కేవలం ఒక్క పార్టీకే ఓటేయకుండా వేర్వేరు పార్టీలకు ఓట్లేయడంతో ఓట్లు చీలాయి. ఇవి పరోక్షంగా బీజేపీకి లాభం చేకూర్చగా కాంగ్రెస్ నష్టపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ జాట్ల ఆధిపత్యం కొనసాగుతుందన్న భావనతో ఇతర కులాలు, వర్గాలు ఉద్దేశపూర్వకంగానే ఒక్క బీజేపీకే ఓటేశాయని రాజకీయ పండితులు చెబుతున్నారు. బరిలో నిల్చొని దాదాపు 10 స్థానాల్లో విజయావకాశాలను కాంగ్రెస్ రెబల్స్ దెబ్బతీశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తెలంగాణలో వైఫల్యంతోనే హరియాణాలో కాంగ్రెస్ ఓటమి
సాక్షి, హైదరాబాద్: ‘‘కర్ణాటకలో ఐదు గ్యారంటీలు, తెలంగాణలో ఆరు గ్యారంటీల పేరిట డొల్ల హామీలతో ప్రజలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్.. హరియాణాలోనూ ఏడు గ్యారంటీల పేరిట మభ్యపెట్టాలని చూసింది. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ప్రదేశ్లలో గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారు. దీనికి హరియాణాలో ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరించడమే నిదర్శనం..’’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సందర్భంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా గ్యారంటీలు ప్రకటిస్తూ వచ్చిన కాంగ్రెస్.. చివరికి బొక్క బోర్లా పడిందని విమర్శించారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డులు చిత్తు కాగితంలా మారాయని, అలవి కాని హామీలతో గద్దెనెక్కాలని భావించిన కాంగ్రె స్కు జనం కర్రు కాల్చి వాత పెట్టారని పేర్కొ న్నారు.తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రజల కు కాంగ్రెస్ గ్యారంటీల డొల్లతనం పూర్తిగా అర్థమైందని.. రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలన వైఫల్యాలే హరియాణాలో ఓటమికి దారితీశాయని విమ ర్శించారు. సోషల్ మీడియా విస్తృతి పెరుగు తున్న ప్రస్తుత సమయంలో ప్రజల నుంచి వాస్తవాలు దాచడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. బీజేపీని ఢీకొట్టే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉంది కాంగ్రెస్తో ముఖాముఖి పోరు ఉన్న రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తోందని.. రాహుల్ బలహీన నాయక త్వం కూడా కాంగ్రెస్ ఓటమికి కారణ మని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీని ఢీకొని నిలువరించే శక్తి కేవలం ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఉందన్నారు. ప్రస్తుత ఫలితాల సరళిని బట్టి 2029లో కేంద్రంలో జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్కు మెజారిటీ సాధ్యం కాదని.. బలమైన ప్రాంతీయ పార్టీలే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. దేశంలో సమాఖ్య స్ఫూర్తిని, సమగ్రతను, సెక్యులరిజాన్ని కాపాడాలని కోరుకునే మేధావులు, ప్రజలంతా ప్రాంతీయ పార్టీలకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్రాజ్, పార్టీ ఫిరాయింపులు, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే వ్యవహారాలు నడుస్తున్నా రాహుల్ గాంధీ చూసీ చూడనట్టు వ్యవహరించిన తీరును దేశం మొత్తం గమనిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డులకు ప్రజాక్షేత్రంలో కాలం చెల్లిందనే విషయాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్ గుర్తుపెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. పండుగ పూట పస్తులు రాష్ట్రంలో కాంగ్రెస్ దండగగా మారి పాలనలో పండుగ పూట కూడా పస్తులు తప్పడం లేదని.. ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఐదారు నెలలుగా వేతనాలు లేవని కేటీఆర్ ఆరోపించారు. పంచాయతీ, మున్సిపల్ కారి్మకులు, ఆస్పత్రుల సిబ్బంది, హాస్టల్ వర్కర్స్, గెస్ట్ లెక్చరర్స్ మొదలుకుని ప్రతీ ప్రభుత్వ శాఖలో వేతనాల్లేక చిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఒకటో తారీఖునే జీతాలు ఇస్తామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందని.. దసరా పండుగ వచి్చనా చిరుద్యోగుల చేతిలో చిల్లిగవ్వ లేదని విమర్శించారు. నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోతే.. చిరుద్యోగుల బతుకు బండి ఎలా సాగుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. -
అనుకున్నదొకటి... అయ్యిందొకటి!
నాలుగు రోజుల క్రితం ఎగ్జిట్పోల్స్ అంచనాలు వచ్చాయి. మంగళవారం కౌంటింగ్ మొదల య్యాక ఉదయం 9 గంటల వేళ తొలి ఫలితాల సరళీ వచ్చింది. కానీ, ఆశ్చర్యకరంగా అంతా మారి పోయింది. హర్యానా, జమ్ము–కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలు, ఆశాభావాలు తలకిందుల య్యాయి. పోటాపోటీతో హంగ్ అవుతుందని బీజేపీ ఆశపడ్డ జమ్ము – కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమి గెలిచింది. హర్యానాలో కాంగ్రెస్దే విజయం అని ఎగ్జిట్పోల్స్ కోడై కూసినచోట అవన్నీ తోసిరాజని విజయంతో బీజేపీ అబ్బురపరిచింది. 1966 హర్యానా ఏర్పాటయ్యాక ఇప్పటి దాకా ఏ పార్టీ సాధించని హ్యాట్రిక్తో రికార్డ్ సృష్టించింది. పార్టీల నుంచి ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకుల దాకా ప్రతి ఒక్కరికీ ఈ ఫలితాలు పాఠాలు నేర్పడం గమనార్హం. ఏ ఎన్నికా చిన్నది కాదనీ, ప్రతిదీ కీలకమేననీ, అతి విశ్వాసం పనికిరాదనీ మరోసారి ఈ ఫలితాలు తేల్చాయి. దశాబ్దం తర్వాత, అదీ 2019 ఆగస్ట్లో ఆర్టికల్ 370 రద్దు చేశాక, జమ్ము–కశ్మీర్ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాక... తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ప్రజాతీర్పు ఆసక్తికరమే. కొన్నేళ్ళుగా ‘నయా కశ్మీర్’గా ఎంతో చేశామని చెప్పుకున్నప్పటికీ, జమ్మూను దాటి కశ్మీర్ లోయలో బీజేపీ తన ప్రభావం చూపలేకపోయింది. దోడా స్థానం గెలిచి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కశ్మీర్లో ఖాతా తెరవడం విశేషం. మరోపక్క హర్యానాలో ‘తిమ్మిని బమ్మిని చేసి బీజేపీ తెచ్చుకున్న గెలుపు’ అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్ ఫలితాల సరళిని చూపిన తీరు, ఈవీఎంల బ్యాటరీల శాతమూ అనుమానాస్పదమన్నది ఆ పార్టీ ఆక్షేపణ, ఆరోపణ. ఆ మధ్య లోక్ సభ ఎన్నికల్లో లానే ఇప్పుడూ ఈసీ ఆ ఆరోపణల్ని బాధ్యతారహితమంటూ కొట్టిపారేసింది. ఆరోపణల్ని పక్కనబెట్టి అసలు జరిగింది ఇప్పటికైనా పరిశీలించుకోవడం అన్ని వర్గాలకూ కీలకం. కశ్మీర్ సంగతి అటుంచి, హర్యానానే తీసుకుంటే... ‘జవాన్... కిసాన్... పహిల్వాన్’ నినాదంతో ముందుకెళ్ళిన కాంగ్రెస్ హర్యానాలో ఆ అంశాలు బీజేపీని మట్టికరిపిస్తాయని భావిస్తూ వచ్చింది. కానీ, జరిగింది వేరు. పదేళ్ళుగా హర్యానాను పాలిస్తున్న బీజేపీ పట్ల అధికారపక్ష వ్యతిరేకత ఒకటికి రెండింతలు ఉన్నప్పటికీ దాని నుంచి ఎందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ లబ్ధి పొందలేకపోయింది. అందుకు కారణాలను ఇప్పటికైనా ఆత్మావలోకనం చేసుకోవాలి. సమైక్య ప్రతిపక్షంగా బీజేపీకి అడ్డుకట్ట వేయాల్సింది పోయి, కాంగ్రెస్ తన బలాన్ని అతిగా అంచనా వేసుకొని భంగపడింది. ఆప్కి హర్యా నాలో చెప్పుకోదగిన స్థాయిలో ఓటు బ్యాంకు ఉందని తెలిసినా, సీట్ల సర్దుబాటు, పొత్తు విషయంలో కాంగ్రెస్ మొండిపట్టుతో పోవడం గట్టి దెబ్బ తీసింది. ఆప్ సీట్ల డిమాండ్ 20 దగ్గర మొదలై, 10 దగ్గరకు వచ్చి ఆగి, చివరకు 5 స్థానాల దగ్గరకు వచ్చి ఆగినా, పొత్తు పొడవనే లేదు. తప్పక గెలిచే 3 సీట్లిచ్చినా చాలు... ‘ఆప్’ ఓకే అంటుందని తెలిసినా, ఆఖరికి రాహుల్ సైతం పొత్తుకే మొగ్గు చూపినా, కాంగ్రెస్ దూతలు పడనివ్వలేదు. చివరకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అధిష్ఠానం జోక్యం చేసుకొని పరాజయానికి బాధ్యులెవరో చూడాలంటూ కుమారి సెల్జా గొంతు విప్పారు. దీన్నిబట్టి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్లో వర్గవిభేదాలకు కొదవ లేదని అర్థమవుతోంది. సీట్ల పంపిణీ వేళ భూపీందర్ సింగ్ హూడా తన వర్గం వారికే ఎక్కువ సీట్లివ్వడం ఇతర సీనియర్ నేతల్లో అసంతృప్తికి దారి తీసింది. ఆ అంతర్గత కుమ్ములాటలు ఆఖరికి మొత్తంగా రాష్ట్రంలో పరాజయానికీ దారి తీశాయన్నది ప్రాథమిక విశ్లేషణ. కాంగ్రెస్ ప్రధానంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సహా జాతీయ అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. స్థానిక అంశాలతో పాటు సూక్ష్మపరిశీలనతో ఎన్నికల మేనేజ్మెంట్పై శ్రద్ధ పెట్టడం, సీఎంనూ, కొన్నిచోట్ల అభ్యర్థులనూ మార్చడం కమలనాధులకు కలిసొచ్చింది. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కనిపించని ఆర్ఎస్ఎస్ ఈసారి ప్రభావం చూపింది. అలాగే, ప్రధాని మోదీ సభలు, మాటలు నాన్ – జాట్ వర్గాలను ఆకర్షించాయని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పూర్తిగా జాట్లు – దళితుల ఓట్బ్యాంక్పైనే అతిగా ఆధారపడి, జాట్లు మినహా మిగతా వర్గాలు, ఓబీసీలు కాషాయఛత్రం కింద ఏకమవుతున్న సంగతి కనిపెట్టలేకపోవడం ఘోర తప్పిదమైంది. కాంగ్రెస్ పక్షాన సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై నెలకొన్న గందరగోళం, గతంలో సాగిన హుడా హయాం పట్ల అసంతృప్తి, ఆయనే మళ్ళీ సీఎం కావచ్చనే అభిప్రాయం ఓటర్లను కాంగ్రెస్ వైపు మొగ్గకుండా ఆపింది. మొత్తంగా రెండు పార్టీల మధ్య ఓట్ల శాతంలో తేడా 1 శాతం కన్నా తక్కువే. అయితే, సీట్ల పరంగా బీజేపీ గణనీయ విజయం సొంతం చేసుకోవడం క్షేత్రస్థాయి వ్యూహ∙ఫలితం. ఎగ్జిట్ పోల్స్లో ఓట్ల శాతం అంచనా కాస్త అటూ ఇటూగా అంతేవున్నా, వచ్చే సీట్ల సంఖ్యపై అతిగా జోస్యం చెప్పడం ఎదురుతన్నింది. వెరసి, ఎగ్జిట్ పోల్స్ కచ్చితత్వాన్ని అనుమానంలోకీ, నిర్వాహకుల్ని ఆత్మపరిశీలనలోకీ నెట్టాయి. ఆప్, కాంగ్రెస్ గనక కలసి పోటీ చేసివుంటే, ఆ రాష్ట్ర ఫలితాలు కచ్చితంగా మరోలా ఉండేవని ఓట్ షేర్ శాతాన్ని బట్టి విశ్లేషణ. కశ్మీర్లో వాస్తవం గుర్తించి, పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఆ పని హర్యానాలో చేయకపోవడమే విడ్డూరం. ఇప్పుడిక రానున్న మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ ఎన్నికలపైకి ఫోకస్ మారనుంది. ఇప్పటికే హర్యానా ఫలితానికి కాంగ్రెస్ను ఆప్ తప్పుబట్టడం మొదలుపెట్టింది. మరి, ఫిబ్రవరిలోగా జరగనున్న ఢిల్లీ ఎన్నికలకైనా ఈ పార్టీలు జత కడతాయో, లేదో చూడాలి. ఏమైనా, తప్పక గెలుస్తారనుకున్న ఎన్నికల్లో సైతం ఆఖరి క్షణంలో కోరి చేతులారా ఓటమి కొని తెచ్చుకోవడం కాంగేయులకు పరిపాటి అయింది. క్షేత్రస్థాయి లోపాల్ని సరిదిద్దక, పోటీకి ముందే గెలుపు ధీమాతో అతిగా వ్యవహరిస్తే ఎవరికైనా ఎదురుదెబ్బలు ఖాయమని గుర్తిస్తే మంచిది. -
ఇది హర్యానా కార్యకర్తల విజయం: ప్రధాని మోదీ
ఢిల్లీ: నవరాత్రి సమయంలో హర్యానాలో బీజేపీ మూడోసారి విజయం సాధించటం శుభసూచకమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా ఢిల్లీ బీజేపీ హెడ్క్వార్టర్స్లో నిర్వహించిన విజయోత్సవ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘హర్యానా విజయం భరత ప్రజాస్వామ్య విజయం. జమ్ము కశ్మీర్లో కాంగ్రెస్-ఎన్సీ కూటమికి అధిక సీట్లు ఇచ్చారు. జమ్ము కశ్మీర్లో గతంతో పోల్చితే బీజేపీకి ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. కాంగ్రెస్-ఎన్సీ కూటమికి నా అభినందనలు. హర్యానాలో ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రతీ ఐదేళ్లకోసారిఓటరు ప్రభుత్వాన్ని మారుస్తారు. కానీ, ఈసారి హర్యానా ప్రజలు బీజేపీ మూడో సారి విజయాన్ని కట్టబెట్టారు. .. హర్యానాలో కమలం మూడోసారి వికసించింది. కార్యకర్తల కృషితోనే హర్యానాలో విజయం సాధించాం. బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడిన చోట ప్రజలు మనకే మద్దతుగా నిలుస్తున్నారు. హర్యానాలో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. అభివృద్ధిని చూసి ప్రజలు హ్యాట్రిక్ విజయం ఇచ్చారు. బలహీన వర్గాలను కాంగ్రెస్ ఓటు బ్యాంక్గా చూస్తోంది. అధికారం తన జన్మహక్కు అని కాంగ్రెస్ అనుకుంటోంది... దేశ వ్యతిరేక రాజకీయాలు సహించబోమని హర్యానా ప్రజలు తేల్చి చెప్పారు. కాంగ్రెస్ కుట్రలను హర్యానా ప్రజలు కనిపట్టారు. కాంగ్రెస్ దేశంలో ప్రమాదకరమైన ఆటను మొదలుపెట్టింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ భగ్గుమంటుందని అంతా అన్నారు. కానీ, మేము జమ్ము కశ్మీర్లో రాజ్యాంగ స్ఫూర్తిని ప్రదర్శించాం. జమ్ము కశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. ..కాంగ్రెస్ పరాన్నజీవి పార్టీగా మారిపోయింది. పరాన్నజీవి అయిన కాంగ్రెస్ తన మిత్రపార్టీలనే నిర్వీర్యం చేస్తుంది. పలువర్గాల ప్రజలను రెచ్చగొట్టింది. కులం పేరుతో విషాన్ని చిమ్ముతోంది. ప్రజలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఈసీ పారదర్శకతనే ప్రశ్నిస్తోంది. మన వ్యవస్థల పారదర్శకతను వేలెత్తి చూపుతోంది. హర్యానాలో క్రీడల అభివృద్ధికి రోడ్ మ్యాప్ రూపొందిస్తాం’’ అని అన్నారు.ప్రధాన మోదీ ప్రసంగం కంటే ముందు కేంద్రమంత్రి జేపీ నడ్డా మాట్లాడారు. ‘‘ ప్రధాని మోదీ నేతృత్వంలో హర్యానాలో ఘన విజయం సాధించాం. జమ్ము కశ్మీర్లో గణనీయమైన ఓట్లు సాధించాం. హర్యానా ప్రజలంతా బీజేపీ వెంటే ఉన్నారు. కాంగ్రెస్ అబద్దాలు ప్రచారం చేసింది. హర్యానా ప్రజలు బీజేపీకి హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టారు. ఈ విజయంలో పార్టీ కార్యకర్తలదే కీలక పాత్ర. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారు. జమ్ము కశ్మీర్లో విజయం సాధించిన ఎన్సీ కూటమికి అభినందనలు’’ అని అన్నారు. ఈ సభలో ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా పాల్గొన్నారు.చదవండి: తీర్పును అంగీకరించడం లేదు: హర్యానా ఫలితాలపై కాంగ్రెస్ -
హర్యానా ఫలితాలు: ‘ఎన్నికల కమిషన్ను కలుస్తాం’
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మరోసారి ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో బీజేపీ 48 స్థానాలో గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ 36 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. హర్యానాలో వెలువడిన ఫలితాలపై మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా స్పందించారు. ‘‘ చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చాలా తక్కువ తేడాతో ఓడిపోయారు. హర్యానాలో ఈ ఇవాళ వెలువడిన ఫలితాలు చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అనేక చోట్ల నుంచి మాకు ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ను కలుస్తాం.#WATCH | Rohtak, Haryana: Former CM and Congress leader Bhupinder Singh Hooda says, "We have lost many seats by a small margin. We have received complaints from many places and we will meet the Election Commission. The result is surprising for us..." pic.twitter.com/6g7yRa2MlF— ANI (@ANI) October 8, 2024కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరుపై స్పందించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ నేతలందరూ ఐక్యంగానే ఉన్నారు. అంతర్గత పోరు.. బీజేపీలోనే చూడొచ్చు. అనిల్ విజ్ ఇంటి నుంచి బయటకు రాలేదు. రామ్ బిలాస్ శర్మకు టికెట్ దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ వంటి ప్రజాస్వామ్య పార్టీలో అభిప్రాయలు ఉంటాయి. కానీ ఆలోచనలో ఎటువంటి తేడా ఉండదు.#WATCH | Rohtak, Haryana: On the question of infighting in the party, Former CM and Congress leader Bhupinder Singh Hooda says, "Congress is united. You can see the BJP, Anil Vij did not come out of his house, Ram Bilas Sharma's ticket was cut. In a democratic party, 'matbhed'… pic.twitter.com/MmSiihs88u— ANI (@ANI) October 8, 2024.. పొత్తు గురించి సమాజ్వాదీ పార్టీతో మేము ఎప్పుడూ మాట్లాడలేదు. సీపీఎం పార్టీ మమ్మల్ని అడిగారు. అందుకే వారికి మేము భివానీ అసెంబ్లీ సీటు ఇచ్చాం. మేము ఆమ్ ఆద్మీ పార్టీకి సీట్లు ఇచ్చాం. ఆ పార్టీ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగింది’’ అని అన్నారు. ఇక.. ఎన్నికల ఫలితాల్లో ఆయన గర్హి సంప్లా-కిలోయ్ అసెంబ్లీ స్థానంలో 71,000 మెజార్టీతో సమీప బీజేపీ అభ్యర్థి మంజూపై విజయం సాధించారు. -
హర్యానా ప్రజలకు నా సెల్యూట్: ప్రధాని మోదీ
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 90 సీట్లకు కాంగ్రెస్ కూటమి 49 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 29 స్థానాల్లో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. హర్యానాలో బీజేపీ ఘన విజయం సాధించింది. హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. బీజేపీ మూడో గెలుపు అందించిన సందర్భంగా హర్యానా ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు.‘‘భారతీయ జనతా పార్టీకి మరోసారి స్పష్టమైన మెజారిటీని అందించినందుకు హర్యానా ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా. ఇది అభివృద్ధి, సుపరిపాలన రాజకీయాల విజయం. హర్యానా ప్రజల ఆశయాలను నెరవేర్చుతాం. జమ్ము- కశ్మీర్లో బీజేపీ పనితీరుపై గర్వంగా ఉంది. ‘నేషనల్ కాన్ఫరెన్స్’కు అభినందనలు. ఆ పార్టీ ప్రదర్శన మెచ్చుకోదగినది’’ అని అన్నారు.PM Narendra Modi tweets, "I salute the people of Haryana for giving a clear majority to the Bharatiya Janata Party once again. This is the victory of the politics of development and good governance. I assure the people here that we will leave no stone unturned to fulfil their… pic.twitter.com/EHVXMjgbTD— ANI (@ANI) October 8, 2024 PM Narendra Modi tweets, "... I am proud of the BJP’s performance in Jammu and Kashmir. I thank all those who have voted for our Party and placed their trust in us. I assure the people that we will keep working for the welfare of Jammu and Kashmir. I also appreciate the… pic.twitter.com/Vo3vpnWDo2— ANI (@ANI) October 8, 2024 జమ్ము కశ్మీర్ ప్రజలకు కృతజ్ఞతలు: అమిత్ షా‘‘జమ్ము కశ్మీర్ ప్రజలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక ఓట్లతో ఆశీర్వదించారు. బీజేపీ ఇప్పటివరకు కశ్మీర్ చరిత్రలో అత్యధిక సీట్లను అందించారు. ఇందుకు నేను హృదయపూర్వకంగా జమ్ము కశ్మీర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ ఎన్నికల కోసం అవిశ్రాంతంగా పని చేసిన బీజేపీ పార్టీ కార్యకర్తలందరినీ అభినందిస్తున్నా. జమ్ము కశ్మీర్లో శాంతియుత ఎన్నికలు జరుగుతాయని ప్రధాని మోదీ గతంలోనే వాగ్దానం చేశారు. ఈ క్రమంలోనే తొలిసారి పారదర్శకంగా ఎన్నికలు జరిగాయి. ఈ చరిత్రాత్మక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంపై కేంద్ర ఎన్నికల సంఘం, జమ్ము కశ్మీర్ పాలనాయంత్రాంగం, భద్రత బలగాలు, పౌరులకు అభినందనలు...కాంగ్రెస్ హయాంలో జమ్ము కశ్మీర్లో ఉగ్రపాలనే సాగేది. అయితే బీజేపీ పాలనలో ప్రజాస్వామ్య పండుగను ఘనంగా చేసుకున్నాం. బీజేపీ హర్యానాలో భారీ విజయం సాధించింది. ప్రధాని మోదీ ప్రభుత్వంపై రైతులు, పేదలు, వెనుకబడిన వర్గాలు, సైనికులు, యువత నమ్మకానికి నిదర్శనం’’ అని ఎక్స్లో పేర్కొన్నారు.Union Home Minister Amit Shah tweets "The people of Jammu and Kashmir have blessed the BJP with the highest percentage of votes in this assembly election and have given the BJP the highest number of seats in its history so far. For this, I express my heartfelt gratitude to the… pic.twitter.com/gyVt8c2G1o— ANI (@ANI) October 8, 2024 -
హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్.. కూటమిదే కశ్మీర్
ఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మరోసారి ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ (46 స్థానాలు) దాటింది. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. దీంతో బీజేపీ మూడోసారి హర్యానాలో అధికారం చేపట్టనుంది. బీజేపీ భారీ విజయం సాధించటంతో హైకమాండ్ మళ్లీ హర్యానాకు సీఎంగా నయాబ్ సింగ్ సైనీకి ప్రకటించింది. ఇక.. ఇక్కడి ఆప్, జేజేపీ పార్టీలు ఒక్కసీటు కూడా గెలువలేదు. మంగళవారం ఓట్ల లెక్కింపులో ఒక సయయంలో బీజేపీ పలు స్థానాల్లో వెనకంజలో ఉన్నా.. అనూహ్యంగా ఫలితాలు బీజేపీకి ఏకపక్షంగా వచ్చాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బీజేపీ అనుకూలమైన తాజా ఫలితాల తలకిందులు చేశాయి.ప్రస్తుతం సీఎం హర్యానా సైనీ.. ఆరు నెలల ముందే సీఎం పీఠంపై కూర్చున్నా.. పార్టీని హర్యానాలో గెలిపించుకున్నారు. ఆశలు లేని స్థాయి నుంచి అనూహ్యంగా బీజేపీ విజయం సాధించింది. 1966 నుంచి హర్యానాలో ఏ పార్టీ కూడా వరసగా మూడు సార్లు అధికారం చేటపట్టలేదు. తాజాగా బీజేపీ ముచ్చటగా మూడోసారి గెలిచి ఆ ఆనవాయితీని బ్రేక్ చేసింది. హర్యానాలోబీజేపీ: గెలుపు-48కాంగ్రెస్: గెలుపు- 37ఇతరులు:గెలుపు-5 ఇప్పటివరకు ఎన్నికల సంఘం వెల్లడించిన అధికారిక ఫలితాలు..జమ్ము కశ్మీర్లో కాంగ్రెస్ కూటమి విజయంజమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు వెలువడిన మ్యాజిక్ ఫిగర్ స్థానాలను కూటమి గెలుపొందింది. ఇక్కడ బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది. కాంగ్రెస్ కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న సీపీఎం స్థానంలో గెలుపు. కాంగ్రెస్ ఆరు స్థానాల్లో విజయం సాధించింది.ఇక.. పీడీపీ కేవలం మూడు స్థానాలకు పరిమితమైంది. జమ్ము రీయన్లో కూటమికి బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా అవుతారని ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు.జమ్ముకశ్మీర్లోనేషనల్ కాన్ఫరెన్స్ - 42 సీట్లుబీజేపీ - 29కాంగ్రెస్ - 06పీడీపీ - 03సీపీఎం - 01ఆప్ - 01జేపీసీ - 01స్వతంత్రులు - 07మొత్తం స్థానాలు: 90 -
హర్యానాలో బీజేపీ జోరు.. కాబోయే సీఎం ఎవరంటే?
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం దూసుకెళ్లోంది. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో కాషాయ పార్థీ నేతలు ముందంజలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి ఎవరు? అనే చర్చ నడుస్తోంది. అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీనే మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందని సమాచారం. సైనీవైపే హైకమాండ్ మొగ్గుచూపుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో లాడ్వా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన సీఎం సైనీ.. కాంగ్రెస్ అభ్యర్థి మేమా సింగ్పై భారీ విజయం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హర్యానా ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. మూడో సారి బీజేపీకి అధికారం ఇచ్చినందకు ధన్యావాదాలు. మోదీ నాయకత్వం వల్లే విజయం సాధ్యమైందన్నారు. #WATCH | Kurukshetra: Haryana CM Nayab Singh Saini says "I want to thank the 2.80 crore people of Haryana for putting a stamp on the works of BJP for the third time. All this is only because of PM Modi. Under his leadership, we are moving forward. He spoke to me and gave his… pic.twitter.com/jPmMecyA8D— ANI (@ANI) October 8, 2024ఇదిలా ఉండగా.. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 90 స్థానాలు ఉన్న హర్యానాలో ఇప్పటికే 49 స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. దీంతో మ్యాజిక్ ఫిగర్(46)ను అధికార బీజేపీ దాటేసింది. ఇక, ముందంజలో ఉన్న 49 స్థానాల్లో ఇప్పటికే 30 స్థానాల్లో కాషాయ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో, బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. అయితే, ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రారంభంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ క్రమంగా బీజేపీ దూసుకెళ్లింది. కాంగ్రెస్ పట్టున్న పలు స్థానాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక, ప్రస్తుత లెక్కల ప్రకారం.. బీజేపీ 49 స్థానాల్లో, కాంగ్రెస్ 36 స్థానాల్లో, ఇతరులు ఐదు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. BIG BREAKING NEWS 🚨 BJP heading for landslide victory in Haryana.BJP is leading on 51 assembly seats. Congress reduced to only 34. No one had imagined it even in dreams.Haryana CM Nayab Singh Saini dedicates Historic Haryana Hat-trick to PM Modi.#HaryanaElectionResult pic.twitter.com/xelrupD7At— ASHER (@ASHUTOSHAB10731) October 8, 2024 -
హర్యానాలో ఆప్ ఓటమికి 10 కారణాలు
న్యూఢిల్లీ: హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు మంగళవారం వెలువడుతున్నాయి. హర్యానాలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యేలా కనిపిస్తోంది. కాంగ్రెస్కు నిరాశే ఎదురయ్యేలా ఉంది. హర్యానాలో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన అరవింద్ కేజ్రీవాల్ ఆశలు అడియాలసలయ్యాయి. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో ఆప్ అభ్యర్థులు ఒక్క సీటులో కూడా ముందంజలో లేరు. హర్యానాలో ఆప్ ఓటమికి 10 ప్రధాన కారణాలివే..కాంగ్రెస్తో పొత్తు లేదు సీట్ల పంపకంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరలేదు. దీంతో బీజేపీ లబ్ధి పొందింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి.ఐదు సీట్లకు పరిమితమై.. ఆప్ మొదట 10 సీట్లు అడిగింది. కాంగ్రెస్ అందుకు సిద్ధంగా లేకపోవడంతో ఆప్ తన డిమాండ్ను ఐదుకి తగ్గించింది. అయితే కాంగ్రెస్ మూడు సీట్లు ఇచ్చింది. ఆప్ అందుకు అంగీకరించలేదు.ఆప్- కాంగ్రెస్ మధ్య పోరు హర్యానా కాంగ్రెస్ నేతలలో ముఖ్యంగా భూపేంద్ర సింగ్ హుడా ఆప్ సహకారాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆప్ సాయముంటే కాంగ్రెస్కు నష్టం వాటిల్లుతుందని ఆయన వ్యాఖ్యానించారు.పేలవమైన పార్టీ పనితీరు హర్యానాలో ఆప్ ఎన్నికల ప్రచారంలో ఉత్సాహాన్ని చూపలేదు. గత ఎన్నికల్లోనూ ఆప్కు విజయం దక్కలేదు. ఓట్ల శాతం కూడా చాలా తక్కువగా నమోదయ్యింది.బీజేపీకి అనుకూల గాలి హర్యానాలో బీజేపీకి అనుకూలమైన గాలి వీచింది. బీజేపీకి కంచుకోటగా ఉన్న సీట్లు కాంగ్రెస్కు ఆప్కు ఆఫర్ చేసింది. ఇక్కడ పోటీని ఎదుర్కోవడం ఆప్కు కష్టమయ్యింది.అట్టడుగు నుంచి మద్దతు శూన్యంహర్యానాలో ఆప్కు అట్టడుగు స్థాయి నుంచి మద్దతు దక్కలేదు. బీజేపీ, కాంగ్రెస్లతో పోలిస్తే అంత బలపడని కారణంగా విజయం సాధించలేకపోయింది. స్థానిక నాయకత్వ లోపం కూడా ఏర్పడింది.చీలిన బీజేపీ వ్యతిరేక ఓట్లు హర్యానాలో పలు పార్టీలు విడివిడిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. దీంతో బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న ప్రజల ఓట్లు చీలిపోయి, ఆప్ విజయావకాశాలు మరింత తగ్గాయి.ఆకట్టుకోవడంలో విఫలం ఆప్ నేతలకు సంబంధించిన వివాదాల కారణంగా పార్టీ ప్రతిష్ట దెబ్బతింది. హర్యానా ప్రజల హృదయాలను ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది.వ్యూహాత్మక అంచనా లోపం హర్యానాలో ఆప్ తన బలాన్ని అంచనా వేయడంలో తప్పుగా లెక్కలు వేసుకుంది. ఇది వైఫల్యానికి దారితీసింది.సమయం కేటాయించని నేతలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆప్ నేతలు తమ పూర్తి సమయం కేటాయించలేదు. చివరి క్షణం వరకూ ఆప్కు కాంగ్రెస్తో పొత్తు కుదరలేదు. దీంతో అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం, వ్యూహాలు రచించడం ఆప్కి భారంగా మారింది. ఇది కూడా చదవండి: కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకున్న సీఎం -
హర్యానాలో బీజేపీ మ్యాజిక్..
-
రౌండ్ రౌండ్ కు మారుతున్న ఫలితాలు...
-
Watch Live: హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలు
-
బీజేపీ వెనుకంజకు అసలు కారణం ఇవే.. రుద్రరాజు కీలక వ్యాఖ్యలు
-
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యం
-
J&K: కాంగ్రెస్ కూటమి గెలుపు
Haryana And Jammu And Kashmir Assembly Election Results Updates : 5.50 PMజమ్ము కశ్మీర్లో కౌంటింగ్ పూర్తి..నేషనల్ కాన్ఫరెన్స్ - 42 సీట్లుబీజేపీ - 29కాంగ్రెస్ - 06పీడీపీ - 03సీపీఎం - 01ఆప్ - 01జేపీసీ - 01స్వతంత్రులు - 07మొత్తం స్థానాలు: 905.30 PMహర్యానాలోబీజేపీ: గెలుపు-48కాంగ్రెస్: ఆధిక్యం-2 గెలుపు- 35ఐఎన్ఎల్డీ+: గెలుపు-2జేజేపీ: 0ఇతరులు:గెలుపు-34.30 PMజమ్ము కశ్మీర్దోడా స్థానంలో ఆప్ అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్ గెలుపుశుభాకాంక్షలు తెలిపిన ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్#WATCH | Former Delhi CM and AAP National Convenor Arvind Kejriwal spoke and congratulated the newly elected AAP MLA from Doda, Mehraj Malik.(Source: AAP) pic.twitter.com/VsI1YJxuqd— ANI (@ANI) October 8, 2024 4.30 PMహర్యానాలోబీజేపీ: ఆధిక్యం-4, గెలుపు-45కాంగ్రెస్: ఆధిక్యం-2 గెలుపు- 34ఐఎన్ఎల్డీ+: ఆధిక్యం-1,గెలుపు-1జేజేపీ: 0ఇతరులు: ఆధిక్యం-0, గెలుపు-3జమ్ముకశ్మీర్లోకాంగ్రెస్ కూటమి: గెలుపు-49బీజేపీ:గెలుపు-29పీడీపీ: గెలుపు-3ఏఐపీ+:గెలుపు-1ఇతరులు:గెలుపు-8 4.28 PMహర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ గెలుపులాడ్వా అసెంబ్లీ స్థానం నుంచి 16,054 ఓట్ల మెజార్టీతో విజయంHaryana CM Nayab Singh Saini wins from Ladwa Assembly seat by a margin of 16,054 votes#HaryanaElection pic.twitter.com/ocxcrT7m3v— ANI (@ANI) October 8, 2024 4.25 PMహర్యానాలో మాజీ సీఎం భూపీందర్ సింగ్ హడా విజయంగర్హి సంప్లా-కిలోయ్ స్థానం నుంచి విజయం సాధించిన మాజీ సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి భూపీందర్ సింగ్ హుడా70,626 వేలకుపైగా మెజార్టీతో గెలుపు4.20 PMగందేర్బల్లోనూ ఒమర్ అబ్దుల్లా గెలుపుజమ్ము కశ్మీర్లోని గందేర్బల్ నియోజకవర్గంలోనూ నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ఒమర్ అబ్దుల్లా విజయంఇప్పటికే బుడ్గాం స్థానంలో ఒమర్ అబ్దుల్లా గెలుపు4.10 PMజమ్ము కశ్మీర్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కాంగ్రెస్ కూటమిఎన్నికల సంఘం అధికారిక ఫలితాల ప్రకారం..ఇప్పటివరకు 41 స్థానాల్లో జేకేఎన్సీ విజయంకాంగ్రెస్: ఆరు సీట్లలో గెలుపుజమ్ము కశ్మీర్లో మొత్తం స్థానాలు 90.. మ్యాజిక్ ఫిగర్ 46 స్థానాలు4.00 PMహర్యానాలోబీజేపీ: ఆధిక్యం-17, గెలుపు-32కాంగ్రెస్: ఆధిక్యం-9 గెలుపు- 27ఐఎన్ఎల్డీ+: ఆధిక్యం-1,గెలుపు-1జేజేపీ: 0ఇతరులు: ఆధిక్యం-0, గెలుపు-3జమ్ముకశ్మీర్లోకాంగ్రెస్ కూటమి: ఆధిక్యం-1,గెలుపు-48బీజేపీ:ఆధిక్యం-0, గెలుపు-29పీడీపీ: ఆధిక్యం-0, గెలుపు-3ఏఐపీ+: ఆధిక్యం-0, గెలుపు-1ఇతరులు: ఆధిక్యం-0, గెలుపు-8 3.40PMజమ్ము కశ్మీర్లోకాంగ్రెస్ కూటమి: ఆధిక్యం-2, గెలుపు-47బీజేపీ: ఆధిక్యం-1, గెలుపు-28పీడీపీ: ఆధిక్యం-0, గెలుపు-3ఏఐపీ+: ఆధిక్యం-0, గెలుపు-1ఇతరులు: ఆధిక్యం-1 గెలుపు-7హర్యానాలోబీజేపీ: ఆధిక్యం-27, గెలుపు-22కాంగ్రెస్: ఆధిక్యం-12 గెలుపు- 24ఐఎన్ఎల్డీ+:ఆధిక్యం-1,గెలుపు-1జేజేపీ: 0ఇతరులు: ఆధిక్యం-0, గెలుపు-3 3.30PMభారత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ గెలుపుహర్యానా హిసార్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సావిత్రి విజయం 3.20PMజమ్ముకశ్మీర్లోకాంగ్రెస్ కూటమి: ఆధిక్యం-8,గెలుపు-40బీజేపీ:ఆధిక్యం-2, గెలుపు-27పీడీపీ: ఆధిక్యం-2, గెలుపు-2ఏఐపీ+: ఆధిక్యం-1ఇతరులు: ఆధిక్యం-3 గెలుపు-5హర్యానాలోబీజేపీ: ఆధిక్యం-35, గెలుపు-14కాంగ్రెస్: ఆధిక్యం-14 గెలుపు- 21ఐఎన్ఎల్డీ+: ఆధిక్యం-3,గెలుపు-0జేజేపీ: 0ఇతరులు: ఆధిక్యం-0, గెలుపు-3 3.10PMఆదిత్య సూర్జేవాలా గెలుపుహర్యానాలోని కైథల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, పార్టీ సీనియర్ నేత రణ్దీప్ సూర్జేవాలా కుమారడు విజయంస్థానికంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన ఆదిత్య సూర్జేవాలా#WATCH | #HaryanaAssemblyElection2024 | Congress leader Aditya Surjewala holds roadshow in Kaithal after being declared winner from the Assembly constituency pic.twitter.com/SkNERVB2j1— ANI (@ANI) October 8, 2024 3.00PMజమ్ముకశ్మీర్లోబీజేపీ:ఆధిక్యం-10, గెలుపు-19కాంగ్రెస్ కూటమి: ఆధిక్యం-16, గెలుపు-33పీడీపీ: ఆధిక్యం-1, గెలుపు-2ఏఐపీ+: ఆధిక్యం-1ఇతరులు: ఆధిక్యం-5 గెలుపు-3 హర్యానాలోబీజేపీ: ఆధిక్యం-39, గెలుపు-8కాంగ్రెస్: ఆధిక్యం-24 గెలుపు- 13ఐఎన్ఎల్డీ+:ఆధిక్యం-3,గెలుపు-0జేజేపీ: 0ఇతరులు: ఆధిక్యం-2, గెలుపు-1 2:50 pm జమ్ము కశ్మీర్:ఎన్సీకి 23.3 శాతం ఓట్లుకాంగ్రెస్ పార్టీకి 11. 8 శాతం ఓట్లు వచ్చాయి.బీజేపీకి 26 శాతం ఓట్లుపీడీపీకి 8.6 శాతం ఓట్లు వచ్చాయి. 2:40 pm జమ్ముకశ్మీర్లోబీజేపీ:ఆధిక్యం-14,గెలుపు-14కాంగ్రెస్ కూటమి: ఆధిక్యం-35,గెలుపు-15పీడీపీ: ఆధిక్యం-2, గెలుపు-1ఏఐపీ+: ఆధిక్యం-1ఇతరులు: ఆధిక్యం-5 గెలుపు-3హర్యానాలోబీజేపీ: ఆధిక్యం-43, గెలుపు-6కాంగ్రెస్: ఆధిక్యం-25 గెలుపు- 11ఐఎన్ఎల్డీ+:ఆధిక్యం-2,గెలుపు-0జేజేపీ: 0ఇతరులు: ఆధిక్యం-2, గెలుపు-1 2:25 pm హర్యానాలోబీజేపీ: ఆధిక్యం-44, గెలుపు-6 కాంగ్రెస్: ఆధిక్యం-25 గెలుపు- 10 ఐఎన్ఎల్డీ+:ఆధిక్యం-2,గెలుపు-0జేజేపీ: 0 ఇతరులు: ఆధిక్యం-3 2:10 pm జమ్ము కశ్మీర్లోబీజేపీ:ఆధిక్యం-15,గెలుపు-12కాంగ్రెస్ కూటమి: ఆధిక్యం-45,గెలుపు-7పీడీపీ: ఆధిక్యం-1, గెలుపు-1ఏఐపీ+: ఆధిక్యం-1ఇతరులు: ఆధిక్యం-5 గెలుపు-32:00pm హర్యానాలోబీజేపీ-ఆధిక్యం-45,గెలుపు-5కాంగ్రెస్- ఆధిక్యం-29 గెలుపు-6ఐఎన్ఎల్డీ-ఆధిక్యం-2,గెలుపు-0జేజేపీ-0ఇతరులు -ఆధిక్యం-3జమ్ముకశ్మీర్లోబీజేపీ-ఆధిక్యం-15,గెలుపు-12కాంగ్రెస్ కూటమి-ఆధిక్యం-47,గెలుపు-5పీడీపీ-ఆధిక్యం-1 ఇతరులు-ఆధిక్యం-6 గెలుపు-2 1:30pmహర్యానాలోబీజేపీ-ఆధిక్యం-45,గెలుపు-3కాంగ్రెస్- ఆధిక్యం-33 గెలుపు-3ఐఎన్ఎల్డీ-ఆధిక్యం-2,గెలుపు-0జేజేపీ-0ఇతరులు -ఆధిక్యం-4జమ్ముకశ్మీర్లోబీజేపీ-ఆధిక్యం-18,గెలుపు-9కాంగ్రెస్ కూటమి-ఆధిక్యం-49,గెలుపు-3పీడీపీ-ఆధిక్యం-2 ఇతరులు-ఆధిక్యం-8 గెలుపు-0 హర్యానాలో బీజేపీ తొలి విజయంజింద్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన డాక్టర్ క్రిషన్లాల్ మిద్ధా12:53pmహర్యానాహర్యానాలో రెజ్లర్ వినేష్ ఫొగాట్ విజయం12: 45pmహర్యానా బీజేపీ-ఆధిక్యం-46,గెలుపు-2కాంగ్రెస్- ఆధిక్యం-32 గెలుపు-3ఐఎన్ఎల్డీ-ఆధిక్యం-2 గెలుపు-0 జేజేపీ-0ఇతరులు -ఆధిక్యం-4జమ్ముకశ్మీర్బీజేపీ-ఆధిక్యం-22,గెలుపు-5కాంగ్రెస్ కూటమి-ఆధిక్యం-50,గెలుపు-2 పీడీపీ-ఆధిక్యం-2ఇతరులు-ఆధిక్యం-8 గెలుపు-012:30pmహర్యానా ఎన్నికల ఫలితాల అప్డేట్పై కాంగ్రెస్ అసహనంఈసీ వెబ్సైట్లో డేటా అప్డేట్ చేయడం లేదంటూ ఆగ్రహంప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉన్న బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందంటూ ఫైర్12:10PMజమ్ముకశ్మీర్ -బీజేపీ-29,ఎన్సీ+కాంగ్రెస్-50,పీడీపీ-2,ఇతరులు-09హర్యానా - బీజేపీ-49,కాంగ్రెస్-35,జేజేపీ-00,ఇతరులు-00 12:00PMఅసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బహర్యానా,జమ్ముకశ్మీర్లో ఖాతాతెరవని ఆప్రెండు రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆప్ 11:50AMనేను ఓటమిని అంగీకరిస్తున్నా: పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తీజా ముఫ్తీబషీర్ అహ్మద్ చేతిలో ఇల్తీజా ఓటమి11:32AMకాశ్మీర్లో మహబూబాముఫ్తీ కుమార్తె ఓటమి 11:22AMజమ్ముకశ్మీర్జమ్ముకశ్మీర్లో బోణీ కొట్టిన బీజేపీకథువాలో బీజేపీ అభ్యర్థి దర్శన్కుమార్ ఘన విజయంనౌషెరాలో బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా వెనుకంజ 11:10AMహర్యానా - బీజేపీ-48,కాంగ్రెస్-36,జేజేపీ-00,ఇతరులు-06జమ్ముకశ్మీర్- బీజేపీ-27,ఐఎన్సీ+బీజేపీ-49, పీడీపీ-05, ఇతరులు-1011:10AMహర్యానా :హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ చేరిన బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టే దిశగా బీజేపీ10:50AMహర్యానా :హర్యానాలో తారుమారైన ఎగ్జిట్ పోల్స్కాంగ్రెస్కే పట్టం కట్టిన ఎగ్జిట్పోల్స్,మారిన తీర్పుహర్యానాలో అన్యూహంగా బీజేపీ ముందంజ48 స్థానాల్లో బీజేపీ ముందంజబీజేపీ-48,కాంగ్రెస్-36,జేజేపీ-0,ఇతరులు-07జమ్ముకశ్మీర్ :జమ్ముకశ్మీర్లో మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్ కూటమిబీజేపీ-28,ఐఎన్సీ+బీజేపీ-48, పీడీపీ-4, ఇతరులు-1010:30AMహర్యానా :జులానాలో మాజీ రెజ్లన్ వినేశ్ ఫొగాట్ వెనుకంజకౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన వినేశ్ ఫొగాట్9:50AMఆధిక్యంలో బీజేపీహర్యానాలో బీజేపీ-కాంగ్రెస్ల మధ్య పోరు హోరాహోరీ తలపిస్తోంది. హర్యానాలో బీజేపీ తిరిగి ఆధిక్యంలోకి వచ్చింది. తొలుత కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగగా, ఆపై బీజేపీ ఆధిక్యం సాధించింది. హర్యానాలో 90 అసెంబ్లీ సీట్లకు గాను ప్రస్తుతం బీజేపీ 46 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ 38 సీట్ల ఆధిక్యంలో ఉంది. 9:00AMహర్యానా, జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. రెండు రాష్ట్రాలా అసెంబ్లీ పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతుంది. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. హర్యానా పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ -56,బీజేపీ-28,జేపీపీ-1,ఇతరులు-5 ఆదిక్యంలో ఉన్నాయి.జమ్ముకశ్మీర్ పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ-31, కాంగ్రెస్ కూటమి-46, పీడీపీ-4, ఇతరులు -7 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.ముందుగా హర్యానాలో అక్టోబర్ 5న 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 1,031 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో 464 మంది స్వతంత్రులు.101 మంది మహిళలు.జమ్మూ కశ్మీర్లోనూ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ కొనసాగుతుంది. ఇక్కడి 90 నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 18,25, అక్టోబర్ 1న మూడు విడతల్లో పోలింగ్ జరిగింది. 90 నియోజకవర్గాల్లో మొత్తం 873 మంది అభ్యర్థులు బరిలోకి నిలిచారు. 👉హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ -63,బీజేపీ-23,జేపీపీ-1,ఇతరులు-1 ఆదిక్యంలో ఉన్నాయికైతాలలో ఆదిత్య సూర్జేవాలా ముందంజజేజేపీ ఉచనకలన్లో దుష్యంత్ చౌతాలాలడ్వా నియోజకవర్గం సీఎం నాయబ్సైనీ ముందంజఅంబాలా కంటోన్మెంట్లో అనిల్ విజ్ ఆధిక్యంజులనా అసెంబ్లీ స్థానం నుంచి స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ముందంజలో ఉన్నారుహర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైందితొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ -17,బీజేపీ-5 ఆదిక్యంలో ఉన్నాయి.93 కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుహర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 468.30గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు9గంటలకు తుది ఫలితం విడుదల 👉జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ జమ్ముకశ్మీర్ పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ-27, కాంగ్రెస్ కూటమి-46, పీడీపీ-5, ఇతరులు -3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. జమ్ముకశ్మీర్లో సైతం కాంగ్రెస్ కూటమి పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో సత్తా చాటుతోందిగందర్బల్,బుద్గాం రెండు స్థానాల్లో ఓమర్ అబ్దుల్లా ముందంజగరిసంప్లా-కిలోయ్లో భూపేందర్ సింగ్ హుడా ముందంజ బీజేపీ చీఫ్ రవీంద్ర నైనా ముందంజ జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైంది జమ్ముకశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 48పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ -4, బీజేపీ -3,ఇతరులు -3 ఆధిక్యంలో ఉన్నాయి -
Haryana Election Result : ఈ నేతల ఫలితంపైనే అందరి దృష్టి
చండీగఢ్: హర్యానాలోని మొత్తం 90 లోక్సభ స్థానాలకు అక్టోబర్ 5న పోలింగ్ జరిగింది. నేడు(మంగళవారం) ఆయా స్థానాల ఫలితాలు వెల్లడికానున్నాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? లేక బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తుందా? అనేది నేడు తేలనుంది. హర్యానాలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అదేవిధంగా బరిలో ఉన్న పలువురు బడా నేతల ఫలితంపై అందరి దృష్టి నిలిచింది.భూపేంద్ర సింగ్ హుడాహర్యానా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేంద్ర సింగ్ హుడా గర్హి సంప్లా కిలోయ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సీటుపై ఆయనకు గట్టి పట్టు ఉంది. హుడా రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్కు మెజారిటీ వస్తే సీఎం పదవికి ఆయనే బలమైన పోటీదారుగా భావిస్తున్నారు.నాయబ్ సింగ్ సైనీమనోహర్ లాల్ ఖట్టర్ను హర్యానా నుండి ఢిల్లీకి పంపిన తరువాత, బీజేపీ నాయబ్ సింగ్ సైనీకి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. ఆయన కురుక్షేత్రలోని లాడ్వా స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు కాంగ్రెస్కు చెందిన మేవా సింగ్ పోటీనిస్తున్నారు. గత ఎన్నికల్లో మేవా సింగ్ లాడ్వా స్థానం నుంచి గెలుపొందారు.అనిల్ విజ్హర్యానా బీజేపీలో విజ్ కీలక నేతగా గుర్తింపు పొందారు. రెండుసార్లు మంత్రిగా పనిచేసిన విజ్ అంబాలా కాంట్ అభ్యర్థి. 1967 నుంచి 2019 వరకు పంజాబీ వర్గానికి చెందిన వారే ఇక్కడ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు.దుష్యంత్ చౌతాలాఉచానా స్థానం నుంచి జేజేపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా పోటీ చేస్తున్నారు. గతంలో ఐదేళ్ల పాటు ఆయన బీజేపీ ప్రభుత్వంతో జతకట్టారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో సీట్ల పంపకంపై ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో పొత్తు తెగిపోయింది. 2019లో ఉచానా స్థానం నుంచి దుష్యంత్ చౌతాలా గెలుపొందారు.వినేష్ ఫోగట్పారిస్ ఒలింపిక్స్ 2024 నుండి తిరిగి వచ్చిన తరువాత, వినేష్ ఫోగట్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. జులనా అసెంబ్లీ స్థానం నుంచి వినేష్ ఫోగట్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. వినేష్పై బీజేపీ తరపున మాజీ పైలట్ యోగేష్ బైరాగి పోటీ చేస్తున్నారు.సావిత్రి జిందాల్దేశంలోనే అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ హిసార్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె హర్యానాలోని కురుక్షేత్ర బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ తల్లి. సావిత్రి జిందాల్ హర్యానాలో మంత్రిగా కూడా పనిచేశారు.ఇది కూడా చదవండి: కశ్మీర్, హరియాణాల్లో నేడే ఓట్ల లెక్కింపు -
కాంగ్రెస్ దే హార్యానా.. సీఎం పీఠం ఎవరిదంటే..!
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందంటూ మెజార్టీ ఎగ్జిట్పోల్స్ వెల్లడించాయి. మొత్తం 90 నియోజకవర్గాలకు గానూ 55కి పైగా స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. ఇక రేపు(అక్టోబర్ 8) అధికారిక ఫలితాలు వెలువడనున్న ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు ఎవరు చేపడతారన్న దానిపై చర్చ మొదలైంది.ప్రధానంగా సీఎం పదవికి ముందంజలో ఉన్న పార్టీ సీనియర్ నేతలు కుమారి సెల్జా, రణ్దీప్ సూర్జేవాలా పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ఎంపీ కుమారి సెల్జా స్పందించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. అయితే ఆ పదవికి కావాల్సిన అర్హతలు, అనుభవం తనకు ఉందని పేర్కొన్నారు.@నేనేమీ చెప్పలేను. నేనే కాదు. ఎవరూ ఏం చెప్పలేరు.. సీఎం ఎవరనే విషయం హైకమాండ్ ప్రకటన తర్వాతే తెలుస్తుంది.. హైకమాండ్ నిర్ణయాన్ని అందరూ అంగీకరిస్తారు.. నేను ఇప్పటికే పబ్లిక్ డొమైన్లో మాట్లాడాను.. ఈ విషయం హైకమాండ్కు తెలుసు. అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది.’ అని కుమారి సెల్జా సోమవారం తెలిపారు.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర’ ఆయనపై. పార్టీపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని మార్చేసిందని పేర్కొన్నారు. ‘రాహుల్ యాత్రతో మొత్తం మారిపోయింది. ఆయనపై ప్రజల్లో ఉన్న అవగాహన, కాంగ్రెస్పై ఉన్న అభిప్రాయం, బీజేపీపై ఉన్న అభిప్రాయం మారిపోయింది. అందుకే లోక్సభలో బీజేపీ సీట్లు ఎలా తగ్గాయో చూశాం. హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది.’ అని పేర్కొన్నారు. -
హర్యానా: ‘సీఎం సైనీ మంచి వ్యక్తి.. కానీ’
చంఢీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అధిక సీట్లు గెలుచుకొని అధికారం చేపడుతుందని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ నివేదికలు వెల్లడించాయి.ఈ నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీపై జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ చౌతాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో నయాబ్ సింగ్ సైనీకి బీజేపీ.. చచ్చిన పాము స్థితిలో ఉన్న పార్టీని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సైనీ.. నియంత్రించలేకపోయారని అన్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి కారణం ఇదే అవుతుందని అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘‘హర్యానాలో బీజేపీ అధికారం కోల్పోయి..రాష్ట్రం బయటకు వెళ్లిపోయే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను మొదటి రోజు నుంచీ ఇదే విషయాన్ని చెబుతున్నా. బీజేపీ నేతలు ఏమి జరిగిందో కూడా అర్థం చేసుకోలేకపోయారు...హర్యానా ముఖ్యమంత్రికి బీజేపీ ‘చచ్చిన పాము’ స్థితిలో ఉన్న పార్టీని అప్పగించారు. ఇప్పటికే చాలా నష్టం కాంగ్రెస్ వల్లే జరిగిపోయింది. నయాబ్ సింగ్ సైనీ మంచి వ్యక్తి. కానీ, నష్టాన్ని నియంత్రించలేకపోయారు. ఒక మంచి వ్యక్తి మెడలో చనిపోయిన పామును బీజేపీ ఉంచింది...ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి 20 సీట్లు వస్తాయని చెబుతున్నాయి. కానీ, వాటిని నమ్మటం లేదు. బీజేపీకి 15 లేదా 16 సీట్లు మాత్రమే వస్తాయని నమ్ముతున్నా. కాంగ్రెస్ కూడా జేజేపీ లేదా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మేం ఏమీ చెప్పలేం. ఫలితాలు వెలువడ్డ తర్వాతే చెబుతాం. కాంగ్రెస్కు కూడా మా పార్టీ మద్దతు అవసరమయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది’’ అని అన్నారు.చదవండి: TN: ఎయిర్ షో మరణాలకు కారణం అదే: మంత్రి -
హరియాణాలో 61% పైగా పోలింగ్
చండీగఢ్: హరియాణా అసెంబ్లీకి శనివారం జరిగిన పోలింగ్లో సాయంత్రం 5 గంటల సమయానికి 61%పైగా ఓటింగ్ నమోదైందని ఈసీ తెలిపింది. సాయంత్రం 6 గంటల సమయంలో కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల క్యూలు కనిపిస్తున్నాయని, ఓటింగ్ శాతం పెరగనుందని పేర్కొంది. అత్యధికంగా నుహ్లో 68.28%, యమునానగర్లో 67.93% పల్వాల్లో 67.69%, జింద్లో 66.02%, సిర్సాలో 65.37% నమోదు కాగా, గురుగ్రామ్లో 49.92% మాత్రమే నమోదైనట్లు తెలిపింది.పోలింగ్ సమయంలో నుహ్, హిసార్, పానిపట్ జిల్లాల్లో చిన్నపాటి ఘర్షణలు జరిగినట్లు ఈసీ తెలిపింది. కేంద్ర మంత్రి, మాజీ సీఎం ఖట్టర్ కర్నాల్లో ఓటేశారు. డబుల్ ఒలింపిక్ పతక విజేత మనూ భాకర్ ఝజ్జర్ జిల్లా గోరియా గ్రామంలో తల్లిదండ్రులతో కలిసి వచ్చి మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీకి చెందిన కురుక్షేత్ర ఎంపీ నవీన్ జిందాల్ గుర్రంపై వచ్చి ఓటేశారు. జులానా నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న వినేశ్ ఫొగాట్ చర్ఖి దాద్రి జిల్లా బలాలిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటేయని గ్రామస్తులు చర్ఖి దాద్రి జిల్లాలో రామల్వాస్ గ్రామస్తులు శనివారం పోలింగ్ను బహిష్కరించారు. గ్రామ పరిసరాల్లో కొనసాగే గనుల అక్రమ తవ్వకాలతో తమ జల వనరులు అడుగంటాయని, పర్యావరణానికి హాని కలుగుతోందని ఆరోపిస్తున్నా రు. తవ్వకాలను అడ్డుకోవాలనే డిమాండ్తో వీరు ఓటేసేందుకు వెళ్లలేదు. ఓటర్లు ఎవరూ రాకపోయేసరికి గ్రామ పోలింగ్ బూత్లో సిబ్బంది అంతా సాయంత్రం వరకు ఖాళీగానే కూర్చున్నారు. అదే సమయంలో గ్రామస్తులు హుక్కా పీలుస్తూ, పేకాట ఆడుతూ సరదాగా కాలక్షేపం చేశారు. -
హరియాణాలో కాంగ్రెస్
న్యూఢిల్లీ: హరియాణాలో బీజేపీ హ్యాట్రిక్ కలలకు కాంగ్రెస్ గండి కొట్టడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించనుందని ఇండియాటుడే మొదలుకుని పీపుల్స్ పల్స్ దాకా అన్ని పోల్స్ ముక్త కంఠంతో పేర్కొన్నాయి. ఆ పార్టీ అలవోకగా మెజారిటీ మార్కును దాటేస్తుందని జోస్యం చెప్పాయి. ఆప్ సున్నా చుడుతుందని, ప్రాంతీయ పార్టీల్లో ఐఎన్ఎల్డీ 2 నుంచి 4, జేజేపీ ఒకటి నుంచి రెండు స్థానాలకు పరిమితమవుతాయని పేర్కొన్నాయి. ఇక జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ సంకీర్ణం ఆధిక్యం సాధిస్తుందని తెలిపాయి.ఆ కూటమికి మెజారిటీ రావచ్చని ఇండియాటుడే, పీపుల్స్ పల్స్ పేర్కొనగా అందుకు అతి సమీపానికి వస్తుందని చాలా పోల్స్ అంచనా వేశాయి. బీజేపీకి 20 నుంచి 35 స్థానాల వరకు రావచ్చని పేర్కొన్నాయి. ఎన్సీ ఏకైక పెద్ద పార్టీగా అవతరిస్తుందని అభిప్రాయపడ్డాయి. మరో ప్రాంతీయ పార్టీ పీడీపీకి 6 నుంచి గరిష్టంగా 18 స్థానాలిచ్చాయి.ఈ అంచనాలను ఫక్తు టైంపాస్ వ్యవహారంగా ఆ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా కొట్టిపారేశారు. తమకు స్పష్టమైన మెజారిటీ ఖాయమన్నారు. బీజేపీ మాత్రం తామే అతి పెద్ద పార్టీగా అవతరిస్తామని ధీమా వెలిబుచ్చింది. జమ్మూకశ్మీర్లో సెపె్టంబర్ 18, 25, అక్టోబర్ 1న మూడు విడతలుగా పోలింగ్ జరిగింది. హరియాణాలో పోలింగ్ ప్రక్రియ శనివారం ఒకే విడతలో ముగిసింది. రెండు రాష్ట్రాల్లోనూ అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడవనున్నాయి. -
కాంగ్రెస్ మహిళా నేతకు వేధింపులు.. వీడియోతో బయటపెట్టిన బీజేపీ
కాంగ్రెస్ను మహిళ వ్యతిరేక పార్టీ అంటూ బీజేపీ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. అందరూ చూస్తుండగానే స్టేజ్ మీ ఓ మహిళను లైంగికంగా వేధించారంటూ కాంగ్రెస్పై. దానికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది కాషాయపార్టీ. హర్యానా కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా, ఇతర నేతల సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని మండిపడింది.ఇంతకీ ఏం జరిగిందంటే.. కాంగ్రెస్ నేత దీపిందర్ సింగ్, ఇతర నేతలు ఉన్న వేదికపై ఉన్నప్పుడే ఓ మహిళ వేధింపులు ఎదుర్కొన్నట్లు కొన్ని దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోస్టు చేస్తూ.. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్లా దీపేందర్ హుడా కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. ఇలాంటి వారి అసభ్య ప్రవర్తన కారణంగా ఎంతోమంది మహిళా కాంగ్రెస్ నేతలు పార్టీని వీడారని ఆరోపించారు. చాలా అవమానకరమైన వీడియో బయటపడింది. కొన్ని దృశ్యాలు సిగ్గుపడేలా ఉన్నాయి. ఇది మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని కాగ్రెస్ ఎంపీ కుమారి సెల్జా ధృవీకరించారు. పట్టపగలు, దీపేందర్ హుడా సమక్షంలో వేదికపై ఒక మహిళా నేతకు పార్టీకి చెందిన వ్యక్తి నుంచే వేధింపులు ఎదురయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లోనే మహిళలకు భద్రత లేకపోతే.. ఇక రాష్ట్రంలోని మహిళలు ఎలా భద్రంగా ఉంటారు?.. ఇది మహిళా వ్యతిరేక పార్టీ. ఈ హుడా మద్దతుదారులపై ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ చర్యలు తీసుకుంటారా?’ అని ప్రశ్నించారు.Most shocking 😮 A woman congress leader was molested in stage in presence of Deependra Hooda by congress leaders Confirmed by news reports and even Kumari Selja If women are not safe in Congress meetings in full public view during the daytime - can they be safe if Congress… pic.twitter.com/yIw46gl91t— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) October 5, 2024మరోవైపు మహిళలు, పేదలు, దళితులను గౌరవించకపోవడం కాంగ్రెస్ సంస్కృతి, డీఎన్ఏలో ఉందనంటూ హర్యానా ముఖ్యమంత్రి నయాబ్సింగ్ సైనీ విమర్శించారు. ఈ విషయంలో మాకు ఫిర్యాదు వస్తే.. చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ ప్రభుత్వం ఎవరినీ వదిలిపెట్టద్దని చెప్పారు.కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కుమారి సెల్జా సైతం ఈ ఘటనను ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘బాధితురాలితో నేను మాట్లాడాను. తనపై వేధింపులు జరిగాయని ఆమె తెలిపింది. రాజకీయాల్లో ఎదిగేందుకు ఎంతో కష్టపడి పనిచేస్తోన్న ఓ మహిళకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం తీవ్రంగా ఖండించదగినది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Haryana: అభ్యర్థి చొక్కా చించిన మాజీ ఎమ్మెల్యే
చండీగఢ్: హర్యానాలో ఈరోజు (శనివారం) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. కొన్నిచోట్ల చెదురుమదురు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. మెహమ్ నుంచి పోటీ చేస్తున్న హర్యానా జనసేవక్ పార్టీ అభ్యర్థి బాల్రాజ్ కుందు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే తనపై దాడి చేసి, తన బట్టలు చించేశారని ఆరోపించారు. దీనిపై వీడియో సందేశం ద్వారా ఆయన ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు.జన్ సేవక్ పార్టీ అభ్యర్థి బాల్రాజ్ కుందు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ డాంగి తనపై దాడి చేశారని ఆరోపించారు. తాను, తన పీఏ రోహ్తక్ జిల్లాలోని ఒక బూత్కు వెళ్ళినప్పుడు మాజీ ఎమ్మెల్యే డాంగి దాడిచేశారని, తన దుస్తులను చింపేశారని కూడా ఆరోపించారు.కాంగ్రెస్ అభ్యర్థి బలరామ్ డాంగి ఓడిపోతారనే భయంతోనే అతని తండ్రి ఆనంద్ సింగ్ డాంగి ఈ దాడికి పాల్పడ్డారని బాల్రాజ్ కుందు ఆరోపించారు. హర్యానా జనసేవక్ పార్టీ అభ్యర్థి బాల్రాజ్ కుందు మెహమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఆనంద్ సింగ్ డాంగి కుమారుడు బలరామ్ డాంగి ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి. ఇక్కడి నుంచి బీజేపీ తరపున దీపక్ హుడా పోటీ చేస్తున్నారు. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా, దశాబ్దం తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోంది. ఇది కూడా చదవండి: హర్యానా ఓటింగ్ వేళ.. నలుగురు నేతలకు బీజేపీ షాక్ -
BCCI: బీసీసీఐ ఏసీయూ చీఫ్గా NIA మాజీ హెడ్
BCCI ACU New Chief: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి చెందిన అవినీతి నిరోధక విభాగానికి (ఏసీయూ) అధిపతిగా ప్రముఖ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శరద్ కుమార్ నియమితులయ్యారు. గతంలో ఆయన టెర్రరిజం కార్యకలాపాల్ని నిరోధించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నాలుగేళ్ల పాటు క్లిష్టమైన టెర్రిరిజం దర్యాప్తులను చేపట్టారు.ఎన్ఐఏ హెడ్గా పనిచేసిన అనుభవంఉత్తరప్రదేశ్కు చెందిన 68 ఏళ్ల శరద్ 1979 బ్యాచ్కు చెందిన హరియాణా క్యాడర్ ఐపీఎస్. ముంబై ఉగ్రదాడి అనంతరం కేంద్రం ఎన్ఐఏను ఏర్పాటు చేసింది. 2013 నుంచి 2017 వరకు శరద్ ఎన్ఐఏ హెడ్గా వ్యవహరించారు. అనంతరం 2018 నుంచి 2020 వరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా విధులు నిర్వర్తించారు. ఈ సమయంలోనే మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో కీలకంగా పనిచేశారు.కేకే మిశ్రా ఏడాది పాటేఇప్పుడు ఆ అనుభవమే శరద్ కుమార్ను ఏసీయూ చీఫ్ను చేసింది. నిజాయితీ గల అధికారిగా పేరున్న శరద్ 1996లో, తిరిగి 2004లో రాష్ట్రపతి పోలీస్ మెడల్స్ను పొందారు. ఈ నెల 1 నుంచి బోర్డు ఏసీయూ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ పదవిలో మూడేళ్లపాటు పనిచేస్తారని బోర్డు వర్గాలు తెలిపాయి. ఇంతకుముందు ఏసీయూ చీఫ్గా ఉన్న కేకే మిశ్రా కూడా హరియాణా క్యాడర్కే చెందిన ఐపీఎస్ అధికారి. కానీ ఏడాది మాత్రమే పదవిలో ఉన్న ఆయన రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన కారణాలు మాత్రం వెల్లడి కాలేదు. చదవండి: WT20 WC Ind vs NZ: కివీస్ ముందు తలవంచారు -
హర్యానాలో అసెంబ్లీ ఎన్నిక పోలింగ్ ప్రారంభం..
-
Haryana Election: ముగిసిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
HARYANA ASSEMBLY ELECTION POLLING UPDATES...హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. క్యూలైన్లో నిల్చున్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు. మొత్తం 90 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.మరికాసేపట్లో హర్యానాలో పోలింగ్ ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు 61% పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు 49.1 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. పలుచోట్లు ఓటు వేసేందుకు ఓటర్లు క్యూలైన్లో ఉన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 36.7% పోలింగ్ నమోదైంది. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో తిరిగి పుంజుకోవాలని కాంగ్రెస్ భావిస్తుండగా, అధికార బీజేపీ హ్యాట్రిక్పై కన్నేసింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్ దళ్, బహుజన్ సమాజ్ పార్టీ, జననాయక్ జనతా పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ సైతం తమ పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి.అనేక స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య ప్రత్యక్ష పోరు జరిగే అవకాశం ఉంది. ఉదయం నుంచీ సీఎం నాయబ్ సైనీ, మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సహా పలువురు వీఐపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే స్టార్ క్రీడాకారులు మనూ బాకర్, వినేష్ ఫోగట్ కూడా ఓటేసిన వారిలో ఉన్నారు.ఇవాళ జరుగుతున్న హర్యానా ఎన్నికల్లో నాయబ్ సైనీ, భూపీందర్ హుడా, వినేష్ ఫోగట్ సహా దాదాపు వెయ్యి మంది అభ్యర్ధుల భవితవ్యం తేలనుంది.హర్యానా శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 90 నియోజకవర్గాల్లో శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలో 2.03 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 20వేల623 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రారంభమైన తొలి గంటల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటీవల పారిస్ ఒలింపిక్స్లో పతకాలు సాధించిన స్టార్ షూటర్ మను బాకర్ ఝజ్జర్లోని పోలింగ్ కేంద్రంలో కుటుంబంతో కలిసి ఓటేసింది.ఎన్నికల్లో తాను ఓటు హక్కు వినియోగించుకోవడం ఇదే తొలిసారి అని పేర్కొంది.కర్నాల్లో కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.చర్కి దాద్రిలోని పోలింగ్ కేంద్రంలో మాజీ రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫోగట్ ఓటు వేశారు. ఈ ప్రజాస్వామ్య పండుగలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కురుక్షేత్రలో ఓటుహక్కు వినియోగించుకున్నారు.హరియాణా సీఎం, బీజేపీ అభ్యర్థి నాయబ్ సింగ్ సైనీ అంబాలాలో ఓటు వేశారు. రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామంటూ విశ్వాసం వ్యక్తంచేశారు.ఫరీదాబాద్లో కేంద్రమంత్రి కృషణ్ పాల్ గుర్జార్, సిర్సాలో మాజీ డిప్యూటీసీఎం దుశ్యంత్ చౌతాాలా ఓటుహక్కు వినియోగించుకున్నారు. దేశంలో అత్యంత సంపన్న మహిళ, స్వతంత్ర అభ్యర్థి సావిత్రి జిందాల్ హిస్సార్లో ఓటు వేశారు. -
Haryana Elections-2024: ఆ సీట్లపైనే అందరి దృష్టి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అందరి దృష్టి హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై నిలిచింది. ఈ రాష్ట్రం రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉన్నందున ఈ ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలకం కానున్నాయి. 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో ఈసారి బీజేపీతో పాటు కాంగ్రెస్, ఐఎన్ఎల్డీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), జేజేపీ, బీఎస్పీ, ఆజాద్ సమాజ్ పార్టీ (ఏఎస్పీ) పోటీలో ఉన్నాయి. జేజేపీ, ఆజాద్ సమాజ్ పార్టీ కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.రాష్ట్రంలో మొత్తం 1,031 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. రాష్ట్రంలో రెండు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఒక కోటి 5 లక్షల మంది పురుషులు, 95 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అధికార బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలనే తపనతో ఉండగా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తన సత్తా చాటాలనే ప్రయత్నంలో ఉంది. హర్యానా ఎన్నికల్లో తొలిసారిగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా విజయం కోసం ఉవ్విళ్లూరుతోంది. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కోర్టు నుంచి బెయిల్ పొందిన తర్వాత హర్యానా ఎన్నికల్లో ఆప్ సత్తాను చాటాలని ప్రయత్నిస్తున్నారు. కాగా హర్యానాలోని కొన్ని సీట్లు అధికార పీఠానికి చేరువ చేసేవిగా పరిగణిస్తారు. వాటి వివరాల్లోకి వెళితే..లాడ్వాలాడ్వా స్థానం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం కురుక్షేత్ర లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుండి బీజేపీకి 47 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఈ సీటు బీజేపీకి సురక్షితమైన సీటుగా చెబుతారు. ఈ సీటు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన జోగా సింగ్, ఐఎన్ఎల్డీకి చెందిన షేర్ సింగ్ బర్సామి, కాంగ్రెస్ అభ్యర్థి మేవా సింగ్, జేజేపీకి చెందిన వినోద్ శర్మ పోటీపడుతున్నారు.జులానాహర్యానాలోని జులనా సీటు కూడా అధికారానికి కీలకమైనదని చెబుతారు. మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇక్కడ దాదాపు రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు. యోగేష్ బైరాగికి బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. గత ఎన్నికల్లో 49 శాతం ఓట్లతో గెలిచిన అమర్జీత్ ధండాకు జేజేపీ టికెట్ ఇచ్చింది. సురేంద్ర లాథర్కు ఐఎన్ఎల్డీ టికెట్ ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ కైత దలాల్కు టికెట్ కేటాయించింది.హిసార్ఈసారి అందరి చూపు హిసార్ స్థానంపైనే నిలిచింది. ఇక్కడి నుంచి సావిత్రి జిందాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కమల్ గుప్తా ఇక్కడి నుంచి ఎన్నికల పోరులో దిగారు. ఆయన 2014 ఎన్నికల్లో జిందాల్ కమల్ గుప్తా చేతిలో ఓడిపోయారు. నాడు సావిత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఇప్పుడు ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ రామ్ నివాస్ రారాను బరిలోకి దింపింది. హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఒకే దశలో పోలింగ్ జరగనుండగా, 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇది కూడా చదవండి: మాగ్నైట్కు ఎగుమతి కేంద్రంగా భారత్ -
నేడే హరియాణా ఎన్నికల సమరం
చండీగఢ్: హరియాణా శాసనసభ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్రంలో మొత్తం 90 నియోజకవర్గాల్లో శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో 2.03 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని హరియాణా ఎన్నికల కమిషనర్ పంకజ్ అగర్వాల్ శుక్రవారం చెప్పారు. 20,623 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మొత్తం 1,031 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 101 మంది మహిళలు ఉన్నారు.అలాగే ఈసారి ఏకంగా 464 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఐఎన్ఎల్డీ–బీఎస్పీ, జేజేపీ–ఆజాద్ సమాజ్ పార్టీ పోటీ పడుతున్నాయి. ముఖ్యమంత్రి నాయబ్సింగ్ సైనీ, కాంగ్రెస్ నేత భూపీందర్సింగ్ హుడా, రెజ్లర్ వినేశ్ ఫోగాట్, జన నాయక్ జనతా పార్టీ అగ్రనేత దుష్యంత్ చౌతాలా తదితరులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.