12 టీబీ డాటా డిలీట్‌ చేసి.. ఐఎస్‌ఐ‌ ఏజెంట్లతో ముచ్చట్లు | Jyoti Malhotra Case: ISI Links Police Try To Recover 12 TB of data | Sakshi
Sakshi News home page

12 టీబీ డాటా డిలీట్‌ చేసి.. ఐఎస్‌ఐ‌ ఏజెంట్లతో ముచ్చట్లు

May 27 2025 3:56 PM | Updated on May 27 2025 4:14 PM

Jyoti Malhotra Case: ISI Links Police Try To Recover 12 TB of data

పాకిస్తాన్‌కు గూఢచర్యం చేసిందన్న అభియోగాలు ఎదుర్కొంటున్న హర్యానా యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా కేసులో.. తాజాగా షాకింగ్‌ విషయాలు వెల్లడయ్యాయి. పాక్‌ నిఘా సంస్థ.. కరడుగట్టిన ఐఎస్‌ఐ(Inter-Services Intelligence) అధికారులతో ఆమె నేరుగా పరిచయాలు కలిగి ఉందని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.

33 ఏళ్ల జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra) ఏమాత్రం భయం లేకుండా వాళ్లతో పరిచయాలు పెంచుకుంది. ఒకరి తర్వాత మరొకరితో మాట్లాడింది కూడా. ఢిల్లీలోని పాకిస్తాన్‌ హైకమిషన్‌ సందర్శన సందర్భంగా ఆమె వాళ్లను కలిసినట్లు తెలుస్తోంది. అయితే  ఐఎస్‌ఐలో వాళ్లు ఏం పని చేసేవాళ్లో కనుగొనే పనిలో దర్యాప్తు అధికారులు తలమునకలయ్యారు. అంతకు ముందు..

జ్యోతి వ్యక్తిగత డివైజ్‌లను(ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌) పోలీసులు సీజ్‌ చేశారు. ఆ డివైజ్‌ల్లో భారీగా మెసేజ్‌లు, డాటా డిలీట్‌ అయినట్లు గుర్తించారు. ఆ డిలీట్‌ డాటానే సుమారు 12 టీబీ(12 terabyte) దాకా ఉండొచ్చని తెలుస్తోంది.  అందులోని సమాచారం ఈ కేసుకు ఉపకరించే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు రికవరీకి ప్రయత్నిస్తున్నారు. 

పహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్‌ సింధూర్‌(Operation Sindoor) పేరిట భారత సైన్యం పాక్‌ భూభాగంతో పాటు పీవోకేలో వైమానిక దాడులు జరిపింది. ఆపై వారానికి(మే 15వ తేదీన ) యూట్యూబ్‌లో ట్రావెల్‌ వ్లోగింగ్‌ చానెల్‌ నడిపించే జ్యోతిని హర్యానా పోలీసులు అరెస్ట్‌ చేశారు.  పాక్‌కు గూఢచర్యం జరిపి ఉంటుందనే అనుమానిస్తున్నారు. పాక్‌, చైనాలో పర్యటనలతో పాటు పాక్‌లో జరిగిన హైప్రొఫైల్‌ ఈవెంట్లకు ఆమె హాజరు కావడం, కేవలం 4 లక్షల ఫాలోవర్స్‌ ఉన్న ఆమె విచ్చలవిడిగా అక్కడ ఖర్చులు చేయడం, అలాగే గన్‌మెన్లతో వీవీఐపీ ట్రీట్‌మెంట్‌ పొందిందన్న విషయం వెలుగులోకి రావడంపై దర్యాప్తు జరుగుతోంది. 

ప్రస్తుతానికి.. అఫీషియల్స్‌ సీక్రెట్స్‌ యాక్ట్‌, భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద ఆమెపై హర్యానా పోలీసులు కేసులు నమోదు చేశారు. పాక్‌లో ఆమె అసలు వీఐపీ ట్రీట్‌మెంట్‌ ఎందుకు పొందింది? ఎలా పొందగలిగింది? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. అలాగే.. డిలీట్‌ చేసిన డాటాలో గనుక కీలక సమాచారం ఉన్నట్లయితే ఆమె చుట్టూ మరింత ఉచ్చు బిగిసే అవకాశం కనిపిస్తోంది. ఇంకోవైపు.. ఆమె ఆర్థిక లావాదేవీలపై విచారణ కోసం పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థల సాయం కోరే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: విదేశీ భార్యల మోజు వద్దు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement