investigation
-
విచారణపై శ్యామల ఫస్ట్ రియాక్షన్
-
ఫాంహౌస్ కోళ్లపందాల కేసులో విచారణకు హాజరైన పోచంపల్లి
-
అక్రమ కేసులకు భయపడేది లేదు
విజయవాడ స్పోర్ట్స్: అక్రమ కేసులకు తాము భయపడబోమని హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడినా, ప్రజావ్యతిరేక విధానాలను విమర్శించినా, సభలు, సమావేశాలు పెట్టినా అక్రమ కేసులు నమోదు చేస్తూ కూటమి ప్రభుత్వం పాలనను నెట్టుకొస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక ఎల్రక్టానిక్ మీడియా చానల్ చర్చలో మైనర్ బాలిక పేరును గోరంట్ల మాధవ్ ప్రస్తావించారని, ఇది బాలిక హక్కుల రక్షణకు భంగం కలిగిస్తుందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ విజయవాడ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో యాక్ట్, బీఎన్ఎస్ 72, 79 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం మాధవ్ గురువారం విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. మాధవ్ను సైబర్ క్రైం స్టేషన్ సీఐ శ్రీను మధ్యాహ్నం 12.40 నుంచి 1.25 గంటల వరకు విచారించారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని గతంలోనే నోటీసులు పంపితే ఎందుకు స్పందించలేదు?, మైనర్ బాలిక పేరును చర్చలో ఎందుకు ప్రస్తావించారు?, బాలిక పేరు ప్రస్తావించడం తప్పని మీకు తెలీదా? అని సీఐ ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసులో విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని, సాక్షులను బెదిరించవద్దని సూచించి మాధవ్ను పోలీసులు పంపించినట్లు తెలిసింది. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు ఒగ్గు గవాస్కర్, సాయిరాం తదితరుల సమక్షంలో మాధవ్ పోలీసు విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసులతో వైఎస్ జగన్మోహన్రెడ్డిని, వైఎస్సార్సీపీ నాయకులను అడ్డుకోవాలనుకోవడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా పక్కనపెట్టి కేవలం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించడం పైనే కూటమి నాయకులు దృష్టి సారించారని మండిపడ్డారు. ప్రజలపై కూటమి నాయకులు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదని విమర్శించారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనపై రాష్ట్ర ప్రజలు ఇప్పటికే విసుగు చెందారని, ఇకపై జరిగే ఎన్నికల్లో ఆయన గెలిచేది లేదని, వైఎస్ జగన్ ఓడేది లేదన్నారు. -
రామోజీ ఉన్నా, లేకున్నా విచారణ కొనసాగించాల్సిందే
-
ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై విచారణ ముమ్మరం
-
టార్గెట్ రూ.333 కోట్లు!.. 100 మంది యువతులతో సన్నిహితంగా..
గచ్చిబౌలి: ఎప్పటికైతే తాను రూ.333 కోట్లు సంపాదిస్తాడో అప్పటి నుంచి నేరాలు మానేయాలని భావించాడు బత్తుల ప్రభాకర్ అలియాస్ బిట్టూ. దీంతో పాటు తన జీవితంలో 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండాలనీ లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. ఈ మేరకు కొన్నేళ్ల క్రితమే తన ఛాతీపై రెండు వైపులా పచ్చబొట్లు పొడిపించుకున్నాడు. శనివారం గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వద్ద పోలీసులపై కాల్పులు జరిపింది ఇతగాడే. సైబరాబాద్ సీసీఎస్ పోలీసుల విచారణలో అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వివరాలు ఇలా.. చదివింది ఎనిమిదో తరగతి.. పెద్ద పెద్ద కాలేజీలను టార్గెట్గా చేసుకుని చోరీలు చేసే బత్తుల ప్రభాకర్ చదివింది మాత్రం ఎనిమిదో తరగతే. ఏపీలోని చిత్తూరు జిల్లా ఇరికిపెంటకు చెందిన ఇతగాడు 7, 8 తరగతులు విజయవాడలో చదివాడు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ 17 ఏళ్ల వయసు నుంచే చోరీల బాట పట్టాడు. దాదాపు 15 ఏళ్లుగా ఇంజినీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ స్కూల్స్లో చోరీలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మారాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కేసులున్న ఇతడికి బిట్టూ, రాహుల్ రెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, రాజు తదితర మారుపేర్లు ఉన్నాయి. స్నేహితులు, సన్నిహితంగా ఉండే యువతుల వద్ద, షాపింగ్కు వెళ్లినప్పడు మృదు స్వభావిగా ఉంటాడు. ఎక్కడా ఎవరితోనూ గొడవలు పడిన దాఖలాలు లేవని పోలీసులు చెబుతున్నారు. రూ.3 వేల చోరీతో మొదలుపెట్టి... బత్తుల ప్రభాకర్ ఛాతీ భాగంలో కుడి వైపు 3, ఎడమ వైపు 100 అంకెలు, మధ్యలో సిలువ టాటూలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిపై పోలీసులు అతగాడిని ప్రశ్నించారు. కొన్నేళ్ల క్రితం తన నేర జీవితం రూ.3 వేల నుంచి చోరీ మొదలైందని, అప్పట్లో ఒకే రోజు రూ.3 లక్షలు, మొత్తమ్మీద రూ.33 లక్షలు చోరీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని ‘3’ టాటూ వేయించుకున్నానని చెప్పాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రూ.333 కోట్ల సంపాదన లక్ష్యంగా చేసుకున్నానని బయటపెట్టాడు. అలాగే 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండాలన్నది మరో లక్ష్యమని, విలాస వంతమైన జీవితం గడుపుతున్న తాను ఇప్పటికే 40 అలా ఉన్నట్లు చెప్పాడు. గేటెడ్ కమ్యూనిటీలో నివాసం.. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే ఇతగాడు గతంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ముసుగులో ఆ రంగానికి చెందిన వారితో కలిసి మైండ్స్పేస్ సమీపంలోని ఫ్లాట్లో ఉన్నాడు. ప్రస్తుతం నార్సింగి పరిధిలో ఉన్న ఓ గేటెడ్ కమ్యూనిటీలో స్నేహితుల పేరిట ఫ్లాట్ తీసుకొని ఉంటూ ఒడిశాకు చెందిన ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆమె సొంత ఊరుకు వెళ్లింది. పోలీసులు నిందితుడి ఫ్లాట్ను తనిఖీ చేసినప్పుడు రూ.50 వేలు ఖరీదు చేసే మద్యం బాటిల్ లభించింది. ప్రతిరోజూ ఉదయం జిమ్కు వెళ్లడం, వీకెండ్స్లో పబ్స్లో జల్సాలు చేయడం ఇతడి నైజం. కేవలం హైఎండ్ కార్లు మాత్రమే వాడే ప్రభాకర్.. సెకండ్ హ్యాండ్ వాటిని స్నేహితుల పేరిట కొంటాడు. కొన్నాళ్లు వాడిన తర్వాత ఆ వాహనాన్ని ఆ స్నేహితుడికే వదిలేసి తన మకాం మార్చేస్తాడు. పోలీసులకు చిక్కకుండా ఉండటానికే ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు. స్నేహితులకూ భారీగా ముట్టచెబుతూ... ఫ్లాట్లో కలిసి ఉండే క్రమంతో తనకు స్నేహితులుగా మారిన వారికి తన గతం తెలియకుండా జాగ్రత్తపడతాడు. అనుకోకుండా ఎవరికైనా తెలిస్తే వారికి భారీ మొత్తం ఇచ్చి నోరు మూయిస్తాడు. చోరీ చేసిన నగదును స్నేహితుల అకౌంట్లలో వేసి, వారి యూపీఐలు తన ఫోన్లో యాక్టివేట్ చేసుకుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడు. జిమ్, పబ్స్తో పాటు గోల్ఫ్, బౌలింగ్ ఆటలు, సినిమాలు ఇతడి హాబీ. వీటిలో ఎక్కడికి వెళ్లినా తన ముఖం సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా కచ్చితంగా మాస్క్ ధరిస్తాడు. గచ్చిబౌలి కాల్పుల కేసు.. వెలుగులోకి కీలక విషయాలు -
మీర్పేట్ మాధవి కేసు..దర్యాప్తులో కీలక ముందడుగు
సాక్షి,హైదరాబాద్: సంచలనం రేపిన మీర్పేట వెంకటమాధవి హత్య కేసులో కీలక ముందడుగు పడింది. భర్త గురుమూర్తే వెంకట మాధవిని హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో మాధవి మిస్సింగ్ కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. క్లూస్ టీమ్ ఇచ్చిన ఆధారాలతో గురుమూర్తిపై హత్యకేసు నమోదు చేశారు. గురుమూర్తిపై బీఎన్ఎస్(BNS) 101 సెక్షన్ పెట్టారు.క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాలను పోలీసులు ఎఫ్ఎస్ఎల్కు పంపారు. వెంకటమాధవిగా భావిస్తున్న శరీర టిష్యూ, వెంట్రుకలు, రక్తపు మరకలను ఫోరెన్సిక్ల్యాబ్కు పంపారు. మాధవి పిల్లలు, తల్లి దగ్గర నుంచి శాంపిల్స్ సేకరించారు. వీటితో మాధవి డీఎన్ఏ మ్యాచింగ్ కోసమే ఫోరెన్సిక్ పరీక్షలకు పోలీసులు నిర్ణయించారు. మరికొన్ని గంటల్లో పోలీసులకు డీఎన్ఏ నివేదిక చేరనుంది. డీఎన్ఏ నివేదికతో గురుమూర్తిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు.ఇక, ఈ హత్య కేసు దర్యాప్తులో భాగంగా బ్లూ రేస్ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో ఆధారాలను పోలీసులు సేకరించారు. ఇదే సమయంలో ఈనెల 14వ తేదీ రాత్రి నుంచి 16వ తేదీ రాత్రి వరకు నిందితుడు గురుమూర్తి సెల్ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల రికార్డు ఫుటేజ్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు విషయమై దేశంలోని ప్రధానమైన ఫోరెన్సిక్ నిపుణుల సహకారాన్ని పోలీసులు తీసుకుంటున్నారు. కాగా, నేడు పోలీసుల చేతికి డీఎన్ఏ రిపోర్టు అందే అవకాశం ఉంది.కేసులో ఈ పురోగతితో సంచలనం సృష్టించిన మాధవి హత్య కేసు మిస్టరీని పోలీసులు దాదాపు ఛేదించినట్లయింది. కేసు నుంచి తప్పించుకోడానికి మాజీ సైనికుడు గురుమూర్తి పకడ్బందీగా ప్లాన్ చేయడంతో పోలీసులకు సవాల్గా మారింది. డీఎన్ఏ పరీక్షలతో కేసును పోలీసులు కొలిక్కి తీసుకొస్తున్నారు. -
తిరుపతి తొక్కిసలాటపై రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ
-
బద్లాపూర్ కస్టడీ డెత్.. ఆ ఐదుగురే కారణం
ముంబై: మహారాష్ట్రలో సంచలన రేపిన బద్లాపూర్ స్కూల్ లైంగికదాడి ఘటనలో నిందితుడి లాకప్ మరణంపై మేజిస్ట్రేట్ విచారణ పూర్తయింది. నిందితుడు అక్షయ్ షిండే లాకప్ డెత్కు ఐదుగురు పోలీసు అధికారులు బాధ్యులని తేలింది. నకిలీ ఎన్కౌంటర్లో పోలీసులే తమ కుమారుడు అక్షయ్ను చంపేశారని తండ్రి అన్నా షిండే ఫిర్యాదుపై ముంబై హైకోర్టు జస్టిస్ రేవతి మొహితె డెరె, జస్టిస్ నీలా గోఖలేల ధర్మాసనానికి సోమవారం సీల్డు కవర్లో దర్యాప్తు నివేదికను మేజిస్ట్రేట్ సమర్పించారు. నివేదిక తమకు అందిందని ధర్మాసనం తెలిపింది. థానె క్రైం బ్రాంచి సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సంజయ్ షిండే, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ నీలేశ్ మోరె, హెడ్ కానిస్టేబుళ్లు అభిజీత్ మోరె, హరీశ్ తావడెతోపాటు ఒక పోలీస్ డ్రైవర్ను కూడా కస్టడీ మరణానికి కారణమని అందులో పేర్కొన్నారని చెప్పింది. దీని ఆధారంగా ఈ ఐదుగురిపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక(ఎఫ్ఎస్ఎల్) నివేదికను బట్టి చూస్తే మృతుడి తండ్రి ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయ పడింది. ఈ నివేదిక ప్రతిని అన్నా షిండేకు, ప్రభుత్వానికి అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. అసలు ప్రతి, ఆధారాల పత్రాలు, సాక్ష్యుల వాంగ్మూలాలు తమ వద్దే ఉంటాయని స్పష్టం చేశారు. విచారణ చేపట్టేదెవరో రెండు వారాల్లో తమకు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బద్లాపూర్ స్కూల్లో అటెండర్గా పనిచేసే అక్షయ్ షిండే(24)స్కూల్ టాయిలెట్లో ఇద్దరు బాలికపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు రావడంతో గతేడాది ఆగస్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 23న అతడు చనిపోయాడు. అక్షయ్ భార్య ఇచ్చిన ఫిర్యాదుపై ప్రశ్నించేందుకు తలోజా జైలు నుంచి తీసుకొస్తుండగా పోలీసుల నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపాడని, ఇన్స్పెక్టర్ సంజయ్ షిండే జరిపిన ఎదురు కాల్పుల్లో అతడు మృతి చెందాడని పోలీసులు ప్రకటించారు. ఆ సమయంలో వీరితోపాటు నీలేశ్ మోరె, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, డ్రైవర్ ఉన్నారు. -
ఆర్జీకార్ జూనియర్ వైద్యురాలి హత్యోదంతం.. బాధితురాలి తండ్రి సంచలన ఆరోపణలు
కోల్కతా : యావద్దేశాన్నీ కదిలించిన కోల్కతా ఆర్జీకార్ ఆస్పత్రిలో జరిగిన యువ వైద్యురాలి (అభయ) పాశవిక హత్యోదంతంపై సీబీఐ విచారణ చేపట్టింది. అయితే, సీబీఐ విచారణపై బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. తమ కుమార్తె హత్యోదంతంలో సీబీఐ అధికారులు విచారణ పేరుతో చేసింది ఏమీలేదని వ్యాఖ్యానించారు. గతేడాది ఆగస్ట్ 9న ట్రైనీ డాక్టర్పై జురిగిన దారుణంపై సీబీఐ సుదీర్ఘంగా దర్యాప్తు చేపట్టింది. ఆ దర్యాప్తు ఆధారంగా మరికొద్ది సేపట్లో సిల్దా సివిల్ అండ్ క్రిమినల్ కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది.ఈ సమయంలో అభయ తండ్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దర్యాప్తులో సీబీఐ చేసింది ఏమీలేదు. మా కుమార్తె కేసుకు సంబంధించి మేం కోల్కతా హైకోర్టు,సుప్రీం కోర్టు ముందు అనేక ప్రశ్నలను లేవనెత్తాం. సమాధానాలు కోరాం. కోర్టు ఆ బాధ్యతను సీబీఐకి అప్పగించింది.కానీ సీబీఐ మా అనుమానాల్ని ఇంతవరకూ నివృత్తి చేయలేదు. మా అమ్మాయికి జరిగిన దారుణంలో ఒక్కరు కాదు. నలుగురు అబ్బాయిలు. ఒక అమ్మాయి ప్రమేయం ఉందని డీఎన్ఏ రిపోర్ట్ చెబుతోంది. నిందితులకు శిక్ష పడినప్పుడే మాకు ఉపశమనం లభిస్తుంది. ఈ కేసులో మాకు న్యాయం జరిగేంత వరకు న్యాయ స్థానాల తలుపు తడుతూనే ఉంటామని’ స్పష్టం చేశారు.ప్రధాని మోదీకి లేఖ మా అమ్మాయి కేసు విషయంలో న్యాయం చేయాలని కోరుతూ మేం ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు లేఖలు రాశాం.వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు’ అని అభయ తండ్రి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. -
ద.కొరియా విమాన ప్రమాదం..వెలుగులోకి కీలక విషయాలు
సియోల్:దక్షిణ కొరియాలో ఇటీవల జరిగిన భారీ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తులో కీలక విషయం బయటపడింది. జెజు ఎయిర్లైన్స్కు చెందిన విమానం డిసెంబర్ 29న మయూన్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతూ రన్వే పక్కనున్న గోడను ఢీకొట్టింది. విమానం బ్యాంకాక్ నుంచి మయూన్కు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పలు రకాలుగా ప్రచారం జరుగుతోంది. ప్రమాదం జరగడానికి నాలుగు నిమిషాల ముందు నుంచి విమానంలోని బ్లాక్బాక్స్ పని చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రమాద కారణాలపై జరుగుతున్న దర్యాప్తులో తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆ విమానం రెండు ఇంజిన్లలో పక్షి ఈకలు, రక్తం ఉన్నట్లు దర్యాప్తు బృందం గుర్తించినట్లు సమాచారం. విమానాన్ని పక్షి ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందన్న వాదనకు బలం చేకూరుతోంది. అయితే ఈ విషయాన్ని దర్యాప్తు బృందం అధికారికంగా ధృవీకరించలేదు. దర్యాప్తులో అధికారులు యాంత్రిక, నిబంధనల ఉల్లంఘన సమస్యలను గుర్తించినట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించినట్లు కథనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా విమానం థ్రస్ట్ రివర్సర్స్, ఫ్లాప్స్, స్పీడ్బ్రేక్స్ వంటివి పూర్తిస్థాయిలో పని చేయలేదని తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది పూర్తిస్థాయిలో సన్నద్ధంగా లేకుండానే విమానం నేల పైకి దిగడానికి అనుమతించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విమానం రన్వేపై అత్యవసరంగా దిగే సమయంలో ల్యాండింగ్ గేర్ పని చేయకపోవడంతో అది బాడీ పైనే బెల్లీ ల్యాండింగ్ చేసిందని ప్రమాద సమయంలో అధికారులు తెలిపారు.అప్పటికే ఒక ఇంజిన్ను పక్షి ఢీకొనడంతో దానిలో శక్తి కూడా గణనీయంగా తగ్గిందని అందువల్లే ల్యాండ్ అయ్యాక అదుపుతప్పి గోడను ఢీకొట్టిందని చెప్పారు. ద.కొరియా విమాన ప్రమాదం జరిగే కొద్ది రోజుల ముందే అజర్బైజాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం కజకిస్తాన్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలోనూ భారీ సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి తోడు 2024 సంవత్సరాంతంలో వరుస విమాన ప్రమాదాలు జరగడంతో విమాన ప్రయాణికులు కలవరపాటుకు గురయ్యారు. ఇదీ చదవండి: నల్లపెట్టె మౌనరాగం -
లైడిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం.. రేవంత్ సిద్ధమా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు(Formula E Car Race Case)లో కేటీఆర్(KTR) ఈడీ విచారణ ముగిసింది. దాదాపు ఏడు గంటల పాటు ఆయనను ఈడీ ప్రశ్నించింది. నగదు బదిలీపైనే కేటీఆర్ను ఈడీ(ED) ప్రశ్నించింది. విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అడిగిన ప్రశ్ననే పదేపదే అడిగారు. ఎన్ని సార్లు అయినా విచారణకు వస్తానని చెప్పా. రేవంత్పై ఏసీబీ కేసు ఉందని.. నాపై ఏసీబీ కేసు బనాయించారు. రేవంత్పై ఈడీ కేసు ఉందని.. నాపై ఈడీ కేసు బనాయించారు.’’ అని ఆయన మండిపడ్డారు‘‘న్యాయ స్థానాలపై మాకు విశ్వాసం ఉంది. లైడిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం.. రేవంత్ సిద్ధమా?. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఎన్ని ప్రశ్నలు అడిగిన సమాధానం చెబుతా. నేను ఎలాంటి తప్పు చేయలేదు’’ అని కేటీఆర్ చెప్పారు.‘‘భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని, చట్టాలను గౌరవించే పౌరుడిని.. ఏ తప్పు చేయకపోయినా అవినీతికి పాల్పడకపోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా కేసు పెడితే విచారణ సంస్థలను గౌరవించి విచారణకు హాజరయ్యారు. ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ కూడా కేసు పెట్టి ఈ రోజు విచారణకు పిలిస్తే హాజరయ్యాను. రెండు సంస్థలు కూడా ఒకే రకమైన ప్రశ్నలు అడిగాయి.ఇదీ చదవండి: ఈడీ విచారణకు కేటీఆర్.. ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్..రెండు సంస్థలు ఎన్నిసార్లు పిలిచినా వస్తా. ఎన్ని ప్రశ్నలు అడిగినా చెప్తా. పూర్తిగా విస్తరణ సహకరిస్తాను అని చెప్పాను. తప్పకుండా నా నిజాయితీని రుజువు చేసుకుంటానని చెప్పాను. ఈ విచారణకు దాదాపు 5 నుంచి 10 కోట్లు ఖర్చు అవుతుంది. నేను నిజాయితీపరుడ్ని.. ధైర్యంగా ఎదుర్కొంటా. 10 కోట్ల రూపాయలతో రైతులకు రుణమాఫీ చేయొచ్చు. పెన్షన్ ఇయ్యొచ్చు. రేవంత్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే జడ్జి ముందు కూర్చుందాం. మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం. నేను రేవంత్ రెడ్డి న్యాయమూర్తి ముందు కూర్చుంటాం.. ఇద్దరికీ లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. ఒక 50 లక్షల రూపాయలతో ఓడిసిపోతుంది విచారణ. అనవసరంగా 10 కోట్ల ఖర్చు ఎందుకు?’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
ఏడు గంటల పాటు కేటీఆర్ ను విచారించిన ఏసీబీ
-
నాతో పాటు లాయర్ వస్తే ఇబ్బందేంటి?
-
విచారణలో పోలీసులకు అల్లు అర్జున్ సమాధానాలు
-
చిక్కడపల్లి స్టేషన్ లో అల్లు అర్జున్ 2 గంటల విచారణ అప్డేట్స్
-
పోలీస్ స్టేషన్ లో కొనసాగుతున్న పుష్ప ఇన్వెస్టిగేషన్
-
పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు సాహిల్
-
పోలీసుల నోటీసులతో విచారణకు హాజరైన మంచు మనోజ్
-
సీబీఐ దర్యాప్తు ముమ్మరం
సాక్షి, విశాఖపట్నం: వాల్తేరు డీఆర్ఎం సౌరభ్కుమార్ ప్రసాద్ కాంట్రాక్టు సంస్థల నుంచి రూ.25 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. వరుసగా నాలుగో రోజు శనివారం ఏడీఆర్ఎం పేషీలో ఉద్యోగులు, అధికారులను సీబీఐ బృందం విచారించింది. డీఆర్ఎం అనధికార వ్యవహారాలను పర్యవేక్షించే ఇద్దరు ఉద్యోగులపై సీబీఐ ఆరా తీసింది. ప్రొటోకాల్–స్పోర్ట్స్ విభాగంలో ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి ఒకరు డీఆర్ఎం వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించేవారు. ఫైళ్ల లావాదేవీలు పూర్తి చేసే విషయంలో ముందుగా సదరు ఉద్యోగితో సంప్రదింపులు జరిగేవి.ఎవరైనా విదేశీ కరెన్సీ లంచంగా ఇస్తే అతనే వాటిని మార్పిడి చేసేవారని సమాచారం. ఈ విషయాలపైనా సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. అదేవిధంగా డీఆర్ఎం అక్రమ వ్యవహారాలను దగ్గరుండి చక్కబెట్టే ఒక గ్రూప్–4 ఉద్యోగి పాత్రపైనా సీబీఐ అధికారులు అనుమానాలు వ్యక్తం చేసి విచారించారు. మొత్తం మెకానికల్, ఇంజినీరింగ్, మెడికల్తోపాటు 8 విభాగాల ఉద్యోగులను ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశ్నించారు. అనంతరం ‘కేసు దర్యాప్తులో ఉంది.గత డీఆర్ఎం సౌరభ్కుమార్ ప్రసాద్ ఆమోదించిన, ఆమోదించబోయే ఫైళ్లను ఎవరూ కదిలించొద్దు. మేం ఈ నెల 27 తర్వాత వచ్చి పూర్తిగా పరిశీలించిన తర్వాత నిర్ణయం చెబుతాం’ అని సీబీఐ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు డీఆర్ఎం లంచాల వ్యవహారంలో ఓ సీనియర్ అధికారి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సదరు అధికారిని కూడా విచారించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. కొన్ని ఫైళ్లు స్వాదీనంఈ కేసులో ఇప్పటికే డీఆర్ఎం కార్యాలయంతోపాటు విశాఖ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న డీఆర్ఎం బంగ్లాలోను సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించి పలు కీలక ఫైళ్లు స్వా«దీనం చేసుకున్నారు. డీఆర్ఎం లంచం తీసుకుంటూ దొరకడానికి కారణమైన సంస్థలతోపాటు ఇంకా ఏ సంస్థలకైనా అనుకూలంగా టెండర్లలో మార్పులు చేయడం, పెనాల్టీ తగ్గించడం వంటి వ్యవహారాలకు పాల్పడి ఉండవచ్చని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే ప్రతి టెండర్ ఫైల్ను పరిశీలించాలని నిర్ణయించారు. సౌరభ్కుమార్ వాల్తేరు డీఆర్ఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏయే ఫైళ్లపై సంతకాలు చేశారన్న విషయాలపై పూర్తిస్థాయిలో ఈ నెల 27వ తేదీ తర్వాత దర్యాప్తు చేయనున్నారు. -
విశాఖలో లా స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల విచారణ
-
మరోసారి కాళేశ్వరంపై విచారణ
-
సిమ్రత్ కేసులో కెనడా పోలీసుల కీలక ప్రకటన
భారత సంతతికి చెందిన యువతి గుర్సిమ్రత్ కౌర్(19).. ఓ ప్రముఖ స్టోర్లోని వాక్ ఇన్ ఒవెన్లో శవమై కనిపించడం తెలిసిందే. ఆమె మృతిపై తల్లితో సహా సహోద్యోగులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ కేసు విచారణ జరిపిన కెనడా పోలీసులు తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తైందని, అనుమానాస్పద హత్యగా అనిపించలేదని హాలీఫాక్స్ పోలీసులు సోమవారం ప్రకటించారు. అలాగే.. తప్పు జరిగిందనడానికి ఆధారాలు కూడా లేవని వెల్లడించారు. ‘‘ఈ కేసులో ఏం జరిగిందో అనేదానిపై అనేక మంది అనేక ప్రశ్నలు లేవనెత్తారు. కానీ, మా విచారణలో అలాంటి అనుమానాలేవీ మాకు కనిపించలేదు. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నట్లు మాకు అనిపించడం లేదు. ఈ కేసు దర్యాప్తు పూర్తైంది’’ అని ఓ అధికారి వీడియో సందేశంలో తెలిపారు.Statement on Sudden Death Investigation pic.twitter.com/0IsyAfMkzX— Halifax_Police (@HfxRegPolice) November 18, 2024 పంజాబ్కు చెందిన 19 ఏళ్ల గురుసిమ్రన్.. గత రెండేళ్లుగా తన తల్లితో కలిసి హాలీఫాక్స్లోని వాల్మార్ట్ షోరూంలో పని చేస్తోంది. తండ్రి, సోదరుడు భారత్లోనే ఉంటారు. అయితే కిందటి నెలలో.. వాక్ ఇన్ ఒవెన్లో ఆమె అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది.సిమ్రన్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆమె స్టోర్ మొత్తం వెతికింది. చివరకు ఒవెన్ నుంచి పొగలు రావడం గమనించి స్టోర్ సిబ్బంది అనుమానంతో తెరిచి చూడగా అందులో కాలిపోయిన స్థితిలో గురుసిమ్రన్ మృతదేహం కనిపించింది. సిమ్రన్ మృతిపై తల్లి అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు ఆమెను బలవంతంగా అందులో ఎవరో నెట్టేసి హత్య చేసి ఉంటారని, వాక్ ఇన్ ఒవెన్ తలుపు లాక్ చేసి ఉండడమే తమ అనుమానాలకు కారణమని సిమ్రన్ సహోద్యోగులు చెప్పారు. కానీ, పోలీసులు మాత్రం అనుమానాలేవీ లేవని చెబుతుండడం గమనార్హం. -
వెలుగులోకి రామోజీ చట్ట విరుద్ధ కార్యకలాపాలు
-
రాజ్ పాకాలకు నోటీసులు
శంకర్పల్లి: మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో అనుమతి లేని పార్టీ నిర్వహణ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారనే కారణంతో రాజ్ పాకాల (51)తోపాటు, కొకైన్ తీసుకున్నట్టు నిర్ధారణ అయిన విజయ్ మద్దూరి (56)పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి విజయ్ మద్దూరికి 41 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు ఇచ్చి, స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. విచారణ నిమిత్తం సోమవారం పోలీస్స్టేషన్కు రావాలని వారు సూచించినా.. ఆయన సాయంత్రం వరకు కూడా స్టేషన్కు రాలేదు. ఇక శనివారం రాత్రి పార్టీ నుంచి వెళ్లిపోయిన రాజ్ పాకాల అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మోకిల పోలీసులు సోమవారం దర్యాప్తు కోసం రాయదుర్గంలోని రాజ్ పాకాల నివాసానికి వెళ్లారు. తాళం వేసి ఉండటంతో ఇంటి బయట నోటీసులు అతికించారు. సోమవారం రాత్రి 11 గంటలకల్లా తమ ముందు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసు విషయంలో రాజ్ పాకాల హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తాను 48 గంటల్లో విచారణకు హాజరవుతానని పేర్కొంటూ న్యాయవాదుల ద్వారా పోలీసులకు లేఖ అందజేశారు. ఇంటికి అనుమతులు లేవన్న అధికారులు రాజ్ పాకాలకు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామ పరిధిలోని సర్వే 691, 692 లలో శ్రీమాతే ప్రాపర్టీస్ పేరుతో సుమారు 8 ఎకరాల భూమి ఉంది. అందులో దాదాపు 1,500 గజాల విస్తీర్ణంలో జీ+1 ఇంటి నిర్మాణం చేపట్టారు. జన్వాడ గ్రామం 111 జీవో పరిధిలో ఉండటంతో ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వలేదని అధికారులు చెప్తున్నారు. దీంతో ఈ ఇంటికి శ్రీమాతే ప్రాపర్టీస్ పేరుతో 7– 90 ఇంటి నంబర్తో పంచాయతీకి పన్ను చెల్లిస్తున్నట్టు తెలిసింది. పార్టీలో పాల్గొన్నవారి విచారణ రాజ్ పాకాల ఇంట్లో పార్టీకి హాజరైన వారందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. ఇప్పటికే ముగ్గురికి నోటీసులిచ్చి విచారించగా.. మరో ముగ్గురు స్వచ్ఛందంగా పీఎస్కు వచ్చి, వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. మిగతా 32 మందికి రెండు రోజుల్లో నోటీసులిచ్చి, విచారిస్తామని వెల్లడించారు. కేసుపై ఏసీపీ సమీక్ష రాజ్ పాకాల ఇంట్లో పార్టీ కేసును నార్సింగి ఏసీపీ రమణగౌడ్ పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఆయన స్టేషన్కు వచ్చి, కేసు దర్యాప్తు తీరు, ఇతర వివరాలను తెలుసుకున్నారు. రాజ్ పాకాల, విజయ్ మద్దూరి విచారణకు హాజరుకాకపోతే తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఆయన సూచనలు చేసినట్టు తెలిసింది. ఇక ముందస్తు చర్యల్లో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ నుంచి 10 మంది ప్రత్యేక పోలీస్ సిబ్బందిని మోకిల పీఎస్కు పంపించారు. ఫోన్ సీజ్లో ట్విస్ట్ ఈ కేసులో కొకైన్ పాజిటివ్ వచ్చిన విజయ్ మద్దూరికి సంబంధించిన డ్రగ్ టెస్ట్ కిట్తోపాటు ఆయన ఫోన్ను సీజ్ చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే ఆ పార్టీలో పాల్గొన్న ఓ మహిళ తన ఫోన్ సీజ్ చేశారని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్నారు. కేసు కోర్టు పరిధిలోకి ఉన్నందున కోర్టు అనుమతి తర్వాత ఫోన్ను తిరిగిస్తామని వెల్లడించారు. విజయ్ను అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన తన ఫోన్కు బదులు పక్కన ఉన్న మహిళ ఫోన్ను ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
సిద్ధిఖీ కేసు: మరో నలుగురి నిందితుల అరెస్ట్.. కీలక విషయలు వెల్లడి
ముంబై: ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో పురోగతి వస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు బుధవారం మరో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిలో ఒకరు.. షూటర్, ప్రధాన సూత్రధారికి మధ్య లింక్ కలిగి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక నిందితుడిని హర్యానాలో, ముగ్గురిని పుణెలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాజా జరిగిన అరెస్టులతో ప్రస్తుతం ముంబై పోలీసుల అదుపులో ఉన్న హత్యకేసు నిందితుల సంఖ్య మొత్తం 14 మందికి చేరింది.హర్యానాలోని కైతాల్లో అరెస్టు చేసిన నిందితుడిని అమిత్ హిసంసింగ్ కుమార్ (29)గా గుర్తించారు. కస్టడీలో ఉన్న ఇతర నిందితుల విచారణలో ఈ హత్యానేరంలో అతని పాత్ర కూడా ఉన్నట్లు తెలిసిందని తెలిపారు. హత్య సూత్రధారి, షూటర్కు మధ్య కీలకమైన లింక్ కలిగి ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పుణెలో అదుపులోకి తీసుకున్న మరో ముగ్గురిని రూపేష్ రాజేంద్ర మోహోల్ (22), కరణ్ రాహుల్ సాల్వే (19), శివమ్ అరవింద్ కోహద్ (20)గా గుర్తించారు. ఈ కేసులో వారి ప్రమేయం కూడా ఉన్నట్లు నిర్ధారించారు. వీరిని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారని ఓ అధికారి తెలిపారు.Baba Siddique Murder case | Accused Amit Hisamsing Kumar was sent to custody of Mumbai Crime Branch till November 4 by the court. During the interrogation, Amit said that he had full knowledge about the murder conspiracy. 4th accused Zeeshan Akhtar had told Amit that someone…— ANI (@ANI) October 24, 2024కీలక నిందితుడైన జీషన్ అక్తర్ సూచనల మేరకు నిందితుడు అమిత్ కుమార్ బ్యాంకు ఖాతాకు రూ. 2.50 లక్షలు బదిలీ అయినట్లు పోలీసులు తెలిపారు. ఇక.. అతను హర్యానాలోని కైతాల్లోవైన్ షాప్ నడుపుతున్నాడు. కైతాల్ ప్రాంతంలో అతనిపై ఇప్పటికే నాలుగు దాడులు, అల్లర్లకు సంబంధించిన కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. జూన్ 2024లో బెయిల్పై బయటకు వచ్చి జీషన్ అక్తర్కు.. అమిత్ కుమార్ ఆశ్రయం ఇచ్చారు. సిద్దిఖీని హత్య చేసే కాంట్రాక్టు జీషన్ లభించటంతో అమిత్తో కలిసి ప్లాన్పై చర్చించినట్లు పోలీసులు తెలిపారు.చదవండి: సిద్ధిఖీ హత్య కేసు: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడితో నిందితుల చాట్హత్యను అమలు చేయడానికి డబ్బు అవసరం ఉండటంతో కాంట్రాక్టు ఇచ్చిన వ్యక్తి నుంచి అమిత్ కుమారు బ్యాంక్ ఖాతాలోకి డబ్బు జమ చేయించుకున్నాడు. దీంతో అమిత్ కుమార్ బ్యాంక్ ఖాతాలో రూ. 2.5 లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. అయితే ఈ హత్య కుట్రలో అమిత్ ప్రమేయం కూడా ఉందని పోలీసులు తెలిపారు.నిందితుడు అమిత్ కుమార్ను బుధవారం కోర్టులో హాజరుపరచగా, విచారణ నిమిత్తం అతన్ని నవంబర్ 4వ తేదీ వరకు పోలీసు కస్టడీ విధించింది. అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను క్రైం బ్రాంచ్ విచారిస్తోంది. ఇక.. ప్రధాన నిందితుడు షూటర్ శివ కుమార్ గౌతమ్, ప్రధాన కుట్రదారులు శుభమ్ లోంకర్, జీషన్ అక్తర్ ఇంకా పరారీలో ఉన్నారు. అక్టోబరు 12న ముంబైలో బాబా సిద్ధిఖీని హత్యకు గురయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
సిద్ధిఖీ కేసు: ‘నిందితుల ఫోన్లో జీషన్ ఫొటో’
ముంబై: ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం)నేత బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది. ఈ హత్య జరిగి వారంరోజులు గడుస్తున్న నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తాజాగా కీలక విషయాలు బయటపెట్టారు. బాబా కుమారుడు జీషన్ సిద్దిఖీ ఫొటోను నిందితుడి ఫోన్లో ఉన్నట్లు గుర్తించారు. హత్య కేసు కేసు.. సూత్రధారి బాబా కుమారుడు జీషన్ సిద్ధిఖీ ఫొటోనే షూటర్లతో పంచుకోవడానికి సోషల్ మీడియా అప్లికేషన్ యాప్ స్నాప్చాట్ను ఉపయోగించాడని పోలీసులు తెలిపారు.Baba Siddique murder case | A picture of Baba Siddique's son Zeeshan Siddique was found in the phone of the accused in Baba Siddique's murder. This picture was shared with the accused by their handler through Snapchat. Investigation revealed that the shooters and conspirators…— ANI (@ANI) October 19, 2024షూటర్లు, కుట్రదారులు సమాచారాన్ని చేరవేయటం కోసం ఈ అప్లికేషన్ను ఉపయోగించారని పేర్కొన్నారు. ఈ యాప్లో సమాచారం చేరిన వెంటనే ఆటో డిలీట్ అయ్యే ఫీచర్ ఉండటం గమనార్హం. ఈ కేసులో ముగ్గురు షూటర్లలో గుర్మైల్ సింగ్, ధర్మరాజ్ కశ్యప్లను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు శివకుమార్ గౌతమ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇక.. నాలుగో నిందితుడు హరీష్ కుమార్ బలక్రమ్ నిసాద్ను సోమవారం యూపీలో అరెస్టు చేసి శుక్రవారం ముంబైకి తీసుకువచ్చారు. చదవండి: బాబా సిద్దిఖీ హత్య కేసులో మరో ఐదుగురు అరెస్ట్కానిస్టేబుల్ సస్పెండ్బాబా సిద్ధిఖీ హత్య జరిగిన సమయంలో ఆయనతో పాటే ఉన్న పోలీస్ సెక్యూరిటీ గార్డు కానిస్టేబుల్ శ్యామ్ సోనావానే సస్పెండ్ అయ్యారు. ఆయనపై అంతర్గత విచారణ కూడా జరుగుతోందని ముంబై పోలీసులు తెలిపారు.Baba Siddique Murder case | Police security guard Constable Shyam Sonawane, present with late NCP leader Baba Siddique at the time of the murder has been suspended. An internal investigation is also going on: Mumbai Police— ANI (@ANI) October 19, 2024ఇక.. బాబా సిద్ధిఖీ తామే హత్య చేయించామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్తో ఉన్న సన్నిహిత సంబంధాలు, దావూద్ ఇబ్రహీం వంటి అండర్వరల్డ్ వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని కారణంగా టార్గెట్ చేసినట్లు ఆ గ్యాంగ్లోని ఓ సభ్యుడు ఫేస్బుక్ పోస్ట్లో వెల్లడించారు.చదవండి: సిద్ధిఖీ కేసు: 65 బుల్లెట్లు, యూట్యూబ్ వీడియోలు, బైక్తో ప్లాన్ -
పోలీసులే షాకయ్యేలా.. విశాఖ హనీ ట్రాప్ కేసులో సంచలనాలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ హనీ ట్రాప్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కిలేడీ జాయ్ జెమీమా ఆగడాలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి. ధనవంతులను తన అందంతో ట్రాప్ చేస్తున్న మాయా లేడీ.. సోషల్ మీడియాలో పరిచయం చేసుకొని విదేశాల్లో ఉన్న వారిని సైతం భారత్కి రప్పిస్తోంది. విచారణలో పోలీసులే షాకయ్యే అనేక వాస్తవాలు బయటపడుతున్నాయి.మంచి అమ్మాయిగా నటించి...విశాఖలోని షీలానగర్కు చెందిన ఓ కుటుంబం కొంతకాలంగా అమెరికాలో ఉంటోంది. ఇన్స్ట్రాగామ్ ద్వారా వారి కుమారుడితో మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీకి చెందిన కొరుప్రోలు జాయ్ జెమీమా పరిచయం పెంచుకుంది. బాధిత యువకుడి ద్వారా షీలానగర్లోని వారి చిరునామా తెలుసుకుంది. అతని తల్లిదండ్రులు షీలానగర్లో ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్లి కొన్ని రోజుల పాటు మంచి అమ్మాయిగా నటించింది. మీ అబ్బాయి స్నేహితురాలినని..పెళ్లి చేసుకుంటానని అడగ్గా.. అతని తల్లిదండ్రులు నిరాకరించారు.ఇంటికి రప్పించి.. నగ్నంగా ఫోటోలు తీసి..ఆ తర్వాత అమెరికాలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్న బాధిత యువకుడికి మాయమాటలు చెప్పి విశాఖకు రప్పించింది. ఎయిర్పోర్టు నుంచే యువకుడిని మురళీనగర్లోని తన ఇంటికి తీసుకువెళ్లి బంధించింది. మత్తు పదార్థాలు కలిపిన జ్యూస్లు, డ్రింక్లు ఇచ్చి పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తూ మైకంలో ఉన్నప్పుడు శారీరకంగా కలిసి ఉన్నట్లు ఫొటోలను తీయించింది. వాటితో ఆ యవకుడిని బ్లాక్మెయిల్ చేసింది. దీంతో యువకుడు తన తల్లిదండ్రులకు చెప్పి పెళ్లికి ఒప్పిస్తానన్నా వినిపించుకోకుండా జెమీమా.. తన సహచరులతో కలిసి తరచూ బెదిరించేది.ఇదీ చదవండి: ప్రియుడి మోజులో.. ఆమె భర్తను ఏం చేసిందంటే?బలవంతంగా నిశ్చితార్థం చేసుకుని..ఇటీవల భీమిలిలోని ఒక హోటల్లో బలవంతంగా నిశ్చితార్థం చేసుకుని.. యువకుడితో రూ.5 లక్షల వరకు ఖర్చు చేయించింది. యువకుని ఫోన్ బ్లాక్ చేసి, నిశ్చితార్థం, శారీరకంగా కలిసి ఉన్న ఫొటోలు చూపించి.. మురళీనగర్లోని తన ఇంట్లో మళ్లీ నిర్భంధించింది. తనను పెళ్లి చేసుకోకపోతే ఈ ఫొటోలతో పోలీస్ కేసులు పెట్టించి.. అమెరికా వెళ్లకుండా చేస్తానని బెదిరిస్తూ అతని వద్ద ఉన్న డబ్బులు కాజేసింది.ఆమె ఇంటి నుంచి అతను ఒకసారి పారిపోయేందుకు ప్రయత్నించగా సహచరులతో కలిసి కత్తితో చంపడానికి ప్రయత్నించింది. ఆమె సహచారులు కూడా జెమీమాను పెళ్లి చేసుకోకపోతే అమెరికా వెళ్లకుండా శవమైపోతావు అంటూ బెదిరింపులకు దిగేవారు. ఎట్టకేలకు ఈ నెల 4న బాధిత యువకుడు ఆమె నుంచి తప్పించుకుని భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు మురళీనగర్లో జెమీమాను అదుపులోకి తీసుకున్నారు. శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గతంలో కూడా జెమీమా, ఆమె స్నేహితులు ధనవంతుల అబ్బాయిలను ప్రేమపేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు బాధిత యువకుడు పోలీసులకు తెలిపాడు. -
అతీగతీలేని దర్యాప్తు
సాక్షి, అమరావతి : నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో చిన్నారి వాసంతిని అపహరించి, హత్యాచారం చేసి మూడునెలలు అవుతున్నా మృతదేహాన్ని ఇప్పటివరకూ గుర్తించలేదు. అలాగే, చిత్తూరు జిల్లా పుంగనూరులో చిన్నారి అంజుమ్ను అపహరించి, హత్యచేసి ఆరు రోజులవుతున్నా ఇప్పటివరకు నిందితులెవరో కనుగొనలేదు. .. ఇదీ బాలికలు, మహిళల భద్రతపట్ల సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ప్రభుత్వ తీరును ఆసరాగా చేసుకునే రాష్ట్రంలో రౌడీలు, ఆకతాయిలు అత్యాచారాలు, లైంగిక దాడులకు బరితెగిస్తున్నారు. మరోవైపు.. దర్యాప్తు విషయంలో పోలీసుల తీరూ నత్తనడకను మరిపిస్తోంది. ఇందుకు పుంగనూరులో చిన్నారి అశి్వయ అంజుమ్ కిడ్నాప్, హత్య కేసే ఉదాహరణ. ఆమె తల్లిదండ్రులు వెంటనే ఫిర్యాదు చేసినా పోలీసులుగానీ ప్రభుత్వంగానీ బాధ్యతాయుతంగా స్పందించకపోవడంవల్లే ఏడేళ్లకే ఆ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి. అపహరణకు గురైన అంజూమ్ను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. కనీసం ఆమె హంతకులను అయినా గుర్తించడంలో పోలీసులు క్రియాశీలంగా దర్యాప్తు చేస్తున్నారా అంటే అదీ లేదు. ముఖ్యమంత్రి, హోంమంత్రి అయినాసరే ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారా అంటే అదసలే లేదు. సత్వర స్పందన లేదు.. సమగ్ర దర్యాప్తు అంతకన్నా లేదు.. నిజానికి.. అంజుమ్ గత ఆదివారం సాయంత్రం నుంచి కనిపించలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు షమియ, అజ్మతుల్లా ఆ రోజు సా.6 గంటల సమయంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు సరైన రీతిలో స్పందించలేదు. పుంగనూరులోని అంజుమ్ కుటుంబం నివసించే యూబీ కాంపౌండ్ నుంచి చెంగాలాపురం రోడ్డు వరకే దర్యాప్తును పరిమితం చేయడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే పోలీసు జాగిలాలు చెంగలాపురం రోడ్డు వరకు వచ్చి ఆగిపోయాయి. దీంతో పోలీసుల దర్యాప్తు కూడా అక్కడితోనే నిలిచిపోయింది. అంతేగానీ అక్కడికి పది కి.మీ. పరిధిలో గాలింపు చర్యలు చేపట్టాలనిగానీ అనుమానితుల కదలికలపై ఆరా తీయాలనిగానీ వారికి అనిపించకపోవడం విస్మయపరుస్తోంది.చెంగలాపురం రోడ్డు వరకు జాగిలాలు వచ్చి ఆగిపోయాయి అంటే.. అక్కడ నుంచి ఆగంతకులు మరో వాహనంలో అంజుమ్ను తీసుకునిపోవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనేలేదు. ఇక గత ఆదివారం అంజుమ్ నివాసం పరిసర ప్రాంతాల్లో అనుమానితుల కదలికలపైనా ఆరా తీయలేదు, స్థానిక ఆకతాయిలపై దృష్టిసారించనే లేదు. సెల్ఫోన్ టవర్ల డేటా, గూగుల్ టేకవుట్ డేటా విశ్లేíÙంచాలని అనిపించకపోవడం విడ్డూరం. ఆదివారం సాయంత్రం నుంచి బుధవారం వరకు పోలీసులు తూతూమంత్రంగా విచారణ పేరుతో విలువైన కాలాన్ని వృథా చేశారు. చివరికి.. బుధవారం మధ్యాహ్నం ఎన్ఎస్పేట సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో అంజుమ్ మృతదేహాన్ని గుర్తించారు. అంజూమ్ నివాసానికి ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 4 కి.మీ. దూరంలోనే ఉంది. అంటే.. పోలీసులు మూడ్రోజుల్లో కూడా కనీసం 4 కి.మీ. పరిధిలో కూడా గాలింపు చర్యలు చేపట్టలేదన్నది స్పష్టమవుతోంది.ఆరు రోజులైనా నిందితులను గుర్తించనేలేదు..పోనీ అంజుమ్ హంతకులను గుర్తించే దిశగా అయినా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారా అంటే అదీ లేదు. చిన్నారి అంజుమ్ అపహరణకు గురై ఆరు రోజులు గడిచాయి. ఆమె మృతదేహాన్ని గుర్తించి మూడు రోజులైంది. ఇప్పటివరకు అసలు నిందితులను గుర్తించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. హత్యకు గల కారణాలనూ పోలీసులు నిర్ధారించలేకపోయారు. స్థానికంగా ఉండే ఓ మహిళతోపాటు గంజాయికి బానిసలైన నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు గంజాయి వ్యసనపరులపైకి నేరాన్ని నెట్టివేసేందుకు యత్నిస్తోందని స్థానికులు సందేహం వ్యక్తంచేస్తున్నారు. అంతేతప్ప.. అంజుమ్ను అపహరించి హత్యచేసిన అసలు దోషులను గుర్తించేందుకు సమగ్రంగా దర్యాప్తు చేయడంలేదని చెబుతున్నారు. కేసును ఏదో విధంగా క్లోజ్ చేయాలనే దిశగానే పోలీసులు ప్రయత్నిస్తున్నారు తప్ప.. అసలు దోషులను గుర్తించేందుకు చిత్తశుద్ధితో దర్యాప్తు చేయడంలేదని కూడా వారు విమర్శిస్తున్నారు. -
స్వతంత్ర దర్యాప్తుతో వాస్తవాలు తెలుస్తాయి
-
యూపీలో దారుణం.. నలుగురి కుటుంబ సభ్యుల హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్లోని అమేథీలో ఓ ఉపాధ్యాయుడి కుటుంబం అత్యంత దారుణ హత్యకు గురైంది. గురువారం ఉపాధ్యాయుడికి ఇంట్లో చొరబడిన గుర్తుతెలియని దుండగులు నాలుగురు కుటుంబ సభ్యులపై కాల్పులు జరిపారు. అమేథీలోని శివరతంగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ నగర్ క్రాస్రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన ఉపాధ్యాయుడిని సునీల్ కుమార్(35)గా గుర్తించారు. ఆయన పన్హౌనాలోని కాంపోజిట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. దుండగుల కాల్పల్లో సునీల్ భార్య పూనం (32), వారి కుమార్తె దృష్టి (6), ఏడాది వయసున్న కుమార్తె మృతి చెందారు.ఈ ఘటపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. టీచర్ భార్య ఆగస్టు 18న చందన్ వర్మా అనే వ్యక్తి రాయ్ బరేలీ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తమకు, తమ కుటుంబానికి ఏమైనా జరిగినే చందన్ వర్మానే బాధ్యుడు అని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్లు ఎస్పీ అనూప్ కుమార్ సింగ్ తెలిపారు. ఆమెను వేధింపులకు గురిచేసినట్లు కూడా కేసులో ఆమె ప్రస్తావించటం గమనార్హం. అయితే ఈ హత్యకు సంబంధించి అనుమానితుడు చందన్ వర్మా ఆచూకీ ఇంకా దొరకలేదని, ఆయన పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఈ కుటుంబ హత్యకు సంబంధించి పూర్తి స్పష్టత రాలేదని అన్నారు.పోలీసుల దర్యాప్తులో భాగంగా చందన్ వర్మా వాట్సాప్ చాట్ బయపడినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు కుటుంబ సభ్యులను హత్య చేసి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకోవాలనే ప్లాన్ అందులో ఉన్నట్లు వెల్లడించారు. ‘‘ ఐదుగురు చనిపోతారు" అని వర్మ వాట్సాప్ చాట్లో వ్రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్యాప్తు చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ యూనిట్, స్పెషల్ ఆపరేషన్ గ్రూపులు కూడా దర్యాప్తులో పాల్గొంటున్నాయని తెలిపారు. -
కొనసాగుతున్న సిట్ దర్యాప్తు
తిరుమల: తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంటూ అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబే వేసిన సిట్ సోమవారం కూడా విచారణ కొనసాగించింది. సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ నేతృత్వంలోని బృందం తిరుమలలో ల్యాబ్ను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలను ఎలా గుర్తిస్తారో సిబ్బందిని అడిగి తెలుసుకుంది. అనంతరం నెయ్యిని నిల్వ చేసే గోదాముకు చేరుకుని ఇక్కడ ఎన్ని రోజులు ఉంచుతారు, నాణ్యతా పరీక్షల నిమిత్తం ఎప్పుడు శాంపిళ్లు తీసుకుంటారు, శాంపిల్ తీసుకున్న అనంతరం ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారు, టెండర్దారుడు ప్రమాణాల మేరకు సరఫరా చేశారా లేదా అనేది ఎలా నిర్ధారిస్తారు, ఒకవేళ కల్తీ జరిగితే.. ఆ విషయాన్ని పసిగట్టే పరికరాలు ల్యాబ్లో ఉన్నాయా వంటి వివరాలను అధికారులు, సిబ్బంది నుంచి సేకరించారు.ల్యాబ్లో తనిఖీలు నిర్వహిస్తుండగా.. అప్పటికే ల్యాబ్కు చేరుకున్న ట్యాంకర్లలోని నెయ్యిని పరిశీలించిన అధికారులు, ల్యాబ్ సిబ్బంది నెయ్యి నాణ్యతా పరీక్షలు ఎలా జరుపుతారో ప్రత్యక్షంగా పరిశీలించారు. గతంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన టెండర్దారుల వివరాలను, నాణ్యతా పరీక్షల నివేదికలను అధికారులు సేకరించారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఎప్పటి నుంచి నెయ్యి సరఫరా చేసింది, ఆ నెయ్యిలో నాణ్యత లేదని ఎప్పుడు గుర్తించారు, నెయ్యిని పరీక్షల కోసం పంపించాలని ఎవరు ఆదేశించారన్న సమాచారాన్ని కూడా అధికారులు సేకరించారు. అనంతరం త్రిపాఠీ నేతృత్వంలోని అధికారుల బృందం పోలీస్ గెస్ట్హౌస్కు చేరుకుని గత మూడు రోజులుగా లభ్యమైన ఆధారాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తరువాత సిట్ చీఫ్ నేతృత్వంలోని బృందం తిరుపతి బయలుదేరి వెళ్లిపోగా.. డీఎస్పీ స్థాయి నేతృత్వంలోని అధికార బృందం మాత్రం ఇంకా ల్యాబ్లో తనిఖీలు నిర్వహిస్తూ.. పాత రికార్డులను పరిశీలించింది.నేడు లడ్డూ పోటు, విక్రయ కేంద్రాల్లో విచారణ మంగళవారం లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడి సరుకులను పరిశీలించి.. లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీవైష్ణవులను విచారించనున్నట్టు సమాచారం. మరో బృందం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు, నాణ్యమైన నెయ్యి సరఫరా కోసం టీటీడీ, ఏఆర్ డెయిరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలించనుంది. టెండర్ల నిబంధనల్లో మార్పులు చేయడానికి దారి తీసిన పరిస్ధితులపై కూడా సిట్ బృందం దర్యాప్తు చేయనుంది. సిట్ బృందం మరో రెండు రోజుల పాటు తిరుమల, తిరుపతిలో ఉండి విచారణ నిర్వహించనుంది. సిట్ కార్యకలాపాల కోసం టీటీడీ శ్వేత భవనంలో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. -
కల్తీ నెయ్యి వ్యవహారం పై జోరు పెంచిన సిట్ ..ఏఆర్ ఫుడ్స్ కు నోటీసులు
-
కల్తీ నెయ్యి వ్యవహారం పై జోరు పెంచిన సిట్ ..ఏఆర్ ఫుడ్స్ కు నోటీసులు
-
తిరుమల లడ్డూ ఎపిసోడ్ పై కొనసాగుతున్న సిట్ దర్యాప్తు
-
తిరుపతిలో నేడు రెండవ రోజు సిట్ బృందం విచారణ
-
సీబీఐ విచారణ.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్కాం కేసులో సీఎం సిద్దరామయ్య విచారణను ఎదుర్కొనున్న వేళ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణను అనుమతిస్తూ గతంలో మంజూరు చేసిన నోటిఫికేషన్ను ఉపసంహరించుకుంది. ఈ మేరకు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయించింది.కుంభకోణం కేసులో వాస్తవాలు వెలుగులోకి వచ్చేందుకు సీబీఐతో దర్యాప్తు జరపాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. సీఎంపై సీబీఐ విచారణను నిరోధించడానికే కాంగ్రెస్ సర్కార్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే సీబీఐ పక్షపాతంగా వ్యవహరించడం వల్లే ఈ నిర్ణయం తీసుకునన్నట్లు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ తెలిపారు. సీఎం సిద్దరామయ్య ఎదుర్కొంటున్న భూ కుంభకోణం ఆరోపణలకు, దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ‘కేంద్ర దర్యాప్తు సంస్థ దుర్వినియోగానికి గురవుతోంది. పక్షపాతంతో వ్యవహరిస్తోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం’ అని తెలిపారు. కాగా ముడా భూ కుంభకోణం కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతివ్వడాన్ని బుధవారం హైకోర్టు సమర్ధించిన విషయం తెలిసిందే. ఈ అనుమతిని సవాల్ చేస్తూ సీఎం వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ.. గవర్నర్ చర్యలుచట్ట ప్రకారం ఉన్నాయని తెలిపింది. కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో సీబీఐ విచారణకు ఆదేశించింది.అనంతరం ఈ కుంభకోణంలో సిద్ధరామయ్యపై విచారణ జరపాలని లోకాయుక్త పోలీసులను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఆయనపై సీఆర్పీసీ సెక్షన్ 156(3) కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. డిసెంబర్ 24 లోగా విచారణ నివేదికను కోర్టుకు అందజేయాలని పోలీసులకు సూచించింది.ఇదిలా ఉండగా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం.. రాష్ట్రంలో నేర పరిశోధనలను స్వేచ్ఛగా నిర్వహించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థకు(సీబీఐ) ప్రభుత్వం గతంలో అనుమతి ఇచ్చింది. -
ముడా స్కామ్.. సీఎం సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు
బెంగళూరు : మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు ఎదుర్కోనున్నారు. బుధవారం ముడా స్కామ్ కేసులో లోకాయిక్త విచారణ చేయాలని బెంగళూరు స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ చేపట్టి మూడు నెలల్లో నివేదిక అందించాలని సూచించింది. ప్రత్యేక కోర్టు ఆదేశాలతో కర్ణాటక మైసూర్ జిల్లా లోకాయిక్తా పోలీసులు విచారణ చేపట్టనున్నారు.మరోవైపు ఇదే ముడా స్కామ్ కేసులో ఇరుక్కున్న సిద్ధరామయ్య రాజీనామా చేయాలంటూ విపక్షాల డిమాండ్ చేస్తున్నాయి. మంగళవారం ఇదే ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించాలంటూ కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ జారీ చేసిన ఆదేశాల్ని హైకోర్టు సమర్థించింది. గవర్నర్ గెహ్లోత్ ఆదేశాల్ని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగ ప్రసన్న విచారణ చేపట్టారు. గవర్నర్ నిర్ణయం చట్టబద్ధమేనని.. సిద్దరామయ్య పిటిషన్ను కొట్టివేశారు.ముడా స్థల కేటాయింపుల్లో అవకతవకలు ఉన్నట్లు పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సిద్ధరామయ్య భార్యకు మైసూరు పరిసరాల్లో భూములు కేటాయించడం అక్రమమని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. భూములు కేటాయింపుల కారణంగా రాష్ట్ర ఖజానాకు రూ.45 కోట్లు నష్టం వాటిల్లినట్లు పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ సీఎం సిద్ధరామయ్యపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. 👉 చదవండి : సీఎంపై విచారణ.. గవర్నర్ ఆదేశాల్ని సమర్థించిన హైకోర్టునాకు భయం లేదుముడా స్కామ్ కేసులో స్పెషల్ కోర్టు లోకాయిక్త విచారణ చేపట్టాలని జారీ చేసిన ఆదేశాలపై సిద్ధరామయ్య స్పందించారు. ‘ముడా స్కామ్ కేసులో చట్టబద్ధంగా పోరాటం చేస్తాం. నేను దేనికీ భయపడను. విచారణకు నేను సిద్ధం’ అని వ్యాఖ్యానించారు. -
గుర్తు లేదు..మరిచిపోయిన!
సాక్షి, హైదరాబాద్: ‘నాకు తెలియదు.. గుర్తు లేదు..మర్చిపోయిన..’కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ వేసిన ప్రశ్నలకు కొందరు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు చెప్పిన వింత సమాధానాలు ఇవి. తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ లే»ొరేటరీ(టీఎస్ఈఆర్ఎల్) చీఫ్ ఇంజనీర్గా వ్యవహరించిన శ్రీదేవిని కమిషన్ ఏ ప్రశ్న అడిగినా ‘తెలీదు..గుర్తు లేదు’అని సమాధానాలివ్వగా, కమిషన్ ఆమెపై తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేసింది. బరాజ్ల నిర్మాణానికి సంబంధించిన మోడల్ స్టడీస్ విషయంలో కీలకపాత్ర పోషించిన ఆమెపై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించగా, సమాధానాలు ఇవ్వలేక నీళ్లు నమిలారు. బరాజ్లను నిర్మించడానికి ముందే మోడల్ స్టడీస్ చేశామని తొలుత చెప్పిన ఆమె, ఆ వెంటనే మాట మార్చారు. దీంతో మీరు ఇచ్చిన అఫిడవిట్లోని సమాచారానికి సైతం కట్టుబడి ఉండకపోతే ఎలా? అని ఆమెపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లోని తన కార్యాలయంలో పలువురు ఇంజనీర్లకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. ⇒ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్(ఎస్డీఎస్ఓ) సీఈగా సైతం శ్రీదేవి వ్యవహరించగా, ఆ పోస్టులో ఉండి బరాజ్ల పరిరక్షణకు ఐఎస్ కోడ్ను అమలు చేశారా? అని కమిషన్ ప్రశ్నించగా, మౌనంగా ఉండిపోయారు. ⇒ బరాజ్లకు వరదలు ఎప్పుడొచ్చాయన్న ప్రశ్నకు సైతం తెలియదు అని బదులిచ్చారు. ⇒ బరాజ్లకు 2020లో త్రిడీ మోడల్ స్టడీస్ నిర్వహించినట్టు ఆమె చెప్పగా, 2023లో జరిగినట్టు టీఎస్ఈఆర్ఎల్ నివేదిక ఇచి్చందని కమిషన్ ఆమెకు తెలియజేసింది. అయితే ఆ విషయం తనకు గుర్తు లేదని ఆమె బదులివ్వడంతో కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. బరాజ్లకు తనిఖీలు చేయలేదు బరాజ్ల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకున్నారని ఎస్డీఎస్ఓ సీఈ ప్రమీళను కమిషన్ ప్రశించగా, ఆ బాధ్యత ప్రాజెక్టు అథారిటీదేనని ఆమె బదులిచ్చారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అమల్లోకి వచి్చనా బరాజ్ల భద్రత వాటి చీఫ్ ఇంజనీర్దేనని స్పష్టం చేశారు. గేట్ల నిర్వహణలో మ్యానువల్స్, బరాజ్ల నిర్వహణ ప్రొటోకాల్స్ అమలు చేశారా? అని కమిషన్ ప్రశ్నించగా, ఆమె సమాధానమివ్వడానికి ఇబ్బంది పడ్డారు. దీంతో పేర్లు చెప్పకుండా వివరాలు తెలపాలని కమిషన్ ఆమెను కోరింది. చట్టం ప్రకారం వర్షకాలానికి ముందు, తర్వాత తనిఖీలు నిర్వహించి నివేదికలు ఇవ్వలేదని ఆమె వివరించారు. – ఎస్స్డీఎస్ఓ ఈఈ విజయలక్ష్మి సైతం ఇదే విషయాన్ని కమిషన్కు తెలిపారు. అధ్యయనాలు, నిర్వహణ లేకపోవడమే కారణం బరాజ్ల వైఫల్యానికి కేవలం నిర్వహణ, పర్యవేక్షణ లోపాలే కాకుండా వాటికి ఎగువ, దిగువన రక్షణ చర్యలు తీసుకోకపోవడం కూడా కారణమేనని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) ఈఈ రఘునాథ శర్మ తెలిపారు. 2019 లోనే వరదల తర్వాత బరాజ్లలో లోపాలు బయటపడగా, 2023 అక్టోబర్లో మేడిగడ్డ బరాజ్ కుంగే వరకు మరమ్మతులు చేయలేదని ఆరోపించారు. వైఫల్యానికి కారకులు ఎవరు? నాటి ప్రభుత్వ అధినేతనా? అని కమిషన్ అడగ్గా, 3డీ మోడల్ అధ్యయనాలు జరపకపోవడం, నిర్వహణ ప్రొటోకాల్స్ పాటించకపోవడం కారణమని ఆయన బదులిచ్చారు. ⇒ మోడల్ స్టడీస్ పూర్తికాక ముందే బరాజ్ల నిర్మాణం ప్రారంభించడంతోనే విఫలమయ్యాయని పలువురు టీఎస్ఈఆర్ఎల్ ల్యాబ్ ఇంజనీర్లు కమిషన్కు తెలిపారు. బరాజ్లను నీటి మళ్లింపుకోసం నిర్మిస్తారని, నిల్వ చేయడంతోనే కుంగిపోవడం, సీపేజీలు ఏర్పడడం జరిగిందన్నారు. వరదల సమయంలో కూడా గేట్లు మూసి ఉంచడంతో ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. -
కాళేశ్వరం కమిషన్ విచారణ రేపటి నుంచి ప్రారంభం
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ రేపటి(శుక్రవారం) నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. రేపు కమిషన్ ముందుకు ఎడుగురు సీఈ స్థాయి ఇంజనీర్లు రానున్నారు. కమిషన్ బహిరంగ విచారణకు రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు రానున్నారు. గత నెలలో కమిషన్.. 15 మందికిపైగా విచారణ చేసింది. రేపటి నుంచి 25 మందికి పైగా కమిషనర్ జస్టిస్ పీనాకి చంద్ర ఘోష్ విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఎస్ఏ, పూణే రిపోర్ట్ కోసం లేఖలు రాసిన కమిషన్, కమిషన్కు కావాల్సిన సమాచారం ఇస్తానని ఆయా టీమ్స్ చెప్పాయి. కమిషన్ అడిగిన లాయర్ను ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. అఫిడవిట్ దాఖలు చేసిన ప్రతీ ఒక్కరినీ కమిషన్ బహిరంగ విచారణ చేయనుంది.ఇక.. ఇప్పటికే కమిషన్ విచారణ కార్యాలయానికి కమిషనర్ జస్టిస్ పీనాకి చంద్ర ఘోష్ చేరుకున్నారు. ఘోష్తో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ భేటీ అయ్యారు.రేపటి నుంచి ఎవరిని విచారణ చేయాలి అనే అంశం, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్టులపై చర్చించారు. ఇప్పటికే మొదలైన ఓపెన్ కోర్టు విచారణ. గత 20 నుంచి ఐదు రోజుల పాటు ఇరిగేషన్ అండ్ సీఈఓ అధికారులను జస్టిస్ గోష్ విచారించారు. -
కోల్కతా డాక్టర్ కేసు: కుట్ర కోణంలో సీబీ‘ఐ’ దర్యాప్తు!
కోల్కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ అధికారులు బుధవారం(సెప్టెంబర్18) కీలక విషయాలు వెల్లడించారు. హత్యాచారం సమయంలో కేసులో ప్రధాన నిందితుడు సంజయ్రాయ్ ధరించిన దుస్తులను కోల్కతా పోలీసులు ఆలస్యంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.హత్య జరిగిన రోజు ఆర్జీకర్ మెడికల్ కాలేజీ సెమినార్హాల్లోకి నిందితుడు సంజయ్రాయ్ వస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా కేసులో సంజయ్రాయ్ ప్రధాన నిందితుడని హత్య జరిగిన మరుసటి రోజే స్పష్టమైంది. అయినా హత్య సమయంలో రాయ్ ధరించిన దుస్తులను సీజ్ చేసేందుకు కోల్కతాలోని తాలా పోలీస్స్టేషన్ పోలీసులకు రెండు రోజులు పట్టింది. ఒకవేళ హత్యాచారం జరిగిన మరుటిరోజే రాయ్ దుస్తులను సీజ్ చేసి ఉంటే మరిన్ని కీలక ఆధారాలు లభించి ఉండేవి’అని సీబీఐ అధికారులు అభిప్రాయపడ్డారు. మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో సంజయ్రాయ్తో పాటు ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ఘోష్, తాలా మాజీ సీఐ అభిజిత్ మండల్ను సీబీఐ ఇప్పటివరకు అరెస్టు చేసింది. అయితే వీరు విచారణలో సహకరించడం లేదని, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారని సీబీఐ తెలిపింది.రాయ్,ఘోష్,మండల్లు కుట్ర చేశారా..? సీబీఐ కూపీ..!మహిళా డాక్టర్ హత్యాచారంలో సంజయ్ రాయ్, ఆర్జీకర్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ఘోష్, తాలా పీఎస్ సీఐ మండల్ మధ్య కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ సీబీఐ కూపీలాగుతున్నట్లు తెలుస్తోంది. హత్యకు ముందు వీరు ముగ్గురి మధ్య ఏమైనా ఫోన్కాల్స్ నడిచాయా అన్నకోణంలోనూ శోధిస్తున్నట్లు సమాచారం. ఆగస్టు9 తెల్లవారుజామున కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో సెమినార్హాల్లో నిద్రపోతున్న మహిళా ట్రైనీ డాక్టర్పై లైంగికదాడి చేసి హత్యచేశారు. ఈ కేసును తొలుత కోల్కతా తాలా పీఎస్ పోలీసులు దర్యాప్తు చేయగా హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు బాధ్యతలను ఐదు రోజుల తర్వాత సీబీఐ తీసుకుంది. కేసు దర్యాప్తును స్వయంగా సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తుండడం గమనార్హం. ఇదీ చదవండి.. కోల్కతా సీపీగా మనోజ్వర్మ -
అబద్ధాల పుట్ట సందీప్ ఘోష్.. అభయ కేసు దర్యాప్తుపై సీబీఐ అధికారులు
కోల్కతా : ఆర్జీ కార్ ఆస్పత్రి అభయ కేసు విచారణలో సీబీఐ కీలక విషయాల్ని వెల్లడించింది. కేసు దర్యాప్తులో భాగంగా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కు సీబీఐ అధికారులు పాలిగ్రాఫ్ టెస్ట్, లేయర్డ్ వాయిస్ అనాలసిస్ పరీక్షల్లో సైతం అన్నీ అబద్ధాలు చెప్పినట్లు తేలిందని సీబీఐ అధికారులు వెల్లడించారు. న్యూ ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (CFSL) నుండి వచ్చిన రిపోర్ట్ సైతం సందీప్ ఘోష్ చెప్పిన సమాధానాలు మోసపూరితంగా ఉన్నట్లు పీటీఐ సైతం నివేదించింది.అభయ కేసు విచారణలో సీబీఐ అధికారులు పలు కీలక విషయాల్ని వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఆ వివరాల మేరకు.. ఆగస్టు 9న ఆర్జీ కార్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ వైద్యురాలిపై దారుణం జరిగినట్లు సందీప్ ఘోష్కు ఉదయం 9.58 గంటలకు సమాచారం అందింది. కానీ సందీప్ ఘోష్ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో బాధితురాలి స్నేహితులు, తోటి జూనియర్ డాక్టర్లు విమర్శలు చేయడంతో ఆ తర్వాత జరిగిన ఘటనకు.. ఏ మాత్రం సంబంధం లేకుండా ఫిర్యాదు చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.హత్య జరిగితే.. ఆత్మహత్య అని ఎలా అంటారు?అదే సమయంలో ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, పైగా ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పిన విషయాన్ని సీబీఐ అధికారులు ప్రస్తావించారు. బాధితురాలి దుస్తులు, ఆమె శరీరంపై గాయాలు ఆత్మహత్య అని ఎలా నిర్ధారిస్తారు అని దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేయడం ఎందుకు ఆలస్యమైంది?అభయ ఘటనపై సందీప్ ఘోష్ ఆగస్టు 9 ఉదయం 10.03 గంటలకు తాలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అధికారి (ఓసీ) అభిజిత్ మోండల్తో సంప్రదించగా.. ఉదయం 11.30 గంటలకు అసహజ మరణం కేసు నమోదు చేశారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఇదే అంశంపై సీబీఐ అధికారులు మోండల్ను అరెస్ట్ చేశారు. జనరల్ డైరీ ఎంట్రీలో ఇలాజనరల్ డైరీ ఎంట్రీ 542 ప్రకారం.. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ సెమినార్ హాల్లో వైద్యురాలు అచేతనంగా పడి ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ అప్పటికే బాధితురాలిని పరిశీలించిన ఆమె సహచర జూనియర్ డాక్టర్ మరణించినట్లు నిర్ధారించారు. సాక్ష్యాలన్నీ నాశనంఆసుపత్రి అధికారులు, నిందితులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వివరాలను ప్రస్తావిస్తూ జనరల్ డైరీలో వివరాలు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో మోండల్ జాప్యం చేయడం, నేరం జరిగిన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోకపోవడంపై కీలకమైన సాక్ష్యాలు దెబ్బతిన్నాయని సీబీఐ అధికారులు తెలిపారు.బాధితురాలి ఘటనపై ఆలస్యంగా స్పందించిన పోలీసులు ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ పుటేజీ ఆధారంగా తెల్లవారు జామున 4.03 గంటలకు నిందితుడు సంజయ్ రాయ్ సెమినార్ హాల్లో ఉన్న అభయ గదిలోకి వెళ్లినట్లు గుర్తించారు. అంనతరం, అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. -
అక్కడ ఏం జరిగిందో మీరు చూశారా?.. గుడ్లవల్లేరు విద్యార్థులకు బెదిరింపులు
సాక్షి, విజయవాడ: గుడ్లవల్లేరులో విచారణ పేరుతో విద్యార్థులపై పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారు. మేం చెప్తుంటే మీరెందుకు వినడంలేదంటూ విద్యార్థులు నిరసన చేయడంపై పోలీసులు వార్నింగ్లు ఇస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మీరెందుకు ఇలా చేస్తున్నారు? ఎస్పీ అధికారి వచ్చి చెప్తున్నా మీకు అర్థం కావడం లేదా?. తిండి తిప్పలు లేకుండా పడి ఏడుస్తున్నామంటూ చిందులు తొక్కుతున్నారు.మీరు ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది.. మీకు బాధ్యత లేదా అంటూ పోలీసులను విద్యార్థులు ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా విద్యార్థులపై ఆగ్రహించిన మహిళా పోలీస్వీ డియో రికార్డ్ చేయడం నువ్వు చూశావా..? మీ దగ్గర వీడియో ఉందా?. నువ్వు కళ్లతో చూశావా..? కళ్లతో చూస్తేనే నమ్మాలి..?. అక్కడ ఏం జరిగిందో నువ్వు చూశావా..?. అంటూ న్యాయం కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కాళేశ్వరం విచారణలో దూకుడు పెంచిన కమిషన్..
-
కోల్కతా జూనియర్ డాక్టర్ కేసు సీబీఐకి అప్పగింత
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనపై కోల్కతా హైకోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తునకు ఆదేశించింది. ఇప్పటివరకు విచారణ చేపట్టిన రాష్ట్ర పోలీసులు ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను వెంటనే సీబీఐకి అందజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐని కోర్టును ఆదేశించింది. కోర్టు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరగాలని మృతురాలి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా పోలీసుల దర్యాప్తులో పురోగతి లేదంటూ హైకోర్టు మండిపడింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు చీఫ్ జస్టిస్ శివజ్ఞానం ఆదేశాలు జారీ చేశారు. గత వారం రోజులుగా ఈ కేసులో న్యాయం జరగాలని జూనియర్ డాక్టర్లు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్లో జూనియర్ డాక్టర్పై జరిగిన హత్య, అత్యాచారం ఘటనపై విచారణను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్లకు నోటీసులు జారీ చేసింది.ఈ కేసును వచ్చే ఆదివారం లోపు పరిష్కరించాలని సీఎం మమతా బెనర్జీ సోమవారం పోలీసులకు డెడ్లైన్ విధించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన ప్రతీ నిందితుడిని అరెస్ట్ చేయాలని ఆమె పోలీసులను ఆదేశించారు. National Human Rights Commission (NHRC), India has taken suo motu cognizance of a media report carried on 9th August that a junior woman doctor was found dead at the Seminar Hall of the Kolkata’s state-run R G Kar Medical College & Hospital on 9th August...The Commission has… pic.twitter.com/Ct4eSVXNzA— ANI (@ANI) August 13, 2024చదవండి: ట్రైనీ డాక్టర్ కేసు.. ఆర్జీకార్ మాజీ ప్రిన్సిపల్పై కోల్కతా హైకోర్ట్ ఆగ్రహం -
ప్రముఖ సంస్థపై సీబీఐ కేసు నమోదు
ఆదిత్య బిర్లా గ్రూప్నకు చెందిన హిందాల్కోపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2011–13 మధ్య కాలంలో బొగ్గు తవ్వకాల కోసం పర్యావరణ అనుమతులు పొందడంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చినట్లు తెలిపింది. తీవ్ర కాలుష్యం ఉన్న ఒడిశా జార్సుగూడ ప్రాంతంలోని తలబిరా–1 గనిలో హిందాల్కో ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించిందని విచారణ అనంతరం సీబీఐ పేర్కొంది.తలబిరా-1 గనిలో మైనింగ్ను అనుమతించడంలో నిపుణుల అంచనా కమిటీ (ఈఏసీ) కార్యదర్శి హోదాలో కంపెనీకి అనుకూలంగా వ్యవహరించిన అప్పటి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ డైరెక్టర్గా ఉన్న టి.చాందిని పేరును సీబీఐ నిందితుల జాబితాలో చేర్చింది. ఆదిత్య బిర్లా మేనేజ్మెంట్ కార్పొరేషన్ 2011–13 మధ్య బొగ్గు తవ్వకాలకు తప్పనిసరి పర్యావరణ అనుమతులు పొందేందుకు మంత్రిత్వ శాఖ అధికారులకు భారీగా లంచాలు చెల్లించిందనే ఆరోపణలు వచ్చాయి. దాంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) 2016లో ప్రాథమిక విచారణ జరిపింది. పరిమితికి మించి 30 లక్షల టన్నుల బొగ్గును అదనంగా వెలికితీశారని వెల్లడించింది. దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 120–బి (నేరపూరిత కుట్ర), అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం హిందాల్కో, అప్పటి డైరెక్టర్ చాందినిలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.ఇదీ చదవండి: 16.8 లక్షల కార్లను రీకాల్ చేసిన టెస్లా!ఇదిలాఉండగా, ఈ విషయంపై హిందాల్కో స్పందించింది. ‘ఇది 2014–15కి సంబంధించిన పాత విషయం. ప్రభుత్వం చేపట్టిన గనుల కేటాయింపుల రద్దు ప్రక్రియలో భాగంగా వాటిని ఎప్పుడో ప్రభుత్వం తీసుకుంది. 100కు పైగా గనుల కేటాయింపులు రద్దు చేసిన విషయం అందరికీ తెలిసిందే’ అని సంస్థ ప్రతినిధి తెలిపారు. -
‘నారదా’ స్టింగ్ ఆపరేషన్ కేసు.. జర్నలిస్టుకు సీబీఐ నోటీసులు
బెంగళూరు: నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో జర్నలిస్టు మాథ్యూ సామ్యూల్కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 22న విచారణ నిమిత్తం తమముందు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. మెయిల్ ద్వారా జర్నలిస్టుకు సీబీఐ నోటీసులు పంపింది.2014లో పశ్చిమబెంగాల్లో నిర్వహించిన నారదా స్టింగ్ ఆపరేషన్ 2016లో వెలుగులోకి వచ్చింది. బెంగాల్ ప్రభుత్వంలోని సీనియర్ ఐఏఎస్ అధికారులు, తృణమూల్ కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా నారదా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. జులైలోనే నోటీసులిచ్చినప్పటికీ తాను అమెరికాలో ఉన్నందున విచారణకు రాలేనని సామ్యూల్ బదులిచ్చారు. దీంతో సీబీఐ ఆయనకు మళ్లీ నోటీసులు ఇచ్చింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: నిందితుల అరెస్ట్కు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. ప్రధాన నిందితులు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావుల అరెస్ట్లకు రంగంసిద్దం చేశారు. విదేశాల నుంచి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు వేగవంతం చేశారు. అమెరికాలో ఉన్న నిందితులకు రెడ్కార్నర్ నోటీసులను జారీ చేసేందుకు ఇంటర్ పోల్తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ కేసు దర్యాప్తు బృందం నేషనల్ సెంట్రల్ బ్యూరో అధికారులు, సీబీఐ అధికారులతో సమన్వయం చేసుకుంటోంది. అమెరికా, భారత్ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం నిందితులను అరెస్టకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని దర్యాప్తు బృందం కోర్టుకు తెలియజేసింది. వీలైనంత త్వరగా నిందితులను ఇండియాకు తీసుకువచ్చి ఫోన్ టాపింగ్ కేసులో విచారించనున్నారు పోలీసులు. కేసులో ఉన్న మరి కొంతమందికి సంబంధించిన దర్యాప్తు బృందం ఆధారాలను సేకరించింది. త్వరలోనే మరి కొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనుంది.చదవండి: ప్రభాకర్రావును రప్పించేందుకు రెడ్కార్నర్ నోటీసులు -
NEET Paper Leak: ఒక్కో పేపర్ రూ. 60 లక్షలు..150 మంది కొనుగోలు
పట్నా: నీట్ యూజీ 2024 పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. తాజాగా సీబీఐకి అందిన సమాచారం ప్రకారం విద్యార్థులు నీట్ ప్రశ్నపత్రాలను రూ.35 నుంచి 60 లక్షలకు కొనుగోలు చేశారు. నిందితులు ఈ పేపర్లను బీహార్ విద్యార్థులకు రూ.35 నుంచి 45 లక్షలకు విక్రయించగా, బీహార్ వెలుపలి విద్యార్థులకు రూ.55 నుంచి 60 లక్షలకు విక్రయించారు. విచారణలో 150 మందికి పైగా విద్యార్థులు పేపర్లు కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభించాయి.గుజరాత్లోని గోద్రా, మహారాష్ట్రలోని లాతూర్, హజారీబాగ్, పట్నా ఇతర నగరాల్లోని వివిధ ప్రాంతాలలో ఈ విక్రయాలు జరిగినట్లు సీబీఐ దర్యాప్తు నివేదికలో వెల్లడైంది. పట్నాలోని 35 మంది విద్యార్థులకు సమాధానాలతో కూడిన ప్రశ్నా పత్రాలను అందించారని సీబీఐ తన దర్యాప్తు నివేదికలో పేర్కొంది. అయితే ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసిన 150 మంది విద్యార్థుల్లో సగం మంది మెరుగైన మార్కులు సాధించలేదని తెలుస్తోంది.దర్యాప్తులో ఎన్టీఏ పలువురు అనుమానిత విద్యార్థుల పేర్లను ఆర్థిక నేరాల విభాగానికి పంపింది. ఈఓయూ ఆ విద్యార్థులను విచారించింది. మరోవైపు నీట్ పేపర్ లీక్ కేసులో ధన్బాద్లో అరెస్టయిన అవినాష్ కుమార్ అలియాస్ బంటీని ఆరు రోజుల పోలీసు రిమాండ్పై సీబీఐకి అప్పగించాలని పట్నా ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఇతనిని జూలై 30 వరకు సీబీఐ విచారించనుంది. -
ముచ్చుమర్రి బాలిక కేసులో పోలీసుల సీన్ రికన్ స్ట్రక్షన్ తేలిన నిజాలు
-
ట్రంప్పై కాల్పులు జరిపింది అతడే.. ఎఫ్బీఐ ప్రకటన!
నూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్తో సహా ప్రపంచ దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. ఇక, శనివారం పెన్సిల్వేనియాలో చేపట్టిన ప్రచారంలో పాల్గొన్న ట్రంప్పై ఓ గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ పక్కనుంచి దూసుకుపోవటంతో గాయమైంది. వెంటనే అప్రత్తమై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వేదిక పైకి వచ్చి.. ట్రంప్ను అక్కడి కిందకు దించి ఆస్పత్రికి తరలించారు.అయితే.. ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) తాజాగా గుర్తించింది. అతణ్ని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్గా ధ్రువీకరించారు. పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్కు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు క్రూక్స్ను షూట్ చేసినట్లు ఎఫ్బీఐ ఏజెన్సీ ప్రతినిధి ఆంథోనీ గుగ్లీల్మి వెల్లడించారు. ట్రంప్ హత్యాయత్నంపై అతని అసలు ఉద్దేశ్యం ఏంటనేదానిపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు జరిపిన కాల్పుల్లో థామస్ మాథ్యూ క్రూక్స్ మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.ఇక.. థామస్ మాథ్యూ క్రూక్స్ రిపబ్లికన్ పార్టీ మద్దతుదాడిగా నమోదు చేసుకున్నట్లు ప్రభుత్వ రికార్డుల ద్వారా తెలుస్తోంది. కానీ, అతడు 2021లో 15 డాలర్లను డెమొక్రాట్లకు అనుబంధంగా పనిచేసే ప్రోగ్రెసీవ్ టర్న్ఔట్ ప్రాజెక్టకు విరాళంగా ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం క్రూక్స్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆ మార్గంలోకి ఎవరినీ రానీవ్వకుండా భద్రత పెంచారు. మరోవైపు.. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపుతామని ఎఫ్బీఐ ప్రకటించింది. దర్యాప్తుకు కొన్ని నెలల సమయం పట్టవచ్చునని తెలిపింది. ఈ కాల్పులు ఘటనకు సంబంధిచి ఏదైనా సమాచారం తెలిస్తే.. తమకు చెప్పాలని ర్యాలీకి హాజరైన ప్రజలను ఎఫ్బీఐ కోరింది. -
కాళేశ్వరం విచారణలో స్పీడ్ పెంచిన కమిషన్
-
ముంబై బీఎండబ్ల్యూ కేసు: నిందితుడు మిహిర్ షా పశ్చాత్తాపం!
ముంబై: ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో పోలిసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ప్రధాన నిందితుడు మిహిర్ షా,అతని డ్రైవర్ రాజశ్రీ బిదావత్తో పోలీసులు బుధవారం రాత్రి ప్రమాధ ఘటన సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అయితే వారు వేగంగా కారుతో స్కూటీని ఢీకొట్టిన తర్వాత తమకారు మృతి చెందిన మహిళను కొంత దూరం ఈడ్చుకువెళ్లినట్లు తెలియదని పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో నిందితుడు మిహిర్ షా,అతని డ్రైవర్ రాజశ్రీ బిదావత్ తాము చేసిన తప్పును ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తాను చేసిన తప్పుకు మిహిర్ షా పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు.. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు మిహిర్ షా, డ్రైవర్ రాజశ్రీ బిదావత్ ఇచ్చిన స్టేట్మెంట్లపై పూర్తి నమ్మకం లేదని, వారి వాంగ్మూలంపై పరిశీలన చేస్తున్నామని పోలసులు తెలిపారు. మరోవైపు.. ఈ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్ షాకు జూలై 16 వరకు పోలీసు కస్టడీ విధించింది కోర్టు.కాగా జులై 7న (ఆదివారం తెల్లవారుజామున) మద్యం మత్తులో మిహిర్ షా బీఎండబ్ల్యూ కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో 45 ఏళ్ల మహిళ అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె భర్త గాయాలతో బయటపడ్డాడు. అయితే ప్రమాదం జరిగినప్పటి నుంచి మిహిర్ షా పరారీలో ఉన్నాడు. దాదాపు 72 గంటల తర్వాత నిందితుడిని విహార్లో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నిందితుడు తండ్రి, శివసేన నాయకుడు రాజేష్ షాను పార్టీ సస్పెండ్ చేసింది. ఇక ప్రమాదం తర్వాత మిహిర్ తన ప్రియురాలికి 40 సార్లు ఫోన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మహిళను కారుతో గుద్ది చంపిన తర్వాత కారును విడిచిపెట్టి ఆటో ఎక్కి ఆమె ఇంటికి వెళ్లిన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రియురాలిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోవచ్చని పోలీసులు తెలిపారు. -
కిడ్నీ రాకెట్ పై గుంటూరు పోలీసుల దర్యాప్తు ముమ్మరం
-
నీట్ పేపర్ లీకేజీ నిజమే
పట్నా: బిహార్లో చోటుచేసుకున్న నీట్–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. పేపర్ లీక్ నిజమేనని పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. నీట్కు ఒక్క రోజు ముందు ప్రశ్నపత్రంతోపాటు సమాధానాల ‘కీ’ని సైతం అభ్యర్థులకు అందజేసి, పరీక్షకు సిద్ధం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసులో బిహార్ పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నలుగురు నీట్ అభ్యర్థులు అనురాగ్ యాదవ్, శివానందన్, అభిõÙక్, ఆయుష్ రాజ్, ఇద్దరు లీకేజీ ముఠా సభ్యులు నితీశ్, అమిత్ ఆనంద్తోపాటు ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ సికిందర్ యాదవేందు ఉన్నారు. ఈ యాదవేందు మేనల్లుడే అనురాగ్æ. విచారణలో నిందితులు ఏం చెప్పారో వారి మాటల్లోనే... ‘‘బిహార్ దానాపూర్ టౌన్ కౌన్సిల్లో జూనియర్ ఇంజనీర్గా పని చేస్తున్న సికిందర్ ప్రసాద్ యాదవేందు మమ్మల్ని సంప్రదించాడు. మేనల్లుడు అనురాగ్సహా నలుగురికి ప్రశ్నపత్రం ఇచి్చ యాదవేందు నుంచి రూ.32 లక్షలు తీసుకున్నాం’’ – నితీశ్, అమిత్, ‘‘ అమిత్, నితీశ్ ప్రశ్నపత్రం, కీ అందజేశారు. పరీక్షకు సిద్ధం కావడానికి సహకరించారు’ – అనురాగ్, నీట్ అభ్యర్థి ‘‘యాదవేందు అంకుల్ మే 4న ఓ ఇంటికి రమ్మని చెప్పాడు. అక్కడ నితీశ్, అమిత్ ప్రశ్నపత్రం ఇచ్చి నన్ను పరీక్షకు సిద్ధం చేశారు’’ – శివానందన్ కుమార్, నీట్ అభ్యర్థి ‘‘నీట్ ప్రశ్నపత్రం కోసం యాదవేందుకు రూ.40 లక్షలు చెల్లించాం’’ –అవదేశ్, అభిషేక్ కుమార్ తండ్రి ‘‘యాదవేందు రూ.40 లక్షలు తీసుకున్నాడు’’ నీట్ అభ్యర్థి ఆయుష్ రాజ్ తండ్రి ‘‘రాజస్తాన్లోని కోటాలో శిక్షణ పొందుతున్న నా మేనల్లుడు అనురాగ్ యాదవ్ నా సోదరి రీనా కుమారితో కలిసి నీట్ పరీక్ష రాయడానికి పాట్నా వచ్చాడు. వారికి పాటా్నలో ప్రభుత్వ అతిథి గృహంలో నేనే బస ఏర్పాట్లు చేశా. నీట్ పరీక్ష రాయడానికి నా మేనల్లుడు సహా నలుగురి అభ్యర్థులకు సహకరించా. నలుగురికి ప్రశ్నపత్రాలు సమకూర్చా. ఒక్కొక్కరి నుంచి రూ.40 లక్షల చొప్పున డిమాండ్ చేశా. నితీశ్ కుమార్, అమిత్ ఆనంద్ రూ.32 లక్షల చొప్పున తీసుకున్నారు’’ – యాదవేందు, ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ తేజస్వీ యాదవ్ సహాయకుడి హస్తం! ప్రభుత్వ అతిథి గృహంలో అనురాగ్ యాదవ్, ఆయన తల్లికి బస ఏర్పాట్ల వెనుక బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. గెస్టు హౌస్ బిల్లులను పరిశీలించగా, అందులో మంత్రిజీ అని ఉంది. తేజస్వీ యాదవ్ వ్యక్తిగత సహాయకుడైన ప్రీతమ్ కుమార్ ఈ గెస్టు హౌస్ను బుక్ చేసేందుకు యాదవేందుకు సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
విచారణ జరిపించాలి..
డాక్టర్ కావాలని ఎంతో కష్టపడి చదివి ‘నీట్’ పరీక్షకు హాజరైన లక్షలాది విద్యార్థుల ఆశలపై ఆ పరీక్షల ఫలితాలు నీళ్లు చల్లాయి. ఎన్నడూ లేనివిధంగా 67 మందికి 720 మార్కులకు 720 రావడం, అలా వచ్చినవారిలో పలువురు ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయడం విద్యార్థులనే కాక, వారి తల్లి తండ్రులనూ నిరుత్తరులను చేసింది.దీనికి తోడు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వందలాదిమందికి పరీక్షానిర్వహణ సంస్థ ఎన్టీఏ గ్రేస్ మార్కులను ఇవ్వడం కూడా విమర్శలకు దారితీసింది. ప్రజల ఆందోళనల నేపథ్యంలో చివరికి గ్రేస్ మార్కులను ఎన్టీఏ ఉపసంహరించుకుంది. కాని, పరీక్షల నిర్వహణలో మాత్రం ఎటువంటి అవకతవకలూ జరగలేదని అనడమే విడ్డూరంగా ఉంది.ప్రతిసారీ విద్యార్థులతో ‘పరీక్షా పే’ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని... కీలకమైన నీట్ పరీక్షపై ఆరోపణలు, అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ మాట్లాడకపోవడం విద్యార్థుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. నీట్ పరీక్ష మాత్రమే కాక దేశంలోని ఎన్నో పోటీ పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తోంది. తాజాగా బయటపడ్డ వివాదస్పద అంశాల కారణంగా దానిపై విద్యార్థులు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది.ప్రతిసారీ ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులకు ఎక్కువగా ర్యాంక్లు రావడం, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు తక్కువ ర్యాంకులు రావడంపై దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అనేక అనుమానాలు కల్గుతున్నాయి.ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి అవకతవకలు ఉన్నవని తేలితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమంగా లబ్ధిపొందిన వారిపైనా చర్యలు తీసుకోవాలి. నీట్లో జరిగిన అక్రమాల కారణంగా కష్టపడి చదివిన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. – గడ్డం శ్యామ్, పీడీఎస్యూ తెలంగాణ ఉపాధ్యక్షుడు -
ప్రభుత్వ ఆసుపత్రిలో స్కాం పై విచారణ వేగవంతం
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
-
పవర్ కమిషన్ విచారణపై కేసీఆర్ బహిరంగ లేఖ
-
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణలో వేగం పెంచిన కమిషన్
-
గొర్రెల స్కామ్ పై ఈడీ ఫోకస్
-
పుణే పోర్షే కేసు: మకందర్కు ఫోన్ చేసిందెవరు?
ముంబై: పుణేలో సంచలనం రేపిన పోర్షే కారు ప్రమాదం దర్యాప్తులో పోలీసులు మరో కీలక విషయం బయటపెట్టారు. బ్లడ్ శాంపిళ్లు తారుమారు చేయాలని నిందితుడు (మైనర్ బాలుడు) తండ్రి డాక్టర్లకు రూ. 3 లక్షల లంచం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ లంచం జువైనల్ జస్టిస్ బోర్డు ఆవరణంలో డాక్టర్ల సూచనతో హాస్పిటల్ వార్డు బాయ్కి అందజేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి తండ్రి విశాల్ అగర్వాల్.. బ్లడ్ శాంపిళ్లను తన భార్య బ్లడ్ శాంపిళ్లతో తారుమారు చేయాలని సూసాన్ ఆస్పత్రి వార్డు బాయ్ అతుల్ ఘట్కాంబ్లేకు లంచం ఇచ్చినట్లు తెలిపారు. ఆ లంచాన్ని విశాల్ అగర్వాల్ ఏకంగా జువైనల్ జస్టిస్ బోర్టు ఆవరణంలో ఇచ్చారని దర్యాప్తులో వెల్లడైంది. పుణే క్రైం బ్రాంచ్ పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్టు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఈ విషయం బయటపడింది. సూసాన్ ఆస్పత్రి ఫొరెన్సిక్ విభాగం హెడ్ డా.అజయ్ తవారే, డా.శ్రీహరి హాల్కర్ (చీఫ్ మెడికల్ ఆఫీసర్) సూచన మేరకు వార్డుబాయ్ అతుల్ ఘట్కాంబ్లే లంచం తీసుకోవడానికి అంగీకరించాడని పోలీసులు తెలిపారు.చదవండి: పుణే కేసు నిందితుడిపై ‘బుల్డోజర్’ప్రయోగంమొదట బాలుడి బ్లడ్ శాంపిల్ నెగటివ్ వచ్చింది. దీంతో అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు మరోసారి పరీక్ష నిర్వహించగా రెండు వేర్వేరు వ్యక్తుల రిపోర్టులు వచ్చినట్లు తేలింది. బాలుడి బ్లడ్ శాంపిల్ను అతని తల్లి శాంపిల్తో డాక్టర్లు తారుమారు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు.. ఈ కేసుతో సంబంధం ఉన్న అష్ఫాక్ మకందర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మకందర్.. డాక్టర్లకు, బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్కు మధ్యవర్తిగా పనిచేశాడని క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు.చదవండి: పూణే ప్రమాదంలో కీలక పరిణామం!.. తెరపైకి ఎమ్మెల్యే కుమారుడుమే 20న మకందర్ సాసూన్ ఆస్పత్రికి చేరుకునే ముందు ‘విశాల్ అగర్వాల్కు సాయం చేయండి’ అని అతనికి ఒకఫోన్ కాల్ వచ్చింది. తర్వాత మకందర్, డాక్టర్ తవారే మధ్య సంభాషణ జరిగింది. అయితే మకందర్ కాల్ చేసి.. విశాల్కు సాయం చేయాలన్నది ఎవరూ? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మకందర్ ఫోన్ను పోలీసులు సీజ్ చేశారు. మే 19 ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే సునీల్ టింగ్రేతో పాటు ఎరవాడ పోలీసు స్టేషన్ వద్ద మకందర్ ఉండటం గమనార్హం. మే19న మైనర్ బాలుడు చేసిన రోడ్డు ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ పుణేలో సంచలనం రేపుతోంది. -
తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేస్తే కఠిన చర్యలు: చంద్రఘోష్
సాక్షి, హైదరాబాద్: విజిలెన్స్, కాగ్ రిపోర్టులు అందాయని కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏజెన్సీలో సమావేశం అయ్యాం. వాళ్లను అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పాను. గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోవాలని అఫిడవిట్ ఫైల్ చేయమన్నాను. ప్రభుత్వం విధించిన సమయంలో ప్రాజెక్టు అందించామన్నారు. ఏజెన్సీలను నిర్మాణం, డిజైన్, మెయింటెనెన్స్ గురించి పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని అదేశించాను. ఏది చెప్పినా, ఎవరూ కమిషన్కు చెప్పినా ప్రతిదీ రికార్డు రూపంలో ఉండాలి. ఈ నెలాఖరు లోపు అఫిడవిట్ రూపంలో సమాధానం ఇవ్వాలని అదేశించాం’’ అనివ చంద్రఘోష్ పేర్కొన్నారు.ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయనేది రికార్డు రూపంలో సమాధానం వచ్చాక వాళ్లను కూడా పిలుస్తాం. సరైన ఆధారాల కోసమే అఫిడవిట్ దాఖలు చేయమని చెప్తున్నా’’ అని చంద్రఘోస్ వివరించారు. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళతో అఫిడవిట్ వచ్చాక ఇతర వ్యక్తులను కూడా పిలుస్తాను. కొంతమంది అధికారులు స్టేట్లో లేరు. వాళ్లను కూడా విచారణ చేస్తాం. విజిలెన్స్, కాగ్ రిపోర్టులు అందాయి.. వాళ్లను కూడా విచారణ చేస్తాం. తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేస్తే మాకు తెలిసిపోతుంది’’ అని చంద్రఘోష్ తెలిపారు. -
విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు... విచారణ వేగవంతం
-
కెనడాలో భారత సంతతి యువకుడి హత్య!
ఒట్టావా: భారత సంతతికి చెందిని ఓ యువకుడు కెనడాలోని సర్రే ప్రాంతంలో హత్యకు గురుయ్యాడు. జూన్ 7 (శుక్రవారం) ఉదయం అతనిపై కాల్పులు జరగటంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన యువకుడిని భారత సంతతికి చెందిన యువరాజ్ గోయల్గా గుర్తించారు. బ్రిటిష్ కోలంబియాలోని సర్రే నుంచి హత్య జరిగినట్లు సమాచారం అందటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే యువరాజ్ గోయల్ మృతి చెంది ఉన్నాడు. ఈ కేసులో పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న మన్వీబాస్రామ్ (23), సాహిబ్ బాస్రా (20), హర్కిరత్ ఝుట్టీ (23), ఓంటారియోకు చెందిన కీలాన్ ఫ్రాంకాయిస్ (20)లను అదుపులోకి తీసుకున్నారు. యువరాజ్పై ఎటువంటి నేరపూర్తి రికార్డు లేదు. అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అతన్ని టార్గెట్ చేసి కొందరు కాల్పులు జరిపినట్లు తేలింది. ఈ హత్య ఎందుకు జరిగిందనే కారణాల కోసం పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. యువరాజ్ గోయాల్ స్టూడెంట్ వీసాపై 2019లో పంజాల్లోని లూథీయానా నుంచి కెనడా వెళ్లారు. 28 ఏళ్ల యువరాజ్ కెనడాలో సెల్స్ ఎగ్జిక్యూటీవ్గా ఉద్యోగం చేస్తున్నారు. యువరాజ్ తండ్రి రాజేశ్ గోయెల్ ఫైర్వుడ్ వ్యాపారవేత్త. యువరాజ్ మృతిపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
బాబు కావాలంటే బైక్ పాప కావాలంటే స్కూటీ
-
చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
-
రేవ్ పార్టీ కేసు: బెంగళూరు పోలీసులకు హేమ లేఖ.. విచారణకు డుమ్మా
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నేడు నిందితులను బెంగళూరు క్రైమ్ బ్యాంచ్ పోలీసులు విచారించనున్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్ నటి హేమతో పాటు మరో ఎనిమిది మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేనని హేమ పోలీసులకు లేఖ రాశారు. ఈ లేఖలో హేమ.. ఈ కేసులో తాను హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరారు. తాను వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్టు తెలిపారు. అయితే, హేమ లేఖను సీసీబీ పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని హేమకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. బెంగళూరు రేవ్ పార్టీ విషయానికి వస్తే ఈ పార్టీలో దాదాపు 150 మంది పాల్గొనగా వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు బ్లడ్ శాంపిల్స్లో తేలింది. దీంతో, వారంతా ఈరోజు విచారణకు హాజరుకావాలని సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన వారిలో టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్నారు. అయితే రేవ్ పార్టీకి తాను హాజరుకాలేదని వీడియోలు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన కేసులో పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు. అలాగే, వారి బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వాసు బ్యాంక్ ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక, ఈ కేసులో వాసు ప్రధాన అనుచరుడు చిత్తూరుకు చెందిన అరుణ్ కుమార్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
చివరి అంకానికి సిట్ దర్యాప్తు
-
సిట్ ఎంట్రీతో అజ్ఞాతంలోకి కొంతమంది అనుమానితులు
-
అల్లర్లపై రంగంలోకి దిగిన సిట్
-
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
కోల్కతా: వెస్ట్బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ ఆరోపణలపై విచారణ కోసం తమ ముందు హాజరు కావాలని నలుగురు రాజ్భవన్ ఉద్యోగులకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సెట్)సమన్లు జారీ చేసింది. ఇంతేకాకుండా రాజ్భవన్లోని సీసీటీవీ వీడియోలను తమకు ఇవ్వాలని సెట్ అక్కడి అధికారులను కోరింది. ‘గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం. ఈ బృందం రానున్న రోజుల్లో కొందరు సాక్షులను విచారించనుంది.లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కొన్ని వీడియోలు కావాలని రాజ్భవన్ను ఇప్పటికే కోరాం’అని ఒక పోలీసు అధికారి చెప్పారు. కాగా, రాజ్భవన్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే ఒక మహిళా ఉద్యోగి గవర్నర్పై రాతపూర్వక ఫిర్యాదు చేసింది. తనను గవర్నర్ సివి ఆనంద్బోస్ లైంగిక వేధింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొంది.అయితే గవర్నర్కు రాజ్యాంగపరమైన రక్షణ ఉండటం వల్ల పోలీసులు, కోర్టులు క్రిమినల్ చర్యలు ప్రారంభించడానికి వీలు లేదు. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని గవర్నర్ స్పష్టం చేశారు. రాజ్భవన్లోకి పోలీసులను రానివ్వద్దని సిబ్బందికి ఇప్పటికే ఆయన ఆదేశాలు జారీ చేశారు. -
సీఎం వైఎస్ జగన్పై దాడి: అది ముమ్మాటికీ హత్యాయత్నమే..
సాక్షి ప్రతినిధి, విజయవాడ : సీఎం వైఎస్ జగన్పై నిందితుడు విసిరిన పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయి కనుబొమపై కాకుండా ముఖ్యమంత్రి తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని పోలీసులు తమ దర్యాప్తు నివేదికలో తేల్చిచెప్పారు. ఈ విషయం నిర్ధారణ అయినందునే ఐపీసీ 307 కింద హత్యయత్నంగా కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొనడంతో అందుకు న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో నిందితుడు వేముల సతీశ్కుమార్కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు అతనిని నెల్లూరు సబ్జైలుకు తరలించారు. అంతకుముందు.. ఈ కేసులో నిందితుడిని విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరుపరిచినప్పుడు ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య వాదనలు వాడివేడీగా సాగాయి. హత్యాయత్నం కేసును పక్కదారి పట్టించేందుకు నిందితుడి తరఫు న్యాయవాది ప్రయత్నించగా.. పోలీసుల తరఫున వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిశోర్ ఆ వాదనలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ చేసిన వీడియోల ఆధారంగా నిందితుడి తరఫు న్యాయవాది వాదించడం గమనార్హం. ముఖ్యమంత్రికి రాయిదెబ్బ తగలలేదని.. గజమాల ఇనుప వైర్ గీసుకుని గాయమైందని.. పైగా, ఈ దాడికి పాల్పడాలని నిందితుడు సతీశ్ను ఎవరూ ప్రేరేపించలేదని వాదించారు. కానీ, ఈ వాదనలను ఏపీపీ కిశోర్ తిప్పికొట్టారు. పోలీసుల రిమాండ్ నివేదికలో పేర్కొన్న అంశాలను ఉటంకిస్తూ పక్కా కుట్రతోనే సీఎం వైఎస్ జగన్పై హత్యాయత్నానికి పాల్పడ్డారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సీఎం జగన్, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్కు తగిలిన గాయాల తీవ్రతపై ప్రభుత్వాసుపత్రి అధికారులు ఇచ్చిన నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. నిందితుడు హత్యాయత్నానికి ఉపయోగించిన పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయి సీఎం జగన్ కనుబోమపై కాకుండా తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని నిర్ధారణ అయినందునే ఈ దుర్ఘటనను హత్యయత్నంగా కేసు నమోదు చేసినట్లు వివరించారు. కుట్రదారుల ప్రేరేపణతోనే.. గతంలో మధ్యప్రదేశ్కు చెందిన కేదర్యాదవ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఏపీపీ ఈ సందర్భంగా ఉదహరించారు. కొందరు కుట్రదారుల ప్రేరేపించడంతోనే నిందితుడు వేముల సతీశ్ సీఎం జగన్పై హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసుల దర్యాప్తులో ఆధారాలతో సహా వెల్లడైందన్నారు. నిందితుడు సతీష్ మైనర్ అని అతని తరఫు న్యాయవాది వాదనను ఏపీపీ కిశోర్ తప్పని నిరూపించారు. పోలీసులు ముందుగానే నిందితుడు సతీ‹Ùకు కార్పొరేషన్ జారీచేసిన జనన ధృవీకరణ పత్రాన్ని న్యాయస్థానానికి సమర్పించారు. దాని ఆధారంగా నిందితుడికి 19 ఏళ్లు ఉన్నట్లుగా తేలిపోయింది. దీంతో న్యాయస్థానం సతీశ్కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం.. భద్రతా కారణాల దృష్ట్యా అతనిని పోలీసులు నెల్లూరు సబ్జైలుకు తరలించారు. ఈ కేసులో మరింత సమాచారాన్ని రాబట్టేందుకుగాను నిందితుడు సతీశ్ను పోలీస్ కస్టడీకి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. -
సీఎంపై హత్యాయత్నం కేసు దర్యాప్తు ముమ్మరం
-
సీఎం జగన్పై దాడి కేసులో విచారణ వేగవంతం: సీపీ
ఎన్టీఆర్,సాక్షి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి కేసులో విచారణ వేగంగా సాగుతోందని, అతి త్వరలో నిందితులను పట్టుకుంటామని విజయవాడ పోలీసు కమిషనర్(సీపీ) కాంతిరాణా చెప్పారు. కమిషనర్ ఆఫీసులో సోమవారం(ఏప్రిల్15) సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసు దర్యాప్తు పురోగతిని ఫొటోలు, వీడియోల ద్వారా వివరించారు. ‘ఎన్టీఆర్ జిల్లాలో 22 కిలోమీటర్ల మేర సీఎం బస్సుయాత్ర కొనసాగింది. యాత్ర సందర్భంగా మొత్తం 1480 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. బస్సు యాత్ర వెంబడి మొత్తం 40 రోప్ పార్టీలు ఏర్పాటు చేశాం. ట్రాఫిక్, ఏపీఎస్పీ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్, యాక్సిస్ కంట్రోల్ సిబ్బంది కూడా పనిచేశారు. బస్సు యాత్రకు అడ్డంకులు ఉన్న చోట్ల ప్రొటోకాల్ ప్రకారం కరెంట్ నిలిపివేశాం. సెక్యూరిటీ, సేఫ్టీ కోసం రూఫ్ టాప్ వీఐపీ ప్రోగ్రామ్ ఉన్నచోట ముందుగానే కరెంట్ నిలిపివేస్తారు. బస్సుయాత్ర డాబా కొట్ల సెంటర్ దాటి వివేకానంద స్కూల్ వద్దకు వచ్చేసరికి ఒక వ్యక్తి సీఎంపైకి బలంగా రాయి విసిరాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దాడి జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలన్నీ పరిశీలించాం. రాయి సీఎం కంటిపై తగిలిన తర్వాత ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి తగిలింది. దర్యాప్తు కోసం ప్రత్యేక టీమ్లు ఏర్పాటు చేశాం. దాడి జరిగినపుడు ఆ ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారో సెల్ ఫోన్స్ డేటా పరిశీలించాం. 50మందికి పైగా అనుమానితులను విచారించాం. అతి త్వరలోనే కచ్చితంగా నిందితుడిని పట్టుకుంటాం’ అని సీపీ తెలిపారు. ఇదీ చదవండి.. సీఎం జగన్పై దాడి.. నిందితులను పట్టుకుంటే బహుమతి -
బెంగళూరు కేఫ్ టెర్రరిస్టులు ఎలా దొరికారంటే?
బనశంకరి: సిలికాన్ సిటీ బెంగళూరులో రామేశ్వరం కేఫ్లో జరిగిన బాంబు పేలుడు గుర్తుంది కదా..! మార్చి 1, 2024న బెంగళూరు వైట్ఫీల్డ్లోని రామేశ్వరం కేఫ్లో బాంబు పేలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. అయితే ఉగ్రవాద ఘటనలకు చాలా రోజులుగా బ్రేక్ పడ్డ తర్వాత ఈ ఘటన జరగడం అందరినీ షాక్కు గురి చేసింది. ఈ కేసులో నిందితులు తాము చేసిన ఓ చిన్న తప్పుతో పోలీసులకు దొరికిపోయారు. పక్కాగా ప్లాన్ చేసి తప్పించుకున్నారు ముసావీర్ హుసేన్ షాజీబ్, అబ్దుల్ మతీన్ తాహ.. ఇద్దరు ఉగ్రవాద శిక్షణలో ఆరితేరారు. పక్కాగా స్కెచ్ వేసి బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ను ఎంచుకున్నారు. ఎన్నికల వేళ దక్షిణాది రాష్ట్రాల్లో అలజడి సృష్టించాలన్నది వీళ్ల కుట్ర. రెక్కీల తర్వాత మార్చి 1, శుక్రవారం రోజున తమ ప్లాన్ అమలు చేశారు. రామేశ్వరం కేఫ్లో బాంబు పేలగానే జారుకున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) రంగంలోకి దిగి కేసు దర్యాప్తు ప్రారంభించింది. అప్పటికే నిందితులు సరిహద్దులు దాటేశారు. సిసి టీవీ ఫుటేజ్ సేకరించిన NIA.. నిందితుల జాడ చెప్పిన వారికి పది లక్షల బహుమానం ప్రకటించింది. అబ్బో.. ఎన్ని జాగ్రత్తలో.? బెంగళూరు నుంచి బయటపడ్డ నిందితులిద్దరూ.. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. బాంబు అమర్చిన హుస్సేన్ షాజీబీ (30), తెర వెనక మాస్టర్మైండ్ మథీన్ థాహ (30) తమ ఆహార్యాన్ని మార్చేశారు. పశ్చిమబెంగాల్లోని మారుమూల ప్రాంతాలకు చేరుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 35 సిమ్ కార్డులు మార్చారు. ఏ ప్రాంతానికి వెళ్లినా.. కొత్త పేర్లు చెప్పి లాడ్జ్లు తీసుకున్నారు. వీలైనంత వరకు తక్కువ ఖరీదు ఉండే మాస్ ఏరియాల్లో.. పోలీసు గస్తీ ఎక్కడయితే తక్కువగా ఉంటుందో అలాంటి ప్రాంతాలు మాత్రమే ఎంచుకున్నారు. స్కాన్ చేసి చెల్లించే UPI పేమెంట్ ఎక్కడా చేయలేదు, కేవలం నగదు మాత్రమే చెల్లించి భోజనం, కావాల్సిన వస్తువులు కొన్నారు. ఓ జిరాక్స్ సెంటర్లో ఆధార్ కార్డులను, డ్రైవింగ్ లైసెన్స్లను సేకరించిన వీరిద్దరు.. వాటితో ఫేక్ ఐడెంటిటీ కార్డులను తయారు చేసి వాడారు. వీరికి ఎప్పటికప్పుడు క్రిప్టో కరెన్సీ ద్వారా నిధులు సమకూరేవని దర్యాప్తులో తేలింది. చిక్కరు.. దొరకరు పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్కు వచ్చిన నిందితులు అక్కడ ఒక హోటల్లో పర్యాటకుల తరహాలో మకాం వేశారు. ఒకసారి ఒక పని మీద వాడిన సిమ్ను వెంటనే మార్చేవారు. అలా 35 సిమ్కార్డులను చేతిలో ఉంచుకున్నారు. ఒక్కో పనికి ఒక్కో సిమ్ చొప్పున వాడడం పక్కనబెట్టడం. పని పూర్తి కాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం. ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. పైగా ఈ సిమ్ కార్డులన్నీ నకిలీ అడ్రస్లు ఉపయోగించి సేకరించినవే. కొన్ని తమిళనాడు పేరుతో ఉన్నవయితే.. మరికొన్ని మహారాష్ట్ర, ఢిల్లీలోని ఫేక్ అడ్రస్లు, ఆధార్లతో సేకరించిన సిమ్ కార్డులు. ఈ సిమ్లను వినియోగించినా.. వీళ్ల ఆచూకీ NIA పసిగట్టలేకపోయింది. ఏ చిన్న ఆధారం దొరికినా.. తప్పుడు అడ్రస్ల కారణంగా దర్యాప్తు మాత్రం ముందుకు సాగలేదు. ఆడింది ఆట.. పాడింది పాట హోటల్లో రూం తీసుకునేటప్పుడు రిజిస్టర్లో తమ పేర్లు కాకుండా నకిలీ పేర్లు రాశారు. కొన్ని సార్లు పొరపాటున అసలు పేరు రాసి కొట్టివేసి నకిలీ పేర్లు రాశారు. పర్యాటకులమని, డార్జిలింగ్ నుంచి వస్తున్నామని, చెన్నెకు వెళుతున్నామని.. ఇలా తోచిన కారణాలను హోటల్ సిబ్బందికి చెప్పారు. నకిలీ ఆధార్ కార్డులు చూపారు. స్థానికంగా వివిధ పర్యాటక స్థలాలను సందర్శిస్తూ జల్సా చేశారు. కోల్కతాలో మూడు హోటల్స్లో ఎప్పటికప్పుడు మకాం మార్చారు. చిన్న కారణంతో చిక్కారు మకాం మార్చుతూ పశ్చిమబెంగాల్లోని చాంద్నీ అనే ప్రాంతానికి వచ్చిన వీరు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, వీళ్లిద్దరిలో ఒకరు వాడుతున్న మొబైల్ కింద పడడంతో ఫోన్లో స్పీకర్ పాడయింది. దీన్ని రిపేర్ చేయించేందుకు.. ఫోన్లోని సిమ్ కార్డు తీసేసి.. దగ్గరలోని రిపేర్ షాప్ మైక్రోమాజిక్ ఇన్ఫోటెక్ అనే చిన్న మొబైల్ షాప్కు తీసుకెళ్లారు. ఫోన్ను పరిశీలించిన మొబైల్ షాపు మెకానిక్.. స్పీకర్ పని చేస్తుందా లేదా అని తెలియడానికి షాప్ కీపర్ తన దగ్గరున్న సిమ్ను ఫోన్లో వేసి రిపేర్ చేశాడు. అప్పటికే IMEA నంబర్పై నిఘా పెట్టిన NIA అధికారులు.. సిమ్ వేయగానే దాని ఆధారంగా అడ్రస్ కనిపెట్టారు. ఈ సారి మాత్రం పక్కాగా ఒరిజినల్ అడ్రస్ దొరికింది. మొబైల్ లొకేషన్ను సంపాదించిన అధికారులు.. కొన్ని గంటల్లోనే చాంద్నీ ప్రాంతానికి చేరుకున్నారు. షాప్ కీపర్ ఇచ్చిన విలువైన సమాచారంతో నిందితుల జాడ పట్టేశారు. వేర్వేరు హోటళ్ల సిబ్బంది వాంగ్మూలం, ఎన్ఐఏ బృందాలు సేకరించారు, రిజిస్టర్లు, సీసీ కెమెరా ఫుటేజీలు, గుర్తింపు కార్డులు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. -
సీఎం జగన్పై హత్యాయత్నం కేసులో దర్యాప్తు ముమ్మరం
సాక్షి, విజయవాడ: సీఎం జగన్పై హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలంలో సీసీఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు. పలువురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. వివేకానంద స్కూల్కు, గంగానమ్మ గుడికి మధ్యలోని చెట్ల దగ్గర నుంచి దాడి జరిపినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కుడివైపు జనావాసాలు ఉండడంతో ఎడమవైపు స్కూల్, గంగానమ్మ గుడి మధ్య ప్రాంతాన్ని నిందితుడు ఎంచుకున్నట్లు గుర్తించారు. పూర్తిగా చీకటిగా, చెట్లు ఉండడంతో నిందితుడు ఎవరికీ కనిపించలేదు. దాడికి పాల్పడిన తర్వాత సులభంగా తప్పించుకోవచ్చని ఆ ప్రాంతాన్ని దాడికి ఎంచుకున్నాడు. 30 అడుగుల దూరం నుంచి సీఎం జగన్పై ఆగంతకుడు దాడి చేశాడు. సీఎం వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం శనివారం రాత్రి విజయవాడ చేరుకుంటారని ముందే తెలుసుకున్న ఆగంతకుడు ఇందుకు తగ్గట్టే ముందస్తు కుట్ర, ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బస్సు యాత్ర విజయవాడలోకి శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రవేశించింది. బస్సు యాత్ర సాగే మార్గంలో విద్యుత్ సరఫరాను నిలిపేస్తుండటాన్ని ఆగంతకుడు ఆసరాగా చేసుకున్నాడు సీఎం జగన్పై ఎయిర్ గన్ తో హత్యాయత్నం చేసి ఉండొచ్చని అంటున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సౌండ్ విన్నానని చెబుతుండటంతో సీఎంపై హత్యాయత్నానికి ఎయిర్ గన్నే వినియోగించి ఉండవచ్చని బలంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో గాయపడ్డ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు కూడా సీఎం వైపు దూసుకొచ్చిన పదునైన వస్తువు వేగాన్ని బట్టి ఇది హత్యాప్రయత్నమేనన్నారు. ఇదీ చదవండి: సీఎం జగన్పై హత్యాయత్నం! -
ప్రమాదం ఎలా జరిగింది?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఎస్బీ ఆర్గానిక్స్లో పదిరోజుల కిందట జరిగిన అగ్నిప్రమాద ఘటన కేసు దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది మంటల వ్యాప్తితో జరిగిన అగ్ని ప్రమాదం కాదని, పేలుడు వల్ల జరిగిన విస్పోటన మని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చా రు. ఈ పరిశ్రమలో పేలుడుకు పదార్థాల (ఎక్స్ ప్లోసివ్)కు సంబంధించిన ఉత్పత్తుల కార్యక లాపాలు జరిగినట్లు భావిస్తున్నారు. ఈ పరిశ్రమకు ఏ రకమైన ఉత్పత్తులు తయారు చేసుకునేందుకు అనుమతులు ఉన్నాయి.. ఇక్కడ ఏ ఉత్పత్తులకు సంబంధించిన కార్యకలాపాలు జరిగాయి. అనే కోణంలో పరిశీలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా చందాపూర్లో ఉన్న ఈ పరిశ్రమలో ఈనెల 3న జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమైన విషయం విదితమే. సుమారు 17 మందికి తీవ్ర గాయాలు కాగా, మరో 20 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రియాక్టర్ పేలిన ఘటనలో ఈ ఫ్యాక్టరీ పూర్తిగా శిథిలమైపోయింది. చుట్టు పక్కల ఉన్న భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ఎక్స్ప్లోసివ్ (పేలుడు పదార్థాల)కు సంబంధించిన కార్యకలాపాలు ఈ ఫ్యాక్టరీలో జరిగాయనే దానిపై నిర్ధారణకు వచ్చారు. డీఆర్డీవో సహకారం కోరిన పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు పోలీసులు రక్షణశాఖకు సంబంధించిన డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) సహకారాన్ని కోరారు. ఈ మేరకు పోలీసుశాఖ డీఆర్డీఓకు లేఖ రాసింది. అలాగే ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ఓ బృందాన్ని పంపాలని పోలీసులు ఐఐసీటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) సంస్థకు కూడా లేఖ రాశారు. 40 శాంపిల్స్ సేకరణ.. ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు కారణంగా చెల్లాచెదురైన శిథిలాల నుంచి కెమికల్స్కు సంబంధించిన శాంపిల్స్ను ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు సేకరించారు. మొత్తం 40 చోట్ల ఈ శ్యాంపిల్స్ను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్లో పరిశీలిస్తున్నారు. ఈ కేసులో లోతైన విచారణ జరుపుతున్నామని సంగారెడ్డి ఎస్పీ సీహెచ్.రూపేష్ ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పారు. -
ఆప్ ప్రభుత్వానికి రూ.100 కోట్లు ?..రూ.192 కోట్లు ఏం చేశారు..?
-
Delhi Excise Policy Scam Case: 12 తర్వాత వర్చువల్గా హాజరవుతా: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వరుసగా ఎనిమిదోసారి పంపిన సమన్లకు కూడా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించలేదు. మార్చి 4వ తేదీన తమ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నందున సోమవారం విచారణకు హాజరు కాలేకపోయినట్లు తెలిపారు. ఈడీ తనకు సమన్లు ఇవ్వడం చట్టవిరుద్ధమే అయినా ఈనెల 12వ తేదీ తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వర్చువల్గా హాజరయ్యేందుకు చట్టం హక్కు కలి్పంచింది. అందుకు ఈడీ అధికారులు అనుమతిస్తారని భావిస్తున్నా. ఈడీ విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నేను డిమాండ్ చేయలేదు. ఒకవేళ ప్రత్యక్ష ప్రసారం చేసినా అభ్యంతరం లేదు’అని కేజ్రీవాల్ అన్నారు. అయితే, కేజ్రీవాల్ పంపిన సమాధానాన్ని పరిశీలిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. అయితే, కేజ్రీవాల్ను వర్చువల్గా విచారించేందుకు సిద్ధంగా లేని ఈడీ..తొమ్మిదో విడత సమన్లు పంపే అవకాశాలున్నాయంటున్నారు. ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంతో ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించడం.. కేజ్రీవాల్ వినతి మేరకు మార్చి 16న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు ప్రకటించడం తెలిసిందే. బీజేపీ ‘మోదీ కా పరివార్’ ప్రచారాన్ని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. కేవలం కేంద్ర మంత్రులే మోదీ కుటుంబమన్నారు. -
అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
యాదాద్రి: అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన గరిడేపల్లి మండల ఎల్బీనగర్ శివారు జానపహాడ్ మేజర్ కాలువలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 40 ఏళ్ల వయస్సుగల వ్యక్తి మృతదేహం 2022 సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన మేజర్ కాలువలో కొట్టుకు వచ్చినట్లు సీఐ చరమందరాజు ఆదివారం తెలిపారు. మృతుడి దేహంపై తెలుపు రంగు లుంగీ, నీలి, తెలుపు రంగు గడులుగల ఫుల్షర్ట్ ఉన్నదని, భుజంపై ఆంజనేయస్వామి పచ్చబొట్టు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ వ్యక్తిని ఎవరో వ్యక్తులు చంపి, చేతులు కట్టి, ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి కాలువలో పడవేసినారని పంచాయతీ సెక్రెటరీ ఫిర్యాదు మేరకు గరిడేపల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు స్థానిక సీఐ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. ఇవి చదవండి: ఉత్తర రింగుకు ఈపీసీ.. దక్షిణ రింగుకు బీఓటీ -
బెంగుళూరు బ్లాస్ట్ లో నిందితుడిని గుర్తించిన పోలీసులు
-
‘రామేశ్వరం కేఫ్’ ఘటనపై ఉన్నతస్థాయి సమావేశం నేడు!
బెంగళూరులోని రాజాజీనగర్లోని రామేశ్వరం కేఫ్లో భారీ పేలుడు సంభవించి, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై సమీక్షించేందుకు నేడు(శనివారం) మఖ్యమంత్రి సిద్ధరామయ్య సారధ్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. రామేశ్వరం కేఫ్లో గుర్తు తెలియని బ్యాగ్ను ఉంచారని, ఆ తర్వాత కొంతసేపటికి భారీ పేలుడు సంభవించిందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఘటనలో గాయపడినవారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, కర్ణాటక పోలీసుల ఫోరెన్సిక్ బృందం ఈ ఉదంతంపై దర్యాప్తు చేపట్టింది. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు(శనివారం) మధ్యాహ్నం ఒంటిగంటకు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ముఖ్యమంత్రి సారధ్యంలో జరిగే ఈ సమావేశానికి పలువురు మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు. బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు ఘటనపై పోలీసులు ఐపీసీలోని సెక్షన్లు 307, 471, యూఏపీఏలోని 16, 18, 38 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పేలుడు పదార్థాల చట్టంలోని మూడు, నాలుగు సెక్షన్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. పేలుడు జరిగిన ప్రదేశంలో దర్యాప్తు బృందం తనిఖీలు చేస్తోంది. ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ మాట్లాడుతూ ‘ఈ కేసు దర్యాప్తు కోసం మేము పలు బృందాలను ఏర్పాటు చేశాం. సీసీటీవీ ఫుటేజీల నుంచి ఆధారాలు సేకరించాం. పేలుడు సంభవించిన సమయంలో బీఎంటీసీ బస్సు ఈ మార్గంలో వెళుతూ కనిపించింది. అనుమానితుడు ఆ బస్సులో వచ్చినట్లు మాకు సమాచారం ఉంది. నిందితులను వీలైనంత త్వరలో పట్టుకుంటాం. పేలుడు కోసం టైమర్ని ఉపయోగించారు. దీనిపై ఎఫ్ఎస్ఎల్ బృందం విచారణ జరుపుతోంది’ అని తెలిపారు. #WATCH | A team of FSL, Bomb Disposal Squad and Dog Squad conducts an investigation at the explosion site at The Rameshwaram Cafe in Bengaluru’s Whitefield area. pic.twitter.com/iJf7rVvcwN — ANI (@ANI) March 2, 2024 -
ఆధార్కార్డు మార్చే విషయంపై.. వివాహిత తీవ్ర నిర్ణయం!
నిజామాబాద్: భర్త వేధింపులతోనే వివాహిత నిజాంసాగర్ ప్రధాన కాలువలో పడి మృతిచెందినట్లు ఎస్సై సుధాకర్ గురువారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం గండిమాసానిపేటకు చెందిన శిరీష(25), సతీశ్ దంపతులు. వీరికి ఏడాది బాబు యోగేశ్ ఉన్నాడు. తరచూ భర్త వేధింపులతో పాటు ఆధార్కార్డులో అడ్రస్ మార్పు విషయమై వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మానసిక వేదనకు గురైన శిరీష బుధవారం తల్లిగారింటికి వెళ్తున్నాని చెప్పి కుమారుడు యోగేశ్తో కలిసి బస్సులో వెళ్లింది. మార్గమధ్యలో బస్సు దిగిన శిరీష నిజాంసాగర్ ప్రధాన కాలువ సమీపంలో ఉన్న చెట్టు కింద కుమారుడు యోగేశ్ను కూర్చోబెట్టి తాను కాలువలో పడి ఆత్మహత్య చేసుకుంది. నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో మృతదేహం ఆచూకీ లభించలేదు. ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నిలిపివేయడంతో గురువారం ఉదయం మృతదేహం లభ్యమైంది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
సీటుబెల్ట్ ధరించినా తీవ్రత ఎలా!
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితను బలితీసుకున్న రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఎమ్మెల్యే నందిత ప్రయాణించిన కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడాన్ని పరిగణనలోకి తీసుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు ఆమె సీట్ బెల్ట్ ధరించే ఉండచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రమాద తీవ్రత ఫలితంగా అది ఊడిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన తీరు, ప్రమాదం అనంతరం కారు స్థితిగతులు, లాస్య మృతదేహం పడున్న పరిస్థితి, ఆమెకు అయిన గాయాలను పరిగణనలోకి తీసుకున్న రవాణా రంగ నిపుణులు మాత్రం సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకోకపోయి ఉండొచ్చని అంటున్నారు. ప్రమాద సమయంలో లాస్య కారులో డ్రైవర్ పక్కన ఉన్న ఫ్రంట్ సీటులో కూర్చుని ప్రయాణిస్తున్నారు. నేరుగా కూర్చున్న స్థితిలో కాకుండా వెనక్కు వాలి పడుకున్నారు. సీట్ ఈ స్థితిలో ఉన్నప్పుడు ప్రమాదం జరిగినా... సీటులో ఉన్న వారు ముందుకు రావడంతో ఏర్పడే ఫోర్స్ సీట్ బెల్ట్ బకెల్ ఊడిపోయే స్థాయిలో ఉండదని చెప్తున్నారు. లాస్య సీట్బెల్ట్ సరిగ్గా ధరించి ఉంటే... అన్ని గాయాలకు ఆస్కారం లేదని చెప్తున్నారు. దీన్ని బట్టి అలారం బజర్ రాకుండా ఆమె సీటు బెల్ట్ను ముందే పెట్టేసి దాన్ని ఆనుకుని కూర్చుని ఉండొచ్చని, ఫలితంగా సీట్ వెనక్కు వాలినప్పుడు ఆ బెల్ట్ ఆమె ఛాతీ భాగంలో కాకుండా వీపు భాగంలో ఉండి ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. సీట్ బెల్టులు సరిగ్గా పెట్టుకోకుంటే.. ఇటీవల కాలంలో మార్కెట్లోకి వస్తున్న దాదాపు అన్ని కార్లలో ఎయిర్బ్యాగ్ తప్పనిసరి అయింది. కొన్ని వాహనాల్లో దీనికి సీట్ బెల్ట్కు మధ్య లింకు ఉంటోంది. వాహనం ప్రమాదానికి గురైనప్పుడు అవి తెరుచుకోవాలంటే దానికి సంబంధించిన సెన్సర్లు యాక్టివేట్ కావాలి. ఇవి ఏసీయూకు (ఎయిర్బ్యాగ్ కంట్రోల్ యూనిట్) అనుసంధానించి ఉంటాయి. యాక్సిలో మీటర్ సెన్సర్ (యాక్సిలో మీటర్ స్పందన ఆధారంగా యాక్టివేట్ అయ్యేవి), ఇంపాక్ట్ సెన్సర్ (ఢీకొన్నప్పుడు యాక్టివేట్ అయ్యేవి), సైడ్ రోడ్ ప్రెజర్ సెన్సర్స్ (పక్క తలుపులపై పడే ఒత్తిడి ఆధారంగా యాక్టివేట్ అయ్యేవి), వీల్ స్పీడ్ సెన్సర్స్ (చక్రం స్పీడ్ ఆధారంగా పని చేసేవి), బ్రేక్ ప్రెజర్ సెన్సర్స్ (బ్రేక్ కొట్టిన తీరు ఆధారంగా యాక్టివేట్ అయ్యేవి) కార్లకు ఉంటాయి. కొన్ని మోడల్స్లో ఇవన్నీ ఉండగా, మరికొన్నింటిలో కొన్ని మాత్రమే ఉంటాయి. ప్రమాదం జరిగినప్పుడు ఒత్తిడి కారణంగా ఇవన్నీ యాక్టివేట్ అయి ఓ యాంగిల్ ఏర్పరుచుకుని ఏసీయూకు సందేశం ఇవ్వడంతో అది బెలూన్ను యాక్టివేట్ చేసి తెరుచుకునేలా చేస్తుంది. ఈ ప్రక్రియ సెకనులోపు సమయంలోనే జరుగుతుంది. సీటు బెల్టులు పెట్టుకోకపోతే కొన్ని వాహనాల్లో ఎయిర్ బ్యాగ్స్ యాక్టివేట్ కావు. మితిమీరిన వేగంలో ఎయిర్బ్యాగ్స్ పనిచేయలేవు హైఎండ్ కార్లు అయినప్పటికీ... అనేక సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నప్పటికీ కొన్ని ప్రమాదాల నుంచి ఎయిర్బ్యాగ్స్ సైతం కాపాడలేవు. మితిమీరిన వేగమే దానికి కారణం. కొన్ని ప్రమాదాల్లో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ అవి డ్రైవింగ్ చేస్తున్న, పక్కన కూర్చున్న వారి ప్రాణాలను కాపాడలేవు. యాక్సిడెంట్ జరిగినప్పుడు సెన్సర్లు యాక్టివేట్ అయి, ఎయిర్బ్యాగ్స్ ఓపెన్ కావడానికి కొంత సమయం పడుతుంది. సాధారణంగా ఇది 0.05 సెకన్గా ఉంటుంది. వాహనం మితిమీరిన వేగంతో ఉన్నప్పుడు ఈ సమయంలోపే డ్రైవర్, ప్రయాణికులు స్టీరింగ్, డాష్బోర్డ్, ముందు సీటు, పక్కడోర్లకు బలంగా ఢీ కొట్టుకుంటారు. రోడ్డు ప్రమాదంతో వాహనం ఛిద్రమైపోయిన సందర్భాల్లోనూ ఎయిర్బ్యాగ్స్ తెరుచుకున్నా ఉపయోగం ఉండదని నిపుణులు చెప్తున్నారు. -
‘కాళేశ్వరం’పై సిట్టింగ్ జడ్జి కోసం మరోసారి లేఖ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై న్యాయవిచారణ నిర్వహించేందుకు సిట్టింగ్ జడ్జి సేవలను కేటాయించాల్సిందిగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని మరోసారి కోరతామని పరిశ్రమలు, ఐటీ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు తెలిపారు. ఈ ప్రాజెక్టుపై విచారణ కోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని గతంలోనే హైకోర్టు చీఫ్ జస్టిస్ను కోరామని, అయితే జడ్జీల సంఖ్య తక్కువగా ఉన్నందున ఇవ్వలేమని, విశ్రాంత న్యాయమూర్తిని అందుకు కేటాయిస్తామని హైకోర్టు నుంచి జవాబు వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో విచారణకు సిట్టింగ్ జడ్జిని కేటాయించాల్సిందిగా మరోసారి లేఖ రాస్తామని వెల్లడించారు. శనివారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కాళేశ్వరం అవినీతిపై న్యాయవిచారణ జరిపిస్తామని స్పష్టంగా పేర్కొన్నామని గుర్తుచేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపిస్తామంటే అడ్డు చెప్పబోమని పేర్కొన్నారు. విచారణ జరిపించ దలుచుకుంటే కేంద్రానికి సీబీఐయే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ విజిలెన్స్ కమిషన్తో కూడా జరిపించేందుకు అవకాశం ఉందన్నారు. అయితే ఈ విభాగాలతో కేంద్రం విచారణ జరిపిస్తే మాత్రం బీఆర్ఎస్–బీజేపీ ఒక్కటవుతాయనే అనుమానం కూడా తమకుందన్నారు.రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమున్నా కాళేశ్వరంపై ప్రాజెక్టుపై విచారణ జరిపించే ఉండేవారని, అందుకోసం విచారణకు సిట్టింగ్ జడ్జిని కూడా ఇచ్చి ఉండేవాళ్లని చెప్పారు. గతంలోనూ వివిధ అంశాలపై పలు సందర్భాల్లో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిగిన ఉదంతాలున్నాయని, అందువల్ల సిట్టింగ్ జడ్జిని ఎప్పుడూ విచారణకు ఇవ్వలేదనే వాదనలు అవాస్తవమని ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఇదిలా ఉంటే... బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకంపై కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన నివేదికలోని అంశాలపైనా తమ ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని శ్రీధర్బాబు చెప్పారు. కేఆర్ఎంబీ చర్చంటే.. బీఆర్ఎస్ సభ్యులు పారిపోయారు కృష్ణానది యాజమాన్య బోర్డు అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొనకుండా బీఆర్ఎస్ సభ్యులు పారిపోయారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు విమర్శించారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులు సూచనలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తామన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డబుల్ డిజిట్ సీట్లు వస్తాయన్నారు. నల్లగొండ సభకు వెళ్లిన కేసీఆర్కు శాసనసభకు రావడానికి ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదన్నారు. సభలో ఏయే పార్టీలు ఎంతెంత సమయమంటే.. 8 రోజుల పాటు 45 గంటల 32 నిమిషాలు సభ నిర్వహించామని, 59 మంది సభ్యులు సభలో మాట్లాడారని, 64 మంది సభ్యులు జీరో అవర్లో మాట్లాడారని, 2 తీర్మానాలను పాస్ చేశామని, 3 బిల్లులకు ఆమోదం తెలిపామని శ్రీధర్బాబు వివరించారు. సభ్యులందరూ సవివరంగా మాట్లాడే అవకాశం కల్పించామని, పార్టీల వారీగా కాంగ్రెస్కు 8 గంటల 43 నిమిషాలు, బీఆర్ఎస్కు 8 గంటల 41 నిమిషాలు, బీజేపీకి 3 గంటల 48 నిమిషాలు, ఎంఐఎంకు 5 గంటలు, సీపీఐకి 2 గంటల 55 నిమిషాలు అవకాశం ఇచ్చామని చెప్పారు. కాగా, కౌన్సిల్ 11 గంటల 5 నిమిషాల పాటు జరిగిందని శ్రీధర్బాబు చెప్పారు. -
షేర్లు.. ఆస్తులు..పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: వందల కోట్ల అక్రమార్జనతో దొరికిపోయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో తవ్వినకొద్దీ మరిన్ని అక్రమ ఆస్తులు బయటపడుతున్నాయి. పలువురు రియల్ ఎస్టేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా కీలక నిర్ణయాలు తీసుకుని తాను పెద్ద మొత్తంలో లబ్ధి పొందినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ బినామీల పేరిట షేర్లు తీసుకోవడంతో పాటు పెట్టుబడులు సైతం పెట్టినట్టు సమాచారం. శివబాలకృష్ణను ఏసీబీ కోర్టు ఎనిమిది రోజుల కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఆరో రోజు కస్టడీలో భాగంగా సోమవారం ఉదయం చంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. తమ సోదాల్లో గుర్తించిన ఆస్తులు, ఆభరణాలు, బ్యాంకు ఖాతాలు, కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్న బ్యాంకు ఖాతాలు, లాకర్లు, కీలక ఆస్తులకు సంబంధించిన పత్రాలు.. ఇలా పలు అంశాలపై గత ఐదు రోజులుగా శివబాలకృష్ణ నుంచి సమాచారం సేకరించిన ఏసీబీ అధికారులు.. తాజాగా రియల్ ఎస్టేట్ కంపెనీలతో లింకులపై ఫోకస్ పెట్టారు. పలు రకాల అనుమతులకు సంబంధించి లోతుగా ఆరా తీస్తున్నారు. రెండు రియల్ కంపెనీలతో పలు లావాదేవీలు ప్రాథమిక ఆధారాల ప్రకారం..ప్రధానంగా రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలతో శివబాలకృష్ణ పలు లావాదేవీలు జరిపినట్టు తెలిసింది. సోమవారం నాటి విచారణలో భాగంగా సంబంధిత వివరాలు ఏసీబీ అధికారులు సేకరించినట్టు తెలిసింది. అదేవిధంగా లాకర్లు ఓపెన్ చేసినప్పుడు లభించిన పలు భూ పత్రాలపైనా ప్రశ్నించినట్టు సమాచారం. ఇప్పటికే శివబాలకృష్ణ సోదరుడు సునీల్ను అధికారులు ప్రశ్నించారు. అతడి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా మరిన్ని అంశాలపై శివబాలకృష్ణను ప్రశ్నించినట్టు తెలిసింది. ఔటర్ చుట్టూ కొన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల్లోనూ అవినీతికి పాల్పడిన శివబాలకృష్ణ తన బినామీల పేరిట ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారం. వీటి గురించి కూడా అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. రెండు రోజుల్లో కస్టడీ ముగియనున్న నేపథ్యంలో కీలక అంశాలపై మరిన్ని వివరాలు సేకరించేలా ఏసీబీ అధికారులు ప్రశ్నావళి రూపొందించుకుంటున్నట్టు తెలిసింది. -
శివబాలకృష్ణకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఏసీబీ
-
నేడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ప్రశ్నించనున్న ఈడీ
-
ప్రజాభవన్ ఎదుట రోడ్డుప్రమాదం కేసులో దర్యాప్తు ముమ్మరం
-
సింగరేణిలో పలు నియామకాలపై ఏసీబీ దర్యాప్తు
-
బిడ్డను కడతేర్చిన తల్లి... వెలుగులోకి మరిన్ని వివరాలు!
బళ్లారి: నాలుగేళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేసిన ఏఐ స్టార్టప్ కంపెనీ సీఈఓ సుచనా సేథ్ కేసులో కీలక విషయాలు బయటపడుత్నాయి. పోలీసులకు హత్య జరిగిన గోవాలోని సర్వీస్ అపార్టుమెంట్ గదిలో ఖాళీగా ఉన్న రెండు సిరప్ సీసాలు లభ్యమయ్యాయి. సిరప్ను అధిక డోస్తో తన కుమారుడికి తాగించి హతమార్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా పరిశీలిస్తే సుచనా సేథ్ ముందుగానే తన కుమారుడిని హత్య చేయాలని ప్రణాళిక వేసినట్లు గోవా పోలీసులు తెలిపారు. అయితే పోస్ట్మార్టం నివేదికల్లో మాత్రం బాలుడు ఎటువంటి పెనుగులాట లేకుండా మరణించడానికి ఒక వస్త్రం లేదా తలగడను ఆమె ఉపయోగించినట్లు తెలుస్తోందని వెల్లడించారు. సుచనా సేథ్ గోవాలో ఉన్న సర్వీస్ అపార్టుమెంట్లో రెండు సిరప్ బాటిల్స్ (ఒకటి చిన్నది, మరోటి పెద్దది) లభించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పోస్ట్మార్టం రిపోర్టులో బాలుడు ఎటువంటి పెనుగులాట లేకుండా మృతి చెందినట్లు తెలుస్తోందని చెప్పారు. అయితే బాలుడు మరణించక ముందు సుచనా అతనికి అధిక డోస్తో కూడిన సిరప్ను తాగించిందా? అన్న విషయంలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. సుచనాకు దగ్గు వస్తోందని సిరప్ కొనుగోలు చేయాలని సర్వీస్ అపార్టుమెంట్ సిబ్బందితో చెప్పిందని పోలీసు అధికారి తెలిపారు. దానితోపాటు ఆమె మరో పెద్ద సిరప్ బాటిల్ను కూడా కొనుగోలు చేసి తన వెంట తెచ్చుకుందని పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని పరిళీలిస్తే పక్కా ప్రణాళిక ప్రకారం బాలుడిని ఆమె హత్య చేసిందని అన్నారు. ప్రాథమిక విచారణలో మాత్రం బాలుడిని తాను హత్య చేయలేదని, తాను నిద్ర లేచేవరకు బాలుడు మృతి చెంది ఉన్నాడని సుచనా సేథ్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె చెప్పే విషయాలపై పలు అనుమానాలు కలుగుతున్నాయని పోలీసు అధికారి తెలిపారు. త్వరలో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని.. బాలుడిని హత్య చేయడానికి ఆమెకు గల ప్రధానమైన కారణాన్ని చేధిస్తామని సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ప్రస్తుతం ఆమె తన భర్తతో విడాకులు తీసుకొవాలని వేరుగా ఉంటోందని.. అదే విషయంలో బాలుడిని హత్య చేసినట్లు తెలుస్తోందని తెలిపారు. ఏఐ స్టార్టప్ కంపెనీ సీఈఓ సుచనా సేథ్ గోవాలో తన కుమారుడిని చంపి, కొడుకు శవాన్ని బ్యాగులో కుక్కి ట్యాక్సీలో కర్ణాటకకు తరలించారు. సోమవారం రాత్రి చిత్రదుర్గలో అరెస్టు చేసినట్లు గోవా పోలీసులు తెలిపారు. నిందితురాలు సుచనా సేథ్ను విచారణ నిమిత్తం ఆరు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ గోవా కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చదవండి: మాతృత్వానికే మచ్చ తెచ్చిన తల్లి -
సీఎం కేజ్రీవాల్ డుమ్మా
-
డ్రగ్స్ కేసుల విచారణకు ఫాస్ట్ట్రాక్ కోర్టు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: డ్రగ్స్ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ప్రజాప్రతినిధుల కేసుల విచారణకు ఉన్న తరహాలోనే ఈ ప్రత్యేక న్యాయస్థానం ఉంటుందని వెల్లడించారు. మత్తు పదార్థాలతో విద్యార్థులు, యువత నిర్విర్యం అవుతున్నారని, వారిని దీని నుంచి రక్షించడానికి తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్స్ బ్యూరో(టీఎస్నాబ్)ను పటిష్టం చేస్తున్నామన్నారు. మత్తుపదార్థాలు ఎవరికీ అందుబాటులో లేకుండా సమూలంగా నిర్మూలిస్తామని చెప్పారు. ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధేతో చర్చిస్తానని తెలిపారు. రాష్ట్రంలో మత్తుపదార్థాలు పండించడం కంటే వినియోగం ఎక్కువగా ఉందని సీఎం వ్యాఖ్యానించారు. గ్రేహౌండ్స్, ఎస్ఐబీలు ఏ విధంగా అయితే మావోయిస్టులను అణచివేశాయో, అదేవిధంగా మత్తు పదార్థాలను పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ కర్తవ్యమని స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. టీఎస్ నాబ్ కోసం అడిషనల్ డీజీపీ సందీప్ శాండిల్యను నియమించామని, మరో 301 మంది అధికారులతో దీనిని బలోపేతం చేస్తామని సీఎం చెప్పారు. వీరికి గ్రేహౌండ్స్, ఎస్ఐబీలో పనిచేస్తున్న వారికి ఇస్తున్న మాదిరిగా అలవెన్సు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. డ్రగ్స్ సరఫరాకు సంబంధించి పూర్తిస్థాయిలో ఇన్ఫార్మర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి..డ్రగ్స్ అనే పదం వినపడకుండా చేయాలన్నది ప్రభుత్వ కృతనిశ్చయం అని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలలతోపాటు ఇతరత్రా ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెడతామని చెప్పారు. సినీతారల డ్రగ్స్ కేసు పురోగతిలో ఉందన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ మేరకు రెండుఫోర్లు టీఎస్నాబ్కు కేటాయించామని తెలిపారు. ఏఓబీతోపాటు ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపుతామని, ఇందుకు టీఎస్ నాబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. విదేశీయుల కోసం డీఅడిక్షన్ కేంద్రం చర్లపల్లి జైలులో రెండు ఎకరాల స్థలంలో డీఅడిక్షన్ కేంద్రం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్టు సీఎం చెప్పారు. నైజీరియా, ఇతర ఆఫ్రికా దేశాల నుంచి వచ్చేవారు వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటూ, మత్తుపదార్థాలు విక్రయిస్తున్నారని, అలాంటి వారికోసం ఈ డీఅడిక్షన్ కేంద్రం పనిచేస్తుందన్నారు. విభాగాల అధిపతుల నియామకం వరకే నా పని ఆయా విభాగాల అధిపతులను నియమించడంవరకే తన పని అని, ఆ తర్వాత వారికి కింద ఎవరు కావాలన్నది వారి నిర్ణయానికి వదిలేస్తున్నట్టు చె ప్పారు. తాను అడిగిన ఫలితాలు రాకపోతే, సంబంధిత విభాగ అధిపతి సమాధానం చెప్పాల్సిందేనని సీఎం వ్యాఖ్యానించారు. మూడు కమిషనరేట్లకు కమిషనర్లను నియమించినా వారికీ అవసరమైన మ్యాన్పవర్ను వారే పిక్ చేసుకుంటారన్నారు. రాష్ట్ర సలహా మండలి.. రాష్ట్ర సలహా మండలిని ఏర్పాటు చేస్తామని దీనికి ముఖ్యమంత్రి చైర్మన్గా వ్యవహరిస్తారని చెప్పారు. ప్రజాభవన్లో ఏర్పాటు అయ్యే మహాత్మా జ్యోతిబా పూలే ఇనిస్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్, రీసెర్చ్ ఆన్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్’లా ఈ సలహామండలి పనిచేస్తుందన్నారు. ప్రొఫెసర్లు హరగోపాల్, నాగేశ్వర్తో పాటు ఆర్ఎస్.ప్రవీణ్కుమార్, ఆకునూ రి మురళి లాంటి మేధావులతో ఇది ఉంటుందన్నారు. అన్నిరకాల గురుకుల విద్యాలయాలు, మండలస్థాయిలో ఏర్పాటు చేసే ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఈ సంస్థ పర్యవేక్షణలో ఉంటాయని చెప్పారు. గత ప్రభుత్వం గురుకు లాలు ఏర్పాటు చేసినా, మౌలిక సదుపాయాలు కల్పించలేదని, అగ్గిపెట్టెల్లాంటి అద్దె భవనాల్లో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్య 100 రోజుల్లో పరిష్కారం జర్నలిస్టుల సమస్యలను వందరోజుల్లో పరిష్కరిస్తామని, ప్రెస్ అకాడమీ చైర్మన్ను సంక్రాంతిలోగా నియమిస్తామన్నారు. ఇళ్ల స్థలాల అంశం మరోసారి రాకుండా పూర్తిస్థాయిలో జర్నలిస్టుల సమస్యను ఒక పద్ధతి ప్రకారం పరిష్కరిస్తామని అందరికీ ఇళ్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తామన్నారు. -
300 మంది భారతీయుల అక్రమరవాణా?.. ఫ్రాన్స్లో విమానం నిలిపివేత
ప్యారిస్: మానవ అక్రమరవాణా జరుగుతుందన్న అనుమానాల నేపథ్యంతో.. ఓ విమానం ఫ్రాన్స్లో నిలిచిపోయింది. ఇందులో 300 మంది భారతీయులు ఉన్నారు. వీళ్లంతా మధ్య అమెరికా దేశం నికరాగువా వెళ్తున్నట్లు తేలింది. గుర్తు తెలియని వ్యక్తి అందించిన సమాచారం మేరకు.. విమానాన్ని తాము అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు ఫ్రాన్స్ అధికారులు ప్రకటించారు. ప్యారిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్లైన్స్ విమానం ఎయిర్బస్ ఏ340 యూఏఈ నుంచి నికరాగువాకు బయల్దేరింది. ఇంధనం కోసం ప్యారిస్ వ్యాట్రి(Vatry) ఎయిర్పోర్ట్లో దిగింది. అయితే అప్పటికే సమాచారం అందడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. విమానాన్ని ఆపేసి.. ఇద్దరి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు భారత అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఇంకోవైపు ప్రయాణికులకు అక్కడే బస ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల్లో మైనర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఇది మానవ అక్రమరవాణేనా అనేది తేలాల్సి ఉంది. అక్రమ చొరబాటు కోసమే? అక్రమ చొరబాట్ల కోసమే వీళ్లను తీసుకెళ్తున్నారా? అనే కోణంలోనూ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. తొలుత వీళ్లను మధ్య అమెరికాకు చేర్చి.. అక్కడి నుంచి అమెరికా లేదంటే కెనడాకు అక్రమంగా ప్రవేశిస్తారేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులంతా క్షేమం: ఇండియన్ ఎంబసీ ఫ్రాన్స్లోని భారత దౌత్య కార్యాలయం ఈ పరిణామంపై స్పందించింది. ఫ్రెంచ్ అధికారులు తమకు సమాచారం అందించారని, తాము దర్యాప్తు జరుపుతున్నామని, ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారని ఎక్స్ ద్వారా తెలిపింది. అయితే వీళ్ల ప్రయాణ ఏర్పాట్లపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. French authorities informed us of a plane w/ 303 people, mostly Indian origin, from Dubai to Nicaragua detained on a technical halt at a French airport. Embassy team has reached & obtained consular access. We are investigating the situation, also ensuring wellbeing of passengers. — India in France (@IndiaembFrance) December 22, 2023 ఫ్రాన్స్ చట్టాల ప్రకారం.. అక్కడి చట్టాల ప్రకారం.. ఫ్రాన్స్ గడ్డపై అడుగుపెట్టిన ఒక విదేశీయుడ్ని ఏమైనా అనుమానాలు ఉంటే అక్కడి భద్రతా బలగాలు నాలుగు రోజుల దాకా ఎటూ కదలనీయకుండా చేయొచ్చు. అక్కడి న్యాయమూర్తులు గనుక అనుమతిస్తే.. మరో ఎనిమిది రోజులు, అసాధారణ పరిస్థితుల్లో మరో ఎనిమిది రోజులు.. గరిష్టంగా 26 రోజులపాటు తమ అదుపులో ఉంచుకోవచ్చు. -
కరాచి బేకరి కిచెన్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం
-
కాళేశ్వరంపై విచారణకు ఆదేశిస్తాం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు, నిర్మాణంలో లోపాలపై రాష్ట్ర మంత్రివర్గం ఆదేశాల మేరకు విచారణకు ఆదేశిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు అన్నారం బ్యారేజీలో బుంగలు ఏర్పడిన నేపథ్యంలో.. వాటిని డిజైన్ చేసిన, నిర్మించిన వారిని బాధ్యులుగా చేసి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై సవివరంగా లిఖితపూర్వక వివరణ సమర్పించాల్సిందిగా నీటిపారుదల శాఖను ఆదేశించినట్టు తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారిగా సోమవారం జలసౌధకు వచ్చిన మంత్రి.. శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై ఈఎన్సీ సి.మురళీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరణ ఇచ్చారు. సమీక్ష అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ప్రతి ప్రాజెక్టుపై సమగ్ర నివేదికకు ఆదేశం నీటిపారుదల శాఖలో భారీ అవినీతి జరిగిందని, ప్రాజెక్టుల నిర్మాణంలో గోప్యత పాటిస్తున్నారని, రహస్య జీవోలు ఇచ్చారంటూ అనేక ఆరోపణలున్నాయని ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. ఇకపై శాఖ పనితీరు పారదర్శకంగా ఉండాలని, సమర్థతను పెంచుకోవాలని అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ వ్యయం, ప్రతిపాదిత ఆయకట్టు వంటి అంశాలపై సరైన అధ్యయనాలు లేకుండానే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని విమర్శించారు. కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.లక్ష కోట్లను ఖర్చు చేసినా, ఆయకట్టుకు నామమాత్రంగానే సాగునీరు లభిస్తోందన్నారు. ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన 32 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. ప్రతి ప్రాజెక్టు కింద స్థిరీకరించిన కొత్త ఆయకట్టు, ప్రాజెక్టుల నిర్వహణకు కానున్న విద్యుత్ చార్జీల వ్యయం ఇతర అంశాలపై సమగ్ర నివేదిక కోరామన్నారు. ప్రాణహిత–చేవెళ్ల చేపడతాం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం పక్కన పెట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును మళ్లీ చేపడతామని చెప్పారు. ప్రాణహితపై తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలనే అంశంపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను సత్వరంగా పూర్తి చేస్తామని చెప్పారు. సీఎంతో పాటు, మంత్రివర్గంలో చర్చించి ఎస్ఎల్బీసీ సొరంగం పనుల బిల్లులు విడుదల చేస్తామన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. మంత్రిగా ఈ నెల 14న బాధ్యతలు స్వీకరిస్తానని ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. సమీక్షలో ఈఎన్సీలు బి.నాగేందర్ రావు, హరిరామ్, అనిల్కుమార్, సీఈలు హమీద్ఖాన్, అజయ్కుమార్ పాల్గొన్నారు. స్మితా సబర్వాల్ గైర్హాజరు జలసౌధలో జరిగిన సమీక్షకు ఆ శాఖ ఇన్చార్జి కార్యదర్శి స్మితా సబర్వాల్ గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి జలసౌధకు వస్తున్నారనే విషయాన్ని ఆమెకు తెలియజేసినట్టు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్మిత కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. -
ప్రతి ముప్పును తీవ్రంగా పరిగణిస్తాం.. ఖలిస్థానీ బెదిరింపులపై కెనడా
ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరింపులపై కెనడా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ప్రతి బెదిరింపును తాము సీరియస్గా తీసుకుంటామని కెనడా రవాణాశాఖ మంత్రి మంత్రి పాబ్లో రోడ్రిగ్జ్ వెల్లడించారు.ముఖ్యంగా విమానయాన సంస్థలను హెచ్చరిస్తూ వచ్చిన బెదిరింపులలను తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. ఎయిర్ ఇండియాపై వచ్చిన బెదిరింపు వీడియోపై తమ పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. కాగా గతవారం ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించవద్దని, అది ప్రమాదకరమని ఖలిస్తానీ వేర్పాటువాది, ‘సిఖ్ ఫర్ జస్టిస్’ వ్యవస్థాపకుల్లో ఒకరైన గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. అతను ఎయిరిండియా ప్రయాణికులకు తీవ్ర హెచ్చరికలు చేశాడు. ‘నవంబర్ 19 తరువాత ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులవరూ ప్రయాణించకండి. మీ ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది’ అని వీడియో ద్వారా కెనడా మీడియాకు తెలిపారు. అంతేగాక ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ఆ విమానాలను అనుమతించబోమని హెచ్చరించాడు. దాంతోపాటు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఆ రోజు మూసివేస్తామని, దాని పేరు మారుస్తామని వీడియోలో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇది కేవలం బెదిరింపు మాత్రమే కాదని, భారత వ్యాపార సంస్థలను నిషేధించేందుకు ఇచ్చిన పిలుపు కూడా అని పేర్కొన్నారు. ఇక ఖలిస్థాన్ ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. ఢిల్లీ, పంజాబ్ విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జార్ సింగ్ హత్య విషయంలో భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్న నెలకొన్న విషయం తెలిసిందే. నిజ్జార్ సింగ్ హత్య విషయంలో భారత ఏజెంట్ల ప్రమోయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ట్రూడ్ ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కెనడా ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. చదవండి: పాక్లో అంగతకుల కాల్పులు.. లష్కరే తోయిబా మాజీ కమాండర్ మృతి -
ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల్లో విచారణకు ప్రత్యేక బెంచ్లు
న్యూఢిల్లీ: ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల్లో విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్లో విచారణను వేగవంతం చేయడానికి ప్రత్యేక ధర్మాసనాలు(బెంచ్లు) ఏర్పాటు చేయాలని హైకోర్టులను ఆదేశించింది. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై 5 వేలకుపైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారణ మందకొడిగా సాగుతోంది. తీవ్రమైన నేరాలకు పాల్పడేవారిని జీవిత కాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని సీనియర్ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల్లో విచారణను వేగంగా పూర్తిచేయడానికి కచి్చతమైన మార్గదర్శకాలు జారీ చేయడం క్లిష్టమైన ప్రక్రియ అని అభిప్రాయపడింది. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను వేగంగా పరిష్కరించే బాధ్యతను హైకోర్టులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమనల్ కేసుల విచారణకు కొన్ని మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఇలాంటి కేసుల వివరాలను జిల్లా కోర్టులు, ప్రత్యేక కోర్టుల నుంచి సేకరించి, హైకోర్టు వెబ్సైట్లో పొందుపర్చాలని తెలియజేసింది. తీవ్రమైన నేరాల విషయంలో విచారణను వాయిదా వేయకూడదని ట్రయల్ కోర్టులకు తేల్చిచెప్పింది. క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారానికి వెబ్సైట్ను, సాంకేతిక పరిజ్ఞానాన్ని సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. ప్రజాప్రతినిధులు తీవ్ర నేరాలను పాల్పడినట్లు అభియోగాలు నిరూపితమైతే ఎంపీ లేదా ఎమ్మెల్యే ఎన్నికల్లో వారు పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించడంపై విచారణ జరుపుతున్నామని స్ప ష్టం చేసింది. ఈ అంశంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలియజేసింది. -
బాలినేని కుటుంబానికి సంబంధం లేదు
ఒంగోలు అర్బన్/సబర్బన్: ‘నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపు పేపర్లు, ఫోర్జరీలతో ఒంగోలులో జరిగిన భూ అక్రమాలతో ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ మలికాగర్గ్ స్పష్టంచేశారు. బాలినేనిపైన, ప్రభుత్వంపైన చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. ఒంగోలు భూదందాపై సిట్ దర్యాప్తును బాలినేని కుటుంబం ముందుకు సాగనివ్వడంలేదంటూ కథనాలు ప్రచురించటం సరికాదని చెప్పారు. బాలినేని కుటుంబం దర్యాప్తును ఎప్పుడూ అడ్డుకోలేదని అన్నారు. అవాస్తవాలను, అసత్య కథనాలను ప్రచురిస్తే అవి రాజకీయ జీవితంలో ఉండేవారి భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయన్నారు. ఇలాంటి కథనాలు ప్రచురించేటప్పుడు, ప్రసారం చేసేటప్పుడు సరైన వివరణ తీసుకోవాలని చెప్పారు. ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్లతో జరిగిన భూ కబ్జాలపై సిట్ దర్యాప్తు వివరాలను కలెక్టర్, ఎస్పీ శుక్రవారం ఇక్కడ మీడియాకు వివరించారు. భూ కబ్జాలపై ఒంగోలు జెడ్పీటీసీ, మేయర్ గంగాడ సుజాత, మరికొందరు ఇచ్చిన వేర్వేరు ఫిర్యాదుల మేరకు సిట్ ద్వారా నిష్పాక్షికమైన, వేగవంతమైన దర్యాప్తు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఎమ్మెల్యే బాలినేని సోదరుడు వేణుగోపాల్రెడ్డి భూమి వివాదంలో ఉందని, దాన్ని భూ కబ్జా కోవలోకి తేవటం çసరికాదని అన్నారు. ఆ భూమి 40 ఏళ్లుగా బ్యాంకు లావాదేవీల ప్రక్రియలో ఉందన్నారు. సివిల్ పంచాయితీలను కూడా భూ కబ్జాల కింద కథనాలుగా ఇవ్వడం వల్ల సిట్ దర్యాప్తు పక్కదారి పట్టే ప్రమాదం ఉందన్నారు. నకిలీ డాక్యుమెంట్లు, భూకబ్జాల వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరిపి, బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డే స్వయంగా చెప్పారన్నారు. సిట్లో ఇద్దరు ఏఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, 17 మంది సీఐలు, ఎస్సైలు ఇతర పోలీస్ సిబ్బంది ముమ్మరంగా పని చేస్తున్నారని చెప్పారు. రెవెన్యూ విభాగం తరఫున జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ శాఖ, మార్కాపురం, కనిగిరి సబ్ డివిజన్ల పరిధిలోని ఆర్డీవోలు సిట్ సబ్ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఫోర్జరీ, నకిలీ స్టాంపులు, నకిలీ డాక్యుమెంట్ల కుంభకోణంపై ఒంగోలు మండలం ముక్తినూతలపాడుకు చెందిన ఒకరు సెప్టెంబర్ 28న ఫిర్యాదు ఇవ్వడంతో భూ కబ్జాల వ్యవహారం వెలుగు చూసిందని కలెక్టర్ చెప్పారు. దీనిపై విచారణ చేపట్టగా లాయర్పేటలోని ఒక ఇంట్లో పూర్ణచంద్రరావు, మరికొందరితో కూడిన బృందం ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందన్నారు. ఆ ఇంట్లో మీ సేవ బ్లాంక్ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ స్టాంప్ పేపర్లు, పలు ప్రభుత్వ అధికారులకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు లభించాయన్నారు. ఇటువంటి అనేక ఫిర్యాదులు రావడంతో సిట్ ఏర్పాటు చేసి లోతైన విచారణ చేపట్టామని తెలిపారు. ఇప్పటి వరకు 572 డాక్యుమెంట్లు, 60 రబ్బర్ స్టాంప్లు, 1,224 జ్యుడిషియల్ స్టాంప్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మార్కాపురం, కనిగిరి పరిధిలో కూడా 5 కేసులు నమోదయ్యాయన్నారు. ప్రైవేటు వ్యక్తుల భూములతో పాటు ప్రభుత్వ భూముల డీకే పట్టాల విషయంలోనూ నకిలీ వ్యవహారాలు జరిగాయని తెలిపారు. ఈ దందా పన్నెండేళ్లకు పైగా జరుగుతున్నట్లు తెలిసిందన్నారు. ఎక్కువ కాలం ఎటువంటి లావాదేవీలు జరగని ఖాళీ స్థలాలకు నకిలీ వీలునామా, జీపీఏ వంటివి సృష్టించి మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఎటువంటి సమస్యలు లేని స్థలాలకు సైతం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, వాటిని గొడవల్లోకి తెచ్చి, కోర్టుల్లో స్టే ఆర్డర్ వంటివి పొందినట్లు కూడా తెలిసిందన్నారు. నకిలీ డాక్యుమెంట్లతో భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. ఈ వ్యవహారాల్లో అక్రమాలపై లోతైన దర్యాప్తు చేసి కారకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు, ప్రభావం లేకుండా పూర్తి స్వేచ్ఛగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వాలపై ఆరోపణలు చేయడం వారిని వ్యక్తిగతంగా బాధించడమే అవుతుందని చెప్పారు. విషయాలను పూర్తిగా తెలుసుకుని వార్తా పత్రికలు, టెలివిజన్ ఛానళ్లు వార్తలను ప్రచురించడం, ప్రసారం చేయడం చేయాలన్నారు. ఎస్పీ మలికాగర్గ్ మాట్లాడుతూ ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నామని, సిట్ బృందం వేగంగా, నిరంతరాయంగా దర్యాప్తు చేస్తోందని తెలిపారు. దీనిపై ఇప్పటివరకు 54 కేసులు నమోదయ్యాయన్నారు. పూర్ణచంద్రరావు బృందంలో 72 మంది ఉన్నారని, వారిలో 38 మందిని ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు. మిగిలిన వారిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. ఈ వ్యవహారంలో బాధితులకు న్యాయం చేయాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి చెబుతున్నారన్నారు. సిట్ దర్యాప్తుపై బాలినేని ప్రభావం ఉందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. -
Bribe Case: బంజారాహిల్స్ పీఎస్ లో కొనసాగుతోన్న ఏసీబీ విచారణ
-
అదే నిజమైతే బిలియనీర్కి ఏడేళ్ళు జైలు శిక్ష! వీడియోలో ఏముందంటే?
ఇటలీలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాలీవుడ్ నటి గాయత్రి జోషి, ఆమె భర్త వికాస్ ఒబెరాయ్ లంబోర్ఘిని కారు ప్రమాదంలో చిక్కుకుందని, ఈ సంఘటనలో వారు గాయపడగా, ఒక ఫెరారీ కారు మంటల్లో చిక్కుకుని అందులోని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ సంఘటన మీద విచారణ జరుగుతోంది. నివేదికల ప్రకారం, ఈ ప్రమాదంలో ఒబెరాయ్ దోషిగా తేలితే సుమారు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ రంగంలో కోట్లు సంపాదిస్తున్న బిలియనీర్ వికాస్ ఒబెరాయ్ ప్రయాణిస్తున్న కారుని.. ఫెరారీ కారు క్రాష్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. వీడియోలో గమనించినట్లయితే.. రోడ్డుపై అనేక సూపర్ కార్లు వెళ్తున్నాయి. ఈ సందర్భంగా ఒబెరాయ్ తన భార్యతో లంబోర్ఘిని కారులో ముందు వెళ్తున్న ఒక ట్రక్కుని ఓవర్టేక్ చేయడానికి వెళ్తాడు, అదే సమయంలో వెనుక వస్తున్న ఫెరారీ కారు లంబోర్ఘినిని ఓవర్టేక్ చేయడానికి వెళ్ళింది. ఈ సందర్భాల్లో ఈ ప్రమాదం జరిగింది. ఇదీ చదవండి: కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి.. ఈ ప్రమాదంలో ఫెరారీ కారులోని ఇద్దరు స్విస్ వ్యక్తులు మరణించారు, కాగా ఒబెరాయ్ అతని భార్య గాయత్రి జోషి గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో ఒబెరాయ్ వేగవంతమైన ఫెరారీని గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం వికాస్ ఒబెరాయ్పై అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే అసలు తప్పు ఎవరిది అనే ప్రశ్న తలెత్తుతోంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. Two deaths on a Ferrari in Sardina, Italy pic.twitter.com/skT3CaXg0T — Globe Clips (@globeclip) October 3, 2023 -
స్కిల్ ఒప్పందం కుదిరిన నాలుగు రోజుల్లోనే..
-
మూడేళ్ల క్రితం డ్రగ్స్ తీసుకున్నా..
హిమాయత్నగర్: మూడేళ్ల క్రితం డ్రగ్స్ తీసుకున్నానని... ఇటీవల కాలంలో ఎప్పుడూ వాటి జోలికి పోలేదని నటుడు నవదీప్ తెలంగాణ స్టేట్ నార్కోటిక్ బ్యూరో (టీఎస్ఎన్ఏబీ) అధికారులకు తెలిపాడు. ఇటీవల హైదరాబాద్ మాదాపూర్లోని విఠల్నగర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ వ్యవహారంలో మరోమారు నవదీప్ పేరు తెరపైకి రావడం, అతడు సైతం డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నట్లు సీపీ, టీఎస్ఎన్ఏబీ డైరెక్టర్ సీవీ ఆనంద్ ప్రకటించిన నేపథ్యంలో టీఎస్ఎన్ఏబీ నుంచి నోటీసులు అందుకున్న హీరో నవదీప్ శనివారం ఉదయం 11 గంటలకు టీఎస్ఎన్ఏబీ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరయ్యాడు. ఏసీపీ కె.నర్సింగరావుతో కలసి టీఎస్ఎన్ఏబీ (వెస్ట్) ఎస్పీ సునీతారెడ్డి నవదీప్ను దాదాపు 7 గంటలపాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం నవదీప్ మీడియాతో మాట్లాడుతూ నార్కోటిక్ బ్యూరో అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పానన్నాడు. మళ్లీ ఎప్పుడు పిలిచినా తాను వచ్చేందుకు సిద్ధమని తెలియజేశాడు. ఈమధ్య కాలంలో డ్రగ్స్ తీసుకోలేదు... డ్రగ్స్ వ్యవహారంలో రామ్చంద్ అనే వ్యక్తిని టీఎస్ఎన్ఏబీ పోలీసులు విచారించగా తన పేరు చెప్పాడని... అతనిచ్చిన వాంగ్మూలం మేరకు నార్కోటిక్ పోలీసులు ప్రశ్నించారని హీరో నవదీప్ వివరించాడు. తాను మూడేళ్ల క్రితం డ్రగ్స్ తీసుకున్నానే తప్ప ఇటీవల కాలంలో తీసుకోలేదన్నాడు. 15 ఏళ్లుగా పరిచయమున్న రామ్చంద్ ఏ కారణంతో తన పేరు చెప్పాడో తెలియదని పేర్కొన్నాడు. డ్రగ్ పెడ్లర్లు వెంకటరమణారెడ్డి, బాలాజీలతో ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలంటూ నార్కోటిక్ పోలీసులు ప్రశ్నించగా 2017 నాటి డ్రగ్స్ కేసు విషయం, ఆనాటి పెడ్లర్ల ద్వారా వారు పరిచయమయ్యారని అతను చెప్పినట్లు తెలిసింది. 2017లో ఎక్సైజ్ అధికారులు విచారణకు పిలిచినప్పుడు వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పానని నవదీప్ ఈ సందర్భంగా గుర్తుచేశాడు. ఆ 81 మందిపై ఆరా... హీరో నవదీప్ మొబైల్ను స్వా«దీనం చేసుకున్న నార్కోటిక్ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రధానంగా 81 ఫోన్ నంబర్లపై పోలీసులు దృష్టి సారించారు. అందులో డ్రగ్ పెడ్లర్లు, వినియోగదారుల పేర్లు ఉన్నట్లు నార్కోటిక్ పోలీసులు అభిప్రాయానికి వచ్చారు. దీంతో వారి గురించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. నవదీప్కు చెందిన ఎస్బీఐ ఖాతాను పరిశీలిస్తున్న పోలీసులు... ఎవరెవరితో లావాదేవీలు జరిగాయనే కోణంలో విచారిస్తున్నారు. అదేవిధంగా అతని మొబైల్లోని స్నాప్చాట్, వాట్సాప్, టెలిగ్రామ్ చాట్లను పరిశీలిస్తున్నారు. డ్రగ్స్ కొనుగోలు, విక్రయాలు, అతను ఎవరెవరితో కలసి డ్రగ్స్ తీసుకున్నాడనే విషయాలన్నీ స్నాప్చాట్, టెలిగ్రామ్ల చాటింగ్లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ నెలాఖరు లేదా అక్టోబర్ మొదటి వారంలో నవదీప్ను విచారణ నిమిత్తం పిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. భయం వేసి పారిపోయా.. డ్రగ్స్ తీసుకోకుంటే పారిపోవాల్సిన అవసరం ఏముందని ఎస్పీ సునీతారెడ్డి నవదీప్ను ప్రశ్నించగా మీడియాలో తాను డ్రగ్స్ తీసుకున్నట్లు పదేపదే వార్తలు రావడం వల్ల భయానికి గురయ్యానని హీరో నవదీప్ పేర్కొన్నట్లు తెలిసింది. మీడియా ఒత్తిడి వల్ల తనను నార్కోటిక్ బ్యూరో అరెస్టు చేసే అవకాశం ఉందని భావించి పారిపోయినట్లు విచారణలో అతను చెప్పాడని సమాచారం. 45 మందికి తరచూ ఫోన్లు.. డ్రగ్స్ వ్యవహారంలో హీరో నవదీప్ను విచారించాం. మూడేళ్ల క్రితం డ్రగ్స్ తీసుకున్నానని చెప్పాడు. విచారణకు వచ్చే సమయంలో మొబైల్లోని డేటా అంతా తొలగించి.. తల్లికి చెందిన మొబైల్ ఫోన్తో వచ్చాడు. అతని మొబైల్ ఫోన్ గురించి ప్రశ్నించగా.. మరమ్మతుల్లో ఉందన్నాడు. దీనిపై క్రాస్ చెక్ చేయగా మొబైల్ షాప్ వ్యక్తి కూడా అదే సమాధానం ఇచ్చాడు. పాత, కొత్త మొబైల్తోపాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఇప్పటివరకు 81 లింకులను గుర్తించాం. వాటిలో ప్రధానంగా 45 మందికి నవదీప్ తరచూ ఫోన్కాల్స్, మెసేజ్లు చేసేవాడు. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం – ఎస్పీ సునీతారెడ్డి -
సీఐడీ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ?
-
Sep 23rd 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
Updates.. 6:50 PM, సెప్టెంబర్ 23, 2023 లోకేష్ తీరుపై YSRCP విమర్శలు ► ఢిల్లీ వదిలి ఏపీకి రండి ► తండ్రి జైల్లో ఉంటే ఢిల్లీలో దాక్కుంటారా? తండ్రి అధికారం అడ్డంపెట్టుకుని అడ్డదారిలో మూడు శాఖలకు మంత్రిగా, ప్రజాధనం దోచేయడానికి అనేక కుంభకోణాలకు @naralokesh తెరతీశాడు. స్కిల్ స్కాంలో తండ్రి అరెస్టు అవ్వడంతో జాతీయ నాయకులను కలుస్తానంటూ కేసుల భయంతో ఢిల్లీ పారిపోయాడు. జాతీయ నాయకుల అపాయింట్మెంట్ లు లభించకపోవడంతో ప్రస్తుతం… pic.twitter.com/lGONp8mG6Y — YSR Congress Party (@YSRCParty) September 23, 2023 5:50 PM, సెప్టెంబర్ 23, 2023 కస్టడీ విచారణలో ప్రశ్నల పరంపర ► కుట్ర కోణం, నిధుల విడుదల, షెల్ కంపెనీలు సాక్ష్యాధారాల మాయంపై ప్రశ్నలు ► సుమన్ బోస్తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారా? ► డీపీఆర్ లేకుండా ఎందుకు ప్రాజెక్టు ఓకే చేయించారు? ► సుబ్బారావుకు 4 పదవులు కట్టబెట్టడం వెనుక మతలబేంటి? ► నిధుల విడుదల చేసే ముందు ప్రొసీర్స్ ఎందుకు ఫాలో కాలేదు? ► ఫైనాన్స్ సెక్రటరీ వద్దన్నా నిధులు ఎందుకు విడుదల చేశారు? ► యూపీ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ను డిప్యూటీ సీఈవోగా ఎందుకు చేశారు? ► 3వేల కోట్ల గురించి అడగొద్దని అధికారులను ఎందుకు దబాయించారు? ► ఈ స్కామ్లో అచ్చెన్నాయుడు పాత్ర ఏంటి? ► 3వేల కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ డిస్కౌంట్గా ఎందుకు మారింది? ► 330 కోట్ల డబ్బులు దోచుకునేందుకే 3,356 కోట్లకు ప్రాజెక్టు అంచనాలు పెంచారా? ► సుమన్ బోస్తో సుబ్బారావుకు జరిగిన ఈమెయిల్స్ వివరాలేంటి.? 5:00 PM, సెప్టెంబర్ 23, 2023 ఇవ్వాళ్టికి ముగిసిన CID విచారణ ► రాజమండ్రి జైలులో చంద్రబాబు విచారణ ► చంద్రబాబును ప్రశ్నించిన CID బృందం ► CID DSP ధనుంజయుడు నేతృత్వంలో విచారణ ► చంద్రబాబు స్టేట్మెంట్ను రికార్డు చేసిన అధికారులు ► విచారణను వీడియో రికార్డింగ్ చేసిన అధికారులు ► న్యాయవాదుల సమక్షంలోనే జరిగిన విచారణ ► బాబు తరపు లాయర్లు దమ్మాలపాటి శ్రీనివాస్, సుబ్బారావు ► భోజనంతో పాటు మొత్తం 4 సార్లు బ్రేక్ ఇచ్చిన అధికారులు ► బాబు ఆరోగ్యం దృష్ట్యా జైలు ఆవరణలోనే వైద్య బృందం ► రేపు కూడా జరగనున్న చంద్రబాబు కస్టడీ విచారణ 4:35 PM, సెప్టెంబర్ 23, 2023 లోకేష్ తీరుపై విమర్శలు ► బాధ్యత వదిలి లోకేష్ ఢిల్లీలో ఉంటున్నాడని YSRCP విమర్శలు ► అరెస్ట్ హంగామా చేసిన లోకేష్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లిపోయాడని చురకలు తండ్రి స్కిల్ కుంభకోణంలో ఆధారాలతో సహా దొరికిపోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటే.. రోడ్డు మీద ధర్నాలు చేయండని కార్యకర్తలను రెచ్చగొట్టి నారా లోకేష్ మాత్రం ఢిల్లీలోని 7 స్టార్ హోటల్స్ లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు! #TDPGoonsInAssembly#APAssembly#TDPRowdies… pic.twitter.com/xizH8fLMNB — YSR Congress Party (@YSRCParty) September 23, 2023 4:35 PM, సెప్టెంబర్ 23, 2023 బుద్ధి మారని తెలుగుదేశం ► బురద జల్లడంలో తీరు మార్చుకోని తెలుగుదేశం ► చివరికి కస్టడీ విచారణను కూడా వదలని వైనం ► ప్రభుత్వానికి ఏదో ఒక లింకు పెట్టేందుకు ప్రయత్నం ► విచారణ ఆలస్యమయిందని ఎల్లో మీడియాలో వార్తలు ► నిన్న అంతా కస్టడీ వద్దని గగ్గోలు ► ఇవ్వాళ 9.30కు మొదలు 11.30కు మొదలైందంటూ అసత్యాలు ► జైల్లో దాక్కుని ఆలస్యం గురించి తెలుసుకున్నారా? ► అదిగో బ్రేకింగ్.. ఇదిగో కుట్ర అంటూ పచ్చ ట్వీట్లు ► జనం నవ్వుకుంటారన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా? చంద్రబాబు గారికి బెయిల్ రాకుండా కుట్ర పన్నారా? అందుకే కోర్టును కస్టడీ కోరారా? కస్టడీ పేరుతో చంద్రబాబు గారిని మానసికంగా ఇబ్బంది పెట్టడమే సీఐడీ లక్ష్యమా? ఉదయం 9.30కే ప్రారంభం కావాల్సిన విచారణ 11.30 వరకు ఎందుకు ప్రారంభం కాలేదు? ఎందుకంటే ఇది అక్రమ కేసు#CBNLifeUnderThreat… pic.twitter.com/oPWrAsdVIb — Telugu Desam Party (@JaiTDP) September 23, 2023 4:15 PM, సెప్టెంబర్ 23, 2023 సుప్రీంకోర్టుకు చంద్రబాబు ► సుప్రీంకోర్టులో చంద్రబాబు లాయర్ల క్వాష్ పిటిషన్ ► హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన బాబు లాయర్లు ► చంద్రబాబును అరెస్ట్ కు గవర్నర్ అనుమతి తీసుకోలేదని వాదన #BREAKING Former Andhra Pradesh CM Chandrababu Naidu approaches #SupremeCourt seeking to quash the FIR against him in the skill development scam case. AP High Court yesterday had dismissed his petition.#ChandrababuNaidu #SupremeCourtofIndia pic.twitter.com/pobSSiM3hR — Live Law (@LiveLawIndia) September 23, 2023 ► 17(A) సవరణ చంద్రబాబు అరెస్ట్ కు వర్తిస్తుందని వాదన ► సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో క్వాష్ పిటిషన్ కాపీ ఇచ్చిన లాయర్లు ► సోమవారం పిటిషన్ ను మెన్షన్ చేసి నెంబర్ కేటాయించే అవకాశం ► నిన్ననే క్వాష్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు The Andhra Pradesh High Court today dismissed the quashing plea filed by former state Chief Minister and Telugu Desam Party leader N Chandrababu Naidu in connection with the multi-crore Skill Development Scam case. Read more: https://t.co/OBWgaImQji pic.twitter.com/RO58oB2jPM — Live Law (@LiveLawIndia) September 22, 2023 4:13 PM, సెప్టెంబర్ 23, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు విచారణ ► ఉదయం 9.30గంటల నుంచి చంద్రబాబు విచారణ ► స్కిల్ స్కాం ప్రశ్నలను చంద్రబాబును అడుగుతున్న CID ► సాయంత్రం 5గంటలకు ముగియనున్న తొలి రోజు విచారణ 3:34 PM, సెప్టెంబర్ 23, 2023 సోమవారం చంద్రబాబు బెయిల్ పిటిషన్ ► స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ► సోమవారం ఏసీబీ కోర్టులో వాదనలు జరిగే అవకాశం ► ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ ► చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని 186 పేజీల కౌంటర్ ► దర్యాప్తు వివరాలను, సేకరించిన ఆధారాలను కౌంటర్లో పొందుపరిచిన సీఐడీ ► సెక్షన్ 17ఏ చంద్రబాబుకు ఎందుకు వర్తించదనే అంశాన్ని పిటిషన్లో పొందుపరిచిన సీఐడీ ► చంద్రబాబుపై ఉన్న స్కిల్ స్కాంకు సెక్షన్ 409 వర్తిస్తుందని కౌంటర్లో వివరించిన ఏసీబీ 2:34 PM, సెప్టెంబర్ 23, 2023 రాజధాని కేసులో ఇంప్లీడ్ పిటిషన్.! ► రాజధాని కేసులో నాన్ పొలిటికల్ JAC ఇంప్లీడ్ పిటిషన్ ► 3 రాజధానులతోనే అభివృద్ధి సాధ్యమని సుప్రీంను ఆశ్రయించనున్న జేఏసీ ► అమరావతి రైతులు వేసిన కేసులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రెండో ప్రతివాదిగా నాన్ పొలిటికల్ JAC 1:35 PM, సెప్టెంబర్ 23, 2023 ఆనాడే ఎన్టీఆర్ చెప్పారు : పోసాని కృష్ణమురళి ► చంద్రబాబు అవినీతిని ఎన్టీఆర్ అప్పుడే బయటపెట్టారు ► చంద్రబాబు తన పదవి కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారు ► చంద్రబాబు అవినీతిపరుడని పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు ► పోలవరాన్ని బాబు ATMగా మార్చుకున్నారని ప్రధాని మోదీ చెప్పారు ► చంద్రబాబు దుర్మార్గాలను నందమూరి కుటుంబమే చెప్పింది ► ఇద్దరినీ కాల్చిన కేసులో బాలకృష్ణ కోర్టుకు వెళ్లకుండా నాటి సీఎం వైఎస్సార్ కాపాడారు ► ఈ విషయాలన్నీ పురంధేశ్వరికి తెలియదా ? ► ఎన్టీఆర్ పెట్టిన మధ్య నిషేధాన్ని చంద్రబాబు ఎత్తేసినపుడు పురంధేశ్వరి ప్రశ్నించలేదెందుకు.? ► ఎన్టీఆర్ వ్యతిరేకించిన కాంగ్రెస్లో మీరు ఎలా చేరారు ? కేంద్ర మంత్రి పదవి ఎందుకు తీసుకున్నారు? ► రేపు ఎన్నికల్లో సమీకరణాలు మారితే మళ్లీ కాంగ్రెస్లో చేరి సోనియా, రాహుల్కు జై కొడతారా ? ► నిత్యం పార్టీలు మారే మీకు సీఎం జగన్ను విమర్శించే అర్హత లేదు 1:15 PM, సెప్టెంబర్ 23, 2023 సానుభూతి రావట్లేదు? కేసు వీడట్లేదు? కిం కర్తవ్యం.? ► రాజమండ్రి : టిడిపి సీనియర్లతో భువనేశ్వరి, బ్రాహ్మణి ► లోకేష్ ఎందుకు రాజమండ్రిలో లేడని అడుగుతున్న టిడిపి నేతలు ► అరెస్ట్ అని ఎల్లో మీడియా ప్రచారానికి భయపడనవసరం లేదంటున్ననేతలు ► రాజమండ్రిలో లోకేష్ ఉంటేనే సానుభూతి వస్తుందన్న నేతలు ► భువనేశ్వరి, బ్రాహ్మణిలను కలిసిన పరిటాల సునీత, ధూళిపాళ్ల ► భువనేశ్వరి, బ్రాహ్మణిలను కలిసిన మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ ► తాజా పరిస్ధితులపై టిడిపి నేతలతో చర్చించిన బాలకృష్ణ 12:15 PM, సెప్టెంబర్ 23, 2023 CID కస్టడీని సవాలు చేస్తూ వేసిన పిటిషన్ తిరస్కృతి ► చంద్రబాబు లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ తిరస్కరణ ► CID రెండు రోజుల కస్టడీపై హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు ► చంద్రబాబు లాయర్ల విజ్ఞప్తి తిరస్కరించిన న్యాయస్థానం 12:15 PM, సెప్టెంబర్ 23, 2023 బాబుకు మామ, అల్లుళ్ల వెన్నుపోటు ► టీడీపీని కబ్జా చేసేందుకు లోకేష్, బాలకృష్ణ ప్లాన్ : మంత్రి కారుమూరి ► ప్రజాధనాన్ని లూటీ చేసిన బాబును అరెస్ట్ చేస్తే తప్పేంటి? ► బాబు నిప్పు అయితే.. పీఎస్ శ్రీనివాస్ ను అమెరికాలో ఎందుకు దాచాడు? ► బాబు అవినీతి చేయలేదంటే టీడీపీ కార్యకర్తలు కూడా నమ్మటం లేదు ► స్కిల్ స్కాంపై అసెంబ్లీలో చర్చించరు, బయట మాత్రం సింపతీ గేమ్ ఆడుతారా? ► బాబు పాలన అంతా స్కాములే, ప్రజలకు మేలు చేసే స్కీముల్లేవ్ ► అందుకే, యనమల నోరు తెరవట్లేదు? ► నాడు అవినీతి - నేడు నీతి అయిందా పవన్ కల్యాణ్? చంద్రబాబు అంత నీతిమంతుడే అయితే టీడీపీ నేతలు అసెంబ్లీలో చర్చకు రాకుండా ఎందుకు పారిపోయారు? @ncbn 14 ఏళ్ల పాలనలో స్కీములన్నీ స్కామ్లే. నాలుగేళ్ల సీఎం వైయస్ జగన్ పాలనంతా స్కీములే. #CorruptBabuNaidu#SkillDevelopmentScam#KhaidiNo7691#SkilledCriminalCBNInJail pic.twitter.com/7TgAd36Uf0 — Karumuri Venkata Nageswara Rao (@karumurionline) September 23, 2023 12:15 PM, సెప్టెంబర్ 23, 2023 మూడు గంటలుగా చంద్రబాబును విచారిస్తున్న CID ► రాజమండ్రి : సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్లో చంద్రబాబుకు ప్రశ్నలు ► సిఐడి డీఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలో అధికారుల ప్రశ్నలు ► కోర్టు ఆదేశాల ప్రకారం విచారణ అంశాలు బయటికి రాకుండా జాగ్రత్తలు ► మధ్యాహ్నం గంటసేపు భోజన విరామం ► చంద్రబాబు ఆరోగ్య అవసరాలకు జైలు ఆవరణలో ప్రత్యేక వైద్యుల బృందం ► చంద్రబాబు బ్లడ్ గ్రూప్ O పాజిటివ్, 2 యూనిట్ల బ్లడ్ను కూడా జైలులో భద్రపరిచిన సిబ్బంది11:50 AM, సెప్టెంబర్ 23, 2023 ఈ పట్టుదల ఎటు పోయింది చిన్న బాబు: YSRCP చురకలు ► చంద్రబాబు జైల్లో ఉంటే ఢిల్లీ సెవెన్ స్టార్ హోటళ్లో లోకేష్ బాబు ► జైల్లో తండ్రి ఉంటే రాజమండ్రి వైపు కన్నెత్తి చూడని లోకేష్ ► అరెస్ట్ అయినప్పుడు నానా హంగామా చేసిన లోకేష్ ► ఢిల్లీలో ఉన్నది నలుగురు ఎంపీలు, ఆ మాత్రం దానికి అక్కడేం పని.? ► రాజమండ్రికి వస్తే అరెస్ట్ చేస్తారన్న ఎల్లోమీడియా వార్తలకు భయపడుతున్నారా? ► మా నాన్నను దోమలు కుడుతున్నాయంటూ ఏసీ సూట్లో కూర్చుని ట్వీట్లు పెడతారా? ► మా నాన్నను చూడకుండా అడ్డుకుంటారా అంటూ ఎగిరిపడ్డ లోకేష్ ► రోడ్డుపైనే కూర్చుని గంటలు, గంటలు ఆందోళనకు దిగిన లోకేష్ ► ఇటు పవన్ కళ్యాణ్ సేమ్ టు సేమ్, రోడ్పైనే పడుకుని ఆందోళన ► రెండు రోజులు గడిచాయో.. లేదో అటు లోకేష్, ఇటు పవన్ జంప్ ► పొత్తు ప్రకటన తర్వాత దరిదాపుల్లో కనిపించని లోకేష్, పవన్ ► బాలయ్య ఒక్కడే అతి కష్టమ్మీద పార్టీ శ్రేణులతో సమన్వయానికి ప్రయత్నం 11:40 AM, సెప్టెంబర్ 23, 2023 బాబు ముందున్న బిగ్ క్వొశ్చన్స్ 1. సీమెన్స్ కు తెలియకుండానే వారి పేరుతో దోపిడీకి స్కెచ్ గీశారా ? 2. కేబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్మెంట్ స్కాం కి ప్లాన్ చేశారా ? 3. స్కిల్ డెవలప్ మెంట్ లో సీమెన్స్ 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% అని జీవో ఇచ్చారా? లేదా ? 4. సీమెన్స్ కంపెనీతో కాకుండా.. సుమన్ బోస్ అనే వ్యక్తితో MOU చేసుకున్నారా? లేదా ? 5. 330 కోట్ల ప్రాజెక్టును.. దోచుకోవడం కోసమే ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3356 కోట్లని చూపించారా? లేదా ? 6. అధికారులు అభ్యంతరం చెప్పినా డబ్బు రిలీజ్ చేయాలని ఆదేశించారా? లేదా ? 7. సీమెన్స్ తో ఒప్పందం అని చెప్పి.. డైరెక్ట్ గా డిజైన్ టెక్ కు 371 కోట్లు రిలీజ్ చేశారా? లేదా? 8. నిధుల విడుదల నుంచి షెల్ కంపెనీలకు డైవర్ట్ చేసేంత వరకు మీ కనుసన్నల్లోనే జరిగిందా? లేదా ? 9. డిజైన్ టెక్ నుంచి రూ. 240 కోట్ల ప్రజాధనాన్ని షెల్ కంపెనీలకు మళ్ళించారా? లేదా ? 10. గంటా సుబ్బారావుకు, లక్ష్మీనారాయణకు చెందిన కంపెనీలకు ఆ నిధులు వెళ్ళాయా? లేదా ? 11. సుమన్ బోస్, ఖన్వేల్కర్ ను జీఎస్టీ, ఈడీ పట్టుకోవడంతో నోట్ ఫైల్స్ మాయం చేయించారా? లేదా ? 12. సంబంధం లేదు లేదు అంటున్న మీరే.. 13 చోట్ల సంతకాలు పెట్టారా? లేదా ? 11:35 AM, సెప్టెంబర్ 23, 2023 స్కిల్ స్కాంపై ఎవరి వాదన ఏంటీ? ► చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేశారన్న అచ్చెన్న ► మరి కేంద్ర దర్యాప్తు సంస్థలు తేల్చిన విషయాలపై ఏమంటారని ప్రశ్నించిన కన్నబాబు స్కిల్ పేరిట దోపిడీ జరగలేదని టీడీపీ నేతలు బుకాయిస్తున్నారు... అదే నిజమైతే ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జీఎస్టీ సహా ఈడీ ఎందుకని నోటీసులిచ్చాయి... అలానే చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇంటిపై ఐటీ శాఖ ఎందుకని దాడి చేసిందో టీడీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలి. - ఎమ్మెల్యే… pic.twitter.com/u2xy4Jnq7R — YSR Congress Party (@YSRCParty) September 22, 2023 11:30 AM, సెప్టెంబర్ 23, 2023 రాబట్టాల్సిన సమాధానాలు బోలెడు ► చంద్రబాబు ఎక్కడెక్కడ బ్యాంకు ఖాతాలున్నాయి? ► చంద్రబాబు పేరిట ఏ ఏ కంపెనీలున్నాయి? ► చంద్రబాబు తరపున ఉన్న బినామీలు ఎవరెవరు? ► చంద్రబాబు దగ్గర పని చేసిన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ పాత్ర ఏంటీ? ► ఆర్థిక వ్యవహరాల ప్రతినిధి పెండ్యాల శ్రీనివాస్ చౌదరీయేనా? ► పెండ్యాల శ్రీనివాస్కు అమెరికా వెళ్లేందుకు విమాన టికెట్లు ఎవరు తీసుకున్నారు? ► సీమెన్స్ మాజీ ఎండి సుమన్ బోస్తో ఏ ఏ లావాదేవీలు నిర్వహించారు? ► డిజైన్టెక్ కంపెనీ అధిపతి ఖన్వేల్కర్తో ఉన్న అనుబంధమేంటీ? 11:15 AM, సెప్టెంబర్ 23, 2023 చంద్రబాబును విచారిస్తోన్న 15 మంది అధికారుల బృందం ► ఇప్పటివరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు సేకరించిన ఆధారాలకు అనుగుణంగా ప్రశ్నలు ► చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఎందుకు అమెరికా పారిపోయాడు? ► చంద్రబాబు పీఏ శ్రీనివాస్కు ఇన్కమ్టాక్స్ శాఖ ఇచ్చిన నోటీసులపై ఏమంటారు? ► షెల్ కంపెనీల ఏర్పాటు వెనక ఎవరెవరు ఉన్నారు? ► స్కిల్ డెవలప్మెంట్ నిధుల విడుదలకు ఎందుకు తొందరపడ్డారు? ► అధికారులపై ఎందుకు ఒత్తిడి తెచ్చారు? ► కీలకమైన ఫైళ్లు ఎలా మాయమయ్యాయి? 11:00 AM, సెప్టెంబర్ 23, 2023 న్యాయవ్యవస్థపై దాడి చేస్తారా? ► ACB కోర్టు న్యాయమూర్తిపై టిడిపి మూక చేస్తోన్న విషప్రచారంపై రాష్ట్రపతి సీరియస్ ► సోషల్మీడియాలో న్యాయవ్యవస్థను నిందించడంపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచన ►ఈమెయిల్ ద్వారా అందిన ఫిర్యాదు మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఆదేశాలు ► రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డికి లేఖ రాసిన రాష్ట్రపతి భవన్ అధికారులు 10:55 AM, సెప్టెంబర్ 23, 2023 ఆర్థిక మూలాలే ప్రధాన లక్ష్యం ► కుంభకోణం మూలాల్లోకి వెళ్లేందుకు CID రెడీ ► అరెస్టు సందర్భంగా తెలియదు, గుర్తు లేదు అన్న జవాబులతో సరిపెట్టిన చంద్రబాబు ► చంద్రబాబు వైఖరిని గమనించి రెండు ఆప్షన్లు(A&B)తో సిద్ధమైన CID ► ప్రభుత్వ ఖజానా నుంచి విడుదలైన నిధులు ఎక్కడికెళ్లాయి? ► ఏ విధంగా షెల్ కంపెనీలకు రూట్ అయ్యాయి? ► దీనికి సంబంధించిన ఆధారాలన్నింటిని సిద్ధం చేసుకున్న అధికారులు ► జవాబు దాటవేసేందుకు ఉండలేని విధంగా శాస్త్రీయ పద్ధతిలో ప్రశ్నలు ► ఒక వేళ సమాధానం చెప్పకుంటే ఆధారాలు చూపించనున్న అధికారులు 10:45 AM, సెప్టెంబర్ 23, 2023 చంద్రబాబుకు పీడకలలా మిగిలిన ఎన్టీఆర్ ► 58ఏళ్ల కింద సరిగా ఇదే రోజు ఎన్టీఆర్ నటించిన C.I.D. సినిమా విడుదల ► C.I.D. సినిమాలో ఇన్వెస్టిగేషన్ అధికారిగా నటించిన ఎన్టీఆర్ ► యాధృచ్చికమే అయినా సరిగ్గా ఇదే రోజు లింకుపై సోషల్ మీడియా పోస్టులు ► సెప్టెంబర్ 23, 1965న విడుదలయిన ఎన్టీఆర్ C.I.D. సినిమా ► సరిగ్గా 58ఏళ్ల తర్వాత ఇదే రోజు చంద్రబాబును విచారిస్తోన్న C.I.D. బృందం ► వెన్నుపోటు పాపం ఊరికే పోలేదంటున్న అన్న అభిమానులు 10:30 AM, సెప్టెంబర్ 23, 2023 ష్.. గప్ చుప్..! ► హఠాత్తుగా రఘురామ నోట ష్.. గప్..చుప్..! ► అదేంటని ప్రశ్నించిన ఎల్లో మీడియా విలేకరులు ► రఘురామ: జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత అర్థం చేసుకోవాలి ► రఘురామ:ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ► ఎందుకని ఇలా మారిపోయారని ప్రశ్నించిన విలేకరులు ► రఘురామ:ఎందుకంటే.. మన లిమిట్స్ మనకున్నాయి.. మనకు అధికారం లేదు కాబట్టి.! ► రఘురామ: అందుకే మన లిమిట్స్లో మనం ఉండాలి కాబట్టి.! ష్..గప్ చుప్.! 10:20 AM, సెప్టెంబర్ 23, 2023 టిడిపికి ఎన్టీఆర్ గుర్తుకొచ్చారు..! ► జైల్లో చంద్రబాబు, ఢిల్లీలో లోకేష్ బాబు ► హఠాత్తుగా తెలుగుదేశం పార్టీకి గుర్తుకొచ్చిన ఎన్టీఆర్ ► "ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే సర్వానికీ అధినేతలు" ► శతజయంతి అంటూ ఎన్టీఆర్ను తెరపైకి తెచ్చిన టిడిపి ► నందమూరి నుంచి నారాకు మళ్లిన పార్టీని వెనక్కి తేగలరా? "ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే సర్వానికీ అధినేతలు." అన్నారు అన్న ఎన్టీఆర్. ఆయన దృష్టిలో పాలకులంటే ప్రజలకు సేవకులు మాత్రమే. అందుకే ప్రజలకు మేలు చేసే ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలను ఎవరికీ భయపడకుండా తీసుకోగలిగారు ఎన్టీఆర్ శకపురుషుడు "ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరం" సందర్భంగా ఆ… pic.twitter.com/EI9mBVxO4O — Telugu Desam Party (@JaiTDP) September 23, 2023 10:10 AM, సెప్టెంబర్ 23, 2023 దోమల పేరుతో అసత్య ప్రచారమా? ► సానుభూతి కోసం తెలుగుదేశం కొత్త వ్యూహాలు ► చంద్రబాబును జైల్లో దోమలు కుడుతున్నాయని ప్రచారం ► నవ్వుల పాలవుతారు, తప్పుడు ప్రచారం మానాలని YSRCP హితవు రాజమండ్రి సెంట్రల్ జైలులో దోమల బెడద లేదని, లార్వా ఆనవాళ్లే లేవని జైళ్ల డిఐజినే చెప్పారే! బహుశా దోమలపై దండయాత్ర పేరుతో నిధులు మింగేశారన్న కోపంతో దోమలు బయట నుంచి వచ్చి కుట్టేసి పోతున్నాయేమో! టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బెయిల్ పిటిషను రద్దయితే లోపలకు వెళ్లి ఇద్దరూ కలిసి జైలులో దోమలపై… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 23, 2023 10:00 AM, సెప్టెంబర్ 23, 2023 చంద్రబాబును విచారిస్తున్న సీఐడీ బృందం.. ►చంద్రబాబు బ్యారక్ ప్రాంతంలోనే ప్రత్యేక గదిలో విచారణ ►విచారణలో ఇద్దరు మధ్యవర్తులు, ఒక ఫొటోగ్రాఫర్. ►ధనుంజయ నేతృత్వంలో ఒక్కో టీమ్లో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు. ►చంద్రబాబు సమాధానాలను రికార్డు చేసేందుకు ల్యాప్ట్యాప్, ప్రింటర్లు. ►చంద్రబాబు విచారణ వీడియో చిత్రీకరణ. ►చంద్రబాబు తరఫున ఒక న్యాయవాదికే అనుమతి. ►విచారణకు ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు. 9:35 AM, సెప్టెంబర్ 23, 2023 సీఐడీ విచారణ ప్రారంభం ►రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న సీఐడీ అధికారులు బృందం. ►చంద్రబాబుతో సీఐడీ బృందం విచారణ ప్రారంభం ►స్కిల్ స్కాంలో చంద్రబాబును విచారిస్తున్న 9 మంది సీఐడీ అధికారుల బృందం. ►సాయంత్రం 5 గంటల వరకు చంద్రబాబును విచారించనున్న సీఐడీ ►కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సీఐడీ విచారణ. ►విచారణలో ప్రతీ గంటకు 5 నిమిషాల పాటు బ్రేక్. ►బ్రేక్ టైమ్లో తన న్యాయవాదులతో మాట్లాడేందుకు చంద్రబాబుకు అనుమతి 9:00 AM, సెప్టెంబర్ 23, 2023 రాజమండ్రి చేరుకున్న సీఐడీ అధికారులు ►రాజమండ్రి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్కు చేరుకున్న సీఐడీ అధికారులు ►మరికాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు రానున్న సీఐడీ అధికారుల బృందం ►కాసేపట్లో సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో విచారణ? ►రాజమండ్రి జైలు చుట్టుపక్కల భద్రత కట్టుదిట్టం. ►ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు. ►ఏపీఎస్పీ, ప్రత్యేక బలగాలు, లోకల్ పోలీసులతో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు. 7:30 AM, సెప్టెంబర్ 23, 2023 రాజమండ్రి జైలుకు బయలుదేరిన సీఐడీ అధికారులు ►తాడేపల్లి సిట్ కార్యాలయం నుండి బయల్దేరిన సీఐడీ అధికారులు. ►ల్యాప్ టాప్, ప్రింటర్, సహా పలు డాక్యుమెంట్స్ వెంట తీసుకెళ్లిన అధికారులు. ►కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకోనున్న అధికారులు ►దాదాపు 30 ప్రశ్నలతో సిద్ధమవుతున్న అధికారులు. ►ఉదయం 9:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ ►మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు వరకు లంచ్ బ్రేక్ ►రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పెంచిన భారీ భద్రత. ►రెండంచుల భద్రత ఏర్పాటు చేసిన అధికారులు ►చంద్రబాబు విచారణ నేపథ్యంలో 8 గంటలకే బ్రేక్ ఫాస్ట్, మందులు పంపిన కుటుంబ సభ్యులు? ►విచారణకి ముందు చంద్రబాబుకి వైద్య పరీక్షలు 7:00 AM, సెప్టెంబర్ 23, 2023 నేడు చంద్రబాబును విచారించనున్న ఏపీ సీఐడీ ► చంద్రబాబును విచారించేందుకు సీఐడీ సిద్ధం. ► నేడు, రేపు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే కాన్ఫరెన్స్ హాల్లో విచారించనున్న సీఐడీ ► కేసు విచారణాధికారి CID DSP ధనుంజయుడు నేతృత్వంలో విచారణ ► విచారణలో పాల్గొననున్న తొమ్మిది మంది సీఐడీ అధికారులు ► ఏసీబీ కోర్టు ఆదేశాల ప్రకారమే చంద్రబాబు విచారణ చేపడతామన్న సీఐడీ ► ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సీఐడీ విచారణ ► ప్రతి గంటకు 5 నిమిషాల బ్రేక్.. మొత్తం ప్రక్రియ వీడియో చిత్రీకరణ ► చంద్రబాబు తరపున ఒక లాయర్కు అనుమతి ► విచారణ సమయంలో ఉండకూడదని బాబు లాయర్కు కోర్టు ఆదేశం 6:00 AM, సెప్టెంబర్ 23, 2023 సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్లో విచారణ ► చంద్రబాబు సీఐడీ విచారణకు సెంట్రల్ జైలులో కాన్ఫరెన్స్ హాల్ సిద్ధం ► దాదాపు పాతిక మంది కూర్చునే హాల్ రెడీ ► కోర్టు నుంచి సూపరిండెంట్ కార్యాలయానికి అందిన సమాచారం ► డిప్యూటీ సూపరిండెంట్కు పర్యవేక్షణ బాధ్యతలు ► సీఐడీ సమాచారం మేరకు.. ఎస్పీ నేతృత్వంలో భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ 6:00 AM, సెప్టెంబర్ 23, 2023 మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేష్ ►హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో మారిన పరిణామాలు. ►సుప్రీం కోర్టులో న్యాయపోరాటానికి సిద్ధమైన టీడీపీ. ►ఎప్పటికప్పుడు న్యాయవాదులతో లోకేష్ సంప్రదింపులు? ►సుప్రీం కోర్టులో వేయాల్సిన పిటిషన్ తదితర అంశాలపై న్యాయవాదులతో లోకేష్ చర్యలు. 6:00 AM, సెప్టెంబర్ 23, 2023 భూమా అఖిలప్రియ ఆమరణ నిరాహార దీక్ష భగ్నం ►చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అఖిలప్రియ రెండు రోజుల ఆమరణ దీక్ష. ►అఖిలప్రియ, ఆమె సోదరుడు విఖ్యాత్ రెడ్డిని వేరే ప్రాంతానికి తరలింపు. ►షుగర్ లెవెల్స్ బాగా తగ్గడంతో అఖిలప్రియకు సెలైన్ బాటిల్స్. ►అఖిలప్రియను ఆళ్లగడ్డకు తరలించిన పోలీసులు. 6:00 AM, సెప్టెంబర్ 23, 2023 జాతీయఅధ్యక్షుడు జైల్లో, జాతీయ కార్యదర్శి ఢిల్లీలో, ఇక్కడ మనమేం చేద్దాం? ► టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో అచ్చెన్నాయుడు సమావేశం ► చంద్రబాబు జైల్లో ఉన్నాడు, క్వాష్ పిటిషన్ కొట్టేశారు, కస్టడీకి ఇచ్చేశారు ► ఇప్పటి పరిస్థితుల్లో బెయిల్ డౌట్, జైల్లో మరింత కాలం బాబు ఉండే అవకాశం ► పార్టీని ఎవరు నడిపించాలి? అసలేం చేయాలి? ► ప్రజలకు ఏమని చెప్పుకోవాలి? ఏం చెబితే వారు నమ్ముతారు? ► ఆధారాలపై ఇంత స్పష్టత వచ్చాక.. మనం చెప్పే మాటలు నమ్ముతారా? ► అవినీతిపై ఇంత పక్కాగా ఆధారాలుంటే ఏమని సర్దిచెప్పుకుందాం ► రేపు లోకేష్ను అరెస్ట్ చేయడానికి అన్ని ఆధారాలున్నాయి ► లోకేష్ కూడా అరెస్ట్ అయితే ఏం చేద్దామని అడిగిన అచ్చెన్న -
మార్గదర్శి కేసు: దర్యాప్తునకు చెరుకూరి శైలజ సహకరించడంలేదు: ఏపీ సీఐడీ
-
5 రోజులు కస్టడీకి అప్పగించండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ సోమవారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ స్కామ్ గురించి, మిగిలిన నిందితుల పాత్ర గురించి చంద్రబాబుకు చాలా విషయాలు తెలుసని, అందువల్ల ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందంటూ సీఐడీ డీఎస్పీ ఎం.ధనుంజయుడు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. కస్టడీకి ఇచ్చే సమయంలో ఎలాంటి షరతులు విధించినా తమకు అభ్యంతరం లేదన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ నిధుల మళ్లింపు, లబ్ధిదారులు ఎవరన్న విషయాలు చంద్రబాబుకు బాగా తెలుసన్నారు. నిధుల దుర్వినియోగంలో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీనే అంతిమ లబ్ధిదారులని తెలిపారు. స్కామ్ జరిగిన తీరును ఈ పిటిషన్లో వివరించారు. ‘ఈ స్కామ్ వెనుక కొందరి ఆర్థిక పరమైన దుష్ప్రవర్తన, లోతైన కుట్ర దాగి ఉంది. వీటి వెనకు అసలు కారణాలన్నింటినీ చంద్రబాబు నుంచి తెలుసుకోవాల్సిన అవసరం దర్యాప్తు సంస్థకుంది. అధికార బాధ్యతలను పక్కన పెట్టి వ్యక్తుల లబ్ధి కోసం భారీ, లోతైన కుట్రకు పాల్పడారు. మాకు కావాల్సిన సమాచారాన్ని చంద్రబాబు నుంచి రాబట్టినప్పుడే ఈ ఆర్థిక మోసం పూర్తిగా బయటపడుతుంది. ఈ స్కామ్కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను మాయం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన లబ్ధిదారులు చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, గంటా సుబ్బారావు, డాక్టర్ లక్ష్మీనారాయణ. మాయం చేసిన ఫైళ్లు ఎక్కడ ఉన్నాయన్న విషయాలను చంద్రబాబును విచారించి రాబట్టాల్సి ఉంది. షెల్ కంపెనీల ద్వారా, పలువురు వ్యక్తుల సాయంతో మొత్తం డబ్బు తిరిగి చంద్రబాబుకే చేరింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను చంద్రబాబు నుంచి రాబట్టాల్సి ఉంది. చంద్రబాబును అరెస్ట్ తరువాత విచారించాం. అయితే ఆయన విచారణకు సహకరించలేదు. అందువల్ల 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదిని ఆదేశించింది. కౌంటర్ దాఖలు తరువాత ఈ వ్యాజ్యంపై విచారణ జరుపుతామని తెలిపింది. -
చంద్రబాబు ‘స్కిల్’ స్కాం.. విచారణలో బయటపడ్డ వాస్తవాలు
నిరుద్యోగులైన యువతీయువకులకు ఆశలు చూపించి దోపిడీ పర్వానికి చంద్రబాబు తెరలేపారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎలా వెలుగులోకి వచ్చింది.? ఇందులో బాబు పాత్ర ఏంటీ.? తీగలాగితే.. డొంక ఎలా కదిలింది.. కేసు విచారణలో బయటపడ్డ వాస్తవాలను పరిశీలిస్తే.. ♦జీవో నెంబర్-47లోని పారాగ్రాఫ్ నెంబర్-35లో అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏర్పాటుపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా క్యాబినెట్ అనుమతి లేకుండా ఎలాంటి కార్పోరేషన్ ఏర్పాటు చేయకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ♦జీవో నెంబర్-2452లోని పారాగ్రాఫ్ నెంబర్-153లో పైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ చాలా స్పష్టంగా నిధుల విడుదలకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇందులో అప్పటి చీఫ్ సెక్రెటరీ ఐవైఆర్ కృష్ణారావు పారాగ్రాఫ్ నెంబర్-27లో నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు ♦తెలిపారు. ♦ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నిధులు విడుదల చేయాల్సినందిగా చీఫ్ సెక్రెటరీ ఐవైఆర్ కృష్ణారావు చెప్పినట్లు అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ స్పష్టంగా నోట్ఫైల్ రాశారు. ఈ ప్రాజెక్టులో నిధుల విడుదలపై మరోసారి పరిశీలించాల్సిందిగా జీవోనెంబర్-2452లో పారాగ్రాఫ్ నెంబర్-160లో అప్పటి ఆర్ధిక శాఖ కార్యదర్శి శ్రీమతి సునీత చాలా స్పష్టంగా అప్పటి ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరికీ నివేదించింది. ♦దీనిపై మరోసారి ఆలోచించిన ఆర్ధికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పారాగ్రాఫ్ నెంబర్-161, 162లో చీఫ్ సెక్రెటరీగా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు వెంటనే నిధులు విడుదల చేయాల్సిందిగా తనతో మాట్లాడినట్లు నోట్ ఫైల్లో రాశారు. సుబ్బారావు తనతో కలిసి నిధులు వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు జీవోలోని 46వ పేజీ ,పారాగ్రాఫ్-31లో ఉన్నట్లు అప్పటి సీఎస్ ఐవైఆర్ చెప్పడం వల్ల దానిన అమలు చేసినట్లు ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి పివిరమేష్ స్పష్టంగా రాశారు. ♦2015లో వివిధ దఫాలుగా రూ.371 కోట్ల రూపాయల బడ్జెట్ ఆర్డర్లు రిలీజ్ అయ్యాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన యంత్రాలపై అప్పటి ఆర్ధికశాఖ సెక్రెటరీ సునీత అభ్యంతరాలు చెప్పినప్పటికీ చంద్రబాబు ఆదేశాలతో నిధులు విడుదల చేశారు. ఈ స్కాంకు సంబంధించి 14.05.2018లో తొలిసారిగా పూనేలోని జీఎస్టీ కార్యాలయానికి ఫిర్యాదు అందింది. ♦దీనికి సంబంధించి జీఎస్టీ అధికారులు ఏపీ అవినీతి నిరోధక శాఖకు ఈ ఫిర్యాదును బదిలీ చేశారు. డిజైన్టెక్ సంస్థ ఫేక్ ఇన్వాయిస్లతో సర్వీస్ టాక్స్ ఎగ్గొట్టిందని ఫిర్యాదు సారాంశం. దీనికి సంబందించి చంద్రబాబుతో సహా అందరికి సమాచారం ఉన్నా ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డిజైన్ టెక్ వ్యవహారం బయటకు రావడంతో చంద్రబాబు అండ్ కో సాక్ష్యాధారాలను మాయం చేసింది. ఏకంగా 30.06.2016న విడుదలైన జీవో నెంబర్-4కు సంబంధించిన ఒరిజినల్ నోట్ ఫైల్.. సుబ్బారావు ఓఎస్డీ ఎన్వీకే ప్రసాద్(ఏ-5) ద్వారా మాయం చేశారు. చదవండి: ఏమో.. తెలియదు.. గుర్తు లేదు.. సీఐడీ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు -
ఆయేషా మీరా కేసులో సాక్షుల విచారణ
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ఆయేషా మీరా హత్య కేసులో పలువురు సాక్షులను సీబీఐ అధికారులు బుధవారం విచారించారు. విజయవాడలోని సీబీఐ కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. 16 ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో నేటికీ నిందితులను పట్టుకోలేకపోవడంతో ఆమె తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. దీంతో సీబీఐ అధికారులు ఈ కేసును అనేక కోణాల్లో విచారించారు. 2019లో ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయించారు. అసలు నిందితుల కోసం విచారణ వేగవంతం చేశారు. విచారణలో భాగంగా ఆయేషా మీరా కేసును వాదించిన న్యాయవాది పిచ్చుక శ్రీనివాసరావు, తాజాగా ఆయేషా మీరా కేసులో పంచనామా నిర్వహించిన కృష్ణప్రసాద్తో పాటు పలువురు సాక్షులను అధికారులు విచారించారు. కేసు విచారణలో తాము ఎప్పుడు పిలిచినా రావాల్సిందిగా అధికారులు సాక్షులకు సూచించారు. -
బాబు స్కిల్డ్ క్రిమినల్..
బాబుది అంతా చీకటి చరిత్ర: అమర్నాథ్ అసలు చంద్రబాబు రాజకీయ జీవితమంతా.. కుట్రలు, కుతంత్రాలు, అవినీతితో నిర్మితమైందని, ఆయనదంతా చీకటి చరిత్ర అని విశాఖలో మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. దేశంలోని ఏ రాజకీయ నాయకుడిపై లేనన్ని అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు చంద్రబాబుపై ఉన్నాయని చెప్పారు. నేరుగా రాజకీయాల్లో ఎదగలేక, వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. తాను నిజాయితీపరుడిని అని రోజూ ప్రవచనాలు వల్లించే చంద్రబాబు రూ.118 కోట్లు ఎలా బొక్కేశాడని ప్రశ్నించారు. చంద్రబాబు తాజా ఆర్థిక నేరాలపై పత్రికలు, టీవీ చానళ్లు అనేక కథనాలు వెల్లడిస్తున్నా.. చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ బాబు ఆర్థిక నేరాలను స్పష్టంగా ఐటీ అధికారులకు వివరించాడని ఆయన తెలిపారు. దుబాయ్ నుంచి కూడా అక్కడి కరెన్సీలో రూ.15 కోట్ల వరకు దండుకున్నారని మంత్రి ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు అధికారులను, మంత్రివర్గాన్ని తప్పుదోవ పట్టించి సుమారు రూ.350 కోట్లు కొట్టేశాడని ఆయన వివరించారు. చంద్రబాబు ఆర్థిక నేరాల విషయంలో ఈడీ జోక్యం చేసుకోవాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. తండ్రీకొడుకులను జైలుకు పంపాలి: రోజా చంద్రబాబు, లోకేశ్పై సీబీఐ విచారణ జరిపించి, జైలుకు పంపాలని మంత్రి ఆర్కే రోజా తిరుమలలో మీడియాతో అన్నారు. గతంలో 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. ఏపీలో చంద్రబాబుకి ఆధార్ కార్డుగానీ, ఓటరు కార్డు గానీ, ఇల్లుగానీ లేకపోయినా హైదరాబాదు నుంచి అప్పుడప్పుడు వచ్చి వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు చేసి వెళ్లిపోతుంటారన్నారు. అలాగే, చంద్రబాబుకు ఐటీ నోటీసులిస్తే ఎందుకు ఎవరూ నోరు మెదపడంలేదని ఆమె ప్రశ్నించారు. కాంట్రాక్టు పనుల్లో కోట్లాది రూపాయల కమీషన్లు దండుకున్నారని రోజా ఆరోపించారు. చంద్రబాబుకు ఐటీ అధికారులు నోటీసులిస్తే ఆయన దత్తపుత్రుడు ఎందుకు ట్వీట్ చేయలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ను సైతం సీబీఐ అధికారులు విచారణ చేయాలని రోజా డిమాండ్ చేశారు. బాబు అత్యంత అవినీతిపరుడు: కొడాలి నాని చంద్రబాబు అత్యంత అవినీతిపరుడు, స్వార్థపరుడు, నమ్మక ద్రోహి అని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఇప్పుడు రికార్డులతో సహా దొరికిన దొంగని చెప్పారు. 2024 ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లయినా ఖర్చుపెడదామని ఆయన చెబుతున్నారన్నారు. చంద్రబాబు హయాంలో ఇప్పటివరకు నిర్వహించిన ఎన్నికల్లో రూ.10 వేల కోట్లు వరకు ఖర్చుచేశారని, ఈ డబ్బంతా ఇలా కమీషన్లు తీసుకోకపోతే ఎక్కడి నుంచి వచ్చిందని కొడాలి నాని ప్రశ్నించారు. ఇన్ని కోట్ల రూపాయల ఖర్చు ఎలా చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. చట్టాలు, రాజ్యాంగాలను అనుసరించి ఏ విధంగా డబ్బులు దోచుకోవాలో ఆయనకు బాగా తెలుసునన్నారు. ఇప్పుడు ఐటీ శాఖాధికారులు ఇచ్చిన నోటీసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీ నాయకుల కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బాబు అవినీతి బాగోతం బయటపడిందని ఇప్పుడు తప్పించుకోలేరని నాని అన్నారు. బాబు, లోకేశ్ పెద్ద అవినీతిపరులు: ధర్మాన ప్రపంచంలోనే చంద్రబాబు, లోకేశ్లు పెద్ద అవినీతిపరులని, దోచుకుని పంచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, రానున్న ఎన్నికల్లో వారికి ఓటు అడిగే అర్హత లేదని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా ఉన్న బాబు ఒక్క పేదవాడికి సెంటు భూమి ఇవ్వలేదని, ఒక్క శాశ్వత పథకం కూడా తీసుకురాలేకపోయారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి గజదొంగలకు అధికారమిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారన్నారు. ఇక అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు శ్రీకాకుళం జిల్లాకు చేసిందేమీ లేదని, చంద్రబాబు ముందు చేతులు కట్టుకుని నిలబడడం తప్ప జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కూడా వీరు తీసుకురాలేకపోయారన్నారు. -
మాదాపూర్ డ్రగ్స్ కేసులో కొత్త కోణాలు.. వెంకట్ లీలలు వెలుగులోకి..
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అరెస్టయిన సినీ ఫైనాన్షియర్ వెంకట్ అక్రమాలపై నార్కోటిక్ ఆరా తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25కుపైగా కేసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఐఆర్ఎస్ అధికారినంటూ వెంకట్ మోసాలు పాల్పడినట్లు తేలింది. నిర్మాతలు సి.కల్యాణ్, రమేష్ల నుంచి ఐఆర్ఎస్ అధికారినంటూ రూ.30 లక్షలకుపైగా వెంకట్ కొట్టేశాడు. ఒక ఐఆర్ఎస్ అధికారిని సైతం పెళ్లి పేరుతో మోసం చేసినట్లు సమాచారం. సినిమాలో అవకాశాల పేరిట అమ్మాయిలకు వల వేసి.. ఇతర రాష్ట్రాల నుంచి రప్పించి వ్యభిచారం చేయించడంతో పాటు, పెళ్లి పేరుతో ఎన్ఆర్ఐ నంటూ విదేశీ యువతలను సైతం వెంకట్ మోసం చేసినట్లు బట్టబయలైంది. ఏపీకి చెందిన ఓ ఎంపీ పేరు చెప్పి వసూలు చేస్తున్న వెంకట్.. సినీ, రాజకీయ నాయకులను పార్టీలకు పిలిచి బురిడీ కొట్టించాడు.వెంకట్ కాంటాక్ట్లో ఉన్న వాళ్లను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. చదవండి: మాదాపూర్ డ్రగ్స్ కేసు: టాలీవుడ్లో ప్రకంపనలు.. ఆ 18 మంది ఎవరు? -
మాదాపూర్ డ్రగ్స్ కేసు: టాలీవుడ్లో ప్రకంపనలు.. ఆ 18 మంది ఎవరు?
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ బ్యూరో విచారణ కొనసాగుతోంది. సినీ ఫైనాన్షియర్ వెంకట్ వాట్సాప్లో కీలక విషయాలు బట్టబయలవుతున్నాయి. బాలాజీ, వెంకట్ కలిసి డ్రగ్స్ పార్టీలు చేసినట్లు గుర్తించారు. 18 మందికి డ్రగ్స్ను అమ్మకాలు చేసినట్లు బాలాజీ, వెంకట్లు అంగీకరించారు. ఆ 18 మంది ఎవరు, అందులో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. గతంలో సినీ నిర్మాత కేసీ చౌదరి అరెస్టు తర్వాత మరోసారి టాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోంది. కేపీ చౌదరి లిస్టులో సినీ ప్రముఖులు, రాజకీయ, ఇతర రంగాల వ్యక్తులకు డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేపీ చౌదరి వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన కొందరు పేర్లు జాబితా అప్పట్లో సిద్దం అవ్వగా, దర్యాప్తుకు సమయంలో పైస్థాయి నుంచి పోలీసులపై ఒత్తిడి వచ్చింది. ఇప్పుడు.. బాలాజీ, వెంకట్ వ్యవహారంలో డ్రగ్స్ వినియోగించిన 18 మంది జాబితాను పోలీసులు సిద్ధం చేశారా ? ప్రశ్నలు తలెత్తుతున్నాయి.మరోసారి నిందితుల్ని కస్టడీకి తీసుకొని విచారణ చేయాలని నార్కోటిక్ బ్యూరో భావిస్తోంది. కేపీ చౌదరికి సినీ ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీకి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. గుడిమల్కాపూర్లో దొరికిన డ్రగ్స్ తీగ లాగితే.. టీఎస్–నాబ్ అధికారులకు గుడిమల్కాపూర్లో దొరికిన డ్రగ్స్ తీగ లాగితే... మాదాపూర్ విఠల్నగర్లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో జరుగుతున్న రేవ్ పార్టీ డొంక కదిలింది. ఈ వ్యవహారంలో ఓ ఫిల్మ్ ఫైనాన్షియర్ సహా ముగ్గురిని పట్టుకున్నారు. కేసుకు సంబంధించి పరారీలో ఉన్న 18 మంది కస్టమర్లు, నలుగురు డ్రగ్ పెడ్లర్స్ కోసం గాలిస్తున్నట్టు టీఎస్–నాబ్(తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో) ఎస్పీ (వెస్ట్) డి.సునీతరెడ్డి గురువారం వెల్లడించారు. నేవీ నుంచి బాలాజీ బయటకొచ్చాక... నెల్లూరుకు చెందిన బి.బాలాజీ ఇండియన్ నేవీలో పనిచేస్తుండగా, కంటికి తీవ్రమైన గాయమైంది. మెడికల్లీ అన్ఫిట్ కావడంతో నేవీ నుంచి బయటకు వచ్చి వ్యాపారిగా మారాడు. తరచూ హైదరాబాద్కు వచ్చి వెళ్లే బాలాజీ తన స్నేహితులతో కలిసి మాదాపూర్ అపార్ట్మెంట్లోని సర్వీస్ ఫ్లాట్లో జరిగే రేవ్ పార్టీలకు హాజరయ్యేవాడు. ఇలా హైదరాబాద్తోపాటు బెంగుళూరులో ఉన్న డ్రగ్ పెడ్లర్స్తో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆపై రేవ్ పార్టీలు ఏర్పాటు చేయడం బాలాజీకి వ్యాపకంగా మారింది. స్నేహితులతో పాటు పరిచయస్తుల కోసం నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని ఫామ్హౌస్లు, గెస్ట్ హౌస్ల్లో వీటిని నిర్వహించేవాడు. ఈ క్రమంలోనే బెంగళూరులో ఉన్న నైజీరియన్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని, వారి నుంచి మాదకద్రవ్యాలు ఖరీదు చేసేవాడు. ఆపై పారీ్టలు నిర్వహిస్తూ, విక్రయాలు ప్రారంభించాడు. బాలాజీ ఖాతాదారుల్లో సినీరంగానికి చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. ఫిల్మ్ ఫైనాన్షియర్ కూడా...: గుంటూరులోని నెహ్రూనగర్కు చెందిన కె.వెంకటరమణారెడ్డి గతంలో జూబ్లీహిల్స్ పరిధిలో ఓ గెస్ట్హౌస్ లీజుకు తీసుకున్నాడు. ఇందులో వ్యభిచారం జరుగుతోందనే సమాచారంతో అప్పట్లో పోలీసులు దాడి చేయగా, నిర్వాహకులు పరారయ్యారు. ఈ కేసులో చిక్కిన వెంకటరమణారెడ్డి ఆపై అమెరికా వెళ్లాడు. అక్కడ నుంచి తిరిగిన వచి్చన తర్వాత తన సన్నిహితులకు సంబంధించిన ప్రొడక్షన్ సంస్థ నిర్వహిస్తూ ఫిల్మ్ ఫైనాన్షియర్గా మారాడు. డమరుకం, కిక్, బిజినెస్మ్యాన్, లవ్లీ, ఆటోనగర్ సూర్య వంటి చిత్రాలకు ఫైనాన్స్ చేశాడు. ఈ క్రమంలోనే రేవ్ పార్టీలకు వెళ్లడం అలవాటైంది. రేవ్ పారీ్టలు నిర్వహించే వారికి ఫైనాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇలా బాలాజీతో కూడా పరిచయం ఏర్పడింది. బెంగళూరుకు చెందిన ముగ్గురు నైజీరియన్లతో పాటు విశాఖపట్నానికి చెందిన మరో వ్యక్తి నుంచి డ్రగ్స్ ఖరీదు చేసిన బాలాజీ వీటిలో కొన్నింటిని వెంకటరమణారెడ్డికి అందించాడు. ఈ మాదకద్రవ్యాలతో బుధవారం రాత్రి మాదాపూర్లోని అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. గుడిమల్కాపూర్లో చిక్కిన బాలాజీ: రేవ్ పార్టీకి హాజరుకావడానికి మరికొన్ని మాదకద్రవ్యాలను తీసుకొని వస్తున్న బాలాజీ కదలికలపై టీఎస్–నాబ్కు సమాచారం అందింది. ఏసీపీ కె.నర్సింగ్రావు, ఇన్స్పెక్టర్ పి.రాజేష్లతో కూడిన బృందం వలపన్ని పట్టుకుంది. బాలాజీ వద్ద నుంచి కొన్ని డ్రగ్స్ స్వాధీనం చేసుకుని ప్రశ్నించగా, సర్వీస్ ఫ్లాట్ విషయం చెప్పా డు. దీంతో గురువారం తెల్లవారుజామున పోలీసులు ఆ ఫ్లాట్ పై దాడి చేశారు. అక్కడ వెంకటరమణారెడ్డితో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ వద్ద సీనియర్ స్టెనోగా పనిచేస్తున్న డి.మురళి పట్టుబడ్డాడు. మద్యంమత్తులో మ్యూజిక్ పెట్టుకుని చిందులు వేస్తున్న వీరు డైనింగ్ టేబుల్పై ప్లేట్లో ఉంచిన కొకైన్ను కరెన్సీ నోటు సాయంతో ముక్కులోకి పీలుస్తున్నారు. వీరి వద్ద టీఎస్–నాబ్ బృందం 2.8 గ్రాముల కొకైన్, ఆరు ఎల్ఎస్డీ బోల్ట్స్, 25ఎక్స్టసీ పిల్స్, రెండు ప్యాకెట్ల గాంజా, రూ.72,500 నగదు, రెండు కార్లు, ఐదుసెల్ఫోన్లు స్వాధీనం చే సుకున్నారు. వీటి విలువ రూ.32.89 లక్షలుగా నిర్థారించారు. స్నాప్చాట్లో కోడ్ నేమ్స్ డ్రగ్ పెడ్లర్గా మారిన బాలాజీ కస్టమర్లలో సినీరంగానికి చెందిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో పాటు కొందరు నటీనటులు ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీళ్లందరితో బాలాజీ సోషల్మీడియా యాప్ స్నాప్చాట్ ద్వారా సంప్రదింపులు జరిపేవాడు. సందేశాలు, కాల్స్ అన్నీ దీని ద్వారానే చేసేవాడు. ఇందులో వారివారి కాంటాక్ట్స్ ర్యాంబో, కిమ్స్, కింగ్, క్యాచీ, సూపర్ వంటి కోడ్ నేమ్స్తో ఉన్నాయి. ఆ కాంటాక్ట్స్లో ఫోన్నంబర్లు సహా ఇతర వివరాలు కనిపించకపోవడంతో వారిని గుర్తించడానికి లోతుగా విశ్లేషిస్తున్నారు. ప్రాథమిక వివరాలను బట్టి 18 మందిని కస్టమర్లుగా గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు నైజీరియన్లతో సహా నలుగురు పెడ్లర్స్ కోసం ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. వెంకట రమణారెడ్డి ఇద్దరు ఢిల్లీ యువతులను సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ తీసుకొచ్చాడు. వీళ్లిద్దరూ సైతం ఆ అపార్ట్మెంట్లోని సర్వీస్ ఫ్లాట్లో పోలీసులకు చిక్కారు. చదవండి: గందరగోళంగా కోరుట్ల దీప్తి కేసు.. -
మధ్యప్రదేశ్ బాలిక మృతి.. కేసులో మరో మలుపు! ఇంతకీ ఏం జరిగింది ?
కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన పెద్దపల్లి జిల్లాలో మధ్యప్రదేశ్ బాలిక కేసు మరో మలుపు తిరిగింది. ఆగస్టు 14వ తేదీ రాత్రి బాలికపై సామూహిక లైంగికదాడి జరిగిందని, దాంతో అమ్మాయి అనారోగ్యం పాలై, మరణించిందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా బాలిక ఒంటిపై గాయాలున్న మాట వాస్తవమే గానీ, లైంగికదాడి జరిగినట్లుగా పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్న విషయం సంచలనం రేపుతోంది. ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే రామగుండం పోలీసులు స్పందించారు. గోదావరిఖని, పెద్దపల్లి ఏసీపీలు, పెద్దపల్లి డీసీపీలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన సీపీ రెమా రాజేశ్వరి కేసును స్వయంగా పర్యవేక్షించారు. అసలు అనారోగ్యంతో ఉన్న బాలికను గుట్టుచప్పుడు కాకుండా ఎందుకు తరలించాల్సి వచ్చింది? వీరికి వాహనం ఎవరు సమకూర్చారు? తనపై కొందరు లైంగికదాడి జరిపారు.. అంటూ బాలిక చెబుతున్న ఆడియోలో వాస్తవమెంత? తదితర విషయాలపై దాదాపు 48 గంటల సుదీర్ఘ సాంకేతిక, శాసీ్త్రయ దర్యాప్తు తర్వాత రామగుండం పోలీసులు నిర్ధారణకు వచ్చారని తెలిసింది. ఇంట్లో వారే కొట్టారా? విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట శివారులోని అక్కాబావల వద్దకు మధ్యప్రదేశ్ నుంచి బాలిక వచ్చింది. ఆమె మరణానికి ముందు ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. ఇవి ఎవ రు చేశారు? అన్నదానిపై స్పష్టత లేదు. బాలికను కుటుంబసభ్యులు లేదా తెలిసినవారే తీవ్రంగా కొట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆరోజు తనను తీవ్రంగా కొట్టడంపై బాలిక మనస్తాపానికి గురైంది. అది తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకోవాలనుకుందేమోనని అనుమానిస్తున్నారు. బాలిక చివరిసారిగా కనిపించిన పరిస్థితులు ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆమె ఆగస్టు 14 మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇంట్లో లేదు. ఆ సమయంలో ఏం చేసింది? అన్నదాని పై పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా అణువణువూ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో బాలిక పురుగుల మందు షాపుల ముందు, రాత్రి 8 గంటల ప్రాంతంలో సమీపంలోని ఓ చెరువు వద్ద కూడా కనిపించిందని సమాచారం. అర్ధరాత్రి చెరువు వద్ద ఏం చేస్తున్నావని కొందరు మందలించడంతో అక్కడి నుంచి బస్టాండ్ వైపు వెళ్లినట్లు తెలిసింది. ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది కాబట్టే.. ఈ రెండు ప్రాంతాల్లో కనిపించిందని పోలీసులు భావిస్తున్నారు. ఇంటి నుంచి బస్టాండ్ వద్దకు బాలిక సంచరించిన ప్రాంతాల్లో మొత్తం 15 మంది ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. రాత్రి 11 తర్వాత ఇంటికి చేరిన బాలిక.. అస్వస్థతకు గురైంది. వెంటనే బాలిక బంధువులు కారు మాట్లాడుకొని, ఆమెను హుటాహుటిన మధ్యప్రదేశ్లోని బాల్ఘాట్ జిల్లా కజ్రీ గ్రామానికి తరలించారు. మార్గమధ్యలో వాంతులు చేసుకుంది. విషయం తెలుసుకున్న రామగుండం పోలీసులు అక్కడి ఎస్పీని సంప్రదించారు. తొలుత బాలిక మరణించిన విషయాన్ని ధ్రువీకరించుకున్నాక అంత్యక్రియలు జరపకుండా ఆపగలిగారు. అంత్యక్రియలు ఆపేది లేదంటూ ఆమె బంధువులు వాదనకు దిగారు. ఎంతో శ్రమిస్తే గానీ.. వారు దారికి రాలేదు. ఎట్టకేలకు బాలిక మృతదేహానికి అక్కడ స్థానిక ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, తిరిగి సెకండ్ ఒపీనియన్ కోసం గాంధీ ఆస్పత్రికి మరోసారి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గాయపరిచింది ఎవరు? బాలిక ఒంటిపై గాయాలున్నాయి తప్పితే, లైంగికదాడి జరిగినట్లుగా ఎలాంటి ఆనవాళ్లు లేవని తెలిసింది. మరి ఆమెను మరణించేంత స్థాయిలో గాయపరిచింది ఎవరు? అసలు ఆగస్టు 14 మధ్యాహ్నం ఏం జరిగింది? బాలిక ఎవరితో ఘర్షణ పడింది? ఆమైపై ఎవరు దాడి చేసి ఉంటారు? అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సామూహిక లైంగికదాడి జరిగిందని ప్రచారం కావడం, అందులోనూ బాధితురాలు మైనర్ కావడంతో విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. అన్ని బృందాల పోలీసులు అత్యంత గోప్యత పాటిస్తున్నారు. ఇంతవరకూ దర్యాప్తు పురోగతిలో ఏ విషయాన్ని మీడియాతో పంచుకోలేదు. ఈ క్రమంలోనే అమ్మాయి మాట్లాడిందని చెబుతున్న ఆడియో విడుదల చేసిన వారిని అదుపులోకి తీసుకొని, ప్రశ్నించినట్లు తెలిసింది. వారు చెప్పే సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయని సమాచారం. గాంధీ ఆస్పత్రి నుంచి నివేదిక వస్తేగానీ.. పోలీసులు ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేసేలా లేరు. ఆ నివేదికలో ఏం ఉంటుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. -
ఈఎస్ఐ కుంభకోణంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్తో పాటు ఉన్నతాధికారులను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈఎస్ఐలో వందల కోట్ల స్కాం జరిగినట్లు ఈడీ గుర్తించింది. రూ.వందల కోట్ల నిధుల దారి మళ్లింపుపై ఈడీ ఆరా తీస్తోంది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. కాగా, నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ కిట్లు, ఫార్మా కంపెనీలకు మందుల సరఫరా కాంట్రాక్టుల అప్పగింతలో జరిగిన అవకతవకల్లో రూ.కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందంటూ గతంలో ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ విచారణ జరిపిన సంగతి తెలిసిందే. చదవండి: కేసీఆర్ మెదక్ పర్యటన వాయిదా.. కారణం ఇదే.. -
వేటాడి.. వెంటాడి..
పట్నంబజారు(గుంటూరుఈస్ట్): పన్నెండేళ్ల బాలికకు తీరని అన్యాయం.. కొంతమంది మోసగాళ్ల చేతికి చిక్కి వ్యభిచార కూపంలో మగ్గిపోయింది.. ఆఖరుకు ఎలాగో తప్పించుకుని ఒక మహిళా అధికారి వద్దకు చేరుకుంది. బాలిక పట్ల మృగాళ్లు వ్యవహరించిన తీరు.. పలువురు మహిళలు చేయించిన అఘాయిత్యాలను చూసిన ఆ అధికారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎలాగైనా సరే నిందితులకు శిక్షలు పడేదాక విశ్రమించకూడదని నిర్ణయం తీసుకున్నారు. కేసు విచారణలో చూపిన ప్రతిభకు గాను గుంటూరు జిల్లా అడ్మిన్ అడిషనల్ ఎస్పీ కొర్లకుంట సుప్రజకు కేంద్ర ప్రభుత్వం ‘సెంట్రల్ హోం మినిస్టర్ బెస్ట్ ఇన్వెస్టిగేషన్’ అవార్డును ప్రకటించింది. గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీస్స్టేషన్ పరిధిలో గతేడాది 12 ఏళ్ల బాలికను అపహరించి, వ్యభిచార కూపంలోకి దించిన కేసు విచారణ బాధ్యతలను అప్పటి వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీగా ఉన్న ప్రస్తుత ఏఎస్పీ కె.సుప్రజకు అప్పగించారు. అన్నీ తానై ఏపీ, తెలంగాణ, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్వయంగా విచారణ జరిపారు. తన నాలుగు నెలల పసిబిడ్డను తీసుకుని.. ఆఖరుకు ఆమె ప్రయాణిస్తున్న వాహనంలోనే ఆ చిన్నారికి ఊయల కట్టి వెళ్లిన పరిస్థితులున్నాయి. కేసులో వ్యభిచారం చేయించిన నిర్వాహకులు, వ్యభిచారానికి పాల్పడిన 80 మంది నిందితులను అరెస్ట్ చేశారు. డీఎస్పీ నుంచి ఏఎస్పీగా పదోన్నతి పొందాక సైతం ఈ కేసును పూర్తిస్థాయిలో సుప్రజతోనే విచారణ చేయించాలని కోర్టు ఆదేశించటంతో పాటు, కేసులో భారీ పురోగతి సాధించిన ఆమెను న్యాయస్థానం అభినందించింది. ఈ కేసులో సుమారు 500 పేజీల చార్జిషీట్ను కోర్టుకు సమర్పించారు. మరో బాలికకు ఇలాంటి పరిస్థితి రాకూడదన్న పట్టుదలతో ఉన్నతాధికారుల సహకారంతో విచారణ చేసినట్టు ఏఎస్పీ సుప్రజ చెప్పారు. -
10 మంది తెలుగు పోలీసులకు కేంద్ర హోంశాఖ మెడల్స్
న్యూఢిల్లీ: 2023 సంవత్సారానికి గానూ దేశవ్యాప్తంగా 140 మంది పోలీసు అధికారులు కేంద్ర హోంశాఖ అందించే ఇన్వెస్టిగేషన్లో ఎక్సలెన్స్ మెడల్స్కు ఎంపికయ్యారు. ఈ మేరకు అవార్డు పొందిన వారి జాబితాను కేంద్ర హోంశాఖ శనివారం ప్రకటించింది. ఇక ఈ ఏడాది అవార్డులు అందుకున్న వారిలో సీబీఐ నుంచి 15 మంది, ఎన్ఐ నుంచి 12 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది, కేరళ, రాజస్థాన్ నుంచి తొమ్మిది మంది చొప్పున, తమిళనాడు నుంచి 8, మధ్యప్రదేశ్ నుంచి ఏడుగురు, గుజరాత్ నుంచి ఆరుగురితోపాటు ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారు ఉన్నారు. కాగా వీరిలో 22 మంది మహిళా పోలీసులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పది మంది పోలీసులకు మెడల్స్ లభించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి అయిదుగురు, తెలంగాణ నుంచి అయిదుగురు పోలీసు అధికారులకు కేంద్ర హోంశాఖ ఎక్సలెన్స్ మెడల్ దక్కాయి. ఏపీ నుంచి.. ► గుంట్రెడ్డి అశోక్ కుమార్, ఇన్స్పెక్టర్ ►షేక్ మన్సూరుద్దిన్, ఇన్స్పెక్టర్ ►ధనుంజయుడు మల్లెల, డీఎస్పీ ►కొర్లకుంట సుప్రజ, డీఎస్పీ ►ఉప్పుటూరి రవిచంద్ర, డీఎస్పీ తెలంగాణ నుంచి.. ►మేకల తిరుపతన్న, అడిషనల్ ఎస్పీ ►రాజుల సత్యనారాయణ రాజు, డీఎస్పీ ►మూల జితేందర్ రెడ్డి, ఏసీపీ ►కమ్మాపల్లి మల్లిఖార్జున కిరణ్కుమార్, డీఎస్పీ ►భూపతి శ్రీనివాసరావు, ఏసీపీ కాగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ అందించే ఈ పతకాన్ని 2018లో ఇవ్వడం ప్రారంభించగా.. ప్రతి ఏడాది ఆగస్టు 12వ తేదీనా ప్రకటిస్తారు. నేర పరిశోధనలో ఉన్నత వృత్తిపరమైన ప్రమాణాలను ప్రోత్సహించడం, విచారణలో వారి ప్రతిభను గుర్తించి గుర్తించి ఈ అవార్డు అందిస్తారు. -
విశాఖ: సంధ్య ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లాలో సంపులో పడి ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. నిన్న(మంగళవారం) అర్ధరాత్రి సంధ్య ఫోన్ నుంచి ఆటో డ్రైవర్కు ఫోన్ వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, సంధ్య పిల్లల్ని సదరు ఆటో డ్రైవర్ ప్రతీరోజూ స్కూల్కు తీసుకువెళ్తాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. మర్రిపాలెం ప్రకాశ్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లోని నీటి సంపులో ముగ్గురు మృతదేహాలు బుధవారం లభించాయి. మృతులను తల్లి సంధ్య, పిల్లలు గౌతమ్, అలేఖ్యలుగా గుర్తించారు. కాగా, చనిపోయిన వారు అపార్ట్మెంట్ వాచ్మెన్గా కుటుంబంగా స్థానికులు చెబుతున్నారు. కాగా, పది నెలల క్రితమే వీరంతా విశాఖకు వచ్చారు. ఇంతలోనే ఇంత ఘోరం జరగడంతో అక్కడున్నవారంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక, వీరి మృతిపై సమాచారం అందుకున్న విశాఖ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను సంపు నుంచి బయటకు తీశారు. అయితే వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం, వారి మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: కీచక టీచర్ అరెస్ట్ -
కఠిన చర్యలు తప్పవు
సాక్షి, అమరావతి: పుంగనూరు ఘటనపై విచారణకు ఆదేశించామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారందరిపై కఠిన చర్యలు తప్పవని డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి హెచ్చరించారు. ఘటన పూర్వాపరాలపై విచారణ జరపాలని డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్లను ఆదేశించామన్నారు. ఈ విషయమై శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిలో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. అక్కడ వాహనాలను సైతం టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా తగులబెట్టారని చెప్పారు. రాళ్లు రువ్విన, నిప్పు పెట్టిన వారందరినీ గుర్తించామన్నారు. ఘటన స్థలిలో సీసీ కెమెరా పుటేజీలను విశ్లేషస్తున్నామని, ఇప్పటికే పలువురిని గుర్తించామని.. మరికొందరు అనుమానితుల కదలికలపై నిఘా పెట్టామన్నారు. చంద్రబాబు రూట్ ప్లాన్ మార్పు వ్యవహారం కూడా విచారణలో తేలుతుందన్నారు. చంద్రబాబు చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలపై కూడా దృష్టి పెట్టామని చెప్పారు. -
కష్టాన్నే నమ్ముకుంది! అదే ఆమెను ఎఫ్బీఐకి తిరుగులేని ఏజెంట్గా..
‘ఎఫ్బీఐలో పనిచేయడం అదృష్టం’ అంటాడు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్. ‘ఎఫ్బీఐ’లో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న ఇండో–అమెరికన్ సోహిని సిన్హా ఎప్పుడూ అదృష్టాన్ని నమ్ముకోలేదు. కష్టాన్నే ఇష్టంగా నమ్ముకుంది. ఎఫ్బీఐలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో స్థాయిలలో పనిచేసింది. తాజాగా సోహిని సిన్హాను ఎఫ్బీఐ సాల్ట్లేక్ సిటీ ఫీల్డ్ ఆఫీస్స్పెషల్ ఏజెంట్ ఇన్చార్జిగా నియమించింది... ఎఫ్బీఐలో సోహిని సిన్హాకు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. కౌంటర్–టెర్రరిజం ఇన్వెస్టిగేషన్లో మంచి పేరు తెచ్చుకుంది. భద్రతకు సంబంధించిన సంక్లిష్టమైన అంశాలను హ్యాండిల్ చేయడంలో, క్రిమినల్ సైబర్ ఇన్వెస్టిగేషన్లో దిట్టగా పేరున్న సోహిని సిన్హా తన వృత్తిపరమైన అంకితభావంతో ఎన్నో ప్రమోషన్లు పొందింది. 2001లో ఎఫ్బీఐలో స్పెషల్ ఏజెంట్గా చేరిన సిన్హా 2009లో సూపర్వైజరీ స్పెషల్ ఏజెంట్గా నియామకం అయింది. ఆ తరువాత వాషింగ్టన్ డీసీలోని కౌంటర్–టెర్రరిజం విభాగానికి బదిలీ అయింది. 2012లో అసిస్టెంట్ లీగల్ అటాషైగా ప్రమోట్ అయింది. కౌంటర్ టెర్రరిజమ్కు సంబంధించిన వ్యవహారాల్లో రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలిస్, కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్లతో కలిసి పనిచేసింది. ఆ తరువాత ఫీల్డ్ సూపర్వైజర్ (డెట్రాయిట్ ఫీల్డ్ ఆఫీస్)గా ప్రమోట్ అయింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ ఉగ్రవాదానికి సంబంధించిన సంక్లిష్టమైన కేసులను ఇన్వెస్టిగేట్ చేసింది.2020లో సైబర్ ఇన్ట్రూజన్ స్క్వాడ్లో చేరింది. తన నాయకత్వ సమర్థతతో 2021లో నేషనల్ సెక్యూరిటీ మ్యాటర్స్, క్రిమినల్ మ్యాటర్స్కు సంబంధించి అసిస్టెంట్ స్పెషల్ ఏజెంట్ ఇన్చార్జి (పోర్ట్లాండ్ ఫీల్డ్ ఆఫీస్) గా ప్రమోట్ అయింది. ఏజెన్సీ ఆపరేషన్స్లో తనదైన ముద్ర వేసింది. ఆ తరువాత ఎఫ్బీఐ డైరెక్టర్కు ఎగ్జిక్యూటివ్ స్పెషల్ అసిస్టెంట్గా నియామకం అయింది. ఇంటర్నేషనల్ ఎసైన్మెంట్స్లో కూడా తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఇంగ్లాండ్ నుంచి ఇరాక్ వరకు ఎన్నో దేశాల్లో, ఎన్నో సంస్కృతుల మధ్య పనిచేసింది.ఎఫ్బీఐలో చేరడానికి ముందు సోహిని సిన్హా థెరపిస్ట్గా, ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన క్లినిక్లో అడ్మినిస్ట్రేటర్గా పనిచేసింది. ఇక చదువు విషయానికి వస్తే సైకాలజీలో డిగ్రీ, మెంటల్ హెల్త్లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఆ చదువు తన వృత్తి జీవితంలో ఎంతో ఉపయోగపడింది. ఇతరులకు సహాయపడాలనే సోహిని సిన్హా తపనకు ఎఫ్బీఐ బలమైన వేదికలా ఉపయోగపడుతోంది. -
పేదల భూములు కొల్లగొట్టి.. హైకోర్టుకొచ్చి స్టే తెచ్చుకున్నారు
సాక్షి, అమరావతి : రాజధానిలో నిరుపేదల నుంచి కారుచౌకగా అసైన్డ్ భూములను కొల్లగొట్టిన వ్యవహారంలో సీఐడీ కేసు నమోదు చే సిన వెంటనే చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ హైకోర్టు నుంచి స్టే తె చ్చుకున్నారని సీఐడీ గురువారం హైకోర్టుకు నివేదించింది. వారి అక్రమాలు బ యటకు వస్తాయన్న ఉద్దేశంతోనే దర్యాప్తును ఎఫ్ఐఆర్ దశలోనే అడ్డుకున్నారని సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి హైకోర్టుకు వివరించారు. వారు అక్రమాలకు పాల్పడకపోతే స్టే పొందాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సచ్చీలురని భావిస్తే స్టే ఎత్తివేయాలని కోరి దర్యాప్తునకు సహకరించాలన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా రాజధాని అసైన్డ్ భూముల బదలాయింపులో భారీ అక్ర మాలపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు, నారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలపై స్టే విధించింది. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ తుది విచారణ జరుపుతున్నారు. దర్యాప్తు జరపకపోతే ఆధారాలెలా వస్తాయి? అసైన్డ్ భూముల కొనుగోళ్లపై ఫిర్యాదు అందిన తర్వాత సీఐడీ ప్రాథమిక విచా రణ జరిపి, అందులో లభించిన ఆధారాలకు అనుగుణంగా బాబు, నారా యణ పై కేసు నమోదు చేసిందని ఏఏజీ చెప్పారు. ఆ విచారణ గురించి వారికి తెలి యదని, లేదంటే దానిపైనా స్టే తెచ్చుకునే వారని అన్నారు. అత్యంత శక్తివంతు లు, పలుకుబడి కలిగిన వారైనందునే ఆఘమేఘాలపై హైకోర్టుకొచ్చి స్టే తెచ్చు కోగలిగారన్నారు. ఒకవైపు దర్యాప్తు జరగకుండా స్టే తెచ్చుకుని, మరోవైపు అక్ర మాలకు ఎలాంటి ఆధారాల్లేవని చెబుతున్నారన్నారు. దర్యాప్తు జరగకపోతే ఆ ధారాలెలా వస్తాయని ప్రశ్నించారు. స్టే ఎత్తేసి దర్యాప్తునకు అనుమతివ్వా లన్నారు. అప్పుడు ఎలాంటి ఆధారాలు సమర్పిస్తామో వారు చూడవచ్చన్నారు. ఆరేళ్ల తరువాత కేసు నమోదు చేశారు.. నారాయణ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు స్టే ఇచ్చినా సీఐడీ దర్యాప్తు కొనసాగించిందన్నారు. రాజ కీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జీవో 41 జారీ చేసిన ఆరేళ్ల తరువాత కేసు నమోదు చేశారన్నారు. ఆ తరువాత జీవో 41ని సవరించారని చెప్పారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, సవరణ సమయంలో కూడా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయా అని ప్రశ్నించగా పోసాని సమాధానం చెప్పలేదు. అనంతరం విచారణను న్యాయమూర్తి బుధవారానికి వాయిదా వేశారు. -
ఫలక్ నుమా రైలు ప్రమాదంపై పోలీసుల విచారణ వేగవంతం
-
మణిపూర్ పరిణామాలపై నివేదిక ఇవ్వండి: సుప్రీం
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బాధితుల పునరావాసంతోపాటు శాంతి భద్రతలను మెరుగుపర్చేందుకు చేపట్టిన చర్యలు, ఆయుధాల స్వాధీనం వంటి అంశాలపై తాజా నివేదికను సమరి్పంచాలని మణిపూర్ ప్రభుత్వాన్ని సోమవారం ఆదేశించింది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, కర్ఫ్యూ సమయాన్ని ఐదు గంటలకు కుదించామని మణిపూర్ ప్రభుత్వం తెలియజేసింది. మణిపూర్లో మైనారీ్టలైన కుకీ తెగ గిరిజనులకు రక్షణ కలి్పంచాలని కోరుతూ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో) ‘మణిపూర్ ట్రైబల్ ఫోరం’ దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ ఆగస్టు 10కి వాయిదా పడింది. మరోవైపు, వేసవి సెలవుల అనంతరం సుప్రీంకోర్టు సోమవారం పునఃప్రారంభమైంది. మణిపూర్ పరిణామాలకు సంబంధించిన పిటిషన్లపై విచారణను మొదలుపెట్టింది. -
‘వాణిజ్య పన్నుల’ అవినీతి కేసులో దర్యాప్తు ముమ్మరం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వాణిజ్యపన్నుల శాఖ అధికారుల భారీ అవినీతి కేసులో ఎన్టీఆర్ జిల్లా పోలీసు యంత్రాంగం దర్యాప్తు ముమ్మరం చేసింది. దీన్లో భాగంగానే ఇప్పటికే రిమాండ్లో ఉన్న నలుగురు ఉద్యోగుల ఇళ్లతోపాటు పరారీలో ఉన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణకు చెందిన ఇళ్లల్లో మంగళవారం ఏకకాలంలో పోలీసులు సోదాలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సత్యనారాయణపురంలోని రెండు ఇళ్లు, కృష్ణాజిల్లా కానూరులో రెండు, గుడివాడలో ఒక ఇల్లు, హైదరాబాద్లోని ఎస్ఆర్నగర్లో ఒక ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాలతో జిల్లా పోలీసు యంత్రాంగం, సిటీ టాస్్కఫోర్స్ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు నిర్వహించారు. కె.ఆర్.సూర్యనారాయణ ఇళ్లతోపాటు జీఎస్టీ అధికారులు బలిజేపల్లి మెహర్కుమార్, కంచర్లకోట సంధ్య, సీనియర్ అసిస్టెంట్ కావూరి వెంకటచలపతి, సబార్డినేట్ మరీదు సత్యనారాయణ ఇళ్లల్లో ఈ సోదాలు చేశారు. వాణిజ్యపన్నుల శాఖ రాష్ట్ర కార్యాలయ అసిస్టెంట్ కమిషనర్ ఫిర్యాదుతో గత నెలలో ఈ అవినీతి వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదుతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు.. నలుగురు ఉద్యోగులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం, వారికి కోర్టు రిమాండ్ విధించటం తెలిసిందే. ఈ నలుగురు అధికారులు పాల్పడిన వందల కోట్ల రూపాయల అవినీతి వెనుక ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ హస్తం ఉందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పోలీసులు ఆయనపైనా కేసు నమోదు చేశారు. విలువైన ఆస్తిపత్రాలు, ఫైళ్లు, సొత్తు స్వాదీనం విజయవాడ సత్యనారాయణపురం పాపరాజు వీధిలోగల సాయిరత్న టవర్స్లోని బలిజేపల్లి మెహర్కుమార్ ఫ్లాట్లో, కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరులోని ఆశ్రిషి రెసిడెన్సిలోని కంచర్లకోట సంధ్య ఫ్లాట్లో, గుడివాడ సమీపంలోని బేతపూడి గ్రామంలో కావూరి వెంకటచలపతి ఇంట్లోను, కానూరులో మరీదు సత్యనారాయణ ఇంట్లోను, విజయవాడ సత్యనారాయణపురంలోను, హైదరాబాద్ ఎస్ఆర్నగర్లోను ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ ఇళ్లల్లో సోదాలు చేశారు. డీసీపీ విశాల్గున్ని పర్యవేక్షణలో సెంట్రల్ ఏసీపీ పి.భాస్కరరావు నేతృత్వంలో ఆరు బృందాలు ఈ తనిఖీలు చేశాయి. ఐదుగురు నిందితులు అక్రమ సంపాదనతో కూడబెట్టిన ఆస్తుల డాక్యుమెంట్లు, నగదు, బంగారు, వెండి ఆభరణాలు, విలువైన సమాచారం ఉన్న ల్యాప్టాప్లు, సెల్ఫోన్లు, వాణిజ్యపన్నుల కార్యాలయంలో కనిపించకుండాపోయిన ఫైళ్ల వివరాలు సేకరించినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తెలిపారు. మరిన్ని విలువైన ఆస్తిపత్రాలు, కేసుకు సంబంధించిన మరిన్ని ఫైళ్ల కోసం సోదాలు కొనసాగిస్తామని చెప్పారు. సోదాల్లో స్వాదీనం చేసుకున్న సొత్తును న్యాయస్థానానికి అందజేస్తామని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు రిమాండ్లో ఉండగా.. కీలక సూత్రధారి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న ఆయన ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లను కోర్టులు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సూర్యనారాయణ పాల్పడిన అవినీతే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. -
సినీ డ్రగ్స్ కేసులో కూపీ లాగుతున్న పోలీసులు
-
విషప్రయోగంతోనే అవతార్ ఖాందా కన్నుమూత?
బ్రిటన్లో ఖలీస్తానీ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ అవతార్ సింగ్ ఖాందా అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఖలీస్తానీ వేర్పాటువాది అమృత్పాల్ సింగ్కి గురువుగా చెప్పుకునే అవతార్ సింగ్ క్యాన్సర్తో కన్నుమూశాడని ప్రకటించినప్పటికీ.. అతనిపై విష ప్రయోగం జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పుడు. ఈ క్రమంలో దర్యాప్తు కొనసాగుతోంది. అవతార్ సింగ్ ఖాందా.. కేఎల్ఎఫ్ చీఫ్ మాత్రమే కాదు, మార్చి 19వ తేదీన లండన్లోని భారత్ హైకమిషన్ ఎదుట భారతీయ జెండాను అవమానించేందుకు ఖలీస్తానీలు ప్రయత్నించిన కుట్రకు ప్రధాన సూత్రధారి కూడా. ఈ ఘటనకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ తన దర్యాప్తులో ఖాందానే ప్రధాన నిందితుడిగా పేర్కొంది కూడా. ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉండి. పోలీసులకు అమృత్పాల్ సింగ్ దొరకకుండా తిరిగిన రోజుల్లోనూ అవతార్ అతనికి సహకరించినట్లు తేలింది కూడా. అవతార్ ఖాందా బ్యాక్గ్రౌండ్ను పరిశీలిస్తే.. కేఎల్ఎఫ్ ఉగ్రవాది కుల్వంత్ సింగ్ తనయుడే ఈ అవతార్. బాంబ్ ఎక్స్పర్ట్ కూడా. 2007లో యూకేకి స్టడీ వీసా మీద వెళ్లి.. 2012లో అక్కడే ఆశ్రయం పొందాడు. 2020 జనవరిలో కేఎల్ఎఫ్ మాజీ చీఫ్ హర్మీత్ సింగ్ హత్యానంతరం.. కేఎల్ఎఫ్లో రాంజోధ్ సింగ్ కోడ్ నేమ్తో అవతార్ కొనసాగాడు. దీప్ సింగ్ మరణాంతరం వారిస్ పంజాబ్ దే చీఫ్గా అమృత్పాల్ సింగ్ నియామకంలోనూ అవతార్ సింగ్దే కీలక పాత్ర కూడా. మెంటార్ రోల్లో అమృత్పాల్ ప్రతీ వ్యవహారాన్ని అవతార్ చూసుకుంటూ వచ్చాడు కూడా. ఇక 37 రోజులపాటు అమృత్పాల్ సింగ్ పరారీలో ఉండగా.. ఆ సమయంలో యూకే నుంచి అవతార్ సహాయసహకారాలు అందించాడని దర్యాప్తు బృందాలు నిర్ధారించుకున్నాయి. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న అవతార్ సింగ్ బర్మింగ్హమ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు మెడికల్ రిపోర్టులు చెబుతున్నా.. అతనిపై విష ప్రయోగం జరిగిందనే అనుమానాల నడుమ దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 23వ తేదీన పంజాబ్ మోగాలో అమృత్పాల్ సింగ్ పోలీసులకు లొంగిపోగా.. అసోం దిబ్రుఘడ్ జైలుకు అతన్ని తరలించారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృత్పాల్, అతని ఎనిమిది మంది అనుచరులపైనా కేసులు నమోదు అయ్యాయి. సంబంధిత వార్త: వేట ముగిసింది.. అమృత్పాల్ అరెస్ట్ -
ముంబై హత్య కేసు: విచారణలో షాకింగ్ ట్విస్ట్..శ్రద్ధా ఘటన స్ఫూర్తితోనే చేశా!
ముంబైలో శ్రద్ధావాకర్ హత్యోదంతం తరహాలో జరిగిన మరో ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ మేరకు మహారాష్ట్రలోని థానేలో 56 ఏళ్ల మనోజ్ సానే అనే వ్యక్తి ప్రియురాలు సరస్వతి వైద్యను చంపి ముక్కలు చేసి, వాసన రాకుండా కుక్కరలో ఉడకబెట్టిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నిందితుడి మనోజ్ సానేని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటన దర్యాప్తులో బాధితురాలి సరస్వతి వైద్య గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె అహ్మద్నరగ్లోని జాంకీబాయి ఆప్టే బాలికాశ్రమంలో పెరిగినట్లు తేలింది. ఆమె తన అంకుల్ ముంబైలో ఉంటారని అతనితోనే ఉంటానని చెప్పేదని ఆ బాలికాశ్రమంలో పనిచేసే మహిళ చెబుతోంది. సరస్వతి చివరిసారిగా రెండేళ్ల క్రితం అనాథశ్రమాన్ని సందర్శించిందని, అప్పుడు ఆమె చాలా సంతోషంగానే కనిపించిందని వెల్లడించింది. ఇక మనోజ్ సానే ఆమెను పెళ్లి చేసుకోలేదు. అతనికి ముంబైలోని బోరివాలిలో ఒక ఇల్లు ఉందని అక్కడ అతని కుటుంబ సభ్యులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కానీ అతను తన కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. మనోజ్ సాన్ బోరివలిలోని ఓ కిరాణ దుకాణంలో పనిచేసేవాడని, అక్కడకి సదరు బాధితురాలు తరుచు వచ్చేదని పోలీసులు పేర్కొన్నారు. 2014 నుంచి వీరి మధ్య స్నేహం మొదలైందని ఆ తర్వాత 2016 నుంచి మీరా రోడ్డులోని ఫ్లాట్కు తీసుకుని సహజీవనం ప్రారంభించినట్లు వెల్లడించారు. చాలాకాలంగా కలిసే ఉంటున్నట్లు తెలిపారు. ఐతే గత కొద్ది రోజులుగా వీరి ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు గమనించి తమకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో తాము నిందితుడు మనోజ్సానే అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. విచారణలో నిందితుడు..ఆమె నాకు కూతురు లాంటిది!.. విచారణలో మనోజ్ సాన్ చెప్పిన విషయాలు విని పోలీసులు కంగుతిన్నారు. తాను హెచ్ఐవీ బాధితుడునని, చాలా ఏళ్ల క్రితమే ఈ వ్యాధి బారిన పడినట్లు చెప్పుకొచ్చాడు. అలాగే బాధితురాలు సరస్వతితో తనకు ఎలాంటి శారీరక సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. ఆమె తనకు కూతురు లాంటిదంటూ షాకింగ్ విషయాన్ని చెప్పాడు. సరస్వతి పదోతరగతి పరీక్షలు రాయాలనుకుందని, ఇందుకోసం ఆమెకు గణిత పాఠాలు చెప్పేవాడనని తెలిపాడు. ఐతే ఆమె తాను ఆలస్యంగా ఇంటికి వచ్చినా అనుమానించేదని చెప్పాడు. ఐతే జూన్ 3వ తేదిన తాను ఇంటికి వచ్చేసరికి ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉందని చెప్పుకొచ్చాడు. దీంతో తాను కేసులో ఇరుక్కుంటానేమోనన్న భయం వేసి ఇలా చేశానని వెల్లడించాడు. తాను ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్య గురించి తెలుసుకుని ఇలా చేసినట్లు పోలీసులకు వివరించాడు. ఇదిలా ఉండగా, నిందితుడి ఇంటిలో లభించిన బాధితురాలి శరీర భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, జూన్ 17 వరకు నిందితుడు తమ కస్టడిలోనే ఉంటాడని పోలీసులు వెల్లడించారు. --ఆర్ లక్ష్మీ లావణ్య, వెబ్ డెస్క్ (చదవండి: ముంబైలో నరరూప రాక్షసుడు..ప్రియురాలిని హతమార్చి.. ఆపై కుక్కర్లో..) -
సీఐడీ దర్యాప్తుపై రామోజీ తప్పుడు రాతలు
-
విచారణకు మార్గదర్శి యాజమాన్యం సరిగా స్పందించడం లేదు
-
మార్గదర్శి కేసులో సీఐడీ అధికారుల విచారణ
-
ఖమ్మంలో మెడికో మానస అనుమానాస్పద మృతిపై దర్యాప్తు
-
మార్గదర్శి అక్రమాలపై దర్యాప్తులో భాగంగా సీఐడీ నోటీసులు
-
వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన హైకోర్టు
-
Monika Shergill: క్వీన్ ఆఫ్ కంటెంట్
స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో సక్సెస్ అంటే సాధారణ విషయం కాదు. ఏ నిమిషానికి ఏ ట్రెండ్ వస్తుందో తెలియదు. అక్కడి ట్రెండ్ ఇక్కడ వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు. సక్సెస్కు సవాలక్ష కారణాలు ఉంటాయి. అయితే అవేమీ చీకట్లో దాక్కున్నవి కావు. వెదుక్కుంటూ వెళితే ముందుకు వచ్చి పలకరిస్తాయి. మోనిక చేసిన పని అలా వెదుక్కుంటూ వెళ్లడమే! ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా ప్రయాణం మొదలు పెట్టిన మోనిక షేర్గిల్ ‘వైస్ ప్రెసిడెంట్, కంటెంట్, నెట్ఫ్లిక్స్ ఇండియా’ స్థాయికి చేరుకోవడం అదృష్టం కాదు...తాను పడిన కష్టం. ఆ కష్టమే మోనిక షేర్గిల్ను ‘హై అండ్ మైటీ–50 పవర్పీపుల్’ జాబితాలో చేర్చింది.... నెట్ఫ్లిక్స్ ఇండియా స్పీడ్ అందుకొని వ్యూ అవర్స్, రెవెన్యూ పెంచుకొని ప్రపంచస్థాయిలో సక్సెస్ సాధించింది. ‘దీనికి కారణం?’ అనే ప్రశ్నకు ఏకైక జవాబు నలభై తొమ్మిది సంవత్సరాల మోనిక షేర్గిల్. మోనిక చొరవ వల్ల ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. ప్రపంచానికి, ప్రతిభావంతులకు మధ్య ‘నెట్ఫ్లిక్స్’ను వారధిగా మలచడంలో మోనిక ఘన విజయం సాధించింది. నెట్ఫ్లిక్స్ కోసం కంటెంట్ను ఎంపిక చేసుకోవడంలో మోనిక అనుసరించే ప్రమాణాల విషయానికి వస్తే...క్రైమ్ షోలలోని సంచలన ధోరణి కనిపించదు. సబ్జెక్ట్లో ఉండే బలమే ప్రధాన ప్రమాణం అవుతుంది. దీనికి ఉదాహరణ ఆస్కార్ పురస్కారం గెలుచుకున్న డాక్యుమెంటరీ ఫిల్మ్... ది ఎలిఫెంట్ విష్పరర్స్. ‘‘ఎంటర్టైన్మెంట్ బిజినెస్లో ఎప్పుడూ రిస్క్ పొంచి ఉంటుంది. ప్రేక్షకుల అభిరుచిని కచ్చితంగా పసిగట్టడం కష్టమే. కరోనా కల్లోల సమయం ప్రేక్షకుల ఆలోచనధోరణిలో మార్పు తీసుకువచ్చింది. కంటెంట్ విషయంలో తమ భాష, ప్రాంతానికి మాత్రమే పరిమితం కావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కంటెంట్పై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ‘ఏది నిజం? ఏది కల్పన?’ అనే విషయంలో వారికి స్పష్టత ఉంది. వ్యాపార విజయం అనేది వారికి సంబంధం లేని విషయం. వారి దృష్టి మొత్తం కథ పైనే ఉంటుంది’’ అంటున్న మోనిక విజయాల గురించి ఆనందించడమే కాదు నిరాశపరిచిన కంటెంట్ విషయంలో సమీక్ష చేసుకోవడంలో ముందుంటుంది. రొమాంటిక్ హిందీ–కామెడీ ఫిల్మ్ ‘మీనాక్షి సుందరేశ్వర్’ నిరాశపరిచింది. దీనికి కారణం సరిౖయెన నటీనటులను ఎంపిక చేసుకోకపోవడం. కథ సరిగ్గా ఉండగానే సరిపోదు కాస్టింగ్ కూడా సరిగ్గా ఉండాలని, ఎక్కడా రాజీపడకూదనే గుణపాఠాన్ని ఆ చిత్రం నుంచి నేర్చుకుంది మోనిక. పోస్ట్–పాండమిక్ ఆడియెన్స్ ఇంటర్నేషనల్ స్టోరీలను ఇష్టపడుతున్నారు. జర్మన్ షో ‘డార్క్’ మనదేశంలో హిట్ కావడం దీనికి నిదర్శనం. ఆ సమయంలో... ‘వేరే దేశం కథలు మన దగ్గర విజయం సాధించినప్పుడు, మన దేశంలోని ఒక ప్రాంతానికి చెందిన కథలు మరొక ప్రాంతంలో ఎందుకు విజయం సాధించవు’ అంటూ ఆలోచన చేసింది మోనిక. తాను నమ్మింది ‘కాంతార’ హిందీ వెర్షన్ విజయంతో నిజం అయింది. సక్సెస్ ముఖ్యమే కాని వేలం వెర్రి జోలికి వెళ్లదు మోనిక. ‘కొరియన్ భాషలో గ్లోబల్ బ్రేక్ఔట్ షోలు ఉన్నాయి. అలా మనం కూడా సాధించాలి అనుకున్నంత మాత్రాన అది సాధ్యపడదు. ఆ షోలో ఉన్న వినూత్నమైన ఐడియా, దాని చుట్టూ ముడిపడి ఉన్న ఎన్నో అంశాలు గ్లోబల్ బ్రేక్ఔట్కు కారణం కావచ్చు. మనదైన ఆలోచన చేసి విజయం సాధించాలిగానీ ఫలాన షోలాగా ఉండాలి అని ప్రయత్నిస్తే విజయం మాట ఎలా ఉన్నా నిరాశ మాత్రమే మిగులుతుంది. ర్యాట్రేస్ ఇష్టపడను. ఆ రేసులో పడితే ఆయాసమే మిగులుతుంది తప్ప ఆలోచన మిగలదు’ అంటోంది మోనిక. కొంతకాలం క్రితం ట్రెండ్స్కు నిర్దిష్టమైన టైమ్ అంటూ ఉండేది. అర్థం చేసుకోవడానికైనా, అందిపుచ్చుకోవడానికైనా అది బాగా సరిపోయేది. కాని ఇప్పటి పరిస్థితి వేరు. ట్రెండ్స్ వేగంగా మారుతున్నాయి. ఒక దేశంలో ట్రెండ్గా ఉన్నది ఇక్కడ వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు....ఇలాంటివి ఎన్నో దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళుతుంది మోనిక షేర్గిల్. అందుకే ఆమె పేరు ముందు ‘క్వీన్ ఆఫ్ కంటెంట్’ అనే విజయధ్వజం రెపరెపలాడుతోంది. -
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్...సీబీఐ న్యాయవాదికి హైకోర్టు సూటి ప్రశ్నలు
-
ఎన్ఐఏ చేతికి భోపాల్ ఉగ్ర కేసు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–భోపాల్లలో మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అరెస్టు చేసిన ఉగ్రవాదులకు సంబంధించిన కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పరిధిలోకి వెళ్లింది. ఈ నెల 9న ఏకకాలంలో దా డులు చేసిన ఏటీఎస్ అధికారులు హైదరాబాద్లో ఐదుగురు, భోపాల్లో 11 మంది ఉగ్రవాదులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గురువారం భోపాల్లో ఏటీఎస్ అధికారులతో భేటీ అయిన ఎన్ఐఏ అధికారులు.. శుక్రవారం నుంచి అధికారికంగా దర్యాప్తు ప్రారంభించారు. దీనికోసం ప్రత్యే కంగా కేసు నమోదు చేశారు. ఈ ఉగ్రవాదులకు ఉన్న విదేశీ లింకులు, ఆర్థిక మూలాలపైనే తొలుత దృష్టి సారించారు. దీనితోపాటు వారికి అందిన శిక్షణ, ఎక్కడెక్కడ శిబిరాలు నిర్వహించారన్నది ఆరా తీస్తున్నారు. హెచ్యూటీ పేరుతోనే కొనసాగింపు.. హైదరాబాద్, భోపాల్లలో అరెస్టైన ఉగ్రవాదులు తొలుత అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ హిజ్బ్ ఉత్ తెహ్రీర్ (హెచ్యూటీ)కి అనుబంధంగా పనిచేశారు. రాకెట్ చాట్, త్రీమా యాప్స్లో ఏర్పాటు చేసుకున్న గ్రూపుల్లో హెచ్యూటీకి చెందినవారు పంపిన వీడియోలు, ఆడియోలు, పత్రాలను చూసి ప్రేరణ పొందారు. కానీ ఎంతకాలం ఎదురుచూసినా హెచ్యూటీ నుంచి విధ్వంసాలకు సంబంధించిన ఆదేశాలు అందలేదు. దీంతో సొంతంగా సలీం, యాసిర్ల నేతృత్వంలో హైదరాబాద్, భోపాల్ మాడ్యుల్స్ను ఏర్పాటు చేసుకున్నారు. నిషేదం నుంచి తప్పించుకోవడానికి ఈ మాడ్యూల్స్కు ఎలాంటి పేర్లూ పెట్టుకోలేదు. ప్రాథమిక ఆధారాలను బట్టి హెచ్యూటీ ఉగ్రవాదులుగానే పరిగణించాలని, ఆ సంస్థపై నిషేధం విధించాలని కేంద్ర హోంశాఖకు నివేదిక పంపేందుకు ఎన్ఐఏ సన్నాహాలు చేస్తోంది. కేసు దర్యాప్తు పూర్తిచేసి, అభియోగపత్రాలు దాఖలు చేశాక ఈ ప్రక్రియ చేపట్టనుంది. ఫోన్లు, ల్యాప్టాప్లలో లాడెన్ వీడియోలు ఏటీఎస్ అధికారులు ఉగ్రవాదుల నుంచి స్వా«దీనం చేసుకున్న ఫోన్లు, ల్యాప్టాప్లను ఫోరెన్సిక్ ల్యాబ్లో విశ్లేషణ చేయించగా.. పలు కీలక అంశాలను గుర్తించారు. యువత ఉగ్రవాద బాటపట్టా లని రెచ్చగొట్టేలా ఒసామా బిన్లాడెన్ చేసిన ప్రసంగాల వీడియోలు, తఫ్సీర్–ఎ–జిహాద్ పేరిట రెచ్చ గొట్టే వ్యాఖ్యల ఆడియోలు వాటిలో ఉన్నట్టు ఏటీఎస్ అధికారులు చెప్తున్నారు. ఈ ఉగ్రవాదుల్లో ఇంజనీరింగ్ చదివిన రిజ్వీ, డానిష్, కరీం, అబ్దుర్ రెహ్మాన్ (హైదరాబాద్లో అరెస్టయ్యాడు) ఎల్రక్టానిక్ పరికరాలను వినియోగించడంపై మిగతా వారికి శిక్షణ ఇచ్చారు. భోపాల్ మాడ్యుల్కు చెందినవారు అక్కడి ఇంద్రపురిలో ఉన్న కమల పార్కులో వివిధ అంశాలపై శిక్షణ తీసుకున్నరని దర్యాప్తు అధికారులు గుర్తించారు. యాసిర్ వీరికి తన ఫిట్నెస్ సెంటర్లో బాక్సింగ్, కత్తిని ఉపయోగించడం వంటి వాటిలో చిట్కాలు నేర్పినట్టు తేల్చారు. హైదరాబాద్లో శిబిరం ఎక్కడ? ఉగ్రవాదులను విచారించిన సమయంలో.. హైదరాబాద్తోపాటు భోపాల్కు చెందిన ఉగ్రవాదులు 2021 జూలైలో ఇక్కడి గోల్కొండలోని మహ్మద్ సలీం ఇంట్లో సమావేశమయ్యారని ఏటీఎస్ గుర్తించింది. తర్వాత రెండు రోజుల పాటు పెద్ద శిక్షణ శిబిరం నిర్వహించారని.. ఎయిర్ గన్ కాల్చడం, బరువు తగ్గడంతోపాటు ఆత్మరక్షణ, పోలీసుల ఇంటరాగేషన్ను ఎదుర్కోవడం వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చారని తేల్చింది. అయితే ఈ శిక్షణ శిబిరం ఎక్కడ నిర్వహించారనేది ఉగ్రవాదులు బయటపెట్టలేదని.. ఆ ప్రాంతాన్ని గుర్తించడానికి ఎన్ఐఏ అధికారులు సాంకేతికంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారని తెలిసింది. ఇక గత ఏడాది నవంబర్లో భోపాల్ సమీపంలో జరిగిన శిబిరంలో వీరంతా నాటు తుపాకీ కాల్చడం, చిన్న చిన్న బాంబులు తయారు చేయడాన్ని ప్రాక్టీస్ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. -
నేడు ఈడీ ముందుకు చికోటి ప్రవీణ్
-
వివేకా హత్య కేసులో అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డిని విచారించిన సీబీఐ
-
మోదీ పర్యటన వేళ ఆత్మాహుతి దాడి బెదిరింపు లేఖ..అప్రమత్తమైన అధికారులు
ప్రధాని నరేంద్ర మోదీ కేరళ పర్యటనకు ముందు వచ్చిన ఆత్మహుతి దాడి బెదిరింపు లేఖ తీవ్ర కలకలం రేపింది. మోదీ కేరళ పర్యటనకు వస్తే ఆత్మహాతి దాడులకు పాల్పడతామంటూ బీజేపీ కార్యాలయానికి లేఖ వచ్చింది. ఈ లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ కార్యాలయంలో అందుకున్నారు. దానిని గతవారమే పోలీసులకు అందజేశారు. దీంతో పోలీసలు, కేంద్ర ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించాయి. ఏప్రిల్ 24, 25 తేదీల్లో కేరళలో పర్యటించనున్న సమయంలో ఈ బెదిరింపు లేఖ రావడంతో రాష్ట్రంలో అధికారుల అప్రమత్తమై హైలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు ఏడీజీపీ (ఇంటిలిజెన్స్ విభాగాం) ప్రధాని మోదీ పర్యటన సమయంలో భద్రతా ప్రోటోకాల్పై ఉత్తర్వులు జారీ చేసింది. అదీ మీడియాలో ప్రసారం కావడంతో ఈ లేఖ విషయం బయటకు వచ్చింది. ఆ లేఖలో మోదీ కేరళ పర్యటిస్తే.. ఆత్మహుతి దాడులకు పాల్పడతామంటూ బెదిరించారు. కొచ్చి నివాసి మలయాళంలో ఈ బెదిరింపు లేఖ రాసినట్లు ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొంది. ఐతే ఏడీజీపీ జారీ చేసిన ఉత్తర్వులు మీడియాకు లీక్ అవ్వడం వివాదాస్పదమైంది. ఇది ఘోర తప్పిదమని, దీనిపై విచారణ జరగాలని బీజేపీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు సురేంద్రన్ డిమాండ్ చేశారు. కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ కూడా అసలు మీడియాకు ఎలా లీక్ అయ్యిందని ఫైర్ అయ్యారు. వాట్సాప్లో ప్రధాని భద్రతకు సంబంధించిన 49 పేజీల నివేదిక ఎలా లీక్ అయ్యి, వైరల్ అయ్యిందో ముఖ్యమంత్రి వివరించాలని మురళీధరన్ డిమాండ్ చేశారు. దీని అర్థం రాష్ట్ర హోంశాఖ కుదేలైందనే కదా అంటూ ఆగ్రహం వ్యకం చేశారు మంత్రి మురళీధరన్. ఇదిలా ఉండగా, బెదిరింపు లేఖలో పేరు, నెంబర్ ఉన్న కొచ్చి నివాసి ఎస్సేజే జానీని విచారించడం ప్రారంభించారు పోలీసులు. అతని చేతి వ్రాతతో సహా ప్రతిదాన్ని క్రాస్ చెక్ చేశారు. ఈ లేఖ వెనుక.. చర్చికి సంబంధించి వారికి ఏవో కొన్ని సమస్యలు ఉండటంతో ఆప్రాంతానికి చెందిన వ్యక్తులెవరో ఇలా రాసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. దీంతో కేరళ రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడమే గాక తిరువనంతపురం, కొచ్చి నగరాల్లో దాదాపు రెండు వేలమంది పోలీసులు మోహరించారు. మరోవైపు షెడ్యూల్ ప్రకారమే మోదీ కేరళలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ వెల్లడించారు. (చదవండి: బంగ్లాను పూర్తిగా ఖాళీ చేసిన రాహుల్..నేడు అధికారులకు అప్పగింత) -
నల్లధనాన్ని తమ సంస్థల్లో పెట్టుబడులుగా తరలించిన రామోజీ
-
సెంట్రల్ ఢిల్లీలో 144 సెక్షన్ విధింపు
-
ఘటన నాటి నుంచి టీడీపీ డైరెక్షన్ లోనే విచారణ
-
సీబీఐ వందసార్లు పిలిచినా వెళ్లి సమాధానం ఇస్తా: కేజ్రీవాల్
-
నేడు సీబీఐ ముందుకు సీఎం కేజ్రీవాల్
-
కడప: వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ
-
పేపర్ లీక్ విషయం ఎలా తెలిసింది..? సమాచారం ఎవరిచ్చారు.?
-
TSPSC పేపర్ లీక్ కేసులో సంచలన నిజాలు
-
పేపర్ లీక్ కేసు చైర్మన్ కూడా విచారణకు రావలసిందే!
-
TSPSC పేపర్ లీక్ పై రంగంలోకి ఈడీ
-
టీఎస్పీఎస్సీ ఉద్యోగులకూ సిట్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్స్ కేసులో సిట్ దర్యాప్తులో ముందుకు వెళ్లే కొద్దీ.. కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న వాళ్లందరినీ ప్రశ్నిస్తోంది సిట్. తాజాగా.. టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న 42 మంది ఉద్యోగులకూ సిట్ నోటీసులు జారీ చేసింది. సిట్ బుధవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్లో పని చేస్తున్న 42 మందికి నోటీసులు జారీ చేసింది. వీళ్లలో పేపర్ లీక్స్ వ్యవహారంలో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్లతో సంబంధాలు ఉన్న వాళ్లే ఉన్నట్లు సమాచారం. దీంతో వాళ్లను ప్రశ్నించాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే కాన్ఫిడెన్షియల్ రూం అధికారిణి శంకర్ లక్ష్మిని రెండుసార్లు పిలిపించుకుని ప్రశ్నించింది సిట్. ఈమె సిస్టమ్ నుంచే పేపర్లు లీక్ అయ్యాయనే అనుమానాలు ఉన్నాయి. తాజాగా నోటీసులు ఇచ్చినవాళ్లలో.. టీఎస్పీఎస్సీలో టెక్నికల్ డిపార్ట్మెంట్తో సంబంధం ఉన్నవాళ్లే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇక.. ప్రధాన సూత్రధారి రాజశేఖర్ స్నేహితుడైన సురేష్ నడుమ సంబంధాలపై సిట్ ఆరా తీస్తోంది. సైబర్ క్రైమ్ టెక్నికల్ టీం వీళ్లిద్దరి మధ్య వాట్సాప్ ఛాటింగ్, కాల్ డేటా, లావాదేవీల ఆధారంగా కీలక ఆధారాలు సేకరించింది. ఈ ఆధారాలను బట్టి.. రాజశేఖర్ టీఎస్పీఎస్సీ నుంచి పేపర్ తీసుకెళ్లి సురేష్కు ఇచ్చినట్లు గుర్తించింది సిట్. అయితే సురేష్ సైతం పేపర్ను లీక్ చేశాడా? చేస్తే ఎంత మందికి పేపర్ ఇచ్చాడు? అనే కోణంలో సిట్ దర్యాప్తు ఇప్పుడు ముందుకు సాగుతోంది. మరోవైపు పేపర్ లీకేజ్ కేసులో.. నేడు సిట్ దర్యాప్తు ఐదవ రోజు ముగిసింది. మొత్తం తొమ్మిది మంది నిందితులను ఏడు గంటలపాటు విచారణ చేపట్టింది సిట్. ప్రవీణ్, రాజశేఖర్ పెన్ డ్రైవ్లలోని ప్రశ్న పత్రాలు లీక్ కావడంపై నిందితులను సిట్ అధికారులు ప్రశ్నించారు. అదే సమయంలో.. పలు అంశాలపై టెక్నికల్ ఆధారాలు సేకరించించింది సైబర్ క్రైమ్ టెక్నికల్ టీం. రేణుక, నిలేష్, గోపాల్ల నడుమ రూ. 14 లక్షల నగదు ట్రాన్జాక్షన్స్ జరిగినట్లు గుర్తించింది. ఈ లావాదేవీలపై సిట్ కూపీ లాగుతోంది. ఇక రాజశేఖర్ కాంటాక్ట్ లిస్ట్, వాట్సాప్ ఛాటింగ్ వివరాల ఆధారంగానే సిట్ నిందితులపై ప్రశ్నలు గుప్పిస్తోంది. ఇదీ చదవండి: మళ్లీ పిలిపించే అవసరం రాకుండా చూసుకోండి!