Youtuber
-
గూఢచర్యం కేసులో మరో యూ ట్యూబర్ అరెస్ట్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా(Travel vlogger Jyoti Malhotra)ను అరెస్టు చేసిన దరిమిలా, తాజాగా పంజాబ్ పోలీసులు మరో యూట్యూబర్ను అరెస్టు చేశారు. పంజాబ్కు చెందిన జస్బీర్ సింగ్ ‘జాన్మహల్ వీడియో’ అనే యూట్యూబ్ ఛానెల్ను నడుపుతున్నారు. ఇతని ఛానల్కు పది లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. పంజాబ్ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్స్ సెల్ జస్బీర్ను రూప్నగర్లో అరెస్టు చేసింది.జస్బీర్ సింగ్(Jasbir Singh) గతంలో ఉగ్రవాద మద్దతు కలిగిన షకీర్ అలియాస్ జట్ రాంధావా అనే పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అధికారితో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తున్నదని పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) గౌరవ్ యాదవ్ పేర్కన్నారు. పాకిస్తాన్ హైకమిషన్ అధికారి ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్తో కూడా జస్బీర్ సింగ్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన మీడియాకు చెప్పారు. జస్బీర్ మూడుసార్లు పాకిస్తాన్ను సందర్శించాడని, అతని ఫోనులో లెక్కకు మంచిన పాకిస్తానీ నంబర్లు ఉన్నాయన్నారు. అవి ఇప్పుడు ఫోరెన్సిక్ దర్యాప్తులో ఉన్నాయని తెలిపారు.డానిష్ ఆహ్వానం మేరకు ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో జరిగిన పాకిస్తాన్ జాతీయ దినోత్సవ కార్యక్రమానికి జస్బీర్ హాజరయ్యారని, జ్యోతి మల్హోత్రా అరెస్టు తర్వాత, జస్బీర్ తన దగ్గరున్న పాకిస్తాన్ సమాచారాన్ని తుడిచివేయడానికి ప్రయత్నించాడని డీజీపీ యాదవ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సైనిక కదలికలపై సున్నితమైన సమాచారాన్ని పాక్తో పంచుకున్నారనే ఆరోపణలతో జస్బీర్ను పోలీసులు అరెస్టు చేశారు.ఇది కూడా చదవండి: ‘సింధూర్’ సమయంలో ప్రధాని మోదీ ఏం చేశారంటే.. -
బిగ్ బాస్లోకి యూట్యూబర్లు,ఇన్ఫ్లుయన్సెర్లకు ఇక నో ఎంట్రీ...
ఎక్కడో ఇంగ్లండ్లో పుట్టి ఓ హీరోయిన్ ద్వారా ఇండియాలో అడుగు పెట్టి అన్ని ప్రధాన భాషల్లోనూ వీర విహారం చేస్తోంది ఆ షో. ఇంగ్లండ్ మూలాలు కలిగిన బిగ్బాస్(Bigg Boss 19) గురించి తెలియనివారు ఉండరు. గత కొన్నేళ్లుగా తెలుగు నాట అనేక రకాల వివాదాలకు విమర్శలకు విజయాలకు చిరునామాగా మారింది ఈ బిగ్ బాస్.ఈ షో కొత్త కొత్త సెలబ్రిటీలను తెరమీదకు తెచ్చింది. మరీ ముఖ్యంగా యూ ట్యూబ్, ఇన్స్టా గ్రామ్ వంటి వేదికల ద్వారా పేరొందిన సోషల్ మీడియా సెలబ్రిటీలకు సరికొత్త పాప్యులరారిటీని అందించింది.డ్యాన్స్, పాటల వీడియోలతో తొలినాళ్లలో సోషల్ సెలబ్రిటీగా పేరొందిన దీప్తి సునయన, మై విలేజ్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన గంగవ్వ, టిక్ టాక్ వీడియోలతో జూనియర్ సమంతగా పాప్యులరైన అషూరెడ్డి, యూట్యూబ్, ఇన్స్టా స్టార్ షణ్ముఖ్ జస్వంత్, ఇన్స్టా గ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా పేరొందిన గీతూరాయల్, కామెడీ కంటెంట్తో ఇన్ఫ్లుయెన్సర్గా మారిన బెజవాడ బేబక్క,7 ఆర్ట్స్ యూ ట్యూబ్ చానెల్ ద్వారా ప్రసిద్ధి పొందిన కిర్రాక్ సీత, రేడియో జాకీగా పేరొందిన ఆర్జె కాజల్, ఇంకా అలాంటి అనేక మంది ఇప్పటికే తమ సోషల్ స్టేటస్కు బిగ్ బాస్ ద్వారా మరింత గ్లామర్ను జత చేసుకున్నారు అనేది తెలిసిందే.ఈ నేపధ్యంలో బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం అవుతోందనగానే సోషల్ మీడియా సెలబ్రిటీలు అప్రమత్తం అయిపోవడం, హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టడం సర్వ సాధారణంగా మారిపోయింది. అదే విధంగా బిగ్ బాస్ హౌస్లోకి వీరు వెళతారు వారు వెళ్లనున్నారు అంటూ సీజన్ మొదలయ్యే దాకా పుకార్లు షికార్లు చేయడమూ రివాజుగా మారింది.అయితే భవిష్యత్తులో వీరి ఆశలు నీరుగారనున్నాయా? ఇకపై బిగ్ బాస్ హౌస్లోకి సోషల్ మీడియా సెలబ్రిటీలకు నో ఎంట్రీ బోర్డు దర్శనమివ్వనుందా? ఇలాంటి సందేహాలు వచ్చేలా చేస్తున్నాయి కొన్ని తాజా నిర్ణయాలు, తాజా పరిణామాలు. ప్రస్తుతానికి తెలుగు బిగ్ బాస్కు సంబంధించినవి కాకపోయినా... ప్రాంతీయ బిగ్బాస్లు అన్నింటికీ పెద్దన్న లాంటి హిందీ బిగ్ బాస్ కు సంబంధించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని సమాచారం.హిందీలో బాలీవుడ్ దిగ్గజం సల్మాన్ఖాన్ సమర్పిస్తున్న బిగ్ బాస్ 19 గురించి వినిపిస్తోన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ సీజన్ కోసం మేకర్స్ గణనీయమైన ఫార్మాట్ మార్పును ప్లాన్ చేస్తున్నారు. గత సంవత్సరాలకు భిన్నంగా, రాబోయే రియాలిటీ షోలో యూ ట్యూబర్లు లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇక ఉండరని సమాచారం. బదులుగా, పోటీదారుల్లో పేరొందిన, స్థిరపడిన బాలీవుడ్ టీవీ రంగ ప్రముఖులు మాత్రమే ఉంటారు.టెల్లీ రిపోర్టర్ నివేదిక ప్రకారం, బిగ్ బాస్ 19 నిర్మాతలు సాంప్రదాయ వినోద పరిశ్రమల నుంచి ప్రసిద్ధి చెందిన పేర్లపై మాత్రమే దృష్టి సారించి, షోను దాని మూలాల వైపునకు నడిపించాలని నిర్ణయించుకున్నారు. ఈ షోకు మరింత సాంప్రదాయ గ్లామర్ అప్పీల్ ఇవ్వడం ద్వారా ప్రారంభకాలం నాటి సెలబ్రిటీ–కేంద్రీకృత ఫార్మాట్కు తిరిగి రావడమే లక్ష్యం గా పెట్టుకున్నారని, అందుకే ప్రధాన స్రవంతి నటుల మీదే దృష్టి సారించి బిగ్ బాస్ అసలు సారాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, విస్త్రుత అభిమానుల స్థాయితో వ్యూహాత్మక గేమ్ప్లేతో కొత్త యువ ప్రేక్షకులపై బలమైన ప్రభావాన్ని చూపగలిగారనేది నిజం. సోషల్ మీడియా సెలబ్రిటీల వల్ల వీక్షకుల సంఖ్య పెరిగారనేది నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే వీరి వల్ల షో తన అసలు స్వరూపాన్ని కోల్పోతుందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏదేమైనా సల్మాన్ బిగ్బాస్ ఈ కొత్త నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేసిన పక్షంలో అదే బాటను తెలుగు బిగ్ బాస్ కూడా అనుసరించే అవకాశాల్ని కొట్టి పారేయలేం. అదే జరిగితే ఈ సీజన్కు కాకపోయినా వచ్చే సీజన్పై సోషల్ మీడియా సెలబ్రిటీలు ఆశలు వదిలేసుకోవాల్సి రావచ్చు. -
దేశద్రోహుల లిస్టులో సన్నీ యాదవ్ ..?
-
బొక్కలిరుగుతాయ్.. అమెరికా టూరిస్ట్కు చేదు అనుభవం, వీడియో వైరల్
భారత దేశ పర్యటనకు వచ్చిన అమెరికన్ యూట్యూబర్కు చేదు అనుభవం ఎదురైంది. ఊహించని ఈ పరిణామానికి హతాశుడైన అతను తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కోల్కతాలో పర్యటిస్తున్న యూట్యూబర్ డస్టిన్ పట్ల స్థానిక టాక్సీ డ్రైవర్ దారుణంగా ప్రవర్తించాడు. ఉద్దేశపూర్వకంగా అతన్ని వేరే హోటల్కు తీసుకెళ్లి, ఎక్కువ ఛార్జీ వసూలు చేయాలని చూశాడు. దీంతోతనకు జరిగిన అవమానానికి సంబంధించిన వీడియోను డస్టిన్ తన యూట్యూబ్ (Youtube) ఛానల్లో అప్లోడ్ చేయగా ఇది వైరల్గా మారింది.ఆనందనగరం కోల్కతాను వీక్షించాలని వచ్చిన పర్యాటకుడి మొదటి రోజు పీడకలగా మారిపోయింది.అమెరికన్ వ్లాగర్ డస్టిన్ అనే కోల్కతా దర్శించేందుకు వచ్చాడు. కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న డస్టిన్ పార్క్ స్ట్రీట్లోని గ్రేట్ వెస్టర్న్ హోటల్కు వెళ్లేందుకు స్థానికంగా ఓ టాక్సీ ని బుక్ చేసుకున్నాడు. ప్రయాణ ప్రారంభమైన కొద్దిసేపటికే డ్రైవర్ దారి మళ్లించి, దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోని రాజార్హాట్ ప్రాంతంలోని ది వెస్టిన్ అనే వేరే హోటల్కి తీసుకెళ్లాడు. పైగా అతనితో వాగ్వాదానికి దిగాడు. అసలు చార్జీరూ.700 బదులుగా రూ.900 డిమాండ్ చేశాడు.ఇదీ చదవండి: నిద్ర ముంచుకు రావాలంటే.. బెస్ట్ యోగాసనాలుఇక్కడితో అయిపోలేదు....మరో వ్యక్తి (ఎర్ర చొక్కా ధరించిన వ్యక్తి) కల్పించుకొని డస్టిన్ను బెదరించడం మొదలు పెట్టాడు. మాఫియాతో తనకు సంబంధాలున్నాయ్.ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి బొక్కలు ఇరగదీస్తానంటూ రెచ్చిపోయాడు. అయినా డస్టిన్ బెదరలేదు. విషయాన్ని పూర్తిగా వివరించే ప్రయత్నం చేశాడు. అయినా రూ. 1000 డిమాండ్ చేశాడురెండోవాడు. ఆ తరువాత వారు డస్టిన్కోసం మరో టాక్సీని బుక్ చేశారు. అయితే ఈ సారి "పార్కింగ్ , పెట్రోల్" కోసం అదనంగా రూ. 100 చెల్లించాలని పట్టుబట్టడంతో మొత్తం చార్జీ రూ. 800కి పెరిగింది. ఇందదులో కొత్త డ్రైవర్కు కేవలం రూ.400 మాత్రమే ఇస్తున్నామని మాట్లాడుతుండగా డస్టిన్ తన వీడియోలో రికార్డ్ చేశాడు. అలాగే 50 నిమిషాలు పట్టాల్సిన ప్రయాణాన్ని 1 గంట 20 నిమిషాలకు పొడిగించారంటూ డస్టిన్ అసహనం వ్యక్తం చేశాడు. అయితే ఈ సంఘటన తన భారత్పై తనకున్న అభిప్రాయాన్ని మార్చలేదని, ఇండియా అద్భుతమైన దేశమంటూ పేర్కొన్నాడు. చదవండి: నటి భర్త, టైగర్ మ్యాన్ వాల్మీక్ థాపర్ ఇకలేరు.. ఎవరీ థాపర్? ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దేశానికి ప్రతిష్టకు భంగం అంటూ వ్యాఖ్యానించారు. విదేశీ పర్యాటకుల పట్ల ఇలా ప్రవర్తించడం మాకు సిగ్గుచేటు అని ఒకరు, మ“నేను వీడియో లింక్తో కోల్కతా పోలీసులకు ఫిర్యాదు చేశా,లాంటి పోకిరితనంపై వెంటనే చర్య తీసుకోవాలని అభ్యర్థించాను’’ అని మరొకరు కమెంట్చేశారు. ఆ బెంగాలీ వాలా చాలా మొరటుగా తిట్టుగాడు బెంగాలీని, సారీ అంమూ మరో యూజర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు వీడియో వైరల్ కావడంతో బిధన్నగర్ పోలీసులు స్పందించి ఇద్దరిని అరెస్టు చేశారు. డ్రైవర్ అలంగీర్ మొల్లా (34), అతడి సహచరుడు మనోజ్ కుమార్ రాయ్ (52)లపై బెదిరింపు, మోసం, క్రిమినల్ కుట్ర కేసులు నమోదు చేశారు. విదేశీయులపై ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. -
AP: ఒంటరి మహిళలు, వివాహితలే టార్గెట్.. యూట్యూబర్ అరెస్ట్
సాక్షి, తిరుపతి: తిరుపతిలో దారుణ ఘటన వెలుగు చూసింది. మహిళలను లైంగికంగా వేధిస్తున్న యూట్యూబర్ హేమాద్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి.. సోషల్ మీడియా వేదికగా మహిళలను వేధింపులకు గుర్తిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. తిరుపతిలో యూట్యూబర్ హేమాద్రిని తిరుచానూర్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నిందితుడు హేమాద్రి.. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలు, ఒంటరి మహిళలకు, వివాహితలతో పరిచయాలు పెంచుకున్నాడు. అనంతరం, వారితో సన్నిహితంగా ఉంటూ ఫొటోలు సేకరించాడు. కొద్ది రోజుల తర్వాత వారిని సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేసినట్టు బాధితులు.. పోలీసులు ఆశ్రయించారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. హేమాద్రిని అరెస్ట్ చేశారు. మరోవైపు.. హేమాద్రి అరెస్ట్ తెలియడంతో తిరుచానూర్, తిరుపతి, చంద్రగిరి నుంచి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడిని పోలీసులు విచారిస్తున్నట్టు తెలిపారు. -
యూట్యూబర్పై సుప్రీం ధిక్కార చర్యలు
న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానంలోని జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పంజాబ్ యూట్యూబర్ అజయ్ శుక్లాపై సుప్రీంకోర్టు మండిపడింది. సుప్రీం జడ్జీలపై అతడు చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా, ప్రతిష్టకు భంగం కలిగించేలా, ధిక్కార పూరితంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. సుమోటోగా అతడిపై ధిక్కార చర్యలు చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ల ధర్మాసనం శుక్రవారం..తక్షణమే శుక్లా వ్యాఖ్యలున్న వీడియోను తొలగించాలని, మరోసారి అదే వీడియోను కానీ, అలాంటి వీడియోను కానీ ప్రసారం చేయరాదంటూ అతడి వరప్రద్ మీడియా చానల్ను ఆదేశించింది. శుక్లా వ్యాఖ్యలు తీవ్రమైనవని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రం, పత్రికా స్వేచ్ఛకు కొన్ని పరిమితులున్నాయని ధర్మాసనం తెలిపింది. ఈ స్వేచ్ఛను అడ్డుపెట్టుకుని సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. శుక్లాపై ధిక్కారం కేసు నమోదు చేయాలని ఆదేశించింది. రిటైర్డు జస్టిస్ బేలా ఎం త్రివేదిపై వ్యాఖ్యలతో కూడిన వీడియోను శుక్లా తన యూట్యూబ్ చానల్లో ఇటీవల అప్లోడ్ చేశాడు. -
దేశాలు చూపిస్తానంటూ.. దేశ ద్రోహం
-
యూట్యూబర్ బయ్యా సన్నీ అరెస్టు కలకలం
సూర్యాపేటటౌన్, నూతనకల్: యూట్యూబ్ వ్లాగర్, బైక్ రైడర్ బయ్యా సన్నీయాదవ్ను నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అరెస్టు చేసినట్లు జరుగుతున్న ప్రచారంతో ఆయన స్వస్థలం సూర్యాపేట జిల్లా నూతనకల్లో కలకలం సృష్టించింది. సన్నీయాదవ్ ఇటీవల పాకిస్తాన్లో పర్యటించి.. తన యూట్యూబ్ చానల్లో ఆ పర్యటనకు సంబంధించిన బైక్ రైడింగ్ వీడియోలను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలపై ఇటీవల ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో చెన్నైలో సన్నీయాదవ్ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ కొంతమంది భారత సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను తన వేగులుగా మార్చుకోవటంతో వారిని భారత దర్యాప్తు సంస్థలు ఇటీవల అరెస్టు చేశాయి. ఈ కోణంలోనే సన్నీయాదవ్ను కూడా ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు ఆయనపై మార్చి 22న నూతనకల్లో కేసు నమోదైంది. ఈ కేసులో అతడికి బెయిల్ లభించింది. కొద్దిరోజుల క్రితం నూతనకల్ వచ్చి.. ఇటీవల తన స్నేహితుడిని కలిసేందుకు చెన్నై వెళ్లాడు. అక్కడే ఎన్ఐఏ అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయం తమకు తెలియదని సన్నీ కుటుంబసభ్యులు తెలిపారు. -
12 టీబీ డాటా డిలీట్ చేసి.. ఐఎస్ఐ ఏజెంట్లతో ముచ్చట్లు
పాకిస్తాన్కు గూఢచర్యం చేసిందన్న అభియోగాలు ఎదుర్కొంటున్న హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో.. తాజాగా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. పాక్ నిఘా సంస్థ.. కరడుగట్టిన ఐఎస్ఐ(Inter-Services Intelligence) అధికారులతో ఆమె నేరుగా పరిచయాలు కలిగి ఉందని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.33 ఏళ్ల జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra) ఏమాత్రం భయం లేకుండా వాళ్లతో పరిచయాలు పెంచుకుంది. ఒకరి తర్వాత మరొకరితో మాట్లాడింది కూడా. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ సందర్శన సందర్భంగా ఆమె వాళ్లను కలిసినట్లు తెలుస్తోంది. అయితే ఐఎస్ఐలో వాళ్లు ఏం పని చేసేవాళ్లో కనుగొనే పనిలో దర్యాప్తు అధికారులు తలమునకలయ్యారు. అంతకు ముందు..జ్యోతి వ్యక్తిగత డివైజ్లను(ఫోన్లు, ల్యాప్ట్యాప్) పోలీసులు సీజ్ చేశారు. ఆ డివైజ్ల్లో భారీగా మెసేజ్లు, డాటా డిలీట్ అయినట్లు గుర్తించారు. ఆ డిలీట్ డాటానే సుమారు 12 టీబీ(12 terabyte) దాకా ఉండొచ్చని తెలుస్తోంది. అందులోని సమాచారం ఈ కేసుకు ఉపకరించే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు రికవరీకి ప్రయత్నిస్తున్నారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) పేరిట భారత సైన్యం పాక్ భూభాగంతో పాటు పీవోకేలో వైమానిక దాడులు జరిపింది. ఆపై వారానికి(మే 15వ తేదీన ) యూట్యూబ్లో ట్రావెల్ వ్లోగింగ్ చానెల్ నడిపించే జ్యోతిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్కు గూఢచర్యం జరిపి ఉంటుందనే అనుమానిస్తున్నారు. పాక్, చైనాలో పర్యటనలతో పాటు పాక్లో జరిగిన హైప్రొఫైల్ ఈవెంట్లకు ఆమె హాజరు కావడం, కేవలం 4 లక్షల ఫాలోవర్స్ ఉన్న ఆమె విచ్చలవిడిగా అక్కడ ఖర్చులు చేయడం, అలాగే గన్మెన్లతో వీవీఐపీ ట్రీట్మెంట్ పొందిందన్న విషయం వెలుగులోకి రావడంపై దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతానికి.. అఫీషియల్స్ సీక్రెట్స్ యాక్ట్, భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద ఆమెపై హర్యానా పోలీసులు కేసులు నమోదు చేశారు. పాక్లో ఆమె అసలు వీఐపీ ట్రీట్మెంట్ ఎందుకు పొందింది? ఎలా పొందగలిగింది? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. అలాగే.. డిలీట్ చేసిన డాటాలో గనుక కీలక సమాచారం ఉన్నట్లయితే ఆమె చుట్టూ మరింత ఉచ్చు బిగిసే అవకాశం కనిపిస్తోంది. ఇంకోవైపు.. ఆమె ఆర్థిక లావాదేవీలపై విచారణ కోసం పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థల సాయం కోరే యోచనలో ఉన్నట్లు సమాచారం.ఇదీ చదవండి: విదేశీ భార్యల మోజు వద్దు! -
పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్కి సర్ప్రైజ్
ప్రముఖ యూట్యూబర్, విద్యావేత్త ఖాన్ సర్ వివాహం ఇపుడు వార్తల్లో నిలిచింది. ఆన్లైన్లో అత్యంత ప్రజాదరణ పొందిన విద్యావేత్తలలో ఒకరు ఖాన్ సర్. అనేక సంవత్సరాలుగా వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఆయన అసాధారణ బోధనా విధానాలు విద్యార్థులు ఆదరణతో ఆన్లైన్ ఆయనకు భారీ ఫాలోయింగే ఉంది. ఆయన అత్యంత నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. కానీ జూన్లో విద్యార్థులకోసం విందు ఇవ్వనున్నారు. జూన్ 2న రిసెప్షన్ పాట్నాలో జరగనుంది. ప్రస్తుతం ఖాన్ సర్ పెళ్లి వార్త నెట్టింట వైరల్గా మారింది.ఉత్తరప్రదేశ్లోని డియోరియాకు చెందినఖాన్ సర్ భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా, తాను ఎవరినీ ఆహ్వానించకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. దీనికి విడుదల చేసిన ఒక వీడియోలో తన విద్యార్థులతో ఈ వార్తను పంచుకున్నారు.భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వ్యక్తిగత వేడుకల కంటే దేశం పరిస్థితికి ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు.. జూన్ 2న రిసెప్షన్ తర్వాత, జూన్ 6న విద్యార్థులందరికీ ప్రత్యేక వివాహ విందును ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఖాన్ సర్ వెడ్స్, ఏఎస్ ఖాన్ అని పేరున్న పోస్టర్ తప్ప, ఆయన తన భార్య పేరును వెల్లడించలేదు. తన వ్యక్తిగత విషయాలను ఎపుడూ గోప్యంగా ఉంచే ఖాన్ సార్ వివాహంగా గుట్టుగా జరిగిపోవడం ఆయన అభిమానులను ఆశ్చర్యపర్చింది. రానున్న విందుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
పాక్లో జ్యోతి మల్హోత్రాకు వీఐపీ సెక్యూరిటీ
న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలతో నిఘా సంస్థలు యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra)ను అరెస్టు చేసిన దరిమిలా ఆమెకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర వివరాలు వెలుగు చూస్తున్నాయి. పాకిస్తాన్లోని లాహోర్లోని అనార్కలి బజార్లో జ్యోతి మల్హోత్రా నడుచుకుంటూ వెళుతుండగా, ఆమెకు ఏకే-47 పట్టుకున్న ఆరుగురు సాయుధులు కాపలాగా ఉండటానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన ఈ వీడియో మరిన్ని ఊహాగానాలకు ఊతమిస్తోంది. పాకిస్తాన్ భద్రతా సిబ్బంది(Pakistani security personnel)గా భావిస్తున్న ఆరుగురు ఆమెకు కాపలా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీడియోను పరిశీలనగా చూస్తే వారు ఆమెకు వీఐపీ తరహాలో భద్రతను అందిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోను చిత్రీకరించిన స్కాటిష్ యూట్యూబర్ కల్లమ్ మిల్ కూడా షాక్కు గురయ్యారు. సాధారణ యూట్యూబర్కు ఇంత భారీ భద్రత కల్పించడాన్ని తాను ఊహించలేదని వ్యాఖ్యానించారు.కల్లమ్ అబ్రాడ్ అనే ఛానల్ నడుపుతున్న స్కాటిష్ యూట్యూబర్ కల్లమ్ మిల్ గత మార్చిలో పాకిస్తాన్ను సందర్శించారు. లాహోర్(Lahore)లోని అనార్కలి బజార్లో పర్యటిస్తున్నప్పుడు ఆయన ఒక వీడియోను చిత్రీకరించారు. అందులో కొందరు వ్యక్తులు తుపాకులు పట్టుకుని ‘నో ఫియర్’ అనే లేబుల్ కలిగిన జాకెట్లు ధరించి కనిపిస్తున్నారు. కొద్దిసేపటికి జ్యోతి మల్హోత్రా ఫ్రేమ్లో కంటెంట్ను చిత్రీకరిస్తూ కనిపిస్తుంది. కల్లమ్ తనను తాను పరిచయం చేసుకుంటాడు. అప్పుడు ఆమె పాకిస్తాన్లో మొదటిసారి పర్యటిస్తున్నారా? అని అడుగుతుంది. దానికి అతను అతను "లేదు.. ఇది ఐదోసారి’ అని సమాధానం ఇస్తాడు.ఆ తర్వాత జ్యోతి అతనితో భారతదేశాన్ని సందర్శించారా? అని ఆరా తీస్తూ, తాను భారతదేశం నుండి వచ్చినట్లు పరిచయం చేసుకుంటుంది. కల్లమ్ పాకిస్తాన్ ఆతిథ్యం గురించి ఆమెను అడగగా ఇక్కడి ఆతిథ్యం చాలా బాగుందని సమాధానం ఇస్తుంది. జ్యోతితో పాటు నడుస్తుండగా సాయుధ వ్యక్తులు అనుసరిస్తుండటాన్ని కల్లమ్ గ్రహిస్తాడు. తరువాత వీడియోలో అతను ‘ఆమె అంత భద్రతా ఏర్పాట్ల మధ్య ఎందుకు ఉందో నాకు తెలియడంలేదు. ఆమె రక్షణకు అన్ని తుపాకుల అవసరం ఏమిటి? ఆమె చుట్టూ ఆరుగురు గన్మెన్లున్నారు’ అని వ్యాఖ్యానించాడు. ఈ ఫుటేజ్లో జ్యోతి మల్హోత్రాతో పాటు పలువురు పర్యాటకులు కూడా కనిపిస్తారు. ఈ వీడియో జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్తో ఉన్న సంబంధాలపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇది కూడా చదవండి: COVID-19: వెయ్యిదాటిన కేసులు.. దేశమంతటా అప్రమత్తం -
ఐఎస్ఐ ఏజెంట్లను కలిశా
చండీగఢ్: గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయిన మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పోలీసు కస్టడీలో కొత్త విషయాలను బయటపెట్టారు. పాకిస్తాన్లోని నిఘా అధికారులతో తనకు పరిచయం ఉందని, పాకిస్తాన్లో వాళ్లను కలిశానని ఆమె ఒప్పుకున్నారు. మే 13న దేశ బహిష్కరణకు గురైన ఢిల్లీలోని పాక్ హైకమిషన్ ఉద్యోగి డ్యానిష్తో తాను తరచుగా యాప్స్ ద్వారా సంప్రదింపులు జరిపానని ఆమె వెల్లడించారు. పాక్కు వెళ్లేందుకు అవసరమైన వీసా సాధించేందుకు ఢిల్లీలోని పాక్ హైకమిషన్కు 2023 నవంబర్లో తొలిసారిగా వెళ్లినప్పుడు అక్కడి ఉద్యోగి డ్యానిష్ అలియాస్ ఎహ్సార్ ఉర్ రహీమ్తో పరిచయం ఏర్పడిందని ఆమె తెలిపారు. అరెస్ట్ తర్వాత పోలీసులు జ్యోతికి చెందిన మూడు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు. ఇంకొన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలనూ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జ్యోతిని జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటెలిజెన్స్ బ్యూరో, మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గత రెండేళ్లలో మూడుసార్లు పాకిస్తాన్కు వెళ్లడంతోపాటు చైనా, బంగ్లాదేశ్ ఇతర దేశాల్లో జ్యోతి పర్యటించారు. ఆపరేషన్ సిందూర వేళ భారత్, పాక్ సైనిక చర్యల సమయంలోనూ డ్యానిష్తో జ్యోతి సంప్రతింపులు జరిపినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆమె నాలుగు బ్యాంక్ అకౌంట్లను విశ్లేషిస్తున్నారు. జ్యోతి పాక్ జాతీయుడిని పెళ్లాడినట్టు, మతం మారినట్లు ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. -
‘నన్ను పెళ్లి చేసుకోవా’.. పాక్ ఐఎస్ఐ ఏజెంట్తో జ్యోతి మల్హోత్రా
న్యూఢిల్లీ: పాకిస్తాన్ (Pakistan) ఐఎస్ఐ (isi)కు దేశానికి చెందిన రహస్య సమాచారాన్ని చేరవేశారనే ఆరోపణలతో అరెస్టయిన జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత వారం కేంద్ర దర్యాప్తు సంస్థలు జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నాయి. వీరి విచారణలో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఐఏస్ఐ ఏజెంట్ అలీ హసన్తో నిరంతరం టచ్లో ఉన్నట్లు తేలింది.అంతేకాదు వీరి ఇద్దరి మధ్య ఎమోషనల్గా జరిగిన వాట్సప్ చాటింగ్ను గుర్తించారు. ఆ చాటింగ్లో ఐఏస్ఐ ఏజెంట్ అలీ హసన్ తనని పాకిస్తాన్లో పెళ్లి చేసుకోవాలని (Get Me Married) జ్యోతి మల్హోత్రా కోరినట్లు తెలిపారు. ఆ చాట్లో భారత సైన్యానికి సంబంధించిన సమాచారం సైతం జ్యోతి షేర్ చేసిందని,కొన్ని సంభాషణలు కోడ్ రూపంలో ఉండగా, అవి గూఢచారి కార్యకలాపాలకు సంబంధించివే అని నిర్ధారించారు.దుబాయ్ నుంచి డబ్బులువాట్సప్ చాట్తో పాటు జ్యోతి మల్హోత్రా ఆర్దిక లావాదేవీలపై కన్నేశారు. ఆమెకు నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఉండగా..అందులో ఒక అకౌంట్కు దుబాయ్ నుండి డబ్బులు వచ్చాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ ఖాతాలన్నింటినీ అధికారులు పరిశీలిస్తున్నారు. పోలీసుల అదుపులో పలువురుభారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధవాతావరణం పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత భద్రత వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. జ్యోతి మల్హోత్రా అరెస్టుతో భారత్కు చెందిన సైనిక రహస్యాల్ని పాక్కు చేరవేస్తున్నారనే ఆరోపణలతో దేశానికి చెందిన 10మందిని భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి.వీరు ప్రధానంగా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్కు చెందిన వారిని తేలింది. -
యూట్యూబ్లో జ్యోతి మల్హోత్రా సంపాదన ఎంతంటే..
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేశారనే ఆరోపణలతో ‘ట్రావెల్ విత్ జో’(Travel with Jo) పేరిట ట్రావెల్ వ్లాగ్ నిర్వహిస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను మే 17 పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపధ్యంలో పలువురు ఆమెకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు సెర్చ్ ఇంజిన్ను ఆశ్రయిస్తున్నారు.జ్యోతి మల్హోత్రా అరెస్టు ఆన్లైన్ కమ్యూనిటీ(Online community)ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేంది. మల్హోత్రా.. భారత్తోపాటు విదేశాలలో తన ప్రయాణిస్తూ, వాటిని డాక్యుమెంట్ చేయడం ద్వారా ప్రజాదరణ పొందారు. యూట్యూబ్లో ఆమెకు 3.77 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో1.33 లక్షల మంది అనుచరులు ఉన్నారు. జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ వ్యూవర్ షిప్ విషయానికొస్తే ఆమె రూపొందించిన ఒక్కో వీడియోకు 50 వేల వీక్షణలు దక్కుతుంటాయి. ఆమె సాధారణంగా నెలకు 10 వీడియోలను పోస్ట్ చేస్తుంటారు.వీక్షకుల సంఖ్య ఆధారంగా ఆమెకు యూట్యూబ్ నుంచి నెలవారీ ఆదాయం రూ.40,000 నుంచి రూ. 1.2 లక్షల మధ్య ఉండవచ్చనే అంచనాలున్నాయి. మల్హోత్రా స్పాన్సర్షిప్ల నుండి కూడా సంపాదిస్తుంటారు. ట్రావెల్ గేర్ బ్రాండ్లు, హోటళ్లు, ఎయిర్లైన్స్, ట్రావెల్ యాప్లు అమెకు ఆదాయాన్ని అందిస్తుంటాయి. ఆమె స్థాయి క్రియేటర్లు సాధారణంగా స్పాన్సర్ చేసిన పోస్ట్కు రూ. 20,000 నుండి రూ.50,000 వరకు ఛార్జ్ చేస్తుంటారు. మల్హోత్రా గత మూడు సంవత్సరాలుగా వ్లాగింగ్ చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘హార్ట్ ల్యాంప్’కు బుకర్ ప్రైజ్.. కన్నడ రచయిత్రి బాను ఏం రాశారు? -
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో బిగ్ అప్డేట్
-
జ్యోతి మల్హోత్రా డైరీలో సంచలన వివరాలు
న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra) కేసులో మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. తన పాకిస్తాన్ పర్యటనలను వివరించే పలు వీడియోలను జ్యోతి మల్హోత్రా సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసిన దరిమిలా ఆమె వార్తల్లో నిలిచారు. 33 ఏళ్ల ఈ యూట్యూబర్ను పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేశారనే ఆరోపణలతో అరెస్టు చేశారు.ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటెలిజెన్స్ బ్యూరో(Intelligence Bureau)లు జ్యోతి మల్హోత్రా కేసును దర్యాప్తు చేస్తున్నాయి. తాజాగా ఆమె డైరీలోని రెండు పేజీలు సంచలన వివరాలను వెల్లడిస్తున్నాయి. వీటిలో ఆమె పాకిస్తాన్లో 10 రోజుల పాటు ఎలా గడిపారనే వివరాలున్నాయని సమచారం. ఈ డైరీని హర్యానా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో ‘ఈ రోజు, నేను పాకిస్తాన్లో 10 రోజుల పర్యటన ముగించుకుని, నా దేశమైన భారతదేశానికి తిరిగి వచ్చాను. ఈ పర్యటనలో నాకు పాకిస్తాన్ ప్రజల నుండి ఎంతో ప్రేమ లభించింది. మా శ్రేయోభిలాషులు మమ్మల్ని కలవడానికి వచ్చారు. మేము లాహోర్ను సందర్శించడానికి రెండు రోజులు సరిపోలేదు’ అని తేదీ లేని ఆ పేజీలో జ్యోతి మల్హొత్రా రాసినట్లు ఉంది.పాకిస్తాన్ను రంగులమయంగా అభివర్ణించిన ఆమె అక్కడి తన అనుభవాలను మాటల్లో వర్ణించలేమని పేర్కొంది. డైరీలోని ఎంట్రీలలో ఆమె పాకిస్తాన్ అధికారులకు చేసిన ఒక అభ్యర్థన వివరాలు ఉన్నాయి. ‘పాక్లోని దేవాలయాలను కాపాడండి. 1947లో వారు విడిపోయిన కుటుంబాలను భారతీయులతో కలవనివ్వండి’ అని ఆమె పేర్కొంది. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రాను మే 16న అరెస్టు చేసిన అధికారులు.. ఆమెపై అధికారిక రహస్యాల చట్టం, భారతీయ న్యాయ సంహితలోని వివిధ విభాగాల కింద కేసులు నమోదు చేశారు.ఇది కూడా చదవండి: ‘స్వర్ణదేవాలయంలో వైమానిక రక్షణ తుపాకులు మోహరించలేదు’ -
ఐఎస్ఐ ఏజెంట్ జ్యోతి మల్హోత్రా!
చండీగఢ్/న్యూఢిల్లీ: ఇండియన్ అండర్కవర్ ఏజెంట్లను గుర్తించడానికి పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra)(33)ను వాడుకుందా? నిజమేనని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఐఎస్ఐ హ్యాండ్లర్ అలీ హసన్తో వాట్సాప్లో జ్యోతి చేసిన చాటింగ్లను వెలికి తీశారు. ఇద్దరి మధ్య కోడ్ భాషలో ఈ చాటింగ్లు జరిగాయి. ఒక చాటింగ్ను పరిశీలిస్తే.. భారత అండర్కవర్ ఏజెంట్ల వివరాలు, వారి ఆపరేషన్ల గురించి అలీ హసన్ ఆమెను ప్రశ్నించాడు.భారత్–పాక్ సరిహద్దు అయిన అటారీ బోర్డర్ను సందర్శించినప్పుడు ప్రత్యేక ప్రోటోకాల్ ఉన్న అండర్కవర్ ఏజెంట్లను చూశావా? అని ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని జ్యోతి బదులిచ్చింది. ప్రోటో కాల్ అందుకున్నవారే అండర్ కవర్ ఏజెంట్లు కావొ చ్చు అని అలీ హసన్ చెప్పగా, అలాంటి వారిని తాను చూడలేదని పేర్కొంది. భారత నిఘా ఏజెంట్ల గుట్టుమట్లు తెలుసుకోవడానికి జ్యోతిని అస్త్రంగా ఉపయోగించినట్లు అంచనా వేస్తున్నారు. ఐఎస్ఐ కోసమే పని చేస్తున్నట్లు ఆమెకు పూర్తి అవగాహన ఉందని పేర్కొంటున్నారు. పాకిస్తాన్కు సంబంధించిన భారీ గూఢచార ముఠాలో ఆమె ఒక కీలక సభ్యురాలని నిర్ధారణకు వచ్చారు. జ్యోతి తొలిసారిగా 2023లో బైశాఖి పండుగ సమయంలో పాకిస్తాన్లో పర్యటించింది. ఈ సరిహద్దులు ఇంకా ఎన్నాళ్లో.. జ్యోతి మల్హోత్రా వ్యక్తిగత డైరీ దర్యాప్తు అధికారుల చేతికి చిక్కింది. ఆమె తన ఆలోచనలు, పర్యటనల గురించి ఇందులో రాసుకుంది. పాకిస్తాన్ ప్రస్తావన సైతం ఉంది. డైరీలో 11 పేజీల్లో రాయగా.. 8 పేజీల్లో సాధారణ అంశాలు, 3 పేజీల్లో పాకిస్తాన్ గురించి హిందీ, ఇంగ్లిష్ భాషలో రాతలు కనిపిస్తున్నాయి. ‘‘పాకిస్తాన్ ప్రజల ఆదరణ, వారి అతిథి మర్యాదలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాకిస్తాన్లో భారతదేశ హిందువుల పర్యటనలు ఇంకా పెరగాలని కోరుకుంటున్నా. పాకిస్తాన్లోని తమ పూరీ్వకుల గ్రామాలను హిందువులు సందర్శించాలి.అక్కడి హిందూ ఆలయాలు, గురుద్వారాలకు సులువుగా వెళ్లొచ్చే పరిస్థితులు రావాలి. 1947లో దేశ విభజన తర్వాత విడిపోయిన కుటుంబాలు మళ్లీ కలిస్తే బాగుంటుంది. పాకిస్తాన్లో పది రోజుల పర్యటన పూర్తి చేసుకొని ఈ రోజే ఇండియాకు తిరిగొచ్చా. రెండు దేశాల మధ్య ఈ సరిహద్దులు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. బాధపడే హృదయాలకు ఉపశమనం కలగాలి. మనమంతా ఒకే దేశం, ఒకే నేలకు చెందినవాళ్లం’’ అని జ్యోతి తన డైరీలో రాసుకుంది. మరోవైపు ఆమె కశీ్మర్ పర్యటనల వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.అర్ధరాత్రి పొద్దుపోయే దాకా పనిచేయడం ఆమెకు అలవాటు అని గుర్తించారు. రాత్రి ఒంటి గంట సమయంలో వీడియోలను ఎడిటింగ్ చేసి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుండేదని చెప్పారు. చాలా సందర్భాల్లో ఢిల్లీకి వెళ్తున్నానని ఇంట్లో వాళ్లకు చెప్పి మరోచోటుకి వెళ్లినట్లు గుర్తించారు. జ్యోతి వ్యవహారం తెలిసి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఆమె ఫోటోలన్నీ తొలగించారు. తన బిడ్డ సంగతి తనకు తెలియదని, దీనిపై తనను ఏమీ ప్రశ్నించవద్దని జ్యోతి తండ్రి స్పష్టం చేశారు. నిందితురాలిపై ప్రశ్నల వర్షంయూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)తోపాటు ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. పూర్తి సమాచారం రాబట్టానికి భిన్న కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. జ్యోతి మల్హోత్రా ఆర్థిక లావాదేవీలు, ప్రయాణాల వివరాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. ఆమె పాకిస్తాన్, చైనాతోపాటు ఇతర దేశాల్లో పర్యటించినట్లు తెలుస్తోంది. ‘ట్రావెల్ విత్ జో’ అనే యూట్యూబ్ చానల్ నిర్వహిస్తూ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ నెల 16న ఆమెను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశారు. గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్లో గత రెండు వారాల్లో మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. ఆదాయానికి, ఖర్చులకు పొంతనేదీ?ఇదిలా ఉండగా, నిందితురాలు జ్యోతి మల్హోత్రా ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ పర్యటించింది, ఎవరిని కలిసిందీ పూర్తి వివరాలు తెలిస్తే వాటన్నింటినీ క్రోడీకరిస్తామని, దానివల్ల దర్యాప్తు వేగంగా ముందుకు సాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. యూట్యూబ్ చానల్ ద్వారానే తనకు ఆదాయం వస్తోందని నిందితురాలు చెబుతుండగా, అధికారులు విశ్వసించడం లేదు. ఆమెకు వచ్చిన ఆదాయానికి, విదేశీ పర్యటనలకు అయిన ఖర్చులకు పొంతన లేదని అంటున్నారు. అందుకే ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వివరాలు కూపీ లాగుతున్నారు.జ్యోతి ల్యాప్టాప్పై ఫోరెన్సిక్ విశ్లేషణ జరుగుతోందని అధికారులు చెప్పారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్–పాకిస్తాన్ మధ్య నాలుగు రోజులపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో జ్యోతి మల్హోత్రా ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేసే ఓ అధికారిని తరచుగా కలిసింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సిబ్బందితో ఆమెకు ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నట్లు ఓ పోలీసు అధికారి చెప్పారు. సోషల్ మీడియా ద్వారా జనంలో గుర్తింపు పొందినవారిని నియమించుకొని, దేశ రహస్యాలు కొల్లగొట్టడం ఆధునిక యుద్ధరీతిలో ఒక భాగంగా మారిందని తెలిపారు. -
NIA విచారణ, జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు
చండీఘడ్: గూఢచర్యం ఆరోపణలతో అరెస్టైన జ్యోతి మల్హోత్రా కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏఎన్ఐ విచారణలో ఆమె పాకిస్తానీ ఏజెంట్లతో నేరుగా సంబంధాలు కొనసాగించిందని, వాటిని రహస్యంగా ఉంచేందుకు పలు ఎన్క్రిప్టెడ్ డివైజ్లు వినియోగించినట్లు తేలింది. ఎన్ఐఏ విచారణలో ఆమె సోషల్ మీడియాను వీడియోలు పోస్టు చేస్తూ ప్రపంచానికి తాను వ్లాగర్గా ప్రమోట్ చేసుకుంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే? ఎన్క్రిప్టెడ్ డివైజ్లను ఉపయోగించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా పాకిస్తానీ ఏజెంట్లతో క్రమం తప్పకుండా టచ్లో ఉండేదని హర్యానా పోలీసులు తెలిపారు. హర్యానా రాష్ట్రం హిస్సార్కు చెందిన జ్యోతి ‘ట్రావెల్ విత్ జో’పేరిట ఒక యూట్యూబ్ ఛానెల్ను నిర్వహిస్తున్నారు. ఈ ఛానెల్కు 3.77 లక్షల మంది సబ్స్కైబర్లు ఉన్నారు. ఈమె ట్రావెల్విత్జో1 ఇన్స్టా గ్రామ్ ఖాతాకు 1,32,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. చైనా, పాకిస్తాన్, ఇండోనేసియాల్లోనూ వీడియోలు తీసింది. అమె తీసిన యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా పోస్టుల్లో భారతీయులకు పాకిస్తాన్ మంచి దేశంగా చూపించే ప్రయత్నం చేయడం,ఉగ్రదాడికి ముందు పహల్గాంలో పర్యటన, ఢిల్లీలోని పాక్ దౌత్య కార్యాలయం ఉద్యోగి ఇషాన్ దార్తో సన్నిహితంగా ఉండడంతో మే 16న జ్యోతిపై సివిల్ లైన్స్ పోలీస్స్టేషన్లో ఎఫ్ ఐఆర్ నమోదైంది.గూఢచర్యం కేసులో ఆమెను కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఈ విచారణలో ఈషాన్ దార్తో సన్నిహిత సంబంధాలు, పాకిస్తాన్లో పర్యటన, ఐఎస్ఐతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. దీంతో పాటు పహల్గామ్ ఉగ్రదాడికి ముందు కశ్మీర్ సందర్శన, కశ్మీర్ పర్యటనకు ముందు పాకిస్తాన్కు వెళ్లడం, ఈ రెండు పర్యటనల మధ్య సంబంధం ఉందా? అన్న కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ విచారణను వేగవంతం చేశాయి. ఈ క్రమంలో జ్యోతి మల్హోత్రా అరెస్ట్పై ఆమె తండ్రి హరీష్ మల్హోత్రాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడం కొత్త అనుమానాలకు తెరతీసినట్లైంది.ఒక సారి తన కుమార్తె జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ కోసం వీడియోలు షూట్ చేసేందుకు ఢిల్లీ వెళుతున్నట్లు తనకు చెప్పిందని, కానీ పాకిస్తాన్కు వెళ్లిన విషయం తనకు తెలియదని చెప్పారు. మరోసారి ఢిల్లీకి కాదు తాము ఉంటున్న ఇంట్లోనే వీడియోలు తీసేదని చెప్పారు. ఇంకోసారి తన కూతురు తాను ఏం చేస్తుందో ఎప్పుడూ చెప్పలేదని జ్యోతి తండ్రి హరీష్ మల్హోత్రా చెప్పడంపై చర్చాంశనీయంగా మారింది. -
యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా తో పాటు మొత్తం 11 మంది అరెస్ట్
-
ISI ఏజెంట్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
-
గూఢచర్యం ఆరోపణలపై మహిళా యూట్యూబర్ అరెస్ట్
చండీగఢ్: హరియాణాకు చెందిన ప్రముఖ మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కు అనుకూలంగా గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులు అరెస్ట్చేశారు. పాకిస్తాన్ సైనిక నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కు భారతదేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని చేరవేశారని జ్యోతిపై పోలీసులు అధికార రహస్యాల చట్టం, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద కేసు నమోదుచేశారు. శుక్రవారం ఆమెను హరియాణాలోని హిస్సార్లోని న్యూ అగ్రసేన్ ఎక్స్టెన్షన్ కాలనీలో అరెస్ట్చేశారు. స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా జ్యోతిని ఐదు రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ జడ్జీ ఉత్తర్వులు జారీచేశారు. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లోని ఒక ఉద్యోగితో జ్యోతి రహస్య సమాచారాన్ని పంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాకిస్తానీ అధికారిని మే 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం తక్షణం భారత్ను వీడాలని ఆదేశించడం తెల్సిందే. పంజాబ్ పోలీసుల దర్యాప్తులో జ్యోతి విషయం వెలుగులోకి వచి్చనట్లు తెలుస్తోంది. పాకిస్తానీ అధికారితో కలిసి గూఢచర్యం కేసులో పంజాబ్ పోలీసులు ఇప్పటికే ఒక మహిళ సహా ఇద్దరిని అరెస్ట్ చేయడం తెల్సిందే. ఎవరీ జ్యోతి? హిస్సార్కు చెందిన జ్యోతి ‘ట్రావెల్ విత్ జో’పేరిట ఒక యూట్యూబ్ ఛానెల్ను నిర్వహిస్తున్నారు. ఈ ఛానెల్కు 3.77 లక్షల మంది సబ్స్రై్కబర్లు ఉన్నారు. ట్రావెల్ బ్లాగర్గా ఉంటూ దేశంలోని పలు ప్రాంతాలను పర్యటిస్తూ ఎన్నో వీడియోలు తీసి పోస్ట్చేశారు. ఈమె ట్రావెల్విత్జో1 ఇన్స్టా గ్రామ్ ఖాతాకు 1,32,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. చైనా, పాకిస్తాన్, ఇండోనేసియాల్లోనూ వీడియోలు తీసింది. మే 16న జ్యోతిపై సివిల్ లైన్స్ పోలీస్స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం జ్యోతి రెండేళ్ల క్రితం పాకిస్తాన్ వీసా కోసం ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు వెళ్లింది. అక్కడ ఎహ్సాన్ ఉర్ రహీమ్ అలియాస్ డ్యానిష్ తో ఈమెకు పరిచయం ఏర్పడింది. తర్వాత వీసా లభించాక మూడు సార్లు పాకిస్తాన్కు వెళ్లి వచ్చింది. ఆ సమయంలో డ్యానిష్ ఆదేశానుసారం అలీ అహా్వన్ అనే వ్యక్తి ఈమెకు పాక్లో బస, రవాణా ఏర్పాట్లుచేశాడు. పాకిస్తాన్లో పర్యటించిన కాలంలో జ్యోతి అక్కడి ఐఎస్ఐ అధికారులను కలిసింది. షకీర్, రాణా షహ్బాజ్లతో పరిచయం పెంచుకుంది. షహ్బాజ్ ఫోన్నంబర్ను ఎవరూ గుర్తుపట్టకుండా తన స్మార్ట్ఫోన్లో జాట్ రంధావా అనే వేరే పేరుతో సేవ్చేసింది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాప్ యాప్లలో మాత్రమే వివరాలు పంపించేది. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు తరచూ వెళ్తూ అక్కడ డ్యానిష్ను ఎక్కువగా కలిసేది. అతని ద్వారా పాకిస్తానీ నిఘా బృందాలతో సంప్రతింపులు జరిపి భారత్కు చెందిన సున్నిత సమాచారాన్ని చేరవేసేది. డ్యానిష్ తో ఈమెకు శారీరక సంబంధం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి ఇండోనేసియాలోని బాలీ ద్వీపానికీ వెళ్లొచ్చారు. ఇటీవల పాకిస్తాన్ అనుకూల వీడియోలు తీసి పోస్ట్చేసింది. పాక్లో కతాస్ రాజ్ టెంపుల్సహా పలు హిందూ ఆలయాల్లో వీడియోలు తీసి పాకిస్తాన్ పట్ల ఇండియన్లలో మంచి అభిప్రాయం పెరిగేందుకు ప్రయత్నించింది. -
పాకిస్థాన్ స్పైగా హర్యానా యూట్యూబర్.. జ్యోతి మల్హోత్రా అరెస్ట్
ఢిల్లీ: హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్లో ఐఎస్ఐ ఏజెంట్గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. జ్యోతి మల్హోత్రాతో పాటు మరో ఆరుగురి అరెస్ట్ను చేశారు. భారత సైనిక సమాచారాన్ని పాక్కు చేరవేసిన జ్యోతి మల్హోత్రా.. ఇటీవల ట్రావెల్ వీసాపై పాకిస్థాన్లో రెండుసార్లు పర్యటించారు. పాకిస్తాన్ అధికారి ఎహ్సాన్ రహీంను కలిసిన జ్యోతి మల్హోత్రా.. ఆ దేశానికి కీలక సమాచారం చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ నెట్వర్క్ హర్యానా, పంజాబ్ అంతటా విస్తరించినట్లు తేలింది. వీరంతా పాక్ ఐఎస్ఐకి ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. జ్యోతి.. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతోంది. ఆమె ఎవరికీ అనుమానం రాకుండా పాక్ అధికారులకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తేలింది. ఈ కేసులో జ్యోతి మల్హోత్రా ట్రావెల్ వ్లాగర్తో కలిసి పని చేస్తున్నట్లు గుర్తించారు. మరో ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్పడి హర్యానా, పంజాబ్ నుంచి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ ఉద్యోగి ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్తో జ్యోతి మల్హోత్రా పరిచయాలు పెంచుకుంది.డానిష్ను ప్రభుత్వం ఇటీవేల బహిష్కరించిన విషయం తెలిసిందే. డానిష్ గురించి కూపీ లాగడంతో జ్యోతి గూఢచార్యం సంగతి బట్టబయలైంది. పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్లకు జ్యోతి మల్హోత్రాను డానిష్ పరిచయం చేసినట్లు తేలింది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్ట్ చేసిన ప్లాట్ఫామ్ల ద్వారా పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్లతో నిత్యం టచ్లో ఉంటున్నట్లు తేలింది.ఈ ప్లాట్ఫామ్స్ ద్వారానే భారత్కు చెందిన కీలక సమాచారాన్ని పాక్ అధికారులకు చేరవేసినట్లు సమాచారం. ‘జాట్ రంధావా’ అని సేవ్ చేసుకున్న ఓ పేరు షకీర్ అలియాస్ రాణా షాబాజ్ అనే పాకిస్థాన్ వ్యక్తిదిగా అధికారులు గుర్తించారు. గడిచిన రెండేళ్లలో మూడు సార్లు పాకిస్తాన్కు వెళ్లిన జ్యోతి.. యూట్యూబ్ వీడియోల కోసం చైనా, బంగ్లాదేశ్, థాయిలాండ్, నేపాల్, భూటాన్, యూఏఈ దేశాల్లో కూడా పర్యటించింది.పాక్ ఇంటలిజెన్స్ అధికారితో సన్నిహిత పెంచుకుని ఇద్దరూ ఇటీవల ఒక వారం పాటు ఇండోనేషియాలోని బాలి వెళ్లినట్లు గుర్తించిన అధికారులు. జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరింత సమాచారం సేకరించే పనిలో పడ్డారు. -
ఆపరేషన్ సిందూర్పై అలహాబాదియా వివాదాస్పద పోస్ట్
న్యూఢిల్లీ: పాడ్కాస్టర్ రణ్వీర్ అలహాబాదియా మరో వివాదంలో చిక్కుకున్నాడు. ‘పాకిస్తానీ అన్నదమ్ములారా, అక్కచెల్లెలారా’ అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసిన రణ్వీర్.. వ్యతిరేకంగా విమర్శలు వెల్లువెత్తడంతో పోస్ట్ను తొలగించాడు. పహల్గాం ఉగ్రవాదాడి అనంతరం.. పాక్లోని ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీనిపై యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశాడు. ‘‘ప్రియమైన పాకిస్తానీ సోదర సోదరీమణులారా.. ఇది రాయడం వల్ల మరో వివాదానికి ఆహ్వానం పలుకుతానని నాకు తెలుసు. చాలా మంది భారతీయులు నాపై ద్వేషం చిందిస్తారు. అయితే.. చాలా మంది భారతీయుల్లా నా హృదయంలో మీ మీద ద్వేషం లేదు. ఎందుకంటే మీలో చాలా మంది మాలాగే శాంతిని కోరుకుంటున్నారు. తరువాత ఎప్పుడైనా మేము మిమ్మల్ని కలిసినప్పుడు మమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తారు. మేం ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాం అనిపిస్తే క్షమించేయండి. మిమ్మల్ని కలిసినప్పుడు భారతీయులు కచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. కానీ, ఇప్పుడు రెండు దేశాల్లో మీడియా చానళ్లు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయి. ఇరుదేశాల్లోని ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. సరిహద్దుల్లో ఉండే ప్రజలు క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. కానీ.. పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ కలిసి పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని అంతం చేయాలని భారత్ కోరుకుంటోంది. ఉగ్రవాదాన్ని ఆర్మీ పెంచి పోషిస్తుందనడానికి మూడు ఉదాహరణలున్నాయి. ఒకటి.. ఇన్నేళ్లలో పట్టుబడిన ఉగ్రవాదులంతా పాకిస్తాన్వారే. రెండోది.. జైషే మహ్మద్ చీఫ్ సోదరుడు హఫీజ్ అబ్దుర్ రవూఫ్ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించారు. దానికి పాక్ మిలిటరీ అధికారులు కూడా హాజరయ్యారు. మూడోది.. పాక్ రక్షణ శాఖా మంత్రి ఖవాజా ఆసిఫ్ స్కై న్యూస్తో మాట్లాడుతూ టెర్రరిజాన్ని పాక్ ప్రభుత్వమే పెంచి పోషిస్తోందని అంగీకరించాడు. అయినా.. పాకిస్తాన్ ప్రజల పట్ల మాకు సానుభూతి ఉంది. ఈ ఆపరేషన్ భారతీయులు, పాకిస్తానీయుల మధ్య యుద్ధం కాదు. భారత్.. పాకిస్తాన్ మిలిటరీ, ఐఎస్ఐపై చేస్తున్నది. శాంతి కొనసాగుతుందని ఆశిస్తున్నా’’ అని పోస్టులో పేర్కొన్నాడు. రణ్వీర్ పోస్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన భారత ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే కాదు, భారత ఆర్మీని కూడా అవమానించాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతిస్తున్నాడని మండిపడ్డారు. దీంతో.. ఆయన పోస్టును డెలిట్ చేశారు. రణ్వీర్ అల్లహాబాదియా ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మొదటిసారి కాదు. తల్లిదండ్రుల గురించి అనుచిత జోకులు వేసినందుకు ఈ ఏడాది ప్రారంభంలో అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. -
యూట్యుబర్ అన్వేష్ పై కేసు నమోదు
-
ప్రపంచ యాత్రికుడు అన్వేష్పై కేసు
హైదరాబాద్, క్రైమ్: ప్రముఖ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేష్ (Na Anvesh)పై సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీతో పాటు పలువురు ప్రముఖులపై తప్పుడు వ్యాఖ్యలు చేశాడనే అభియోగం అతనిపై నమోదు అయినట్లు సమాచారం.ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ.. తెగ ఎంజాయ్ చేసేస్తూ.. ఆ వీడియోలను అప్లోడ్ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బూలు సంపాదించుకుంటున్నాడు అన్వేష్. అయితే.. తాజాగా బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో.. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్రాజు తదితరులు రూ.300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా అతను వ్యాఖ్యలు చేశారట. అయితే అన్వేష్ అవాస్తవ, తప్పుడు సమాచారం ప్రచారం చేశారంటూ పోలీసులు సుమోటో(Suo moto)గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు, చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు.. పరువుకు భంగం కలిగించేలా వీడియో ఉంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా.. ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా ఆ వీడియో ఉంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్ మీద చర్యలు తీసుకోవాలి అని సైబర్క్రైమ్ ఠాణా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ పోలీసులు అన్వేష్పై కేసు నమోదు చేశారు. దీనిపై అన్వేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి. -
మధుమతి అనుమానాస్పద మృతి.. వివాహేతర సంబంధమే కారణం
సాక్షి, ఎన్టీఆర్: ఏపీకి చెందిన ప్రముఖ తెలుగు యూట్యూబర్ మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం సృష్టించింది. మధుమతి తన అమ్మమ్మ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆమె మృతికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది.వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్నపేట మండల పరిధిలోని ఏ కొండూరు గ్రామానికి చెందిన మధుమతి(22) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేది. ఇన్స్టాగ్రామ్ (Instagram)లో రీల్స్ చేస్తూ తనకుంటూ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకుంది. అదేవిధంగా లక్షల్లో సబ్స్క్రైబర్లు ఆమె సొంతం. ఈ క్రమంలోనే మధుమతికి అప్పటికే వివాహం అయిన ప్రతాప్ (Prathap)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొన్నాళ్లకు వివాహేతర బంధానికి దారి తీసింది.అయితే, ఉన్నట్టుండి మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తాజాగా మధుమతి తన అమ్మమ్మ ఇంటికి వెళ్లగా.. అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, తమ కుమార్తె ఆత్మహత్యకు ప్రతాప్ కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని మధుమతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో యూట్యూబర్ అనుమానాస్పద మృతిఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో మధుమతి అనే యూట్యూబర్ అనుమానాస్పద మృతిఏ కొండూరు గ్రామానికి చెందిన మధుమతి (22)కి తెల్లదేవరపల్లికి చెందిన ప్రతాప్తో వివాహేతర సంబంధంతమ కుమార్తెను తీసుకెళ్లి ప్రతాపే ఉరి వేసి చంపేశాడని ఆరోపిస్తున్న… pic.twitter.com/mKLsLE3UjK— Telugu Scribe (@TeluguScribe) May 2, 2025Video Credit: Telugu Scribe -
ఆ వీడియోలు లీక్ చేస్తా.. ఎమ్మెల్యేను బెదిరించిన యూట్యూబర్ అరెస్ట్
సాక్షి, కామారెడ్డి జిల్లా: ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే టార్గెట్ చేసి బ్లాక్ మెయిలింగ్కు పాల్పడిన ఓ యూట్యూబర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావును బెదిరించిన కేసులో యూట్యూబర్ శ్యామ్ను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చారు. ఎమ్మెల్యేకు సంబంధించిన వీడియోలు ఉన్నాయంటూ శ్యామ్ బ్లాక్మెయిలింగ్కు దిగాడు.సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలంటే భారీగా డబ్బులు ఇవ్వాలంటూ శ్యామ్ డిమాండ్ చేశాడు. దీంతో తన నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేశాడంటూ ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు శ్యామ్ని అదుపులోకి తీసుకున్నారు. డబ్బుల కోసం బెదిరించిన వ్యవహారంలో శ్యామ్తో పాటు మరో మహిళపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇన్స్టా లవర్తో వివాహిత ప్రేమాయణం.. భర్త ఇంటికి వచ్చే సరికి..
ఛండీగఢ్: ఇటీవలి కాలంలో సోషల్ మీడియా పరిచయాలు హత్యలకు దారితీస్తున్నాయి. కొందరు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. క్షణికావేశంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు.. వారిని జైలుపాలు చేస్తున్నాయి. తాజాగా ప్రియుడి కోసం భర్తనే హత్య చేసిన మరో దారుణ హర్యానాలో చోటుచేసుకుంది. సోషల్ మీడియా రీల్స్ వారి కాపురంలో చిచ్చుపెట్టింది.వివరాల ప్రకారం.. హర్యానాలోని భివానీకి చెందిన ప్రవీణ్తో రవీనాకు 2017లో వివాహం జరిగింది. వీరిద్దరికీ ముకుల్ అనే ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, రవీనా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఒక యూట్యూబ్ రన్ చేస్తూ అందులో వీడియోలు షేర్ చేస్తుంది. ఇన్స్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఆప్లోడ్ చేస్తుంటుంది. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం యూట్యూబర్ సురేష్తో రవీనాకు పరిచయం ఏర్పడింది. దీంతో, వారిద్దరూ స్నేహితులయ్యారు.అనంతరం, ఇన్స్స్టాగ్రామ్ వేదికగా ఇద్దరూ కలిసి రీల్స్ కూడా చేశారు. ఇలా రెండేళ్ల పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరు మరింత దగ్గరయ్యారు. శారీరకంగా ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇలా గడుస్తున్న సమయంలో వారి వ్యవహారం భర్త ప్రవీణ్కు వీరి వ్యవహారం తెలిసింది. రవీనాకు గట్టిగానే హెచ్చరించాడు. ఈ క్రమంలో మార్చి 25వ తేదీన రవీనా ఇంటికి సురేష్ వచ్చాడు.. ఇదే సమయంలో ప్రవీణ్ ఇంటికి రావడంతో వారిద్దరూ అభ్యంతరకర స్థితిలో దొరికిపోయారు. తర్వాత, వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, రవీనా, సురేష్ కలిసి.. ప్రవీణ్ హత్య చేశారు. అనంతరం, ప్రవీణ్ మృతదేహాన్ని తన బైక్పై తీసుకెళ్లి.. దూరంగా ఉన్న మురుగు కాలువలో పడేశారు. తర్వాత ఏమీ తెలియనట్టుగా ఉండిపోయారు.ఈ ఘటన తర్వాత ప్రవీణ్ కనిపించకపోవడంతో అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసకున్న పోలీసులు.. వారి ఇంటి వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా.. మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీంతో, రవీనాను అదుపులోకి తీసుకుని పోలీసులు గట్టిగా విచారించగా.. అసలు విషయం చెప్పుకొచ్చింది. తన ప్రియుడు సురేష్తో కలిసి ప్రవీణ్ను హత్య చేసినట్టు ఒప్పుకుంది. ప్రస్తుతం సురేష్ పరారీలో ఉండగా.. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.In Bhiwani, Haryana, a woman along with her lover strangled her husband to death. They took the body on a bike & threw it in the drain. The matter came to light when Raveena & her lover were seen with the body in CCTV. Police arrested Raveena & her lover Suresh is absconding. pic.twitter.com/Ae36kcs1Wp— Baba Banaras™ (@RealBababanaras) April 16, 2025 -
ఈ యూట్యూబర్.. బిలియనీర్!
అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన ఆన్ లైన్ ఇన్ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ అయిన ‘మిస్టర్ బీస్ట్’ సంపాదనలో కొందరు హాలీవుడ్ టాప్ స్టార్లనే మించిపోయాడు. ఆయన సంపాదన, సంపద గురించి వివరాలు పూర్తిగా బహిరంగంగా లేనప్పటికీ, ఫోర్బ్స్, సెలబ్రిటీ నెట్ వర్త్ వంటి అనేక పరిశ్రమ నివేదికలు మిస్టర్ బీస్ట్ తన డిజిటల్ సామ్రాజ్యం ద్వారా అపారమైన సంపదను కూడబెట్టినట్లు సూచిస్తున్నాయి.భారీ పాపులారిటీయూట్యూబ్ లో మిస్టర్ బీస్ట్ పాపులారిటీ, ఫైనాన్షియల్ సక్సెస్ మిస్టర్ బీస్ట్ అసాధారణ ఆర్థిక విజయానికి ప్రధాన చోదకాలలో ఒకటి యూట్యూబ్ లో అతని అపారమైన పాపులారిటీ. 2025 మార్చి నాటికి మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ఛానెల్కు 383 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. దీంతో ఆయన ప్రపంచంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న కంటెంట్ క్రియేటర్లలో ఒకడిగా నిలిచాడు. ఈ భారీ ఆదరణే యాడ్ రెవిన్యూ, బ్రాండ్ సహకారాల వంటి వాటి ద్వారా భారీ సంపాదనను తెచ్చిపెట్టింది. మెయిన్స్ట్రీమ్లోని సెలబ్రిటీలకు కూడా ఈ స్థాయిలో ఫాలోయింగ్ లేదంటే అతిశయోక్తి కాదు.మిస్టర్ బీస్ట్ నెట్వర్త్ఫోర్బ్స్ (2025 మార్చి) నివేదిక ప్రకారం 2023 జూన్ నుంచి 2024 జూన్ వరకు మిస్టర్ బీస్ట్ సంపాదన 85 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.700 కోట్లు). దీన్ని చూస్తే అర్థమవుతుంది యూట్యూబ్లో ఆయన ఎంత భారీ మొత్తంలో సంపాదిస్తున్నాడో. అంతేకాక, ప్రముఖుల సంపదలను అంచనా వేసే సెలబ్రిటీ నెట్ వర్త్ (2025 ఫిబ్రవరి) అయితే మిస్టర్ బీస్ట్ నెట్వర్త్ను సుమారు 1 బిలియన్ డాలర్లుగా (రూ.8,300 కోట్లు) అంచనా వేసింది. కొన్ని అంచనాలు మిస్టర్ బీస్ట్ నెలవారీ ఆదాయాన్ని సుమారు 50 మిలియన్ డాలర్లుగా పేర్కొన్నాయి. -
హీరో ప్రభాస్ పీఆర్వోపై కేసు నమోదు
బంజారాహిల్స్(హైదరాబాద్): తనను చంపుతామని బెదిరించిన హీరో ప్రభాస్ పీఆర్వోగా చెప్పుకుంటున్న వ్యక్తిపై యూట్యూబర్ చేసిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–44లో డయల్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్లో విజయ్సాధు అనే జర్నలిస్ట్ అసోసియేట్ ఎడిటర్గా పనిచేస్తున్నాడు. తన డయల్ స్యూస్ ఛానల్లో ఈ నెల 4న హీరో ప్రభాస్కు మేజర్ సర్జరీ జరిగిందంటూ ఓ వీడియోను విజయసాధు పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ అయ్యింది. మరుసటి రోజు సురేష్ కొండి అనే వ్యక్తి ఫోన్ చేసి తాను ప్రభాస్ పీఆర్వోనని పరిచయం చేసుకున్నాడు. డార్లింగ్ ఇన్ డేంజర్ అనే హెడ్డింగ్తో ప్రభాస్కు మేజర్ సర్జరీ జరిగిందంటూ, అనారోగ్యం బారిన పడ్డాడంటూ డయల్ న్యూస్ యూట్యూబ్లో పెట్టిన పోస్ట్కు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని సురేష్ ప్రశ్నించాడు. వెంటనే ఆ వీడియోను డిలీట్ చేయాలని బెదిరిస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. అయితే ఈ వీడియోను విజయ్సాధు డిలీట్ చేయలేదు. దీంతో సురేష్ ఈ పోస్ట్ను ప్రభాస్ ఫ్యాన్స్కు పంపించాడు. ఈ పోస్ట్ చూసిన ప్రభాస్ అభిమానులు ఫోన్కాల్, ఎస్ఎంఎస్, వాట్సప్ మెసేజ్లలో విజయసాధును తీవ్రంగా దూషిస్తూ నిన్ను చంపేస్తాం..నీ ఆఫీసును తగలబెడతాం..అంటూ హెచ్చరించారు. అంతేకాకుండా ఈ నెల 6వ తేదీన ఉదయం 10 మంది యువకులు యూట్యూబ్ కార్యాలయానికి వచ్చి తాము ప్రభాస్ అభిమానులం అంటూ న్యూసెన్స్ చేయగా భయాందోళనకు గురైన విజయసాధు డయల్ 100కు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని అల్లరి మూకలను పంపించి వేశారు. న్యూసెన్స్కు కారణమైన సురేష్ కొండిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. -
కూతురు ఫొటో బయటపెట్టిన మహాతల్లి (ఫొటోలు)
-
యూట్యూబర్ సన్నీయాదవ్పై లుకౌట్ నోటీసులు
సాక్షి, సూర్యాపేట జిల్లా: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పోలీసులు పట్టు బిగిస్తున్నారు. యూట్యూబర్ సన్నీయాదవ్పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సన్నీ యాదవ్పై నూతనకల్ పీఎస్లో కేసు నమోదైంది. యూట్యూబ్ వీడియోలతో బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేస్తున్న సన్నీయాదవ్పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి సూర్యాపేట జిల్లా ఎస్పీ సోషల్ మీడియా ఖాతాకు ట్యాగ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టిన సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీసులు.. సన్నీ యాదవ్ కోసం గాలిస్తున్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి చెందిన సన్నీ యాదవ్ సామాజిక మాధ్యమాల ద్వారా బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు పలు ఫిర్యాదులు వచ్చాయి. అయితే, లండన్లో ఉన్న అతనిపై సూర్యాపేట జిల్లా సైబర్ క్రైం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. -
మా కష్టాలు మాకే తెలుసు.. చివరికిలా శాశ్వతంగా! పిక్స్ వైరల్
ప్రస్తుతం వెడ్డింగ్ సీజన్ జోరుగా నడుస్తోంది. ప్రముఖ్యంగా ఈ సీజన్లో చాలామంది సెలబ్రిటీలు వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. బ్యాచిలర్స్ జీవితానికి బై బై చెప్పేస్తున్నారు. తాజాగా ప్రముఖ సింగర్ విపుల్ ధనాకర్ క్లబ్లో చేరారు. తన లేడీలవ్తో ఏడడుగులు వేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ ఈ జంటను అభినందనలతో ముంచెత్తారు. ప్రస్తుతం వీరి వెడ్డింగ్కు సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి.విలేన్గా పాపులర్ సింగర్ విపుల్ ధనాకర్. తాజాగా ( మార్చి 16)తన ప్రేయసి దివ్య దహియాతో వివాహం చేసుకున్నాడు. వ్యక్తిగత జీవితం గురించి చాలా గోప్యంగా ఉండే, విలేన్ ఇన్స్టాగ్రామ్లో ఈ సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకున్నాడు. దీంతో ఈ సడన్ సర్ప్రైజ్కి ఫ్యాన్స్సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. "మా ఈ ప్రయాణం లోతు ఎంతో మాకు మాత్రమే తెలుసు మా కష్టాలు, బాధలు, అనుభవించిన, బాధ , ప్రేమ అన్నీ.. చివరకు ఇలా.. జీవితాంతం కలిసి పయనించబోతున్నాం’’ తన జీవితంలో ముఖ్యమైన రోజు గురించి వార్తను షేర్ చేశాడు. దీంతో కొన్ని అందమైన ఫోటోలను కూడా పంచుకున్నాడు.విలేన్,దివ్య దహియా పెళ్లిదుస్తుల్లో అత్యద్భుతంగా కనిపించారు. తెల్లటి, సిల్వర్ ఎంబ్రాయిడరీ షేర్వానీలో రాయల్ లుక్తో అదిరిపోయాడు. ముత్యాల హారం, ముత్యాలు, కుందన్ కల్గితో అలంకరించిన తెల్లటి పగ్డితో, గడ్డంతో విలేన్ లుక్ మరింత ఎలివేట్ అయింది.ఇకవధువు దివ్య పాస్టెల్ పింక్ లెహంగాలో చాలా అందంగా కనిపించింది. ఎంబ్రాయిడరీ స్కర్ట్, సరిపోలే బ్లౌజ్తో మహారాణిలా మెరిసిపోయింది. తలపై షీర్ దుపట్టా, క్లాసీగా కనపించింది. డైమండ్ నెక్లెస్, గ్యాజులు మ్యాచింగ్ చెవిపోగులు ,మాంగ్ టీకాతో లుక్ను మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. అద్భుతంగా ఉన్నారు..దిష్టి తగిలేను జాగ్రత్త అంటూ నెటిజన్లు కొత్త జంటను అభినందించారు.గాయకుడిగా విలేన్ న్యూ ఢిల్లీకి విపుల్ దనాకర్ యూట్యూబ్లో తన మ్యూజిక్ వీడియోలకు బాగా ప్రాచుర్యం పొందాడు. 2018లో ‘ఏక్ రాత్’,చిడియా (2019) పాటలతో సంగీత ప్రపంచాన్ని ఉర్రూత లూగించాడు.అలాగే సావన్, జవానీ లాంటి పాటలతోపాటు, కనికా కపూర్ తో పాడిన తాజా పాట ‘చురాకే’ మరింత ప్రజాదారణ పొందాడు. గాయకుడిగా, స్వరకర్తగా,రచయితగా తనను తాను నిరూపించుకున్నాడు. ఈ ప్రయాణంలో చాలా కష్టపడ్డాను. ప్రతిదీ అర్థం చేసుకోవాలి, దర్శకత్వం , స్క్రీన్ ప్లే రాయాలి, ఎడిటింగ్ కంపోజింగ్, సాహిత్యం ఎలా రాయాలి వీటన్నింటిలోనూ పట్టు ఉండాలి,అప్పడేరాణిస్తాం అంటాడు విలేన్. View this post on Instagram A post shared by Vilen (@vilenofficial) -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన 'మహాతల్లి'
మహాతల్లి జాహ్నవి దాసెట్టి (Jahnavi Dasetty) పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆదివారం నాడు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. అది చూసిన స్నేహితులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. యూట్యూబర్ నిఖిల్ విజయేంద్రసింహా అయితే.. ఒక్కసారి మావయ్యా అనమ్మా అంటూ ఎమోషనల్ అయిపోయాడు. జాహ్నవి, సుశాంత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గతేడాది గర్భం దాల్చినట్లు వెల్లడించింది జాహ్నవి. అప్పటినుంచి తన ప్రెగ్నెన్సీ జర్నీని వీడియోల రూపంలో షేర్ చేస్తూనే ఉంది. భర్తతో కలిసి ఫోటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉంది.ఎవరీ జాహ్నవి?జాహ్నవి తెలుగమ్మాయి. నిఫ్ట్లో ఫ్యాషన్ టెక్నాలజీ చదివిన ఆమె మొదట్లో కొన్ని షార్ట్ ఫిలింస్ చేసింది. అలా మహాతల్లి- మహానుభావుడు అనే ఓ వెబ్ సిరీస్లోనూ నటించింది. ఈ సిరీస్ ఏ రేంజ్లో క్లిక్ అయిందంటే జాహ్నవిని మహాతల్లిగానే జనాలు గుర్తుపెట్టేసుకున్నారు. ఇప్పటికీ అలాగే పిలుస్తారు. వెబ్ సిరీస్లు, సరదా వీడియోలు చేస్తూ యూట్యూబ్లో పాపులర్ అయింది. సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు కూడా చేసేది. లై, మెంటల్ మదిలో చిత్రాల్లోనూ నటించింది. View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) చదవండి: ఎవర్నీ మోసం చేయకూడదు.. గుణపాఠం నేర్చుకున్నా..: కావ్యశ్రీ -
తెలుగు యూట్యూబర్ సృజన సాగర్ నూతన గృహప్రవేశం.. టాలీవుడ్ బుల్లితెర తారల సందడి (ఫోటోలు)
-
అతి తెలివి కుర్రాళ్లు!
న్యూఢిల్లీ: దేశమంతటా రచ్చ అయిన ‘ఇండియా హాజ్ గాట్ టాలెంట్’ యూట్యూబ్ షో వివాదం తాలూకు మంటలు ఇంకా చల్లారడం లేదు. ఆ షోలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా చిక్కుల్లో పడటం తెలిసిందే.మెదడులోని చెత్తనంతా వాంతి రూపంలో బయట పెట్టుకున్నారంటూ సుప్రీంకోర్టు ఆయనకు తీవ్రంగా తలంటింది కూడా. ఈ వ్యవహారంలో రణ్వీర్తో పాటు సదరు షో హోస్ట్ సమయ్ రైనా కూడా పలు కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. ఇంతటి రగడకు కారణమైన ఆ వివాదాస్పద ఎపిసోడ్పై ఇటీవల కెనడాలో నిర్వహించిన ఒక షోలో సమయ్ వ్యంగ్యాస్త్రాలు విసిరి తాజాగా మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురయ్యారు.‘‘బాగా ఫన్నీగా ఏవేవో చెప్పి నవ్విస్తానని అనుకుంటున్నారేమో! బీర్బైసెప్స్ (రణ్వీర్ అలహాబాదియా)ను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి! బహుశా నా టైం బాగా లేనట్టుంది. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి. నా పేరే సమయ్’’ అని ప్రేక్షకులను ఉద్దేశించి రైనా వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ షో టికెట్లు కొనడం ద్వారా నా కోర్టు ఖర్చులను భరించినందుకు కృతజ్ఞతలు’’ అంటూ ముక్తాయించారు. సోమవారం అలహాబాదియా పిటిషన్పై విచారణ సందర్భంగా రైనా తాజా వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రత్యేకంగా ప్రస్తావించి మరీ వాటిపై కన్నెర్ర చేసింది.‘‘ఈ అతి తెలివి కుర్రాళ్లు తమకే అన్నీ తెలుసనుకుంటారు. మనల్ని బహుశా పనికిరాని పాత తరంగా భావిస్తారేమో తెలియదు! వీళ్లలో ఒకరు కెనడాకు వెళ్లి మరీ ఆ పనికిమాలిన ఎపిసోడ్ను మరోసారి పనిగట్టుకుని ప్రస్తావించారు. ఈ కోర్టు న్యాయపరిధి ఎంతటిదో, తలచుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోగలదో బహుశా వీళ్లకు తెలిసినట్టు లేదు’’ అంటూ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా హెచ్చరించారు.‘‘కాకపోతే ఎంతైనా వాళ్చ్లు కుర్రాళ్లు. మేం అర్థం చేసుకోగలం. అందుకే అలాంటి చర్యలేవీ తీసుకోదలచలేదు’’ అని స్పష్టం చేశారు. చేసిన తప్పులకు వాళ్లు ఇప్పటికైనా పశ్చాత్తాపపడుతున్నారని ఆశిస్తున్నట్టు చెప్పారు. హక్కులతో పాటే బాధ్యతలు అలహాబాదియాకు కూడా ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ గట్టిగా చురకలు వేశారు. ‘‘కొందరు గిరాకీ లేని వ్యక్తులు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరిట పనికిరాని వ్యాసాలు రాసి వదులున్నారని మాకు తెలుసు. వారిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా బాగా తెలుసు. ప్రాథమిక హక్కులు తమ సొత్తని ఎవరైనా భావిస్తే పొరపాటు.మన దేశంలో ఎవరికైనా సరే, బాధ్యతలతో పాటు హక్కులు వర్తిస్తాయి. హక్కులను ఆస్వాదించాలంటే వాటితో పాటుగా రాజ్యాంగం కల్పించిన బాధ్యతలను నిర్వర్తించి తీరాల్సిందే. దీన్ని అర్థం చేసుకోని వారిని ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు’’ అని హెచ్చరించారు. రణ్వీర్ యూట్యూబ్ షోపై విధించిన నిషేధాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం ఎత్తేసింది. ఇకపై నైతిక ప్రమాణాలకు లోబడి పద్ధతిగా వ్యవహరించాలని హెచ్చరించింది. ఈ మేరకు హామీ పత్రం సమర్పించాల్సిందిగా ఆదేశించింది. -
యూట్యూబర్ చర్యతో స్టేడియంలో గోతులు
అమలాపురం రూరల్: వ్యూస్ కోసం కొందరు యూట్యూబర్లు విచక్షణను వదిలేస్తున్నారు. అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియం గ్రౌండ్ను ఓ యూట్యూబర్ అనుచరులు గోతులమయం చేశారు. ఈ చేష్టలను జిల్లా క్రీడాఅభివృద్ధి అధికారి అడ్డుకోవడంతో అక్కడి నుంచి పారిపోయారు. సుమారు 300 మందిని వెంటబెట్టుకుని ఓ యూట్యూబర్ (YouTuber) బాలయోగి స్టేడియం గ్రౌండ్లోకి(Balayogi Stadium Ground) ప్రవేశించాడు. ఈ గ్రౌండ్లో బంగారం పాతిపెట్టానని, అది ఎవరికి దొరికితే వారిదే అంటూ అక్కడ వచ్చిన యువకులను ఉసిగొల్పాడు. దాంతో వారు చేతికి దొరికిన వస్తువుతో గ్రౌండ్ను తవ్వడం మొదలెట్టారు. దీనిని గమనించిన జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సురేష్కుమార్ వారి చర్యలను నిలుపుదల చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
నైతిక విలువల్ని పాటించండి
న్యూఢిల్లీ: యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియా వివాదాస్పద అశ్లీల వ్యాఖ్యలు, సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర జోక్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో ఓవర్ ది టాప్(ఓటీటీ)ప్లాట్ఫామ్లు నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు స్వీయ నియంత్రణ సంస్థలు, ఓటీటీ ప్లాట్ఫామ్లు ఐటీ నిబంధనలు,2021లోని ‘కోడ్ ఆఫ్ ఎథిక్స్’ను పాటించాలని గురువారం కేంద్ర ప్రభుత్వం ఒక అడ్వైజరీని జారీచేసింది. నైతిక నియమాల ఉల్లంఘన జరిగితే ఓటీటీ ప్లాట్ఫామ్లకు సంబంధించిన స్వీయనియంత్రణ సంస్థలు తగు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఓటీటీ ప్లాట్ఫామ్ వంటి ఆన్లైన్ క్యూరేటెడ్ కంటెంట్, సోషల్ మీడియాలో అసభ్యకర, శృంగారభరిత, బూతు సమాచారం విస్తృతంగా ప్రసారంలోకి వస్తోందని పలువురు పార్లమెంట్ సభ్యులు, కొన్ని సంస్థల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అడ్వైజరీ జారీచేసింది. -
మీ బుర్రలో ఇంత చెత్త ఉందా?.. యూట్యూబర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: పబ్లిక్గా అశ్లీల వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. పాపులారిటీ కోసం అంత అసభ్య భాష మాట్లాడతారా? అంటూ మండిపడింది. ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షోలో అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు అతని వికృతమైన, చెత్త మనస్తత్వానికి నిదర్శనమని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు అలాంటి భాష ఎవరైనా మాట్లాడతారా అని కోర్టు అసహనం వ్యక్తం చేసింది.‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షోలో తాను చేసిన వ్యాఖ్యలపై వేరు వేరు ప్రాంతాల్లో నమోదైన కేసులను కలిపి విచారించేలా ఆదేశాలివ్వాలని అల్హాబాదియా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ను మంగళవారం(ఫిబ్రవరి 18) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటిశ్వర్సింగ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ బుర్రలో ఇంత చెత్త ఉందా అని తీవ్రంగా మందలించారు. కొంత కాలం పాటు ఎలాంటి షోలలో పాల్గొనరాదని అల్హాబాదియాను ఆదేశించారు. అయితే వ్యాఖ్యలకుగాను నమోదైన కేసుల్లో అల్హాబాదియాకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఊరటనిచ్చింది. ఈ కేసుల్లో అతడిని అరెస్టు చేయకుండా స్టే విధించింది. బీర్బైసెప్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పాలపులర్ అయిన అల్హాబాదియా అతని స్నేహితుడు సమయ్ రైనాషోలో పాల్గొన్నప్పుడు నోరు జారారు. అతని అశ్లీల వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. పలు చోట్ల కేసులు నమోదయ్యాయి.ఏకంగా మహారాషష్ట్ర,అస్సాం సీఎంలు ఈ విషయమై స్పందించారంటే పరిస్థితి ఎక్కడిదాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. యూట్యూబ్లో అశ్లీల కంటెంట్పై కేంద్రానికి నోటీసులు..యూట్యూబ్లో అశ్లీల కంటెంట్ను నియంత్రించేందుకు నిబంధనలు రూపొందించాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రణ్వీర్ అల్హాబాదియా కేసు విచారణ సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అలాంటి నిబంధనలేవైనా రూపొందిస్తే తాము సంతోషిస్తామని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. -
చాలా భయంగా ఉంది.. వివాదం తర్వాత ఏం జరిగిందంటే?: యూట్యూబర్
ఇండియాస్ గాట్ లాటెంట్ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) ప్రస్తుతం ముఖం చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. తల్లిదండ్రులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకుగానూ యావత్దేశం అతడిని దుమ్మెత్తిపోసింది. అది నోరా? డ్రైనేజీనా? అంటూ తిట్లదండకం అందుకుంది. ఇతడిపై పలు రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి.ఫోన్ స్విచ్ఛాఫ్?అయితే అల్హాబాదియా పోలీసులకు దొరక్కుండా తప్పించుకుతిరుగుతున్నాడని, అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడని రూమర్లు వస్తున్నాయి. ఈ పుకార్లపై అతడు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. నేను, నా టీమ్ పోలీసులకు సహకరిస్తున్నాం. వారికి నేను అందుబాటులోనే ఉన్నాను. తల్లిదండ్రులపై అనుచిత వ్యాఖ్యలు చేశాను, వారిని అవమానించాను. అందుకు నన్ను క్షమించండి. ఈ విషయంలో నేను కాస్త బాధ్యతగా వ్యవహరించాల్సింది.నా తల్లి క్లినిక్పై దాడిచాలామంది నన్ను చంపుతానని బెదిరిపిస్తున్నారు. నాతో సహా నా కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బెదిరిస్తున్నారు. కొందరైతే రోగులుగా నటిస్తూ మా అమ్మగారి క్లినిక్కు వెళ్లి అక్కడ విధ్వంసం సృష్టించారు. నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. కానీ నేను ఎక్కడికీ పారిపోవడం లేదు. పోలీసులపై, భారత న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది అని రణ్వీర్ రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Ranveer Allahbadia (@beerbiceps) చదవండి: జీవితంలో పెళ్లే చేసుకోనన్న జాలిరెడ్డి.. ఇప్పుడేకంగా లవ్ మ్యారేజ్ -
పరారీలో యూట్యూబర్ అల్హాబాదియా..!
ముంబయి:వివాదాస్పద వ్యాఖ్యలతో అందరి ఆగ్రహాన్ని చవిచూసిన యూట్యూబర్ రణ్వీర్అల్హాబాదియా పారిపోయాడా.. పోలీసులకు భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికైనా వెళ్లిపోయాడా..అంటే అవుననే అంటున్నారు ముంబయి పోలీసులు. అల్హాబాదియాకు ఫోన్ చేస్తే స్విచ్ఆఫ్ వస్తోందని, ఇంటికి వెళ్తే తాళమేసి ఉందని పోలీసులు తెలిపారు.ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో తల్లిదండ్రులపై అల్హాబాదియా అశ్లీల వ్యాఖ్యలు చేశారు.ఈ కేసులో అల్హాబాదియాను పోలీసులు విచారించాల్సి ఉంది. అయితే తాను తన ఇంటి వద్దే వాంగ్మూలం ఇస్తానని అల్హాబాదియా పోలీసులను కోరాడు.దీనికి పోలీసులు తిరస్కరించారు. తర్వాత స్టేట్మెంట్ కోసం పోలీసులు అల్హాబాదియాకు ఫోన్చేయగా స్విచ్ఆఫ్ వచ్చింది. ఇంటికి వెళితే తాళం వేసి ఉంది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో హాజరవడానికిగాను మరో కమెడియన్ సమయ్రానాకు పోలీసులు మార్చి 10 దాకా సమయమిచ్చారు.బీర్బైసెప్స్తో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నరణ్వీర్ అల్హాబాదియా ఇటవలే ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో యూట్యూబ్ ఆ వీడియోను కూడా ఇప్పటికే డిలీట్ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి అస్సాంలోనూ అల్హాబాదియాపై కేసు నమోదైంది. కాగా, దేశవ్యాప్తంగా తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని అల్హాబాదియా తాజాగా సుప్రీంకోర్టుకు వెళ్లాడు. అయితే ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. -
‘రణ్వీర్ అలహాబాదియా’పై అస్సాం సీఎం కీలక ట్వీట్
గువహతి:ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో అశ్లీల వ్యాఖ్యలు చేసినందుకుగాను ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియాపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టారు. ఎఫ్ఐఆర్లో రణ్వీర్ అలహాబాదియాతో పాటు ఇండియాస్ గాట్ లేటెంట్లో పాల్గొన్న ప్యానెలిస్టుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు తెలిపారు.Today @GuwahatiPol has registered an FIR against against certain Youtubers and social Influencers, namely 1. Shri Ashish Chanchlani2. Shri Jaspreet Singh3. Shri Apoorva Makhija4. Shri Ranveer Allahbadia5. Shri Samay Raina and othersfor promoting obscenity and engaging in…— Himanta Biswa Sarma (@himantabiswa) February 10, 2025 అశ్లీల వ్యాఖ్యలకుగాను ఇప్పటికే రణ్వీర్పై ముంబై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.కేసు దర్యాప్తులో భాగంగా షో జరిగిన సెట్లోకి కూడా పోలీసులు వెళ్లి పరిశీలించారు. రణ్వీర్ చేసిన వ్యాఖ్యలు సోషల్మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. నెటిజన్లంతా రణ్వీర్పై దుమ్మెత్తిపోశారు.రణ్వీర్ వ్యాఖ్యల వీడియోలను తొలగించాల్సిందిగా జాతీయ మనావహక్కుల సంఘం ఇప్పటికే యూట్యూబ్ను కోరింది. అయితే తన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో రణ్వీర్ ఇప్పటికే క్షమాపణలు చెప్పాడు. -
ఇది సమాజం.. తలదించుకునే పనులు చేయకండి: సీఎం ఫడ్నవీస్ వార్నింగ్
ముంబై : భారత్లో ప్రముఖ యూట్యూబర్, బీర్ బైసెప్స్గా పాపులర్ అయిన కంటెంట్ క్రియేటర్ రణవీర్ అలహాబాదియాకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరికలు జారీ చేశారు. ఏమైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. ఇది సమాజం.. తలదించుకునేలా వ్యవహరించకండి అని సీఎం ఫడ్నవీస్ హెచ్చరించారు. ఇంతకి ఏం జరిగిందంటే?ఇండియాస్ గాట్ టాలెంట్లో యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా నోరు జారారు. దీంతో అలహాబాదియాపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియాస్ గాట్ టాలెంట్లో రణ్వీర్ అలహాబాదియా ఓ కంటెస్ట్తో రాయలేని భాషలో ఓ జోకు వేశాడు. ఆ జోక్తో అలహాబాదియాతో సహా పక్కనే ఉన్న గెస్ట్లు, న్యాయనిర్ణేతలు సైతం పగలబడి నవ్వారు. ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ కామెంట్స్ చెలరేగింది. పలువురు న్యాయవాదులు సైతం అలహాబాదియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలహాబాదియా చేసిన కామెంట్స్పై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.‘ అలహాబాదియా చేసిన కామెంట్స్ గురించి నాకు సమాచారం అందింది. అయితే నేను ఆ వీడియోను చూడలేదు. చాలా అసభ్యకరంగా మాట్లాడారని, అలా మాట్లాడటం తప్పే అవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. కానీ మనం ఇతరుల స్వేచ్ఛను హరించకూడదు. ప్రతి ఒక్కరికీ పరిమితులు ఉంటాయి. ఎవరైనా వాటిని దాటితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని స్పష్టం చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలు.. యూట్యూబర్ క్షమాపణలుఓ షోలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా క్షమాపణలు తెలిపాడు. నెట్టింట పెద్దఎత్తున విమర్శలు రావడంతోపాటు ముంబయిలో పోలీసు కేసు నమోదు చేశారు. హద్దులు దాటినవారిపై చర్యలు తప్పవని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ హెచ్చరించిన క్రమంలో రణ్వీర్ అలహాబాదియా క్షమాపణలకు చెప్పక తప్పలేదు.#WATCH | Mumbai: On controversy over YouTuber Ranveer Allahbadia's remarks on a show, Maharashtra CM Devendra Fadnavis says, "I have come to know about it. I have not seen it yet. Things have been said and presented in a wrong way. Everyone has freedom of speech but our freedom… pic.twitter.com/yXKcaWJWDD— ANI (@ANI) February 10, 2025 -
వీరి వీడియోలు క్షణాల్లో వైరల్.. టాప్-10 భారత యూట్యూబర్లు
యూట్యూబ్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలువురికి ఉపాధి మార్గంగా మారింది. కెమెరాలు, మైకులు పట్టుకుని తిరుగుతూ, అందమైన ప్రకృతిని లేదా జనం తిరుగాడే ప్రాంతాలను చిత్రీకరిస్తూ, యూ ట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. తద్వారా వారు ఆనందాన్ని అందుకోవడమే కాకుండా, మనకు వినోదాన్ని కూడా పంచుతున్నారు. అలాగే యూట్యూబ్ నుంచి ఆదాయాన్ని కూడా అందుకుంటున్నారు. ఇదేకోవలో మన దేశానికి చెందిన 10 మంది యూట్యూబర్లు ఇంటర్నెట్ను శాసిస్తున్నారు. వారి జాబితా ఇలా..అజయ్ నాగర్అజయ్ నాగర్.. దేశంలో ప్రముఖ యూట్యూబర్గా పేరొందారు. 2000 జూన్ 12న హర్యానాలోని ఫరీదాబాద్లో జన్మించారు. అజయ్నాగర్ ‘CarryMinati’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా రోస్ట్ వీడియోలు, కామెడీ, గేమింగ్ వీడియోలతో అందరికీ వినోదాన్ని పంచుతుంటారు. ఇతని యూట్యూబ్ ఛానల్ నాలుగు కోట్ల పైగా సబ్స్క్రైబర్లున్నారు. "YouTube vs TikTok" వంటి వీడియోలు అజయ్ నాగర్కు మరింత ఆదరణను తెచ్చిపెట్టాయి.ఆశిష్ చంచలానీఆశిష్ చంచలానీ (Ashish Chanchlani) ప్రముఖ కామెడీ క్రియేటర్. ఆయన "Ashchanchlani Vines" అనే యూట్యూబ్ ఛానల్తో విపరీతమైన ఆదరణను అందుకున్నారు. 1993 డిసెంబర్ 7న ముంబైలో జన్మించిన ఆశిష్ తన వినోదాత్మక వీడియోలు, స్కిట్స్, హాస్యంతో కూడిన కంటెంట్తో యువతలో పాపులర్ అయ్యారు. ఆశిష్ చంచలానీ ఛానల్ మూడు కోట్లకు పైగా సబ్స్క్రైబర్లను అందుకుంది. ఆశిష్ తన వీడియోలలో సాధారణ పరిస్థితులను కూడా వినోదాత్మకంగా చూపించి, జనాలకు నవ్వు తెప్పించే ప్రయత్నం చేస్తుంటారు.భువన్ బామ్భువన్ బామ్.. ఇతనొక కామెడీ కంటెంట్ క్రియేటర్. ఆయన "BB Ki Vines" అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆదరణ పొందారు. 1994 సెప్టెంబర్ 22న న్యూఢిల్లీలో జన్మించిన భువన్, తన వినోదాత్మక వీడియోలు, స్కిట్స్తో యువత అభినందనలు అందుకుంటున్నారు. ఈ ఛానల్ రెండు కోట్లకు పైగా సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుంది. భువన్ తన వీడియోల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతపై సరదా కామెడీ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు.అమిత్ భదానాఅమిత్ భదానా (Amit Bhadana).. ప్రముఖ కంటెంట్ క్రియేటర్. కామెడీ వీడియోలను చేయడంలో ముందుంటారు. ‘Amit Bhadana’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులర్ అయ్యారు. 1999 జూలై 7న న్యూఢిల్లీ లో జన్మించిన అమిత్, తన వీడియోలలో హాస్యంతోపాటు రోజువారీ జీవితం, సామాన్య పరిస్థితులు, కుటుంబ సంబంధాలు తదితర విషయాలపై వినోదాత్మక కంటెంట్ అందిస్తుంటారు.సందీప్ మహేశ్వరిసందీప్ మహేశ్వరి.. ఈమె భారతీయ పారిశ్రామిక దిగ్గజం. మోటివేషనల్ స్పీకర్, ఎంట్రప్రెన్యూర్. 1975 సెప్టెంబరు 28న న్యూఢిల్లీ లో జన్మించిన సందీప్, "Sandeep Maheshwari" అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు పలు అంశాలలో స్ఫూర్తి అందిస్తుంటారు. మహేశ్వరి తన వీడియోలలో జీవితంలో సానుకూలత, మనోభావాల నియంత్రణ మొదలైన అంశాల గురించి చెబుతూ యువతకు సన్మార్గాన్ని చూపిస్తుంటారు.గౌరవ్ చౌధరిగౌరవ్ చౌధరి (Gaurav Chaudhary) టెక్నికల్ క్రియేటర్. "Technical Guruji" అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా టెక్నాలజీ, గాడ్జెట్లు, నూతన ఆవిష్కరణలు, రివ్యూ, టిప్స్ , ట్రిక్స్ తెలియజేస్తుంటారు. 1995 అప్రిల్ 7న రాజస్థాన్లో జన్మించిన గౌరవ్ టెక్నికల్ విషయాలను శరళమైన భాషలో అందిస్తుంటారు. టెక్నికల్ గురూజీ ఛానల్ రెండు కోట్లకు పైగా సబ్స్క్రైబర్లను పొందింది.నిశ్చయ్ మల్హన్ నిశ్చయ్ మల్హన్ (Nischay Malhan), Triggered Insaan పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. 1995 నవంబర్ 3న న్యూఢిల్లీలో జన్మించిన నిశ్చయ్, తన వీడియోల్లో రోస్టింగ్, కామెడీ, మీమ్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈయన ఇతర క్రియేటర్లపై చేసిన పంచ్లు పాపులర్ అయ్యాయి.హరిష్ బెనివాల్హరిష్ బెనివాల్ ప్రముఖ కామెడీ క్రియేటర్. ఆయన "Harish Beniwal" అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆదరణ పొందారు. హరిష్ తన వీడియోల్లో ప్రధానంగా కామెడీ స్కిట్స్, హాస్యభరిత కంటెంట్ను చూపిస్తుంటారు. 1996లో జన్మించిన హరిష్, తన వినోదాత్మక వ్యవహారశైలితో యువతను ఆకట్టుకుంటున్నారు.సమయ్ రైనాసమయ్ రైనా.. కామెడీ క్రియేటర్, స్ట్రీమర్. ఆయన "Samay Raina" అనే ఛానల్ పాపులర్ అయ్యారు. సమయ్ పలు రోస్ట్ వీడియోలు, కామెడీ స్కిట్స్, లైవ్ స్ట్రీమింగ్తో యువతను అలరిస్తుంటారు. 1996లో జమ్ము కశ్మీర్లో జన్మించిన సమయ్, తన ఇన్స్పిరేషనల్, సరదా వీడియోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నెటిజన్లకు మంచి వినోదం అందించేందుకు ప్రయత్నిస్తుంటారు.నిషా మధులికనిషా మధులిక.. ప్రముఖ భారతీయ ఫుడ్ కంటెంట్ క్రియేటర్. ‘Nisha Madhulika’ అనే ఛానల్ ద్వారా పాపులర్ అయ్యారు. ఇందులో ఆమె ఇండియన్ వంటకాల తయారీని వివరంగా చూపిస్తుంటారు. 1963లో జన్మించిన నిషా తన వీడియోలలో సులభంగా వంటలు చేసుకునే విధానాన్ని చెబుతుంటారు. నిషా మధులిక ఛానల్ కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆహార ప్రియులు నిషా మధులిక ఛానల్ను ఫాలో చేస్తుంటారు. ఇది కూడా చదవండి: ‘ఆప్’ ఓటమితో పంజాబ్లో వణుకు.. సీఎంకు ముచ్చెమటలు -
ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక ఉద్యోగం ఇదే..!
‘నేను ఉద్యోగం మానేస్తా.. మానేస్తా..’ అని మీరు చేస్తున్న ఉద్యోగమే కష్టమైందని అనుకుంటున్న వారంతా ఇక్కడ ఓ లుక్ వేయండి. జీవనోసాధి కోసం కొందరు ప్రాణాలనే పణంగా పెట్టి, ఆపదతో కూడిన ఉద్యోగాలెన్నో చేస్తుంటారు. అలాంటి వాటిలో ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన, ప్రమాదకరమైన ఉద్యోగం ఒకటి ఉందని ప్రముఖ యూట్యూబర్ దారా తహ్ చెప్పాడు. ‘ఇండోనేషియాలోని మౌంట్ ఇజెన్ అగ్ని పర్వతం దగ్గర పనిచేసే గని కార్మికులు అగ్నిపర్వతం నుంచి వెలువడే విష వాయువులతో రోజూ పోరాడాల్సి ఉంటుంది. ఆ వాయువుల్లో కొన్ని తక్షణమే చంపగలవు. అక్కడి వాయు మేఘాలు ఒక్కసారిగా కమ్ముకొచ్చి, ఊపిరి తీసే ప్రమాదం ఉంది. అక్కడి గంధకం గనికి వెళ్లే మార్గంలో ఒక యాసిడ్ సరస్సు ఉంది. ఇది చూడటానికి చక్కగా స్నానానికి అనువుగా అనిపిస్తుంది కాని, ప్రపంచంలోనే ప్రమాదకరమైన సల్ఫ్యూరిక్ యాసిడ్ సాంద్రత ఎక్కువగా ఉన్న సరస్సుల్లో ఇదీ ఒకటి. ప్రతిరోజూ వివిధ ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల కోసం ఉపయోగించే సల్ఫర్ను ఇలాంటి ప్రదేశాల నుంచే సేకరిస్తారు. ‘ఇక్కడ ఒక అరగంట కూడా నేను ఉండలేకున్నా, నా జీవితంలో చూసిన అత్యంత ప్రమాదకర ఉద్యోగం ఇదే’ అంటూ తన యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. (చదవండి: నాటి బాలకార్మికురాలు..ఇవాళ లీడ్ స్టార్!) -
దయ్యాల కోసం అద్దె చెల్లించడమా..!
అక్కడ దయ్యాలు, భూతాలు ఉన్నాయంటే ఆ వైపు కూడా వెళ్లరు చాలామంది. అలాంటిది ఓ వ్యక్తి కేవలం దయ్యాల కోసమే అద్దె చెల్లించాడు. ఈజిప్టులోని కైరో వెలుపల అతి పురాతనమైన మూడు పిరమిడ్లు ఉన్నాయి. వీటిని ఈజిప్ట్ ప్రభుత్వం అద్దెకిస్తోంది. వాటిల్లో ఒకటి, అతిపెద్దది, గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా. అక్కడ దాదాపు మూడువేలకు పైగా దయ్యాలు, భూతాలు ఉన్నాయని చాలామంది అంటుంటారు. ఇప్పుడు ఆ దయ్యాలను చూడటానికే ప్రముఖ యూట్యూబర్ జేమ్స్ డొనాల్డ్సన్ (మిస్టర్ బీస్ట్), వాటిని వంద గంటలకు అద్దెకు తీసుకున్నాడు. ‘బియాండ్ ది రికార్డ్స్’ పేరుతో భయంకర ప్రదేశాల్లోకి వెళ్లి, అక్కడ జరిగే విచిత్రమైన సంఘటనల వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. ఇప్పుడు తన భారీ అన్వేషణ కోసం ఈజిప్ట్లోని ఈ పిరమిడ్లను ఎంచుకున్నాడు.మరో వింత..ఈ విమానంలో ప్రయాణించాల్సిన పనిలేదు.. ‘ఈ వంద గంటల్లో స్నేహితులతో కలసి అక్కడ ఉండే అన్ని గదులు, సమాధులను చూసి, అక్కడే నిద్రించాలన్నది నా ప్లాన్. ఇందుకోసం, అవసరమైన అన్ని వస్తువులతో పాటు, పారానార్మల్ యాక్టివిటీ డివైజ్, ఇతర పరికరాలను తీసుకెళ్తున్నా’ అని చెప్పాడు. కొంతమంది ఇది సాధ్యం కాదని కొట్టి పారేస్తుంటే, తను మాత్రం త్వరలోనే వీడియోతో సమాధానం చెబుతానంటున్నాడు. భూమి నుంచి దూరంగా వెళ్లకుండా విమానంలో స్పెండ్ చేయడం గురించి విన్నారా..?. ఆ ఆలోచనే వెరైటీగా ఉంది కదూ..!. అలాంటి కోరిక ఉంటే వెంటనే ఉత్తర అమెరికాలో అలాస్కాకి వచ్చేయండి. శీతాకాలపు మంచు అందాల తోపాటు విమానంలో గడిపే అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి అదేంటో తెలుసుకుందామా..!ఆ వీడియోలో 1950ల నాటి విమానం(Airplane) వింటేజ్ డీసీ-6 విమానం విలక్షణమైన విమానహౌస్(Airplane House)గా రూపాంతరం చెందింది. ఇది ఒకప్పుడూ మారుమూల అలాస్కా(Alaska) గ్రామాలకు ఇంధనం, సామాగ్రిని సరఫరా చేసేది. ఇందులో రెండు బెడ్ రూమ్లు, ఒక బాత్రూమ్తో కూడిన వెకేషనల్ రెంటల్ హౌస్గా మార్చారు. చుట్టూ మంచుతో కప్పబడి ఉండే ప్రకృతి దృశ్యం మధ్యలో ప్రత్యేకమైన విమాన ఇల్లులో అందమైన అనుభూతి.ఇలా సర్వీస్ అయిపోయిన విమానాలను అందమైన టూరిస్ట్ రెంటల్ హౌస్లుగా తీర్చిదిద్ది పర్యాటకాన్ని ప్రోత్సహించొచ్చు అనే ఐడియా బాగుంది కదూ..!. చూడటానికి ఇది ప్రయాణించకుండానే విమానంలో గడిపే ఓ గొప్ప అనుభూతిని పర్యాటకులకు అందిస్తోంది. చెప్పాలంటే భూమి నుంచి దూరంగా వెళ్లకుండానే విమానంలో గడిపే ఫీలింగ్ ఇది. (చదవండి: మంచు దుప్పటిలో విలక్షణమైన ఇల్లు..ఒక్క రాత్రికి ఎంతో తెలుసా...!) -
షాపింగ్ మాల్లో యూ ట్యూబర్ హల్చల్
గచ్చిబౌలి: నా ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే రండి డబ్బులు ఇస్తానంటూ ఓ యూ ట్యూబర్ హల్చల్ చేసిన సంఘటన కొత్తగూడలోని శరత్ సిటీ క్యాపిటల్ (ఏఎంబీ)మాల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..శుక్రవారం బౌన్సర్లతో మాల్లోకి వచి్చన యూ ట్యూబర్ పవర్ వంశీ నా ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే త్వరగా సెకండ్ ఫ్లోర్కు త్వరగా రండి ముందు వచ్చిన వారికే డబ్బులు వస్తాయని హల్చల్ చేశాడు. దీనిని గుర్తించిన శరత్సిటీ క్యాపిటల్ మాల్ సెక్యూరిటీ సిబ్బంది వీడియో తీసేందుకు అనుమతి లేదని చెప్పి సదరు యూ ట్యూబర్ను బయటికి పంపారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని గచి్చ»ౌలి పోలీసులు తెలిపారు. కాగా మాల్లో యూ ట్యూబర్ వంశీ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గతంలోనూ అతను కూకట్పల్లిలో రోడ్డుపై డబ్బులు విసిరిన ఘటనలో పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో కూకట్పల్లిలో రోడ్లపై డబ్బులు విసిరిన యువకుడు. pic.twitter.com/5N7YzDrVmn— greatandhra (@greatandhranews) December 28, 2024 -
యూట్యూబ్లో తప్పుడు థంబ్నెయిల్స్ ఇచ్చే వారికి హెచ్చరిక
యూట్యూబ్.. ప్రపంచంలో ఎక్కువమంది ఇందులో సమయం గడుపుతుంటారు. వారికి నచ్చిన కంటెంట్ కోసం వెతుకుతుంటారు కూడా. అయితే, ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకోవాలని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ యూజర్లను తప్పుదారి పట్టిస్తుంటాయి. వీడియోలో ఉన్న కంటెంట్తో యూట్యూబర్స్ పెట్టే థంబ్నైల్స్, టైటిల్స్ ఎలాంటి సంబంధం ఉండదు. ఇలా వ్యూస్ కోసం వారిని తప్పుదోవ పట్టించడం వంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపై కంటెంట్కి వ్యతిరేకంగా తప్పుదారి పట్టించే థంబ్నెయిల్స్ పెడితే ఖాతాలను తొలగించనున్నట్లు ప్రకటించింది.థంబ్నైల్లో ఒక సినిమా పేరు ఉంచి యూట్యూబ్లో రిలీజ్ చేస్తారు. దానిని క్లిక్ చేస్తే మరో సినిమా ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీల ఫోటోలు ఉంచి ఎలాంటి సంబంధంలేని అడ్డమైన థంబ్నైల్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి చర్యల వల్ల యూజర్లు బాగా విసిగెత్తిపోతున్నారని యూట్యూబ్ గుర్తించింది. ఇలాంటి సందర్భాలలో యూజర్ల సమయం వృథా అవుతుంది. ఆపై ఆ ఫ్లాట్ఫామ్పై విశ్వాసం తగ్గిపోతుంది. దీంతో యూట్యూబ్ పలు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.యూజర్లను తప్పుదోవ పట్టించేలా క్లిక్బైట్ థంబ్నెయిల్స్ను ఎవరైనా ఉపయోగిస్తే.. ఆ యూట్యూబ్ అకౌంట్లపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ హెచ్చరిక తర్వాత కూడా వారిలో మార్పులు రాకుంటే రానున్న రోజుల్లో ఇలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది. సెలబ్రిటీలతో పాటు రాజకీయ నేతల గురించి వీడియోలు పోస్ట్ చేస్తున్న క్రమంలో వారికి ఇష్టం వచ్చినట్లు థంబ్నైల్స్ క్రియేట్ చేస్తుంటారు. కంటెంట్ నిజమే అనుకొని యూజర్లు లోపలికి వెళ్తే.. అక్కడ ఏమీ ఉండదు. ఇలా లెక్కలేనన్ని వీడియోలు యూజర్లను తప్పుదోవ పట్టించడంతో వారిని విసిగిస్తున్నారు. దీంతో అలాంటి యూట్యూబ్ ఛానళ్లపై చర్యలకు సిద్ధమైంది. -
యూట్యూబ్ కోసం రూ.8 లక్షల ఖర్చు.. ఎంత వచ్చిందంటే?
టెక్నాలజీ బాగా పెరిగిపోతోంది. ప్రజలు డబ్బు సంపాదించడానికి సులభమైన మార్గాలను అన్వేషిస్తూ.. యూట్యూబ్ మీద పడుతున్నారు. నేడు చాలామందికి యూట్యూబ్ అకౌంట్స్ ఉన్నాయి. దీని ద్వారా కొందరు లెక్కకు మించిన డబ్బు సంపాదిస్తుంటే.. మరికొందరు ఫెయిల్ అవుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'నళిని ఉనగర్'. ఇంతకీ ఈమె ఎవరు? యూట్యూబ్ కోసం ఎంత వెచ్చించింది? ఎందుకు ఫెయిల్ అయిందనే.. వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.నళిని ఉనగర్.. 'నలినీస్ కిచెన్ రెసిపీ' పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి మూడు సంవత్సరాలు నడిపింది. అయితే ఈమెకు యూట్యూబ్ ద్వారా ఏ మాత్రం ఆదాయం రాలేదు. కానీ నళిని.. స్టూడియో, కిచెన్ సెటప్ చేసుకోవడానికి, ప్రమోషన్స్ కోసం దాదాపు రూ.8 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.మూడేళ్ల పాటు సుమారు 250 వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. కానీ యూట్యూబ్ నుంచి ఆమెకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదు. దీంతో విసుగెత్తి.. యూట్యూబ్కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా కిచెన్ వస్తువులను, స్టూడియో ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా విక్రయించనున్నట్లు పేర్కొంది. నేను నా యూట్యూబ్ కెరీర్లో ఫెయిల్ అయ్యాను. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని సోషల్ మీడియా ద్వారా చెప్పింది.I failed in my YouTube career, so I’m selling all my kitchen accessories and studio equipment. If anyone is interested in buying, please let me know. 😭 pic.twitter.com/3ew6opJjpL— Nalini Unagar (@NalinisKitchen) December 18, 2024మూడు సంవత్సరాల్లో 250 వీడియోలు చేసాను, 2450 సబ్స్కైబర్లు మాత్రమే వచ్చారు. ఎంత కష్టపడినా.. యూట్యూబ్ కొన్ని రకాల కంటెంట్లకు మాత్రమే ఫేవర్ చేస్తుందని నళిని ఆరోపించింది. నేను మూడేళ్ళలో సంపాదించిన మొత్తం 'సున్నా' అని ఆవేదన వ్యక్తం చేసింది.నేను యూట్యూబ్ మీద చాలా కోపంగా ఉన్నాను. నేను ఈ ఛానల్ ప్రారంభించాడని డబ్బు, సమయాన్ని మాత్రమే కాకుండా నా వృత్తిని కూడా వదులుకున్నాను.. అని ఒక ట్వీట్లో వెల్లడించింది. కానీ నాకు యూట్యూబ్ ఎలాంటి ప్రతిఫలాన్ని అందించలేదని వాపోయింది.I’m honestly angry with YouTube. I spent my money, time, and even risked my career to build my channel, but in return, YouTube gave me nothing. It feels like the platform favors certain channels and specific types of videos, leaving others with no recognition despite the hard…— Nalini Unagar (@NalinisKitchen) December 18, 2024యూట్యూబర్స్ ఎదుర్కోవాల్సిన సవాళ్లుయూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు అనే మాట నిజమే. కానీ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన అందరూ డబ్బు సంపాదిస్తారు అని అనుకోవడం మూర్కత్వమే. ఎందుకంటే యూట్యూబ్లో అందరికీ డబ్బులు వస్తాయనే గ్యారంటీ లేదు. డబ్బు రావడం అనేది సబ్స్కైబర్లు, వాచ్ అవర్స్, వ్యూవ్స్ వంటి వాటిపైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి యూట్యూబర్స్ వీటన్నింటినీ విజయవంతంగా ఎదుర్కోగలిగి.. ఓపిగ్గా నిలబడితే డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. -
నటిపై లైంగిక వేధింపులు.. ప్రసాద్కు పెళ్లి కూడా అయిందా?
టాలీవుడ్లో ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయన అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సెట్లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ప్రసాద్ బెహరాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అతనికి ఇప్పటికే పెళ్లయిందని తెలుస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. తనతో కలిసి నటించిన జాను నారాయణ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు వివరించాడు. అయితే ఆ తర్వాత ఆమెతో విడిపోయినట్లు తెలిపారు. మా ఇద్దరి సెట్ కాకపోవడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని ప్రసాద్ పేర్కొన్నారు.(ఇది చదవండి: నటిపై లైంగిక వేధింపులు.. యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్)కాగా.. మావిడాకులు వెబ్ సిరీస్తో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. యూట్యూబ్లో వెబ్ సిరీస్ల ద్వారా టాలీవుడ్లో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా పెళ్లివారమండి లాంటి సిరీస్లతో ప్రేక్షకులను అలరించారు. ఈ ఏడాది రిలీజైన కమిటీ కుర్రోళ్లు చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. -
వెబ్ సిరీస్ నటుడు ప్రసాద్ బెహరా అరెస్ట్
-
యూట్యూబర్స్@ జైల్!
బంజారాహిల్స్/ఘట్కేసర్: హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని జూబ్లీహిల్స్ పోలీసులు... రాచకొండ కమిషనరేట్లోని ఘట్కేసర్ అధికారులు.. బుధవారం ఇద్దరు యూట్యూబర్స్ను అరెస్టు చేసి జైలుకు పంపారు. వీరిలో ఒకరు సినీ నటితో అసభ్యంగా ప్రవర్తించి కటకటాల్లోకి చేరగా... మరొకరు ఔటర్ రింగ్ రోడ్పై (ఓఆర్ఆర్) న్యూసెన్స్ క్రియేట్ చేసి ఊచలు లెక్కపెడుతున్నాడు. ఇతడి అరెస్టు ద్వారా పోలీసులు రీల్స్, మీమ్స్ పేరుతో ఓవర్ చేస్తే ఊరుకునేది లేదని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. Irresponsible Instagram Content Creator ArrestedRecently a viral video surfaced showing an individual throwing ₹20,000 bundle on the roadside of ORR and challenging viewers to a #MoneyHunt. This irresponsible act caused chaos, inconvenience, and posed a significant threat… pic.twitter.com/tpypMB6lnQ— Rachakonda Police (@RachakondaCop) December 18, 2024 మారానంటూ మళ్లీ మొదటికి... మణికొండ పంచవటి కాలనీలో నివసించే సినీ నటికి ఏడాదిన్నరగా యూట్యూబర్ ప్రసాద్ బెహరాతో పరిచయం ఉంది. ఇతడు యూట్యూబ్, కొన్ని చిత్రాల ద్వారా ప్రాచుర్యం పొందాడు. సదరు నటి ‘పెళ్లివారమండీ’ వెబ్ సిరీస్లో ప్రసాద్తో జత కట్టారు. షూటింగ్ సమయంలో ప్రసాద్ ప్రవర్తన, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తట్టుకోలేక వెబ్ సిరీస్ నుంచి ఆమె తప్పుకున్నారు. ఆపై ఆమెకు పలుమార్లు ఫోన్ చేసిన ప్రసాద్ క్షమాపణలు చెప్పాడు. నిజమని నమ్మిన ఆమె ఏడాది తర్వాత మెకానిక్ అనే వెబ్ సిరీస్లో హీరోయిన్గా నటిస్తోంది. తన ప్రవర్తన మార్చుకోని అతగాడు అసభ్యంగా మాట్లాడటం, తాకడం చేశాడు. ఆమె అడ్డు చెప్పగా... షూటింగ్స్లో ఇవన్నీ సహజమని, కాదంటే నీకే నష్టమని హెచ్చరించాడు. అతడి ప్రవర్తన, మాటలు, చేష్టలతో విసిగిపోయిన పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటే.. దుర్భాషలాడాడు. దీంతో ఆమె జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించగా... ప్రసాద్పై బీఎన్ఎస్లోని 75 (2), 79, 351 (2) సెక్షన్ల కింద కేసు నమోదైంది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. కట్ట విసిరి కట్టలు సంపాదించాలని... మనీ హంట్ చాలెంజ్ పేరుతో ఓఆర్ఆర్పై ఓ నోట్ల కట్ట విసిరి, ఆ రీల్ను సోషల్ మీడియాలో పెట్టి, సబ్స్క్రైబర్లను పెంచుకోవడం ద్వారా యూట్యూబ్ నుంచి భారీ ఆదాయం పొందాలని ప్రయతి్నంచిన మరో యూట్యూబర్ రాయలపురం భానుచందర్ జైలుకు వెళ్లాడు. బాలానగర్కు చెందిన ఇతగాడు ఐదు రోజుల క్రితం ఘట్కేసర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 9 సమీపంలో ఓ రీల్ చేశాడు. రూ.20 వేల కట్టను చెట్ల పొదల్లో పడేసి ఎవరైన వచ్చి తీసుకోవచ్చంటూ దాన్ని తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశాడు. ఇది వైరల్ కావడంతో ఓఆర్ఆర్ పెట్రోలింగ్ సిబ్బంది సీరియస్గా తీసుకున్నారు. ఇలా చేయడం న్యూసెన్స్ కిందికి వస్తుందని, ప్రయాణికులకు ముప్పు వాటిల్లేలా ప్రవర్తించడమే అని ఘట్కేసర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇతడిపై బీఎన్ఎస్లోని 125, 272, ఐటీ యాక్ట్లోని 66 సీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేయడంతో పాటు అతడి దగ్గర ఉన్న ఐ ఫోన్ 13 ప్రో సీజ్ చేశారు. ఓఆర్ఆర్, జాతీయ రహదారులపై రీల్స్ చేస్తే ప్రాణాలకు హాని జరిగే ప్రమాదం ఉందని, ఇలా చేస్తే జైలుకు పంపుతామని మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి హెచ్చరించారు. -
వెబ్ సిరీస్ నటుడు ప్రసాద్ బెహరా అరెస్ట్
-
నటిపై లైంగిక వేధింపులు.. యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్
ప్రముఖ యూట్యూబర్, నటుడు ప్రసాద్ బెహరాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువ నటి ఫిర్యాదు ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనితో కలిసి ఓ వెబ్ సిరీస్లో నటించిన సదరు నటిని లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో ప్రసాద్ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.కాగా.. ప్రసాద్ బెహరా యూట్యూబ్లో వెబ్ సిరీస్ల ద్వారా టాలీవుడ్లో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా మావిడాకులు, పెళ్లివారమండి లాంటి సిరీస్లతో ప్రేక్షకులను అలరించారు. ఈ ఏడాది రిలీజైన కమిటీ కుర్రోళ్లు చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు.అసభ్యంగా తాకుతూ..ఓ వెబ్ సిరీస్ షూటింగ్లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ యువనటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో చాలాసార్లు అలానే ప్రవర్తించాడని యువతి ఆరోపించింది. అందరిముందే సెట్లో తన బ్యాక్ టచ్ చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. అందరిముందు తనను అసభ్యంగా తాకుతూ పరువు పోయేలా ప్రవర్తించాడని యువతి వెల్లడించింది. -
సోషల్ మీడియాలో క్రేజ్ కోసం యువకుడి వికృత చేష్టలు
-
విద్యార్థిపై అక్రమ కేసులో సీఐడీకి ఎదురుదెబ్బ
గుంటూరు/అమరావతి/వీరఘట్టం/కడప అర్బన్/నర్సీపట్నం: రెండేళ్ల క్రితం ఓ యూట్యూబర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన ఓ డిగ్రీ విద్యార్థిని అకారణంగా తీసుకువచ్చిన గుంటూరు సీఐడీ పోలీసులకు చుక్కెదురైంది. అతన్ని రిమాండ్కు తరలించేందుకు చేసిన విశ్వ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అతన్ని సెల్ఫ్బాండ్పై విడుదల చేయాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం దశుమంతపురం గ్రామానికి చెందిన అలజంగి యగ్నేష్ భాస్కర్ డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు. రెండేళ్ల క్రితం ఓ యూట్యూబర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కూటమి పార్టీటలు ఇంకా సీఎం అభ్యర్థి ఎవరో నిర్ణయించుకోలేదని బదులిచ్చాడు. అంతటితో ముగిసిందని భావించి కళాశాలకు వెళ్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాజిక కార్యకర్తలను ఏరివేతకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. 2 రోజుల క్రితం గుంటూరు సీఐడీ పోలీసులు అతని స్వగ్రామానికి వెళ్లారు. నిద్రిస్తున్న అతన్ని గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకువచ్చి రోజంతా విచారించారు. గురువారం జిల్లా కోర్టు ఆవరణలోని సీబీసీఐడీ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి రిమాండ్ను రద్దు చేశారు. సెల్ఫ్బాండ్ మీద విడుదల చేయాలని ఉత్తర్వులిచ్చారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు పొలూరి వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మొండితోక శ్రీనివాసరావు, అజీజ్, షేక్.అజీబుల్లా, రమణారెడ్డి యగ్నేష్ ను పరామర్శించి ధైర్యం చెప్పి అండగా నిలిచారు. అండగా నిలవాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ ఆదేశం కాగా..యగ్నేష్ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. యగ్నేష్ కుటుంబానికి అండగా నిలవాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్కు, పాలకొండ, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు, వైఎస్సార్సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్రాజుకు సూచించారు. సోషల్ మీడియా పోస్టులపై నమోదవుతున్న అక్రమ కేసులతో యువత భవిష్యత్ నాశనం అవుతుందని, అటువంటి వారికి అండగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్పై కేసు నమోదు పల్నాడు జిల్లా అమరావతి రాజీవ్కాలనీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ కంభంపాటి దినేష్ పై గురువారం కేసు నమోదు చేశారు. సీఐ శ్రీనివాసరావు అందించిన వివరాల మేరకు.. దినేష్ ఈ ఏడాది జూలైలో ప్రభుత్వ పెద్దల ఫొటోలు మారి్ఫంగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీనిపై రాజీవ్ కాలనీకి చెందిన వంశీ ఇచి్చన ఫిర్యాదు మేరకు దినేష్ పై కేసు నమోదు చేశారు.వర్రా కస్టడీపై విచారణ వాయిదా..మరో కేసు నమోదు సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డిని కస్టడికి ఇవ్వాలని కడప జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. దీనిపై గురువారం (5వ తేదీ) విచారణ చేయాల్సి ఉండగా..దాన్ని ఈ నెల 9కి వాయిదా వేశారు. కాగా, సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డిపై అనకాపల్లి జిల్లా నాతవరం మండలం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు మారి్ఫంగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని నాతవరం మండలం, లింగంపేట టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు దేవాడ అప్పలనాయుడు గత నెల 10న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్, ఐటి చట్టాలను అనుసరించి 192, 196, 61(2), 336(4), 340(4), 353(2) సెక్షన్ల కింద వర్రాపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గుంటూరు జైల్లో రిమాండ్లో ఉన్న రవీంద్రారెడ్డిని పీటీ వారెంట్పై తీసుకువచ్చిన నాతవరం పోలీసులు గురువారం నర్సీపట్నం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మేజి్రస్టేట్ ముందు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించడంతో వర్రాను విశాఖ సెంట్రల్ జైల్కు తరలించారు. ఇదే రోజు న్యాయవాది మాకిరెడ్డి బుల్లిదొర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
యూట్యూబర్ ఇంట్లో శుభకార్యం.. నిహారిక, ప్రదీప్తో పాటు వాళ్లంతా (ఫొటోలు)
-
యూట్యూబర్గా సక్సెస్ అయ్యి..ఏకంగా బాలీవుడ్ మూవీ..!
పాండిచ్చేరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘అరోవిల్’నురహస్య నగరం అంటారు. కులం, మతం, డబ్బు లేకుండా కొంతమంది జీవించే ఇక్కడి నుంచే పెరిగి పెద్దదయ్యింది అహిల్య బామ్రూ. వ్యంగ్య వీడియోలు చేసే యూట్యూబర్గా ఈమె చేసిన ‘ప్రయోగం’ సక్సెస్ అయ్యి బాలీవుడ్ దాకా చేర్చింది. ఇటీవల విడుదలయ్యి ప్రశంసలు పొందుతున్న‘ఐ వాంట్ టు టాక్’లో అభిషేక్ బచ్చన్ కుమార్తెగా నటించింది. ‘అరోవిల్’లో నాకు దొరికిన స్వేచ్ఛ నన్ను తీర్చిదిద్దింది అంటున్న అహిల్య జీవితం ఆసక్తికరం.‘నేను ముంబైలో పెరిగి ఉంటే ఇలా ఉండేదాన్ని కానేమో. ఆరోవిల్లో పెరగడం వల్ల నేను ఒక భిన్నమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోగలిగాను’ అంటుంది అహిల్యా అమ్రూ. అహిల్యా గురించి చె΄్పాలంటే ఒక విజిటింగ్ కార్డు ఆ అమ్మాయికి చాలదు. ఆ అమ్మాయి గాయని, చిత్రకారిణి, డాన్సర్, నటి, వాయిస్ఓవర్ ఆర్టిస్ట్, డిజిటల్ క్రియేటర్...‘ఇవన్నీ నేను ఆరోవిల్లో ఉచితంగా నేర్చుకున్నాను. ఉచితంగా నేర్పించేవారు అక్కడ ఉన్నారు. బయట ఇది ఏ మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతిదానికీ డబ్బు కావాలి’ అంటుంది అహిల్య.ఇంతకీ ఆరోవిల్ అంటే? అదొక రహస్య నగరి. ఆధ్యాత్మిక కేంద్రం. లేదా భిన్న జీవన స్థావరం. ఇది పాండిచ్చేరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం కూడా సందర్శించవచ్చు. ఇక్కడ 42 దేశాలకు చెందిన 3000 మంది పౌరులు జీవిస్తున్నారు. వారి పని? డబ్బు ప్రస్తావన లేకుండా జీవించడం. పండించుకోవడం, తినడం, పుస్తకాలు చదువుకోవడం, తమకు వచ్చింది మరొకరికి నేర్పించడం, మెడిటేషన్. వీరు చేసేవాటిని ‘గ్రీన్ ప్రాక్టిసెస్’. అంటే పృథ్వికీ, పర్యావరణానికీ ద్రోహం చేయనివి. అక్కడే అహిల్య పెరిగింది.స్వేచ్ఛ ఉంటుంది‘మాది ముంబై. నేను అక్కడే పుట్టా. ఆ తర్వాత మా అమ్మానాన్నలు పాండిచ్చేరి వచ్చారు. అక్కడ నేను ఆశ్రమ పాఠశాలలో ఇంగ్లిష్, ఫ్రెంచ్, బెంగాలీ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఆరోవిల్కు మారాము. అక్కడ విశేషం ఏమిటంటే చదువులో, జీవితంలో కావాల్సినంత స్వేచ్ఛ ఉంటుంది.ఏది ఇష్టమో అది నేర్చుకుంటూపోవచ్చు. విసుగు పుడితే మానేయవచ్చు. బయట ప్రపంచానికి సంబంధం లేని పోటీతో జీవన శైలితో ఉండవచ్చు. ఇది అందరికీ సెట్ అవదు. కాని నాకు సెట్ అయ్యింది. నేను ఇక్కడ ఎన్నెన్ని నేర్చుకున్నానో చెప్పలేను. ఇక్కడ పెరగడం వల్ల నాకు ఆధ్యాత్మిక భావన అంటే ఏమిటో తెలిసింది. ప్రకృతితో ముడిపడి ఉండటం అంటే ఏమిటో తెలిసింది. భిన్న సంస్కృతులు, జీవితాలు తెలిశాయి. ఆరోవిల్ లక్ష్యం విశ్వమానవులను ఏకం చేయడం. ఇది చిన్న లక్ష్యం కాదు. మనుషులందరూ ఒకటే అని చాటాలి. బయట ఉన్న రొడ్డకొట్టుడు జీవితంతో, ΄ోటీతో విసుగుపుట్టి ఎందరో ఇక్కడకొచ్చి ఏదైనా కొత్తది చేద్దాం అని జీవిస్తున్నారు. ఆరోవిల్ మీద విమర్శలు ఉన్నాయి. ఉండదగ్గవే. కాని ఇది ప్రతిపాదిస్తున్న జీవనశైలి నచ్చేవారికి నచ్చుతుంది’ అంటుంది అహిల్య.రీల్స్తో మొదలుపెట్టి...వ్యంగ్యం, హాస్యం ఇష్టం అ«ధికంగా ఉన్న అహిల్య సరదాగా రీల్స్తో మొదలుపెట్టి డిజిటల్ క్రియేటర్గా మారింది. మన దేశానికి వచ్చిన విదేశీయులు ఆవును చూసి, గేదెను చూసి ఎంత ఆశ్చర్యపోతుంటారో అహిల్య చాలా సరదాగా చేసి చూపిస్తుంది. అందరి యాక్సెంట్, బాడి లాంగ్వేజ్ ఇమిటేట్ చేస్తూ ఆమె చేసే వీడియోలకు ఫ్యాన్స్ కొల్ల. అందుకే అభిషేక్ బచ్చన్ ముఖ్యపాత్రలో నవంబర్ 22న విడుదలైన ‘ఐ వాంట్ టు టాక్’ సినిమాలో మొదటిసారిగా బాలీవుడ్ నటిగా మొదటి అడుగు వేయగలిగింది అహిల్య. ఈ సినిమాలో కేన్సర్ పేషంట్ అయిన సింగిల్ పేరెంట్ అభిషేక్ తన కూతురితో అంత సజావుగా లేని అనుబంధాన్ని సరి చేసుకోవడానికి పడే కష్టం, కూతురుగా అహిల్య పడే తాపత్రయం అందరి ప్రశంసలు పొదేలా చేశాయి. (చదవండి: బరువు తగ్గి.. అందాల పోటీలో కిరీటాన్ని దక్కించుకుంది!) -
Choreographer: సొనాలీ భదౌరియా
డాన్సర్, కొరియోగ్రాఫర్, యూట్యూబర్. సొనాలీ సొంతూరు పుణే. ఆమెకు చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే పిచ్చి. అది ఆమె సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యాక కూడా కంటిన్యూ అయింది. అందుకే తాను జాబ్ చేస్తున్న కంపెనీలోని డాన్స్ క్లబ్ ‘క్రేజీ లెగ్స్’లో జాయిన్ అయింది. ఎన్నో డాన్స్ పోటీల్లో పాల్గొంది. ఆ ఉత్సాహంతోనే "LiveToDance with Sonali’అనే యూట్యూబ్ చానల్ను స్టార్ట్ చేసింది. అందులో తన డాన్స్ వీడియోలు అప్లోడ్ చేస్తుంటుంది. ఆమె చానల్కి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. యూట్యూబ్ సిల్వర్ బటన్నూ సాధించింది. వేలల్లో ఫాలోవర్స్తో సొనాలీకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. -
50 గంటల్లో 16 వేల కేలరీల ఫాస్ట్ ఫుడ్ ఛాలెంజ్..కట్చేస్తే..!
ఆరోగ్యం కోసం మంచి సమతుల్య ఆహారం తీసుకోవడమే మేలు. కానీ ఒక్కోసారి జిహ్వ చాపల్యం చంపుకోలేక ఇష్టమైన జంక్ ఫుడ్ని లాగించేస్తాం. పైగా ఏదో అప్పుడప్పుడే కదా అని సర్ది చెప్పుకుని మరీ తినేస్తాం. ఆ తర్వాత వర్కౌట్లు చేసి అదనపు కేలరీలను తగ్గించే యత్నం చేస్తాం. కానీ ఇలా తినడం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ప్రయోగాత్మకంగా తెలియజేశాడు ఓ యూట్యూబర్. అందుకోసం అతడు ఏం చేశాడంటే..ఫిట్నెస్ కంటెంట్ క్రియేటర్ అయిన 30 ఏళ్ల కెనడియన్ టెన్నిసన్ ఓ విచిత్రమైన ఫుడ్ ఛాలెంజ్ని తీసుకున్నాడు. ఆయన 50 గంటల ఫాస్ట్ ఫుడ్ మారథాన్ సవాలును స్వీకరించాడు. అందుకోసం తన బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్, డిన్నర్తో సహా మొత్తం ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఐటెమ్స్ వంటివి మాత్రేమ తీసుకున్నాడు. వాటిలో తృణధాన్యాలు, పెరుగు వంటివి కూడా ఉన్నాయి. తొలిరోజు అలాంటి ఫుడ్ తింటూ 8 వేల కేలరీలను వినియోగించినట్లు పేర్కొన్నాడు. ఈ ఆహారం కారణంగా తన మానసిస్థితి, శక్తి స్థాయిలోని ప్రతికూల భావాలను గుర్తించినట్లు తెలిపాడు. రెండో రోజు కూడా ఇలానే తినడం వల్ల గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడ్డట్లు తెలిపాడు. ఎక్కువ మొత్తంలో కేలరీలను పెంచినప్పటికీ పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించాడు. ఈ ఫుడ్ కారణంగా ముఖంపై మొటిమలు రావడం మొదలయ్యిందని వెల్లడించాడు. ఆ తర్వాత కండరాలు తిమ్మిరిగా ఉండి బద్ధకంగా ఏదో తెలియని నీరసంతో ఇబ్బంది పడుతున్నట్లుగా అనిపించిందని వెల్లడించాడు. అలాగే ఈఫుడ్కి తగ్గట్టు చేయాల్సిన పదివేల స్టెప్స్కు బదులుగా తాను 4 వేల స్టెప్స్ నడిచినట్లు పేర్కొన్నాడు. ఈ రెండు రోజుల ఛాలెంజ్ తదనంతరం మూడో రోజు జిమ్సెషన్ అత్యంత భయంకరమైనది. ఎందుకంటే ఈ అధిక కేలరీల ఫుడ్ కారణంగా విపరీతమైన చెమట్లు పట్టి..వర్కౌట్లు చేయడం చాలా కష్టంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు.అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల కలిగే పరిణమాల గురించి తెలియజేసేందుకే ఈ 50 గంటల ఫాస్ట్ ఫుడ్ ఛాలెంజ్ని స్వీకరించానని యూట్యూబర్ వెల్లడించాడు. అందుకు సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు ఆహారంతో మిళితమైన శారీరక సంబంధం గురించి చాలా క్లియర్గా వివరించి మరీ చెప్పారంటూ సదరు యూట్యూబర్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: సులభంగా ఇమ్యూనిటీ పెంపొందించుకోండి ఇలా..!) -
హర్ష సాయి కేసులో బిగ్ ట్విస్ట్..
-
హర్ష సాయి సంచలన ఆడియో లీక్
-
యూట్యూబర్ హర్ష అరెస్ట్
-
Supreme Court: కులం పేరిట వేధిస్తేనే... ఎస్సీ, ఎస్టీ కేసు
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల (నిరోధక) చట్టం వర్తింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ప్రత్యేకించి కులం పేరిట వేధించినప్పుడు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుంది. అంతే తప్ప కేవలం బాధితులు ఆ సామాజికవర్గాలకు చెందినంత మాత్రాన వర్తించబోదు‘ అని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న షాజన్ స్కారియా అనే యూట్యూబర్కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేరళకు చెందిన ఎమ్మెల్యే పీవీ శ్రీనిజన్ ఆయనపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద క్రిమినల్ కేసు పెట్టారు. మరుణదాన్ మలయాళీ అనే యూట్యూబ్ చానల్ నడుపుతున్న షాజన్ అందులో పెట్టిన ఒక వీడియోలో తనను ఉద్దేశపూర్వకంగా అవమానించారని ఆరోపించారు. షాజన్ ముందస్తు బెయిల్ పిటిషన్ను కేరళ హైకోర్టు తిరస్కరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం, ‘బెదిరింపులకు, లేదా అవమానాలకు గురైన వ్యక్తి కేవలం ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందినంత మాత్రాన సదరు నేరానికి ఎస్సీ, ఎస్టీ వేధింపుల (నిరోధక) చట్టం సెక్షన్ 3(1)(ఆర్) వర్తించబోదు. కులం పేరిట అవమానించినప్పుడు, వేధించినపుడు మాత్రమే వర్తిస్తుంది. సదరు చట్టంలో పేర్కొన్న మేరకు అంటరానితనం వంటి దురాచారాన్ని పాటించినప్పుడు, అగ్ర కులస్తులు మైల, పవిత్రత అంటూ నిమ్నవర్ణాల వారిపట్ల కులం పేరిట దురహంకారపూరితంగా ప్రవర్తించినప్పుడు ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీలను కులం పేరిట వేధించకుండా చూసేందుకే కఠినమైన సెక్షన్లు చేర్చారు. కనుక ఈ చట్టం వర్తింపులో నిందితుని ఉద్దేశం చాల ముఖ్యం‘ అని స్పష్టం చేసింది. ‘షాజన్ కేసులో అదేమీ కని్పంచడం లేదు. సదరు వీడియో ద్వారా ఎస్సీ, ఎస్టీల పట్ల ఉద్దేశపూర్వకంగా ద్వేషం, శతృత్వ భావం, దురుద్దేశాల వంటివి వెళ్లగక్కినట్టు ఎక్కడా రుజువు కాలేదు. ఎమ్మెల్యేను కేవలం వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకున్నారు‘ అని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులో ప్రాథమికంగా అభియోగాలు నిర్ధారణ అయితే తప్ప ముందస్తు బెయిల్ను తిరస్కరించలేమని స్పష్టం చేసింది. -
నడిరోడ్డుపై చీప్ ట్రిక్స్.. పట్టించుకోని పోలీసులు
-
Deepthi Sunaina: సాగర్ ఒడ్డున దీప్తి సునైన.. ముద్దొచ్చేంత అందంగా! (ఫొటోలు)
-
రోడ్డు ప్రమాదంలో యూ ట్యూబర్ మృతి
తొండంగి: బైక్ రైడర్గా, యూట్యూబర్గా సోషల్ మీడియాలో పేరొందిన పొగాకు సోంబాబు (క్రేజీ సొంబాబు) బైక్పై వెళ్తుండగా కాకినాడ జిల్లా బెండపూడి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకా రం.. నెల్లూరుకు చెందిన పొగాకు సోంబాబు (35) వృత్తి రీత్యా హైదరాబాద్లో ఉంటున్నారు. ప్రకృతి అందాలను చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్ చేసేవారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం రాజమహేంద్రవరంలో స్నేహితుల వివాహానికి తోటి బైక్రైడర్స్తో కలిసి హాజరయ్యారు. అనంతరం బైక్లపై దునపాటి రాజేష్ , వెంకట్లతో కలసి ఏజెన్సీ ప్రాంతమైన లంబసింగి, అరకు తదితర ప్రాంతాలను సందర్శించారు. అనంతరం విశాఖ నుంచి రాజమహేంద్రవరం బయలుదేరారు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. సోంబాబు బైక్ను జాతీయ రహదారిపై బెండపూడి వై.జంక్షన్ వద్ద భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అదుపుతప్పి పడిపోయాడు. దీంతో తీవ్రగాయాలైన సోంబాబును 108 అంబులెన్స్లో తుని ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తొండంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యూస్ కోసం నెమలి కూర!
-
‘నెమలి కర్రీ’ వీడియోతో బుక్కయ్యాడు
తంగళ్లపల్లి (సిరిసిల్ల): ‘ట్రెడిషినల్ పికాక్ కర్రీ రెసిపీ’ అంటూ ఓ యూట్యూబర్ తన చానల్లో వీడియో పోస్టు చేసి అడ్డంగా బుక్కయ్యాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్కుమార్ శ్రీటీవీ అనే యూట్యూబ్ చానల్లో నెమలి వంట చేయడం గురించి వీడియో పోస్టు చేశాడు. ఈ విషయంపై ‘యూట్యూబ్లో నెమలికూర వంటకం’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన కథనానికి అటవీ అధికారులు స్పందించారు.తంగళ్లపల్లిలో వంట చేసిన స్థలాన్ని పరిశీలించి, ప్రణయ్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి కల్పనాదేవి మాట్లాడుతూ, వంటకాన్ని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నెమలి పేరుతో వీడియో పెట్టినందుకు అటవీచట్టం ప్రకారం కేసు నమోదు చేశామని, పలు అటవీ జంతువులు, పక్షుల వంటకాల వీడియోలు కూడా పోస్టు చేసినట్లు గుర్తించామన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. తనిఖీలలో ఫారెస్టు సెక్షన్ అధికారి శ్రవణ్కుమార్, బీట్ ఆఫీసర్ ఎంఏ ఖలీమ్, సిబ్బంది పాల్గొన్నారు. -
యూట్యూబ్లో నెమలికూర వంటకం
తంగళ్లపల్లి (సిరిసిల్ల): జాతీయ పక్షిని చంపడం చట్టరీత్యా నేరం. అయితే ఓ యూట్యూబర్ ఏకంగా ‘ట్రెడిషినల్ పికాక్ కర్రీ రెసిపీ’ అంటూ తన యూ ట్యూబ్ చానల్లో పోస్టు చేశాడు. దీంతో ఇది వైరల్గా మారింది. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్కుమార్ అనే వ్యక్తి కొన్నా ళ్లుగా శ్రీటీవి అనే యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు.అయితే శనివారం తన యూట్యూబ్ చానల్లో ‘నెమలి కూర సంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి’ అంటూ పెట్టిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసిన వారందరూ విస్తుపోయారు. అంతేకాకుండా అడవిపంది కూర వండటం గురించిన వీడియో కూడా సదరు యూట్యూబ్ చానల్లో దర్శనమివ్వడం గమనార్హం. పోలీసులు, అటవీశాఖ అధికారులు ఈ వీడియోపై నిజానిజాలు తెలుసుకొని సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. -
30 కోట్ల సబ్బర్లను సాధించిన తొలి యూట్యూబర్ ఇతడే..!
-
టాప్ 10 ఇండియన్ యూట్యూబర్స్ లిస్ట్లో.. 'శ్రుతి అర్జున్ ఆనంద్'!
శ్రుతి.. ఉత్తరప్రదేశ్, ఝాన్సీలో పుట్టిపెరిగింది. కంప్యూటర్ సైన్స్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. మేకప్, ఫ్యాషన్ అంటే చాలా ఆసక్తి. అందుకే తన తొలి వీడియోను వాటి మీదే అంటే.. హెయిర్ స్టయిల్స్ మీదే తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. అప్పుడు ఆమె అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది.ఆ వీడియోకు ఆమె ఊహించని రీతిలో వ్యూస్, షేర్స్ వచ్చాయి. ఆ ప్రోత్సాహం, ఉత్సాహంతో ‘ShrutiArjunAnand’ పేరుతో యూట్యూబ్ చానెల్ను స్టార్ట్ చేసింది. 2013లో ఆమె ఇండియా వచ్చేవరకు ఆ చానెల్లో ఎక్కువగా ఫ్యాషన్ కంటెంట్ వీడియోలే అప్లోడ్ అయ్యేవి. ఇండియా వచ్చేశాక యూట్యూబ్ చానెల్ మీద ఫుల్ టైమ్ వర్క్ చేయడం మొదలుపెట్టింది.డే టు డే లైఫ్లోని పరిస్థితులు, కుటుంబ విషయాలను కథానాంశాలుగా తీసుకుని కామెడీ టచ్తో వీడియోలుగా తీసి తన చానెల్లో అప్లోడ్ చేస్తోంది. తన చానెల్కున్న లక్షల వ్యూస్, మిలియన్ల సబ్స్క్రైబర్స్తో ఆమె 2016లోనే టాప్ 10 ఇండియన్ యూట్యూబర్స్ లిస్ట్లో చేరిపోయింది. ఇప్పుడు శ్రుతి.. దేశంలోకెల్లా రిచెస్ట్ యూట్యూబర్స్లో ఒకరు.ఒక్క శ్రుతే కాదు ఆమె భర్త అర్జున్, కూతురు కూడా టాప్ యూట్యూబర్సే. ఇంకా చెప్పాలంటే ఆమె కుటుంబమంతా యూట్యూబర్సే. ‘ShrutiArjunAnand Digital Media’ ప్రైవేట్ లిమిటెడ్, ‘Shruti Makeup & Beauty’ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలను స్థాపించి తన ఫ్యామిలీ మెంబర్స్తో కలసి పనిచేస్తూ సోషల్ మీడియా వ్యూయర్స్ నచ్చే.. మెచ్చే కంటెంట్ని క్రియేట్ చేస్తోంది శుత్రి అర్జున్ ఆనంద్. -
శ్రీవారి భక్తులపై ప్రాంక్ వీడియో..
-
ప్రణీత్ హనుమంతు పై పోక్సో చట్టం
-
రుచులతో ప్రయాగాలు చేయడం.. కబితా సింగ్ అభిరుచి!
రుచులతో ప్రయాగాలు చేయడం కబితా సింగ్ అభిరుచి. అందులో ఆమెకు అపారమైన ప్రజ్ఞ ఉంది. కబితా గరిట పట్టిందంటే చాలు నలభీమ పాకం ఇలాగే ఉంటుందేమో అన్నంత టేస్టీగా ఘుమఘుమలాడిపోతుంది ఆ వంటకం. అలా తను చేసే డిఫరెంట్ వంటకాల గురించి లోకానికి చెప్పాలనుకుంది.సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితే పర్ఫెక్ట్ అనుకుంది. అందుకే 2014లో Kabita's Kitchen పేరుతో యూట్యూబ్ చానెల్ను స్టార్ట్ చేసింది. అందులో ఆమె చేప్పే 10 మినిట్స్ ప్రెషర్ కుకర్ రెసిపీస్ నుంచి స్ట్రీట్ ఫుడ్ దాకా, నాన్ ఆయిలీ ఆలూ పాలక్ నుంచి పాస్తా, పిజ్జా, సాలిడ్స్, సూప్స్ దాకా అన్ని రకాల వంటలకు ఊహించని రీతిలో రెస్పాన్స్ మొదలైంది. 2017కల్లా మిలియన్ల వ్యూస్కి చేరుకుంది. ఇప్పుడు ఆమె చానెల్కి (2023 లెక్కల ప్రకారం) కోటీ 34 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు.ఈ పాపులారిటీ వల్ల ఆమె చానెల్కి బ్రాండ్ ప్రమోషన్స్ పెరిగాయి. 2023 గణాంకాల ప్రకారం యాడ్స్ వల్ల ఆమె ఏడాదికి 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఆర్జిస్తోందని అంచనా. అకార్డింగ్ టు వేరియస్ వెబ్సైట్స్ Kabita's Kitchen వాల్యూ 5 నుంచి 6 కోట్లు ఉండొచ్చట. చూశారా.. తిరగమోతకూ తిరుగులేని విలువుంటుంది. అందుకే వంటలో నైపుణ్యాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి!ఇవి చదవండి: Sharvari Wagh: అది సినిమానా? ఓటీటీనా? టీవీ సీరియలా అని చూడను.. -
ప్రయాణాలపై ఇష్టంతోనే.. ఈ స్థాయికి!
ముంబైలో హోటల్ మేనేజ్మెంట్ చేసిన నిఖిల్కు ప్రయాణాలు చేయడం అంటే బోలెడు ఇష్టం. ఎంత ఇష్టం అంటే రోజూ 50 నుంచి 100 కిలోమీటర్లు ఎక్కడో ఒకచోటుకి వెళ్లిరావాల్సిందే. అయితే ఒకానొక రోజు మాత్రం... ‘ఎప్పుడూ ముంబై మాత్రమేనా.. ఔట్సైడ్ ముంబై కూడా వెళ్లాలి’ అనుకున్నాడు.అలా బైక్పై ఆజ్మీర్, బెంగళూరుకు వెళ్లాడు. ఇక అప్పటి నుంచి మొదలైన ఔట్సైడ్ ముంబై ప్రయాణాలు ఆగలేదు. ఈ ప్రయాణాల పుణ్యమా అని మన దేశంలోని ‘మోటో వ్లాగింగ్’ ప్రఖ్యాత యూట్యూబర్లలో ఒకరిగా నిఖిల్ శర్మ పేరు తెచ్చుకున్నాడు.నిఖిల్ ఫ్యాన్ బేస్ విషయానికి వస్తే..యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో ఫాలోవర్ల సంఖ్య లక్షలలో ఉంది. తాను వీడియోలు చేయడం మొదలుపెట్టినప్పుడు మన దేశంలో వ్లాగింగ్కు పెద్దగా ్రపాచుర్యం లేదు. డైలీ వ్లాగింగ్ చేయడం ద్వారా ఆడియెన్స్తో ఎప్పటికప్పుడూ టచ్లో ఉండేవాడు. మన దేశంలో ఏ మూలన ఉన్న ఆడియెన్స్ అయిన నిఖిల్ చెబుతున్న కబుర్లు విని ఊహాల్లోనే తాను ఉన్న చోటుకి వెళ్లేవారు.వ్లాగింగ్కు ఆవలి ప్రపంచంలోకి వెళితే..నిఖిల్కు నటన అంటే ఇష్టం. బాలీవుడ్ సినిమాల్లో, టీవీ సీరియల్స్లో నటించాడు. ఫ్లైట్ అటెండెంట్గా కొంతకాలం ఉద్యోగం కూడా చేశాడు. ఉద్యోగం మానేసినప్పుడు తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు. అదే సమయంలో తండ్రి చనిపోవడంతో కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత తన భుజస్కంధాలపై పడింది. ‘వ్లాగింగ్ వదలేయ్. డబ్బు సంపాదనపై దృష్టి పెట్టు’ అని కొద్దిమంది సలహా ఇచ్చారు. అయితే ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తన ప్యాషన్కు ఎప్పుడూ దూరం కాలేదు.ఆ ప్యాషనే తనను ప్రతిష్ఠాత్మకమైన యూట్యూబ్ ఫ్యాన్స్ ఫెస్టివల్లో పాల్గొనేలా చేసింది. ఔట్సైడ్ ముంబై యాత్రలు చేస్తే చాలు అనుకున్న అతడిని అమెరికా, కెనడా, ఇండోనేషియ, సౌత్ కొరియా, జపాన్... మొదలైన దేశాలకు వెళ్లేలా చేసింది. ‘ఫోర్బ్స్ 30 అండర్ 30–ఇండియా’ జాబితాలో చోటు సంపాదించేలా చేసింది. క్లాతింగ్ బ్రాండ్ లేబుల్ ఎంఎన్తో డిజైనర్, ఎంటర్ప్రెన్యూర్గా నిరూపించుకున్న నిఖిల్... ‘ఎన్ని చేసినా వ్లాగింగ్ అనేది నా ప్యాషన్’ అంటున్నాడు.ప్రతిభతో పాటు..మన ప్యాషన్కు ప్రతికూల పరిస్థితులు ఎదురు కావచ్చు. రాజీ పడి వేరే దారి చూసుకోవడం సులభం. రాజీ పడకుండా నచ్చిన దారిలోనే వెళ్లడం కష్టం. అయితే ఆ కష్టం ఎప్పుడూ వృథా పోదు. తప్పకుండా ఫలితం ఇస్తుంది. ప్రతిభతో పాటు ఓపిక కూడా ఉండాలి. తొందరపాటు వల్ల నష్టపోయిన ప్రతిభావంతులు ఎంతోమంది ఉన్నారు. – నిఖిల్ శర్మఇవి చదవండి: -
మొదటి భార్యతో విడాకులు.. అతనితో ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్..!
కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన భామ సునయన. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంది. గతేడాది రెజీనా చిత్రంతో పలకరించిన ఈ బ్యూటీ ఈ ఏడాది ఇన్స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించింది. అయితే ఇటీవల తనకు ఎంగేజ్మెంట్ జరిగిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకు కాబోయే భర్త వేలిని పట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన నిశ్చితార్థం జరిగిందని పేర్కొంది. అయితే తను పెళ్లి చేసుకోబోయేది ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు. తాజాగా ఆమె ప్రముఖ యూట్యూబర్, దుబాయ్కు చెందిన ఖలీద్ అల్ అమెరీతో నిశ్చితార్థం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఖలీద్ ఇటీవల జూన్ 26న అమ్మాయి వేలికి డైమండ్ రింగ్తో చేతులు పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేశాడు.దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది.కాగా.. సునయన 2005లో కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో నటప్రయాణం మొదలు పెట్టింది. తనకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా కాదలిల్ విడుదెన్(2008). నీర్పరవై చిత్రం తనను మరో మెట్టు ఎక్కించింది. తెలుగులో పెళ్లికి ముందు ప్రేమ కథ, రాజరాజ చోర సినిమాలతో పాటు చంద్రగ్రహణం, మీట్ క్యూట్ సిరీస్లతో సినీ ప్రియులకు మరింత దగ్గరైంది.మొదటి భార్యతో విడాకులు..కాగా.. జూలై 1న ఖలీద్ అల్ అమెరీ మాజీ భార్య సలామా మొహమ్మద్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఒ యూట్యూబ్ ఛానెల్తో మాట్లాడుతూ తాను, ఖలీద్ విడాకులు తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీనే కోర్టు విడాకులు మంజూరు చేసిందని ఆమె పేర్కొంది. దుబాయ్కు చెందిన ఖలీద్ అల్ అమెరికీ సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. View this post on Instagram A post shared by Sunainaa (@thesunainaa) View this post on Instagram A post shared by Khalid Al Ameri (@khalidalameri) -
రైతు వర్సెస్ యూట్యూబర్.. పీఎస్కు చేరిన పంచాయితీ
పెద్దపల్లి, సాక్షి: వాడలో మొదలైన చిన్న గొడవ.. చిలికి చిలికి గాలివానగా మారింది. హైవే మీదకు చేరి ఆందోళన చేపట్టే దాకా పోయింది. చివరకు పోలీసుల ఎంట్రీతో ఆ పంచాయితీ.. పోలీస్ స్టేషన్కు చేరింది. పెద్దపల్లి పట్టణంలో గౌరెడ్డిపేటకు చెందిన ఓ రైతు తన ఎడ్లబండిని రోడ్డుపై ఉంచాడు. దీంతో అక్కడ వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈలోపు స్థానికంగా ఉండే ఓ యూట్యూబర్ ఆవేశంతో ఊగిపోతూ అక్కడికి వచ్చాడు. సదరు రైతును దుర్భాషలాడుతూ కొట్టాడు. అది భరించలేకపోయిన ఆ రైతు.. ఆ ఎడ్ల బండితో రాజీవ్ రహదారిపై చేరి ఆందోళన చేపట్టాడు. ఈ క్రమంలో అక్కడా ట్రాఫిక్ జామ్ అయ్యింది.విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు. రైతుతో పాటు సదరు యూట్యూబర్ను అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కు తరలించి పంచాయితీ నిర్వహించారు. అయితే ఈ వివాదం ఎలా ముగిసిందన్నది మాత్రం తెలియాల్సి ఉంది. -
Faisal Khan: ఇటు సోషల్ మీడియా.. అటు సోషల్ యాక్టివిటీస్లోనూ ఖాన్ సర్ ఫస్టే!
అసలు పేరు ఫైసల్ ఖాన్. టీచర్, యూట్యూబర్. ఖాన్ సర్, ఖాన్ సర్ పట్నాగా పాపులర్. సొంతూరు.. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్. అలహాబాద్ యూనివర్సిటీలో సైన్స్లో మాస్టర్ డిగ్రీ చేశాడు. 2019లో ‘ఖాన్ జీఎస్ రీసెర్చ్ సెంటర్’ పేరుతో యూట్యూబ్ చానెల్ను స్టార్ట్ చేశాడు.స్కూళ్లు, కాలేజీలు బంద్ అయిన కరోనా లాక్డౌన్ టైమ్లో అకడమిక్స్ని టీచ్ చేస్తూ ఖాన్ చేసిన వీడియోలు ఇటు యూట్యూబ్లో అటు ఇన్స్టాలో వైరలై అతనికి బోలెడంత మంది ఫాలోవర్స్ని.. సబ్స్క్రైబర్స్ని సంపాదించి పెట్టాయి. ఎంతటి కష్టమైన, క్లిష్టమైన సబ్జెక్ట్ని అయినా అరటి పండు మింగినంత అలవోకగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఖాన్ సర్ యూఎస్పీ. అందుకే అతని యూట్యూబ్ చానెల్కి స్టూడెంట్సే కాదు వరుణ్ ధవన్ లాంటి సినిమా యాక్టర్స్ కూడా సబ్స్క్రైబర్సే!సోషల్ మీడియాలోనే కాదు సోషల్ యాక్టివిటీస్లోనూ ఖాన్ సర్ ఫస్టే! స్కూల్కి వెళ్లలేని పేద పిల్లలకు ఫ్రీగా టీచ్ చేస్తాడు. ఆర్థికావసరాల్లో ఉన్న వాళ్లకు తనకు తోచిన హెల్ప్ చేస్తాడు. యూట్యూబ్ ద్వారా ఖాన్ సర్ నెలకు 15 లక్షల రూపాయలు సంపాదిస్తాడని అంచనా! ఆర్జనే కాదు సాయమందించే మనసూ ముఖ్యమే అని ప్రూవ్ చేస్తున్నాడు ఖాన్ సర్!ఇవి చదవండి: Pooja Singh: పూజా సింగ్ టు.. రింకీ దూబే.. బై శాన్వికా..! -
Nikhil Anil Brijlal Kumar Sharma: ముంబైకర్ నిఖిల్..
నిఖిల్ అనిల్ బ్రిజ్లాల్ కుమార్ శర్మ aka నిఖిల్ ముంబైకర్.. మోటో వ్లాగర్, బిజినెస్మన్. టాప్ టెన్ రిచెస్ట్సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ర్స్ ఆఫ్ ఇండియాలో ఒకడు. హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసిన ఈ ముంబై వాసి కొన్నాళ్లు ఖతార్ ఎయిర్వేస్లో ఫ్లయిట్ అటెండెంట్గా పనిచేశాడు.చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీదున్న ఇంట్రెస్ట్ ఆ ఎయిర్వేస్ కొలువులో కుదురుగా ఉండనివ్వలేదు. దాంతో ముంబైకి తిరిగొచ్చి.. నటనలో లక్ని పరీక్షించుకున్నాడు. అట్టే అవకాశాలు రాలేదు. వీడియోగ్రఫీ అంటే కూడా ఆసక్తి ఉండటంతో మైండ్ని అటువైపు మోల్డ్ చేసుకున్నాడు. యూట్యూబ్ని వేదికగా మలచుకున్నాడు. మోటర్ బైక్ మీద తను వెళ్లిన ప్రదేశాలను షూట్ చేస్తూ ఆ వీడియోలను తన యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేయసాగాడు. అలా అతని లద్దాఖ్ మోటో ట్రిప్ వ్లాగ్ తన చానెల్ సబ్స్క్రైబర్స్ని అమాంతం పెంచేసింది. పాపులారిటీని తెచ్చిపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న తన ఫ్యాన్స్ని కలవడానికి నిఖిల్ ఓ2ఓ (కన్యాకుమారి టు కశ్మీర్) బైక్ రైడ్ చేశాడు. ‘ముంబైకర్ నిఖిల్’ పేరుతోనే కీ చైన్స్, బెల్ట్ల బ్రాండ్ని స్థాపించాడు. ఇవి ఎక్స్క్లుజివ్గా అమెజాన్లోనే దొరుకుతాయి.ఇవి చదవండి: Revathi Pillai: తానొక.. డిజిటల్ స్టార్.. అండ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్.. -
Deepthi Sunaina: నలుపు రంగు డ్రెస్లో 'పిచ్చెక్కిస్తున్న' సోషల్ స్టార్ దీప్తి సునైనా (ఫొటోలు)
-
Nisha Madhulika: దేశంలోకెల్లా ఫిఫ్త్ రిచెస్ట్ యూట్యూబర్...
నిషామధులిక.. లీడింగ్ యూట్యూబ్ షెఫ్. వెజిటేరియన్ రెసిపీస్కి ఫేమస్. యూట్యూబ్ చానెల్ పెట్టేకంటే ముందు ఆమె తన భర్త కంపెనీలో అకౌంట్స్ చూసేవారు. తొలి నుంచి రకరకాల వంటకాలు చేయడమంటే ఆమెకు ఆసక్తి. సెలవు రోజు వచ్చిందంటే చాలు వెరైటీ వంటల ప్రయోగాలకు పోపు పెట్టేవారు.ఓసారి ఇలాగే కొత్త వంటకాన్ని వండుతూ ‘ఈ రెసిపీని తనలా కుకింగ్ హాబీ ఉన్నవాళ్లకు షేర్ చేస్తే’ అనే ఆలోచన కలిగింది ఆమెకు. వాళ్లబ్బాయితో చెప్పింది. వెబ్సైట్ ఒకటి రూపొందించి ఇచ్చాడు తల్లికి కానుకగా. ఇక్క అక్కడి నుంచి ఆమె అభిరుచి ప్రయాణం మొదలైంది.తనకు తెలిసిన, తను ఎక్స్పరిమెంట్ చేసిన వంటకాల రెసిపీలతో బ్లాగింగ్ స్టార్ట్ చేశారామె. ఆ తర్వాత మూడేళ్లకే అంటే 2011లో ఆమె పేరు మీదే యూట్యూబ్లో వంటల చానెల్నూ ప్రారంభించారు. షార్ట్ టైమ్లోనే మిలియన్ల సబ్స్క్రైబర్స్ని సాధించారు. ఈ యేడు ఫిబ్రవరి నాటికి ఆమె చానెల్కి ఉన్న సబ్స్కైబర్స్ సంఖ్య దాదాపు కోటీ 41 లక్షలు (జాగరణ్ వెబ్సైట్ ప్రకారం).దేశంలోకెల్లా ఫిఫ్త్ రిచెస్ట్ యూట్యూబర్. జాగరణ్ వెబ్సైట్ ప్రకారం ఆమె యూట్యూబ్ చానెల్ నెట్ వర్త్ 43 కోట్లు. సబ్జెక్ట్ ఏదైనా సరే.. ఇంట్రెస్ట్ ఉంటే టెక్నో యుగం బారియర్ కాదని.. సెకండ్ యూత్ కూడా ఆన్ పార్ విత్ యూత్ ఉండొచ్చని ప్రూవ్ చేశారు నిషామధులిక.ఇవి చదవండి: Namita Dubey: నిజమైన యాక్టర్స్.. తమ పాత్ర గురించే ఆలోచిస్తారు! -
Gaurav Chaudhary: కోట్ల యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ని సొంతం చేసుకున్నాడు.. ఎలా అంటే?
యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్చేసి ఎందరో ముందుకు వెళ్లినవారు, మధ్యలోనే నిలపివేసినవారు, మళ్ళీ కొనసాగించినవారున్నారు. కానీ కోట్ల సబ్స్క్రైబర్స్ని పొందినవారు ఎందరున్నారు? ఎవరున్నారు? అనే సందేహానికి ఈ యూట్యూబరే.. నిదర్శనం. మరి అతని గురించి తెలుసుకుందామా..'గౌరవ్ చౌధరీ' రిచెస్ట్ ఇండియన్ టెక్ యూట్యూబర్. ‘టెక్నికల్ గురూజీ’ అనే యూట్యూబ్ చానెల్తో పాపులర్. దీన్ని 2015లో స్టార్ట్ చేశాడు. కష్టమైన టెక్నికల్ అంశాలను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఇతను ఎక్స్పర్ట్.ఈ స్కిల్తోనే 2017 కల్లా కోటి మంది సబ్స్క్రైబర్స్ని సంపాదించుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత వ్యూస్ గెయిన్ చేస్తోంది అతని చానెల్. 2024, మార్చి నాటికి రెండు కోట్ల 35 లక్షల మంది సబ్స్క్రైబర్స్తో టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్లో ఒకడిగా ఉన్నాడు. టెక్ కేటగరీలో తొలి నేషనల్ క్రియేటర్స్ అవార్డ్ను అందుకున్నాడు.అతని నెట్ వర్త్ 360 కోట్లకు పైమాటే! రాజస్థాన్లోని అజ్మేర్ అతని సొంతూరు. 16 ఏళ్లకే కోడింగ్లో ఆరితేరాడు. బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో మైక్రోఎలక్ట్రానిక్స్లో గ్రాడ్యుయేషన్ చేశాడు. కోడింగ్లో తనకున్న నైపుణ్యంతో దుబాయ్లోనే డిజిటల్ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు.సోషల్ మీడియా అనగానే ఎంటర్టైన్మెంటే కాదు సీరియస్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. వాటితోనూ వ్యూస్ అండ్ క్యాష్ని రాబట్టుకోవచ్చని నిరూపించాడు!ఇవి చదవండి: కలే నిజమైంది.. ప్రాణాలు కాపాడింది! -
కొత్తింట్లోకి అడుగుపెట్టిన 'మహాతల్లి'.. ఎమోషనల్ పోస్ట్
'మహాతల్లి' జాహ్నవి నూతన ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. తన భర్తతో కలిసి కొత్తింట్లో కుడికాలు పెట్టింది. డ్రీమ్ హౌస్లో పాలు పొంగించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనైంది. 'నాలుగు సంవత్సరాల క్రితం సుశాంత్, నేను కొత్తింటి కోసం వెతకడం ప్రారంభించాము. కొంతకాలానికే మాకు పర్ఫెక్ట్గా సరిపోతుందనుకునే ఇల్లు దొరికేసింది.నా వల్ల అవుతుందా?నా కుక్కపిల్లలు ఆడుకోవడానికి, అటూఇటూ పరిగెత్తడానికి అవసరమయ్యేంత పెద్ద స్థలం ఉంది. మేము ఇల్లు కొనాలని అనుకున్నప్పటి నుంచి ఎన్నోసార్లు ఇది మావల్ల అయ్యే పని కాదేమోనని మథనపడ్డాం. ఆ సమయంలో నా బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ నాకు అండగా నిలబడ్డారు. ఇప్పుడు కొత్తిల్లు సొంతమవుతుంటే అంతా ఏదో కలలా అనిపిస్తోంది' అని క్యాప్షన్లో రాసుకొచ్చింది. ఏప్రిల్ 19న గృహప్రవేశం చేసినట్లు పేర్కొంది. ఎవరీ జాహ్నవి?కర్నూలుకు చెందిన తెలుగమ్మాయి జాహ్నవి. నిఫ్ట్లో ఫ్యాషన్ టెక్నాలజీ చదివిన ఆమె మొదట్లో షార్ట్ ఫిలిం డైరెక్టర్ హరీశ్ నాగరాజుతో కలిసి కొన్ని లఘుచిత్రాలకు పని చేసింది. అలా మహాతల్లి- మహానుభావుడు అనే వెబ్సిరీస్లో నటించింది. ఇది ఎంతలా క్లిక్ అయిందంటే జాహ్నవి మహాతల్లి పేరిట సొంతంగా ఓ ఛానలే ప్రారంభించింది. వెబ్ సిరీస్లు చేస్తూ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ బాగా పాపులర్ అయింది.అన్ని రకాల విషయాలపై తనదైన రీతిలో వీడియోలు చేస్తూ ఉంటుంది. లై, మెంటల్ మదిలో వంటి చిత్రాల్లోనూ నటించింది. కొన్నేళ్ల క్రితం సుశాంత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అందరిలాగే ఈ జంట కూడా సొంతిల్లు ఉండాలని కల గనేవారు. తాజాగా ఆ కలను వీరు సాకారం చేసుకోవడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) చదవండి: వార్ 2 కోసం జూనియర్ ఎన్టీఆర్ కసరత్తులు.. అది లీక్ చేయొద్దనే..