రోడ్డు ప్రమాదంలో యూ ట్యూబర్‌ మృతి | YouTuber in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యూ ట్యూబర్‌ మృతి

Published Tue, Aug 13 2024 1:42 PM | Last Updated on Tue, Aug 13 2024 3:38 PM

YouTuber in road accident

తొండంగి: బైక్‌ రైడర్‌గా, యూట్యూబర్‌గా సోషల్‌ మీడియాలో పేరొందిన పొగాకు సోంబాబు (క్రేజీ సొంబాబు) బైక్‌పై వెళ్తుండగా కాకినాడ జిల్లా బెండపూడి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకా రం.. నెల్లూరుకు చెందిన పొగాకు సోంబాబు (35) వృత్తి రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. 

ప్రకృతి అందాలను చిత్రీకరించి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసేవారు.  ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం రాజమహేంద్రవరంలో స్నేహితుల వివాహానికి తోటి బైక్‌రైడర్స్‌తో కలిసి హాజరయ్యారు. అనంతరం బైక్‌లపై దునపాటి రాజేష్‌ , వెంకట్‌లతో కలసి ఏజెన్సీ ప్రాంతమైన లంబసింగి, అరకు తదితర ప్రాంతాలను సందర్శించారు. అనంతరం విశాఖ నుంచి రాజమహేంద్రవరం బయలుదేరారు. అక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకున్నారు. 

సోంబాబు బైక్‌ను జాతీయ రహదారిపై బెండపూడి వై.జంక్షన్‌ వద్ద భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అదుపుతప్పి పడిపోయాడు. దీంతో తీవ్రగాయాలైన సోంబాబును 108 అంబులెన్స్‌లో తుని ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తొండంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement