mobile phone
-
తల్లి ఫోను లాక్కుందని.. 13 కి.మీ నడచివెళ్లి..
ఈ రోజుల్లో అందరూ ఫోనుకు బానిసలైపోతున్నారు. ముఖ్యంగా యువత ఫోను(Mobile Phone)తో టైమ్పాస్ చేస్తూ చదువులను కూడా పక్కనపెడుతున్నారు. ఈ నేపధ్యంలో పలు ఆసక్తికర ఉదంతాలు కూడా తరచూ వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని రీవా జిల్లాలో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం రీవాకు చెందిన పదవ తరగతి విద్యార్థిని ప్రస్తుతం జరుగుతున్న సీబీఎస్సీ పదవ తరగతి పరీక్షలకు హాజరవుతోంది. అయితే పుస్తకం చదువుతున్నానని(studying) తల్లికి చెప్పి, ఫోనులో సోషల్ మీడియా పోస్టులను చూస్తోంది. దీనిని గమనించిన తల్లి.. కుమార్తె దగ్గనున్న ఫోనును లాక్కుంది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ పదవ తరగతి విద్యార్థిని ఇంటి నుంచి బయటకు వచ్చి, ఏకంగా 13 కిలోమీటర్ల దూరం నడచి వెళ్లి,అక్కడి నుంచి తన స్నేహితురాలికి ఫోన్ చేసింది.ఆ స్నేహితురాలితో పాటు కలసి రైల్వే స్టేషన్కు వెళ్లి అక్కడ అందుబాటులో ఉన్న ఒక రైలులో కూర్చుంది. అయితే రైలు టీటీఈ ఆ విద్యార్థినులను ఖాండ్వా రైల్వే స్టేషన్(Railway station)లో ఎక్కడి నుంచి వస్తున్నారని ప్రశ్నించారు. వారు తడబడుతూ మాట్లాడుతుండటంతో టీటీఈ వారిని ఆర్పీఎఫ్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో వారు మైనర్లని తేలింది. దీంతోవారిని ఆర్పీఎఫ్ పోలీసులు బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. అక్కడి సిబ్బందికి ఆ విద్యార్థినులు తమ తల్లిదండ్రుల పేర్లు, చిరునామా చెప్పడంతో వారు ఆ విద్యార్థినులను తీసుకుని స్వయంగా వారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలల సంక్షేమ సమితి అధ్యక్షుడు ప్రవీణ్ శర్మ మాట్లాడుతూ వారిలో ఒక విద్యార్థిని వయసు 15 అని, మరొకరి వయసు 17 అని తెలిపారు. వారిద్దరూ ఒకే స్కూలులో చదువుతున్నారని, వారిద్దరికీ నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించాక వారిని తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు. ఇది కూడా చదవండి: ‘ఆ గోధుమలతోనే జుట్టూడింది’ -
తరగతి గదిలో మొబైల్ నిషిద్ధం.. పూజలు, నమాజ్కు పర్మిషన్ నో!
భిల్వారా: రాజస్థాన్లో కొనసాగుతున్న పాఠశాల విద్యావిధానంలో నూతన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. భిల్వారాలో జరుగుతున్న హరిత్ సంగం జాతర ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర విద్య పంచాయతీరాజ్ మంత్రి మదన్ దిలావర్ కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి ఏ ఉపాధ్యాయుడు కూడా తరగతి గదిలోనికి మొబైల్ ఫోన్ తీసుకెళ్లకూడదని, పాఠశాల సమయంలో ప్రార్థన లేదా నమాజ్ పేరుతో ఏ ఉపాధ్యాయుడు కూడా పాఠశాలను వదిలి వెళ్లకూడదని ఆయన ఆదేశించారు.రాష్ట్రంలో విద్యా రంగాభివృద్ధికి విద్యా శాఖ(Department of Education) జారీ చేసిన ఆదేశాలను అమలయ్యేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని మదన్ దిలావర్ పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలని, తరగతి గదిలో బోధించేటప్పుడు ఏ ఉపాధ్యాయుడు మొబైల్ ఫోన్ తీసుకెళ్లకూడదన్నారు. తరగతి గదిలో ఫోన్ మోగితే, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇబ్బందికరంగా మారుతుందన్నారు. ఫలితంగా చదువులకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.ఇదేవిధంగా పాఠశాల జరుగుతున్న సమయంలో మతపరమైన ప్రార్థనల పేరుతో ఏ ఉపాధ్యాయుడు పాఠశాల నుండి బయటకు వెళ్లకూడదని ఆదేశించారు. ఇటువంటి ఘటనలపై పలుమార్లు ఫిర్యాదులు(Complaints) వచ్చిన దరిమిలా విద్యాశాఖ ఇటువంటి నిర్ణయం తీసుకున్నదన్నారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు.. విద్యార్థులకు 20కి 20 మార్కులు ఇస్తున్నారని, అలా ఇవ్వడం సరైనది కాదన్నారు. బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.ఇది కూడా చదవండి: Delhi Election 2025: ఐదు వ్యాన్లతో ఆప్పై కాంగ్రెస్ ప్రచార దాడి -
విశాఖ సెంట్రల్ జైలులో మరో మొబైల్ కలకలం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ సెంట్రల్ జైలులో మరో మొబైల్ కలకలం రేగింది. నర్మదా బ్లాక్లో మరో మొబైల్ను అధికారులు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం మూడు సెల్ ఫోన్లను అధికారులు గుర్తించారు. సిమ్ కార్డులేని మొబైల్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సూపరింటెండెంట్ మహేష్ బాబు నేతృత్వంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.విశాఖ సెంట్రల్ జైలులో సెల్ ఫోన్లు దొరకడం సంచలనంగా మారింది. జైలు అధికారులు రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా డిసెంబరు 31న పెన్నా బ్యారక్ సమీపంలో పోలీసులకు సెల్ ఫోన్స్ దొరికాయి. బ్యారక్ సమీపంలోని పూల కుండీ వద్ద భూమిలో నాలుగు అడుగల లోతున ఫోన్లను పాతిపెట్టారు. ఫోన్లను ప్యాక్ చేసి గుంతలో దాచిపెట్టారు. రెండు రాళ్లు కప్పి పైన పూల కుండీ పెట్టారు.ఆ కవర్లో రెండు సెల్ఫోన్లు, ఒక పవర్ బ్యాంక్, రెండు చార్జింగ్ వైర్లు, ఫోన్ బ్యాటరీ కనిపించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇక, దొరికిన సెల్ఫోన్లలో సిమ్ కార్డులు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, కవర్ దొరికిన పెన్నా బ్యారక్లో రౌడీ షీటర్ హేమంత్ కుమార్, ఇతర ఖైదీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. -
క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండిలా..
ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే ప్రస్తుతం చాలా ప్రకటనల్లో క్యూఆర్ కోడ్ను గమనిస్తుంటాం. ఆ కోడ్ను స్కాన్(Scan) చేస్తే నేరుగా సదురు ప్రకటన వివరాలు తెలుసుకోవచ్చు. పూర్తి సమాచారాన్ని ఫిజికల్గా ప్రకటనల్లో ఇవ్వడం కొన్నిసార్లు కుదరకపోవచ్చు. దాంతో చాలా కంపెనీలు క్యూఆర్(QR Code) కోడ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. కేవలం కంపెనీ ఉత్పత్తుల వివరాలే కాకుండా విద్య, వైద్యం, పరిశ్రమలు, బీమా రంగం.. ఇలా ఏ విభాగంలో చూసినా క్యూఆర్ కోడ్తో సమాచారాన్ని తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఏదైనా డివైజ్ల్ ఉన్న క్యూఆర్ను లేదా ఫేన్పే, జీపే వంటి లావాదేవీలకు సంబంధించిన క్యూఆర్ను స్కాన్ చేయడం సులువే. కానీ మీకు ఎవరైనా సాఫ్ట్కాపీ(Soft Copy) పంపించి అందులో క్యూఆర్ కోడ్ సమాచారం తెలుసుకోవాలంటే ఏం చేస్తారు.. మీకు వచ్చిన క్యూఆర్ను తిరిగి వేరే ఫోన్కు పంపించి అందులోనుంచి మీ డివైజ్లో స్కాన్ చేస్తారు కదా. ఇది అన్నివేళలా కుదరకపోవచ్చు. అలాంటి సమయంలో సులువుగా క్యూఆర్ స్కాన్ చేసే మార్గం ఉంది.గూగుల్ లెన్స్ఫోన్ స్క్రీన్ నుంచి నేరుగా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడానికి గూగుల్ లెన్స్ను వినియోగించడం సులువైన మార్గం. దీన్ని గూగుల్ సదుపాయం ఉన్న ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలో ఉపయోగించవచ్చు.ఎలా ఉపయోగించాలంటే..ఫోన్లోని క్యూఆర్ కోడ్ను స్క్రీన్షాట్(Screen Shot) తీసుకోవాలి.గూగుల్ ఫోటోలు లేదా గూగుల్(Google) యాప్ను ఓపెన్ చేయాలి.సెర్చ్ బటన్ పక్కన లెన్స్ సింబల్ కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేసిన వెంటనే గ్యాలరీకి యాక్సెస్ అడుగుతుంది.ఫోటోలకు యాక్సెస్ ఇచ్చి అప్పటికే స్క్రీన్షాట్ తీసుకున్న క్యూఆర్ కోడ్ను సెలక్ట్ చేసుకోవాలి.గూగుల్ లెన్స్(Google Lens)లోని కృత్రిమమేధ మీరు సెలక్ట్ చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి నేరుగా అందులోని సమాచారాన్ని రీడైరెక్ట్ చేస్తుంది.వేరే ఫోన్ అవసరం లేకుండానే నేరుగా సాఫ్ట్కాపీ లేదా స్క్రీన్షాట్ తీసిన క్యూఆర్ వివరాలు తెలుసుకునేందుకు ఇలా ప్రయత్నించవచ్చు.ఇదీ చదవండి: భలే ఛాన్స్.. తగ్గిన బంగారం ధర! తులం ఎంతంటే..ప్రస్తుతం చాలా ఫోన్ తయారీ కంపెనీలు వాటి కెమెరాలు లేదా గ్యాలరీ యాప్ల్లోనే నేరుగా క్యూఆర్ కోడ్ స్కానింగ్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. అంటే గూగుల్ లెన్స్ అవసరం కూడా లేకుండానే నేరుగా కెమెరా ఆన్ చేసి క్యూఆర్ను స్కాన్ చేయవచ్చు. -
మొబైల్ వాడకుండా, ఎనిమిది గంటల్లో రూ. లక్ష సంపాదించింది!
అందాల పోటీల్లో విశ్వసుందరిగా నిలిచిన సుందరాంగుల గురించి విన్నాం.. కుస్తీ పోటీల్లో కండబలం చూపించిన ధీరేశ్వరుల గురించి తెలుసు. మేమేం తీసిపోయాం అంటూ అన్నింటా సమ ఉజ్జీగా పోటీ పడుతున్నమగువల కథనాలూ చాలానే విన్నాం. కానీ ప్రస్తుతం ఒక వింత..కాదు కాదు, చాలెంజింగ్ అండ్ క్రియేటివ్ పోటీ ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. చైనాకు చెందిన ఒక మహిళ మొబైల్ ఫోన్ వాడకుండా ఎనిమిది గంటలు గడిపి లక్షరూపాయలకు పైగా బహుమతిని గెల్చుకుంది. ఇంట్రస్టింగ్గా ఉంది కదా.. అదేంటి అంటే..!చాంగ్కింగ్ మునిసిపాలిటీలోని షాపింగ్ సెంటర్లో ఈ ప్రత్యేకమైన పోటీని నిర్వహించారు. ప్రశాంతంగా, ఎలాంటి ఆందోళన లేకుండా ఎనిమిది గంటల పాటు మొబైల్ ఫోన్ వాడకుండా గడపాలి. ఈ పోటీలో నైరుతి చైనాకు చెందిన ఒక మహిళ 10,000 యువాన్లను (సుమారు రూ.1,16,000) గెలుచుకుని వార్తల్లో నిలిచింది.నవంబరు 29న జరిగిన ఈ పోటీలో 100 మంది దరఖాస్తుదారులలో పది మంది పోటీదారులు పాల్గొన్నారు. మొబైల్ ఫోన్లు లేదా ఐప్యాడ్లు లేదా ల్యాప్టాప్ల వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు ప్రాప్యత లేకుండా, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బెడ్పై ఎనిమిది గంటలు గడపాలి. కంపోజ్డ్ గా, రిలాక్స్డ్గా ఉంటూ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్( స్మార్ట్ఫోన్, ఐప్యాడ్, ల్యాప్టాప్) వాడాలన్న ఉత్సుకత లేకుండా గడపాలి.నిబంధనలు, కత్తిమీద సామేజిము న్యూస్ రిపోర్టుల ప్రకారం, నిబంధనలూ కఠినంగా ఉన్నాయి. ఈవెంట్కు ముందు పోటీదారులు తమ మొబైల్ ఫోన్లను సరెండర్ చేయాల్సి ఉంటుంది . అత్యవసర పరిస్థితుల్లో పాత మొబైల్ మోడల్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఎమర్జెన్సీ ఫోన్లను కుటుంబ సభ్యులను సంప్రదించడానికి మాత్రమే ఉపయోగించాలి. అదనంగా, పాల్గొనేవారు ఎక్కువ సమయం పడుకునే ఉండాలి. టాయిలెట్ బ్రేక్ కూడా ఐదు నిమిషాలు మాత్రమే. అంతేకాదు ఈ ఎనిమిది గంటలు ఎంచక్కా బజ్జుంటాను అంటే అస్సలు కుదరదు. పోటీదారులు గాఢ నిద్రలోకి జారుకోవడం నిషేధం. పాల్గొనేవారి ఆహారపానీయలు అందిస్తారు. వారి మానసిక ధైర్యాన్ని పరీక్షించే ప్రయత్నంలో, నిర్వాహకులు మణికట్టు పట్టీలను ఉపయోగించి నిద్ర , ఆందోళన స్థాయిలను పర్యవేక్షించారు. ఈ పోటీలు శారీరక బలం కన్నా, మానసిక బలం, ఓర్పు ఎక్కువ అవసరం. అయితే పోటీదారుల్లో చాలామంది పుస్తకాలు, చదువుతా, విశ్రాంతిగా గడిపారు. (హలేబీడు ఉలి చెక్కిన గ్రంథం, ఆసక్తికర విషయాలు)100కి 88.99 స్కోరు చేసి, ఫైనాన్స్ సంస్థలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్న ఒక మహిళ విజేతగా నిలిచింది. మంచం మీదే, ఎలాంటి ఆందోళన లేకుండా, నిద్రపోకుండా ప్రశాంతంగా గడిపిందట. పోటీల్లో పాల్గొన్నటి దుస్తుల ఆధారంగా "పైజామా సోదరి" అనే మారుపేరుతో సంచలనం రేపుతోంది. సంపాదించింది. పరుపుల కంపెనీ ఈ పోటీని స్పాన్సర్ చేసింది. ఈ పోటీపెట్టడంలో కంపెనీ ఉద్దేశ్యం ఏంటి అనేది స్పష్టత లేదు కానీ నో మొబైల్-ఫోన్ ఛాలెంజ్ చైనా అంతటా వైరల్గా మారింది. నిముష నిమిషానికీ మొబైల్ స్క్రీన్ను అన్లాక్ చేసే మొబైల్ యూజర్లకు ఇది నిజంగానే అగ్ని పరీక్షే. ఓసోసి.. అదెంత పని అనుకుంటున్నారా? అయితే మీరూ ప్రయత్నించండి. బోలెడంత ప్రశాంతత, ఆరోగ్యం మీ సొంతమవుతుంది. -
రూ.15,000 లోపు ప్రీమియం ఫీచర్లున్న స్మార్ట్ఫోన్లు
-
స్క్రీన్కు బానిసవుతున్న బాల్యం
విహాన్ వయసు మూడున్నరేళ్లు. తన తోటి పిల్లలు చురుకుగా ఆడుతూ, కేరింతలు కొడతూ, చిట్టిచిట్టి మాటలతో అలరిస్తుంటే తాను మాత్రం ఏమి పట్టనట్లు దిగాలుగా ఉంటున్నాడు. రోజంతా మొబైల్ చూస్తూ కాలం గడుపుతున్నాడు. మాటలు రావడం లేదని తల్లిదండ్రులు డాక్టర్ వద్దకు తీసుకెళితే అసలు విషయం బోధపడింది. చిన్నప్పటి నుంచి తనకు మొబైల్ చూపించడంతో దానికి బానిసయ్యాడని తెలిసింది. టెక్నాలజీ పెరుగుతోందని సంబరపడాలో..అది మన తర్వాతి తరాలకు శాపంగా మారబోతుందని బాధపడలో తెలియని పరిస్థితి నెలకొంది. పుట్టి ఎడాదిన్నర కావస్తున్న చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు మొబైలే ప్రపంచమైంది. చిట్టిపొట్టి మాటలు నేర్చుకుంటూ తాత, అమ్మమ్మలూ, నాయనమ్మలతో సంతోషంగా గడపాల్సిన బాల్యం ఎలక్ట్రానిక్ స్క్రీన్లకు బానిసవుతుంది. గతంలో ఇంట్లో పెద్దవారు పిల్లలకు మాటలు, మంచి అలవాట్లు నేర్పుతూ కాలం గడిపేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగం చేయడంతో పిల్లలను పట్టించుకునేవారు లేకుండా పోయారు. వివిధ కారణాల వల్ల తాతలు, అమ్మమ్మ, నాయనమ్మలు పిల్లల వద్ద ఉండలేకపోతున్నారు. దాంతో తెలిసి తెలియక తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల పిల్లలను ఎలక్ట్రానిక్ వస్తువులకు బానిసలుగా మారుస్తున్నారు.పేరెంట్స్ నుంచే పిల్లలకుకేవలం పిల్లల చేతిలోని ఫోనే కాకుండా, తల్లిదండ్రులు వాడే ఫోన్ వల్ల కూడా పిల్లలకు మాటలు రావడం లేదని ఎస్తోనియా దేశంలోని టార్టూ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అద్యయనం ద్వారా తెలిసింది. తల్లిదండ్రులకు ఫోన్ని అతిగా చూసే అలవాటు ఉంటే అది పిల్లలకూ వస్తుందట. వాళ్ల స్క్రీన్టైం సమయం కూడా దాదాపు ఉండటం గమనించారు. రెండు నుంచి నాలుగున్నరేళ్ల వయసులో ఉన్న పిల్లల్ని ఎంపిక చేసుకుని వారి భాషానైపుణ్యాలని పరిశీలించారు. పిల్లలూ, వాళ్ల తల్లిదండ్రులూ రోజులో ఎంత సమయం ఫోన్లో గడుపుతున్నారో చూశారు. స్క్రీన్ టైమ్ అతితక్కువగా ఉన్న తల్లిదండ్రులూ, పిల్లల మధ్య భాషానైపుణ్యాలని పరీక్షించారు. ఈ తరహా పిల్లల్లో భాషానైపుణ్యాలు ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్నాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ‘షరతులు తీరిస్తే జాబ్ చేయడానికి సిద్ధం’సమయం గడపాలిమొబైల్ ఫోన్లు చూపించడానికి బదులుగా పిల్లలతో ఎక్కవ సమయం గడిపేందుకు చొరవ చూపాలని శాస్త్రవేత్తలు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. పిల్లలతో కలిసి అవుట్డోర్లో ఆడేందుకు సమయం కేటాయించాలని చెబుతున్నారు. ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి పిల్లలతో గడపాలంటున్నారు. -
సెల్ఫోన్ రికవరీలో ‘అనంత’ టాప్
అనంతపురం: సెల్ఫోన్ల రికవరీలో 10 వేల మైలురాయిని దాటి అనంతపురం పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. ఇప్పటివరకు మొత్తం 10,195 ఫోన్ల రికవరీ చేసి, బాధితులకు అందజేశారు. వీటివిలువ సుమారు రూ.18.85 కోట్లుగా నిర్ధారించారు. తాజాగా రికవరీ చేసిన 1,309 మొబైల్ ఫోన్లను బాధితులకు మంగళవారం అనంతపురంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఎస్పీ పి.జగదీష్ అందజేశారు. వీటివిలువ రూ.3.45 కోట్లు ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు. సెల్ఫోన్ పోగొట్టుకున్న తర్వాత ఆచూకీ దొరకదనుకునే ఫోన్లను సైతం రికవరీ చేసి అందజేయడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ పోలీసులను అభినందించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని బాధితులకు 1,156 ఫోన్లు అందజేశారు. -
ఫోన్ల రికవరీలో అనంతపురం పోలీసుల రికార్డు.. ఏకంగా 18.85 కోట్ల విలువైన
సాక్షి, అనంతపురం: అనంతపురం పోలీస్ మైదానంలో సెల్ఫోన్ల రికవరీ మేళా నిర్వహించారు. సెల్ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు క్యూ కట్టడంతో పరేడ్ మైదానం జాతరను తలపించింది. మంగళవారం ఒక్కరోజే 1309 మంది బాధితులకు తమ ఫోన్లను తిరిగి అందజేశారు పోలీసులు. ఫోన్లు రివకరీ చేసిన సిబ్బందిని పోలీసులు ప్రశంసించి రివార్డులు అందించారు.ఇప్పటి వరకు జిల్లాలో 10వేల మందికి సంబంధించిన 18.5 కోట్ల రూపాయల విలువైన సెల్ ఫోన్లను రికవరీ చేసి ఇచ్చామని జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. ఇవాళ అందజేసిన ఫోన్ల విలువ రూ. 3 కోట్ల 45 లక్షలు ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు 10,195 ఫోన్లు రికవరీ చేయగా.. వీటిలో 19 జిల్లాలకు 2535 ఫోన్లను, 20 రాష్ట్రాలకు 1056 మొబైళ్లను పంపిణీ చేశామని తెలిపారు. రికవరీ చేసి నేడు అందించిన ఫోన్ల విలువ 3 కోట్ల 45 లక్షలు ఉంటుందని చెప్పారు. -
బీఎస్ఎన్ఎల్ నుంచి 4జీ ఫోన్.. ఇక అంతా చవకే!
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) సొంత 4జీ మొబైల్ ఫోన్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం కార్బన్ మొబైల్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇతర టెలికాం సంస్థల కంటే చౌకగా ఉండే కొత్త ఫోన్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.ప్రైవేటు టెలికాం కంపెనీలు తమ టారిఫ్ రేట్లను పెంచడంతో మొబైల్ యూజర్లు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. బీఎస్ఎన్ఎల్లో రీఛార్జ్ ప్లాన్లు చవగ్గా ఉండటమే ఇందుకు కారణం. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని మరింత మంది వినియోగదారులను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ అడుగులు వేస్తోంది. తన 4జీ నెట్వర్క్ను వేగంగా విస్తరిస్తోంది. అంతటితో ఆగకుండా టైర్ 2, టైర్ 3 నగరాల్లోని వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి ఈ చవకైన 4జీ ఫోన్ను ప్రవేశపెడుతోంది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త టెక్నాలజీ..దేశంలోని ప్రతి మూలకు సరసమైన 4జీ కనెక్టివిటీని తీసుకురావడానికి బీఎస్ఎన్ఎల్, కార్బన్ మొబైల్స్ చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నాయి. దేశ "4జీ సాథీ పాలసీ" కింద ప్రత్యేక సిమ్ హ్యాండ్సెట్ బండ్లింగ్ ఆఫర్ను ప్రారంభించనున్నాయి. దేశవ్యాప్తంగా సరసమైన 4జీ కనెక్టివిటీని అందించడమే తమ లక్ష్యమని బీఎస్ఎన్ఎల్ ఒక పోస్ట్లో పేర్కొంది. ఈ ఫోన్ బీఎస్ఎన్ఎల్ సిమ్తో వస్తుంది. వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది. -
సెల్లో సొల్లు ముచ్చట్లు !
సాక్షి, హైదరాబాద్: మొబైల్ ఫోన్ వినియోగం అనేది నిత్య జీవితంలో ఒక భాగమైంది. ఎక్కడున్నా ఇతరులతో మనం ఎప్పుడూ ‘హలో’దూరంలోనే ఉండొచ్చు. అయితే ఈ మొబైల్ ఫోన్లలో ఇప్పుడు సొల్లు ముచ్చట్లు ఎక్కువయ్యాయి. మనకు అవసరం లేని విషయాలు చెప్పి విసిగించే వారు ఎక్కువవుతున్నారు. బిజినెస్ ప్రమోషన్లు, ఆర్థికపరమైన ఆఫర్లు, అంశాలు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల పేరిట ప్రతి నిత్యం ఏదో ఒక అపరిచిత నంబర్ నుంచి మన మొబైల్ ఫోన్కు ఫోన్కాల్స్ లేదా ఎస్ఎంఎస్లు రావడం పరిపాటిగా మారింది. మొబైల్ వినియోగదారుల చెవిలో మోతగా మారిన ఈ పెస్కీ (ఇబ్బందికరమైన) కాల్స్తో మొబైల్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై లోకస్ సర్కిల్స్ సంస్థ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది.మొత్తం 18,173 మంది నుంచి అభిప్రాయాలు సేకరించగా వీరిలో 95 శాతం మంది ఈ తరహా ఫోన్కాల్స్ వస్తున్నట్టు తెలిపారు. రోజుకు సరాసరిన 3 కాల్స్ పైనే వచి్చనట్టు సర్వేలో పాల్గొన్న 77 శాతం మంది వెల్లడించారు. డీఎన్డీ (డు నాట్ డిస్ట్రబ్–అనవసర ఫోన్కాల్స్, ఎస్ఎంఎస్లు రావొద్దు అని పెట్టుకునే ఆప్షన్) వాడుతున్న వారికి ఈ స్పామ్ కాల్స్ బెడద తప్పడం లేదు. మొబైల్ వినియోగదారులకు తలనొప్పిగా మారిన ఈ తరహా ఫోన్కాల్స్కు సంబంధించి మొబైల్ వినియోగదారులు లోకల్ సర్కిల్స్ సర్వేలో పంచుకున్న అంశాలు ఇలా.. గత ఆరు నెలల్లో మరింత పెరిగిన బెడద ఇలాంటి అనవసర, వ్యాపార ప్రమోషన్లకు సంబంధించిన ఫోన్కాల్స్ బెడద మొబైల్ వినియోగదారులు గత ఆరు నెలల్లో మరింత పెరిగినట్టు సర్వే నివేదిక వెల్లడించింది. ఆరు నెలల కిందట 90 శాతం నుంచి 95 శాతానికి ఇది పెరిగినట్టు తెలిపింది. ఆరు నెలల కిందట రోజుకు పదికిపైగా స్పామ్కాల్స్ వచ్చే వారి సంఖ్య 3 శాతం ఉండగా.. ఇది ఆరు నెలల్లో 23 శాతానికి పెరిగినట్టు సర్వే పేర్కొంది. అయితే, వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ స్పామ్కాల్స్, మెసేజ్లను అరికట్టేందుకు ట్రాయ్ (టెలీకమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) చర్యలకు ఉపక్రమించినట్టు లోకల్ సర్కిల్స్ సంస్థ వెల్లడించింది. -
మొబైల్ ఫోన్తో బ్రెయిన్ క్యాన్సర్ రాదు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ వినియోగిస్తే బ్రెయిన్ క్యాన్సర్ సోకుతుందున్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్లుగా ఉంది. అయితే, ఇది అపోహ మాత్రమేనని, ఎంతమాత్రం నిజం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫోన్కు, బ్రెయిన్ క్యాన్సర్కు మధ్య ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటున్నాయి. ఈ అంశంపై జరిగిన 5 వేలకుపైగా అధ్యయనాలను ఆ్రస్టేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్, న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ(అర్పాన్సా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ పరిశోధకుల బృందం నిశితంగా సమీక్షించింది. ఇందులో 63 అధ్యయనాల వివరాలు 1994 నుంచి 2022 వరకు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వైర్లెస్ టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరిగింది. కానీ, బ్రెయిన్ క్యాన్సర్ కేసులు మాత్రం పెరగలేదని పరిశోధకులు గుర్తించారు. అధ్యయనాల్లో తేలిన ఫలితాల ఆధారంగా వారు ఈ నిర్ధారణకు వచ్చారు. ఇది తగిన సాక్ష్యాధారాల ఆధారంగా జరిగిన చాలా సమగ్రమైన విశ్లేషణ అని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సూచనతో జరిగిన ఈ విశ్లేషణ వివరాలను ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ పత్రికలో ప్రచురించారు. ఫోన్ వాడకంతో తలకు, మెడకు సైతం క్యాన్సర్ సోకుతున్నట్లు ఆధారాలు లేవని వెల్లడించారు. ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ను పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం ఉపయోగిస్తే బ్రెయిన్ క్యాన్సర్ సోకుతుందని చెప్పలేమని స్పష్టంచేశారు. సాధారణంగా ఫోన్ల నుంచి రేడియో తరంగాలు వెలువడుతాయన్న సంగతి తెలిసిందే. ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంటాం కాబట్టి బ్రెయిన్ క్యాన్సర్ సోకుతుందన్న ప్రచారం దశాబ్దాల క్రితమే మొదలైంది. దీనిపై ప్రజల్లో రకరకాల భయాందోళనలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఫోన్ల నుంచి వెలువడే రేడియో తరంగాల వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందంటూ కొన్ని అధ్యయనాలు సైతం చెప్పాయి. 2011లో డబ్ల్యూహెచ్ఓ అనుబంధ విభాగమైన ఇంటర్నేషన్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్(ఐఏఆర్సీ) సైతం ఇదే విషయం వెల్లడించింది. అయితే, ఈ సంస్థ చాలా పరిమితమైన సమాచారంపై ఆధారపడి ఈ నిర్ధారణకు వచ్చిందని, సమగ్రమై అధ్యయనం చేయలేదని అంతర్జాతీయ పరిశోధకులు తాజాగా తేలి్చచెప్పారు. ఫోన్లతో క్యాన్సర్లు వస్తాయన్న ఆపోహ వీడాలని సూచించారు. -
ఆ సెగ్మెంట్లో మోస్ట్ పాపులర్ స్మార్ట్ ఫోన్లు ఇవే..?
భారత్లో ఎక్కువగా రూ.10 వేలు నుంచి రూ.20 వేల ధర ఉన్న మొబైల్ ఫోన్లకు భారీగా డిమాండ్ ఉందని ఇన్ఫినిక్స్ ఇండియా సీఈఓ అనీష్ కపూర్ తెలిపారు. గత రెండేళ్లుగా మొబైల్ మార్కెట్లోని స్తబ్దత తొలగిపోయిందన్నారు. 5జీ ట్రెండ్ కొనసాగుతుండడంతో చాలా మంది కస్టమర్లు అందుకు అనువుగా ఉంటే ఫోన్లను విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం..‘భారత మార్కెట్లో రూ.10,000-రూ.20,000 మధ్య ధర కలిగిన స్మార్ట్ఫోన్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే మొత్తం అమ్మకాలు 40% పైగా పెరిగాయి. ఇటీవలి కాలంలో 5జీ ఫోన్లకు డిమాండ్ అధికమైంది. గతంలో రూ.10,000 లోపు ఫోన్లకు ఎక్కువ మార్కెట్ ఉండేది. 5జీ రావడంతో రూ.10,000 కంటే అధిక ధర మొబైళ్లకు డిమాండ్ పెరిగింది. గత రెండేళ్లుగా మార్కెట్లో ఉన్న స్తబ్దత తొలగిపోయింది. ఫీచర్లు అప్గ్రేడ్ చేయడం, తాజా ట్రెండ్కు తగిన లేటెస్ట్ టెక్నాలజీ అందించడం ద్వారా వీటికి మరింత గిరాకీ ఏర్పడే అవకాశం ఉంది’ అన్నారు.ఇదీ చదవండి: ‘బహిరంగ విచారణ జరగాలి’ -
ప్రపంచంలో పలుచని స్మార్ట్ఫోన్
మొబైల్స్ తయారీ దిగ్గజం మోటరోలా భారత్లో ఎడ్జ్ 50 స్మార్ట్ఫోన్ విడుదల చేసింది. మిలిటరీ గ్రేడ్ ధ్రువీకరణతో ప్రపంచంలో అతి పలుచని స్మార్ట్ఫోన్ ఇదేనని కంపెనీ వెల్లడించింది. 7.79 మిల్లీమీటర్ల మందంతో దీన్ని తయారుచేశారు.ఇందులో ఆన్డ్రాయిడ్ 14 ఓఎస్, 6.67 అంగుళాల ఓలెడ్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్–5, క్వాల్కామ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ 256 జీబీ ఇంటర్నల్ మెమరీ, 50 ఎంపీ మెయిన్ సెన్సార్, 13 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 10 ఎంపీ టెలిఫోటో, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా పొందుపరిచారు. డాల్బీ అట్మోస్ సౌండ్, 68 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్స్ వైర్లెస్ చార్జింగ్తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి హంగులు ఉన్నాయి. మార్కెట్లో దీని ధర రూ.27,999గా ఉంది.ఇదీ చదవండి: భవిష్యత్తులో డిమాండ్ ఏర్పడే విభాగం..! -
నగరవాసుల్లో 'నోమో ఫోబియా'
ప్రపంచాన్ని మన గుప్పిట్లోకి అదే మరో చేత్తో మనల్ని తన గుప్పిట్లోకి తెచ్చేసింది స్మార్ట్ఫోన్. అయితే సరికొత్త ధైర్యాలతో పాటు భయాలను కూడా మనకు చేరువ చేస్తోంది. సరదాలను తీర్చడంతో పాటు సమస్యలనూ పేర్చేస్తోంది. రోజంతా ఫోన్తోనే గడిపే స్మార్ట్ ఫోన్ ప్రియుల్లో నోమో ఫోబియా అనే సరికొత్త అభద్రతా భావం పెరుగుతోందని ఒప్పో కౌంటర్పాయింట్ చేసిన అధ్యయనం వెల్లడించింది.ఈ ఫోబియా తీవ్రతను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లోని 1,500 మంది స్మార్ట్ఫోన్ వినియోగదారులపై ఈ అధ్యయనం జరిగింది. అదే విధంగా నోమోఫోబియా అంటే నో మొబైల్ ఫోన్ ఫోబియా అంటే... మొబైల్ ఫోన్ నుంచి దూరం అవుతానేమో అనే భయంతో పుట్టే మానసిక స్థితి అని జర్నల్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్లో ప్రచురించబడిన అధ్యయనం పేర్కొంది. మొబైల్ ఫోన్ ల మితిమీరిన వినియోగం వల్ల సంభవించే మానసిక రుగ్మతల్లో ఇది ఒకటిగా తేలి్చంది. – సాక్షి, సిటీబ్యూరోఅప్పటిదాకా చేతిలోనే ఉన్న పోన్ కాసేపు కనబడకపోతే లేదా దూరంగా ఉంటే చాలు.. నా ఫోన్ ఏది? ఎక్కడ ఉంది? ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలిగా... అంటూ ఆందోళనగా, అసహనంగా, గాభరాపడిపోవడం అలాగే ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఆగిపోతుందేమో అనే కంగారుపడేవాళ్లని చాలా మందినే మనం చూస్తున్నాం. అయితే వారిలో ఇది చూడడానికి సాధారణ సమస్యగా కనిపిస్తున్నా.. అది సాధారణం కానే కాదని, ఆ సమయంలో కలిగే భయాందోళనలు తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యగా మారే ప్రమాదం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.కారణం ఏదైనా సరే.. మన ఫోన్కు కొద్దిసేపైనా సరే దూరంగా ఉండాలనే ఆలోచన ఎవరికైతే ఆందోళన కలిగిస్తుందో.. తరచుగా తమ ఫోన్ను తరచి చూసుకోవడం వంటి లక్షణాలతో నోమో ఫోబియా బాధితులుగా మారే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఇది ప్రతీ నలుగురు స్మార్ట్ ఫోన్ ప్రియుల్లో ముగ్గురిని ప్రభావితం చేస్తోందని, నగరాలు/ గ్రామాలు తేడా లేకుండా ఇది దాదాపు 75 శాతం జనాభాపై దాడి చేస్తోందని అధ్యయన నిర్వాహకులు అంటున్నారు. మితమే హితం..డిజిటల్ అక్షరాస్యత అందరికీ అలవడాలి. బాధ్యతాయుతమైన స్మార్ట్ఫోన్ వినియోగాన్ని ప్రోత్సహించడం అవసరం. సమస్య ముదిరితే అంతర్లీన ఆందోళన లేదా డిపెండెన్సీ సమస్యలను పరిష్కరించడానికి కాగ్నిటివ్–బిహేవియరల్ థెరపీ, కౌన్సెలింగ్ అవసరం కావచ్చు. స్మార్ట్ఫోన్ వినియోగంపై పరిమితులను సెట్ చేయాలి. అంటే ‘టెక్–ఫ్రీ’ సమయాలు లేదా ప్రాంతాలు వంటివి. శారీరక శ్రమ మానసికోల్లాసం కలిగించే ఆఫ్లైన్ కార్యకలాపాలు వంటి హాబీల్లో పాల్గొనడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.ఆరోగ్యంపై దు్రష్పభావం.. నోమోఫోబియాతో ఆందోళన, శ్వాసకోశ మార్పులు, వణుకు, చెమట, ఆందోళన, అయోమయ స్థితి వగైరాలు కలుగుతున్నాయి. అలాగే నిద్రలేమి, ఏకాగ్రత లేమి, నిర్లక్ష్యాన్ని ప్రేరేపించి వ్యక్తిగత సంబంధాలను విస్మరించేలా చేస్తుంది. కారణం ఏదైనా సరే.. స్మార్ట్ఫోన్లపై అతిగా ఆధారపడటం వల్ల ముఖ్యమైన అప్డేట్లు, సందేశాలు లేదా సమచారాన్ని కోల్పోతారనే భయంతో వ్యక్తులు ఈ ఫోబియాకు గురవుతున్నారు.అధ్యయన విశేషాలివీ..– నో మొబైల్ ఫోబియానే షార్ట్ కట్లో ‘నోమో ఫోబియా‘గా పేర్కొంటున్నారు. ఇది వర్కింగ్ కండిషన్లో ఉన్న మొబైల్ ఫోన్ దగ్గర లేకపోవడం వల్ల కలిగే భయం లేదా ఆందోళనను సూచిస్తుంది.– అధ్యయనంలో పాల్గొన్న స్మార్ట్ఫోన్ వినియోగదారుల్లో 65 శాతం మంది తమ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతున్నప్పుడు రకరకాల మానసిక అసౌకర్యాలకి గురవుతున్నారని అధ్యయనం తేలి్చంది. ఆ సయమంలో వీరిలో ఆందోళన, ఆత్రుత, డిస్కనెక్ట్, నిస్సహాయత, అభధ్రత భావాలు ఏకకాలంలో ముప్పిరిగొంటున్నాయని వెల్లడించింది. అంతేకాకుండా బ్యాటరీ పనితీరు సరిగా లేదనే ఏకైక కారణంతో 60 శాతం మంది తమ స్మార్ట్ఫోన్లను రీప్లేస్ చేయబోతున్నారని అధ్యయనం వెల్లడించింది.– ఈ విషయంలో మహిళా వినియోగదారుల (74 శాతం మంది)తో పోలిస్తే పురుష వినియోగదారులు (82 శాతం మంది) ఎక్కవ సంఖ్యలో ఆందోళన చెందుతున్నారని అధ్యయనంలో తేలింది.– ఫోన్ ఆగకూడదనే ఆలోచనతో 92.5 శాతం మంది పవర్–సేవింగ్ మోడ్ను ఉపయోగిస్తున్నారని, 87 శాతం మంది తమ ఫోన్లను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు సైతం ఉపయోగిస్తున్నారని తేలి్చంది.– ‘ముఖ్యంగా 31 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వారిలో బ్యాటరీ గురించిన ఆందోళన ఎక్కువగా ఉంది. తర్వాత స్థానంలో 25 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల వారు ఉన్నారు’ అని రీసెర్చ్ డైరెక్టర్, తరుణ్ పాఠక్ చెప్పారు.సాంకేతికత రోజువారీ జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నందున, నోమోఫోబియా, దాని అనుబంధ సవాళ్లను పరిష్కరించడం ఒక క్లిష్టమైన అంశం కాబోతోంది. ఆరోగ్యకరమైన సాంకేతికత అలవాట్లను పెంపొందించడం స్మార్ట్ఫోన్లతో కాకుండా వ్యక్తుల మ«ధ్య సంబంధాలను శక్తివంతం చేయడం వంటివి నోమోఫోబియా ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తాయి. -
నాకు మొబైల్ లేదు: సిద్ధూ
బనశంకరి: కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తాను మొబైల్ ఫోన్ వాడనని చెప్పారు. సోమవారం మీడియా ప్రశ్నకు బదులిస్తూ, ‘‘ఒకప్పుడు ఆర్నెల్లు మొబైల్ వాడాను. రాత్రి వేళ ఫోన్లు రావడం, నిద్రకు భంగం కలగడంతో పక్కన పెట్టా. ఏ విషయమైనా పీఏలు, గన్మెన్ వచ్చి చెబుతారు. సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో నా కుమారుడు చెబుతాడు’’ అన్నారు. నాయకత్వ మార్పుపై హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని సిద్దరామయ్య అన్నారు. డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్కు సీఎంగా అవకాశమివ్వాలని ఇటీవల ఒక్కళిగ మతగురువు ఒకరు సిద్దరామయ్య సమక్షంలోనే కోరడం తెలిసిందే. -
మహా ఈవీఎం వివాదం
18వ లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4న అందరి దృష్టిని ఆకర్షించిన లోక్సభ స్థానం ముంబై నార్త్వెస్ట్. ఎందుకంటే అక్కడ గెలుపొందిన శివసేన అభ్యర్థి రవీంద్ర వాయ్కర్కు వచి్చంది కేవలం 48 ఓట్ల ఆధిక్యం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇదే అత్యల్ప మెజారిటీ. ఇప్పుడు దానిచుట్టే రగడ మొదలైంది. వాయ్కర్కు అనుకూలంగా కౌంటింగ్ కేంద్రంలో ఉన్న ఆయన బంధువు మొబైల్ ఫోన్తో ఈవీఎంను హ్యాక్ చేశారనే వార్తా కథనం సంచలనం రేకెత్తిస్తోంది. ఈ కథనం క్లిప్పింగ్తో ఆరోపణలు మొదలయ్యాయి. అయితే ఈవీఎంలను హ్యాక్ చేయడానికి వీల్లేదని, వాటిని తెరవడానికి ఓటీపీ అవసరమే లేదని, బాహ్య వ్యవస్థలతో ఎలాంటి అనుసంధానం లేకుండా ఈవీఎంలు స్వతంత్రంగా పనిచేస్తాయని ముంబై నార్త్వెస్ట్ రిటర్నింగ్ ఆఫీసర్ వందనా సూర్యవంశీ చెప్పారు. అనధికారికంగా కౌంటింగ్ కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫోన్ను వాడిన వాయ్కర్ బంధువుపై కేసు నమోదైందని వెల్లడించారు. ముంబై: ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లు బాహ్య ప్రపంచంతో ఎలాంటి అనుసంధానం, సాంకేతిక సంబంధాలు లేకుండా స్వతంత్రంగా పనిచేస్తాయని, సురక్షితమని ముంబై వాయువ్య లోక్సభ నియోజకవర్గం రిటరి్నంగ్ అధికారి వందనా సూర్యవంశీ ఆదివారం తెలిపారు. సమాచార మారి్పడికి ఈవీఎంలలో ఎలాంటి ఏర్పాటు ఉండదని పేర్కొన్నారు. ఈవీఎంలను తెరవడానికి ఎలాంటి ఓటీపీ అవసరం లేదని, వాటిపై ఉండే బటన్ను నొక్కడం ద్వారా ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఆమె వివరించారు. ముంబై నార్త్వెస్ట్లో శివసేన అభ్యర్థి రవీంద్ర వాయ్కర్ కేవలం 48 ఓట్లతో నెగ్గారు. రవీంద్ర వాయ్కర్ బంధువు మంగేష్ పాండిల్కర్ కౌంటింగ్ కేంద్రంలో ఈవీఎంకు అనుసంధానమైన మొబైల్ ఫోన్ను వాడారని, దీని ద్వారా ఈవీఎంను అన్లాక్ చేశారని, హ్యాక్ చేశారని మిడ్–డే పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. దీనిపై రిటరి్నంగ్ ఆఫీసర్ వందన స్పందిస్తూ.. ‘ఈవీఎంలు సాంకేతికంగా లోపరహితమైనవి. బయటినుంచి ఏ ఇతర సాంకేతిక వ్యవస్థలపై ఆధారపడకుండా స్వతంత్రంగా పనిచేస్తాయి. వాటిని ప్రోగ్రామ్ చేయడం కుదరదు. వైర్లెస్గా, వైర్లను కనెక్ట్ చేసి సమాచార మారి్పడి చేయడానికి ఈవీఎంలలో ఎలాంటి ఏర్పాటు లేదు’ అని తెలిపారు. రవీంద్ర వాయ్కర్ బంధువు మొబైల్ ఫోన్ ద్వారా ఈవీఎంను అన్లాక్ చేశారనే వాదనలను కొట్టిపారేశారు. ఇది శుద్ధ అబద్ధం. ఒక పత్రిక దీన్ని వ్యాపింపచేస్తోంది. మిడ్–డే పత్రికకు ఐపీసీ 499, 505 సెక్షన్ల కింద పరువునష్టం, అసత్య వార్తల ప్రచారానికి గాను నోటీసులు జారీచేశామని వందనా సూర్యవంశీ వెల్లడించారు. ముంబై నార్త్వెస్ట్లో శివసేన (యూబీటీ) అభ్యర్థి అమోల్ సజానన్ కీర్తికర్ గెలిచారని తొలుత వార్తలు వెలువడ్డాయి. అయితే రవీంద్ర వాయ్కర్ (శివసేన– షిండే) 48 ఓట్లతో గెలిచారని ఎన్నికల సంఘం ప్రకటించింది. మేము గెలిచినందుకేనా ఈ సందేహాలు: ఏక్నాథ్ షిండే ముంబై నార్త్వెస్ట్లో తమ (శివసేన) అభ్యర్థి రవీంద్ర వాయ్కర్ గెలిచినందుకే ఈవీఎంలపై అనుమానాలు రేకెత్తిస్తున్నారని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే మండిపడ్డారు. ఈ ఒక్క నియోజకవర్గం ఫలితంపైనే ఎందుకు సందేహాలు లేవనెత్తుతున్నారు. రాష్ట్రంలోని మిగతా స్థానాల ఫలితాలపై ఎందుకు అనుమానాలు వ్యక్తం చేయడం లేదు? ఎందుకంటే ముంబై నార్త్వెస్ట్లో నా అభ్యర్థి వాయ్కర్ గెలిచారు. వారి అభ్యర్థి (శివసేన–యూబీటీ) ఓడిపోయారు.. అని షిండే వ్యాఖ్యానించారు. ప్రజాతీర్పు వాయ్కర్కు అనుకూలంగా ఉందన్నారు. అది డాటా ఎంట్రీ ఆపరేటర్ మొబైల్ రవీంద్ర వాయ్కర్ బావమరిది మంగేష్ పాండిల్కర్ కాల్స్ చేయడానికి, అందుకోవడానికి కౌంటింగ్ కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ దినేశ్ గౌరవ్ ఫోన్ వాడారని రిటరి్నంగ్ ఆఫీసర్ వందన వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రంలో మొబైల్ వాడకూడదనే అధికారిక ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఐపీసీ 188 సెక్షన్ కింద మంగే‹Ùపై పోలీసు కేసు నమోదైంది. అలాగే దినేశ్ గౌరవ్పై కూడా కేసు నమోదైంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ డేటాను పొందుపర్చడానికి మాత్రమే మొబైల్ ఫోన్ను వాడాలని, ఫోన్తో అవసరం తీరగానే సీనియర్ అధికారికి అప్పగించాలని, ఎల్లప్పుడూ మొబైల్ ఫోన్ను సైలెంట్ మోడ్లోనే పెట్టాలి. దినేశ్ ఈ నిబంధనలను పాటించలేదని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మొబైల్ ఫోన్కు వచ్చే వన్టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్.. సిస్టమ్లోకి లాగిన్ అవుతారు. డేటా ఎంట్రీ, ఓట్ల లెక్కింపు రెండు వేర్వేరు అంశాలు. కౌంటింగ్ ప్రక్రియకు, మొబైల్ ఫోన్ అనధికారిక ఉపయోగానికి ఎలాంటి సంబంధం లేదు. మొబైల్ ఫోన్ వాడకం దురదృష్టకర ఘటన, దీనిపై దర్యాప్తు జరుగుతోందని వందన వెల్లడించారు. ‘అధునాతన సాంకేతిక ఫీచర్లు, గట్టి అధికారిక నిఘా ఉందని.. అందువల్ల ఓట్లను తారుమారు చేసే అవకాశమే లేదని చెప్పారు. ప్రతిదీ అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల ఎదుటే జరుగుతుందన్నారు. రవీంద్ర వాయ్కర్ గాని, ఓటమి పాలైన అమోల్ కీర్తికర్ గాని రీ కౌంటింగ్ను కోరలేదని తెలిపారు. చెల్లని పోస్టల్ బ్యాలెట్లను పునఃపరిశీలించాలని డిమాండ్ చేయగా.. తాము అది చేశామని వివరించారు. అధీకృత కోర్టు ఆదేశాలు ఉంటే తప్ప సీసీటీవీ ఫుటేజీని బయటపెట్టలేమని తెలిపారు. ఫలితాన్ని నిలిపివేయాలి: పృథ్విరాజ్ చౌహాన్ ముంబై నార్త్వెస్ట్ నియోజకవర్గ ఫలితాన్ని నిలిపివేయాలని సీనియర్ కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చౌహాన్ ఆదివారం డిమాండ్ చేశారు. భారత ఎన్నికల సంఘం అన్ని పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ అంశాన్ని లోతుగా చర్చించాలని కోరారు. ‘మొబైల్ ఫోన్ అనధికారిక వినియోగంపై దర్యాప్తు జరగాలి. ఎఫ్ఐఆర్ను బహిరంగపర్చలేదు’ అని చౌహాన్ అన్నారు. -
మొబైల్ ఆర్డర్ పెడితే.. ఏమొచ్చిందో తెలుసా? ఖంగుతిన్న కస్టమర్
ఆన్లైన్ ఆర్డర్ పెడితే.. డెలివరీ తీసుకునే వరకు వచ్చింది మనం పెట్టిన ఆర్డర్ అవునా? కాదా? అని సందేహమే. ఎందుకంటే గతంలో కొందమంది పెట్టిన ఆర్డర్స్ కారకుండా రాళ్లు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది.ఒక వ్యక్తి అమెజాన్లో వివో వై20ఏ మొబైల్ ఆర్డర్ చేశారు. డెలివరీ కూడా వచ్చింది. వచ్చిన డెలివరీని అన్బాక్సింగ్ చేసి చూస్తే ఒక్కసారిగా షాకయ్యాడు. ఎందుకంటే మొబైల్ ఫోన్కు బదులు అందులో మూడు సబ్బులు ఉన్నాయి. ఇది చూసి ఖంగుతిన్న కస్టమర్ అమెజాన్ కస్టమర్ కేర్ నుంచి సహాయం పొందటానికి ప్రయత్నించి విఫలమయ్యడు.తాను ఎదుర్కొన్న సమస్యను ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫోటోలను కూడా షేర్ చేశారు. అమెజాన్లో మొబైల్ ఆర్డర్ పెడితే.. సబ్బులు వచ్చాయని, దీనిపైన అమెజాన్ స్పందించలేదని పేర్కొన్నారు. ఆన్లైన్ మార్కెట్లో ఎంత పెద్ద మోసాలు జరుగుతున్నాయో ఆలోచించండి అంటూ ట్వీట్ చేసాడు.मेरी भांजी @Anuja7Jha ने @amazonIN से फ़ोन मंगाया। उसमें फ़ोन की जगह साबुन का टुकड़ा भेज दिया गया है। @AmazonHelp कोई मदद भी नहीं कर रहा है। सोचें,क्या ऐसे ऑनलाइन मार्केटिंग चल सकती है? इतना बड़ा फ्रॉड। आग्रह कि आमेजन पर दबाव बनाएँ। थैंक्स pic.twitter.com/8udb1uzTUB— Narendra Nath Mishra (@iamnarendranath) June 14, 2024 -
వన్ ప్లస్ ఫోన్ పై క్రేజీ డిస్కౌంట్..
-
నాకేమీ తెలియదు, మొబైల్ పోయింది
బనశంకరి: అత్యాచారం, లైంగిక వీడియోల కేసులో అరెస్టైన హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సిట్ అధికారులు బెంగళూరులో విచారణ చేపట్టారు. ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుండా నిరాకరిస్తున్నట్లు సిట్ వర్గాలు తెలిపాయి. ఇది రాజకీయకుట్ర, అనవసరంగా తనకు ఈ కేసులో ఇరికించారు. మీ పని మీరు చేయండి, నేనేమీ చెప్పను అని మొండికేసినట్లు తెలిసింది. ప్రశ్నలను తమ న్యాయవాదిని అడగాలని చెప్పిన ప్రజ్వల్ శుక్రవారం విచారణలో ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తన మొబైల్ఫోన్ ఏడాది కిందట చోరీ అయ్యిందని, మీరు అడుగుతున్న మొబైల్ఫోన్ తన వద్ద లేదని సిట్ అధికారులకు చెప్పారు. అశ్లీల వీడియోలలో ఉన్నది మీరే కదా అని చూపించగా, ఆ వీడియోల్లో ఉన్నది నేను కాదని, వారందరూ తనకు పరిచయం అంతే, నేను ఎవరిపై అత్యాచారానికి పాల్పడలేదని ప్రజ్వల్ చెప్పినట్లు సమాచారం. దీంతో విచారణను ఎలా సాగించాలని సిట్ అధికారులు తలపట్టుకున్నారు. నేడో రేపో ఘటనాస్థలికి శుక్రవారం రాత్రి 9 గంటల వరకు విచారించి భోజనం అందజేశారు. శనివారం కూడా విచారణ కొనసాగించారు. ఆదివారం లేదా సోమవారం హాసన్, హొళెనరసిపురలోని ఇళ్లకు ప్రజ్వల్ను తీసుకెళ్లి సంఘటనలు ఎలా జరిగాయో మహజరు పరిచే అవకాశముంది. ముందస్తు బెయిలు కోసం తల్లి అర్జీ ప్రజ్వల్ కేసులో ఓ బాధిత మహిళను అపహరించారనే కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన తల్లి భవానీ రేవణ్ణ శనివారం హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు హాజరు కావాలని సిట్ గతంలో నోటీసులు జారీచేసినా ఆమె హాజరు కాలేదు. దీంతో పరారీలో ఉన్నారని భవానీ కోసం సిట్ గాలిస్తోంది. ముందస్తు బెయిల్కోసం భవానీ ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించగా అర్జీని తిరస్కరించింది. అరెస్ట్ చేస్తారనే భయంతో భవానీ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం పిటిషన్ విచారణ కు వచ్చే అవకాశం ఉంది. బెంగళూరులో భవాని నివాసానికి ముగ్గురు మహిళా న్యాయవాదులు వెళ్లారు. వారు ఆమె తరఫున సిట్ అధికారులతో చర్చించారు. విచారణకు హాజరవుతారని, అరెస్టు కోసం ఒత్తిడి చేయరాదని సిట్ను కోరారు. -
గూగుల్ మ్యాజిక్ ఎడిటర్.. గురించి ఎప్పుడైనా విన్నారా!
పాత పిక్సెల్ ఫోన్లకు ‘మ్యాజిక్ ఎడిటర్’ను తీసుకురానున్నట్లు గూగుల్ ప్రకటించింది. ‘మ్యాజిక్ ఎడిటర్’లో రకరకాల ఇమేజ్ ఎడిటింగ్, ఎన్హాన్స్మెంట్ టూల్స్ ఉంటాయి. ఫొటో రిసైజ్ చేయడానికి, ఎరేజ్ చేయడానికి, యూనిక్ ఫిల్టర్లను అప్లై చేయడానికి మ్యాజిక్ ఎడిటర్ ఉపయోగపడుతుంది.కొత్త ఫ్రీ మ్యాజిక్ ఎడిటర్ ఫీచర్లు ప్రస్తుతం కొన్ని పిక్సెల్స్ 7, పిక్సెల్స్ 6 సిరీస్ ఫోన్లలో అందుబాటులో ఉన్నాయి. ‘మ్యాజిక్ ఎడిటర్’తోపాటు ఫొటోఅన్బ్లర్, మ్యాజిక్ ఎరేజర్, పోట్రాయిట్ లైట్లాంటి ఏఐ–పవర్డ్ ఫొటో–ఎడిటింగ్ ఫీచర్లు అన్ని ఆండ్రాయిడ్ డివైజ్లకు అందుబాటులోకి రానున్నాయి.యాపిల్ ఐపాడ్ ప్రో 11బాడీ: 249.7“177.5“5.3 ఎంఎం; బరువు: 466 గ్రా.; డిస్ప్లే: 11.00 వోఎస్/సాఫ్ట్వేర్: ఐపాడ్వోఎస్ 17.5; రిజల్యూషన్: 1668“2420; బ్యాటరీ: 7,606 ఎంఏహెచ్; మెమోరీ: 256జీబి 8జీబి ర్యామ్/ 512జీబి 8జీబి ర్యామ్/ 1టీబి 16జీబి ర్యామ్/ 2టీబి 16జీబి ర్యామ్పోకో ఎఫ్ 6..సైజ్: 6.67 అంగుళాలు రిజల్యూషన్: 1220“2712 పిక్సెల్స్బరువు: 179 గ్రా; బ్యాటరీ: 5000 ఎంఏహెచ్ఇంటర్నల్: 256జీబి 8జీబి ర్యామ్/ 512జీబి 12జీబి ర్యామ్ కలర్స్: బ్లాక్, గ్రీన్, టైటానియంఇవి చదవండి: సముద్ర సాహసాలు చేయాలనుందా? అయితే ఈ గేమ్ ఆడాల్సిందే! -
ఫోన్ కనపడకపోతే.. ప్రాణం పోతోందా? అయితే మీకీ వ్యాధి ఉన్నట్లే!
ఒక్క నిమిషం.. ఫోన్ కనపడదు. చాలా భయం. చాలా ఆందోళన. చాలా కోపం. చాలా వణుకు. ఈ లక్షణాలన్నీ ఉంటే మీకు ‘నో మొబైల్ ఫోన్ ఫోబియా’ లేదా ‘నోమొఫోబియా’ ఉన్నట్టే. ఇది మీకు చేటు చేస్తుంది. దీన్నుంచి బయటపడమని సైకియాట్రిస్ట్లు సూచిస్తున్నారు.ఇంతకుముందు మనిషి రెండు చేతులు రెండు కాళ్లతో ఉండేవాడు. ఇప్పుడు అతని చేతికి అదనపు అంగం మొలుచుకుని వచ్చింది – మొబైల్ ఫోన్. అది లేకుండా గతంలో మనిషి బతికాడు. ఇప్పుడూ బతకొచ్చు. కాని మొబైల్ ఫోన్తో మన వ్యక్తిగత, కుటుంబ, వృత్తిగత, స్నేహ, సాంఘిక సమాచార సంబంధాలన్నీ ముడి పడి ఉన్నాయి కాబట్టి అది కలిగి ఉండక తప్పదు. అలాగని అదే జీవితంగా మారితే నష్టాలూ తప్పవు. ఐదు నిమిషాల సేపు ఫోన్ కనిపించకపోతే తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నా, సినిమాకు వెళ్లినప్పుడైనా మూడు గంటల సేపు ఫోన్ స్విచ్చాఫ్ చేయలేకపోయినా, రాత్రి ఫోన్ ఎక్కడో పడేసి మీరు మరెక్కడో నిద్రపోలేకపోయినా, ఎంత ఆత్మీయులొచ్చినా ఫోన్ వైపు చూడకుండా దానిని చేతిలో పెట్టుకోకుండా వారితో గడపలేకపోయినా మీకు ‘నోమొ ఫోబియా’ ఉన్నట్టు.కేస్స్టడీ.. 1ఆఫీస్ నుంచి హుషారుగా ఇల్లు చేరుకున్న సుందర్ కాసేపటికి బట్టలు మార్చుకుని ముఖం కడుక్కుని రిలాక్స్ అయ్యాడు. ఫోన్ గుర్తొచ్చింది. టీ పాయ్ మీద లేదు. టీవీ ర్యాక్ దగ్గర లేదు. కంగారుగా భార్యను పిలిచి ఆమె ఫోన్తో రింగ్ చేయించాడు. రింగ్ వస్తోంది కాని ఇంట్లో ఆ రింగ్ వినపడలేదు. సుందర్కు చెమటలు పట్టాయి. మైండ్ పని చేయలేదు. ఎక్కడ మర్చిపోయాడు. కారు తాళాలు తీసుకుని కిందకు వెళ్లి కారులో వెతికాడు. లేదు. మళ్లీ పైకి వచ్చి ఇల్లంతా వెతికాడు. దారిలో పెట్రోలు పోయించుకున్నాడు... అక్కడేమైనాపోయిందా? మరోచోట ఫ్రూట్స్ కొని ఫోన్పే చేశాడు. అక్కడ పడేసుకున్నాడా? ఫోన్.. మొబైల్ ఫోన్.. అదిపోతే... అదిపోతే... మైండ్ దిమ్మెక్కిపోతోంది. సరిగ్గా అప్పుడే అతని కూతురు వచ్చి రక్షించింది. ‘నాన్నా.. ప్యాంట్ జేబులో మర్చిపోయావు. వాల్యూమ్ లో అయి ఉంది’ అని. ఫోన్ కనపడకపోతే ప్రాణంపోతుంది ఇతనికి. అంటే నోమొ ఫోబియా ఉన్నట్టే.కేస్ స్టడీ.. 2ఇంటికి చాలా రోజుల తర్వాత గెస్ట్లు వచ్చారు. వారు ఎదురుగా కూచుని మాట్లాడుతున్నారు. ఇంటి యజమాని విజయ్ ఫోన్ చేతిలో పట్టుకుని వారితో మాట్లాడుతున్నాడు. ప్రతి నిమిషానికి ఒకసారి ఫోన్ చూస్తున్నాడు. వాళ్లతో మాట్లాడుతూనే ఫేస్బుక్ స్క్రోల్ చేస్తున్నాడు. వాళ్లతో మాట్లాడుతూనే వాట్సప్ చెక్ చేస్తున్నాడు. వాళ్ల వైపు ఒక నిమిషం ఫోన్ వైపు ఒక నిమిషం చూస్తున్నాడు. వాళ్లకు విసుగొచ్చి కాసేపటికి లేచి వెళ్లిపోయారు. విజయ్కు నోమొ ఫోబియా ఉంది.కేస్ స్టడీ.. 3దుర్గారావు ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్లి హోటల్లో దిగాడు. దిగాక గాని తెలియలేదు అక్కడ ఫోన్ సిగ్నల్స్ అందవని. కాల్స్ ఏమీ రావడం లేదు. డేటా కూడా సరిగ్గా పని చేయడం లేదు. ఆ ఊళ్లో వేరే మంచి హోటళ్లు లేవు. సిగ్నల్ కోసం హోటల్ నుంచి గంట గంటకూ బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఇక అక్కడ ఉన్నంత సేపు దుర్గారావుకు అస్థిమితమే. చిరాకే. ఏ కాల్ మిస్సవుతున్నానో అన్న బెంగే. ఏ మెసేజ్ అందడం లేదో అన్న ఆందోళనే. ఇదీ నోమొ ఫోబియానే.నష్టాలు..1. నోమొఫోబియా ఉంటే మీ అనుబంధాలు దెబ్బ తింటాయి. ఎందుకంటే అనుబంధాల కంటే ఫోన్తో బంధం ముఖ్యమని భావిస్తారు కాబట్టి.2. నోమొ ఫోబియా మీ లక్ష్యాలపై మీ ఫోకస్ను తప్పిస్తుంది. మీరు ఎక్కువసేపు ఒక పని మీద మనసు లగ్నం చేయరు. దీనివల్ల చదువుకునే విద్యార్థి, పని చేయాల్సిన ఉద్యోగి, ఇంటిని చక్కదిద్దే గృహిణి అందరూ క్వాలిటీ వర్క్ను నష్టపోతారు. పనులు పెండింగ్లో పడతాయి.3. నోమొ ఫోబియా కలిగిన వారు తమను తాము నమ్ముకోవడం కన్నా ఫోన్ను నమ్ముకుంటారు. చివరకు ఫోన్ లేకుండా ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టడానికి కూడా ఇష్టపడరు.4. సోషల్ మీడియా సంబంధాలే అసలు సంబంధాలుగా భావించి అసలు సంబంధాలు కోల్పోతారు.5. ఫోన్ ఇతరుల చేతుల్లో పడితే వారు ఏమి ఆరా తీస్తారోనని అనుక్షణం ఫోన్ని కనిపెట్టుకుని ఉంటారు.ఎలా బయటపడాలి?1. ఖాళీ సమయాల్లో మెల్లమెల్లగా ఫోన్ను పక్కన పడేయడంప్రాక్టీస్ చేయండి.2. రోజులో ఒక గంటైనా ఏదో ఒక సమయాన ఫోన్ స్విచ్చాఫ్ చేయడం మొదలుపెట్టండి.3. సినిమాలకు, శుభకార్యాలకు వెళ్లినప్పుడు ఫోన్ ఇంట్లో పడేయడమో, మ్యూట్ చేసి జేబులో పడేయడమో చేయండి.4. ఫోన్ నుంచి దృష్టి మరల్చే ఆటలు, పుస్తక పఠనం, ఇతర హాబీలపై దృష్టి పెట్టండి.5. యోగా, ప్రాణాయామం చేయడం మంచిది.6. ఫోన్లో మీ కాంటాక్ట్స్, ముఖ్యమైన ఫొటోలు, ఇతర ముఖ్య సమాచారం పర్సనల్ కంప్యూటర్లోనో మెయిల్స్లోనో నిక్షిప్తం చేసుకుని ఫోన్ ఎప్పుడుపోయినా మరో సిమ్ కొనుక్కోవచ్చు అనే అవగాహన కలిగి ఉంటే నోమొఫోబియాను దాదాపుగా వదిలించుకోవచ్చు.ఇవి చదవండి: Fauzia Arshi - ఆకాశమే హద్దు! -
Lok sabha elections 2024: ‘రీడ్ ద లెటర్ బిట్వీన్’
ఇదేదో పజిల్లా ఉందే అనుకుంటున్నారా? నిజమే.. చిన్నపాటి పజిలే. కాకపోతే పార్టీలు ప్రచారం కోసం ఉపయోగిస్తున్న కీబోర్డు ట్రెండ్. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ కీబోర్డును మీదున్న అక్షరాలతో ఈ ట్రెండ్ను వైరల్ చేస్తున్నాయి బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు. అదెలా అంటే.. నేను.. ‘‘వికసిత్ భారత్ కోసం ఎవరు ఓటు వేయనున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కీబోర్డులోని యూ అండ్ ఓ మధ్య ఉన్న లెటర్ను బిగ్గరగా చదవండి’’ అని భారతీయ జనతా పార్టీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ఆ రెండు లెటర్స్ మధ్యనున్న అక్షరం ‘ఐ’. ఆ మెసేజ్ చదివిన ప్రతి ఒక్కరూ ‘ఐ’ అంటారు. సో... వారంతా తాము బీజేపీకి ఓటు వేస్తున్నట్టు ప్రతిజ్ఞ చేసినట్టేనని బీజేపీ భావిస్తోంది. మేము..ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ ఈ ట్రెండ్నే అనుసరిస్తోంది. ‘‘నియంత నరేంద్ర మోదీ నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడేది ఎవరు? కీబోర్డులో క్యూ, ఆర్ మధ్య ఉన్న లెటర్స్ను చదవండి’’ అని ఎక్స్లో పోస్టు చేసింది. ఇక్కడ క్యూ, ఆర్ మధ్య ఉన్నది డబ్ల్యూ, ఈ.. రెండక్షరాలను కలిపితే ‘మేము’ అనే అర్థం వస్తుంది. మేమంతా కలిసి బీజేపీని ఓడిస్తామని సందేశాన్నిచ్చేలా ఆప్ వైరల్ చేస్తోంది. పోలీసులు సైతం.. ఈ రెండు పార్టీలిలా ఉంటే.. సురక్షితమైన డ్రైవింగ్ గురించి అవగాహన కలి్పంచేందుకు ఢిల్లీ పోలీసులు కూడా ఈ వైరల్ ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. ‘‘డ్రైవింగ్ చేస్తూ మీరు కీ బోర్డును చూస్తే.. క్యూ అండ్ ఆర్ మధ్యలో లెటర్స్ (డబ్ల్యూ, ఈ) చలాన్తో మిమ్మల్ని కలుస్తాయి’’ అని ఎక్స్లో పోస్టు చేశారు. అంటే మీరు కీబోర్డు చూస్తే వి (మేము) చలాన్ వేస్తామని అర్థమన్నమాట. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మంచి నిద్రకు మొబైల్ చేటు
కర్ణాటక: ఇటీవల రోజుల్లో మొబైల్ ఫోన్ లేనిదే జీవితం సాగడం లేదు. ప్రతి పనికీ మొబైల్ కావాలి. దీని వల్ల ఎంత మంచి జరిగినా, కీడు కూడా తప్పడం లేదు. మొబైల్ఫోన్ వంటి డిజిటల్ పరికరాలపై ఆధారపడిన ఐటీ సిటీ పౌరులు బంగారం లాంటి నిద్రను పాడు చేసుకుంటున్నారు. 59 శాతం మంది పౌరులు అర్ధరాత్రి వరకు నిద్ర పోవడం సాధ్యం కావడం లేదు. దీనివల్ల నిద్ర కరువై అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. 46 శాతం మంది నిద్రలేచిన తరువాత కూడా తగినంత నిద్ర లేనందున నిరాసక్తంగా ఉంటున్నారని ఒక సర్వే వెల్లడించింది. 90 శాతం మంది అదే మాట ► వేక్ పిట్కో అనే సంస్థ గ్రేట్ ఇండియన్ స్లీప్ స్టోర్ కార్డ్స్– 2024 అనే సర్వేను విడుదల చేసింది. ఇందులో బెంగళూరు నిద్ర ప్రవృత్తి, ప్రజల మొబైల్ అలవాట్ల గురించి ఆరా తీయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి తెచ్చింది. ► సమీక్షలో పాల్గొన్న 90 శాతం మంది.. నిద్రపోయే వరకూ మొబైల్ఫోన్ను వాడుతున్నామని తెలిపారు. ► 38 శాతం మంది రాత్రి 11 గంటల తరువాత నిద్రకు ఉపక్రమిస్తున్నారు. ► కుతూహలమైది ఏమిటంటే 29 శాతం మంది ప్రజలు తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ అర్ధరాత్రి వరకు మేలుకునే ఉంటారు. నిద్రను నిర్లక్ష్యం చేసేవారు పగలు ఉత్సాహం కోల్పోయి తమ పనులను సమర్థంగా చేయలేకపోతున్నారని సర్వే హెచ్చరించింది. మంచి నిద్రకు ఇది ముఖ్యం బాగా నిద్రపోవాలంటే పడుకునే గంట ముందు వరకు మొబైల్, కంప్యూటర్ తరహా డిజిటల్ పరికరాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతారు. కానీ 59 శాతం మంది నిద్రపోయే చివరి క్షణం వరకూ మొబైల్తో గడుపుతున్నారు. దీని వల్ల నిద్ర సక్రమంగా సాగదు. ఉదయాన్నే హుషారు లేకపోగా నిస్సత్తువ ఆవరిస్తుంది. దూరంగా ఉంటేనే మంచిది 28 శాతం మంది తమ పనుల వల్ల అర్ధరాత్రి వరకు మేల్కొని ఉంటామని తెలిపారు. 55 శాతం మంది డ్యూటీలో ఉన్నప్పుడు నిద్ర వస్తుందని, ఒళ్లునొప్పులు వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. 40 శాతం మంది రాత్రి మొబైల్, ల్యాప్టాప్కు దూరంగా ఉంటే మంచి నిద్ర సాధ్యమని నమ్ముతున్నారు. 23 శాతం మంది ప్రజలు మంచి బెడ్, గదిలో అలంకారం వల్ల బాగా నిద్రించవచ్చని చెప్పారు. ఏదేమైనా సిలికాన్ నగరవాసులు మొబైల్ మోజులో పడి నిద్రను అశ్రద్ధ చేస్తున్నారని వెల్లడైంది. -
ఒళ్లో పేలిన ఫోను.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో మొబైల్ ఫోన్ పేలిన ఉదంతం వెలుగు చూసింది. స్థానిక కోచింగ్ సెంటర్లో క్లాసులు జరుగుతుండగా ఒక విద్యార్థిని ఒళ్లోవున్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో తరగతిలో కలకలం చెలరేగింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఆ విద్యార్థిని మొబైల్ ఫోనును బయటకు విసిరేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం హమీర్పూర్ ప్రధాన మార్కెట్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ విద్యాసంస్థ ఉంది. ఇక్కడ దాదాపు 40 మంది చదువుకుంటున్నారు. క్లాసులో తరగతి జరుగుతుండగా ఓ విద్యార్థిని దగ్గరున్న ఫోనులో నుంచి మంటలు చెలరేగాయి దీంతో ఆమె భయంతో ఆ మొబైల్ ఫోనును మెయిన్ రోడ్డు వైపునకు విసిరేసింది. ఆ ఫోను అక్కడున్న సైన్ బోర్డుకు తగిలి పేలిపోయింది. దీంతో సైన్ బోర్డుకు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత మొబైల్ ఫోను పూర్తిగా కాలిపోయింది. అనంతరం స్థానికులు అప్రమత్తమై ఆ మంటలపై బకెట్లతో నీళ్లు పోసి, ఆర్పివేశారు. భవనం మొదటి అంతస్థులో ఈ ఘటన జరిగింది. అక్కడికి సమీపంలోనే దుస్తుల దుకాణాలు ఉన్నాయి. రోడ్డుపైనో, తరగతి గదిలోనో ఆ మొబైల్ ఫోన్ పేలి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని స్థానికులు అంటున్నారు. -
పిల్లల చేతిలో హెల్ఫోన్!
సాక్షి, అమరావతి: కరోనా లాక్డౌన్, ఆన్లైన్ తరగతుల కారణంగా పిల్లల్లో సెల్ఫోన్ వినియోగం పెరిగిపోయింది. కరోనా వ్యాప్తి తగ్గిపోయినా.. ఆఫ్లైన్ తరగతులు ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా పిల్లల్లో సెల్ఫోన్ వినియోగం మాత్రం తగ్గడం లేదు. దేశంలోని పట్టణ, నగర ప్రాంతాల్లో 9 నుంచి 17 ఏళ్ల పిల్లలు రోజుకు సగటున మూడు గంటలకు పైగా సెల్ఫోన్ వినియోగిస్తున్నారు. లోకల్ సర్కిల్ సంస్థ నిర్వహించిన సర్వేలో 61 శాతం తల్లిదండ్రులు ఈ అంశాన్ని వెల్లడించారు. తమ పిల్లలు ఫోన్లో గేమ్స్ ఆడటం, ఓటీటీ యాప్స్లో సినిమాలు చూడటం, సోషల్ మీడియాలో గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 296 జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న 46 వేల మంది తల్లిదండ్రులను సర్వే చేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో 62 శాతం మంది పురుషులు, 38 శాతం మంది మహిళలు ఉన్నారు. దూకుడు.. అసహనం పెరిగాయ్ సర్వేలో భాగంగా సెల్ఫోన్ అతి వినియోగంతో పిల్లల సామాజిక ప్రవర్తన/మానసిక ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావాల స్థాయిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. సెల్ఫోన్ వినియోగం కారణంగా పిల్లల్లో గమనించిన మార్పులు ఏమిటని 11,697 మంది తల్లిదండ్రులను ఆరా తీయగా.. 39 శాతం పిల్లల్లో దూకుడు స్వభావం పెరిగినట్టు తల్లిదండ్రులు చెప్పారు. 37 శాతం పిల్లల్లో అసహనం, 25 శాతం పిల్లల్లో అతి క్రియాశీలత (హైపర్ యాక్టివ్నెస్) పెరిగిందని వెల్లడించారు. 22 శాతం పిల్లల్లో నిస్పృహ పెరిగినట్టు గుర్తించారు. ఇంట్లో ఉన్నంతసేపూ ఫోన్తోనే.. పట్టణ ప్రాంతాల్లోని చాలామంది పిల్లలు ఇంట్లో ఉన్న సమయంలో సెల్ఫోన్తో గడపడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. మీ పిల్లలు రోజుకు సగటు ఎంత సమయం సెల్ఫోన్ వినియోగిస్తున్నారని 11,507 మందిని ఆరా తీయగా.. 6 గంటల మేర సెల్ఫోన్తో గడుపుతున్నట్టు 15 శాతం మంది తెలిపారు. 3నుంచి 6 గంటల పాటు తమ పిల్లలు ఫోన్ వినియోగిస్తున్నట్టు 46 శాతం మంది, 1నుంచి 3 గంటల మధ్య వినియోగిస్తున్నట్టు 39 శాతం మంది పేర్కొన్నారు. అయితే ఓటీటీ.. లేదంటే సోషల్ మీడియా మీ పిల్లలు సెల్ఫోన్ ఎందుకోసం వినియోగిస్తున్నారని 12,017 మందిని ప్రశ్నించి.. సోషల్ మీడియా, ఓటీటీ, ఆన్లైన్ గేమింగ్, ఇతర వ్యాపకాలు, ఏమీ చెప్పలేం అని ఆప్షన్లు ఇవ్వగా.. చాలామంది ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లతో సమాధానాలిచ్చారు. 37 శాతం మంది తమ పిల్లలు ఓటీటీల్లో సినిమాలు, వెబ్సిరీస్ను చూస్తున్నట్టు చెప్పారు. 35 శాతం మంది వాట్సప్, ఇన్స్ట్రాగామ్, స్నాప్చాట్, బీ రియల్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో పిల్లలు గడుపుతున్నట్టు తెలిపారు. ఆన్లైన్ గేమింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టు 33 శాతం మంది, ఇతర వ్యాపకాలని 10 శాతం, ఏమీ చెప్పలేమని 2 శాతం మంది వెల్లడించారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ ముఖ్యం పిల్లల్లో ఫోన్ వినియోగాన్ని నియంత్రించడంలో తల్లిదండ్రుల పాత్రే కీలకం. పాఠశాల, కళాశాలల్లో అలసిపోయి ఉంటారని ఇంటికి రాగానే పిల్లలు సెల్ఫోన్ వాడుతున్నా కొందరు తల్లిదండ్రులు పట్టించుకోరు. ఆటవిడుపు కోసం చేసే ఈ చర్య క్రమంగా వ్యసనంగా మారుతోంది. అదేవిధంగా హోమ్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్స్ కోసమని పిల్లలు అడిగిన వెంటనే సెల్ఫోన్ ఇచ్చేస్తుంటారు. అనంతరం వాళ్లు ఎంతసేపు ఫోన్ను వినియోగిస్తున్నారనేది పట్టించుకోరు. ఈ విధానాన్ని వీలైనంత వరకూ తగ్గించాలి. పిల్లల ముందు తల్లిదండ్రులు సెల్ఫోన్ను అనవసరంగా వినియోగించడం మానుకోవాలి. వీలైనంత సేపు వారితో గడపాలి. – డాక్టర్ కేవీ రామిరెడ్డి, సూపరింటెండెంట్, మెంటల్ కేర్ హాస్పిటల్, వైజాగ్ -
చేతిలో మొబైల్ ఉండాల్సిందే.. రాజేష్..సురేష్ల పరిస్థితి చూద్దాం
సురేష్ జేఎన్టీయూకేలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తెల్లవారుజామున లేచింది మొదలు అర్థరాత్రి వరకు మొబైల్ ఫోన్ చూస్తూనే ఉంటాడు. పరీక్షలు సమీపిస్తున్నాయని ఇంట్లో కుటుంబ సభ్యులు అడిగితే చివర్లో చదివేస్తానంటూ బదులిస్తున్నాడు. చేతిలో మొబైల్ లేకుండా ఉండలేనంతగా మారిపోయాడు. పరీక్షలు వచ్చినా ఇతని వైఖరిలో మార్పు లేదు. ఫలితాలు చూసేసరికి సబ్జెక్టులన్నీ ఫెయిలయ్యాడు. బిడ్డ తీరు చూసి తల్లిదండ్రుల ఆవేదం వర్ణనాతీతం. రాజేష్ది కాట్రేనికోన. తండ్రి వ్యవసాయం చేస్తుంటాడు. తల్లి గృహిణి. ఉన్నంతలో మంచి ప్రైవేట్ స్కూలులో జాయిన్ చేశారు. రోజూ స్కూలుకు వెళ్లి వస్తుంటాడు. స్కూలు నుంచి రాగానే తండ్రి కొనిచ్చిన మొబైల్ ఫోన్లో మునిగి తేలుతుంటాడు. ఇందులో కూడా పాఠాలు చదువుకుంటున్నానని తల్లికి చెబుతున్నాడు. కానీ మార్కులు చూస్తే దారుణం. కుర్రాడి పరిస్థితి అర్ధమైన తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. సెల్ వ్యసనాన్ని ఎలా మానిపించాలో తెలియక తలపట్టుకుంటున్నారు. సాక్షిప్రతినిధి,కాకినాడ: రాజేష్..సురేష్లు మాత్రమే కాదు. చాలా మంది విద్యార్థులది ఇదే తీరు. చేతిలో మొబైల్ ఉండాల్సిందే. ఇంట్లో ఉన్నంతసేపు సెల్తోనే కాలమంతా గడిపేస్తున్నారు. బిడ్డల భవిష్యత్ కోసం బంగారు కలలు కనే తల్లిదండ్రులకు ఇదో పెద్ద సమస్యగా తయారైంది. మొబైల్ ఫోన్ల నుంచి వీరిని ఎలా దూరం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. విలువైన కాలాన్ని వృథా చేస్తున్న బిడ్డల తీరుపై ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చాలామంది చదువుకుంటున్న చిన్నారుల నుంచి యువత వరకూ ఈ మొబైల్తోనే కాలక్షేపం చేసేస్తున్నారు. విలువైన భవిష్యత్ను చేజేతులా పాడుచేసుకుంటున్నారు. దీనిపై చాలా ఇళ్లలో ఇది నిత్యం వివాదాలకు కారణమవుతోంది. అప్డేట్గా ఉంటే మంచిదే.. కానీ.. వాస్తవానికి మొబైల్ ఫోన్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ప్రతీక. దీనిని సద్వినియోగం చేసుకుంటే చాలా ఉపయోగం. కానీ కెరీర్కు ఉపయోగపడని అంశాలను చూస్తుంటే కీలకమైన కాలం కాస్తా కరిగిపోతుంది. ఫలితంగా భవిష్యత్కు నష్టం జరుగుతుంది. కమ్యూనికేషన్కు..ఎప్పటికప్పుడు తమ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలపై అప్డేట్గా ఉంటే మంచిదేనని.. కానీ అలా ఎక్కువ మంది విషయంలో ఇలా జరగడం లేదని జేఎన్టీయూకే ప్రొఫెసర్ ఒకరు చెప్పారు. అరచేతిలో ప్రపంచాన్ని వీక్షించే వీలున్న ఈ చిన్న ఆధునిక పరికరం ద్వారా మేలైన జీవితానికి బాటలు వేసుకోవచ్చునంటున్నారాయన. అలాగని నిరంతరం దానిని వాడడమే వ్యసనంగా పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు. మరీ ఇంత వ్యసనంగానా.. దాదాపు అన్ని వయసుల పిల్లలలో ఎక్కువ మంది రోజులో నాలుగు గంటల పాటు మొబైల్ ఫోన్ల ద్వారా సామాజిక మాధ్యమాల్లో ఉంటున్నారని ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది. ఇలా నెలలో 120 గంటలు.. అంటే సుమారు నాలుగున్నర రోజులు. ఏడాదికి 54 రోజుల పాటు మొబైల్ ఫోన్ చూడటంలోనే కాలం గడిపేస్తున్నారని అంచనా. ఇది చాలా ప్రమాకరమైన పోకడ. తరచూ ఫోన్ చూడటం మానసిక రోగంలా తయారైందని సైకియాట్రిస్టులు అంటున్నారు. పరీక్షా కాలంలోనూ.. పరీక్షలకు ముందు విద్యార్థులకు ప్రతి క్షణం చాలా విలువైనది. ఏ సమయంలో ఏది చేయాలో అదే చేయాలి. చదువుపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు, టీచర్లు పదే పదే చెబుతున్నా పెడచెవిన పెడుతున్నారు. పరీక్షలు దగ్గరపడే సమయంలోనైనా మొబైల్కు కాస్త దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నా ప్రయోజనం కనిపించడం లేదని తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. కెరీర్ను మలుపు తిప్పే పదో తరగతి నుంచి డిగ్రీ లేదా, ఇంజినీరింగ్ మధ్య చదువుల్లో ఉన్న విద్యార్థులను ఈ ‘మొబైల్ ధోరణి’ దెబ్బతీస్తోందని విద్యావంతులు హెచ్చరిస్తున్నారు. సహజంగా 20–22 వయస్సు మధ్య గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తారు. పీజీ ఇతర ఉన్నత విద్యా కోర్సులు 25 ఏళ్లకు పూర్తి చేసి ఉద్యోగం సాధించాలి. కానీ ఈ మొబైల్ విచ్చలవిడి వినియోగంతో పాతికేళ్లు దాటినా బ్యాక్లాగ్లు వెంటాడుతున్నాయి. ఉద్యోగం సంపాదించాల్సిన సమయంలో వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్ట్రా తదితర సామాజిక మాధ్యమాల ప్రభావంలో పడి నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. -
ఇంకా దొరకని బండి సంజయ్ ఫోన్?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పోగొట్టుకున్న సెల్ఫోన్లను గుర్తించి తిరిగి అప్పగించడంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోలీసులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. సీఈఐఆర్ విధానం ఉపయోగించి ఫోన్లను గుర్తిస్తున్నారు. ప్రస్తుతం సెల్ఫోన్ విద్యార్థి నుంచి వృద్ధులు, అధికారి నుంచి కూలీవరకు, ఉన్నతాధికారి నుంచి చిరుద్యోగి వరకు, వార్డు మెంబరు నుంచి ప్రధాని వరకు అందరిని కలిపే సామాజిక మాధ్యమంగా మారింది. అలాంటి సెల్ఫోన్ పొరపాటున పోగొట్టుకున్నా.. చోరీకి గురైనా అందులోని డేటాతోపాటు, విలువైన సమాచారం పోతుంది. అందుకే పోలీసులు అలా పోగొట్టుకున్న పోన్లను వేటాడి గుర్తించేందుకు సీఈఐఆర్ విధానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఈ సాంకేతికతను తొలిసారిగా కరీంనగర్ కమిషనరేట్లో ప్రయోగపూర్వకంగా ప్రారంభించారు. ప్రస్తుతం 50శాతం వరకు ప్రజలు పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించగలిగారు. నేటికీ దొరకని ‘బండి’ ఫోన్.. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో వాట్సాప్లలో పేపర్ లీకేజీ కలకలం రేపింది. ఈ వ్యవహారంలో ఎంపీ బండి సంజయ్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో సంజయ్ ఫోన్ అదృశ్యమైంది. పోలీసులే తన ఫోన్ మాయం చేశారని సంజయ్ ఆరోపించారు. ఆయన ఫోన్తో తమకు సంబంధం లేదని పోలీసులు వివరణ ఇచ్చారు. ఆరోపణల పర్వం ఎలా ఉన్నా.. బండి సంజయ్ ఫోన్ నేటికీ లభించలేదు. అందులో అనేక కీలక విషయాలు ఉన్నాయని, తన ఫోన్ వెంటనే అప్పగించాలని బండి అనుచరులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా.. పోలీసుల తరఫు నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడం గమనార్హం. ఫోన్ల రికవరీలో దేశంలోనే నంబర్వన్గా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ పోలీసులు ఎంపీ సెల్ఫోన్ విషయంలో ఎలాంటి పురోగతి సాధించకపోవడంపై ఆయన అనచరులు విమర్శలు గుప్పిస్తున్నారు. 1,318 ఫోన్ల అందజేత! ఈ ఏడాది ఏప్రిల్లో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిష్టర్ (సీఈఐఆర్) సాంకేతికతపై కరీంనగర్ కమిషనరేట్లో పోలీసులకు శిక్షణ ఇచ్చారు. ఆ వెంటనే రామగుండం, జగిత్యాల, సిరిసిల్ల జిల్లా సిబ్బందికి శిక్షణను విస్తరించారు. ఈ సాంకేతికత వినియోగంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకూ 5,449 ఫోన్లు ఉమ్మడి జిల్లాలో పోయినట్లు రిపోర్టయ్యాయి. అందులో 1,318 ఫోన్లను రికవరీ చేశారు. సెల్ఫోన్ల రికవరీ అత్యధికంగా 418 రామగుండం పరిధిలో ఉండగా, అత్యల్పంగా 157 జగిత్యాల పరిధిలో ఉండటం గమనార్హం. సీఈఐఆర్ సాంకేతికత అంటే.? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిష్టర్ (సీఈఐఆర్) సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా పోయిన సెల్ఫోన్ను తిరిగి కనిపెట్టొచ్చు. సీఈఐఆర్ వెబ్సైట్లోకి వెళ్లి సెల్ఫోన్ను ఐఎంఈఐ నంబరు సాయంతో బ్లాక్ చేయవచ్చు. ఈ తరువాత ఆ సెల్ఫోన్ ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయదు. ఒకవేళ ఫోన్ ఆన్చేసినా, అందులో కొత్త సిమ్కార్డు వేసినా.. ఆ విషయం ఫోన్ యజమానికి ఎస్ఎంఎస్ ద్వారా తెలిసిపోతుంది. ఎలా పనిచేస్తుంది..? సెల్ఫోన్ పోగొట్టుకున్న వెంటనే డబ్లూ.డబ్లూ.డబ్లూ.సీఈఐఆర్.జీవోవీ.ఐఎన్ పోర్టల్ ఓపెన్ చేయాలి. అందులో బ్లాక్ ఫోన్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. అందులో మొబైల్ నంబర్–1, మొబైల్ నంబరు–2, సెల్ఫోన్ బ్రాండ్, మోడల్, ఇన్వాయిస్ (బిల్) ఫొటో సూచించిన గడుల్లో నింపాలి. పోగొట్టుకున్న స్థలం, పోయిన తేదీ, ఇతర చిరునామా, అంతకుముందే ఇచ్చిన పోలీస్ కంప్లయింట్ నంబరు, ఫోన్ యజమాని చిరునామా, ఈమెయిల్ ఐడీ, ధ్రువీకరణ కార్డులు, చప్టాలను సూచించిన బాక్సుల్లో నింపాలి. వెంటనే సెల్ఫోన్ (పాత నెంబరు మీద తీసుకున్న కొత్త సిమ్) నంబరుకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత ఫామ్ను సబ్మిట్ చేయాలి. ఆ తరువాత ఫోన్ దానంతట అదే బ్లాక్ అవుతుంది. ఇకపై దాన్ని ఎవరూ ఆపరేట్ చేయలేరు. అందులోని డేటా సురక్షితంగా ఉంటుంది. ఒకవేళ దొంగించించిన వ్యక్తి లేదా సెకండ్ హ్యాండ్లో కొన్న వ్యక్తి సిమ్ వేయగానే.. మీ నంబరుకు మెసేజ్ వస్తుంది. ఆ సందేశం ఆధారంగా ఫోన్ ఎక్కడ ఉన్నా.. పట్టుకోవడం సులభతరంగా మారుతుంది. అన్బ్లాక్ చేయండిలా.. మీఫోన్ను పోలీసులు పట్టుకున్నా.. లేక మీకే దొరికినా.. మీ పాత ఐడీని, ఫోన్నంబరు, ఇతర వివరాలు నింపిన తరువాత ఫోన్ను అన్బ్లాక్ చేసుకోవచ్చు. ఇవి చదవండి: ఔను..! నిజంగానే కలెక్టర్కు కోపమొచ్చింది! -
చోరీ అయిన సెల్ ఫోన్ల రికవరీలో టాప్లో అనంతపురం జిల్లా..!
అనంతపురం క్రైం: చోరీ జరిగిన, సొంతదారు పోగొట్టుకున్న సెల్ఫోన్ల రికవరీలో జిల్లా పోలీసులు అగ్రస్థానంలో నిలిచారని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. చాట్బాట్ సేవలు అందుబాటులో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ జిల్లాలో రూ.13.13 కోట్లు విలువ చేసే 8,010 సెల్ఫోన్లు రికవరీ చేసి సొంతదారులకు అందజేసినట్లు వివరించారు. ఇటీవల వివిధ కేసుల్లో పోలీసులు రికవరీ చేసిన రూ.71 లక్షలు విలువ చేసే 385 సెల్ఫోన్లను జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో సంబంధీకులకు సోమవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏపీలోని 9 జిల్లాలు, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్కు చేతులు మారిపోయిన సెల్ఫోన్లను కూడా రికవరీ చేసినట్లు వివరించారు. పాత ఫోన్లు కొనొద్దు ఫోన్లు కొనుగోలు చేసే వారెవరైనా పాత ఫోన్లను కొనకపోవడం మంచిదని ఎస్పీ అన్బురాజన్ సూచించారు. అపరిచిత వ్యక్తుల నుంచి అస్సలు కొనుగోలు చేయరాదన్నారు. పరిచయస్తుల ద్వారా కొనుగోలు చేస్తే ఫోన్కు సంబంధించిన బాక్స్తో పాటు బిల్లు తప్పక తీసుకోవాలన్నారు. ఫోన్ తక్కువ ధరకు వస్తుందని ఆశపడి కొనుగోలు చేస్తే అనవసరంగా పోలీసు కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఫోన్లు చోరీకి గురైనా, కనపడకుండా పోయినా సీఈఐఆర్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. ఫోన్లు విక్రయిస్తున్న అపరిచత వ్యక్తులపై అనుమానం వస్తే వెంటనే 94407 96800కు సమాచారం అందించాలని కోరారు. పోగొట్టుకున్న డబ్బు ఖాతాలో పడుతుంది బ్యాంక్ ఖాతాలోని సొమ్మును సైబర్ నేరగాళ్లు కాజేస్తే వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేయడం ద్వారా గంట వ్యవధిలోనే ఆ డబ్బు తిరిగి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని ఎస్పీ వివరించారు. 1930 పేవలను సకాలంలో వినియోగించుకోవాలన్నారు. అన్ని యాప్లకు గుడ్డిగా అనుమతులివ్వకూడదన్నారు. ‘పోలీసు స్పందన’కు 128 వినతులు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 128 వినతులు అందాయి. ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ ఇందిర, దిశ సీఐ చిన్నగోవిందు, ఎస్ఐ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఎస్పీకి కృతజ్ఞతలు రౌడీ మూకలు కబ్జా చేసిన తమ స్థలాలను తిరిగి స్వాధీనం చేసేందుకు ఎస్పీ అన్బురాజన్ చూపిన చొరవను అభినందిస్తూ 73 మంది బాధితులు సోమవారం ఆయనను కలసి కృతజ్ఞతలు తెలిపారు. తమలో చాలా మంది ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులుగా ఉన్నామని, ఉద్యోగ విరమణ సమయంలో అందిన డబ్బుతో స్థలాలు కొనుగోలు చేసినట్లు వివరించారు. వీటిని కొందరు రౌడీ మూకలు కబ్జా చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ స్థలాలు తిరిగి స్వాధీనం చేసిన ఎస్పీ అన్బురాజన్ సేవలను మరిచిపోలేమంటూ సన్మానం చేశారు. కాగా, మొత్తం ఈ వ్యవహారంలో బాధితుల పక్షాన నిలిచి పోరాటం చేసిన నూర్బాషాకే సన్మానం పొందే అర్హత ఉందని, ఎస్పీ ప్రతిగా ఆయనకు సన్మానం చేశారు. కానిస్టేబుల్కు అవార్డు కుందుర్పి: సైబర్ క్రెం కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబరచిన కుందుర్పి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ అనిల్ను ఎస్పీ అన్బురాజన్ అభినందించారు. కళ్యాణదుర్గం డివిజన్ పరిధిలో ఇటీవల చోరీకి గురైన సెల్ఫోన్ల రికవరీలో అనిల్ చూపిన చొరవను అభినందిస్తూ సోమవారం డీపీఓలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ అభినందిస్తూ అవార్డు అందజేశారు. -
India Mobile Congress 2023: కాంగ్రెస్.. కాలం చెల్లిన ఫోన్
న్యూఢిల్లీ: 2014 అనేది కేవలం ఒక తేదీ కాదని, దేశంలో అదొక పెనుమార్పు అని ప్రధానమంతి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని కాలం చెల్లిన ఫోన్గా అభివరి్ణంచారు. 2014లో దేశ ప్రజలు ఆ ఔట్డేటెడ్ ఫోన్ను వదిలించుకున్నారని, ఇండియా దశ దిశ మార్చే ప్రభుత్వాన్ని ఎంచుకున్నారని తెలిపారు. కాలం తీరిన ఫోన్లలో ఎన్నిసార్లు బటన్లు నొక్కినా, స్తంభించిన స్క్రీన్ను ఎన్నిసార్లు తట్టినా ఎలాంటి ఫలితం ఉండదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రీస్టార్ట్ చేసినా, చార్జింగ్ పెట్టినా, బ్యాటరీ మార్చినా ఆ ఫోన్ పనిచేయదని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు. పనికిరాని ఫోన్ తరహాలోనే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ, పరిపాలన స్తంభించిపోయిందని అన్నారు. అలాంటి సమయంలో దేశానికి సేవ చేసే అవకాశాన్ని ప్రజలు తమకు ఇచ్చారని గుర్తుచేశారు. శుక్రవారం ఢిల్లీలో ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్లలో తమ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన సంస్కరణలతో దేశం ప్రగతి పథంలో పరుగులు తీస్తోందని అన్నారు. గతంలో మొబైల్ ఫోన్లు దిగుమతి చేసుకున్న మన దేశం ఇప్పుడు ఎగుమతిదారుగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు మన దేశంలోనే ఫోన్లను ఉత్పత్తి చేస్తున్నాయని వెల్లడించారు. భారత్లో 5జీ మొబైల్ సేవలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయని, ఇక 6జీ సరీ్వసులకు శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు. గతేడాది అక్టోబర్ 1న 5జీ టెక్నాలజీని ప్రారంభించామని, దేశవ్యాప్తంగా ఏడాదిలోనే 5 లక్షల 5జీ బేస్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. 2జీ సేవల విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని చెప్పారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న టెలికాం స్పెక్ట్రం కుంభకోణాన్ని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. 4జీ సేవలను తీసుకొచ్చిన తమపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదన్నారు. 6జీ టెక్నాలజీలో ప్రపంచాన్ని మనమే ముందుకు నడిపిస్తామన్న విశ్వాసం తనకు ఉందన్నారు. దేశవ్యాప్తంగా 100 ‘5జీ ల్యాబ్లు’ యూపీఏ సర్కారు పాలనలో మొబైల్ ఫోన్ల తయారీ రంగాన్ని విస్మరించారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రస్తుతం మన దేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైన్ఫోన్ల తయారీదారుగా మారిందని అన్నారు. అలాగే ఏటా రూ.2 లక్షల కోట్ల విలువైన ఎల్రక్టానిక్ పరికరాలను ఎగుమతి చేస్తున్నామని తెలియజేశారు. ఇండియాలో తయారైన ఫోన్లను ప్రపంచమంతటా ఉపయోగిస్తుండడం మనకు గర్వకారణమని పేర్కొన్నారు. బ్రాడ్బ్యాండ్ వేగంలో మన దేశం ఏడాది వ్యవధిలోనే 118వ స్థానం నుంచి 43వ స్థానానికి చేరిందని వివరించారు. ఇంటర్నెట్ అనుసంధానం, వేగంతో ప్రజల జీవనం సులభతరం అవుతోందన్నారు. విద్య, వైద్యం, టూరిజం, వ్యవసాయం వంటి రంగాల్లో మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయని తెలిపారు. ఆధునిక సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలు ప్రతి సమాజంలో ఒక్కరికీ చేరాలని, ఆ దిశగా కృషి చేస్తున్నామని వెల్లడించారు. పెట్టుబడి, వనరులు, సాంకేతికతను ప్రజలకు చేరువ చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. విద్యార్థులు, స్టార్టప్ కంపెనీల కోసం దేశవ్యాప్తంగా త్వరలో 100 ‘5జీ ల్యాబ్లు’ అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు. విద్యాసంస్థల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. -
వినూత్నంగా సెల్ఫోన్లో కూరగాయల వ్యాపారం, నిమిషాల్లో డోర్ డెలీవరీ
కూరగాయలు పండించడంలో పాత పద్ధతి పాటిస్తూ.. వాటిని విక్రయించడంలో మాత్రం కొత్త పోకడలు అవలంబిస్తున్నాడో రైతు. మార్కెట్కు వెళ్లే అవసరం లేకుండా, కూరగాయలు రాశిగా పోసి కొనుగోలు దారుల కోసం వేచి చూడాల్సిన అగత్యం లేకుండా సెల్ఫోన్ సాయంతో వ్యాపారం చేస్తున్నారు. ఇంటి నుంచే నిర్వహిస్తున్న ఈ వ్యాపారానికి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. నరసన్నపేట: వాట్సాప్ సాయంతో ఓ గ్రూపును ఏర్పాటు చేసుకున్న రైతు దాని ద్వారానే ఎంచక్కా వ్యాపారం నిర్వహిస్తున్నారు. నచ్చిన కూరగాయలు వాట్సాప్ లో బుక్ చేసిన కొన్ని గంటల వ్యవధిలో డోర్ డెలివరీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ తమకూ బాగుండడంతో వినియోగదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నరసన్నపేటలోని దేశవానిపేటకు చెందిన ఆదర్శ రైతు రావాడ మోహనరావు వినూత్న పద్ధతిలో వర్తకం చేస్తున్నారు.మోహనరావుకు ప్రకృతి వ్యవసాయంపై గురి బాగా కుదిరింది. దీంతో సారవకోట మండలంలోని పద్మపురంలో 20 ఎకరాల విస్తీర్ణంలో పురుగు మందులు వాడకుండా సహజ ఎరువులతో పంటలు పండిస్తున్నారు. వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలతో కూరగాయల సాగు చేస్తున్నారు. వీటిని అందరిలా కాకుండా వాట్సాప్ ద్వారా విక్రయించాలని నిర్ణయించుకుని మన మార్ట్ ఆర్గానిక్ ఫార్మ్ అని పేరుతో ఒక గ్రూప్ క్రియేట్ చేసి తనకు తెలిసిన మిత్రులను చేర్చారు. మొదట్లో 26 మందితో ఉన్న ఈ గ్రూపు ఇప్పుడు 540 మందికి చేరింది. ఈ వాట్సాప్ గ్రూపులో పండిన కూరగాయలు, దుంపలు, పళ్లు వాటి ధరలను ప్రదర్శిస్తున్నారు. నచ్చిన వారు తమకు కావాల్సిన కూరగాయలను ఆర్డర్ పెడుతున్నారు. కొన్ని గంటల్లో కూరగాయలు ఇంటికి చేర్చుతున్నారు. ఇప్పుడు నరసన్నపేటలో ఈ వ్యాపారం హాట్ టాపిక్ అయింది. రోజూ ఆకుకూరలు, కూరగాయలు వంద కిలోలకు పైగా విక్రయిస్తున్నారు. శమ తప్పింది నేను వృద్ధాప్యంలో ఉన్నాను. బజారుకు వెళ్లి కూరగాయలు కొనేందుకు నానా అవస్థలు పడేవాడిని. ఇప్పుడు కావాల్సిన కూరగాయలు వాట్సాప్లో ఆర్డర్ చేస్తున్నాం. తెచ్చి అందిస్తున్నారు. బాగుంది. కూరగాయలు నాణ్యతగా ఉంటున్నాయి. – కేఎల్ఎన్ మూర్తి, పుండరీకాక్ష కాలని, నరసన్నపేట తాజా కూరగాయలు వాట్సాప్లో కూరగాయలు చూసి ఆర్డర్ పెడుతున్నాం. గంట వ్యవధిలోనే ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. మాకు సమయం ఆదా అవుతోంది. కూరగాయలు కూడా తాజాగా ఉంటున్నాయి. తూకం కచ్చితంగా ఉంటుంది. – సాయి శ్రీనివాస్, టీచర్, నరసన్నపేట ఆదరించారు.. ప్రకృతి వ్యవసాయంపై మక్కువతో పలు ప్రాంతాల్లో తిరిగి ఏడాదిగా వివిధ పద్ధతుల్లో కూరగాయల సాగు చేస్తున్నాను. కొందరు మిత్రుల సలహాతో వాట్సాప్లో కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాను. మూడు నెలలుగా ఇది నిరంతరాయంగా సాగుతోంది. పండుతున్న కూరగాయలు ఏ రోజుకు ఆ రోజు అయిపోతున్నాయి. వినియోగదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. – రావాడ మోహనరావు, ఆదర్శ రైతు, దేశవానిపేట -
సెల్ఫోన్ యూజర్లకు వార్నింగ్ మెసేజ్.. స్పందించిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఫోన్ యూజర్లకు సెల్ఫోన్లో అలర్ట్ మెసేజ్ రావడం కలకలం సృష్టించింది. ఫోన్లను ఆపే వరకు అలారమ్ సౌండ్ రావడంతో కస్టమర్ల ఆందోళనకు గురయ్యారు. అయితే, టెస్టింగ్లో భాగంగానే వినియోగదారులకు ఇలా అలర్ట్ మెసేజ్ పంపినట్టు కేంద్రం వివరణ ఇచ్చింది. దీనిపై భయపడాల్సిందేమీలేదని స్పష్టం చేసింది. అయితే, దేశవ్యాప్తంగా అన్ని నెట్వర్క్ల యూజర్లకు గురువారం ఉదయం 11-12 గంటల మధ్య ప్రాంతంలో సెల్ఫోన్లకు వార్నింగ్ మెసేజ్ వచ్చింది. ఫోన్లను ఆపే వరకు అలారమ్ సౌండ్ చేస్తూ స్క్రీన్పై మెసేజ్ డిస్ప్లే అయ్యింది. ఈ అలర్ట్పై కేంద్రం వివరణ ఇచ్చింది. ‘ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా సెల్ ప్రసారం సిస్టమ్ ద్వారా పంపంబడిన నమూనా పరీక్ష సందేశం. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి. ఎందుకంటే మీ వైపు నుంచి ఎటువంటి చర్య అవసరం లేదు. ఈ సందేశం నేషనల్ డిజాస్టర్ నిర్వహణ అథారిటీ అమలు చేస్తున్న టెస్ట్ పాన్ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థకి పంపబడింది. దీన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజా భద్రత మరియు అత్యవసర సమయంలో సకాలంలో హెచ్చరికలను అందిస్తాయి అని తెలిపింది. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను హెచ్చరించేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజా భద్రతను మరింత మెరుగుపరుస్తుంది అని రాసి ఉంది. కాగా, ఈ మెసేజ్ ఇప్పటి వరకు మూడు భాషల్లో యూజర్లకు వచ్చింది. మొదట ఇంగ్లీష్, తర్వాత తెలుగు, చివరగా హిందీలో మెసేజ్లు వచ్చాయి. What is this alert all about? @airtelindia @airtelnews @Airtel_Presence It's like a real high vibration and emergency alarm. pic.twitter.com/dLdohymNxL — Aksh (@aksh2810) September 21, 2023 మొబైల్ ఫోన్ యూజర్లకు అలెర్ట్ మెసేజ్ రావడం ఇటు హైదరాబాద్లోనూ కలకలం సృష్టించింది. ఒక సభలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఉన్నప్పుడు ఈ అలారం వచ్చింది. ఒక్కసారిగా వార్నింగ్ సౌండ్ రావడంతో ఏమైందని మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఫోన్లను ఆపే వరకు అలారం సౌండ్ రావడంతో అక్కడే ఉన్న వారు ఆందోళనకు గురయ్యారు. కాసేపటికే ఇది టెస్ట్ అలారం అని తెలియడంతో సమావేశాన్ని కొనసాగించారు. -
చిన్నపిల్లలకు స్మార్ట్ఫోన్ ఇస్తున్నారా? టీనేజ్లో డిప్రెషన్తో..
ఆధునిక సాంకేతిక యుగంలో స్మార్ట్ఫోన్ అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. స్మార్ట్ ఫోన్ లేనిదే రోజు గడవదంటే అతిశయోక్తికాదు. లేచినప్పటి నుంచి నిద్రకు ఉపక్రమించే వరకు పక్కన స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. సగం పనులు దీనితోనే అవున్నాయంటే మాటలు కాదు. ఒక వైపు స్మార్ట్ ఫోన్తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంతకుమించి సమస్యలూ ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలపై ఫోన్ పెను ప్రభావం చూపుతోంది. జీవనశైలే మారిపోయింది ప్రస్తుతం 99 శాతం మంది చేతుల్లో స్మార్ట్ఫోన్ ఉంటుంది. చిన్నపిల్లలు ఈ ఫోన్ల వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. 1995 తర్వాత పుట్టిన పిల్లలు తమ కౌమారమంతా స్మార్ట్ఫోన్తోనే గడుపుతున్న మొదటి తరమని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఫోన్లు వచ్చాక మనిషి జీవన శైలే మారియిందని పేర్కొంటున్నాయి. 1995 తర్వాత పుట్టిన పిల్లలు ఎక్కువ సమయం ఆన్లైన్లోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు. కబుర్లు, సరదాలు, ఆట పాటలూ అన్నీ అందులోనే. పుస్తకాలు చదవడం, నిద్రపోవడం, స్నేహితులతో గడపడం, శారీరక ఆటలకు కేటాయిస్తున్న సమయం చాలా తక్కువ. ఈ జీవన శైలి వలన పిల్లల పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్యులూ హెచ్చరిస్తున్నారు. ముందు తరాలవారితో పోల్చుకుంటే జీవన నైపుణ్యాల్లో ఇప్పటి పిల్లలు వెనకబడిపోతున్నారని నిపుణులు చెప్తున్నారు. వీటికి అదనంగా ఒంటరితనంతోపాటు ఇతర మానసిక సమస్యలూ ఎక్కువవుతున్నాయని అధ్యయనాలు తేల్చాయి. స్మార్ట్ ఫోన్లు పిల్లలు, టీనేజర్ల మెదళ్లపై తీవ్ర ప్రభావం చూపి సృజనాత్మకతను చంపేస్తున్నాయని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు స్పష్టం చేశాయి. అమెరికా సైకాలజీ ప్రొఫెసర్ జీన్ అధ్యయనమూ ఇదే విషయాన్ని మరింత విడమరిచి చెప్పింది. టీనేజర్లు తీవ్ర నిరాశలోకి.. టీనేజర్ల ఆరోగ్యం, ప్రవనర్తన తాలూకు అంశాలపై అమెరికాలోని శాండియాగో స్టేట్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్, ఐజెన్ కన్సెల్టింగ్ వైద్యురాలు జీన్ త్వెంగే అధ్యయనం చేశారు. ఆమె తన బృందంతో కలిసి 13 నుంచి 18 ఏళ్ల వయస్సు గల పది లక్షలకుపైగా పిల్లపై పరిశోధనలు చేశారు. టీనేజర్లు తమ సమయాన్ని ఎలా గడుపుతన్నారనేది మానసిక ఆరోగ్య కోణంలో ఓ ప్రాథమిక అంశమని ఆమె పేర్కొన్నారు. ఆమె 2011 నుంచి ఒంటరితనంతో బాధపడే టీనేజర్లు బాగా పెరగడం గుర్తించినట్టు చెప్పారు. జీవితం వృథా అనే భావనకు చాలామంది వస్తున్నట్టు తేలిందని పేర్కొన్నారు. ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలని, ఐదేళ్లలో ఈ వ్యాధి లక్షణాలు 60 శాతం మేర పెరిగాయని వివరించారు. తమను తాము గాయపరుచుకునేంతగా అవి విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాలికల్లో ఈ ప్రమాదకర ధరోణి రెండు మూడింతలు పెరిగిందని పేర్కొన్నారు. కొన్నేళ్లలోనే టీనేజర్ల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని జీన్ తన అధ్యయనంలో వివరించారు. ఫోన్ వ్యసనంలా.. మన దేశంలోని కాలేజీ విద్యార్థులు రోజుకు 150 సార్లుకుపైగా తమ ఫోన్లు చెక్ చేసుకుంటున్నారట. ఫోన్ చూసుకోకపోతే ఏదో మిస్ అయిపోతామనే భావనలో ఉంటున్నారట. ఇదొక వ్యసనంలా మారిందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడేం చేయాలి? ► రోజుకు రెండు గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం డిజిటల్ మీడియాకు కేటాయించడం మంచిది. ఇది మానసిక ఆరోగ్యానికి ఆనందానికి దోహదపడుతుంది. ► అయితే డిజిటల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇది కూడా విచారానికి కారణమవుతుంది. ► మన సమయం మన చేతిలోనే ఉంటుంది. ఉండాలి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ► స్నేహితులతో టచ్లో ఉండేందుకు మాత్రమే సోషల్ మీడియాను వాడాలి. ఒకవేళ పిల్లలకు ఫోన్ చాలా అవసరమని భావిస్తే ఇంటర్నెట్ సౌకర్యం లేని ఫోన్ మాత్రమే ఇవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మన పిల్లలను జాగ్రత్తగా పరిశీలిస్తుండాలి. చిన్నపిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదు చిన్న పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వకూడదు. అది వారికి అలవాటు చేయడం వల్ల వారి పెరుగుదలతోపాటు మెదడుపై ప్రభావం చూపుతోంది. మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. పెద్దలు కూడా అవసరానికి మించి స్మార్ట్ఫోన్లు వాడకూడదు. దీనివల్ల మతిమరుపు నిద్రలేమి సమస్యలకు లోనవుతారు. మీపిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చినట్లు అనుమానం ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. -
పిల్లలు అడిగనవన్నీ ఇచ్చేస్తున్నారా? అయితే మీరు ట్రాప్లో పడ్డట్లే!
ఈ మధ్యకాలంలో సెల్ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్కు అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా రెండేళ్ల లోపు చిన్నారులు కూడా ఫోన్లో బొమ్మలు చూస్తూ గంటల తరబడి గడిపేస్తున్నారు. భోజనం తినాలన్నా, నిద్ర పోవాలన్నా ఫోన్ పక్కన ఉండాల్సిందే అనేంతలా అలవాటుపడుతున్నారు. ఇక తల్లిదండ్రులు కూడా పిల్లల చేతిలో ఫోన్ పెడితే అన్నం తినిపించడం సులువు అని ఈజీగా మొబైల్ అలవాటు చేస్తున్నారు. ఇది చిన్నారుల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఇది మానసికంగా, శారీరకంగా చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. 1. మీ పిల్లల స్నేహితులందరికీ సెల్ ఫోన్ ఉందని, మీ బిడ్డకు కూడా సెల్ ఫోన్ కొనిచ్చారా? 2.మీ పిల్లలు హోంవర్క్ పుస్తకం మర్చిపోతే మీరు స్కూల్ కు వెళ్లి ఇచ్చి వస్తున్నారా? 3.మీ పిల్లల ప్రాజెక్ట్ వర్క్ కు కావాల్సిన మెటీరియల్ కోసం మీరు షాపుల చుట్టూ తిరుగుతున్నారా? 4.మీ బిడ్డను చాలా యాక్టివిటీస్ లో చేర్పించడం వల్ల అసలు ఖాళీ సమయమే ఉండటం లేదా? 5. మీరు పికప్ చేసుకోవడానికి వెళ్లేందుకు కాస్తంత లేటయితే వెంటనే మీకు మెసేజ్ వస్తుందా? వీటిలో ఏ ఒక్కటి చేస్తున్నా.. మీరు పేరెంట్ ట్రాప్లో చిక్కుకున్నట్లే. పిల్లలు కష్టపడకూడదని చాలామంది పేరెంట్స్ పిల్లలు అడిగినవన్నీ ఇచ్చేస్తుంటారు. అలాగే వాళ్ల ప్రాజెక్ట్ వర్క్స్ కూడా చేస్తుంటారు. ఫ్రెండ్స్ తో, టీచర్స్ తో వారికి ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులే పరిష్కరిస్తుంటారు. దీనివల్ల పిల్లలు తమకు సొంతంగా సమస్యలను పరిష్కరించుకొని, స్కిల్స్ సాధించుకునే అవకాశాన్ని కోల్పోతారు. జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు పరిష్కారం కోసం ఇతరులవైపు చూసే, ఇతరులపై ఆధారపడే మనస్తత్వాన్ని అలవాటు చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితులకు కారణమయ్యే ప్రవర్తననే parenttrap(పేరెంట్ ట్రాప్)అంటారు. కంట్రోల్ ట్రాప్(Control Trap): తల్లిదండ్రులు తమ పిల్లలను అతిగా నియంత్రించడం, వాళ్లు ఏం చేస్తున్నారో, సోషల్ మీడియా వాడకం వరకు ప్రతీది నిర్దేశించినప్పుడు ఇది జరుగుతంది. పిల్లల భద్రత, శ్రేయస్సు కోసం కొంత నియంత్రణ అవసరం. అయితే అతిగా నియంత్రించడం వల్ల పిల్లల్లో ఆందోళన, స్వీయగౌరవ సమస్యలు ఏర్పడతాయి. క్రిటిసిజమ్ ట్రాప్(Criticism Trap): కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను నిత్యం విమర్శిస్తుంటారు, నిరంతరం వారిలో తప్పులను వెతుకుతుంటారు. ఇది వారి ఆత్మగౌరవం, విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. కంపారిజన్ ట్రాప్(Comparison Trap): చాలామంది పేరెంట్స్ పిల్లలను తోబుట్టువులతోనూ, తోటివారితోనూ పోల్చుతుంటారు. నిరంతరం ఇతరులతో పోల్చడం వారి ఆత్మగౌరవాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. గివింగ్ ట్రాప్(Giving Trap): ఇతర పిల్లలకు ఉన్నవి తమకు లేవని పిల్లలు బాధపడకూడదని తల్లిదండ్రులు భావిస్తారు. అందువల్ల వారు అడగకుండానే అన్నీ తెచ్చి పెడతారు. దీనివల్ల పిల్లలకు అవసరంలేని వస్తువులను ఇచ్చే ఉచ్చులో పడతారు. గిల్ట్ ట్రాప్(Guilt Trap): పిల్లల అసంతృప్తికి తాము కారణం కాకూడదని పేరెంట్స్ భావిస్తారు. తమ బిడ్డ కలత చెందడానికి కారణం తామేనని తల్లిదండ్రులు భావించి అపరాధ భావనకు లోనవుతారు. దాన్ని అధిగమించేందుకు పిల్లలు కోరినవీ, కోరనివీ కొనిచ్చి తమ భారం దింపుకుంటారు. హర్రీడ్ ట్రాప్(Hurried Trap): తల్లిదండ్రులు తమ పిల్లల కోసం తమ శక్తిమేరకు ప్రతిదీ చేయాలని కోరుకుంటారు. దీనివల్ల పిల్లల అవసరాలు వెంటనే తీరతాయని భావిస్తుంటారు. తక్షణ తృప్తి (#instantgratification)కి అలవాటు పడతారు. అలా తక్షణ తృప్తి దొరకనప్పుడు తీవ్రంగా నిరాశ చెందుతారు, విపరీత నిర్ణయాలు తీసుకుంటారు. పర్మీసివ్ ట్రాప్(Permissive Trap): కొందరు తల్లిదండ్రులు పిల్లలు ఏం చేసినా ఏమీ అనరు, ఏం చేయాలనుకున్నా అనుమతిస్తారు. పిల్లలతో సంఘర్షణ నివారించడానికి ఇది సులువైన మార్గంగా భావిస్తారు. కానీ దీనివల్ల పిల్లల్లో స్వీయ క్రమశిక్షణ లోపిస్తుంది, విచ్చలవిడితనానికి దారితీయవచ్చు. ప్రెజర్ ట్రాప్(Pressure Trap): తల్లిదండ్రులు తమ పిల్లల విజయాలను పంచుకోవడం గర్వంగా భావిస్తారు. పోటీలో పిల్లలు ముందుంటే సంతోషిస్తారు, ఏమాత్రం వెనుకంజ వేసినా ఆందోళన పడుతుంటారు. ముందుకు దూసుకుపోవాలని పిల్లలను ఒత్తిడి చేస్తారు. రెస్క్యూ ట్రాప్(Rescue Trap): తల్లిదండ్రులు తమ పిల్లల కష్టాలను చూసి బాధపడతారు. వాటినుంచి బయట పడేయడం ద్వారా వారిని ‘రక్షించాలని’ భావిస్తారు, బయటపడేస్తారు. పర్యవసానంగా కొన్ని పనులు జరగాలంటే వేచి ఉండటం ( delayed gratification) అవసరమనే విషయం పిల్లలకు ఎప్పటికీ అర్థం కాదు. అలాగే తమ సమస్యలను స్వయంగా పరిష్కరించుకునే అవకాశం ఉండదు. పేరెంట్ ట్రాప్స్ నుండి బయటపడాలంటే... పేరెంట్ ట్రాప్స్ నుండి బయటపడాలంటే ఎప్పటికప్పుడు తమ ప్రవర్తనను గమనించుకుంటూ, అంచనా వేసుకుంటూ, అవసరమైనమేరకు మార్చుకునేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలి. ► ప్రతి బిడ్డ ప్రత్యేకమని, ఎవరి ప్రత్యేక సామర్థ్యాలు వారికి ఉంటాయని గుర్తించాలి. ► బిడ్డను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పోల్చకూడదు. ► సరిహద్దులను నిర్ణయించి స్థిరంగా అమలు చేయాలి. వాటి పరిధిలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛనివ్వాలి. ► కష్టమైన అంశాలపై మాట్లాడటానికి, అవసరమైనప్పుడు కష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ► విమర్శించడం కంటే నిర్మాణాత్మక అభిప్రాయాన్ని అందించడంపై దృష్టి పెట్టాలి. ► పిల్లల బలాలను, విజయాలను, సానుకూల ప్రవర్తనలను ప్రశంసించాలి. ► పిల్లలు తమ పనులు తాము చేసుకునేలా ప్రోత్సహించండి. ► తమకు కావాల్సినవి తాము కష్టపడి సాధించుకోవడం నేర్పించండి. ► తమ సమస్యలు తామే పరిష్కరించుకునేందుకు ప్రోత్సహించండి. -డా. మీ నవీన్ నడిమింటి(9703706660), ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
మీ సెల్ఫోన్ పోగొట్టుకున్నారా? ఇలా చేస్తే ఎక్కడున్నా దొరికేస్తుంది
సాక్షి, భీమవరం: సెల్ఫోన్ పోగొట్టుకుంటే వర్రీ కాకండి. ఫోన్ కొనుగోలు చేసిన ఆధారాలతో పోలీసులకు వాట్సాప్ మేసేజ్ ద్వారా ఫిర్యాదు చేస్తే కొద్దిరోజుల్లోనే పైసా ఖర్చులేకుండా మీ చెంతకు చేరుతుంది. పోలీసు శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన సెల్ఫోన్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పోగొట్టుకున్న సెల్ఫోన్ను ఎవరైనా, ఎంత దూరంలో వినియోగిస్తున్నా సులభంగా కనిపెడుతున్నారు. వాటిని రికవరీ చేసి బాధితులకు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2,400 సెల్ఫోన్ మిస్సింగ్ ఫిర్యాదులు అందగా సుమారు రూ.1.20 కోట్ల విలువైన 801 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. కొందరే పోలీస్స్టేషన్లకు.. ప్రస్తుతం సెల్ఫోన్ లేనిది ఎటువంటి కార్యకలాపాలు ముందుకు సాగడం లేదు. ప్రధానంగా ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగం పెరిగింది. వీటి ఖరీదు అధికంగా ఉంది. సెల్ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకుంటే ఆ బాధ వర్ణనాతీతం. ఖరీదైన ఫోన్ పోయిందనే బాధతోపాటు ఫోన్లో నిక్షిప్తమైన ఫోన్ నంబర్లు, సమాచారం పొందడం కష్టంగా మారింది. దీంతో ఫోన్ పోగొట్టుకున్నవారు తన ఫోన్ ఎక్కడైనా పడిపోయిందా.. లేదా ఎవరైనా దొంగిలించారా అనే సందేహంతో సతమతమవుతుంటారు. దీనిపై కొందరు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేస్తుండగా మరికొందరు మిన్నకుండి పోతున్నారు. దీంతో సెల్ఫోన్ దొరికిన వారు లేదా దొంగిలించిన వారు ఆ ఫోన్ తమదేనన్న ధీమాతో వినియోగించుకుంటున్నారు. వాట్సాప్కు మెసేజ్ చేస్తే.. సెల్ఫోన్ పొగొట్టుకున్నవారికి పోలీసు శాఖ మంచి అవకాశం కల్పించింది. పోగొట్టుకున్న ఫోన్ వివరాలను 9154966503 వాట్సాప్ నంబర్కు ‘హాయ్’ అనే మెసేజ్ చేస్తే చాట్బోట్ మెసేజింగ్ పద్ధతి ద్వారా ఒక లింక్ ఆటోమెటిక్గా వస్తుంది. ఆ లింక్ను ఓపెన్ చేసి ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి వివరాలతోపాటు ఫోన్ వివరాలను పొందుపరిస్తే సెల్ఫోన్ను గుర్తిస్తారు. దీనికిగాను జిల్లాలో ఎస్పీ యు.రవిప్రకాష్ ప్రత్యేక సెల్ఫోన్ ట్రాకింగ్ బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ బృందంలో దిశా పోలీసు స్టేషన్కు సంబంధించిన ఎస్సైతో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లు, ఐడీ డిపార్ట్మెంట్కు చెందిన ముగ్గురు సిబ్బంది పనిచేస్తున్నారు. బృంద సభ్యులు తమ రోజువారి విధి నిర్వహణతోపాటు ఫోన్ల రికవరీని కూడా చేస్తున్నారు. పోలీసులు రికవరీ చేసిన ఫోన్లలో ఇతర రాష్ట్రాల్లో వినియోగిస్తున్న ఫోన్లు కూడా ఉండటం విశేషం. నా ఫోన్ దొరికింది మోటారు సైకిల్పై భీమమరం నుంచి నిడదవోలు వెళ్తుండగా ఒక వ్యక్తి లిఫ్ట్ అడిగి నా ఫోన్ దొంగిలించాడు. నిడదవోలు స్టేషన్లో కంప్లయింట్ చేశాను. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫోన్ పోగా వెతికి పట్టుకుని జూన్లో అందజేశారు. పోయిన ఫోన్ దొరకడం ఆనందంగా ఉంది. – షేక్ బాషా, భీమవరం సెల్ఫోన్ ట్రాకింగ్ బృందం ద్వారా.. సెల్ఫోన్ దొరికితే పోలీసుస్టేషన్లలో అందజేయాలి. అక్రమంగా వినియోగించినా, ఆధారాలు లేకుండా కొనుగోలు చేసినా ఇబ్బందులు తప్పవు. జిల్లాలో సెల్ఫోన్ ట్రాకింగ్ బృందం ఏర్పాటుచేసిన తర్వాత ఇప్పటివరకు రూ.1,20,15,000 విలువైన 801 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశాం. ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు ఒకసారి ఫిర్యాదు చేసి మిన్నకుండి పోకూడదు. కొన్నిరోజుల తర్వాత మరలా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. – యు.రవిప్రకాష్, ఎస్పీ, భీమవరం -
సెల్ ఫోన్ వాడొద్దన్నందుకు..
బోయినపల్లి(చొప్పదండి): పదోతరగతిలో మంచి జీపీఏతో పాసైన ఓ విద్యార్థిని సెల్ఫోన్ వాడొద్దని మందలించడంతో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బోయినపల్లి మండలం విలాసాగర్లో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. విలాసాగర్కు చెందిన శేఖర్–లావణ్య దంపతుల కూతురు పోలె శరణ్య (16), ఇటీవలే పదోతరగతిలో 8.3 జీపీఏతో పాసైంది. శనివారం సెల్ఫోన్ చూస్తుండగా శరణ్యను తండ్రి మందలించడంతో రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోనే పడుకుంది. తెల్లారి చూసేసరికి శరణ్య కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. గ్రామంలో వెతుకుతుండగా సాయంత్రం ఓ బావిలో శరణ్య శవమై కనిపించింది. సెల్ఫోన్ వాడొద్దని మందలించినందుకు మనస్థాపం చెందిన శరణ్య మర్లపేట నుంచి విలాసాగర్ వెళ్లే దారిలోని ఓ వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణం చెందినట్లు తండ్రి శేఖర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ పేర్కొన్నారు. -
రూ.లక్ష ఫోన్ కోసం డ్యామ్లో నీటిని ఎత్తిపోశాడు.. తీరా చూస్తే..
అసలే ఎండాకాలం. నీటి ఎద్దడి సమస్యను చాలా ప్రాంతాల్లో ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్నారు. డబ్బుల లాగే నీటిని కూడా పొదుపుగా వాడాల్సిన పరిస్థితి తలెత్తింది. నీటిని కానీ ఓ అధికారి తన సెల్ఫోన్ కోసం ఏకంగా రిజర్వాయర్లోని నీటిని బయటకు ఎత్తిపోశారు. తన స్వార్థం కోసం వందల ఎకరాలకు సాగునీరు అందించే నీటిని వృథా చేశాడు. ఏం అని ప్రశ్నిస్తే.. ఆ నీరు వాడుకకు పనికిరానిదని, కలెక్టర్ నుంచి అనుమతి కూడా తీసుకున్నట్లు చెబుతున్నాడు. అసలు ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో చుద్దాం.. చత్తీస్గఢ్ రాష్ట్రం కంకారా జిల్లాలోని కొల్లిబేడ ప్రాంతానికి చెందిన రాజేశ్ విశ్వాస్ ఆహార ధాన్యాల సరాఫర శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సెలవు దినాన్ని సరదాగా గడపడానికి ఖేర్కట్ట డ్యామ్కు వచ్చారు. అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో తన రూ.లక్ష విలువైన స్మార్ట్ఫోన్ రిజర్వాయర్లో జారిపడింది. స్థానిక ఈతగాళ్లు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. డ్యామ్ దాదాపు 15 అడుగుల లోతు ఉంటుందని, నీరు 10 అడుగుల లోతు ఉన్నాయని భావించారు. దీంతో 30హెచ్పీ సామర్థ్యం కలిగిన రెండు మోటార్లను మూడు రోజులపాటు ఉపయోగించి 21 లక్షల లీటర్ల నీటిని నీటిని ఎత్తిపోశారు. గత సోమవారం నుంచి గురువారం వరకు నిరంతరాయంగా నీటిని తోడిపోశారు. ఈ నీటితో దాదాపు 1500 ఎకరాల సాగుకు ఈ నీరు అందించవచ్చు. చివరికి స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన నీటివనరుల శాఖ అధికారులు ఆ ప్రక్రియను నిలుపుదల చేశారు. కానీ అప్పటికే 21 లక్షల లీటర్లను తోడిపోసినట్లు అధికారులు చెప్పారు. అయితే చివరికి రాజేష్కు తన ఫోన్ లభించింది. కానీ అది మూడు రోజులు వాటర్లో ఉండటం వల్ల పనికి రాకుండా పోయింది. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట్లో వైరల్గా మారింది. అనంతరం శుక్రవారం సదరు అధికారిని సస్పెండ్ చేశారు.దీనిపై స్పందించిన నెటిజన్లు ఫుడ్ ఆఫీసర్పై మండిపడుతున్నారు. ఒక ఫోన్ కోసం వందల ఎకరాలకు ఉపయోగపడే నీటిని వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి విలువ తెలిసిన వారు ఇలా చేయరని హితవు పలుకుతున్నారు. అతనిని చట్టం ప్రకారం శిక్షించాలని సూచిస్తున్నారు. చదవండి: Video: విద్యార్థుల ముందే ఓ రేంజ్లో తన్నుకున్న ప్రిన్సిపల్, టీచర్లు దీనిపై ఫుడ్ ఆఫీసర్ రాజేష్ విశ్వాస్ మాట్లాడుతూ.. ‘నేను స్నేహితులతో డ్యామ్లో ఈతకొట్టడానికి వెళ్లాను. ఈ క్రమంలో ఫోన్ నీటిలో పడిపోయింది. అందులో అధికారిక సమాచారం ఉంది. ఈతగాళ్లు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. నాలుగు అడుగుల మేర నీటిని ఎత్తిపోస్తే ఫోన్ను కనిపెట్టోచ్చని అన్నారు. దీంతో స్థానిక నీటి వనరుల అధికారుల నుంచి అనుమతి తీసుకున్నాను. నా ఫోన్ దొరికింది. ఈ నీరు సాగుకు పనికి రాదు. నా చర్య వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరగలేదు.’ అని తెలిపారు. మరోవైపు రాజేశ్ విశ్వాస్ అనే అధికారికి తాము ఎలాంటి రాతపూర్వక అనుమతి ఇవ్వలేదని నీటి వనరుల అధికారులు పేర్కొన్నారు. కేవలం వర్బల్గానే అనుమతి పొందారని తెలిపారు. నాలుగు అడుగుల మేర నీటిని మాత్రమే ఎత్తిపోయడానికి అనుమతి ఇచ్చామని, అంతకంటే ఎక్కువ నీటిని ఎత్తిపోశారని అధికారులు తెలిపారు. #Chhattisgarh के अंतागढ़ में फूड इंस्पेक्टर ने अपना मोबाइल खोजने के लिए बहा दिया परलकोट जलाशय का 21 लाख लीटर पानी! फोन मिल गया फूड इंस्पेक्टर का कहना है - उन्होनें कुछ गलत नहीं किया, वहीं मंत्री @amarjeetcg कार्रवाई की बात कह रहे है।@ZeeMPCG @mohitsinha75 @RupeshGuptaReal pic.twitter.com/c0qcPpOUrd — कुलदीप नागेश्वर पवार Kuldeep Nageshwar Pawar (@kuldipnpawar) May 26, 2023 -
మొబైల్ ఫోన్ పోయిందా? ఇక చింతే లేదు.. త్వరలో పటిష్ట వ్యవస్థ!
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా ఇక చింతాల్సిన అవసరం లేదు. పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి బ్లాక్ చేసే పటిష్టమైన వ్యవస్థను ప్రభుత్వం తీసుకొస్తోంది. పీటీఐ వార్తా సంస్థ నివేదిక ప్రకారం... ప్రభుత్వం ఈ వారంలో ట్రాకింగ్ సిస్టమ్ను విడుదల చేయనుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీడాట్) టెక్నాలజీ డెవలప్మెంట్ బాడీ సెంటర్ ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, నార్త్ ఈస్ట్ రీజియన్లతో సహా కొన్ని టెలికాం సర్కిళ్లలో CEIR సిస్టమ్ను పైలట్గా నడుపుతోందని ఒక సీనియర్ అధికారి ద్వారా తెలిసింది. ఈ వ్యవస్థ ఇప్పుడు పాన్-ఇండియా విస్తరణకు సిద్ధంగా ఉందని, మే 17న పాన్-ఇండియా లాంచ్కు షెడ్యూల్ ఖరారైనట్లు సమాచారం. దేశంలోని అన్ని టెలికాం నెట్వర్క్లలో క్లోన్ చేసిన మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తనిఖీ చేసే ఫీచర్లను సీడాట్ ఈ వ్యవస్థలో పొందుపరిచింది. దేశంలో మొబైల్ ఫోన్ల విక్రయానికి ముందు వాటి IMEI నంబర్ను బహిర్గతం చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. IMEI అనేది 15 అంకెల సంఖ్య. ఇది ప్రతి మొబైల్ ఫోన్కు ప్రత్యేకంగా ఉంటుంది. ఆమోదించిన IMEI నంబర్లను యాక్సెస్ చేసే వీలు మొబైల్ నెట్వర్క్లకు ఉంటుంది. అంటే తమ నెట్వర్క్లో ఏదైనా అనధికార మొబైల్ ఫోన్లు ప్రవేశిస్తే ఇవి పసిగట్టగలవు. టెలికాం ఆపరేటర్లు, CEIR వ్యవస్థ మొబైల్ ఫోన్ల IMEI నంబర్, దానికి లింక్ చేసిన మొబైల్ నంబర్లను గుర్తించగలవు. ఈ సమాచారం ఆధారంగా పోగొట్టుకున్న లేదా చోరీ గురైన మొబైల్ ఫోన్లను సులువుగా ట్రాక్ చేయవచ్చు. ఇదీ చదవండి: Mothers Day: బడా వ్యాపారవేత్తలైనా తల్లిచాటు బిడ్డలే.. టాప్ బిజినెస్ టైకూన్స్ మాతృమూర్తుల గురించి తెలుసా? -
చార్జింగ్లో ఉండగా ఫోన్కాల్
నర్సీపట్నం: నర్సీపట్నం కోమటవీధికి చెందిన కె.లక్ష్మణ్ (25) విద్యుత్ షాక్తో శుక్రవారం మృతి చెందాడు. టౌన్ సీఐ ఎన్.గణేష్ కథనం... మృతుడు లక్ష్మణ్ శుభకార్యాల క్యాటరింగ్ బాయ్స్ను సరఫరా చేస్తుంటాడు. ఇంటి దగ్గర ఫోన్ చార్జింగ్లో ఉన్నప్పుడు కాల్ రావడంతో ఫోన్లో మాట్లాడుతుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్కు గురయ్యాడు. వెంటనే బంధువులు సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నిపుణుల సూచనలివే..! ► మొబైల్ చార్జింగ్ అవుతుండగా వాడరాదు ► చార్జ్ అవుతున్నప్పుడు సాధారణంగా ఫోన్ వేడెక్కుతుంది ► ఆ సమయంలో వాడితే అది మరింత వేడిగా మారుతుంది ► ఫోన్ అధిక వేడికి గురైతే అందులోని బ్యాటరీ పాడవుతుంది ► బ్యాటరీ లైఫ్టైం తగ్గిపోయే అవకాశం ఉంది ► పరిమితికి మించి వేడైనప్పుడు బ్యాటరీ పేలిపోయే ప్రమాదం ఉంది ► చార్జింగ్ అవుతున్నప్పుడు వాడితే అధిక వేడివల్ల మంటలు కూడా రావొచ్చు ► తడి చేతులతో చార్జింగ్ పెట్టరాదు.. ఫోన్ వాడరాదు ► నేల తడిగా ఉన్న ప్రాంతంలో చార్జింగ్ పెడితే షాక్ కొట్టే చాన్స్ ఉంది. Smartphone Explosion: చిన్నారి ప్రాణం తీసిన స్మార్ట్ఫోన్.. స్పందించిన కంపెనీ -
PM Modi: ప్రధాని మోదీకి ఇదేం భద్రత?!
బెంగళూరు: ప్రధాని మోదీ భద్రతా ఏర్పాట్లలో లోపం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మరోసారి బయటపడింది. ఎస్పీజీ స్థాయి భద్రత ఉన్న ఓ ప్రధాని స్థాయి వ్యక్తి కాన్వాయ్లోకి ఇతర వాహనాలు రావడం, తరచూ కొందరు అతిసమీపంగా రావడం గతంలో చూశాం. ఆయా ఘటనలపై విమర్శలు రావడం తెలిసిందే. తాజాగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలోనూ అలాంటి సీన్ రిపీట్ అయ్యింది. ఆదివారం మైసూర్ ప్రధాని మోదీ రోడ్షోలో పాల్గొన్నారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం పైకి ఓ మొబైల్ వచ్చి పడింది. రోడ్షోకు హాజరైన ప్రజలకు ప్రధాని మోదీ అభివాదం చేస్తున్న టైంలో ఇది జరిగింది. మోదీకి అతి సమీపంగా వెళ్లి.. వాహనం బొనెట్పై మొబైల్ పడింది. ఈ విషయాన్ని ఎస్పీజీ సిబ్బంది గమనించినా.. వాహనం ఆగకుండా ముందుకు పోయింది. అయితే.. ఈ ఘటనపై ప్రధాని మోదీ సెక్యూరిటీ బృందం దర్యాప్తు చేపట్టింది. విచారణలో.. ఆ మొబైల్ బీజేపీ మహిళా కార్యకర్తదేనని తేలింది.మోదీపై పూలు వేసే క్రమంలో, అత్యుత్సాహంతో ఆ మహిళ మొబైల్ సైతం విసిరారని భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(SPG) అధికారులు ఆమెను వదిలేశారు. #WATCH | Security breach seen during Prime Minister Narendra Modi’s roadshow, a mobile phone was thrown on PM’s vehicle. More details awaited. pic.twitter.com/rnoPXeQZgB — ANI (@ANI) April 30, 2023 ఇదిలా ఉంటే.. తాజా కేరళ పర్యటనలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ప్రజలకు అభివాదం చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఓ మొబైల్ ఆయన కాళ్ల దగ్గర పడింది. వెంటనే.. పక్కనున్న సిబ్బంది దానిని పక్కకు తన్నేశారు. ఎస్పీజీ స్థాయి భద్రతా సిబ్బంది ఉన్న ప్రధానికి.. స్థానిక పోలీసుల భద్రతా భారీగా కల్పిస్తున్నప్పటికీ పెద్దగా ఆంక్షలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే విమర్శ వినిపిస్తోంది ఇప్పుడు. Amazing reflex of PM Modi's SPG. Today during his roadshow at Kochi, someone threw a mobile along with flowers by mistake and see how the SPG personal reacted. pic.twitter.com/s4YhxJycEi — നചികേതസ് (@nach1keta) April 24, 2023 #WATCH | Karnataka: Security breach during PM Modi's roadshow in Davanagere, earlier today, when a man tried to run towards his convoy. He was later detained by police. (Visuals confirmed by police) pic.twitter.com/nibVxzgekz — ANI (@ANI) March 25, 2023 #WATCH | Karnataka: A young man breaches security cover of PM Modi to give him a garland, pulled away by security personnel, during his roadshow in Hubballi. (Source: DD) pic.twitter.com/NRK22vn23S — ANI (@ANI) January 12, 2023 ఇదీ చదవండి: బుల్లి పట్టణాల్లోనూ బిలియనీర్లు -
Smartphone Explosion: చిన్నారి ప్రాణం తీసిన స్మార్ట్ఫోన్.. స్పందించిన కంపెనీ
మొబైల్లో వీడియో చూస్తూ చిన్నారి మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. షావోమీ సంస్థ ఘటనపై స్పందించింది. బాధిత కుటుంబానికి ఎటువంటి సాయమైనా చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కేరళలోని త్రిసూర్లో ఎనిమిదేళ్ల ఆదిత్యశ్రీ స్మార్ట్ఫోన్లో వీడియో చూస్తుండగా అది ఒక్కసారిగా పేలింది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఘటనపై స్థానిక పోలీసుల బృందం దర్యాప్తు చేస్తోంది. అన్ని ఆధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా రంగంలోకి దిగింది. ఇక ఈ ఘటనకు కారణమైన మొబైల్ ఫోన్ మోడల్ రెడ్ మీ అని కొన్ని రిపోర్టులు వెల్లడించాయి. అయితే, ఇది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసు అధికారులు చెప్తున్నారు. (చదవండి: చేతిలో స్మార్ట్ఫోన్..వెన్నెముక డౌన్!) ఫోన్ పేలిన ఘటనపై రెడ్ మీ మొబైల్స్ మాతృ సంస్థ షావోమీ ఇండియా ప్రతినిధులు స్పందిస్తూ.. వినియోగదారుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్య అంశమని అన్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో బాధిత కుటుంబానికి సాధ్యమైనంత మేర అండగా ఉంటామని చెప్పారు. కొన్ని రిపోర్టులు రెడ్ మీ మొబైల్ పేలిందని చెప్తున్నాయి. అదింకా నిర్ధారణ కాలేదని, అధికారులకు సహకరించి నిజానిజాలు నిగ్గులేందుకు కృషి చేస్తామన్నారు. (స్వలింగ వివాహాల చట్టబద్ధత అంశం.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు) కాగా, మొబైల్ ఫోన్లు పేలడం ఇదే తొలిసారి కాదు. కొన్ని నెలల క్రితం తన మొబైల్కు చార్జింగ్ పెడుతుండగా షాక్ కొట్టి ఒక యువకుడు చనిపోయాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని బదువాలో జరిగింది. మరో ఘటనలో 68 ఏళ్ల పెద్దాయన, చార్జ్ అవుతున్న మొబైల్లో మాట్లాతుండగా షాక్ కొట్టింది. ఆయన స్పాట్లో విగతజీవిగా మారాడు. ఇలాంటివే మరికొన్ని ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. వీటన్నింటిలో ముఖ్యంగా గమనించిన అంశాలేంటంటే.. ఫోన్ చార్జింగ్లో ఉండగా వాడటం. నిపుణుల సూచనలివే..! ► మొబైల్ చార్జింగ్ అవుతుండగా వాడరాదు ► చార్జ్ అవుతున్నప్పుడు సాధారణంగా ఫోన్ వేడెక్కుతుంది ► ఆ సమయంలో వాడితే అది మరింత వేడిగా మారుతుంది ► ఫోన్ అధిక వేడికి గురైతే అందులోని బ్యాటరీ పాడవుతుంది ► బ్యాటరీ లైఫ్టైం తగ్గిపోయే అవకాశం ఉంది ► పరిమితికి మించి వేడైనప్పుడు బ్యాటరీ పేలిపోయే ప్రమాదం ఉంది ► చార్జింగ్ అవుతున్నప్పుడు వాడితే అధిక వేడివల్ల మంటలు కూడా రావొచ్చు ► తడి చేతులతో చార్జింగ్ పెట్టరాదు.. ఫోన్ వాడరాదు ► నేల తడిగా ఉన్న ప్రాంతంలో చార్జింగ్ పెడితే షాక్ కొట్టే చాన్స్ ఉంది. -
మనం చూసిన సాంకేతిక విప్లవం
ప్రపంచంలో మొబైల్ ఫోన్లు మొదలై యాభై ఏళ్లయ్యింది. అవి ఇండియాలోకి ప్రవేశించి నలభై ఏళ్లయ్యింది. అప్పట్లో ఆ ఫోన్లు అడుగు పరిమాణంలో ఉండేవి. వాటితో కేవలం మాట్లాడగలం. మెసేజులు, ఫొటోలు పంపలేము. 1990లలో ఇండియాలో మొబైల్ సేవలు ఊపందుకున్నాయి. అప్పుడు కూడా ‘టాక్ టైమ్’ ఖరీదైన వ్యవహారం. కానీ తర్వాతి రెండు దశాబ్దాల్లో అనేక మలుపులు తిరిగాయి. పాలసీ మార్పులు, ప్రీ–పెయిడ్ సర్వీస్, ఛోటా రీచార్జ్, సర్వీస్ నెట్వర్క్ల విస్తరణ, స్థానిక తయారీ వంటివన్నీ కలిసి మొబైల్ ఫోన్ సేవలను సరసమైన ధరలకే అందుబాటులోకి తెచ్చాయి. ఆధునిక మానవ చరిత్రలో అనేకమంది ప్రజల జీవితాలను స్పృశించిన అతి గొప్ప సాంకేతిక సాధనం మొబైల్ ఫోన్! ఆధునిక మానవ చరిత్రలో అనేకమంది ప్రజల జీవితాలను స్పృశించిన అతి గొప్ప సాంకేతిక సాధనం మొబైల్ ఫోన్. భారతదేశం స్వాతంత్య్రం పొందిన పలు దశాబ్దాల తర్వాత సగటు కుటుంబాలకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికతలు సైకిల్, చేతి గడియారం, లేదా ట్రాన్సిస్టర్ రేడియో మాత్రమే. 1960లు, 1970లలో నాలాగా భారత్లో పుట్టి పెరిగినవారు అప్పట్లో ఫోన్ కలిగి ఉండటం ఒక విలాసంగా ఉండేదని మీకు చెబుతారు. టెలిఫోన్ కనెక్షన్ కోసం వేచి ఉండే సమయం అయిదు నుంచి ఏడేళ్ల వరకు ఉండేది. ఫోన్ ఉన్న కుటుంబాలకు ఇరుగుపొరుగు వద్ద చాలా డిమాండ్ ఉండేది. తమ సంబంధీకుల కాల్స్ అందుకోవడానికి వారు ఈ సౌకర్యాన్ని ఉపయో గించుకునేవారు. వారు ఆ నంబర్ను పీపీ (ప్రైవేట్ పార్టీ) అని పంచు కునేవారు. అనధికారికంగా తమ ఫోన్లను ఇతరులు వాడకుండా యజ మానులు వాటిని లాక్ చేసేవారు. (ఇప్పుడు స్మార్ట్ ఫోన్లకు స్క్రీన్ లాక్ లాగా అప్పుడు ఫోన్ డయలర్ని లాక్ చేసేవారు.) నా తరం వారు నిజంగానే తమ జీవితకాలంలో లాండ్లైన్ ఫోన్ల నుంచి సర్వవ్యాపి అయిన స్మార్ట్ ఫోన్ల వరకు సంభవించిన సాంకేతిక వివ్లవానికి సాక్షీభూతులయ్యారు. మొబైల్ ఫోన్ ను 50 సంవత్సరాల క్రితమే ఆవిష్కరించారు. న్యూయార్క్లోని దాని ఆవిష్కర్త మార్టిన్ కూపర్ ప్రపంచంలోనే మొట్టమొదటి మొబైల్ కాల్ను 1973 ఏప్రిల్ 3న చేశారు. పాశ్చాత్య ప్రపంచంలో కూడా మొబైల్ ఫోన్ వినియోగదారీ వస్తువుగా మారటానికి దాదాపు రెండు దశాబ్దాలు పట్టింది. లాండ్లైన్ లాగే, మొబైల్ ఫోన్ కూడా ప్రారంభంలో విలాసంగానే ఉండేది. 1980లలో దాని ధర అమెరికాలో 4,000 డాలర్లు. వాటి పరిమాణం పెద్దదిగా ఒక అడుగు ఉండేది. దాన్ని ‘ఇటుక ఫోన్’ అనేవారు. 1990ల మధ్యలో నేను ఉపయోగించిన తొలి మొబైల్ ఇటుక సైజు కంటే కాస్త చిన్నదిగా ఉండేది. అప్పటికీ అది ఏ జేబులోనూ పట్టేది కాదు. ధర సుమారు యాభై వేలు. నేను పని చేస్తుండిన టెలివిజన్ ప్రొడక్షన్ కంపెనీ, ఫీల్డ్ అసైన్ మెంట్ల కోసం వెళ్లే విలేఖరుల కోసం కొన్ని హ్యాండ్ సెట్లను అద్దెకు తీసుకుంది. అవి ఒక డయలింగ్ ప్యాడ్తో కూడిన భారీ పరికరం, పొడుచుకువచ్చిన యాంటెన్నా, మందమైన రింగ్టోన్ తో ఉండేవి. గుర్తుంచుకోండి, దాంతో కేవలం మాట్లాడగలరు. మెసేజ్ చేయలేరు, ఫొటోలు పంపలేరు. మొబైల్ టెలిఫోన్ యుగంలోకి భారత్ 1987 జనవరి 1న ప్రవేశించిందని కొద్దిమందికే తెలుసు. మహానగర్ టెలిఫోన్ నిగమ్ తన ‘మొబైల్ రేడియో ఫోన్ సర్వీస్’ను ఢిల్లీలో ప్రారంభించడం ద్వారా ఇది మొదలైంది. అది కారులో అమర్చిన ఫోన్ యూనిట్ని ఉప యోగించి ప్రయాణిస్తున్నప్పుడు మాట్లాడటానికి వీలయ్యే ఒక ప్రాథమికమైన కార్ ఫోన్ సర్వీస్. కొన్ని డజన్ల ఫోన్లను మాత్రమే అప్పట్లో వ్యవస్థాపించారు. 1992లో దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో సెల్యులార్ టెలిఫోన్ సేవలను అందించడానికి ప్రైవేట్ కంపెనీలకు లైసెన్స్ ఇచ్చారు. మొట్టమొదటి వాణిజ్యపరమైన సెల్యులార్ మొబైల్ కాల్ను 1995 జూలై 31న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు కలకత్తా నుంచి న్యూఢిల్లీలో ఉన్న సమాచార మంత్రి సుఖ్రామ్కు చేశారు. కలకత్తాలో మొబైల్ కాల్ సర్వీస్ను మోడీ–టెల్స్ట్రా (బీకే మోడీ గ్రూప్, ఆస్ట్రేలియాకు చెందిన టెల్స్ట్రా జాయింట్ వెంచర్) అందించాయి. కొన్ని నెలల తర్వాత ఢిల్లీలో ‘భారతి’ సెల్యులార్ సేవలు ఆరంభించింది. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లో మాట్లాడటం ఖరీదైన వ్యవహారంగా ఉండేది – ఒక కాల్ చేయాలంటే నిమిషానికి రూ. 16.80, కాల్ రిసీవ్ చేసుకోవాలంటే రూ. 8.40 చెల్లించాల్సి వచ్చేది. ఫస్ట్ జనరేషన్ (1జి) డేటా టెక్నాలజీ అయిన జనరల్ పాకెట్ రేడియో సర్వీస్ (జీఆర్పీఎస్) అందించడానికి ఫోన్ కంపెనీలకు మరి కొన్నేళ్లు పట్టింది. తర్వాతి రెండు దశాబ్దాల్లో అనేక మలుపులు తిరిగాయి. పాలసీ మార్పులు, ప్రీ–పెయిడ్ సర్వీస్, ఛోటా రీఛార్జ్, కొత్త ప్రాసెసింగ్ టెక్నాలజీలు, దూకుడైన రోలవుట్ ప్లాన్స్, సర్వీస్ నెట్వర్క్ల విస్తరణ, లోకల్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటివన్నీ కలిసి భారతీయులకు మొబైల్ ఫోన్లను సరసమైన ధరలకే అందుబాటులోకి తెచ్చాయి. అధిక కాల్ ఛార్జీలు పాతకథ అయిపోయాయి. జీఆర్పీఎస్ నుంచి, సూపర్ ఫాస్ట్ డేటా స్పీడ్ వరకు పయనించాం. మొబైల్ ఫోన్లు అంటే గతంలోలా ఎమర్జెన్సీ కాల్స్ చేసుకోవడానికి మాత్రమే కాదు, వినోదం నుంచి బ్యాంకింగ్ వరకు ప్రతి అవసరానికీ ఉపయోగపడుతున్నాయి. పిల్లలుగా ఉన్నప్పుడు, ల్యాండ్ లైన్ ఫోన్లో మనం సమాధానం ఇస్తుండగా మనకు కాల్ చేస్తున్న వ్యక్తి చిత్రాన్ని చూడటం సరదాగా ఉంటుందని జోక్ చేయడం నాకు గుర్తుంది. వీడియో కాల్స్ నిజంగానే ఇప్పుడు చిన్నపిల్లలాట అయిపోయింది! భారతీయ సెల్ఫోన్ విప్లవంలో మలుపులు టాక్ టైమ్కు ఎక్కువ ఖర్చు అవుతుండటం మొబైల్ ఫోన్లను సృజనాత్మకంగా ఉపయోగించడానికి దారితీసింది. సాధారణంగా, మీరు ఒక నంబరుకు కాల్ చేస్తున్నప్పుడు, ఆ వ్యక్తి కాల్ తీసు కోలేనప్పుడు దాన్ని మిస్డ్ కాల్ అంటారు. టాక్ టైమ్ ఆదా చేయ డానికి, జనం మిస్డ్ కాల్స్ చేయడం ప్రారంభించారు. ఉద్దేశపూర్వకంగా ‘కాల్ మి బ్యాక్’, ‘నేను చేరుకున్నాను’ వంటి ముందస్తుగా నిర్దేశించిన సందేశాలను తెలియచేయడానికి మిస్డ్ కాల్స్ ఇస్తుంటారు. యజమానులకూ, డ్రైవర్లు, ఇంటి పనిమనుషులు వంటి పరిమితమైన టాక్ టైమ్ ఉన్న వారికీ మధ్య సమాచారానికి ఇది అనుకూలమైన సాధనం. కంపెనీలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వ విభాగాలు తరచుగా వాడే మార్కెటింగ్ సాధనమే మిస్డ్ కాల్. సామాన్య ప్రజలకు మొబైల్ ఫోన్ ని రోజువారీ సాధనంగా చేసే ప్రయాణంలో ప్రీ–పెయిడ్ సర్వీస్ ఒక కీలక మలుపు. నెల చివరలో బిల్ని చెల్లించడానికి బదులుగా వినియోగదారులు టాక్ టైమ్ని కొని, దాన్ని నిర్దిష్ట కాలంలో తమ అవసరాల కోసం ఉపయో గిస్తారు. మరొక వినూత్న ఆవిష్కరణ ‘ఛోటా రీఛార్జ్’ లేదా మైక్రో రీఛార్జ్ కూపన్లు. నెలకు 200 లేదా 300 రీఛార్జ్కి బదులుగా కేవలం ఐదు రూపాయలకే చోటా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది కూరగాయల వ్యాపారి, వ్యవసాయ కూలీ వంటివారికి కూడా మొబైల్ సేవలను సరసమైన ధరకు అందించే గేమ్ ఛేంజర్ అయ్యింది. ఎఫ్ఎమ్సీజీ సిమ్ కార్డులు, రీఛార్జ్ సేవల రూపంలో ఫోన్ సర్వీస్ని స్థానిక పచారీ కొట్లు, ఫార్మసీలు, పాన్ షాపుల్లో విస్తృతంగా అందుబాటులో ఉంచడం జరిగింది. టెలికామ్ సంస్థల కోసం ‘పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్’ లాగా సేవ చేయడమే కాకుండా, ఈ ఫ్రాంచైజీలు కంపెనీ స్టోర్లలోని కస్టమర్ రిలేషన్స్ ఉద్యోగుల లాగా చందాదారుల సమస్యలను లాంఛనప్రాయంగా పరిష్కరి స్తాయి. ఫోన్లు, వాటి సేవలు వేగంగా అమ్ముడయ్యే వినియోగ సరుకులు (ఎఫ్ఎమ్సీజీ)గా మారిపోయాయి. దినేష్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మొబైల్ ఫోన్ పేలి ఎనిమిదేళ్ల చిన్నారి మృతి
సాక్షి, తిరువనంతపురం: మొబైల్ ఫోన్ పేలి ఎనిమిదేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన కేరళలోని తిరువిల్వమలలో చోటు చేసుకుంది. ఈ మేరకు ఎనిమిదేళ్ల అదిత్య శ్రీ అనే చిన్నారి మొబైల్ ఫోన్ ఉపయోగిస్తుండగా చిన్నారి ముఖంపైనే పేలింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన సోమవారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ చిన్నారి స్థానిక స్కూల్లో మూడో తరగతి చదువుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మొబైల్ ఫోన్ పేలుడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఐఏఎస్ హత్య కేసు నిందితుడి విడుదల దుమారం..బిహార్ సీఎంపై విమర్శలు) -
ఫోన్ పోతే.. ఇలా వెతకండి!
షాపింగ్ నుంచి ఇంటికి వచ్చిన వసుధ తెచ్చిన వస్తువులన్నీ లోపల సర్దేసి, వచ్చి కూచుంది. సడెన్గా ఏదో గుర్తుకువచ్చినట్టు అయ్యి ఫోన్ కోసం వెతికింది. చూస్తే, ఎక్కడా కనిపించలేదు. బ్యాగ్, ఇంటిలోపల అంతా చెక్ చేసింది. ఫోన్ కనపడకపోయేసరికి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయ్యింది. ఖరీదైన ఫోన్, అందులో వందలాది కాంటాక్ట్ నంబర్లు, ముఖ్యమైన ఫొటోలు.. అనుకునేసరికి కాసేపటి వరకు ఏం చేయాలో అర్ధం కాలేదు. తన ముఖ్యమైన డేటా పోతే వచ్చే సమస్యలు తలుచుకుని చెమటలు పట్టేశాయి. ∙∙ వసుధ సమస్య చాలామంది ఎదుర్కొనే ఉంటారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? ఫోన్ ట్రాక్ చేయాలన్నా, మన వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉండటానికి మార్గమే లేదా? అనుకునేవారికి సరైన సమాధానంగా సిఇఐఆర్ వరదాయినిగా మారింది. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (సిఇఐఆర్)ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ∙∙ నకిలీ మొబైల్ ఫోన్ల క్రయవిక్రయాలకు అడ్డుకట్టవేయడానికి, మొబైల్ ఫోన్ దొంగతనాన్ని అరికట్టడానికి, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల ద్వారా చట్టబద్ధమైన రక్షణ కలిగించడానికి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (సిఇఐఆర్)ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) ఏర్పాటు చేసింది. సిఇఐఆర్ పోర్టల్ ప్రయోజనాలు: https://ceir.gov.in పోర్టల్ పోగొట్టుకున్న లేదా దొంగలించిన మొబైల్ పరికరాలను ట్రాక్ చేయడానికి ఐఎమ్ఇఐ నంబర్ను ఉపయోగిస్తుంది. సిఇఐఆర్ ద్వారా మొబైల్ పరికరం బ్లాక్ చేశాక, అది ఏ భారతీయ నెట్వర్క్ కంపెనీకి కనెక్ట్ చేయలేరు. ఆ పరికరాన్ని ఇక తిరిగి ఉపయోగించలేనిదిగా మార్చేస్తుంది. పోర్టల్లో మొబైల్ ఫోన్ను బ్లాక్ చేయడానికి.. ►ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. లేదా కోల్పోయిన డివైజ్ సర్టిఫికెట్ లేదా మీ అక్నాలెడ్జ్ కాపీని తీసుకోవాలి. ►మీ సర్వీస్ ప్రొవైడర్ నుంచి డూప్లికేట్ సిమ్ తీసుకోవాలి. ►సిఇఐఆర్ పోర్టల్కు లాగిన్ అయ్యి, కంప్లైంట్ కాపీ, ఐడెంటిటీ (ఆధార్ కార్డ్) ప్రూఫ్ని యాడ్ చేయాలి. https://www.ceir.gov.in/Request/CeirUserBlockRequestDirect.jsp ►మీ ఫారమ్ సబ్మిట్ చేసిన తర్వాత మీ రిక్వెస్ట్ ఐడీ జనరేట్ అవుతుంది. ►మొబైల్ నంబర్ను బ్లాక్ చేయడానికి తగిన కారణం ఏంటో తెలియజేయాలి. ►మీ రిజిస్టర్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి, సబ్మిట్ చేయాలి. ఐఎమ్ఇఐ నంబర్ను చెక్ చేయడానికి.. ►ముందు పోర్టల్కి లాగిన్ అవ్వాలి. https://ceir.gov.in/ Device/CeirIMEI Verification.jsp ►మీ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి. ►మీ మొబైల్కి ఓటీపి వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ►15 అంకెల ఐఎమ్ఇఐ నంబర్ను నమోదు చేసి, చెక్ రిక్వెస్ట్ అనే దానిపై క్లిక్ చేయాలి. ►ఐఎమ్ఇఐ నంబర్ ధ్రువీకరణ అవుతుంది. సిఇఐఆర్ పోర్టల్లో మీ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ చేయడానికి.. ►పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి. https://ceir.gov.in/Request/CeirRequestStatus.jsp ►రిక్వెస్ట్ స్టేటస్ ఆప్షన్ను చెక్ చేస్తే, తెలిసిపోతుంది. పోర్టల్లో రికవరీ మొబైల్ ఫోన్ని అన్బ్లాక్ చేయడానికి.. https://ceir.gov.in/ Request/CeirUser UnblockRequest Direct.jsp పోర్టల్కు లాగిన్ అవ్వాలి. ►రిక్వెస్ట్ ఐడీని ఎంటర్ చేయాలి. ►మొబైల్ నంబర్ను అన్బ్లాక్ చేయడానికి కారణాన్ని ఇవ్వాలి. డివైజ్ను గుర్తించాక డేటాను తొలగించడానికి.. ►ఆండ్రాయిడ్ డివైజ్ డేటాను లాక్ లేదా ఎరేజ్ చేయడానికి https://support.google.com/ accounts/answer/6160491?hl=en ►ఐ ఫోన్ అయితే.. iCloud.com లో ఫైండ్ మై ఐఫోన్ అని సెర్చ్ చేసి, డేటా తొలగించాలి. https://support.apple.com/en-in/guide/icloud/mmfc0ef36f/icloud పోయిన మొబైల్ డేటా సురక్షితంగా ఉంచడానికి.. ►ఈ పోర్టల్ పూర్తిగా చట్టబద్ధమైనది. ఫోన్ ట్రాక్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తుంది. మీ డేటా, యాప్స్ను డీకంపైల్ చేయదు. https://reports.exodus-privacy.eu.org/en/ ►మీ మొబైల్ నంబర్లను నిర్ధారించడానికి, తీసేయడానికి టెలికాం విభాగాం అనుమతిస్తుంది. https://tafcop.dgtelecom.gov.in ►ఎస్సెమ్మెస్లు, బల్క్ ఎస్సెమ్మెస్లు పంపినవారిని గుర్తించడానికి అనుమతిస్తుంది. https://smsheader.trai.gov.in ►ఎస్సెమ్మెస్, వాట్సప్, ఇమెయిల్లో వచ్చిన షార్ట్ లింక్స్ మీ వ్యక్తిగత డేటాను డామేజీ చేయవచ్చు. అందుకని, షార్ట్ లింక్స్ పూర్తి యుఆర్ ఎల్ వివరాలను https://isitphishing.org/ ద్వారా చెక్చేయవచ్చు. ►యాంటీవైరస్, యాంటీ మాల్వేర్, సెక్యూరిటీ యాప్లను ఫోన్లో ఇన్స్టాల్ చేసి ఉంటే వాటిని గుర్తించడంలో సహాయపడుతుంది. ∙అన్ని అప్లికేషన్లు, సోషల్మీడియా, ఇమెయిల్ అకౌంట్స్ కోసం రెండంచెల ప్రామాణీకరణను ఉపయోగిస్తే, డేటా సురక్షితంగా ఉంటుంది. బ్లాక్ చేస్తే.. పనిచేయదు బ్లాక్ లిస్ట్ చేసిన మొబైల్ పరికరాలను షేర్ చేయడానికి నెట్వర్క్ ఆపరేటర్లకు సెంట్రల్ సపోర్ట్ సిస్టమ్గా సేవలందిస్తూ, అన్ని మొబైల్ ఆపరేటర్ల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎమ్ఇఐ) డేటాబేస్లకు లింక్ చేస్తుంది. సబ్స్క్రయిబర్ ఐడెంటిటీ మాడ్యూల్ (సిమ్) కార్డ్ మార్చినప్పటికీ ఒక నెట్వర్క్లోని బ్లాక్ చేసిన పరికరాలు ఇతర నెట్వర్క్లలో పనిచేయవని ఇది నిర్ధారిస్తుంది. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
సోదరుడితో గొడవ, తెగని పంచాయితీ.. కోపంలో చైనా ఫోన్ మింగేసిన యువతి
భోపాల్: ఇంట్లో పిల్లలు అలగడం, కోపడడం మనం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలో చిన్నారులు తొందర పడి ఏది పడితే అది చేస్తూ ఉంటారు. కొందరు తమను తామే గాయపరుచుకుంటే.. ఇంకొందరు ఇతరులకు గాయం చేస్తుంటారు. ఏదేమైనా ఆ తర్వాత పరిణామాలను మాత్రం వాళ్లు ఊహించరు. సరిగ్గా ఈ తరహా ఘటనే మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. సోదరుడిపై కోపంతో ఓ యువతి ఏకంగా ఫోన్ మొత్తాన్ని మింగేసింది. ఆ తర్వాత ఏమైందంటే? వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో 18 ఏళ్ల యువతి తన సోదరుడితో చైనా మొబైల్ ఫోన్ విషయంలో గొడవ మొదలైంది. వీరిద్దరి మధ్య మొదలైన ఈ సమస్యకు ఎంతసేపటికి పరిష్కారం లభించలేదు. దీంతో ఆ యువతికి పట్టారని కోపం వచ్చింది. ఆవేశంలో గొడవకు కారణమైన ఫోన్ను తీసుకుని ఆ యువతి ఆమాంతం మింగేసింది. కోపంతో సెల్ఫోన్ మింగిన వెంటనే ఆమెకు విపరీతమైన కడుపునొప్పి, నిరంతరం వాంతులు అవుతూ వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను గ్వాలియర్స్లోని జయరోగ్య ఆసుపత్రి (జేఏహెచ్)కి తీసుకెళ్లారు. వైద్యులు అల్ట్రాసౌండ్, ఇతర పరీక్షలు నిర్వహించి యువతి కడుపులో మొబైల్ ఫోన్ ఉందని తేల్చారు. ఆ తర్వాత వైద్యుల బృందం ఆపరేషన్ చేసి ఆమె కడుపులో ఉన్న మొబైల్ ఫోన్ను విజయవంతంగా బయటకు తీశారు. వైద్యులు దాదాపు రెండు గంటల పాటు ఎమర్జెన్సీ సర్జరీ చేసి యువతి కడుపులోంచి మొబైల్ను బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని జయరోగ్య ఆసుపత్రి వైద్యులు తెలిపారు. -
తెలుసుకున్నాకే ఫోన్ కొంటున్నారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ ఇప్పుడు అత్యవసర వస్తువుల జాబితాలోకి వచ్చి చేరింది. పొద్దున లేవగానే, అలాగే పడుకునేప్పుడు ఫోన్ ముట్టుకోకుండా ఆ రోజు పూర్తి కాదంటే అతిశయోక్తి కాదేమో. మరి అంతటి ప్రత్యేకత కలిగిన ఫోన్ కొనుగోలు విషయంలో బడెŠజ్ట్ ఒక్కటే కాదు కోరుకునే ఫీచర్లనుబట్టి మోడల్ ఎంపిక జరుగుతోందట. స్తోమత లేనివారు, ఫోన్ వాడకం పెద్దగా అవసరం లేనివారు బేసిక్ ఫోన్లను వాడుతున్నారు. ప్రస్తుతం భారత్లో 60 కోట్ల మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. బేసిక్ ఫోన్ల నుంచి స్మార్ట్ఫోన్ల వైపు వినియోగదార్లు మళ్లుతుండడం, 5జీ విస్తరణ కారణంగా 2023లో ఈ సంఖ్య 100 కోట్లను దాటుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్మార్ట్ఫోన్ రంగంలో ధరల శ్రేణి, కోరుకుంటున్న ఫీచర్లు, వినియోగదార్ల అభిరుచులు వేటికవే ప్రత్యేకం. విలువ ఉండాల్సిందే.. ధర ప్రాధాన్యం కాదు.. డబ్బుకు తగ్గ విలువ ఉండాల్సిందేనన్నది భారతీయుల ఆలోచన. రూ.15 వేలల్లో ఫోన్ కొనాలని భావించిన కస్టమర్ ముందు ఎక్కువ ఫీచర్లున్న ఫోన్ రూ.18 వేలకు లభిస్తే ఖరీదుకు వెనుకాడడం లేదు. ఇక రూ.7 వేల లోపు, అలాగే రూ.30 వేలకుపైగా ఖరీదు చేసే ఫోన్ల ను 2–5 ఏళ్లు వాడుతున్నారట. అదే రూ.15–30 వేల సెగ్మెంట్లో ఆరు నెలలకే మార్చేస్తున్నారు. కారణం యువ కస్టమర్లు కావడం. ఆన్లైన్లో కొనుగోలు చేసే వినియోగదారులకే మొబైల్స్ పట్ల అవగాహన ఎక్కువ. రూ.15 వేల లోపు లభించే ఫోన్లే అధికంగా ఆఫ్లైన్లో అమ్ముడవుతున్నాయి. రూ.15–30 వేల ధరల శ్రేణి మోడళ్ల అమ్మకాల్లో ఆన్లైన్ వాటా ఎక్కువ. ప్రపంచంలోనే ముందంజ.. స్మార్ట్ఫోన్ల పట్ల అవగాహన ఉన్న కస్టమర్లు భారత్లోనే అత్యధికం. కొనుగోలు కంటే ముందే ఆన్లైన్లో మోడళ్ల ఫీచర్లు, రివ్యూలను చూస్తున్నారట. ఈ విధంగా ముందే అవగాహనకు వచ్చి ఫోన్లను చేజిక్కించుకోవడంలో ప్రపంచంలో భారత్ ముందంజలో ఉందని రియల్మీ గ్లోబల్ ప్రొడక్ట్ మేనేజర్ శ్రీ హరి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘మొబైల్ కొనుగోలు నిర్ణయంలో యువత కీలకపాత్ర పోషిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు స్మార్ట్ఫోన్ కొనే ముందు వీరిని సంప్రదిస్తున్నారు. మార్కెట్లోకి వస్తున్న మోడళ్లు, ఫీచర్లు, రేటింగ్స్ వంటి విషయాలపై యువతకు ముందే అవగాహన ఉంటోంది’ అని వివరించారు. ధర పరంగా చూస్తే.. ► రూ.7,000 లోపు: ఈ విభాగంలో వినియోగదార్లకు కావాల్సింది ఏదైనా స్మార్ట్ఫోన్. వీరికి ఫీచర్లతో పనిలేదు. అత్యధికంగా ఫీచర్ ఫోన్ నుంచి ఇటువైపు మళ్లినవారే. ఇంకో విషయం ఏమంటే వినోదం కోసం పూర్తిగా వీళ్లు ఆధారపడేది ఈ స్మార్ట్ఫోన్పైనే. ► రూ.7–15 వేలు: స్మార్ట్ఫోన్ రంగంలో ఈ విభాగం వాటా ఏకంగా 50 శాతం ఉంది. అధిక బ్యాటరీ, 6.5 అంగుళాలు, ఆపైన సైజున్న డిస్ప్లే, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ కోరుకుంటున్నారు. ► రూ.15–30 వేలు: అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఈ విభాగంలో పట్టణ కస్టమర్లు ఎక్కువ. ముఖ్యంగా యూత్ అధికంగా కొనుగోలు చేసే ధరల శ్రేణి ఇది. మంచి డిజైన్, రెండు లేదా ఎక్కువ కెమెరాలు, అధిక రిజొ ల్యూషన్, ఫుల్ హెచ్డీ, అమోలెడ్ డిస్ప్లే, కర్వ్, 5జీ, ఫాస్ట్ చార్జింగ్, తక్కువ మందం ఉండాల్సిందే. ► రూ.30 వేలు ఆపైన: ఇక్కడ ఫీచర్లు ప్రాధాన్యం కాదు. పెద్ద బ్రాండ్ అయి ఉండాలి. ఈ విభాగంలో కంపెనీలు ఎలాగూ ఒకదాన్ని మించి ఒకటి ఫీచర్లను జోడిస్తాయి అన్నది కస్టమర్ల మనోగతం. -
కవిత వాడుతున్న ఫోన్ను అప్పగించాల్సిందిగా ఆదేశించిన ఈడీ
న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం వాడుతున్న ఫోన్ను అప్పగించాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆదేశించారు. దీంతో విచారణ గది నుంచి బయటకొచ్చిన కవిత.. తన పర్సనల్ సెక్యూరిటీ దగ్గరున్న ఫోన్ను ఈడీ అధికారులకు అదించారు. అంతక ముందే ఇంటి వద్ద ఉన్న ఎమ్మెల్సీ ఫోన్ను సెక్యూరిటీతో ఈడీ అధికారులు తెప్పించారు. కవిత ఫోన్లో ఉన్న డేటాను ఈడీ అధికారులు పరిశీలించనున్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలకు సంబంధించి ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ ఈడీ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ ఇంకా కొనసాగుతోంది. జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని బృందం అయిదు గంటలుగా ఆమెను ప్రశ్నిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ పాత్రపై విచారణ జరుగుతోంది. ఆరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్టు, ఆడిటర్ బుచ్చిబాబు వాట్సాప్ చాట్ ఆధారంగా కవితను ప్రశ్నిస్తున్నారు. చదవండి: కవితను ప్రశ్నిస్తున్న ఈడీ స్పెషల్ టీమ్ -
Heart Attack: ఫోన్ మాట్లాడుతూ కుప్పకూలిన యువకుడు..
సాక్షి, కామారెడ్డి: యువతపై మాయదారి గుండెపోట్లు పగబట్టినట్లున్నాయి. గతంలో ఎటువంటి అనారోగ్యం ఆనవాలు లేని వ్యక్తులు కూడా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. చూస్తుండగానే హార్ట్ స్ట్రోక్తో మరణిస్తున్నారు. తాజాగా కామారెడ్డిలో అలాంటి ఘటనే బుధవారం వెలుగుచూసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన గోనె సంతోష్ (33) అనే యువకుడు ఇంట్లో ఫోన్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలాడు. (చదవండి: చిన్నవయసులోనే గుండెపోటు సంఘటనలు ఎందుకు?) వెంటనే అతడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. సంతోష్ మృతితో కుంటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గత ఐదు రోజుల్లో జిల్లాలో గుండెపోటుకు గురై నలుగురు ప్రాణాలు విడిచారు. (చదవండి: కబడ్డీ ఆడుతూ కుప్పకూలిన బీ ఫార్మసీ విద్యార్థి.. చూస్తుండగానే...) -
‘స్మార్ట్’ వాదనలు స్మార్ట్ కాదు! లైఫ్ పార్ట్నర్తో ‘ఫెక్స్టింగ్’ చేస్తున్నారా?
భార్యాభర్తలు, జీవిత భాగస్వాముల మధ్య ఏదో అంశం మీద వాదోపవాదనలు, చిన్న చిన్న గొడవలు మామూలే. వాదన జరుగుతుండగా... ఆఫీసుకు వెళ్తూ తన పార్ట్నర్ నుంచి దూరంగా వెళ్తే గొడవ సద్దుమణగడం ఖాయం. కానీ మొబైల్ ఫోన్లో టెక్ట్స్ మెసేజీల రూపంలో అదే గొడవ అదే పనిగా కొనసాగితే...? ఇలా లైఫ్ పార్ట్నర్స్ మధ్య ఫైటింగ్ కాస్తా టెక్ట్స్ మెసేజీల రూపంలో కొనసాగడాన్ని‘ఫెక్స్టింగ్’ అనే ధోరణిగా అభివర్ణిస్తున్నారు. మొబైల్స్ ఎన్నెన్నో కొత్త కొత్త రకాల ఫీచర్స్తో వస్తున్నాయి కాబట్టి వాటిని ‘స్మార్ట్’ఫోన్స్ అన్నారు. కానీ ‘ఫెక్స్టింగ్’ అంత స్మార్ట్ కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘ఫెక్స్టింగ్’ అంటే కేవలం జీవిత భాగస్వాముల మధ్య ఫైటింగ్ అనే కాదు... పేరెంట్స్, ఫ్రెండ్స్ మధ్య కూడా కావచ్చుకానీ... అత్యధికంగా ప్రభావం చూపేది భార్యాభర్తల మధ్యనే కావడంతో సాధారణంగా దాన్ని లైఫ్పార్ట్నర్స్కే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అత్యంత ప్రఖ్యాతమైన ఓ సెలబ్రిటీ కేస్స్టడీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్య, అమెరికన్ ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ల దాంపత్యం వయసు 45 ఏళ్లు పైమాటే. ఇటీవల ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాము వాదించుకునేందుకు టెక్ట్స్ మెసేజీలు వాడతామని చెప్పా రు. అందుకు ఓ వినోదాత్మక కారణం కూడా తెలిపారు. తమ ఘర్షణ, వాదోపవాదాలు అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీకి తెలియకుండా ఉండేందుకు ఈ మార్గాన్ని ఉపయోగిస్తుంటామని సరదాగా వెల్లడించారామె. అంటే అందరి గుట్టుమట్లు పసిగట్టే అత్యంత సమర్థమైన ఏజెన్సీనే బురిడీ కొట్టించడానికి ఆమె ‘ఫెక్స్టింగ్’ ను ఎంచుకున్నారన్న మాట. రెండు రకాల వాదనలు ఫెక్స్టింగ్లో పార్ట్నర్స్ ఎదురెదురుగా ఉండరు కాబట్టి... ముఖ కవళికలూ. అందులోని ఆవేశాలూ, ఉద్వేగాలూ కనిపించవు. వాదన తాలూకు తీవ్రత అక్షరాల్లో అంతగా ప్రభావ పూర్వకంగా కనిపించదు కాబట్టి అంత హానికరం కాదనీ అనేవాళ్లూ ఉంటారు. అంతేకాదు... ఆ వాదన కొనసాగడానికి ఇష్టపడని వారు... టెక్ట్స్కు బదులుగా క్రమంగా ‘స్మైల్’ లేదా షేక్హ్యాండ్ ఎమోజీల్లాంటివి ఉపయోగిస్తూ పోతే, ఎదుటివారి నుంచి తగినంత ప్రతిస్పందన లేకపోవడంతో క్రమంగా వాదన సన్నగిల్లిపోతుందనీ, ఎదురుబొదురు ఉన్నప్పటంత హాని జరగకపోవచ్చనీ కొందరు చెబుతుంటారు. సరిగ్గా దీనికి పూర్తి భిన్నంగా వాదించేవారూ ఉంటారు. మాటలు తడబడవచ్చు. ఏదో మాట సరిగా వ్యక్తం కాకపోవచ్చు. కానీ సరిగ్గా వ్యక్తీకరించగలిగేవాళ్లైతే రాతలోనే ప్రభావం ఎక్కువ అని చెప్పేవాళ్లూ ఉన్నారు. పాతగాయాలూ రేగే ప్రమాదం దంపతుల మధ్య సంభాషణల రూపంలో ఎదురుబొదురుగా ఘర్షణలు జరుగుతున్నప్పుడు ఏదైనా మాటతూలినా గాలికి పోయే మాటల వల్ల ఆ తర్వాత ఎలాంటి ప్రభావమూ ఉండదు. కానీ ‘రాత’ ఎప్పటికీ నిలిచిపోయే అవకాశం ఉంది. అందువల్ల ఆ తర్వాత ఎప్పుడో చదువుకున్నప్పుడూ పాత మాటలూ, పాత వాదనల ప్రభావాలు కెలికినట్లుగా అయి, అవి ఆ తర్వాతెప్పుడో కూడా ప్రమాదం తెచ్చిపెట్టవచ్చని మరికొందరు చెబుతున్నారు. అంతుఉండకపోవచ్చు... ఆ అంశమే ప్రమాదం తేవచ్చు... పొద్దున్నే భార్యాభర్తల మధ్య వాదన చెలరేగింది. ఇద్దరూ తమ తమ పనులు చేసుకుంటూనే వాదనల్లో మునిగిపోయారు. ఆఫీసుకు బయల్దేరే సమయానికి ఘర్షణ పెద్దదైంది. కానీ ఆఫీసు సమయానికి ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోవడంతో ఆ ‘వాదోపవాదాలు’ అక్కడితో ముగుస్తాయి. కానీ ‘ఫెక్స్టింగ్’ అలా కాదు. ఆఫీసుకు వెళ్లే దారిలో బస్సులోనో, ఆటోలోనో లేదా మెట్రోరైల్ లోనో అలాగే కొనసాగవచ్చు. అంతేకాదు... ఆఫీసుకు చేరి, సీట్లలో కూర్చున్నాక కూడా అదేపనిగా కొనసాగితే ప్రమాదమే. ఆ మాటకొస్తే కీలకమైన మీటింగుల్లోనూ ‘టెక్ట్స్ మెసేజు’లు కొనసాగుతూ... అసలు లక్ష్యానికి అడ్డంగా మారవచ్చు. టెక్ట్స్ వల్ల ఒనగూరే సౌలభ్యమల్లా వాదన మౌనంగా కొనసాగుతూ... అది మాటల ద్వారా బయటకు తెలియదంతే. కానీ పని ప్రదేశంలో... చేయాల్సిన పని వదిలేసి అదేపనిగా వాదులాడుకుంటూ పోతే... ఆఫీసులో పూర్తి చేయాల్సిన పనులు కొనసాగకపోగా / జరగకపోగా... అదే ఇబ్బంది తెచ్చిపెట్టే ప్రమాదమూ ఉందంటున్నారు కపుల్ కౌన్సెలింగ్ నిర్వాహకులు, మనస్తత్వ నిపుణులు. అంతేకాదు... అది పనితీరుతో పాటు, బంధాల విషయాల్లోనూ ప్రమాదం తెచ్చిపెట్టవచ్చునని హెచ్చరిస్తున్నారు. వస్తువులో కాదు... అంతా మన విచక్షణలోనే ఉంది... ‘‘ఏదైనా ప్రయోజనం అన్నది ఆ వస్తువును మనం ఉపయోగించే తీరులో లేదా మన విచక్షణను బట్టే ఉంటుందిగానీ... ఉపకరణంలో ఏమీ ఉండదు. ఇంగ్లిష్లో చెప్పా లంటే ‘ఆబ్జెక్ట్’లో కాకుండా ‘ఆబ్జెక్టివ్’లోనే అంతా ఉంది’’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు కొందరు మనస్తత్వ నిపుణులు. ఎప్పుడైనా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఎదురుబొదురుగా ఉండి మాట్లాడుకోవడమే మంచిది. కొన్ని పదాలు, పంక్చువేషన్లు, ఎమోజీల వల్ల దురభిప్రాయాలు వచ్చే అవకాశమూ ఉంది. మాటల్లో చెప్పుకునే విషయాలను రాతలో పెట్టినప్పుడు అది మరింతగా హాని చేసే ప్రమాదం ఉంది. ‘మీ అభిప్రాయం తో ఏకీభవించకపోవచ్చు. కానీ మీ అభిప్రాయానికి విలువివ్వాల్సిందే’ అనే పరస్పర గౌరవ భావన, దృక్పథాల వల్లనే మంచి ఫలితాలు వస్తాయి. – డాక్టర్ సుజాత రాజమణి, మానసిక నిపుణులు -
యాప్.. ఏజ్ గ్యాప్!
సాక్షి, హైదరాబాద్: కొందరికి బిర్యానీ ఇష్టం.. ఇంకొందరికి వంకాయ అంటే మధురం.. మరికొందరికి పప్పన్నమే అమృతం.. ఇలా ఇష్టాలు మరెన్నో.. అదీ దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాల వారీగా భిన్నంగా ఉంటుంది. అందుకే ‘లోకో భిన్న రుచి’అన్న సామెత పుట్టింది. మరి ఒక్క భోజనం విషయంలోనేనా.. అన్ని వ్యవహారాలకూ ఈ నానుడి వర్తిస్తుంది. ఇది తేల్చేందుకే ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లు, యాప్ల వినియోగంపై వివిధ అధ్యయనాలు జరిగాయి. అన్ని అధ్యయనాలూ కొంచెం అటూఇటూగా ఒకే తరహా ఫలితాలను ఇవ్వడం గమనార్హం. అన్నీ కూడా లోకా ‘మొబైల్ యాప్స్’భిన్న రుచీ అన్నట్టుగా నివేదికలు ఇచ్చేశాయి మరి.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 630 కోట్ల మందికిపైగా స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఉన్నట్టు అంచనా. దీనికి తగ్గట్టుగానే మొబైల్ అప్లికేషన్స్ (యాప్స్) భారీగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో ఫోన్లు, యాప్ల వినియోగం బాగా ఎక్కువైంది. ఆఫీసులో, ఇంట్లో, వీధిలో, బెడ్పై ఉన్నా, భోజనం చేస్తున్నా, వాహనాల్లో ఉన్నా ఫోన్లను ఉపయోగించడం పెరిగిపోయింది. అయితే ఇందులో ఫోన్ మాట్లాడటానికి వినియోగించే సమయం తక్కువేనని.. 88శాతం సమయాన్ని యాప్స్లోనే గడుపుతున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇక తరచూ ఫోన్ చెక్ చేసుకోవడం కూడా బాగా పెరిగిపోయినట్టు తేలింది. ఉదాహరణకు అమెరికన్లు సగటున రోజూ 262 సార్లు అంటే ప్రతి ఐదున్నర నిమిషాలకోసారి తమ ఫోన్ను చెక్ చేసుకుంటున్నట్టు వెల్లడైంది. వివిధ అధ్యయనాలు, పరిశీలనల్లో తేలినది ఇదీ.. ►24 ఏళ్లలోపు యువతరంలో 21శాతం రోజుకు యాభైకంటే ఎక్కువసార్లు ఒక యాప్ను ఓపెన్ చేస్తున్నారు. ►49 శాతం వినియోగదారులు రోజుకు 11 సార్లు యాప్లను తెరుస్తున్నారు. ►సగటు స్మార్ట్ఫోన్యూజర్ రోజుకు 10 యాప్లను.. నెలకు 30 యాప్లను ఉపయోగిస్తున్నారు. ►యాపిల్ యాప్ స్టోర్లో 1.96 మిలియన్ల యాప్లు, గూగుల్ ప్లేస్టోర్లో 2.87 మిలియన్ల యాప్లు ఉన్నాయి. ►గతేడాది మొత్తంగా 219 బిలియన్ల యాప్లను స్మార్ట్ ఫోన్ యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ►ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం యాప్ డౌన్లోడ్లు ఉచితంగానే జరుగుతున్నాయి. ►సగటున ఒక్కో వ్యక్తి తమ ఫోన్లో 80 దాకా యాప్లను ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. వీటిలో 62 శాతం యాప్లను నెలలో ఒకసారి కూడా ఉపయోగించడం లేదు ►2023లో మొబైల్ యాప్స్ ద్వారా 935 బిలియన్ డాలర్ల రెవెన్యూ జనరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. భారత్ విషయానికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్లకు భిన్నంగా మనదేశంలో వయసు వారీగా యాప్ల వినియోగంలో ప్రాధాన్యతలు వేరుగా ఉన్నట్టు అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా 18– 24 ఏళ్ల మధ్యవారు తమ మొబైల్స్లో గడిపే సమయం, వినియోగించే యాప్లకు.. 25ఏళ్లు, ఆపైనవారి అభిరుచులు, ప్రాధాన్యతలకు భిన్నంగా ఉన్నట్టు వెల్లడైంది. ►24 ఏళ్లలోపు యువతరం ఇన్స్టా, ట్రూకాలర్, ఫ్లిప్కార్ట్, ఎంఎక్స్ ప్లేయర్, టెలిగ్రామ్లను అధికంగా వినియోగిస్తున్నారు. ►25 ఏళ్లు, ఆపై వయసు వారు వాట్సాప్, ఫేస్బుక్, ఫోన్పే, అమెజాన్, ఫేస్బుక్ మెసెంజర్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ►మహిళలు ఉపయోగించే టాప్–5 యాప్లలో వాట్సాప్, స్నాప్చాట్, మీషో, షేర్చాట్, మోజో ఉన్నాయి. ►పురుషులు ఎక్కువగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్రూకాలర్, ఫోన్పే, అమెజాన్లను వినియోగిస్తున్నారు. -
పట్టుబడ్డ దొంగను స్టేషన్కి తరలిస్తుండగా..హఠాత్తుగా పోలీసుపై కత్తితో..
మొబైల్ ఫోన్ దొంగతనం కేసు విషయమై ఒక దొంగను పట్టుకుని తరలిస్తుండగా అనుహ్యంగా పోలీసుపై దాడి చేశాడు. అదీకూడా అందరూ చూస్తుండగా పట్టపగలే దాడి చేసి పారిపోయేందుకు యత్నించాడు. ఈ ఘటన ఢిల్లీలో మయపూరీలోని ఒక స్లమ్ ఏరియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..పశ్చిమ ఢిల్లీలోని మాయపురిలో అనిష్ రాజ్ అనే దొంగ ఒక మహిళ ఫోన్ని దొంగలించాడు. దీంతో ఆ మహిళ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఏఎస్ఐ శంభు దయాల్ ఈ కేసు విషయమే ఆ మహిళను తీసుకుని సంఘటనా స్థలానికి వచ్చి విచారించగా..సదరు మహిళ అనీష్ను చూపిస్తూ ఇతనే నా భర్త ఫోన్ దొంగలించాడనే చూపించింది. దీంతో వెంటనే దయాల్ ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్కి తరలిస్తుండగా ఒక్కసారిగా జేబులోంచి కత్తిని తీసి పోలీసు ఛాతి, మెడ, వెన్నుపై ఏకంగా 12 సార్లు దాడి చేశాడు. పాపం ఆ పోలీసుల వాటిని లెక్కచేయకుండా అతన్ని ఆపేందుకు యత్నించాడు. ఐతే నిందితుడు సదరు పోలీస్ని తోసేసి పారిపోయాడు. దీంతో అక్కడే ఉన్న జనం ఒక్కసారిగా స్పందించి..నిందితుడిని వెంబడించారు. సమీపంలో ఉన్న మరో పోలీసు అతడ్ని పట్టుకుని అరెస్టు చేశాడు. ఆ ఘటన మొత్తం సమీపంలోని సీసీఫుటేజ్లో రికార్డు అయ్యింది కూడా. ఐతే గాయపడిన ఏఎస్ఐని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు ఆయన నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడి మృతి చెందారు. రాజస్తాన్లోని సికార్కు చెందిన శంభు దయాల్కి ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా సదరు పోలీసు శంభూజీకి నివాళులర్పించారు. అంతేగాదు ట్విట్టర్లో...ప్రజలను రక్షించడం కోసం ప్రాణాలను సైతం పట్టించుకోని మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం. మీ ప్రాణానికి విలువ కట్టలేం కానీ మీ గౌరవార్థం కోటి రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నాం అని అన్నారు. जनता की रक्षा करते हुए ASI शंभु जी ने अपनी जान तक की परवाह नहीं की। वे शहीद हो गये। हमें उन पर गर्व है। उनकी जान की कोई क़ीमत नहीं पर उनके सम्मान में हम उनके परिवार को एक करोड़ रुपये की सम्मान राशि देंगे। https://t.co/RA3EW8MKXL — Arvind Kejriwal (@ArvindKejriwal) January 11, 2023 Delhi Police Cop was brutally stabbed to Death in Mayapuri Delhi by a Jihadee. When u vote for Free and ur Leader is an Anarchist ,hell bound to change the demography this is bound to happen. What u need somebody Like Maharaj #Yogi in almost all the state of Bharat. pic.twitter.com/Fzv4a2sY5b — Kavi🇮🇳🇮🇳🇮🇳 (@kavita_tewari) January 9, 2023 (చదవండి: సెకనులో అంతా అయిపోయింది..సర్వం కోల్పోయా! విలపిస్తున్న బాధితురాలి భర్త) -
మొబైల్ ఫోన్ కోసం కన్నతల్లినే దారుణంగా కొట్టిన కసాయి కొడుకు
మొబైల్ ఫోన్ కొనుక్కునేందుకు డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే కర్రతో దారుణంగా కొట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని చింద్వారాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే... దర్బాయి గ్రామంలోని బద్కుహి చౌకీ ప్రాంతంలో నివశిస్తున్న వినేద్ అనే ప్రబుద్ధుడు తన తల్లిని స్మార్ట్ ఫోన్ కొనుక్కునేందుకు రూ. 25 వేలు ఇమ్మని అడిగాడు. ఐతే అతడి తల్లి రూ. 15 వేలు మాత్రమే ఇచ్చింది. దీంతో వినోద్ కోపేద్రకంతో కన్నతల్లి అని కూడా లేకుండా కర్రతో దారుణంగా కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు మహిళను హుటాహుటినా అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. తన కొడుకుకి తన నుంచి తన భర్త నుంచి డబ్బు తీసుకుంటుంటాడని కన్నీళ్లు పెట్టుకుంది. (చదవండి: బ్రహ్మపుత్ర నదిలో ఈత కొడుతూ వస్తున్న పులి..షాక్లో ప్రజలు) -
షాకింగ్ ఘటన: దొంగతనం చేశాడని..కదులుతున్న రైలు నుంచి తోసేసి..
దొంగతనం చేశాడని ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి..కదులుతున్న ట్రైయిన్ నుంచి తోసేశారు. ఈ ఘటన అయోధ్య- ఢీల్లీ ఎక్స్ప్రెస్ రైలులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఒక గుర్తు తెలియని 20 ఏళ్ల వ్యక్తి షాజహాన్పూర్లోని తిల్హర్ రైల్వే స్టేషన్ పట్టాలపై మృతి చెంది ఉన్నాడు. సదరు వ్యక్తి రైల్వే పట్టాల వద్ద ఉండే ఓవర్హెడ్ లైన్ పోల్కి తల ఢీకొట్టడంతో మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. ఐతే మృతుడికి సబంధించిన ఒక వైరల్ వీడియో నెట్టింట హల్ చల్ చేసింది. ఆ వీడియోలో ఒక జనరల్ కంపార్ట్మెంట్ బోగిలో 40 ఏళ్ల నరేంద్ర దూబే అనే వ్యక్తి బాధితుడిని ఫోన్ దొంగలించినందుకు క్రూరంగా కొడుతున్నట్లు కనిపించింది. పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు నవ్వుతూ కనిపించాడు. ఆ తర్వాత బాధితుడిని పనిష్మెంట్ కింద కదులుతున్న ట్రైయిన్ నుంచి తోసేస్తున్నట్లు..సదరు బాధితుడు భయంతో అరుస్తున్న కేకలు ఆ వీడియోలో వినిపించాయి. దీంతో పోలీసులు సదరు ప్రయాణికుడు నరేంద్ర దూబేని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత ఒక మహిళన తన మొబైల్ ఫోన్ షాజహాన్పూర్ రైల్వేస్టేషన్లో పోయిందని ఫిర్యాదు చేసినట్లు విచారణలో తేలింది. వాస్తవానికి బాధితుడు ఫోన్ దొంగలించి లక్నోలో ట్రైయిన్ ఎక్కినట్లు తేలింది. అయితే అక్కడ జనరల్ కంపార్ట్మెంట్లోని ఒక సముహం అతని వద్ద ఈ ఫోన్ని గుర్తించి దాడి చేసి రైలులోంచి తోసేశారని పోలీసలు చెబుతున్నారు. దొంగలించిన అరగంటలోనే బాధితుడు రైల్వే పట్టాలపై విగతజీవిగా పడిఉన్నట్లు తెలిపారు. A man suspected to have stolen a mobile phone in Ayodhya Delhi express was thrashed mercilessly and thrown off the running train. He died after his head hit against a pole near Tilhar railway station in Shahjahanpur Uttar Pradesh. pic.twitter.com/bCrREOD51o — Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) December 18, 2022 (చదవండి: మరొకరితో సంబంధం.. ఏకంగా భర్త ఇంట్లోనే కాపురం.. మహిళను చెట్టుకు కట్టి) -
స్మార్ట్ఫోన్ల మితిమీరిన వినియోగంతో తిప్పలు
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ఫోన్ల మితిమీరిన వినియోగంతో తిప్పలు తప్పడం లేదు. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా మొబైళ్లను విచ్చలవిడిగా ఉపయోగించడంతో భార్యాభర్తలు, అతి సన్నిహితుల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. అవసరమున్నా, లేకపోయినా సమయం, సందర్భం లేకుండా స్మార్ట్ఫోన్లలో మునిగిపోవడం చాలా మందికి అలవాటు అయ్యింది. కొంతమందిలో వ్యసనంగా మారడంతో పరిణామాలు సమాజాన్ని కలవర పరుస్తున్నాయి. ఆధునిక సాంకేతికత ఒక వరంగా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో ఎన్నో అవసరాలను తీరుస్తోంది. ఐతే ఈ టెక్నాలజీని మితిమీరి ఉపయోగిస్తే పెనుసమస్యగా మారుతోంది. మానవ సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ఫోన్ల అతి వినియోగం వల్ల వివాహిత జంటల సంబంధాల్లో, మానసికంగా చూపుతున్న ప్రభావం, స్వభావంలో వస్తున్న మార్పులపై ‘స్మార్ట్ఫోన్స్ అండ్ దెయిర్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ రిలేషన్షిప్స్–2022’అనే అంశంపై వీవో–సైబర్ మీడియా పరిశోధన చేసింది. అందులో వెల్లడైన ఆసక్తికరమైన విషయాలను ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ స్విచ్ఛాఫ్ స్టడీలో వెలువరించింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పుణేలలోని స్మార్ట్ఫోన్ల వినియోగదారులపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఫోన్ వాడకంలో వస్తున్న ట్రెండ్స్, అతి వినియోగంతో వస్తున్న మార్పులను విశ్లేషించింది. జెండర్తో సంబంధం లేకుండా భర్త/భార్య సగటున రోజుకు 4.7గంటలు స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్నారు. తమతో కాకుండా ఫోన్తో గడుపుతున్నారంటూ తమ జీవిత భాగస్వామి తరచూ ఫిర్యాదు చేస్తుంటారని 73శాతం మంది అంగీకరించారు. ఇంకా మరెన్నో విషయాలను అధ్యయనం వెల్లడించింది. ముఖ్యాంశాలు ►అవకాశమున్నా కూడా తమ భార్య/భర్తతో కాకుండా ఎక్కువ సమయం మొబైళ్లతోనే సమయం గడుపుతున్నామన్న 89% మంది. ►స్మార్ట్ఫోన్లలో మునిగిపోయి కొన్నిసార్లు తమ చుట్టూ పరిసరాలనూ మరిచిపోయామన్న 72 శాతం మంది. ►తమ వారితో సమయం గడుపుతున్నపుడు కూడా ఫోన్లను చూస్తున్నామన్న 67% మంది. ►స్మార్ట్ఫోన్ల మితిమీరి వినియోగం వల్ల తమ భాగస్వాములతో సంబంధాలు బలహీనపడినట్టు 66 శాతం మంది. అంగీకారం. ►అతిగా ఫోన్ వాడకంతో మానసికమైన మార్పులు వస్తున్నాయని, స్మార్ట్ఫోన్ వాడుతున్నప్పుడు భార్య కలగజేసుకుంటే ఆవేశానికి లోనవుతున్నామన్న 70 శాతం ►ఫోన్ కారణంగా భార్యతో మాట్లాడుతున్నపుడు కూడా మనసు లగ్నం చేయలేకపోతున్నామన్న 69 శాతం మంది. ►భోజనం చేస్తున్నపుడు కూడా ఫోన్లను ఉపయోగిస్తున్నామన్న 58 శాతం మంది. ►లివింగ్రూమ్లో స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్న వారు 60 శాతం ►రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కూడా ఫోన్లు చూస్తున్నవారు 86 శాతం ►జీవితంలో ఒకభాగమై పోయిన స్మార్ట్ఫోన్లను వేరు చేయలేమన్న 84 శాతం ►తీరిక సమయం దొరికితే చాలు 89% మంది ఫోన్లలో మునిగిపోతున్నారు ►రిలాక్స్ కావడానికి కూడా మొబైళ్లనే సాధనంగా 90% మంది ఎంచుకుంటున్నారు. స్క్రీన్టైమ్పై స్వీయ నియంత్రణ అవసరం.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆకర్షణకు లోనయ్యే, గంటలు గంటలు అందులోనే మునిగేపోయేలా చేసే గుణం స్మార్ట్ ఫోన్లలో ఉంది. అది ‘అటెన్షెన్ సీకింగ్ డివైస్’కావడంతో బయటకెళ్లినా, ఇంట్లో ఉన్నా పది నిమిషాలు కాకుండానే మొబైళ్లను చెక్ చేస్తుంటాం. వాడకపోతే కొంపలు మునిగేదేమీ లేకపోయినా అదో వ్యసనంగా మారింది. బహిరంగ ప్రదేశాల్లోనూ తాము బిజీగా ఉన్నామని చూపెట్టేందుకు సెల్ఫోన్లు ఉపయోగిస్తుంటారు. ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చాక అత్యవసరమైతే తప్ప మొబైళ్లు ఉపయోగించరాదనే నిబంధన వివాహితులు పెట్టుకోవాలి. బెడ్రూమ్లో ఫోన్లు వినియోగించరాదనే నియమం ఉండాలి. రోజుకు ఇన్ని గంటలు మాత్రమే సెల్ఫోన్ వాడాలనే నిబంధన పెట్టుకోవాలి. ఉపవాసం మాదిరిగా వారానికి ఒకరోజు అత్యవసరమైతే తప్ప ఫోన్ ఉపయోగించకుండా చూసుకోవాలి. మొబైల్ అధిక వినియోగ ప్రభావం తమ జీవితాలపై, సంబంధాలపై ఏ మేరకు పడుతోందనే జ్ఞానోదయమైతే ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ -
భారతీయ చిన్నారులు బాగా ‘స్మార్ట్’
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ పరిపక్వతలో భారతీయ చిన్నారులు ముందంజలో నిలుస్తున్నారు. 10–14 ఏళ్ల వయసు పిల్లల్లో ఫోన్ వినియోగం 83 శాతంగా ఉంది. ఇది ప్రపంచ సగటుతో పోలిస్తే 7 శాతం అధికంగా నమోదవటం విశేషం. కాగా, ఇతర దేశాలతో పోలిస్తే ఆన్లైన్ అపాయాల(రిస్క్)కు గురవుతున్న చిన్నారుల్లో అత్యధికులు భారతీయులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. స్మార్ట్ ఫోన్ వినియోగంలో 10నుంచి 14ఏళ్లలోపు భారతీయ చిన్నారులు 24 శాతం ఆన్లైన్ ముప్పునకు గురైనట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆన్లైన్ భద్రతపై అవగాహన లేమి దేశంలో 47 శాతం మంది తల్లిదండ్రుల్లో సైబర్ బెదిరింపులు, సోషల్ మీడియా దుర్వినియోగంపై ఆందోళన పెరుగుతోంది. ఇక్కడ చిన్నారులు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నపుడు రక్షణ కల్పించడంలో అవగాహన లేమి ఆన్లైన్ ముప్పునకు కారణాలుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా దేశంలో 33 శాతం తల్లిదండ్రుల ఆన్లైన్ ఖాతాలు సైతం సైబర్ దాడికి గురైనట్టు గుర్తించారు. ఇది ప్రపంచంలోని ఇతర దేశాల సగటుతో పోలిస్తే 13 శాతం ఎక్కువ. ప్రపంచ సగటులో 15 శాతం మంది చిన్నారులు ఆన్లైన్ ముప్పునకు గురైతే.. మన దేశంలో అది 28 శాతంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా సైబర్ బెదిరింపులు, వ్యక్తిగత సమాచారం చోరీ, ఆర్థిక సమాచారం లీకేజీలను అరికట్టడానికి చిన్నారులకు ఫోన్ ఇచ్చేముందు పాస్వర్డ్ ప్రొటెక్షన్ తప్పనిసరిగా పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రముఖ ఆన్లైన్ స్టోర్లలోనే షాపింగ్, అపరిచిత వ్యక్తుల సందేశాలకు దూరంగా ఉండటంపై తరచూ పిల్లలను హెచ్చరించాలని చెబుతున్నారు. చిన్నారులకు ప్రత్యేకంగా ఫోన్ ఇవ్వకపోవడం మంచిదని, తమ ఫోన్లలోనే వారికి అవసరమైన యాప్లు మాత్రమే ఓపెన్ అయ్యేలా పర్యవేక్షించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. (చదవండి: హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం) -
మొబైల్లో గేమ్ ఆడుతుండగా పేలుడు..తీవ్రంగా గాయపడ్డ చిన్నారి
ఇటీవల మొబైల్ ఫోన్లు పేలుడు గురించి తరుచుగా వింటున్నాం. ఎందుకిలా జరుగుతుందో అంతుపట్టడం లేదు. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కోవిడ్ మహమ్మారీ నుంచి పిల్లలకు ఆన్లైన్లో క్లాసులకు అలవాటుపడ్డారు. దీంతో పిల్లలు మనకు తెలియకుండానే సెల్ఫోన్లకు బానిసవ్వుతున్నారు. పలువురు తల్లిదండ్రులు కూడా పిల్లలు ఫోన్కి బాగా అతుక్కుపోతున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. అలాంటి తరుణంలో ఈ సెల్ఫోన్ల పేలుడు ఘటనలు ప్రజలను కాస్త భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. అచ్చం అలానే ఇక్కడోక చిన్నారి ఫోన్లో గేమ్ ఆడుతుండగా.. హఠాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో మధురలోని మేవాటీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...మధురకు చెందిన మహ్మద్ జావేద్ అనే వ్యక్తి తన 13 ఏళ్ల కొడుకుకి మొబైల్ ఫోన్ ఇచ్చాడు. ఆ చిన్నారి తన చదువు కోసం అని తండ్రి ఫోన్ని తరుచుగా ఉపయోగిస్తుంటాడు. అందులో భాగంగానే ఆరోజు కూడా ఫోన్ తీసుకున్నాడు. కాసేపటికి అందులో గేమ్ ఆడుతున్నాడు. ఏమైందో ఏమో అకస్మాత్తుగా ఫోన్ పేలిపోయింది. ఆ పేలుడు శబ్దానికి వేరే గదిలో ఉన్న అతడి తల్లిదండ్రులు ఉలిక్కిపడి...హుటాహుటినా వచ్చి చూడగా...బాలుడు తీవ్రగాయాలపాలై మంచంపై పడి ఉన్నాడు. దీంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు షాక్కి గురయ్యారు. ఆ చిన్నారి దుస్తులు కాలిపోయి, ఛాతీపై పలు తీవ్రగాయాలయ్యాయి. తొలుత తమకు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. ఆ తర్వాత పరిశీలించి చూడగా ఫోన్ ముక్కలై పడి ఉండటంతో..మొబైల్ బ్లాస్ట్ అయ్యిందని తెలిసిందని చిన్నారి తండ్రి చెబుతున్నాడు. 24 గంటలు పిల్లలను మానిటర్ చేస్తూ కూర్చొవడం అసాధ్యం అని అంటున్నాడు. పిల్లలు కూడా కాస్త అసహనంగా ఫీలవుతారు. ప్రస్తుతం అంతా ఆన్లైన్ చదువులు కాబట్టి వారు కాస్త ఒత్తిడికి గురవుతున్నారు. కాసేపు రిలాక్స్ అయ్యేందుకని మొబైల్ ఫోన్లు ఇస్తుంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు గేమ్లు కూడా ఆన్లైన్లో ఆడుతుంటారు. అందువల్ల ఇలాంటి ఘటనలు ఎదురైతే తాము ఏంచేయాలని చిన్నారి తండ్రి జావేద్ కన్నీటిపర్యంతమయ్యాడు. (చదవండి: వివాహ మండపంలోకి ఎద్దు ఎంట్రీ..పరుగులు తీస్తున్న జనాలు) -
షాకింగ్ విషయాలు.. ‘సోషల్’ శృతి మించితే అంతే.. రోజుకు 6 గంటలా!
సాక్షి, హైదరాబాద్: కౌమార ప్రాయంలోనే కుర్రకారు సోషల్ మీడియాలో గంటల తరబడి గడిపేస్తున్నారు. చదువు, కెరీర్, భవిష్యత్కు చక్కటి బాటలుపర్చుకోవాల్సిన తరుణంలోనే సామాజిక మాధ్యమాలతో కుస్తీ పడుతూ సమయం వృథా చేసేస్తున్నారట. మెట్రో నగరాల్లో ఈ ట్రెండ్ అత్యధికంగా ఉన్నట్లు టెక్సెవీ అనే సంస్థ తాజా అధ్యయనంలో తెలిపింది. మన సుమారు 31 శాతం మంది టీనేజర్స్ రోజుకు 6 గంటల పాటు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగాం, వాట్సాప్ తదితర మాధ్యమాలతో పాటు ఆన్లైన్ వీడియో గేమ్స్లతో టైమ్పాస్ చేస్తున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. రోజుకు 3 నుంచి 6 గంటల పాటు సోషల్ మీడియా, గేమ్స్ ఆడుతూ గడుపుతున్నవారు 27 శాతం మంది.. ఒకటి నుంచి మూడు గంటల పాటు గడుపుతున్న వారు 8 శాతం.. కేవలం ఒక గంటపాటైనా సోషల్ ఛాట్, వీడియో గేమ్ ఆడనిదే నిద్రపోని వారు 13 శాతం మంది ఉండడం గమనార్హం. నయాట్రెండ్ మాటెలా ఉన్నా.. ఈ పరిణామంతో తమ పిల్లలు చదువును నిర్లక్ష్యం చేస్తుండడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది. 9 నుంచి 13 ఏళ్లలోపు వారిలోనూ 21 శాతం మంది రోజుకు 6 గంటల పాటు సోషల్ మీడియా, వీడియో గేమ్స్తో కుస్తీ పడుతున్నట్లు ఈ అధ్యయనం తెలపడం గమనార్హం. తమ చిన్నారులు వీడియో గేమ్లు, సోషల్ మీడియాకు బానిసలుగా మారినట్లు 39 శాతం మంది తల్లిదండ్రులు అంగీకరిస్తుండగా.. మరో 38 శాతం మంది ఈ పరిణామం పట్ల ఆందోళన వ్యక్తంచేసినట్లు తెలిపింది. మరో 23 శాతం మంది చిన్నారులు సోషల్ మీడియా, గేమ్స్, వీడియోలకు బానిసలుగా మారలేదని స్పష్టం చేసినట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. శృతి మించితే అనర్థాలే.. ప్రస్తుత సాంకేతిక యుగంలో చిన్నారులకు అన్ని మాధ్యమాలపై అవగాహన తప్పనిసరి అయినప్పటికీ.. ఇదే వ్యసనంగా మారితే అనర్థాలు తప్పవని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులు ఏ అంశాలపై సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు? ఎలాంటి చాటింగ్ చేస్తున్నారు? ఏ గేమ్స్ ఆడుతున్నారన్న అంశంపై తల్లిదండ్రులు కనిపెట్టని పక్షంలో అనర్థాలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. స్మార్ట్ ఫోనే ముద్దు.. చాక్లెట్.. పిజ్జా.. బర్గర్లతో పాటే టీనేజర్లు స్మార్ట్ ఫోన్ను బాగా ముద్దు చేస్తున్నారట. సుమారు 38 శాతం మంది కౌమార దశ బాల, బాలికలు విరివిగా స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నట్లు ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది. డెస్క్టాప్ కంప్యూటర్లను 31 శాతం మంది.. ల్యాప్టాప్లను 16 శాతం.. ట్యాబ్లెట్ పీసీలను 5 శాతం మంది వినియోగిస్తున్నారని ఈ అధ్యయనం తెలపడం విశేషం. -
మోసపూరిత, వేధింపు కాల్స్కు అడ్డుకట్ట.. త్వరలో అమల్లోకి కొత్త రూల్!
న్యూఢిల్లీ: మోసపూరిత, వేధింపు కాల్స్కు అడ్డుకట్ట వేసే దిశగా తలపెట్టిన కాలర్ ఐడెంటిటీ (సీఎన్ఏపీ) అంశంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చర్చాపత్రాన్ని రూపొందించింది. దీనిపై ప్రజలు డిసెంబర్ 27లోగా తమ అభిప్రాయాలు తెలపాలి. కౌంటర్ కామెంట్ల దాఖలుకు 2023 జనవరి 10 ఆఖరు తేదీ. సీఎన్ఏపీ అమల్లోకి వస్తే కాల్ చేసే వారి పేరు మొబైల్ ఫోన్లలో డిస్ప్లే అవుతుంది. తద్వారా గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్స్ను స్వీకరించాలా వద్దా అనే విషయంలో తగు నిర్ణయం తీసుకునేందుకు ఉపయోగపడనుంది. ప్రస్తుతం ట్రూకాలర్, భారత్ కాలర్ ఐడీ అండ్ యాంటీ స్పామ్ వంటి యాప్లు ఈ తరహా సర్వీసులు అందిస్తున్నాయి. అయితే, ఈ యాప్లలోని సమాచార విశ్వసనీయతపై సందేహాలు నెలకొన్నాయి. ప్రతి టెలిఫోన్ యూజరు పేరు ధృవీకరించే డేటాబేస్ .. టెలికం సంస్థలకు అందుబాటులో ఉంటే కచ్చితత్వాన్ని పాటించేందుకు అవకాశం ఉంటుంది. దీనిపైనే సంబంధిత వర్గాల అభిప్రాయాలను సేకరించేందుకు ట్రాయ్ చర్చాపత్రాన్ని రూపొందించింది. చదవండి: డిజిటల్ లోన్లపై అక్రమాలకు చెక్: కొత్త రూల్స్ నేటి నుంచే! -
ఛార్జింగ్లో ఉన్న మొబైల్ తీస్తుండగా షాక్ తగిలి చిన్నారి మృతి
సాక్షి, గద్వాల్: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఛార్జింగ్లో ఉన్న మొబైల్ ఫోన్ తీస్తుండగా షాక్ తగిలి నిహారిక అనే చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. అయిజ మండలం ఈడిగొనిపల్లి గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. కాగా పదేళ్ల నిహారిక 4వ తరగతి చదువుతుంది. కూతురు అకస్మిక మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ పరికరాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. సెల్ఫోన్లు, ఈ-వాహనాలు పేలుతున్న ఘటనలు అధికంగా జరుగుతున్నాయి. కొన్ని సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడవద్దని, పిల్లలను వీటికి దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: మల్లారెడ్డి ఆదాయాలపై ఐటీ విచారణ: 13 మంది హాజరు.. మరో 10 మందికి నోటీసులు -
బీ అలెర్ట్! చుట్టుపక్కల పరిస్థితుల్ని మర్చిపోయి ఫోన్లో మునిగిపోతున్నారా..
‘‘చేతిలో ఫోన్ పెడితే చాలు మనం పెట్టిందంతా వద్దనకుండా మా బుడ్డోడు తినేస్తాడు’’ ‘‘మేమిద్దరం మూవీ చూడాలనుకుంటే బుజ్జిదాని చేతికి ఫోనిస్తాం. అది అల్లరి చేయకుండా యూట్యూబ్లో కార్టూన్ చానెల్ తానే సెలక్ట్ చేసేసుకుని మరీ చూస్తుంది తెలుసా?’’ఇలాంటి మాటలు వినపడని ఇల్లూ, అనని ఇల్లాళ్లూ సిటీలో కనపడడం అరుదై పోయింది. అయితే తమ పనులు సులభంగా కావడానికి పెద్దలు ఉపయోగించే ఈ రకమైన చిట్కాలు పసిపిల్లల భవిష్యత్తుపై దుష్ప్రభావం చూపించనున్నాయని యువతలో కనపడుతున్న తీవ్రమైన ఫబ్బింగ్ స్థితి పిల్లల్లోనూ మొదలవుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చుట్టుపక్కల పరిస్థితుల్ని మర్చిపోయేంతగా ఫోన్లో మునిగిపోవడమే ‘‘ఫబ్బింగ్’’ గా వ్యవహరిస్తున్నారు. 2012లో ఫోన్, స్నబ్బింగ్ పదాల్ని మేళవించి ఓ ఆ్రస్టేలియా యాడ్స్ సంస్థ దీన్ని సృష్టించింది. ఆ తర్వాత ఇది వాడుక పదంగా మారిపోయింది. గతంలో ఈ ఫబ్బింగ్ అనే స్థితి నగరంలోని సగానికి పైగా యువకుల్లో కనిపిస్తోందని ‘కన్సీక్వెన్స్ ఆఫ్ ఫబ్బింగ్ ఆన్ సైకలాజికల్ డిస్ట్రెస్ అమాంగ్ ది హైదరాబాద్’ అనే అధ్యయనం వెల్లడించింది. అదే పరిస్థితికి చిన్నారులు కూడా చేరేలా ఉన్నట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మహమ్మారితో మరింతగా... పసివయసును దృష్టి మరల్చడానికి గతంలో అరకొరగా కనిపించిన ఫోన్ చిట్కా...కరోనా నేపథ్యంలో నగరంలో మరింతగా పెరిగిందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్, పిల్లలకు స్కూల్స్ లేకపోవడం..తల్లులకు పనుల భారం పెరగ డం..ఇవన్నీ కలిపి పిల్లలకు చేజేతులా ఫోన్ను అలవాటు చేసే దిశగా పెద్దల్ని మరింతగా ప్రేరేపించాయి. ఏడిచే పిల్లల్ని ఊరుకోబెట్టడం, తిండి తినకుండా మారాం చేసే పిల్లల్ని ఏమార్చి తినిపించడం, అల్లరి మానిపించడం...ఇలా అనేక అవసరాలకు ఫోన్ ఏకైక సులభ పరిష్కారంగా అవతరించడం పలు రకాల సమస్యలు తెచ్చిపెడుతుందని వైద్యులు అంటున్నారు. నేటి నిశ్శబ్ధం...రేపటి యుద్ధం... పారాడే పిల్లలకి ఫోన్ అలవాటు చేయడం వల్ల వారి మాట్లాడే దశ మరింత ఆలస్యం కావచ్చునని నగరానికి చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ డా.అనిత హెచ్చరిస్తున్నారు. పిల్లల్ని నిశ్శబ్ధంగా ఉంచడానికి పెద్దలు చేసే ఈ ప్రయత్నం వారిని మౌనంగా మార్చవచ్చు, అలాగే మాటలపట్ల ఆసక్తి తగ్గిపోతుందని, అలాగే భావోద్వేగాలను అర్థం చేసుకోవడం వారికి కష్టమవుతుందని ఆమె పేర్కొన్నారు. తద్వారా పెరిగి పెద్దయే దశలో ఇతరులతో ఎలా మెలగాలో అర్థం కాక సతమతమవుతారని, కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గిపోతాయని స్పష్టం చేస్తున్నారు. పిల్లల్ని తినిపించడానికి ఫబ్బింగ్కు గురి చేయడం శారీరక అనారోగ్యాలకు దారి తీస్తుందన్నారు. ఆహారం తీసుకునేటప్పుడు ఫోన్లో ఆడుకోవడం, లేదా ఏదైనా తదేకంగా చూడడం అతిగా తినడానికి, ఒబెసిటీకి దారి తీస్తాయన్నారు. కాస్త ఓపికగా వ్యవహరించడం తగినంత సమయం వెచ్చిస్తే పిల్లలను అదుపు చేయడం సమస్య కాదని దానికి బదులుగా వారి భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే పరిష్కారాలు ఎంచుకోవడం సరైంది కాదని వైద్యులు సూచిస్తున్నారు. యువతలో ఫబ్బింగ్ అధ్యయనం ఏం చెప్పిందంటే.. సిటిలోని ఈఎస్ఐసీ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధా బాల సహ రచయితగా ‘కన్సీక్వెన్స్ ఆఫ్ ఫబ్బింగ్ ఆన్ సైకలాజికల్ డిస్ట్రెస్ అమాంగ్ ది హైదరాబాద్’ అనే అధ్యయనం నగర యువతలో పబ్బింగ్ సర్వసాధారణమైపోయిందని పేర్కొంది. ఇది వారి జీవితాలను వారి స్నేహితులు కుటుంబ సభ్యులతో సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని తేల్చింది. అధ్యయనం ప్రకారం, నగర యువతలో 52% మంది ఫబ్బింగ్లో నిమగ్నమై ఉన్నారు. వీరిలో ఫబ్బింగ్ వల్ల 23% మంది అపరిమితంగా 34% మంది పరిమితంగా మానసిక ఇబ్బందులను అనుభవించారు. ఫబ్బింగ్ గేమింగ్ వ్యసనానికి కారణమవుతోంది. -
ఫోన్ రిపైర్ చేసేలోపే ఒక్కసారిగా బ్లాస్ట్: వీడియో వైరల్
ఒక మొబైల్ ఫోన్ని రిపైర్ చేస్తుండగా ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో లలిత్పూర్లోని పాలీలో చోటు చేసుకుంది. ఒక కస్టమర్ తన ఫోన్ని లలిత్పూర్లో ఉన్న మొబైల్ఫోన్లు రిపైర్ చేసే షాపుకి తీసుకువచ్చాడు. ఫోన్లో ఛార్జింగ్ సమస్య ఉందని షాపు యజమానికి చెప్పాడు. దీంతో సదరు షాపు యజమాని మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి బ్యాటరీ తీసేందుకు యత్నిస్తున్నాడు. అంతే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. అదృష్టవశాత్తు త్రుటిలో సదరు షాపు యజమాని, కస్టమర్ ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. అందుకు సంబంధించిన ఘటన మొత్తం షాపు వద్ద ఉన్న సీసీఫుటేజ్లో రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ వీడియోలో... ఒక వ్యక్తి షాపు కౌంటర్ ముందు నిలబడి ఒక గ్లాస్పై తన మొబైల్ని పెట్టాడు. మరోవ్యక్తి ఒక టూల్ ఉపయోగించి బ్యాటరీ తీసేందుకు యత్నిస్తాడు. ఒక్కసారిగా పొగ వస్తూ పెద్దగా పేలుపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. उत्तर प्रदेश के ललितपुर में रिपेयरिंग के दौरान एक मोबाइल बम की तरह फट पड़ा pic.twitter.com/eBUCe9f4nL — Bhadohi Wallah (@Mithileshdhar) October 23, 2022 (చదవండి: కొరడాతో కొట్టించుకున్న చత్తీస్గఢ్ సీఎం.. ఎందుకంటే?) -
ఛీ ఏం మనుషులు! చావుబతుకుల మధ్య కొట్టమిట్టాడుతుంటే ఫోటోలా!
లక్నో: ఒక యువతి తీవ్రగాయలపాలై నిస్సహాయ స్థితిలో ఉంటే స్థానికులు సాయం అందించకపోగా చుట్టూ చేరి మొబైల్ ఫోన్తో ఫోటోలు తీస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో కన్నౌజ్లో చోటు చేసుకుంది. ఆ యువతి ఇంటి నుంచి అదృశ్యమైన కొద్ది గంటల్లోనే తీవ్ర గాయాలపాలై కనిపించింది. ఆ 13 ఏళ్ల బాధిత యువతికి తలతో సహ ఒంటిపై పలుచోట్ల తీవ్రగాయాలయ్యాయి. ఆమె ఒకవైపు నుంచి సాయంచేయమంటూ అక్కడ ఉన్నవారిని అభ్యర్థిస్తుంది. కానీ అక్కడ ఉన్న స్థానికులంతా ఆమె చుట్టూ చేరి సెల్ఫోన్తో ఫోటోలు తీసే బిజీలో ఉన్నారు. ఒక్కరూ కూడా పోలీసులు వచ్చేదాకా ఆమెకు ఎలాంటి సాయం అందించలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సదరు బాధిత యువతిని ఆటోరిక్షాలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సూపరింటెండెంట్ కున్వార్ అనుపమ్ సింగ్ తెలిపారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఐతే ఆమెపై లైంగికదాడి జరిగిందా లేదా అనేది ఇంకా తెలియరాలేదని, అలాగే ఇంకా ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. (చదవండి: వాతావరణ కార్యకర్తకు షాక్..! ఫేస్బుక్ లైవ్ రికార్డు చేస్తుండగా మొబైల్ కొట్టేసిన స్నాచర్) -
వాతావరణ కార్యకర్త ఫోన్ చోరీ...ఫేస్బుక్లో లైవ్ రికార్డు చేస్తుండగా....
నొయిడా: వాతావరణ కార్యకర్త లిసిప్రియ కంగుజం మొబైల్ ఫోన్ని గుర్తు తెలియని వ్యక్తులు రెప్పపాటులో లాక్కుని పరారయ్యారు. ఈ మేరకు 11 ఏళ్ల బాలిక లిసిప్రియ నొయిడాలో తన అనుచరులతో కలిసి ఫేస్బుక్ లైవ్ రికార్డు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె వాతావరణాన్ని కలుషితం కాకుండా ఉండేలా... కాకర్స్ కాల్చకుండా దీపావళి పండుగను ఎలా జరుపుకోవాలనే దానిపై ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఇంతలో వెనుక నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు దుండగలు ఆమె ఫోన్ని లాక్కుకుని వెళ్లిపోయారు. దీంతో ఆమె పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా తనకు సహాయం చేయమంటూ ట్విట్టర్లో ఒక సందేశాన్ని కూడా పోస్ట్ చేసింది. ఈ మేరకు సెంట్రల్ నొయిడా అదనపు డీసీపీ సాద్మియాన్ కేసు నమోదు మొబైల్ స్నాచర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మణిపూర్కి చెందిన లిసిప్రియ కంగుజం వాతావరణ మార్పులపై పోరాటం చేస్తున్న పర్యావరణ కార్యకర్త. కీలకమైన వాతావరణ మార్పు సమస్యలపై పలువురు ప్రపంచ నేతలను కలిసింది కూడా. అంతేగాదు ఆ బాలిక కాప్ 25 వాతావరణ మార్పు సదస్సులో ప్రసంగించి అందరీ మన్ననలను పొందింది. ఇటీవల చత్తీస్గఢ్ బొగ్గు వ్యతిరేక నిరసనలో పాల్గొంది. అలాగే 2020లో వాషింగ్టన్లో ఎర్త్డేని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో కూడా పాల్గొంది. (చదవండి: మిరాకిల్ అంటే ఇదే...మీద నుంచి కారు వెళ్లిపోయింది ఐనా...) -
సెల్ఫోన్ చార్జింగ్ పెట్టి స్నానం చేస్తుండగా..
కుషాయిగూడ: సెల్ఫోన్ చార్జింగ్ పెట్టి స్నానం చేస్తుండగా షాట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం జరిగిన ఘటన శుక్రవారం చర్లపల్లిలో చోటు చేసుకుంది. వెంకట్రెడ్డినగర్ కాలనీకి చెందిన చెన్నమ్మ ఇంట్లో ఈ ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం సమయంలో చెన్నమ్మ ఆమె భర్త బయటకు వెళ్లగా కొడుకు తన సెల్ఫోన్కు చార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్లాడు. చార్జింగ్ పెట్టిన చోట షాట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించాయి. పొగలు రావడాన్ని గమనించిన అతడు బయటకు వచ్చి చూడగా ఇంట్లో వస్తువులకు మంటలు అంటుకుంటున్నాయి. అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇంట్లోని బట్టలు, వస్తువులు, ఆహార పదార్థాలు మంటల్లో కాలిపోయాయి. విషయం తెలిసిన స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అక్కడికి చేరుకొని బాధితులను పరామర్శించి ఆదకుంటానని హామీ ఇచ్చారు. ఆమె వెంట నాగిళ్ల బాల్రెడ్డి, కనకరాజుగౌడ్, ప్రభుగౌడ్ తదితరులు ఉన్నారు. (చదవండి: ఓటర్లను యాదాద్రి తీసుకెళ్లి ప్రమాణాలు...టీఆర్ఎస్పై కేసు నమోదు) -
కళ్లకింద నల్లటి వలయాలా?.. ఇంట్లోనే చక్కటి పరిష్కారం
ఇటీవలి కాలంలో మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం, కంప్యూటర్ స్క్రీన్ వైపు అధికంగా చూడటం వల్ల చాలామందికి కళ్లు ఎర్రబడటం, మంటలు, కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడటం వంటి ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వాటికి ఇంటిలో సహజంగా దొరికే వాటితోనే చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఓసారి ప్రయత్నించి చూడండి. ►కళ్ల ఎర్రబడి, మంట పుడుతుంటే ఉదయం లేదా సాయంత్రం.. సుమారు పది నిమిషాలు ఐస్క్యూబ్స్తో కళ్లను మసాజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా చర్మం మీద కాకుండా.. కాటన్ క్లాత్లో చుట్టి.. మెల్లిగా కళ్లను మసాజ్ చేయాలి. ఒకవేళ ఐ మాస్క్ ఉంటే.. దానిని కొంతసేపు ఫ్రిజ్లో ఉంచి కళ్లకు పెట్టుకోవచ్చు. చల్లని టీ బ్యాగులు: కోల్డ్ కంప్రెస్ లేదా ఐ మాస్క్ లేకుంటే.. ఉపయోగించిన టీ బ్యాగ్లు మీకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. గ్రీన్ టీ వంటి అనేక టీలు యాంటీ ఆక్సిడెంట్లతో కూడి ఉండటం వల్ల వీటిని ఫ్రిజ్లో పెట్టి కళ్ల మీద పెట్టుకుంటే చాలు... కళ్లకింద ఉండే క్యారీబ్యాగ్స్ను, డార్క్ సర్కిళ్లను తగ్గిస్తాయి. ►తాజా కీరదోసకాయను ఒక మాదిరి పరిమాణంలో గుండ్రటి ముక్కలుగా తరిగి.. వాటిని ఒక గిన్నెలో పెట్టి అరగంట పాటు ఫ్రిజ్లో ఉంచండి. తర్వాత వాటిని ఫ్రిజ్ నుంచి తీసి కళ్లపై ఉంచి.. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. బాదం నూనె: బాదం నూనె, విటమిన్ ఇ మిశ్రమాన్ని ఉపయోగిస్తే కళ్ల కింద ఉండే నల్లటి వలయాలు క్రమంగా మటుమాయం అవుతాయి. పడుకునే ముందు మీ డార్క్ సర్కిల్స్ను బాదం నూనె, విటమిన్ ఇ మిశ్రమంతో కలిపి మసాజ్ చేయాలి.. ఉదయం లేచిన తర్వాత.. ఆ ప్రాంతాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే కళ్ల మంటలు తగ్గి హాయిగా ఉంటుంది. చల్లని పాలు: పాల ఉత్పత్తులు విటమిన్–ఎ ను కలిగి ఉంటాయి. ఇందులో రెటినోయిడ్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా, యవ్వనంగా ఉంచడంలో గొప్పగా పనిచేస్తాయి. చల్లని పాల గిన్నెలో కాటన్ మేకప్ రిమూవర్ ప్యాడ్ను నానబెట్టండి. అనంతరం 10 నిమిషాల పాటు కళ్లపై ఉంచండి. గోరు వెచ్చని నీటితో శుభ్రం చేస్తే.. డార్క్ సర్కిల్స్ సమస్య తగ్గుతుంది. కంటి నిండా నిద్ర: నిర్ణీత సమయం పడుకోకపోవడం వల్ల కళ్ల కింద ద్రవం పేరుకుపోతుంది. కాబట్టి కంటినిండా హాయిగా∙నిద్రపోవాలి. క్రమగా వ్యాయామం చేయాలి. ఈ సహజ నివారణలతో కంటిచుట్టూ ఉండే నల్లటి వలయాలను సులువుగా ఛేదించవచ్చు. -
మీ ఫోన్ 5జీకి సపోర్ట్ చేస్తుందా?
-
5G ఫోన్ కొనేముందు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి
-
వీడియోలు, ఓటీటీ కంటెంట్.. 70 శాతం మంది ఆ వయసు వారే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ దైనందిన జీవితంలో భాగమైంది. ఖాళీ సమయాల్లో 63.36 శాతం మంది యువత మొబైల్ ఫోన్లతో గడుపుతున్నారని ఇన్ఫోటైన్మెంట్ యాప్ వే2న్యూస్ సర్వేలో తేలింది. ఇందులో 51 శాతం మంది వీడియోలు, 29 శాతం ఓటీటీ కంటెంట్ చూస్తున్నారు. మిగతావారు మ్యూజిక్ వింటున్నారు. ప్రజల ప్రాధాన్యతలు తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చేపట్టిన ఈ సర్వేలో 3,50,000 మందికిపైగా పాల్గొన్నారు. ఇందులో 88 శాతం మంది పురుషులు 12 శాతం స్త్రీలు ఉన్నారు. అభిప్రాయాలు వెల్లడించిన వారిలో 70 శాతం మంది 21–30 సంవత్సరాల లోపువారే. మొత్తంగా తెలంగాణ నుంచి 53 శాతం మంది ఉండగా మిగిలిన వారు ఏపీకి చెందినవారు. షాపింగ్ తీరుతెన్నులు ఇలా.. ఆన్లైన్తోపాటు ఆఫ్లైన్ స్టోర్లలో షాపింగ్ చేస్తున్నట్లు 31 శాతం మంది చెప్పారు. వస్తువులను ఆఫ్లైన్ స్టోర్లలో భౌతికంగా చూసి, బట్టలను ట్రయల్ చేసి, ఎలక్ట్రానిక్స్ చెక్ చేసిన తర్వాతే కొనేందుకు మొగ్గు చూపుతున్నామని 29.5 శాతం మంది తెలిపారు. కోవిడ్ 19 ఆంక్షలు, లాక్ డౌన్, ప్రజల్లోని భయాలతో విక్రయాలు తగ్గి ఇటీవలి సంవత్సరాల్లో తీవ్ర నష్టాలు చూసిన ఔట్లెట్లకు ఇప్పుడిప్పుడే వాక్–ఇన్స్ పెరుగుతుండటం ఉపశమనం కలిగించే అంశం. సొంత వాహనాల్లో.. ప్రస్తుతం దేశంలో కోవిడ్ ఆంక్షలు లేవు. దీంతో అందరూ తిరిగి ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 50.71 శాతం ప్రజలు తమ సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. చాలాకాలం పాటు దేశ ప్రజల ప్రయాణ ప్రాధాన్య క్రమంలో ఉన్న రైళ్ల వైపు ఇప్పుడు కేవలం 26 శాతం మంది మళ్లుతుండగా బస్సులను మరింత తక్కువగా 14 శాతం ఎంచుకుంటున్నారు. కోవిడ్ ప్రభావం గురించి ప్రజలకు అవగాహన పెరగడంతో జాగ్రత్తగా ప్రయాణాలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు దీన్నిబట్టి అర్థమవుతోంది. కాగా, తెలంగాణలో అధికంగా మహబూబ్ నగర్ నుంచి 39,073 మంది, నల్లగొండ 32,403, ఏపీలో వైజాగ్ 21,872, శ్రీకాకుళం నుంచి 20,921 మంది సర్వేలో పాలు పంచుకున్నారు. -
విద్యార్థిపై ‘నారాయణ’ లెక్చరర్ ప్రతాపం
సాక్షి, పటమట (విజయవాడ): విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థిని అధ్యాపకుడు కాలితో తన్నిన ఘటనను మరువక ముందే నగరంలోని నారాయణ కళాశాలలోనూ ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. మార్కులు తక్కువ వచ్చాయని ఓ విద్యార్థిని లెక్చరర్ తీవ్రంగా కొట్టారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.. విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థికి మార్కులు తక్కువ వచ్చాయి. అయితే, మార్కులు ఎందుకు తగ్గాయంటూ ప్రసాదరావు అనే లెక్చరర్ శుక్రవారం మధ్యాహ్నం సదరు విద్యార్థిని చితకబాదారు. ఈ దృశ్యాన్ని మరో విద్యార్థి తన సెల్ఫోన్లో చిత్రీకరించడం గమనించిన ఆ లెక్చరర్, కళాశాల ప్రతినిధి కోటితో కలిసి అతన్ని(చిత్రీకరిస్తున్న విద్యార్థి) తీవ్రంగా కొట్టారు. అంతేగాక వారిద్దరినీ వేరే తరగతి గదిలోకి తీసుకెళ్లి.. బెదిరించడమేగాక సెల్ఫోన్ లాక్కొని పగులకొట్టారు. జరిగిన ఘటనను విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పగా, వారు పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మహేంద్ర చెప్పారు. చదవండి: (ఇదీ చరిత్ర.. ఇవీ నిజాలు: ఎన్టీఆర్.. చంద్రబాబు.. అలనాటి నగ్నసత్యాలు) -
కదులుతున్న రైలులో మొబైల్ చోరీకి యత్నం.. పాపం వాడి పనైపోయింది!
దొంగతనం.. చట్టరీత్యా నేరం అయినా నిత్యం ఈ పదం వింటూనే ఉన్నాం. ఇంటికి తాళం కనిపిస్తే చాలు ఇల్లు గుల్ల అవ్వాల్సిందే. ఒక ఇంట్లోని వస్తువులేనా.. ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలు, విలువైన వస్తువులు సైతం కొట్టేస్తుంటారు. ఇక రైలు, బస్సుల్లో వంటి రద్దీగా ఉండే ప్రదేశాల్లోనూ దొంగలు తమ చేతి వాటాన్ని చూపిస్తూనే ఉంటారు. ఎంత తెలివిగా తప్పించుకున్నా కొన్నిసార్లు దొంగ దొరికిపోతుంటాడు. తాజాగా ఓ దొంగ రైల్వే స్టేషన్ నుంచి కదులుతున్న రైలులో మొబైల్ ఫోన్ చోరీకి ప్రయత్నించి చివరికి ఊహించని విధంగా విఫలమయ్యాడు. ఈ ఘటన సెప్టెంబర్ 14న బిహార్లో చోటుచేసుకుంది. బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెళ్తున్న రైలులో కిటికీలోంచి ప్రయాణికుడి మొబైల్ను కొట్టేసేందుకు ఓ దొంగ ప్రయత్నించాడు. రైలు సాహెబ్పూర్ కమల్ స్టేషన్ దగ్గరకు రాగానే దొంగ మొబైల్ దొంగిలించేందుకు వ్యక్తి చేతిని పట్టుకున్నాడు. కానీ అక్కడే అతని ప్లాన్ బెడిసి కొట్టింది. మొబైల్ తీసుకుంటుండగా అప్రమత్తమైన ప్యాసింజర్ దొంగ చేతులను కిటికీలోంచే గట్టిగా పట్టుకున్నాడు. రైలు కదలడం ప్రారంభమవ్వడంతో దొంగ క్షమాపణలు కోరుతూ, చేతులు వదిలేయమని వేడుకున్నాడు. అప్పటికే రైలు వేగం పెరగడంతో ఏం చేయాలో తోచని దొంగ తన రెండో చేతిని కూడా కిటికీ ద్వారా లోపలికి అందించాడు. ప్రయాణికుడు దొంగ రెండు చేతులను గట్టిగా పట్టుకున్నాడు. దాదాపు 10 కిలోమీటర్లు దొంగ అలాగే కిటికీకి వేలాడుతూ ప్రయాణం చేశాడు. చివరికి రైలు ఖగారియా దగ్గరకు రాగానే ప్రయాణికుడు స్నాచర్ చేయి వదలడంతో అతడు పారిపోయాడు. దీనిని తోటి ప్రయాణికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. చదవండి: చిన్న కారులో 29 మంది.. ‘ఇంకెంత మందిని ఎక్కించేస్తార్రా బాబు’ Though #unverified yet chilling. A mobile snatcher caught in a moving train when his failed attempt probably led to his worst day of life. The thief was hung by a window in a moving train from Begusarai to Khagaria. The passengers handed him over to GRP. IS this act justified? pic.twitter.com/o3ja5qWggi — Kumar Saurabh Singh Rathore (@JournoKSSR) September 15, 2022 -
మొబైల్ డిస్ప్లే దిగుమతులపై 15 శాతం సుంకాలు
న్యూఢిల్లీ: స్పీకర్లు, సిమ్ ట్రే వంటివి అమర్చిన మొబైల్ ఫోన్ డిస్ప్లే యూనిట్ల దిగుమతులపై 15 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ) వర్తిస్తుందని కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) వెల్లడించింది. డిస్ప్లే అసెంబ్లీని దిగుమతి చేసుకునేటప్పుడు, సుంకాల ఎగవేత కోసం తప్పుడు డిక్లరేషన్లను ఇవ్వకుండా నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సాధారణంగా మొబైల్ ఫోన్ డిస్ప్లే అసెంబ్లీలో టచ్ పానెల్, కవర్ గ్లాస్, ఎల్ఈడీ బ్యాక్లైట్ వంటివి ఉంటాయి. వీటి దిగుమతులపై ప్రస్తుతం 10% సుంకం ఉంది. -
ప్రియురాలితో మొబైల్ చాటింగ్ ... దెబ్బకు ఆగిపోయిన విమానం
బెంగళూరు: ఒక వ్యక్తి మొబైల్కి సందేశం రావడంతో మంగళూరు నుంచి ముంబైకి వెళ్లాల్సిన విమానం ఆరుగంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఇండిగో విమానాన్ని ముంబై బయలుదేరడానికి అనుమతించే ముందు పోలీసులు ప్రయాణికులందర్నీ విమానం నుంచి దించి హఠాత్తుగా తనీఖీలు చేయడం మొదలు పెట్టారు. పోలీసులు ఇంత అకస్మాత్తుగా తనీఖీలు చేయడానికి కారణం అందులో ఉన్న ఒక మహిళా ప్రయాణికురాలు. ఆమె తన సహా ప్రయాణికుడి మొబైల్కి అనుమానాస్పద సందేశం రావడంతో ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని అప్రమత్తం చేసింది. దీంతో సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ని అప్రమత్తం చేయడంతో టేకాఫ్కి సిద్ధంగా ఉన్న విమానం కాస్త ఆగిపోయింది. తిరిగి ఎయిర్ పోర్టు బేకు చేరుకుంది. ఇంతకీ ఆ వ్యక్తి తన మొబైల్లో ప్రియురాలితో చాటింగ్ చేస్తున్నాడు. అదే విమానాశ్రయం నుంచి బెంగళూరుకు విమానం ఎక్కేందుకు వచ్చిన తనప్రియురాలితో మొబైల్లో చాటింగ్ చేస్తున్నాడు. తన స్నేహితురాలు కర్ణాటక రాజధాని వెళ్లే విమానం మిస్సైందని చెప్పుకొచ్చాడు. ఐతే పోలీసులు అతన్ని చాలా సేపు విచారించిన తర్వాత గానీ ప్రయాణించేందుకు అనుమతించ లేదు. ఈ మేరకు ప్రయాణికులందర్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత దాదాపు 185 మంది ప్రయాణికులను ముంబై వెళ్లే విమానంలోకి తిరిగి అనుమతించారు. దీంతో విమానం సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరింది. ఐతే ఇది భద్రతల నడుమ ఇద్దరి వ్యక్తుల మధ్య స్నేహ పూర్వక సంభాషణే కావడంతో ఆ వ్యక్తి పై ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని నగర పోలీస్ కమిషనర్ ఎన్ శశికుమార్ అన్నారు. (చదవండి: కాల్చేస్తాం, జరిమానా కట్టేస్తాం ) -
వాట్ యాన్ ఐడియా సర్ జీ! అధికారులకు కొత్త రకం ఫోన్లు ఇచ్చిన కలెక్టర్
సాక్షి, చెన్నై: తిరుచ్చి కలెక్టర్ ప్రదీప్కుమార్ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తన పరిధిలోని అధికారులతో సమన్వయం కోసం అందరికీ పుష్..టు టాక్ పేరిట కొత్త రకం ఫోన్లను కొనుగోలు చేసి ఇచ్చా రు. వివరాలు.. ప్రదీప్కుమార్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పరిధిలోని అధికారులను ప్రజా సేవలో సమన్వయ పరిచేందుకు, ప్రభుత్వ కార్యాక్రమాల విస్తృతం చేయడమే లక్ష్యంగా కొత్త ప్రయోగంపై ఆయన దృష్టి పెట్టారు. ఇందుకోసం విదేశాల నుంచి పుష్ టు టాక్ పేరిట 35 కొత్త రకం ఫోన్లను కొనుగోలు చేశారు. ఆపదలో రక్షణ కవచం.. తొలి విడతగా జిల్లా పరిధిలోని రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి విభాగాల అధికారులకు ఈ పుష్ టు టాక్ ఫోన్లను అందజేశారు. అయితే, ఈ ఫోన్లకు నంబర్లు ఉండవు. ఎవరెవరి చేతిలో ఈ ఫోన్లు ఉన్నాయో కేవలం వారి పేర్లు మాత్రమే ఉంటాయి. సంబంధిత అధికారితో అత్యవసరంగా మాట్లాడదలిచినా, సమాచారం అందజేయాలని భావించినా ఇందులో ప్రత్యేక ఆఫ్షన్లు ఉంటాయి. కలెక్టర్ మాత్రం ఒకేసారిగా 35 మందితో మాట్లాడేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే, ఆయా అధికారులు ఎక్కడెక్కడ ఉన్నారో కలెక్టర్ ఇట్టే పసిగట్టేందుకు కూడా అవకాశం ఉంది. ఈ ఫోన్లు డైరెక్ట్గా మొబైల్ టవర్ల ద్వారా పనిచేస్తాయి. మహిళా అధికారులు ఎక్కడైనా తనిఖీలకు వెళ్లిన సమయంలో ఏదేని ప్రమాదం తలెత్తినా, ఆపదలో ఉన్నా.. ఇందులోని ఎస్ఓఎస్ అనే ఎమర్జెన్సీ బటెన్ను నొక్కగానే అందరికీ సమాచారం క్షణాల్లో వెళ్తుంది. సమీపంలోని ఉన్నతాధికారులు తక్షణం అక్కడికి చేరుకుని అండగా నిలుస్తారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, తాను ఏదేనా సమాచారం పంపిన పక్షంలో, అధికారులు ఇతర పనుల్లో ఉంటే ఆ వివరాలు ఈ ఫోన్లలో అట్టే నిల్వ ఉంటాయని పేర్కొన్నారు. అధికారులు ఎవరైనా ఆపదలో ఉన్న పక్షంలో ఆరంజ్ కలర్ బట్టన్ను నొక్కితే చాలు అని, తనతో పాటుగా అందరం తక్షణం సంబంధిత ప్రాంతానికి చేరుకుంటామని వివరించారు. సిబ్బంది సమన్వయంతో ముందుకెళ్లేందుకే ఈ ఫోన్లను కొనుగోలు చేసి ఇచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. -
అయ్యో.. మొబైల్ పోయిందా? ఇలా చేయండి
విజయనగరం క్రైమ్: ఎంతో విలువైన మొబైల్ మిస్సయిందా? కంగారు పడకండి. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. జిల్లా పోలీస్శాఖ నూతనంగా రూపకల్పన చేసి నిరంతర పర్యవేక్షణకు సైబర్ సెల్ను ఏర్పాటుచేసింది. మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తులు ఇటీవలికాలంలో పెరుగుతుండడంతో, బాధితులకు ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకండా, ఫిర్యాదుల స్వీకరణను సులభతరం చేస్తూ ఎస్పీ ఎం.దీపిక చర్యలు చేపట్టారు. మొబైల్ పొగొట్టుకున్న బాధిత ఫిర్యాదు దారు పేరు, చిరునామా, సంప్రదించాల్సిన మొబైల్ నంబర్, మొబైల్ మోడల్, ఐఎంఈఐ నంర్, ఫోన్ పోయిన తేదీ, సమయం, ప్రాంతం వంటి వివరాలను పోలీస్ వాట్సాప్ నంబర్ 8977945606కు పంపించాలి. ఫిర్యాదు అందుకున్న వెంటనే సైబర్సెల్ పోలీసులు బాధిత ఫోన్ను ట్రాక్ చేస్తారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చర్యలు చేపడతారు. పోగొట్టుకున్న ఫోన్లను ట్రాక్ చేసి తర్వాత తిరిగి బాధితులకు అందజేస్తారు. ఒకవేళ పోయిన ఫోన్లు ట్రాక్ కాకుంటే చట్టపరమైన చర్యలు చేపట్టి, దర్యాప్తు చేస్తారు. వాట్సాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను సైబర్ సెల్ సిబ్బంది స్వీకరించి, వాటిని రిజిస్టర్లో నమోదుచేసి, పోయిన మొబైల్స్ను కనుగొనేందుకు చర్యలు చేపడతారు. ఆందోళన అవసరం లేదు జిల్లాలో మొబైల్స్ పోగొట్టుకున్న ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జస్ట్ డయల్ 8977945606కు చేసి ఫిర్యాదు చేస్తే సైబర్ సెల్ నిరంతర పర్యవేక్షణ చేస్తుంది. పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. పోలీస్ శాఖ కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ఎం.దీపిక, ఎస్పి, విజయనగరం -
54% మహిళలకే సొంత సెల్ఫోన్
సాక్షి, అమరావతి: సాంకేతిక యుగంలోనూ భారతదేశంలోని మహిళలు పురుషుల కంటే సొంత సెల్ఫోన్ల వినియోగంలో వివక్ష ఎదుర్కొంటున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)–5 వెల్లడించింది. దేశవ్యాప్తంగా 7,24,115 మంది మహిళలను ఇంటర్వ్యూ చేస్తే అందులో సగంమంది మాత్రమే తమకు ప్రత్యేకంగా సెల్ఫోన్ ఉందని చెప్పారు. వీరిలో 71 శాతం మందికి మాత్రమే టెక్ట్స్ మెసేజ్లు చదవగలిగే సామర్థ్యం ఉందని తేలింది. మహిళా సాధికారత అన్వేషణలో భాగంగా 15–49 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో ఉపాధి, సంపాదనపై నియంత్రణ, యాజమాన్య హక్కులు, మొబైల్ ఫోన్ వినియోగంపై 2019–21 మధ్య ఈ సర్వే నిర్వహించారు. అగ్రస్థానంలో గోవా దేశవ్యాప్తంగా దాదాపు 66.29 కోట్ల్ల మంది మహిళలున్నారు. ఎన్ఎఫ్హెచ్ఎస్–5 సర్వేలో సొంత సెల్ఫోన్లు వినియోగిస్తున్న మహిళల్లో గోవా అగ్రస్థానంలో నిలవగా మధ్యప్రదేశ్ చివరి స్థానంలో ఉంది. గోవాలో సర్వేచేసిన 2,030 మంది మహిళల్లో 91.2 శాతం మందికి సొంత ఫోన్లున్నాయి. మధ్యప్రదేశ్లో 48,410 మంది మహిళల్లో 38.5 శాతం మందికే ఫోన్లున్నాయి. తెలంగాణలో 60 శాతం మందికి సొంత ఫోన్లు ఉన్నాయి. సొంత సెల్ఫోన్లు వినియోగిస్తున్న మహిళల శాతం ఏపీలో 48.9గా ఉంది. దేశవ్యాప్తంగా 2015–16 సర్వేతో పోలిస్తే తాజా గణాంకాలు మెరుగుదలను సూచిస్తున్నాయి. సొంత ఫోన్లు ఉన్న మహిళలు గతంలో 46 శాతం ఉండగా అది ఇప్పుడు 54 శాతానికి చేరింది. ఈ వృద్ధి నెమ్మదిగా ఉండటంతో కొందరు నిపుణులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సిక్కిం, లక్షద్వీప్, పుదుచ్చేరి, నాగాలాండ్, మిజోరంతో పోలిస్తే ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. వయసును బట్టి..: ఈ సర్వే ప్రకారం మహిళల్లో సొంత సెల్ఫోన్ల వినియోగం వయసును బట్టి పెరుగుతోంది. 15–19 ఏళ్ల వయసు గల యువతుల్లో 32 శాతం ఉంటే.. 25–29 ఏళ్ల మహిళల్లో 65 శాతానికి పెరిగింది. సొంత మొబైల్ ఫోన్ ఉన్న మహిళల్లో టెక్ట్స్ మెసేజ్ చదివే సామర్థ్యం వయసు పెరిగే కొద్దీ తగ్గుతోంది. ఇది 15–19 సంవత్సరాల వయసు గల వారిలో 89 శాతం ఉంటే.. 40–49 సంవత్సరాల వయసు గల వారిలో 53 శాతానికి తగ్గింది. -
ఆంటీ ఎంత చాకచక్యంగా ఫోన్ కొట్టేసిందో చూడండి: వీడియో వైరల్
దొంగతనాలకు సంబంధించిన ఎన్నో వైరల్ వీడియోలు చూసుంటాం. పాపం వాళ్లు దొంగతనం చేసేటప్పుడు ఎంతలా టెన్షన్ పడుతూ దొంగలించి పారిపోతుంటారో వంటివి చూశాం. ఎందుకింత హైరానా మంచిగా పనిచేసుకుని హాయిగా ఉండొచ్చు కదా అనుకుంటా. కానీ కొంతమంది కన్నింగ్ క్యాండిట్లు అసలు ఏ మాత్రం భయపడుకుండా భలే చోరి చేస్తారు. వాళ్ల ముఖంలో కాస్త కూడా గాభరా గానీ ఆందోళన గానీ కనిపించదు. అచ్చం అలానే ఇక్కడో ఆంటీ ఎంతలా దొంగతనం చేసిందో చూడండి. వివరాల్లోకెళ్తే... ఇద్దరు మహిళలు షాపింగ్ చేసి బిల్లు పే చేసేందుకు కౌంటర్ వద్దకు వచ్చారు. ఐతే అందులో ఒక మహిళ తెలివిగా తను ముందున్న మహిళ వద్దకు రాసుకుంటూ వస్తుంది. పైగా చాలా చాకచక్యంగా సదరు మహిళ పర్సులో పోన్ తీస్తూనే మరోవైపు బిల్ కౌంటర్ దగ్గర ఉన్న వ్యక్తి ఏవేవో సందేహాలు అడుగుతుంది. ఇంతలో ఆ మహిళ ఫోన్ని తన బ్యాగ్లో వేసుకుని కామ్గా వెళ్లిపోతుంది. కనీసం తన ఫోన్ పోయిందని పాపాం ఆ మహిళకు కూడా ఇంకా తెలియదు. ఈ మేరకు ఘనటకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: నివాళి సభలో ‘పోకిరీ’ పాటకు బెల్లి డ్యాన్స్లు.. నోరెళ్లబెట్టిన బంధువులు.. వీడియో వైరల్) -
ఆంటీ తెలివిగా దుకాణంలో ఫోన్ను భలే నొక్కేసింది..!!
-
వస్తామన్న బస్సు రానే వచ్చింది.. తండ్రిని ఆగం పట్టిచ్చిన ఆన్లైన్ గేమ్స్!
భిక్కనూరు (నిజామాబాద్): మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన వ్యాపారి భార్య, ఇద్దరు కుమారులు అదృశ్యమయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై ఆనంద్గౌడ్ వారి ఆచూకీని నాలుగు గంటల్లోనే కనుగొనడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఏమి జరిగిందంటే.. తిప్పాపూర్ గ్రామానికి చెందిన వ్యా పారి వీరమల్లి శ్రీనివాస్కు భార్య శాలిని అలియాస్ అశ్విని, ఇద్దరు కుమారులు వరుణ్, లోకేష్లు ఉన్నారు. శాలిని తండ్రి అనారోగ్యానికి గురికావడంతో ఆమె ఇద్దరు కుమారులను తీసుకుని ఈనెల ఒకటవ తేదీ తిప్పాపూర్ నుంచి కరీంనగర్ వెళ్లి అక్కడ తండ్రిని పరామర్శించి 3వ తేదీ కరీంనగర్లో బస్సు ఎక్కి కామారెడ్డికి మధ్యాహ్నం 3.50 గంటలకు చేరుకుంది. తన భర్త శ్రీనివాస్కు ఫోన్చేసి తిప్పాపూర్ రావడానికి రామాయంపేటలో బయలుదేరుతున్నానని భిక్కనూరు నుంచి తనను తిప్పాపూర్ తీసుకెళ్లాలని సెల్ ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో సాయంత్రం 6.30 గంటలకు ఆయన భిక్కనూరు బస్టాండ్కు వచ్చాడు. బస్సులో రాకపోగా ఫోన్ స్విచ్ఆఫ్ కావడంతో తీవ్ర ఆందోళన చెందారు. చదవండి👉 ఏమై పోయాడో..? స్నానానికి దిగిన యువకుడు అదృశ్యం ఆమె కుమారులు సెల్ఫోన్లో గేమ్ ఆడటంతో చార్జింగ్ అయిపోయి ఫోన్ స్విచ్ఆఫ్ ఆయ్యింది. కాగా తండ్రి మీద ఉన్న మమకారంతో ఆమె తిరిగి కరీంనగర్ వెళ్ళాలని నిర్ణయించి కుమారులతో కలిసి సిరిసిల్లి బస్సు ఎక్కారు. సిరిసిల్ల నుంచి కరీంనగర్ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ఆ రాత్రికి అక్కడున్న బంధువుల ఇంటికి వెళ్ళారు. అయితే ఎస్సై ఆనంద్గౌడ్ తీవ్రంగా కృషి చేసి ఫోన్ సిగ్నల్ ఆధారంగా సిరిసిల్లలో ఉన్నట్లు గుర్తించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే స్పందించిన ఎస్సైని పలువురు అభినందించారు. చదవండి👉🏻 వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ముగ్గురి అరెస్ట్ -
యువతి స్పెషల్ టాలెంట్.. సెల్ఫోన్పై తుపుక్.. తుపుక్ అని ఉమ్మేసి.. !
సోషల్ మీడియా వాడుతున్న యూజర్లు సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ క్రమంలో ఫోటోలు, వీడియోలు ఇలా ఒకటేంటి ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా నెట్టింట దర్శనమిస్తుంటాయి. అందులో కొన్ని వీడియోలు వైరల్గా మారి అందులోని వాళ్లు రాత్రికి రాత్రే స్టార్గా మారిన ఘటనలు ఉన్నాయి. అందుకే ప్రపంచ నలుమూలల జరిగిన వీడియోలు క్షణాల్లో సోషల్మీడియాలో కనిపిస్తుంటాయి. తాజాగా ఓ యువతి వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. యూఎస్కు చెందిన ఓ యువతికి స్పెషల్ ట్యాలెంట్ ఉంది. సాధారణంగా ఎవరైనా తమ ఫోన్లను చేతివేళ్లతో అన్లాక్ చేస్తారు. అయితే రోటీన్కి భిన్నంగా ఆ యువతి తన లాలాజలంతో మొబైల్ని అన్ లాక్ చేస్తుంది. మొబైల్ వినియోగదారులు తమ ఫోన్ అన్లాక్ని చేతివేళ్లు, ప్యాటర్న్, ఇమేజ్ పద్ధతులను ఉపయోగించి ఓపన్ చేస్తుంటారు. ఆమె మాత్రం అలా చేయకుండా తన ఉమ్మితో ఫోన్ను అన్ లాక్ చేస్తోంది. ఇటీవల తాను స్నేహితులతో కలిసి పబ్కు వెళ్లింది. అక్కడ తన ఫోన్ని ఉమ్మితో అన్ లాక్ చేస్తానని పందెం కాసింది. ఇంకేముంది ఆమె చెప్పినట్లు ఫోన్ స్క్రీన్ మీద మీద ఉమ్ముతూ ఫోన్ లాక్ చేసింది. అందరు చూస్తుండగానే ఫోన్ పై ఉమ్ముతూ సెల్ ఫోన్ లాక్ తీసింది. మొదట్లో ఆమె చెబితే ఎవరూ నమ్మలేదు గానీ తర్వాత యువతి అలా చేసేసరికి అక్కడి వారు షాకయ్యారు. ఆమె స్పెషల్ ట్యాలెంట్ను అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. A girl using her spit to unlock her phone. 🃏 pic.twitter.com/dhMfaj6dYV — Public Outsider (@publicoutsider) April 25, 2022 చదవండి: క్లాస్లో అందరి ముందే లవర్కు ముద్దుపెట్టిన అబ్బాయి.. తరువాత ఏం జరిగిందంటే.. -
ఎస్ఐ స్కాం: ఆధారాలు దొరక్కుండా చేసేందుకు మొబైల్ ముక్కలు!
బనశంకరి: రాష్ట్ర సర్కారుకు సంకటంగా మారిన ఎస్ఐ పోస్టుల పరీక్షల స్కాంలో అరెస్టయిన దివ్య హగరగి అరెస్టు కావడంతో విచారణ వేగమందుకుంది. ఆమెను శనివారం కూడా సీఐడీ అధికారులు విచారించారు. తన మొబైల్ఫోన్ దొరకరాదని పరారీలో ఉన్నప్పుడే బద్దలు కొట్టినట్లు తెలిసింది. కొద్దిరోజుల కిందటే సీఐడీ అధికారులు దివ్య హగరగిని పూణేలో అరెస్ట్ చేశారు. ఆ సమయంలో మొబైల్ గురించి విచారించగా ఆమె నోరు మెదపలేదు. శనివారం కలబురిగిలో జరిపిన విచారణలో, ఫోన్ను పగలగొట్టినట్లు చెప్పింది. మొబైల్లో ఉన్న సాక్ష్యాధారాలు నాశనం చేయడానికే ఇలా చేసినట్లు తెలిసింది. మిగిలిన నిందితుల మొబైల్స్ స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిలో సాక్ష్యాధారాల కోసం శోధిస్తున్నారు. అవసరమైతే దివ్యని మళ్లీ పూణే కు తీసుకెళ్లే అవకాశం ఉంది. 18 రోజులూ దేవస్థానాల యాత్ర దివ్య హగరగి దైవ భక్తురాలు. పరారీలో ఉన్న 18 రోజులు ప్రముఖ ఆలయాలను సందర్శించి పూజలు చేసినట్లు తెలిసింది. ఎస్ఐ పరీక్షల్లో అక్రమాలు వెలుగులోకి రాగానే ఏప్రిల్ 10వ తేదీన మధ్యాహ్నం కలబురిగిలో ఇల్లు విడిచిపెట్టింది. అఫ్జలపుర మీదుగా మహారాష్ట్ర సొల్లాపురకు చేరుకుని అక్కడ మొబైల్ స్విచ్చాఫ్ చేసుకుంది. తరువాత ఆన్ చేయలేదు. పారిశ్రామికవేత్త సురేశ్ కాటిగావ సహాయం తీసుకుని ఒక ఫాంహౌస్లో రెండురోజులు మకాం వేసింది. సిద్దరామేశ్వర ఆలయం దర్శించి పూణెకి వెళ్లి 5 రోజులు పాటు అక్కడే మకాం వేసింది. తరువాత గుజరాత్కు వెళ్లి అక్కడ మూడురోజుల పుణ్యక్షేత్రాల్లో పూజలు చేసింది. 22వ తేదీ మళ్లీ పుణే కు చేరుకుని అరెస్టయ్యే వరకు రింగ్రోడ్డులోని ఒక ఇంట్లో తలదాచుకుంది. పరీక్ష రద్దుపై కాంగ్రెస్ నేతల భగ్గు ఈ కుంభకోణంలో బీజేపీ నేతలు భాగస్వాములుగా ఉన్నారని, వారిని కాపాడటానికి విచారణ నివేదికకు ముందే పరీక్షను రద్దు చేశారని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆరోపించారు. బెంగళూరులో మాట్లాడుతూ దివ్య హగరగిని అరెస్ట్ చేసి తీసుకువస్తుండగానే పరీక్ష రద్దును హోంమంత్రి ప్రకటించారన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ పరీక్షలో ఉత్తీర్ణులై పోస్టు కోసం వేచిచూస్తున్న అభ్యర్థులు డీకేని కలిశారు. నిజాయితీగా పరీక్ష రాసి ఉత్తీర్ణులైన తమకు ఎందుకు శిక్ష అని వాపోయారు. ఫ్రీడంపార్క్ వద్ద ధర్నా చేపట్టారు. మళ్లీ ఎస్ఐ పరీక్ష జరపాలని ప్రభుత్వం ఏ ఆధారంతో నిర్ణయించిందని సీఎల్పీ నేత సిద్దరామయ్య ప్రశ్నించారు. హోంమంత్రి ని తొలగించాలని డిమాండ్ చేశారు. కింగ్పిన్ దివ్యహగరగి అరెస్టైన తక్షణం పరీక్ష రద్దు నిర్ణయం తీసుకోవడం వెనుక రహస్యమేమిటన్నారు. నిజాయితీగా పరీక్ష రాసినవారికి న్యాయం చేయాలన్నారు. ఎస్ఐ స్కాంలో హోంమంత్రి అరగజ్ఞానేంద్ర పాత్ర ఉందని కాంగ్రెస్ నేత దినేశ్గుండూరావ్ ఆరోపించారు. రూ.3 లక్షలతో ఇంటి నుంచి పరారు పారిపోయే ముందు రూ.3 లక్షలు తీసుకుని వెళ్లిన దివ్య ఎక్కడా ఏటీఎంలో నగదు డ్రా చేయలేదు. ఇలా దొరకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. దివ్య కుటుంబ నేపథ్యం గమనిస్తే చాలా శ్రీమంతులు. అనేక స్కూళ్లు, కాలేజీలు, వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కలబురిగి చుట్టుపక్కల కోట్లాదిరూపాయల ఆస్తులు కలిగి ఉన్నారు. రాజకీయంగా మంచి పేరు కలిగి ఉంది. డబ్బు సంపాదనకు, పలుకుబడిని చాటుకోవడానికి ఎస్ఐ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిందని అనుమానాలున్నాయి. (చదవండి: ఎస్ఐ పరీక్షలో అక్రమాలు.. హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు) -
స్మార్ట్గా బంధిస్తోంది.. అధికమవుతున్న అనారోగ్య సమస్యలు
స్మార్ట్ ఫోన్ల వాడకం పతాకస్థాయికి చేరింది. మొబైల్ లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. అవసరానికి వాడుకోవడం మంచిదే. కానీ దానికి బానిసలవుతున్న వారు కెరీర్ను పాడు చేసుకుంటున్నారు. అపరిమిత వాడకం.. జీవితాలనే చిన్నాభిన్నం చేస్తోంది. వెన్నెముక, కంటి తదితర సమస్యల బారినపడి అనారోగ్యం పాలవుతున్నారు. సాక్షి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్మార్ట్ఫోన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజాగా ట్రాయ్ (టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) లెక్కల ప్రకారం ఉమ్మడి అనంతపురం జిల్లా చిరునామాతో సిమ్ కార్డులు తీసుకున్న 8,01,456 మంది స్మార్ట్ఫోన్లు వాడుతున్నట్లు తేలింది. ఏటా 10 నుంచి 15 శాతం వరకు మొబైల్ఫోన్ల సంఖ్య పెరుగుతోంది. ఇవి కాకుండా సాధారణ (కీప్యాడ్) ఫోన్లు మరో 10 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. నెలకు రూ.16 కోట్లు పైనే స్మార్ట్ఫోన్ వినియోగదారు నెలకు సగటున రూ.200 వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన వినియోగదారులు వివిధ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు నెలకు కనిష్టంగా రూ.16 కోట్లు, ఏడాదికి రూ.192 కోట్లకు పైగా చెల్లిస్తున్నారని తెలుస్తోంది. మిగతా సాధారణ ఫోన్లు కూడా కలిపితే ఏడాదికి రూ.250 కోట్లకు పైగా చార్జీల రూపంలో ఆయా కంపెనీలకు చెల్లిస్తున్నట్టు సమాచారం. సగటున 2 గంటల సమయం వృథా స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్న వారికి సగటున రోజుకు రెండు గంటల సమయం వృథా అవుతోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇలా ఏదో ఒక యాప్ నుంచి ప్రయోజనం లేకుండా కాలక్షేపం చేస్తున్నారు. ఎక్కువగా యువకులు, పనిచేసే వారు ఇలా చేయడం వల్ల ఉత్పాదక రంగంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. చాలామంది విద్యార్థులు చదువుల్లో వెనుకబడిపోతున్నారు. సెల్ఫోన్ కొనివ్వలేదని.. గత ఏడాది డిసెంబర్లో ఉరవకొండ పట్టణంలో రవినాయక్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇంతకీ కారణమేంటంటే తల్లిదండ్రులు తనకు సెల్ఫోన్ కొనివ్వలేదని. తన కొడుకు సెల్ఫోన్కు బానిస అయ్యాడని తల్లి కుళ్లాయమ్మ కన్నీరుమున్నీరవుతోంది. అలవాటు చేసినందుకు.. అనంతపురం నగరానికి చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి శ్రీనివాసులు, తనూష దంపతులకు మూడేళ్ల తేజాస్ అనే కుమారుడు ఉన్నాడు. అన్నం తినడం లేదని కుమారుడికి సెల్ఫోన్ అలవాటు చేశారు. చివరకు ఆ సెల్ఫోన్కు బానిసైన చిన్నారి.. ఏడీహెచ్డీ (అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్)కు గురయ్యాడు. ప్రస్తుతం కర్నూలులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ తాజాగా ప్రపంచ ఆరోగ్యసంస్థ సర్వే ప్రకారం ఎక్కువ సేపు మొబైల్ వాడుతున్న వారిలో టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ (మెడ నొప్పి) లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ సేపు మెడ వంచి మొబైల్ ఫోన్ మెసేజ్లు చదువుతున్నారు. గంటల తరబడి మెడ వంచి చూడటం వల్ల వెన్నెముక సమస్యలు కూడా వస్తున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా మితిమీరి మొబైల్ఫోన్కు అలవాటు పడిన చిన్నారులకు రెటీనా (కంటి) సమస్యలు వస్తున్నట్టు అధ్యయనాలు తేల్చాయి. అనర్థాలకు మూలం సెల్ఫోన్ అనేక అనర్థాలకు సెల్ఫోన్ వినియోగమే మూలం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సెల్ఫోన్, వాట్సాప్, ఇంటర్నెట్ వినియోగాన్ని కూడా ఒక బానిసత్వంగా పరిగణించింది. వీటి వల్ల అనేక అనర్థాలు వస్తున్నాయి. ప్రధానంగా నిద్ర వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటోంది. నిద్ర లేకపోవడంతో కోపతాపాలకు గురికావడం, ధ్యాస లోపించడం తోపాటు కంటి చూపు పూర్తిగా మందగిస్తోంది. చిన్న వయస్సులో నిషేధిత వెబ్సైట్లలోకి ప్రవేశించి పోర్న్ సైట్లకు బానిసలుగా మారిపోతున్నారు. సర్వ అనర్థాలకు కారణం సెల్ఫోన్ అని ప్రధానంగా చెప్పవచ్చు. –యండ్లూరి ప్రభాకర్, మానసిక వైద్య నిపుణుడు, అనంతపురం అధికమవుతున్న అనారోగ్య సమస్యలు (చదవండి: ప్రశాంత్ నీల్.. మన బంగారమే) -
పాఠశాలలో సెల్ఫోన్ లొల్లి.. విద్యార్థినిపై నింద.. చివరికి!
సాక్షి, వికారాబాద్: పాఠశాలలో సెల్ఫోన్ వినియోగించొద్దనే నిబంధనలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కొందరు ఉపాధ్యాయులు యథేచ్ఛగా వినియోగిస్తుండగా విద్యార్థులు సైతం బడికి తీసుకొస్తున్నారు. సెల్ఫోన్ తెచ్చిన వివాదంతో ఓ విద్యార్థిని కనిపించకుండా పోయింది. బాలిక ఫోన్ ఆపహరించిందని ఉపాధ్యాయులు నిందించడంతో మనోవేదనకు గురై అదృశ్యమైంది. ఆమె ఇల్లు విడిచి వెళ్లి నాలుగు రోజులు అవుతున్నా ఇప్పటి వరకు జాడ లేకుండా పోయింది. ఈ విషయమై బాధితురాలి తల్లిదండ్రులు తాండూరు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో నివాసం ఉంటున్న రమేష్ కూతురు సాయిపూర్ ప్రాంతంలోని నెంబర్–1 ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. పాఠశాలలో సెల్ఫోన్ వినియోగించొద్దనే నిబంధనలు ఉన్నా ఉపాధ్యాయులు, కొందరు విద్యార్థులు సైతం కొంతకాలంగా సెల్ఫోన్లు బడికి తీసుకొస్తున్నారు. ఈక్రమంలో గత నెల 25న ప్రభుత్వ నెంబర్– 1 పాఠశాలలో ఓ విద్యార్థి సెల్ఫోన్ తీసుకొచ్చింది. అది పోయింది. ఈ విషయమై బాలిక ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఉపాధ్యాయులు 9వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో విచారించారు. ఫోన్ ఎవరు తీసుకున్నా వెంటనే తిరిగి ఇచ్చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులు గాలించగా సెల్ఫోన్ బాత్రూంలో లభించింది. అంతటితో ఆగకుండా సెల్ఫోన్ను ఓ బాలిక దొంగిలించిందని ఆమెపై చోరీ నింద వేశారు. విద్యార్థుల ఎదుటే ఆమెకు చివాట్లు పెట్టారు. అనంతరం సదరు బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి చోరీ విషయం చెప్పారు. అనంతరం ఇంటికెళ్లిన బాలికను తల్లిదండ్రులు దండించారు. తాను దొంగతనం చేయలేదని బాలిక చెప్పినా వినిపించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆమె కోసం రెండు రోజుల పాటు కుటుంబసభ్యులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు.. ప్రభుత్వ నంబర్– 1 పాఠశాలలో జరిగిన సెల్ఫోన్ చోరీ వివాదం బాలిక కనిపించకుండా పోయేందుకు కారణమైంది. బాలిక తండ్రి రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ బాలిక మిస్సింగ్ కేసును త్వరగా ఛేదించాలని పట్టణ సీఐ రాజేందర్రెడ్డిని ఆదేశించారు. బాలిక ఎవరైనా తమ బంధువుల ఇంట్లో తలదాచుకుందా.. లేదా ఇతర ప్రాంతాలకు రైలులో ఏమైనా వెళ్లిందా అనే కోణాల్లోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
‘మొబైల్ సేవల లోపాలపై ఫోరంను ఆశ్రయించొచ్చు’
న్యూఢిల్లీ: టెలికాం కంపెనీల మొబైల్ సేవల్లో లోపాలపై కస్టమర్లు వినియోగదారుల ఫోరాలను నేరుగా ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సమస్య పరిష్కారానికి టెలిగ్రాఫ్ చట్టంలో ఉన్న మధ్యవర్తిత్వ సదుపాయం దీనికి అడ్డు కాబోదని న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రంనాథ్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. రెండింట్లో దేన్ని ఎంచుకోవాలన్నది కస్టమర్ ఇష్టమేనని చెప్పింది. ఉచిత సేవలు, కాంట్రాక్టులో భాగంగా కస్టమర్కు వ్యక్తిగతంగా అందించే సేవలు మాత్రమే ఇందుకు మినహాయింపు అని వివరించింది. అహ్మదాబాద్కు చెందిన ఓ కస్టమర్ తమపై నేరుగా ఫోరాన్ని ఆశ్రయించడాన్ని సవాలు చేస్తూ వొడాఫోన్–ఐడియా సెల్యూలర్ కంపెనీ చేసుకున్న అపీలుపై విచారణ సందర్భంగా కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. -
విద్యార్థుల ఫోన్లను తగలుబెట్టిన టీచర్లు!... మండిపడుతున్న నెటిజన్లు!
Students' Cellphones Seized Thrown Into Fire: విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టే నిమిత్తం టీచర్లు కచ్చితంగా కొన్ని కఠిన చర్యలు అమలు చేస్తుంటారు. అది వారి బావి భవిష్యత్తును దృష్టలో ఉంచుకుని కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తారు. అచ్చం అలానే ఇండోనేషియాలోని టీచర్లు విద్యార్థుల పట్ల కఠినమైన వైఖరిని అవలంభించారు. అయితే ఈ టీచర్లు విద్యార్థులు మాట వినకపోవటం వల్ల వాళ్లు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారో ఏమో తెలియదు గానీ విద్యార్థులను మాత్రం కాస్త కఠినంగానే శిక్షించారు. అసలు విషయంలోకెళ్తే...నిజానికి పాఠశాల్లో స్మార్ట్ ఫోన్లను కొన్ని గంటల సేపు నిషేధించడం లేదా స్టడీ అవర్స్ అయ్యేంతవరకు నిషేధిస్తారు. కానీ ఇండోనేషియాల బోర్డింగ్ స్కూల్లో స్మార్ట్ ఫోన్లు పూర్తిగా నిషేధించారో ఏమో తెలియదు గానీ విద్యార్థుల ఎంత చెప్పిన స్మార్ట్ ఫోన్లు తీసుకువస్తున్నారని టీచర్లు కోపంతో ఫోన్ల్నింటిని వారి వద్ద నుంచి తీసేసుకున్నారు. వాటిని వారి ముందే మంటల్లో వేసి కాల్చేశారు. ప్లీజ్ మేడం వద్దు అంటూ విద్యార్థులు అరుస్తున్నప్పటికీ వినిపించుకోకుండా టీచర్లు స్మార్ట్ ఫోన్లు మంటల్లో వేసేశారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు బహుశా టీచర్లు పదేపదే చెప్పినా విద్యార్థులు వినిపించుకోకపోవడంతో అలా చేసి ఉంటారని కొందరు, అయినా ఒకరి ఆస్తిని నాశనం చేసే హక్కు ఎవరికి లేదంటూ మరికొంతమంది మండిపడుతున్నారు. View this post on Instagram A post shared by Fakta Indo | Berita Indonesia (@fakta.indo) (చదవండి: మంచు పర్వత అధిరోహణ.. దూసుకొచ్చిన హిమపాతం!) -
మొబైల్ మింగేశాడు.. ఎండోస్కోపీతో..
Delhi: తీహార్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న ఖైదీ ఒకరు మొబైల్ ఫోన్ మింగేశాడు. జైలు అధికారులు తన వద్ద మొబైల్ ఉన్నట్లు గుర్తిస్తారన్న భయంతో ఖైదీ ఈ పని చేసినట్లు పోలీసులు తెలిపారు. ఖైదీని ఆస్పత్రికి తరలించి ఎండోస్కోపీ ద్వారా మొబైల్ను బయటకు తీశారు. జనవరి 5న ఈఘటన జరిగినట్లు జైళ్ల శాఖ ఐజీ సందీప్ గోయల్ చెప్పారు. చికిత్స పూర్తైన అనంతరం తిరిగి ఖైదీని జైలుకు తరలించామన్నారు. ఖైదీ ఆరోగ్యం స్థిరంగానే ఉందని చెప్పారు. చదవండి: (ఒకే కూర.. ఒకే స్వీటు.. మత పెద్దల సంచలన నిర్ణయం) -
APEPDCL ఎవరి ఇంటి మీటర్కు వారే రీడింగ్!
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి ఏపీ రాష్ట్ర ఇంధన శాఖ శ్రీకారం చుడుతోంది. ఎవరి ఇంటి మీటర్కు వారే రీడింగ్ తీసి బిల్లులు పొందేలా సాంకేతికతను అభివృద్ధి చేసింది. స్మార్ట్ ఫోన్తో కరెంటు బిల్లు కడుతున్నట్లుగానే అదే ఫోన్తో మీటర్ రీడింగ్ కూడా తీసేయొచ్చు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ బిల్లులు తీసే ప్రక్రియ స్పాట్ బిల్లింగ్ రీడర్ల ద్వారా జరుగుతోంది. కరోనా నేపథ్యంలో మీటర్ రీడింగ్ తీసేందుకు సిబ్బంది ఇళ్లకు రావడంపై కొందరు అభ్యంతరం తెలుపుతున్నారు. అయినా, మరో మార్గం లేకపోవడంతో వారే రీడింగ్ తీస్తున్నారు. గత రెండు వేవ్లలో కరోనా బారిన పడి పలువురు స్పాట్ బిల్లింగ్ రీడర్లు ప్రాణాలు కూడా కోల్పోయారు. మూడో వేవ్ వస్తున్న నేపధ్యంలో మళ్లీ ఇప్పుడు రీడింగ్పై ఆందోళన మొదలైంది. అంతేకాకుండా రీడింగ్ తీయడం కాస్త ఆలస్యమైతే స్లాబు మారి, బిల్లు ఎంత వస్తుందోననే భయం వినియోగదారుల్లో ఉంది. దీనికి పరిష్కారంగా ఎవరికి వారు మీటరు రీడింగ్ సకాలంలో తీసుకుని పంపితే ఈ–బిల్లు మీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) అందుబాటులోకి తెచ్చింది. దీనిని మిగతా రెండు డిస్కంలు ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్లు కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రీడింగ్ ఇలా.. ఈపీడీసీఎల్ అనుసరిస్తున్న విధానం ప్రకారం.. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈస్టర్న్ పవర్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. కొత్త వారైతే పేరు, చిరునామా, సెల్ ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ నమోదు చేయాలి. ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి. 16 నంబర్ల విద్యుత్తు సర్వీస్ మీటరును నమోదు చేయాలి. ఆ వెంటనే సెల్ఫోన్కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీటరు ఐకాన్ రిజిస్ట్టర్ సర్వీస్ నంబర్పై క్లిక్ చేసి కెమెరా ఐకాన్ ద్వారా మీటర్ రీడింగ్ స్కాన్ చేయాలి. దానిని సబ్మిట్ చేస్తే అధికారి నిర్ధారణ చేసిన తరువాత మొబైల్కు సమాచారం వస్తుంది. ఈ యాప్లోనే బకాయిలు, బిల్లు కట్టే విధానం, వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. అందరి క్షేమం కోరి వినియోగదారులకు ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నాం. విద్యుత్ అంతరాయాల షెడ్యూల్ను ముందే తెలుసుకునేలా రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం (ఆర్టీఎఫ్ఎంఎస్)ను కూడా మా డిస్కం అభివృద్ధి చేసింది. వినియోగదారులు, సిబ్బంది క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటువంటి మీటర్కు రీడింగ్ వెసులుబాటు కల్పించాం. దీనివల్ల భద్రతతో పాటు స్లాబులు మారకుండా ఉంటాయి. –కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ -
ఫోన్లో అసభ్యకరమైన మెసేజ్లు.. కానీ అసలు విషయం అది కాదు..
కొన్ని రోజులుగా కూతురు ప్రతిమ (పేరు మార్చడమైనది)ను చూస్తుంటే లత మనసు తల్లడిల్లిపోతోంది. సమయానికి తినడం లేదు, నిద్రపోవడం లేదు. తనలో తను దేనికోసమో మధనపడుతోంది. కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పటికే తను చాలాసార్లు చూసింది. అదేమని అడిగితే.. ‘ఏమీ లేదు’ అంటుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న కూతురి విషయం భర్తకు చెప్పింది. తండ్రి గట్టిగా నిలదీసేసరికి ‘ఎవరో ఆకతాయిలు తనకు అసభ్యకరమైన మెసేజ్లు పంపి, వేధిస్తున్నార’ని చెప్పింది. బాధపడిన పేరెంట్స్ ఈ విషయం ఇంతటితో వదిలేస్తే కూతురు భవిష్యత్తుకు ప్రమాదం అవుతుందని ప్రతిమ వద్దులే అంటున్నా వినకుండా ఆమెను తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్లారు కంప్లైంట్ ఇవ్వడానికి. వారు చెప్పిందంతా విన్నాక, ప్రతిమను అడిగారు పోలీసులు. భయం భయంగా చూస్తున్న ప్రతిమకు ధైర్యం చెప్పి, ఒంటరిగా ఆమెతో మాట్లాడి అసలు విషయాలు రాబట్టారు. ప్రతిమకు అసలు ఏ ఆకతాయిలూ వేధింపుల మెసేజ్లు పంపలేదు. రోజులో ఎక్కువ సమయం ఫోన్లోనే గడపడం వల్ల మానసిక ఆందోళనకు గురైంది. వేళకు తిండి, నిద్ర లేకపోవడంతో ఆమె శారీరక ఆరోగ్యంపైనా ప్రభావం పడింది. ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందించడం, విమర్శకు తట్టుకోలేకపోవడం .. వంటి దశకు చేరుకుంది. ఇలా ప్రతిమలో ఫోన్ కారణంగా మానసికంగా వచ్చిన మార్పులను అక్కడి కౌన్సిలర్ ఒక్కోటి ముందుంచారు. అలవాట్లు తీవ్రమైతే అవి వ్యసనానికి ఎలా దారి తీస్తాయో చెబుతూ ఎక్కడ తన నుంచి తల్లీదండ్రి ఫోన్ లాక్కుంటారో అని భయపడి ‘ఆకతాయిల నుంచి మెసేజ్’ అంటూ అబద్ధం చెప్పింది. నిజమేంటో తెలిసి కూతురు ఫోన్ వ్యసనాన్ని దూరం చేయడానికి తల్లీదండ్రి సిద్ధమయ్యారు. చదవండి: చిరుత దళం.. వాళ్లు చంపాలని. వీరు కాపాడాలని! వ్యసనంగా మారిన అలవాటు ఇది కేవలం ప్రతిమ ఒక్క విషయమే కాదు, మనలో చాలా మంది రకరకాల కారణాల వల్ల సోషల్ మీడియాకు వ్యసనపరులుగా మారుతున్నారు. ఏది సరైనదో తెలుసుకునే విచక్షణను కోల్పోతున్నారు. డిజిటల్ అలవాట్లకు దూరం దూరం ఈ రోజుల్లో సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండటం అనేది అసాధ్యమైన విషయంగా అంతా చెబుతారు. కానీ, మన మానసిక ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలంటే డిజిటల్ అలవాట్లను నియంత్రించుకోవడం అత్యవసరం. ఇది నూతన సంవత్సరానికి తీసుకోబోయే సరైన, తప్పనిసరి నిర్ణయం కూడా. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, అలవాట్లను నియంత్రించుకునే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి.. తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. సోషల్ మీడియాకు సాధ్యమైనంత దూరంగా ఉండటం వల్ల మనకు రోజులో ఎక్కువ ఖాళీ సమయం లభిస్తుంది. తక్కువ ఆందోళన చెందుతాం. ఉదయం, పగటి వేళల్లో మన పనితీరు పెరుగుతుంది. నేర్చుకునే విషయాల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుకనే సోషల్ మీడియాను ఒక వ్యసనంగా కాకుండా వార్తావాహికగా ఉపయోగించుకోవాలి. ‘విష’యాలు.. ► సామాజిక మాధ్యమాల ద్వారా విషయాలు తెలుస్తుంటాయి అనుకుంటే బాగానే ఉంటుంది. కానీ, మనలో విషం నింపే నెగిటివిటీ లాంటి వ్యసనం కూడా ఉంటుంది. ►మీరు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్నామనే విషయాన్ని ముందు మీ చుట్టూ ఉన్నవారికి చెప్పండి. ఈ మాట వల్ల తిరిగి మీ చుట్టూ ఉన్నవారు ప్రశ్నిస్తారనే ఆలోచనతోనైనా సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. ►మీ ఫోన్లో అనవసర యాప్లను తొలగించండి. అలాగే, అనవసరమైన నోటిఫికేషన్స్ను వదిలే వెబ్సైట్లను బ్లాక్ చేయండి. ►సామాజిక మాధ్యమం నుంచి దూరంగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయంగా ఏం పనులు చేయాలో ప్లాన్ చేయండి. ►మీకే కాదు మీ ఫోన్ కు కూడా విశ్రాంతి ఇవ్వండి. అంటే రోజులో 8 నుంచి 10 గంటలైనా ఫోన్కి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకోండి. ►ఫోన్లో కాకుండా బయట అలారం గడియారాన్ని ఏర్పాటు చేసుకోండి. దీని వల్ల నిద్రలేస్తూనే ఫోన్ చూసే అలవాటు తప్పుతుంది. ►రోజులో కొంత సమయం ఫోన్ని ఇంట్లో ఉంచి, పచ్చని పచ్చికలో కాసేపు తిరగండి. ఇలా దినసరి చర్యలో భాగంగా సామాజిక మాధ్యమాల్లో ఉండే సమయాన్ని బయటి పనుల్లో గడిపేలా ప్లాన్ చేయండి. మరిన్ని డి–అడిక్షన్ చిట్కాలు ►ఫోన్ను ఛార్జ్ చేసే పరికరాన్ని బెడ్రూమ్ లోపల కాకుండా హాలులో అమర్చండి. ►సోషల్ మీడియా నోటిఫికేషన్స్ను ఫోన్ నుంచి కాకుండా ల్యాప్ టాప్ లేదా డెస్క్టాప్లో చూడండి. ►హోమ్ స్క్రీన్లో ముఖ్యమైన యాప్లను మాత్రమే ఉంచండి. ►గ్రే స్కేల్ మోడ్ను ఉపయోగించండి. ►మీరు ఎంతసేపు స్క్రీన్ సమయాన్ని ఉపయోగించాలో మీ ఆండ్రాయిడ్ ఫోన్ మానిటర్ సెట్టింగ్స్ను ముందే సెట్ చేసుకోవచ్చు. ఇది మిమ్మల్ని అలవాటు నుంచి నియంత్రించడానికి ఉపకరిస్తుంది. -అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
గేమ్స్, చాటింగ్.. తల్లిదండ్రులు మందలించడంతో..
సాక్షి, నిజాంపేట్: మొబైల్ ఫోన్ వాడవద్దని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన బాలుడు భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ బండారి లేఅవుట్లో నివాసముండే రామకృష్ణ, దీప్తీల కుమారుడు వినీత్ (14) విజ్ఞాన్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. చదవండి: (Mandya MP Sumalatha: ఎంపీ సోదరికి వంచన) ఇటీవల ఫోన్లో ఎక్కువగా గేమ్స్, చాటింగ్ చేస్తుండటంతో గురువారం ఉదయం తల్లిదండ్రులు కుమారుడిని మందలించారు. దీంతో అపార్ట్మెంట్ పైకి వెళ్లాడు. రోజు మాదిరిగానే వాకింగ్, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడని తల్లిదండ్రులు భావించారు. ఈ క్రమంలో 9.45 గంటల సమయంలో అపార్ట్మెంట్పై ఉన్న ఓవర్హెడ్ ట్యాంక్ మీద నుండి బాలుడు వినీత్ కిందకు దూకడంతో తలకు తీవ్రగాయమైంది. బాలుడిని వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్ట్మార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (మొదటి భర్తతో సాన్నిహిత్యం.. తనకు పుట్టలేదనే అనుమానంతో..) -
థ్యాంక్యూ టీటీడీ.. మహిళా భక్తురాలు ఈ–మెయిల్
తిరుమల: టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ శ్రీవారి భక్తురాలు శుక్రవారం ఈఓ జవహర్రెడ్డికి ఈ–మెయిల్ పంపారు. వివరాలు.. తెలంగాణ, హైదరాబాద్లోని మల్కాజ్గిరికి చెందిన నవత ఈనెల 6 తేదీ శ్రీవారి దర్శనానికి వచ్చితిరుమలలో మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారు. వెంటనే విజిలెన్స్ కంట్రోల్ రూమ్లో ఫిర్యాదు చేశారు. స్పందించి సిబ్బంది వెంటనే సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేసి గంటలోపు ఆమె మొబైల్ ఫోన్ను గుర్తించి అప్పగించారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. తాను ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పటి నుంచి ఫోన్ తనకు అప్పగించేంత వరకు విజిలెన్స్ కంట్రోల్ రూం సిబ్బంది ఎంతో గౌరవంగా, స్నేహ పూర్వకంగా వ్యవహరించారని అభినందిస్తూ శుక్రవారం ఈఓ జవహర్రెడ్డికి ఈ–మెయిల్ పంపారు. -
ఫోన్ నాది.. కాదు నాది ఇచ్చేయ్: వైరలవుతోన్న క్యూట్ వీడియో
కోతి చేష్టలు కొన్నిసార్లు విచిత్రంగా ఉంటాయి. అవి చేసే తింగరి పనులు అదరిని నవ్విస్తుంటాయి. ఇంటి ఆవరణలో, పైన ఏ వస్తువులు కనిపించిన వాటిని చెల్లాచెదురుగా పడవేస్తాయి. ఇక వాటికి ఏమైనా దొరికితే వాటిని పట్టుకొని నానా హంగామా సృష్టిస్తాయి. ఇక కోతులు డబ్బులు, ఫోన్లను పట్టుకొని పారిపోయిన సంఘటనలు చాలానే చూశాం. తాజాగా ఓ కోతికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది పాత వీడియో అయినప్పటికీ మరోసారి వైరల్గా మారింది. చదవండి: హ్యాట్సాఫ్ మేడమ్!.. యువకుడిని భుజాలపై మోసుకెళ్లిన మహిళా పోలీస్ ఈ వీడియోలో ఒక మంచంపై చిన్నారి మొబైల్తో ఆడుకుంటుంది. అక్కడికి వచ్చిన కోతి పాప పక్కనే కూర్చుంటుంది. వెంటనే చిన్నారి చేతిలోని ఫోన్కు లాక్కొని దాన్ని పరీక్షించి చూస్తుంది. కొద్దిసేపు కోతిని పరీక్షించిన చిన్నారి ఆ ఫోన్ను తిరిగి లాక్కుంటుంది. వెంటనే మళ్లీ పాప దగ్గరి నుంచి కోతి ఫోన్ లాక్కుంటుంది. ఇలా ఈ వీడియో చూస్తుంటే మొబైల్ నాదంటే నాది అని లాక్కుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింటా వైరలవుతూ నెజిజన్లను నవ్విస్తోంది. చదవండి: అద్భుతమైన ఫోటో.. రాష్ట్రపతిని ఆశీర్వదించిన 102 ఏళ్ల టీచర్ View this post on Instagram A post shared by Jagadeesh Madineni (@jagadeeshmadinenimadineni) -
ఏకంగా మొబైల్ ఫోన్ మింగేశాడు.. 6 నెలల తర్వాత ఏమైందో తెలుసా?
సాధారణంగా చిన్నపిల్లలు పాకుతూ నాణేలను, చిన్న చిన్న వస్తువులను మింగడం తెలిసిన విషయమే. అయితే ఇటీవల కాలంలో కొంతమంది మరీ వింత వింతగా ఏది పడితే అది తినేస్తున్నారు. ఇసుక, మట్టి, వెంట్రుకలు, రాళ్లను కరకరా నమిలేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా మొబైల్ ఫోన్ మింగేసాడు. ఈ విచిత్ర సంఘటన ఈజిప్ట్ దేశంలో చోటుచేసుకుంది. తీవ్రమైన కడుపు నొప్పితో ఓ వ్యక్తి ఇటీవల ఆసుపత్రిలో చేరాడు. అయితే వైద్యులు అతని కడుపుని ఎక్క్రే తీసి చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.పేషెండ్ కడుపులో మొబైల్ ఫోన్ కనిపించడంతో వైద్యులకు మైండ్ బ్లాంక్ అయ్యింది. చదవండి: వైరల్: అభివృద్ధి అన్నందుకు యువకుడి చెంప చెల్లుమనిపించిన ఎమ్మెల్యే కాగా ఆరు నెలల క్రితం అతను పొరపాటున ఫోన్ను మింగిన్నట్లు వైద్యులకు తెలిసింది. అయితే కడపులో నుంచి ఫోన్ సహజంగా బయటకు వస్తుందని ఆ యువకుడు భావించాడు కానీ అది జరగలేదు. మొబైల్ కడుపులో ఇరుక్కొని ఆహారం జీర్ణం కాకుండా అడ్డుకుంది. దీంతో తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఈజిప్టులోని అస్వాన్ నగరంలోని ఆసుపత్రిలో అతనికి ఆపరేషన్ చేసి మొబైల్ను బయటకు తీశారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. మింగేసిన ఫోన్ మూడు భాగాలుగా విడిపోగా.. బ్యాటరీ అతని కడుపులో పేలిపోతుందని వైద్యులు కంగారు పడ్డారు. కానీ చివరికి ఆపరేషన్ సక్సెస్ అయి సురక్షితంగా బయటపట్టాడు. చదవండి: వైరల్: ఒక్క క్షణం ఆలస్యమైతే ఆ గర్భిణీ పరిస్థితి ఏమయ్యేదో ! -
ఆంధ్రప్రదేశ్లో సైబర్ సేఫ్ కియోస్క్లు.. ఇక ఫోన్లు సురక్షితం
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని ఓ వ్యాపారవేత్త మొబైల్ ఫోన్కు ఏదో లింక్ వచ్చింది.. ఆయన దాన్ని క్లిక్ చేశారు. అందులో ఏమీ లేదు కానీ ఆయనకు తెలియకుండానే మొబైల్ ఫోన్లో మాల్వేర్ చేరింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన ఆన్లైన్ బ్యాంక్ ఖాతాల నుంచి ఎవరో నగదు స్వాహా చేసేశారు. ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన ఆ వ్యాపారవేత్త లబోదిబోమన్నారు. ఇలా మొబైల్ ఫోన్ను సాధనంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి నేరాలకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర పోలీసు శాఖ కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలో సైబర్ కవచ్ పేరిట 50 సైబర్ సేఫ్ కియోస్క్ల ఏర్పాటుకు నిర్ణయించింది. కేసుల కంటే కట్టడే ముఖ్యం మన దైనందిన జీవితంలో మొబైల్ ఫోన్ ఓ అత్యవసర వస్తువుగా మారింది. సంభాషణలు, సందేశాల నుంచి బ్యాంకింగ్, ఈమెయిల్స్, ఇతర లావాదేవీల వరకు అన్నిటికీ మొబైల్ ఫోన్ను వాడాల్సిందే. ఇదే సమయంలో వేధింపురాయుళ్లు, సైబర్, ఆర్థిక నేరగాళ్ల మోసాలకు సాధనంగా కూడా మారుతోంది. వివిధ వైరస్లు, మాల్వేర్, తదితరాల నుంచి మన ఫోన్లకు ముప్పు పొంచి ఉంది. దేశ, విదేశాల నుంచి వివిధ లింక్లు, మెయిళ్లు, వీడియోలు, ప్రకటనలు.. ఇలా పలు రకాలుగా వైరస్లను సైబర్ నేరగాళ్లు మొబైల్ ఫోన్లలోకి పంపుతున్నారు. అనంతరం సైబర్, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. మోసపోయాక కేసులు నమోదు చేయడం కంటే ముందుగానే మొబైల్ ఫోన్ వాడకందారులకు అవగాహన కల్పించడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. తమ మొబైల్ ఫోన్లో ప్రమాదకర వైరస్, మాల్వేర్ ఉన్నాయో, లేదో కూడా 90 శాతం మంది స్మార్ట్ఫోన్ వాడకందారులు గుర్తించలేరు. కాబట్టి వారి ఫోన్లలో ఇవి ఉన్నాయో, లేదో తెలుసుకోవడానికి ‘సైబర్ సేఫ్ కియోస్క్లు’ ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొన్ని రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో వీటికి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. సైబర్ సేఫ్ కియోస్క్ల్లో సేవలన్నీ ఉచితం.. త్వరలో రాష్ట్రంలో 50 సైబర్ సేఫ్ కియోస్క్లను పోలీసు శాఖ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే గుజరాత్లోని నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ నుంచి వీటిని కొనుగోలు చేసి అన్ని జిల్లాలకు పంపింది. 18 జిల్లా, అర్బన్ పోలీసు ప్రధాన కార్యాలయాల్లో, 18 దిశ పోలీస్స్టేషన్లలో, ప్రముఖ బస్స్టేషన్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లో మరో 14 కియోస్క్లను ఏర్పాటు చేస్తారు. ఆ కియోస్క్ల డాష్బోర్డ్లను ఎలా నిర్వహించాలో కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి కియోస్క్కు అడ్మిన్గా నియమిస్తారు. ఎవరికైనా తమ ఫోన్లో ప్రమాదకర వైరస్ చేరిందని సందేహం కలిగితే ఆ కియోస్క్కు తీసుకువెళ్లి పరీక్షించుకోవచ్చు. కియోస్క్ల్లో ఆ స్మార్ట్ ఫోన్లను స్కాన్ చేసి పరీక్షిస్తారు. వాటిలో ప్రమాదకర వైరస్లు, మాల్వేర్, సాఫ్ట్వేర్లు ఉంటే తొలగిస్తారు. ఈ సేవలన్నీ కూడా ఉచితంగానే అందిస్తారు. -
కోపంతో చేతిలోని ఫోన్ విసిరిన మంత్రి కొప్పుల ఈశ్వర్
హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని 21వ వార్డులో సోమవారం దళితబంధు సర్వే పర్యవేక్షణకు వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓ అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మంత్రుల కన్నా మీరే బిజీగా ఉంటున్నారా..? మంత్రి రాకపై ముందే సమాచారం ఇచ్చినా.. కనీస ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటారా’అని అసహనం వ్యక్తం చేశారు. ముందుగానే సమాచారం ఇచ్చి, దళితబంధు గురించి మాట్లాడడానికి వస్తున్నానని తెలిపినా.. పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. అధికారులు ఇచ్చిన వివరణ సరిగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, ఏర్పాట్లు సరిగా చేయలేదని ఒకవైపు కొప్పుల నిలదీస్తుండగానే ఆ అధికారి మంత్రి మాటలను పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతుండడంతో కొప్పుల మరింత సీరియస్ అయ్యారు. చేతిలోని సెల్ఫోన్ను విసిరి సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మంత్రి కొప్పుల ఒక్కసారిగా అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేతిలోని ఫోన్ విసిరివేయడం చర్చనీయాంశంగా మారింది. (చదవండి: ఉద్రిక్తతకు దారితీసిన ‘జెండా గద్దె పంచాయితీ’) (చదవండి: ‘దళితబంధు’ను అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకుంటా) -
సార్.. నా రెండో భార్య వల్లే మొదటి భార్యతో అలా..!
‘ఆయనకి ఇద్దరు’ అనే మాట కొందరు మగవారి జీవితాల్లో రహస్య వ్యవహారమే కానీ.. మొదటి భార్య అనుమతితో రెండో వివాహం చాలాచోట్ల సమ్మతమే. అయితే అతడికి సమస్యంతా రెండో భార్యతోనే వచ్చింది. సహజంగానే ఆడవారికి సవతిపోరు పడదు. అందుకే తెలివిగా వీలుచిక్కినప్పుడల్లా అతడి ఫోన్ నుంచి సీక్రెట్గా మొదటి భార్య(సవతి)తో అతడిలానే చాట్ చేసి.. కథను విడాకులు దాకా లాక్కొచ్చింది రెండోభార్య. విషయం తెలుసుకున్న అతగాడు లబోదిబోమంటూ కోర్టుకెక్కాడు. రెండో భార్యపై కేసు వేశాడు. నష్టపరిహారంతో పాటు జైలు శిక్ష కూడా పడేలా చేశాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: ఫేస్బుక్లో పరిచయం.. వాట్సాప్లో మరింత క్లోజ్, చివరికి! అసలు ఏం జరిగిందంటే.. ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు. వేర్వేరు ఇళ్లల్లో ఉంచాడు. ఇద్దరినీ చక్కగానే చూసుకుంటున్నాడు. అయితే రెండో భార్యకి కొంచెం పొజెసివ్నెస్ ఎక్కువ. తన భర్త తన సవతికి దగ్గరవ్వడం ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. దాంతో ఆమె అతడికి తెలియకుండా, అతడి ఫోన్ రహస్యంగా తీసుకుని మొదటి భార్యతో అతడు చేసిన చాటింగ్ మొత్తం చదివేది. అతడి ఈ–మెయిల్స్ కూడా తెరిచి చూసేది. కొన్ని మెసేజులకు కోపం తెప్పించేలా రిప్లైలు ఇచ్చేది. దాంతో మొదటి భార్యకు అతడికి చాలా మనస్పర్థలు వచ్చాయి. ఆ గొడవలు కాస్త ముదిరి విడాకులు కూడా అయ్యాయి. దాంతో అతడు మానసికంగా కుంగిపోయాడు. అంతటికీ కారణం తన రెండో భార్యేనంటూ కోర్టును ఆశ్రయించాడు. చదవండి: పబ్–జీ ఖర్చు 10 లక్షలు తన రెండో భార్య కారణంగానే తన మొదటి భార్యతో విడిపోవాల్సి వచ్చిందని, అందుకుగాను తాను ఆర్థికంగా చాలా నష్టపోయానని, చివరికి కోర్టు వ్యవహారాల్లో తలమునకలై ఉద్యోగం కూడా పోగొట్టుకున్నానని.. అన్ని ఖర్చుల నిమిత్తం పరిహారం ఇప్పించమని జడ్జిని దీనంగా వేడుకున్నాడు. రాస్ అల్ ఖైమా సివిల్ కోర్టు న్యాయమూర్తి ఈ కేసుని పరిశీలించి.. భర్త ఫోన్లలో అతడికి తెలియకుండా మెసేజులు చదవడమంటే అతడి ప్రైవసీకి భంగం కలిగించే చర్యేనని తేల్చి.. నష్ట పరిహారంగా 8,000 దిర్హామ్లు అంటే సుమారు లక్ష అరవై నాలుగు వేలు చెల్లించాలని తీర్పు ఇచ్చారు. అంతే కాకుండా కోర్టు ఖర్చులకు మరో రూ.42 వేలు చెల్లించడంతో పాటు ఆమెకు ఒక నెల రోజులు జైలు శిక్ష కూడా విధించారు. చదవండి: చున్నీ బిగించి చంపి.. లోయలో తోసి.. -
మొబైల్ ఫోన్ను ఎత్తుకుపోయిన చిలుక.. ఫన్నీవీడియో
సాధారణంగా మనలో చాలా మందికి ఫోటోలు, సెల్ఫీవీడియోలు తీసుకోవడం అంటే మహసరదా. దీనికోసం ప్రత్యేకంగా తయారై మరీ ఫోటోలు దిగుతుంటారు. ఈ క్రమంలో కొందరు ఫోటోలు దిగడానికి ప్రత్యేకమైన ప్రదేశాలకు వేళ్తుంటే.. మరికొంత మంది తమ ఇంట్లో లేదా మిద్దేమీదకో వెళ్లి ఫోటోలు దిగుతుంటారు. ఈ క్రమంలో ఒక్కొసారి కొన్ని ఫన్నీ సంఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. మన ఇంట్లోని తినే వస్తువులను కోతులు ఎత్తుకుపోవడం మనకు తెలిసిందే. ఇక్కడో పక్షి ఏకంగా మొబైల్ ఫోన్ను ఎత్తుకుపోయింది. ప్రస్తుతం ఈ ఫన్నీవీడియో సోషల్ మీడియలో చక్కర్లు కొడుతుంది. దీనిలో ఒక వ్యక్తి ఇంట్లో మిద్దేమీద తన మొబైల్ ఫోన్ను చేతిలో పట్టుకుని ఉన్నాడు. ఫోటోలు దిగుతున్నాడో.. మరేంటోకానీ.. కాసేపటికి తన ఫోన్ను కాస్త పక్కన ఉన్న పిట్ట గోడ మీద ఉంచాడు. అయితే, ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఒక రామచిలుక వచ్చింది. ఆ ఫోన్ను తినేపదార్థం అనుకుందో.. మరేం అనుకుందో గానీ దాన్ని తన కాళ్ల మధ్యలో పట్టుకొని తుర్రున గాలిలో ఎగిరింది. ఆ వ్యక్తి , వెంటనే ఏదో అలజడి కావడంతో తన ఫోన్ కోసం అటూ ఇటూ చూశాడు. తన మొబైల్ ఫోన్ను ఒక రామ చిలుక తన కాళ్లలో అదిమి పట్టుకుని గాల్లో ఎగిరిపోతుండటాన్ని గమనించాడు. వెంటనే దాన్ని పట్టుకొవడానికి ప్రయత్నించాడు. అయినప్పటికి అది చిక్కలేదు. మొబైల్ ఫోన్ వీడియో ఆన్లోనే ఉండటంతో అది ఆకాశంలో వెళ్తున్నప్పుడు అక్కడి ఇళ్లు, నగరాలు అన్ని దాటుకుంటు ప్రయాణిస్తున్న దృష్యాలు అందులో రికార్డు అయ్యాయి. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. దీన్ని ఫ్రెడ్జ్ స్కూల్జ్ అనే యూజర్ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘భలే చిలుక.. పాపం సెల్ఫీ దిగుతామని తీసుకుందేమో..’, ‘ఇది నిజమైన వీడియో కాదు..’, ‘బరువైన సెల్ఫోన్ను చిలుక ఎలా పట్టుకుందబ్బా.. ’, ‘కింద పడకుండా ఎంత బాగా పట్టుకుంది..’, ‘ఆ ఫోన్ మళ్లి మీకు ఎక్కడ దొరికింది’ ?, అంటూ కామెంట్లు పెడుతున్నారు. Parrot takes the phone on a fantastic trip. 😳🤯😂🦜 pic.twitter.com/Yjt9IGc124 — Fred Schultz (@fred035schultz) August 24, 2021 చదవండి: Anaconda: రోడ్డు దాటుతున్న భారీ అనకొండ.. షాకింగ్ వీడియో.. -
మొబైల్ ఫోన్ ఎగుమతులు మూడు రెట్లు
న్యూఢిల్లీ: భారత్ మొబైల్ ఫోన్ ఎగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (2021–22, ఏప్రిల్–జూన్)లో మూడు రెట్లు పెరిగింది. రూ.4,300 కోట్లుగా నమోదయ్యింది. 2020 ఇదే కాలంలో ఎగుమతుల విలువ దాదాపు రూ.1,300 కోట్లు. ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ఒక నివేదికలో ఈ విషయాలను తెలిపింది. ఈ రంగంలో రికవరీ, వృద్ధి అంశాలను తాజా గణాంకాలు సూచిస్తున్నట్లు నివేదిక వివరించింది. నివేదికలో ముఖ్యాంశాలు ►మొబైల్ హ్యాండ్సెట్ తయారీ పరిశ్రమ నిరంతరం వృద్ధి పథంలో కొనసాగుతోంది. కోవిడ్–19 సెకండ్వేవ్లోనూ ఫలితాలను నమోదుచేసుకుంది. ►ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగుమతులు సైతం మొదటి త్రైమాసికంలో 100 శాతం పెరిగి విలువలో రూ.20,000 కోట్లను అధిగమించింది. ►ఇక ఇదే కాలంలో మొబైల్ ఫోన్ల దిగుమతుల విలువ భారీగా తగ్గి రూ.3,100 కోట్ల నుంచి రూ.600 కోట్లకు పతనమైంది. 2014–15 అల్టైమ్ కనిష్ట స్థాయి ఇది. ►కాగా ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్ల దిగుమతుల విలువ మాత్రం మొదటి త్రైమాసికంలో 50 శాతంపైగా పెరిగి రూ.6,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్లకు ఎగసింది. మరింత పురోగతికి చర్యలు... మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగంలో మరింత పురోగతి సాధించడానికి కృషి చేస్తున్నాం. ఇందుకు తగిన విధాన కల్పనకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. భారీగా ఈ విభాగాల్లో ఉత్పత్తులను పెంచాలన్నది ప్రధాన లక్ష్యం. ప్రపంచ దేశాల్లో అవసరాల్లో 25 శాతం భారత్ వాటా కావాలన్నది సంకల్పం. – పంకజ్ మొహింద్రూ, ఐసీఈఏ చైర్మన్ చదవండి : ఏడాదిలో మరింత పెరగనున్న ఇళ్ల ధరలు! -
సాయం చేయబోతే..ఫోన్ మాయం
సాక్షి, కల్లూరు (ఖమ్మం): బైక్పై నుంచి పడిన వ్యక్తిని పైకి లేపుదామని సాయం చేయబోయిన హెచ్ఎం ఫోన్ అపహరణకు గురైంది. నారాయణపురంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వంగా రామారావు పెనుబల్లి నుంచి వచ్చి మంగళవారం కల్లూరులోని ఎన్నెస్పీ బస్టాప్ వద్ద దిగారు. అకస్మాత్తుగా బైక్పై వచ్చిన ఓ యువకుడు అక్కడే కిందపడ్డాడు. ‘అబ్బా..లేపండి సార్’ అంటూ కోరడంతో సాయం చేస్తుండగా..అంతలోనే మరో వ్యక్తి వచ్చి చేరాడు. అతడిని పైకిలేపుతున్నట్లు నటిస్తూ రామారావు చొక్కా జేబులో ఉన్న రూ.30వేల ఫోన్ను తస్కరించి..అంతకుముందే పడిన యువకుడితో కలిసి పరారయ్యారు. కాసేపటి తర్వాత ఈయన తేరుకుని గుర్తించి..ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే..సాంకేతిక లోపంతో 15రోజులుగా సీసీ కెమెరాలు పని చేయట్లేదని వారు తెలపడంతో..ఉసూరుమంటూ నారాయణపురంలో పాఠశాల విధులకు వెళ్లిపోయారు. చదవండి: సైబరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ, ఆర్టీసీ ఎండీగా నియామకం -
పిల్లల చేతుల్లో ఫోన్లు.. ఏం చూస్తున్నారో ఇలా తెలుసుకోండి!
సాక్షి, మహబూబ్నగర్ : కోవిడ్ మహమ్మారికి అడ్డుకట్ట వేసే క్రమంలో పాఠశాలల్లో ప్రత్యేక్ష బోధనకు అవకాశం లేని పరిస్థితి. అన్ని తరగతుల బోధన ఆన్లౌన్లోనే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తమ పిల్లలు ఒకప్పుడు మొబైల్ పట్టుకుంటే తప్పు అని చెప్పే తల్లిదండ్రులే.. నేడు ఫోన్ చూడక తప్పదూ అనే ధోరణి నెలకొంది. ఆన్లైన్ తరగతుల పేరుతో విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫోన్లోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం ఫోన్లు వారి చేతికి ఇచ్చి వారి పనులు వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు ఏం చూస్తున్నారు?ఏం విటున్నారు? అనే అంశంపై పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫోన్లో ఉండే నిషేధిత వీడియోలు, అపరిచితులతో పరిచయాలు తదితర అంశాలు విద్యార్థుల మానసిక స్థితి, భవిష్యత్తు పరిణామాలపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పలు చర్యలు తీసుకుంటే చిన్నారుల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెల్ఫోన్ వినియోగంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఆన్లైన్ తరగతులపై పర్యవేక్షణ.. ప్రభుత్వ పాఠశాలల్లో చాలా వరకు రికార్డు చేయబడిన వీడియోలు టీసాట్తో పాటు నిపుణ వంటి తదితర వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రతి రోజు చూసే విధంగా వెసలుబాటు ఉంటుంది. ఇందుకు సంబందించి షెడ్యూల్ను సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు వాట్సాప్, మెసేజ్ల రూపంలో పంపిస్తారు. వాటిని అనుసరించి తరగతులు వినాల్సి వస్తుంది. హోంవర్కు, వర్కుషీట్లు వంటివి పూర్తి చేయాలని సూచిస్తుంటారు. ఇక ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు చాలా వరకు లైవ్గా, యాప్ల ద్వారా తరగతులు బోధిస్తున్నారు. అయితే, కొందరు తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడంతో విద్యార్థులు ఏం చూస్తున్నారని పట్టించుకోవడం లేదు. కరోనా నేపథ్యంలో తరగతులన్నీ ఆన్లైన్లోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మక్తల్లో ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థికి తండ్రి ఆన్లైన్ తరగతుల కోసం సెల్ఫోన్ కొనిచ్చాడు. పాఠాలు విన్న తర్వాత కూడా మొబైల్ చేతిలో ఉండడంతో పలు గేమ్స్కు ఆడడం మొదలెట్టాడు. ఎక్కువ సేపు ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని తల్లిదండ్రులు సెల్ఫోన్ తీసుకోవడంతో సదరు విద్యార్థి మనస్థాపానికి గురయ్యాడు. శనివారం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తల్లిదండ్రులు అందర్నీ ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేస్తుంది. పరిశీలించాల్సినవి ఇవీ.. ► పిల్లలు ఆన్లైన్ తరగతుల్లో సూచించినవే వింటున్నారా లేదా ఇతర అంశాల జోలికి వెళ్తున్నారా తప్పకుండా దృష్టిసారించాలి. ► గూగుల్, య్యూట్యూబ్లలో నిషేధిత వీడియోలు, షార్ట్ఫిల్మ్లతో కాలక్షేపం చేస్తుంటారు. ఆయా యాప్ల సెట్టింగ్స్లో హిస్టరీని పరిశీలిస్తే ప్రారంభం నుంచి ఏ టైమ్లో ఏం సెర్చ్ చేశారు, అవి తరగతులకు సంబంధించినవేనా అని తెలిసిపోతుంది. మరుసటి రోజు జాగ్రత్త పడొచ్చు. ► సోషల్ మీడియాకు, యాప్స్కు దూరంగా ఉంచాలి. ► ఎంత పనిలో ఉన్నా అప్పడప్పుడూ పిల్లల స్మార్ట్ఫోన్, ట్యాబ్లో చేస్తున్న కార్యకలాలపై నిఘా వేయాలి. ► గాడ్జెట్లలో యాప్, గేమ్, ఇతర పైళ్లను డౌన్లోడ్లు చేయకుండా తల్లిదండ్రులు నియంత్రించాలి. అందుకు ప్రత్యేక యాప్లను ఇన్స్టాల్ చేయడమో.. డివైజ్ సెట్టింగ్లను మార్చడమో చేయాలి. ► ఇంటర్నెట్లో అశ్లీల లింక్లు వాటంతటవే ఓపెన్ అవుతుంటాయి. వాటిపై నియంత్రణ విధించాలి. ► ఎవరైన వేధింపులు, బెదిరింపులకు దిగితే.. తక్షణమే సమచారం ఇచ్చేలా సూచనలు చేయాలి. ► చాలావరకు మీకు సమీప గదుల్లోనే ఫోన్లు, కంప్యూటర్లు ఉంచండి. -
కాల్ చేస్తామని ఫోన్ కొట్టేసి బైక్తో ఈడ్చుకెళ్లారు, వైరల్ వీడియో
తిరువనంతపురం: కేరళలోని కోజిగోడ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఫోన్కాల్ చేసుకుంటామని చెప్పి మొబైల్ఫోన్ కొట్టేయడమే కాకుండా అడ్డు వచ్చిన సదరు వ్యక్తిని బైక్తో కొద్దిదూరం పాటు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. వివరాలు.. బిహార్కు చెందిన అలీ అక్బర్ కోజిగోడ్కు పనినిమిత్తం వచ్చారు. తన పని ముగించుకొని రోడ్డుపై వెళుతుండగా.. ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చారు. తమ ఫోన్ పాడైందని.. అర్జెంటుగా ఒక కాల్ చేసుకుంటామని చెప్పి అక్బర్ను అడిగారు. వారి మాటలు నమ్మిన అక్బర్ తన ఫోన్ను వారి చేతిలో పెట్టగానే యువకులిద్దరు వెంటనే బైక్ను స్టార్ట్ చేసి అక్కడినుంచి పారిపోయేందుకు యత్నించారు. అయితే బైకును అక్బర్ పట్టుకొని ఉండడంతో అతన్ని అలాగే రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈ క్రమంలో అలీతో పాటు బైకుపై వెనకాల కూర్చున్న దొంగ కూడా కిందపడిపోయాడు. ఆ తర్వాత అక్బర్ బైకును వెంబడించినా ప్రయోజనం లేకపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అక్బర్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. కాగా అక్బర్ వద్ద ఫోన్ దొంగలించిన ఇద్దరు యువకులను సాను కృష్ణన్, షమ్నాస్ అబ్దురాహిమాన్లుగా గుర్తించారు. అయితే దుండగులకు చెందిన ఒక ఫోన్ అక్కడపడిపోగా స్థానికులు దానిని పోలీసులకు అందించారు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
లవర్కి గిఫ్ట్గా ఫోన్ ఇచ్చాడని మరీ ఇంత దారుణమా..
జబల్పూర్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గర్ల్ ఫ్రెండ్కి మొబైల్ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చాడని దారుణానికి తెగబడ్డారు అమ్మాయి కుటుంబ సభ్యులు. ఫోన్ కొనిచ్చిన యువకుడు, అతని స్నేహితుడి పట్ల అమానవీయంగా అవమానించారు. అమానవీయం అగ్రవర్ణానికి చెందిన అమ్మాయికి ఫోన్ ఇచ్చినందుకు గాను ఇద్దరు దళిత యువకులకు గుండు కొట్టించారు. ఆ తర్వాత వారి మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. అంతటితో ఆగకుండా ఇద్దరిని నేలపై ఉమ్మించి ఒకరి ఉమ్మును మరొకరి చేత నాకించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్లో మే 22 న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఫోన్ ఇచ్చాడని జబల్పూర్ జిల్లాలో దామన్ ఖమారియా గ్రామానికి చెందిన రాజ్కుమార్ మెహ్రా అనే దళిత యువకుడు అదే ఊరిలో అగ్రవర్ణానికి చెందిన 19 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ప్రస్తుత లాక్డౌన్ కారణంగా ఇంటి నుంచి బయటకు రావడానికి కుదరడం లేదని, తనకో ఫోన్ కొనివ్వాలంటూ ఆ అమ్మాయి కోరింది. దీంతో రాజ్కుమార్ తన స్నేహితుడైన మహేంద్రకు చెందిన ఫోన్ను ఆ అమ్మాయికి ఇచ్చాడు. విచక్షణ కోల్పోయారు ఆ అమ్మాయి ఫోన్లో మాట్లాడుతుండగా కుటుంబ సభ్యులు చూశారు. ఆమెను విచారిస్తే ఫోన్ గిఫ్ట్గా ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఆగ్రహించిన అమ్మాయి కుటుంబ సభ్యులు ఇద్దరు దళిత యువకులను నిర్బంధించి దారుణానికి తెగబడ్డారు. -
జాగ్రత్త సుమ! ఇలా వాడితే మీ సెల్ఫోన్ సేఫ్..
ఇటీవల సెల్ఫోన్ వాడకం అన్నది ఎంత సాధారణమైన అంశంగా మారిందో మనకు తెలియంది కాదు. ప్రతి ఇంట్లోనూ ప్రతి కుటుంబ సభ్యుడికీ మొబైల్ఫోన్ ఉండనే ఉంటుంది. అందరకూ ఒకేసారి ఉపయోగించకపోయినా... ఒకరు కాకపోతే మరొకరు సెల్ఫోన్ను ఉపయోగిస్తూనే ఉంటారూ. ఇలాంటి వేళల్లో సెల్ఫోన్ నుంచి రేడియేషన్ వచ్చే మాట నిజమే. సెల్ టవర్కు దూరంగా ఉన్నప్పుడు, సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పుడు, కాల్ కనెక్ట్ అవడానికి ప్రయత్నం జరుగుతున్నప్పుడు రేడియేషన్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో సెల్ఫోన్ వాడటం వల్ల మెదడులో గడ్డలు వస్తాయన్న అపోహలు చాలామందిలో ఉన్నాయి. అయితే సెల్ఫోన్ వల్ల క్యాన్సర్లు వస్తాయని చెప్పడానికి ఇంతవరకు కచ్చితమైన ఆధారాలు ఏమీ లభించలేదు. అయినా ముందుజాగ్రత్తగా కొన్ని సూచనలు పాటిస్తే సెల్ఫోన్ను సేఫ్గా ఉపయోగించినట్లవుతుంది. వీలున్న అన్ని సందర్భాలలో సాధారణ ఫోన్స్ (లైన్డ్ ఫోన్స్)లో మాట్లాడాలి. సెల్ఫోన్ సంభాషణలు క్లుప్తంగా ఉండేట్లు చూసుకోవాలి. చాలాసేపు సెల్ఫోన్ వాడటం తప్పనిసరి అయినప్పుడు హెడ్ఫోన్స్ వాడటం మంచిది. ఒకవేళ హెడ్ఫోన్స్ వాడని సందర్భాల్లో... సెల్ఫోన్ను మరీ చెవికి ఆనించి దగ్గరగా పెట్టుకోవడం కాకుండా కొద్ది సెంటీమీటర్లు దూరంలో ఉంచుకొని మాట్లాడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రింగ్ చేసిన నెంబరు, కనెక్ట్ అయిన తర్వాత మాత్రమే సెల్ఫోన్ను చెవి వద్దకు తీసుకెళ్లాలి. పైన పేర్కొన్న జాగ్రత్తలతో పాటు... రోజు మొత్తం మీద కాల్స్ కలిసి, మూడునాలుగు గంటలు దాటుతున్నట్లు గమనిస్తే సెల్ఫోన్ వాడకాన్ని ప్రత్యేకంగా నియంత్రించడం మంచిది. వీలైన సందర్భాల్లో ఎస్ఎంఎస్, చాటింగ్, యాప్ బేస్డ్ మెసేజింగ్, డేటా సర్చింగ్ వంటి అవసరాలకు మాత్రమే సెల్ఫోన్ను పరిమితం చేయాలి. -
భారీగా పెరిగిన మొబైల్ మాల్వేర్ దాడులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో మొబైల్ ఫోన్లపై మాల్వేర్ దాడులు పెరిగినట్టు సైబర్ భద్రతా సంస్థ చెక్ పాయింట్ టెక్నాలజీస్ తెలిపింది. 2020 అక్టోబర్ నుంచి 2021 మార్చి మధ్య కాలంలో మాల్వేర్ దాడులు తొమ్మిది రెట్లు పెరిగినట్టు ఈ సంస్థ పేర్కొంది. 2020 అక్టోబర్లో 1,345 దాడులు జరగ్గా.. 2021 మార్చిలో 12,719 మాల్వేర్ దాడులను గుర్తించినట్టు ఈ సంస్థ వివరించింది. ఈ మేరకు 2021 మొబైల్ సెక్యూరిటీ నివేదికను విడుదల చేసింది. 97 శాతం సంస్థలు 2020లో మొబైల్ ముప్పులను ఎదుర్కొన్నాయని.. అంతర్జాతీయంగా 46 శాతం సంస్థల్లో కనీసం ఒక ఉద్యోగి అయినా హానికారక మొబైల్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకున్నట్టు తెలిపింది. -
అయ్యయ్యో.. అల్లు అర్జున్ ఫోన్ పోయిందా!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నేడు(గురువారం) 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. దీంతో పుష్ప టీమ్ అతడి అభిమానుల కోసం ఒకరోజు ముందే టీజర్ను రిలీజ్ చేసి మాంచి సర్ప్రైజ్ ఇచ్చింది. అయితే బన్నీకి మాత్రం ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్ షాక్నిచ్చింది. ఈ కార్యక్రమానికి అనుకున్న సమయాని కంటే కొంత ఆలస్యంగా వచ్చిన బన్నీ తన మాటలతో అభిమానుల్లో జోష్ నింపాడు. ఇంతమంది ప్రేమను అందుకున్న తాను ఎంతో అదృష్టవంతుణ్ణి అని చెప్పుకొచ్చాడు. ఇక బన్నీ స్పీచ్తో ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. అయితే ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ తన ఫోన్ను పోగొట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అతడు కొంత అప్సెట్ అయినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. చదవండి: అలా అనుకున్నాను కాబట్టే ఇంత దూరం వచ్చా!: బన్నీ ‘జార్జియా’కు పయనమైన హీరో విజయ్ -
600 మీటర్లు పరుగులు తీసి.. దొంగను పట్టుకుంది
బంజారాహిల్స్: ఓ యువతి సాహసం పోలీసులచే శభాష్ అనిపించుకుంది. సెల్ఫోన్ దొంగిలించి పరారవుతున్న స్నాచర్ను చూస్తూ అందరిలా చేష్టలుడిగి చూడలేదు. దొంగ.. దొంగ.. అని అరుస్తూనే చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తూ పారిపోతున్న దొంగను వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించింది. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్కు చెందిన భూమిక అనే యువతి బంజారాహిల్స్ రోడ్ నెంబర్.12లోని ఓ బొటిక్లో డిజైనర్గా పనిచేస్తున్నది. మంగళవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో విధులు ముగించుకొని యూసుఫ్గూడ చెక్పోస్ట్లో మెట్రో రైలు ఎక్కేందుకు వెళ్తున్నది. ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్డుపక్క నుంచి వెళ్తున్న భూమికను వెనుకాల నుంచి అనుసరిస్తున్న ఓ యువకుడు వేగంగా పరుగెత్తుకొచ్చి చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన భూమిక అరుస్తూ దొంగ వెళ్తున్న వైపు సుమారు 600 మీటర్ల మేర పరుగులు తీసింది. ఈ క్రమంలో అటువైపు నుంచి వస్తున్న ఓ స్కూటీని ఆపి విషయం చెప్పగా స్కూటీ నడుపుతున్న వ్యక్తి ఆమెను ఎక్కించుకొని దొంగ పారిపోతున్న వైపు పోనిచ్చాడు. శ్రీకృష్ణానగర్లోని సింధు టిఫిన్ సెంటర్ గల్లీలోంచి పారిపోతున్న యువకుడిని ఆ యువతి వెంబడించి కాలర్పట్టుకొని లాగింది. చేతిలో ఉన్న తన సెల్ఫోన్ను లాక్కుంది. అప్పటికే చుట్టుపక్కల వారు గమనించి ఆ యువకుడిని పట్టుకున్నారు. బాధితురాలు 100కి డయల్ చేయగా క్షణాల్లోనే జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. క్రైం పోలీసులు విచారించగా ఈ దొంగ పేరు జె.నవీన్ నాయక్(20)గా గుర్తించారు. శ్రీకృష్ణానగర్లో నివాసం ఉంటూ జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇదిలా ఉండగా స్నాచర్ను వెంబడించి పట్టుకున్న యువతిని పోలీసులతో పాటు స్థానికులు ప్రశంసించారు. చదవండి: తోటి విద్యార్థినిపై అనుమానం పెనుభూతమైంది -
మొబైల్ చోరీ.. 3 కి.మీ వెంటాడి సాధించాడు
చెన్నై : ఓ వ్యక్తి దొంగతనానికి గురైన తన మొబైల్ ఫోన్ను దక్కించుకోవటానికి ఏకంగా మూడు కిలోమీటర్లు పరిగెత్తాడు. ఆ దొంగకి ముచ్చెమటలు పట్టించడంతో పాటు భయం తెప్పించి చివరకు విజయం సాధించాడు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత శుక్రవారం చెన్నై పెరుర్కు చెందిన పార్తిబన్ అనే వ్యక్తి వడ పెరుంబాక్కమ్-మాధవరమ్ రోడ్లో బైక్ ఆపి, ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ దొంగ అతడి చేతిలోని సెల్ఫోన్ లాక్కుని పరిగెత్తాడు. ( విషాదం: ఇద్దరు పిల్లల్ని హతమార్చి.. ఆత్మహత్య ) పార్తిబన్ ఆ దొంగవెంట పడ్డాడు. దాదాపు మూడు కిలోమీటర్ల వరకు ఛేజింగ్ సాగింది. దొంగకు అతి చేరువగా వెళ్లగా.. భయపడిపోయిన తస్కరుడు చివరకు ఫోన్ను కిందపడేసి పారిపోయాడు. పార్తిబన్ ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఆమిర్ ఖాన్ అందుకే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్
ఆమిర్ ఖాన్ను అందరూ పర్ఫెక్షనిస్ట్ అని అంటారు. అనుకున్న కథ అనుకున్న పని అనుకున్న సినిమా అనుకున్న విధంగా చేయడానికి అతడు పెట్టవలసిన శ్రద్ధనంతా పెడతాడు. అతడు ‘గజనీ’ కోసం లావెక్కి, ‘3 ఇడియెట్స్’ కోసం సన్నబడి, ‘ధూమ్ 3’ కోసం సిక్స్ ప్యాక్ చేసి, ‘దంగల్’ కోసం ఒదులొదులు శరీరం చేసుకుని ఇన్ని ప్రయోగాలు చేశాడు తన శరీరంతో సినిమా కోసం. అలాంటిది ఇప్పుడు ‘లాల్సింగ్ చద్దా’ సినిమా కోసం ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేమంటే తన ఫోన్ స్విచ్చాఫ్ చేయాలని అనుకోవడం. ‘పనికి అది ఆటంకం కలిగిస్తోంది. అందుకే డిసెంబర్ వరకూ నా ఫోన్ వాడదలుచుకోలేదు. మరీ ముఖ్యమైన విషయమైతే చెక్ చేసి నా అసిస్టెంట్ నాకు చెబుతాడు’ అన్నాడు అతను. ‘అలాగే నా సోషల్ మీడియా అకౌంట్స్ వైపు కూడా డిసెంబర్ వరకూ చూడదలుచుకోలేదు. నా టీమ్ వాటిని నిర్వహిస్తుంది’ అని చెప్పాడు. ఫోన్ లేని రోజుల్లో మనుషులకు ఏ పని మీదైనా తగిన అటెన్షన్ ఉండేది. ఇప్పుడు ఆ అటెన్షన్ను ఫోన్ చెదరగొడుతూ ఉంది. ఫోన్ లేకుండా ఉండటం అసాధ్యం ఇప్పుడు కొందరికి. క్షణం అది పక్కన లేకపోతే ఇన్సెక్యూర్గా ఫీలవుతారు. అలాంటిది అంతపెద్ద స్టార్ అయ్యి ఫోన్ పక్కన పడేశాడంటే ఆమిర్కు తన నటన, కెరీర్ పట్ల ఉండే శ్రద్ధ అర్థమవుతోంది. చదవండి: ఉత్తరాఖండ్ విలయం.. గొంతెత్తిన దియా మిర్జా -
మహిళ కొంపముంచిన సెకండ్ హ్యాండ్ ఫోన్
ముంబై : కుమారుడి ఆన్లైన్ చదువుల కోసం సెకండ్ హ్యాండ్లో సెల్ఫోన్ కొన్న ఓ తల్లి చిక్కుల్లో ఇరుక్కుంది. అది దొంగిలించిన ఫోన్ అవ్వటం కారణంగా ఓ రోజు మొత్తం పోలీస్ స్టేషన్లో ఉండాల్సి వచ్చింది. చివరకు పోలీసుల ఔదార్యంతో కష్టాలనుంచి గట్టెక్కగలిగింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, బోరివ్లీకి చెందిన స్వాతి సుభాష్ సావ్రే తన కొడుకు ఆన్లైన్ చదువుల నిమిత్తం కొద్దిరోజుల క్రితం 6 వేల రూపాయలు పెట్టి సెకండ్ హ్యాండ్ ఫోన్ కొన్నది. దాని రిపేర్ల కోసం మళ్లీ 1,500 రూపాయలు ఖర్చు చేసింది. అనంతరం అందులో సిమ్ వేసుకుని వాడటం మొదలుపెట్టింది. మరుసటి రోజు స్వాతి ఇంటి వద్దకు వచ్చిన పోలీసులు.. అది దొంగిలించిన ఫోన్ అని చెప్పి, ఆమెను రైల్వే పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ( సెల్ ఫోన్ రీప్లేస్ చేయలేదని ఆవేదనతో..) ఓ రోజు మొత్తం విచారించి దొంగతనంతో ఆమెకు సంబంధం లేదని గుర్తించి పంపేశారు. అయితే స్వాతి ఆ ఫోన్ను కొనడానికి దాదాపు మూడు నెలల పాటు కష్టపడాల్సి వచ్చింది. అంతేకాదు! కుమారుడి ఆన్లైన్ చదువు కూడా నిలబడిపోయే పరిస్థితి. స్వాతి పనిచేస్తున్న ఇంటి యజమానితో తన గోడును వెళ్లబోసుకుందామె. ఆ యజమాని ఈ విషయాన్ని ముంబై పోలీసులకు ట్వీట్ చేశాడు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు. అనంతరం కుమారుడి చదువు కోసం ఆమెకు సెల్ ఫోన్ను గిఫ్ట్గా ఇచ్చారు. -
ఆర్డర్ క్యాన్సల్ అయ్యిందని.. ఫోన్ కొట్టేశాడు
న్యూఢిల్లీ: కరోనా ఎఫెక్ట్, ఎక్కువ డిస్కౌంట్లు వంటి వాటి వల్ల ఎక్కువ మంది కస్టమర్లు ఆన్లైన్ షాపింగ్ అంటే ఆసక్తి చూపుతున్నారు. నిత్యావసరాల నుంచి ఎలాక్ట్రానిక్ పరికరాల వరకు ప్రతిదానిని ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో అమెజాన్ డెలివరీ బాయ్ ఒకరు ఆర్డర్ క్యాన్సల్ అయ్యిందంటూ కస్టమర్కి అబద్దం చెప్పి మొబైల్ని అమ్ముకున్నాడు. కస్టమర్ ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. వివరాలు.. ఢిల్లీ కిద్వాయ్ నగర్కు చెందిన ఓ వ్యక్తి అమెజాన్లో మొబైల్ని బుక్ చేశాడు. అక్టోబర్ 1న అది డెలివరీ కావాల్సి ఉంది. ఈ క్రమంలో డెలివరీ బాయ్ అతడి ఇంటికి వచ్చి.. మీ ఆర్డర్ క్యాన్సల్ అయ్యింది.. త్వరలోనే మీ డబ్బు తిరిగి రీఫండ్ చేస్తారని చెప్పాడు. దాంతో అతడు అమెజాన్ సైట్లోకి వెళ్లి రీఫండ్ గురించి కంప్లైంట్ చేశాడు. (చదవండి: 12 గంటల్లో 1.75 లక్షల ఫోన్ల అమ్మకం) దీని గురించి చెక్ చేసిన అమెజాన్ అతడి మొబైల్ ఆల్రెడీ డెలివరీ చేశామని చెప్పింది. దాంతో అతడు కిద్వాయి నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో డెలివరీ బాయ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అతడిని ఢిల్లీ జవహర్ క్యాంప్కి చెందిన మనోజ్గా గుర్తించారు. ఇక విచారణలో డబ్బు అవసరం ఉండటంతో మొబైల్ని తానే అమ్ముకున్నానని తెలిపాడు. -
నాసా- నోకియా డీల్: చంద్రుడిపై 4జీ నెట్వర్క్
ఇకపై చందమామపై మొబైల్ ఫోన్ వాడొచ్చు. అది కూడా 4జీ, 5జీ నెట్వర్స్తో.. నమ్మడానికి కాస్తా అనుమానంగా ఉన్నా ఇదే నిజం. చందమామపై ఏకంగా ఫోన్ నెట్ వర్క్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చందమామపై 4G సెల్యూలర్ నెట్ వర్క్ అమర్చేందుకు ప్రపంచ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాతో ప్రముఖ మొబైల్ దిగ్గజం నోకియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం నోకియాకు 14.1 మిలియన్ డాలర్ల నిధులను నాసా అందిచనుంది. టిప్పింగ్ పాయింట్ ఎంపికల కింద 370 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలపై సంతకం చేసింది. మొదట జాబిల్లిపై 4జీ/ఎల్నెటీఈ నెట్వర్స్ను నోకియా నిర్మిస్తుంది. ఆ తర్వాత దాన్ని 5జీకి విస్తరించనుంది. ఇది అంతరిక్ష పరిశోధన, అభివృద్ధి దిశగా కొనసాగేందుకు ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థ చంద్ర ఉపరితల సమాచార మార్పిడికి ఎక్కువ దూరం, పెరిగిన వేగంతో పాటు ప్రస్తుత ప్రమాణాల కంటే ఎక్కువ విశ్వసనీయతను అందించగలదని నాసా తన కాంటాక్ట్ అవార్డు ప్రకటనలో పేర్కొంది. చదవండి: బస్సు సైజు గ్రహ శకలం.. మనకు ప్రమాదమేనా? To the moon! 🌕 We are excited to have been named by @NASA as a key partner to advance “Tipping Point” technologies for the moon, to help pave the way towards sustainable human presence on the lunar surface. So, what technology can you expect to see? (1/6) pic.twitter.com/wDNwloyHdP — Bell Labs (@BellLabs) October 15, 2020 2028 నాటికి చంద్రునిపై స్థావరం ఏర్పాటు చేసుకోవాలన్నది నాసా లక్ష్యమని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్స్టైన్ తెలిపారు. అప్పటికి వ్యోమగాములు చంద్రునిపై నివసించడానికి, పనులు ప్రారంభించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంత త్వరగా అభివృద్ధి చేయాలని అన్నారు. తాము చంద్రునిపై ఎక్కువ కాలం ఉండేందుకు విద్యుత్ వ్యవస్థలు, నివాస సామర్థ్యం అవసరమన్నారు. ఇందుకోసం నాసా నోకియా ఆఫ్ అమెరికాతో కాంట్రాక్ట్ కుదిరింది. చంద్రునిపై సెల్యులార్ కమ్యూనికేషన్ నెట్వర్క్ను నిర్మించేందుకు నాసా ఇప్పటికే ప్రణాళికలు చేపట్టింది. Our pioneering innovations will be used to build and deploy the first wireless network on the moon, starting with #4G/LTE technologies and evolving to #5G. (2/6) — Bell Labs (@BellLabs) October 15, 2020 నోకియా పరిశోధక విభాగం బెల్ ల్యాబ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. చంద్ర రోవర్లు, నావిగేషన్ వైర్లెస్ ఆపరేషన్తో పాటు వీడియోను ప్రసారం చేయడానికి నెట్వర్క్ను తీసుకోస్తోంది. ఈ నెట్వర్క్ కాంపాక్ట్ను సమర్థవంతంగా నిర్మించారు. అలాగే అంతరిక్షంలో విపరీతమైన ఉష్ణోగ్రత, రేడియేషన్, వాక్యూమ్ పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించారు. అంతరిక్షంలో రాకెట్ ప్రొపెల్లెంట్ను తయారు చేయడానికి సాంకేతికత కోసం దాదాపు 370 మిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది. ఈ సాంకేతికను అందించే స్పేస్ఎక్స్, యునైటెడ్ లాంచ్ అలయన్స్ వంటి అంతరిక్ష సంస్థలకు నాసా అందిస్తోంది. చంద్రునిపై కమ్యూనికేషన్ నెట్వర్క్ను నిర్మిస్తే అక్కడికి వెళ్లే వ్యోమగాములు మొబైల్ ఫోన్లను వినియోగించుకోవచ్చు. -
పారిశుద్ధ్యంపై జనచైతన్యం
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై స్థానిక ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. ఇటీవల ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలతో గ్రామాల్లో అంటువ్యాధులు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాదితో పోలిస్తే జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మలేరియా వ్యాధులు సగానికి పైగా తగ్గగా.. డెంగీ, డయేరియా తదితర వ్యాధులు దాదాపు 20 శాతానికే పరిమితమయ్యాయని పంచాయతీరాజ్శాఖ పరిశీలనలో తేలింది. ఈ నేపథ్యంలో ప్రజాచైతన్యాన్ని మరింత పెంచడం ద్వారా గ్రామాల్లో అంటువ్యాధులను పూర్తిగా నియంత్రించేందుకు ఆ శాఖ నడుంకట్టింది. ► మనం – మన పరిశుభ్రత పేరుతో పంచాయతీరాజ్శాఖ రాష్ట్రంలో ఉన్న 13,371 గ్రామాల్లోనూ విడతల వారీగా సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతుంది. పట్టణాల తరహాలో గ్రామాల్లో ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తారు. ఇప్పటికే మొదటి విడతలో 1,320 గ్రామాల్లో , రెండో విడతలో 4,740 గ్రామాల్లో ఈ కార్యక్రమాలు ప్రారంభించారు. ► దీనికి తోడు ప్రజాచైతన్యం కోసం సోషల్ మీడియాను ఉపయోగించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో 2.70 కోట్ల వరకు జనాభా ఉన్నట్లు అంచనా. వీరిలో కోటిమందికిపైగా ఇంటర్నెట్ వసతితో కూడిన మొబైల్ ఫోన్లు వాడుతున్నట్లు గుర్తించింది. వీరిలో 66 లక్షల మంది ఫేస్బుక్, వాట్సాప్లను, 40 లక్షలమంది ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లను ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. ► పరిసరాల అపరిశుభ్రత కారణంగా సంక్రమించే వ్యాధులు, ఫలితంగా కలిగే ఆర్థికభారం, సంపూర్ణ పారిశుద్ధ్యం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ స్క్రీన్షాట్లను రూపొందించి గ్రామాల్లో మొబైల్ ఫోన్ల వినియోగదారులకు పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం ప్రాంతాల వారీగా సబ్ గ్రూపుల రూపకల్పనకు ఆలోచిస్తున్నారు. ► గ్రామీణ ప్రాంతానికి ఎక్కువగా సంబంధం ఉండే ఉన్నత పా´ఠశాలలు, జూనియర్ కాలేజీ విద్యార్థులతో పాటు ఇతరత్రా చురుగ్గా ఉండే వారిని వారి గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుదలకు చేపట్టే చర్యల్లో భాగస్వాముల్ని చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
మొబైల్ రేట్లకు రెక్కలు!
సాక్షి,న్యూఢిల్లీ: డిస్ప్లేల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం 1 శాతం సుంకం విధించిన నేపథ్యంలో మొబైల్ ఫోన్ల ధరలు 3శాతం దాకా పెరిగే అవకాశం ఉందని ఇండి యా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. యాపిల్, హువావే, షావోమి, వివో, విన్స్ట్రాన్ వంటి సంస్థలకు ఇందులో సభ్యత్వం ఉంది. ‘మొబైల్ ఫోన్ల రేట్లపై 1.5-3 శాతం దాకా సుంకాల ప్రభావం ఉంటుంది‘ అని ఐసీఈఏ నేషనల్ చైర్మన్ పంకజ్ మహీంద్రూ ఒక ప్రకటనలో తెలిపారు. దేశీయంగా ఉత్పత్తి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని, అయితే ప్రస్తుతం దిగుమతులను తగ్గించుకోవడం మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా మార్కెట్ వాటాను కూడా పెంచుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా దశలవారీగా తయారీని ప్రోత్సహించే కార్యక్రమంలో (పీఎంపీ) భాగంగా డిస్ప్లే అసెంబ్లీ, టచ్ ప్యానెళ్లపై అక్టోబర్ 1 నుంచి దిగుమతి సుంకాలను అమలు చేయాలని 2016లోనే కేంద్రం నిర్ణయించింది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, దేశీయంగా తయారీ పెంచుకునేందుకు వీలుగా ప్రభుత్వం పీఎంపీని తెరపైకి తెచ్చింది. వేదాంత గ్రూప్ చైర్మన్ వల్కన్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ సుమారు రూ. 68,000 కోట్ల పెట్టుబడితో 2016లో ట్విన్స్టార్ డిస్ప్లే టెక్నాలజీస్ పేరుతో దేశీయంగా తొలి ఎల్సీడీ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అయితే, ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో ప్రాజెక్టు మొదలుకాలేదు. -
ఎస్బీఐ ఏటీఎంకు మొబైల్ తీసుకెళ్లండి!
ఎస్బీఐ ఏటీఎంలలో రూ.10వేలు, అంతకు మించి చేసే డెబిట్ కార్డు నగదు ఉపసంహరణలకు ఓటీపీ నమోదు చేయడం అన్నది ఇకపై 24 గంటల పాటు అమల్లోకి రానుంది. ప్రస్తుతానికి రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల మధ్య ఎస్బీఐ ఏటీఎంల్లో రూ.10వేలకు మించి చేసే ఉపసంహరణలకు కస్టమర్ల మొబైల్కు వచ్చే ఓటీపీని ఇవ్వడం తప్పనిసరిగా అమల్లో ఉంది. రాత్రి వేళల్లో మోసాలకు తావు లేకుండా ఉండే ఉద్దేశ్యంతో ఈ ఏడాది జనవరిలో ఈ సదుపాయాన్ని ఎస్బీఐ తీసుకొచ్చింది. ఇది మంచి ఫలితాలను ఇవ్వడంతో ఈ నెల 18 నుంచి రోజులో అన్ని వేళల్లోనూ (24గంటల పాటు) రూ.10వేలు అంతకుమించి చేసే నగదు ఉపసంహరణలకు పిన్ నంబర్తోపాటు ఓటీపీ నమోదు చేయాల్సి ఉంటుందని ఎస్బీఐ ప్రకటించింది. ఎస్బీఐ కార్డుదారులకు ఉచితంగా క్రెడిట్ స్కోరు! న్యూఢిల్లీ: ఎస్బీఐ క్రెడిట్ కార్డు దారులకు క్రెడిట్ స్కోరు తెలుసుకునే సదుపాయం కల్పించనున్నామని సంస్థ ఎండీ, సీఈవో అశ్విని కుమార్ తివారీ తెలిపారు. ‘‘అమెరికాలో మాదిరిగా రెండు మూడు అంశాలను ఇక్కడ ప్రవేశపెట్టాలనుకుంటున్నాను. క్రెడిట్కార్డు దారులకు వారి ఖాతా నుంచి క్రెడిట్ స్కోరు తెలుసుకునే సదుపాయం ఇందులో ఒకటి. అకౌంట్లో లాగిన్ అయినప్పుడు తమ క్రెడిట్ స్కోరు ఎంతో ఎటువంటి ఖర్చు లేకుండా తెలుసుకోవచ్చు. అమెరికాలో ఇది సర్వ సాధారణం. దీని ద్వారా అన్ని సమయాల్లోనూ తమ క్రెడిట్ స్కోరు ఏ విధంగా మార్పులు చెందుతుందో తెలుసుకోవచ్చు. కస్టమర్ అనుకూలమైన ఈ చర్యను వెంటనే అమలు చేయాల్సి ఉంది. దీనిపై మా బృందంతో చర్చించాను’’ అని వివరించారు. ‘‘ రిటైలర్ స్థాయిలో ఈ విధమైన స్కీమ్పై పని చేయాలనకుంటున్నాము. ఇప్పటికే ఎస్బీఐ కార్డ్ కో బ్రాండెడ్ విభాగంలో 14 ఒప్పందాలను కలిగి ఉంది. మరింత పెంచాలనుకుంటున్నాము. కస్టమర్ల సేవల విస్తృతిపై దృష్టి సారించాము’’ అని తివారీ తెలిపారు. -
లాక్డౌన్ ‘స్క్రీన్టైమ్స్’
సాక్షి, సిటీబ్యూరో: స్క్రీన్టైమ్స్. అదేపనిగా మొబైల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కు అతుక్కుపోయే అలవాటు. సాధారణంగా ఇది అతి పెద్ద సవాల్. ఈ అలవాటు ఒక పరిమితిని దాటడడం వల్ల అనేక రకాల అనర్థాలు చోటుచేసుకుంటాయి. ప్రస్తుత కరోనా కాలంలో ఈ ‘స్క్రీన్టైమ్స్’ ఒక సిండ్రోమ్ దశకు చేరుకుందని మానసిక వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు దీని బారినపడి చాలా నష్టపోతున్నట్లు చెబుతున్నారు. ప్రత్యేకించి ఇది ‘ లాక్డౌన్ స్క్రీన్టైమ్స్’గా యువతను పట్టి పీడిస్తోంది. ఆన్లైన్ తరగతుల వల్ల స్కూల్కు వెళ్లే పిల్లల నుంచి కాలేజీకి వెళ్లే యువత వరకు లాక్డౌన్ స్క్రీన్టైమ్స్ వ్యసనంలా వేధిస్తోంది. ఒకవైపు స్కూళ్లు, కాలేజీలు లేకపోవడం వల్ల మానసిక వికాసంలో స్తబ్దత కనిపిస్తుండగా ‘స్క్రీన్టైమ్స్’ దానికి మరింత ఆజ్యం పోస్తోందని డాక్టర్లు పేర్కొంటున్నారు. దీనివల్ల పలు మానసిక సమస్యలు తలెత్తుతున్నట్లు చెబుతున్నారు. కరోనా ఉధృతం కావడం, సాధారణ జనజీవితంపై నెలకొన్న అనిశ్చితి ఇందుకు ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న ‘స్క్రీన్టైమ్స్’ టీనేజ్ పిల్లలకు అతి పెద్ద సవాల్గా మారింది. రోజుకు 7 గంటలు దాటితే అంతే.. చిక్కడపల్లికి చెందిన పదో తరగతి అమ్మాయి కొంతకాలంగా ఆన్లైన్ క్లాస్లకు హాజరవుతోంది. రెండు గదుల ఇంట్లో కుటుంబమంతా కలిసి ఉంటారు. తాను ఒక గదికి పరిమితమై ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆన్లైన్ క్లాస్లు వింటుంది. ఆ తర్వాత మొబైల్ ఫోన్లోనే పలు ఫీచర్లు వీక్షిస్తూ గడిపేస్తుంది. అదేపనిగా ఫోన్ చూస్తుండడంతో తల్లి ఆంక్షలు విధించింది. దీంతో ఆ అమ్మాయిలో విపరీతమైన కోపం, అసహనం, చికాకు పెరిగాయి. ఈ నేపథ్యంలో వైద్యుడిని సంప్రదించగా ‘తనకు జీవితంలో ఫ్రీడమ్ లేకుండా పోయిందని, చనిపోవాలనిపిస్తోందని’ సదరు అమ్మాయి డాక్టర్ వద్ద ఏకరువు పెట్టింది. కావలసినంత సమయం మొబైల్ఫోన్ చూసేందుకు తల్లి అంగీకరించకపోవడమే ఇందుకు కారణం. ఆ ఒక్క అమ్మాయి మాత్రమే కాదు. చాలా మంది పిల్లల పరిస్థితి ఇలాగే ఉంది. లాక్డౌన్ టైమ్లో ఇది మరింత ఆందోళన కలిగిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. మానసిక వైద్య నిపుణుల విశ్లేషణ ప్రకారం 18 నెలల వయస్సు వరకు పిల్లలు ‘స్క్రీన్టైమ్స్’కు దూరంగా ఉండాలి. 5 ఏళ్లలోపు పిల్లలు గంట సేపు వీక్షించవచ్చు. ఎదుగుతున్న పిల్లలు 3 గంటల వరకు మొబైల్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, టీవీ వంటివి చూడవచ్చు. టీనేజ్ పిల్లలు, యువత 7 గంటల కంటే ఎక్కువ సమయం ‘స్క్రీన్టైమ్స్’తో గడిపితే మానసిక సమస్యలను ఎదుర్కోక తప్పదు. సాధారణంగానే గంటల తరబడి మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయే కుర్రకారు లాక్డౌన్ టైమ్లో 15 గంటలకు పైగా ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నట్లు వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి ఒంటిగంట వరకు కూడా ‘స్క్రీన్టైమ్స్’లోనే కొట్టుకుపోతున్నారు. అనర్థాలు అనేకం... లాక్డౌన్ కారణంగా ఇప్పుడు ఆన్లైన్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న బాలుడు కొద్ది రోజులుగా తన గదికే పరిమితమయ్యాడు. ఎవరితోనూ మాట్లాడడం మానేశాడు. తనకు తాను పూర్తిగా ఐసోలేట్ కావడంతో పేరెంట్స్ ఆందోళనకు గురయ్యారు. వైద్యులను సంప్రదించగా శారీరకంగా ఎలాంటి అనారోగ్యం లేదని నిర్ధారించారు. చివరకు సికింద్రాబాద్లో ఒక సైకియాట్రిస్టును సంప్రదించగా రాత్రింబవళ్లు ఫోర్న్సైట్స్ చూస్తున్నట్లు కౌన్సెలింగ్లో వెల్లడైంది. సాధారణంగా ఉదయం టిఫిన్ చేసి కాలేజీకి లేదా స్కూల్కు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి ఆట, పాటలతో సరదాగా గడపాల్సిన పిల్లలు అందుకు పూర్తిగా భిన్నమైన వాతావరణంలో ఉండడం వల్ల అనేక రకాల అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. స్క్రీన్టైమ్స్కు బానిసలుగా మారుతున్నారు. తమకు తెలియకుండానే రకరకాల తప్పులు చేస్తున్నారు. మూర్తిమత్వ వికాసానికి విఘాతం .. ♦సాధారణంగా ఏ వయస్సులో రావలసిన మార్పు ఆ వయస్సులో రాకపోతే ‘డెవలప్మెంటల్ డిలే’ అంటారు. స్క్రీన్టైమ్స్ వల్ల మానసిక ఎదుగుదల కొరవడుతుంది. మూర్తిమత్వ వికాసానికి ఇది విఘాతం కలిగిస్తుంది. ♦ఇరువై నాలుగు గంటలు స్క్రీన్స్కు అతుక్కుపోవడం వల్ల భావప్రకటనా నైపుణ్యం (కమ్యూనికేషన్స్ స్కిల్) కోల్పోతున్నారు. ♦ మొదడులో ఆలోచనా శక్తిని, చైతన్యాన్ని పెంచే న్యూరాన్స్లో మార్పుల వల్ల ప్రవర్తనలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. ♦ఆపదలో ఉన్నవారిని ఆదుకొనే స్వభావాన్ని కోల్పోతున్నారు. తోటి వారి పట్ల, కుటుంబం పట్ల ఉండవలసిన ప్రేమ, దయ, సానుభూతి, ఆప్యాయత సానుభూతి వంటివి కొరవడడం ‘స్క్రీన్టైమ్స్’ అనర్థాల్లో మరికొన్ని. అభిరుచుల్లో మార్పు అవసరం మెబైల్ ఫోన్లు, ఇతర గాడ్జెట్స్కు కేటాయించే సమయాన్ని తగ్గించుకోవాలి. మనస్సుకు నచ్చే అభిరుచులను అలవర్చుకోవాలి. సంగీతం, సినిమా, ఆటలు, పాటలు మంచిదే. ఈ లాక్డౌన్ టైమ్లో వ్యాయామం, యోగ, ప్రాణాయామం వంటివి అలవాటు చేసుకోవడం వల్ల మానసిక వికాసం మెరుగుపడుతుంది. పఠనాశక్తి పెరుగుతుంది. విషయాన్ని గ్రహించే నైపుణ్యం, భావప్రకటన కూడా బాగుంటాయి. – డాక్టర్ సంహిత, సీనియర్ సైకియాట్రిస్టు, పద్మారావునగర్ -
పక్కాగా రిపోర్టులు
సాక్షి, హైదరాబాద్: మొబైల్ ఫోన్కే కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితాలు పక్కాగా రానున్నాయి. పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా మొబైల్ ఫోన్కు ఎస్ఎంఎస్ రూపంలో ఫలితం పంపిస్తారు. దాంతోపాటు ఒక లింక్ను కూడా పంపిస్తారు. ఆ లింక్ను ఓపెన్ చేస్తే అందులో పూర్తి రిపోర్ట్ కనిపిస్తుంది. దాని ఆధారంగా పాజిటివ్ వచ్చిన కరోనా బాధితులు అవసరాన్ని బట్టి తక్షణమే ఆసుపత్రిలో చేరడం కానీ, ఐసోలేషన్కు వెళ్లడానికి కానీ వీలుకలుగుతుంది. నెగెటివ్ వచ్చినవారు ఇతరత్రా అనారోగ్య సమస్యలుంటే వాటికి చికిత్స చేయించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ‘కోవిడ్ ల్యాబ్ మేనేజ్మెంట్ సిస్టమ్’అనే పేరుతో యాప్ను శుక్రవారం ప్రారంభించింది. యాంటిజెన్ పరీక్ష చేయించుకుంటే అరగంట నుంచి గంటలోనే ఫలితాన్ని మొబైల్ ఫోన్కు మెసేజ్ రూపంలో పంపిస్తారు. ఇక ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకుంటే 24 గంటల్లోగా ఎస్ఎంఎస్ వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటిదాకా కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్న వారికి ఫలితం చెప్పడంలో సరైన పద్దతి లేదు. ఎవరికివారు తంటాలు పడి తెలుసుకోవాల్సిన పరిస్థితి. తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఒక్కోసారి ఫలితం తెలియక తీవ్రమైన లక్షణాలున్న బాధితులు సీరియస్ రోగులుగా మారుతున్నారు. పైపెచ్చు పరీక్ష ఫలితం లేకుంటే ఆసుపత్రులు చేర్చుకోవడం లేదు. అందుకే ఈ పద్దతికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో యాంటిజెన్, ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లలో ఈ పద్ధతి ప్రారంభమైందని అధికారులు వెల్లడించారు. మొత్తం దాదాపు 1,100 సెంటర్లలో ఇదే పద్దతిలో ఎస్ఎంఎస్లు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. రిజిస్ట్రేషన్... ఓటీపీ... ఆ తర్వాతే శాంపిళ్ల సేకరణ ప్రస్తుతం బాధితులు ఇచ్చే ఫోన్ నెంబర్ను, ఆధార్ నెంబర్, అడ్రస్ను ఆధారం చేసుకొని కరోనా నిర్దారణ పరీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొందరైతే తప్పుడు ఫోన్ నెంబర్లు, అడ్రస్లు ఇస్తున్నారు. దీంతో వారికి సమాచారం ఇవ్వడానికి కూడా వీలుపడటం లేదు. పైగా వారెక్కడ ఉంటున్నారో కనుక్కోవడం, చుట్టుపక్కల అలర్ట్ చేయడం గగనంగా మారింది. దీంతో కరోనాను కట్టడి చేయడం పోలీసులకు, ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్గా మారింది. కొందరు పాజిటివ్ ఉన్నవారు కూడా డాక్టర్ల సలహాలను పాటించకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారన్న విమర్శలున్నాయి. దీంతో వైరస్ వ్యాప్తి విస్త్రృతమవుతోంది. ఈ పరిస్థితులన్నింటికీ చెక్ పెట్టేందుకే సర్కారు ఈ యాప్ను తయారు చేసిందని అధికారులు తెలిపారు. దీని ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి పరీక్ష చేయించుకోవడానికి శాంపిల్ కేంద్రానికి వస్తే అతని పేరు, మొబైల్ నెంబర్, అడ్రస్లు సంబంధిత యాప్తో అనుసంధానమైన కంప్యూటర్లో ఎంటర్ చేస్తారు. ఈ వివరాలు ఎంటర్ చేశాక, అప్పటికప్పుడే సంబంధిత వ్యక్తి ఫోన్కు వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఓటీపీ చెబితేనే రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. అప్పుడు మాత్రమే శాంపిల్స్ తీస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5 వేల వరకు ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేస్తుండగా (ప్రైవేటులో 1900, ప్రభుత్వంలో 3100), దాదాపు 14 వేల వరకు యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు. ఇకనుంచి పరీక్షలు చేయించుకున్న వారందరికీ స్పష్టమైన రిపోర్ట్ ఫోన్ నెంబర్కే వస్తుంది. -
సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే 10వేల జరిమానా
లక్నో : రోడ్డు ప్రమాదాలను అరికట్టే లక్ష్యంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారికి 10 వేల రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించింది. గురువారం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. డ్రైవింగ్ నిబంధనలకు సంబంధించి గత నెలలోనే ఓ జీవో జారి చేసింది. ఇందులో మొదటిసారి డ్రైవింగ్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి 500ల రూపాయలు, రెండవసారి ఉల్లంఘించి. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవాళ్లు నాలుగు రెట్లు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు డబ్యూహెచ్వో ఓ నివేదికలో వెల్లడించింది. (బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, విసర్జించినా) A penalty of Rs 10,000 to be imposed on people using mobile phones while driving. Notification issued by the State Transport Department on July 30, Thursday after #UttarPradesh govt passed this mandate in June. pic.twitter.com/tkqdGFLJfN — ANI UP (@ANINewsUP) July 31, 2020 -
వీడియో: చూస్తుండగానే మొబైల్తో పరారీ!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కిషన్బాగ్లో శుక్రవారం మిట్టమధ్యాహ్నం ఇద్దరు దుండగులు మొబైల్ ఫోన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. ఈ ఘటన ఎన్ఎం గూడ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద జరిగింది. ఒక వ్యక్తి మొబైల్ చూస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంతలోనే బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు అతని చేతిలో నుంచి మొబైల్ లాక్కుని క్షణాల్లో అక్కడి నుంచి పరార్యాయారు. వారిని బాధితుడు వెంబడించినప్పటికీ లాభం లేపోయింది. ఈ స్నాచింగ్ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులు గుర్తించే పనిలోపడ్డారు. (సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై హైకోర్టులో పిటిషన్) -
వీడియో: చూస్తుండగానే మొబైల్తో పరారీ!
-
ఫోన్ను ఈ శానిటైజర్తో క్లీన్ చేయండి
న్యూ ఢిల్లీ: ఇంట్లో ఉన్నప్పుడు చేతులు కడుక్కునేందుకు సాధారణంగా సబ్బు వినియోగిస్తాం. బయట ఉన్నప్పుడైతే శానిటైజర్ వాడుతాం. అది సరే.. మరి ఫోన్లను శుభ్రం చేసేందుకు..? శానిటైజర్ ఉపయోగిస్తే స్క్రీన్ పాడైపోతుందేమోనని భయపడిపోతాం. కానీ మార్కెట్లో వచ్చిన కొత్తరకాల శానిటైజర్లతో ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టేయొచ్చు. మొబైల్ ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్, టీవీ రిమోట్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను శుభ్రం చేసేందుకు మార్కెట్లో ఎన్నో శానిటైజర్లు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇవి రెండు రకాలుగా లభ్యమవుతున్నాయి. మొదటిది స్ప్రే శానిటైజర్, రెండోది యూవీ బాక్స్ శానిటైజర్. వీటిలో కొన్ని ముఖ్యమైన ఉత్పత్తుల గురించి గురించి తెలుసుకుందాం.. స్ప్రే శానిటైజర్: వీటి ధర 230 రూపాయల నుంచి 250 వరకు ఉంటుంది. ఈ శానిటైజర్ను ఫోన్ లేదా ల్యాప్ట్యాప్ వంటి వస్తువులపై స్ప్రే చేసి అనంతరం కాటన్ వస్త్రంతో తుడవాలి. అయితే ఇష్టమొచ్చినట్లుగా కాకుండా నెమ్మదిగా రుద్దాల్సి ఉంటుంది. ► పోరట్రానిక్స్ స్వైప్: ఇది వాడటానికే కాకుండా మీ వెంట తీసుకెళ్లడానికి కూడా సులభంగా ఉంటుంది. ఇందులో స్ప్రేయర్తోపాటు శుభ్రం చేసేందుకు వీలుగా చిన్న వస్త్రాన్ని కూడా ఇస్తారు. దీని ధర 249 రూపాయలు. ► మొబివాష్ మొబైల్ శానిటైజర్: ఇది శానిటైజింగ్తోపాటు క్లెన్సింగ్, డియోడరైజింగ్ వంటి పనులను కూడా చేసి పెడుతుంది. దీని వెంట కూడా ఒక కాటన్ వస్త్రం వస్తుంది. పైన చెప్పిన దానిలాగే దీన్ని ఫోన్పై స్ప్రే చేసి సుతారంగా తుడిచేయాలి. (చైనా బ్యాన్ : మైక్రోమాక్స్ రీఎంట్రీ) యూవీ(అల్ట్రా వయొలెట్) బాక్స్ శానిజైజర్: వీటి ధర 3000 రూపాయల నుంచి 5 వేల వరకు ఉంటుంది. మీ ఫోన్పై ఉండే వైరస్ కణాలను నాశనం చేయాలనుకుంటే వీటిని ఎంచుకోవడమే ఉత్తమం. ♦ నైకా జెనరిక్ యూవీ-సీ పోర్టబుల్ శానిజైజింగ్ బాక్స్: పేరు చదవగానే అర్థమై ఉంటుంది. ఇది అతినీల లోహిత కిరణాలు, ఓజోన్ క్రిమిసంహారకాలను ప్రసరింపజేసి ఫోన్పై ఉండే బాక్టీరియా, వైరస్ను నాశనం చేస్తుంది. ఇందులో అరోమా థెరపీ సౌలభ్యం కూడా ఉంది. ఇది 99.9 శాతం క్రిములను సంహరిస్తుందని పేర్కొంటోంది. దీన్ని నైకా వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేయవచ్చు. దీని ధర 3,200 రూపాయలు. ♦ డెయిలీ ఆబ్జెక్ట్స్ పోర్టబుల్ మల్టీ ఫంక్షనల్ యూవీ స్టెరిలైజర్ అండ్ వైర్లెస్ చార్జర్: ఇది కూడా పైదానిలాగే పని చేస్తుంది. ఇక 5 నిమిషాల్లో మీ ఫోన్పై ఉండే సూక్ష్మ క్రిములను మటుమాయం చేస్తామని సదరు కంపెనీ చెబుతోంది. ఈ పరికరం 15 వాట్ల వరకు చార్జింగ్ అవుతుంది. దీన్ని వైర్లెస్గానూ ఉపయోగించవచ్చు. దీని ధర 4,800 రూపాయలు. ఇది మీకు కావాలనుకుంటే డెయిలీ ఆబ్జెక్ట్స్ వెబ్సైట్ను సందర్శించి ఆర్డర్ చేసుకోండి. (కొత్త వాదన: ఇక్కడ శానిటైజర్లకు నో!) -
సింగపూర్లో ఉపాధ్యాయుడి వికృత చేష్టలు
సింగపూర్ : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన సింగపూర్లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. సింగపూర్కు చెందిన 47 ఏళ్ల వ్యక్తి ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్గా విధులు నిర్వహిస్తున్నాడు. తాను జాయిన్ అయిన మూడేళ్ల కాలంలో దాదాపు 160 మంది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వారి అనుమతి లేకుండా అప్స్కర్ట్ వీడియోలు,ఫోటోలు తీశాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం అతన్ని విధుల నుంచి తొలగించారు. అయితే తాజాగా కొందరు మహిళల ఫిర్యాదుతో ఆ వ్యక్తిని జూన్ 23న పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళల అనుమతి లేకుండా ఫోటోలు తీయడంతో పాటు వారి గోప్యతను భంగపరిచినందుకు గాను సదరు వ్యక్తిపై చార్జీషీట్ నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.(భీమవరంలో యువకుడు ఆత్మహత్య) అయితే బాధితుల వివరాలను గోప్యంగా ఉంచేందుకు ఈ ఘోరానికి పాల్పడిన వ్యక్తితో పాటు స్కూల్ పేరును చెప్పడానికి వీలు లేదని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 2015 నుంచి జూలై 2018 మధ్య సదరు వ్యక్తి దాదాపు 168 మంది మహిళలు తమ దుస్తులు మార్చుకుంటున్న వీడియోలను వీడియోలు తీశాడు. ఇందులో మొదటి ఎనిమిది వీడియోలు 2015 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు, తర్వాత ఎనిమిది 2016 మొదటి ఆరు నెలల్లో తీశాడని కోర్టు పేర్కొంది. ఇక 2017 వచ్చేసరికి ఆ సంఖ్య 105కు చేరిందని, అయితే నిందితుడు అన్ని వీడియోలను ఒకేసారి కాకుండా పాఠశాలలో నిర్వహించిన వివిధ వేడుకలను టార్గెట్ చేసుకొని తీసేవాడు. ఇలా 2018 సంవత్సరం వరకు దాదాపు 160కి పైగా అసభ్యకర వీడియోలను తీసి ఆ వీడియోలను వారికే చూసిస్తూ తనకు లొంగాలని లేకుంటే ఇవన్ని సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందేవాడు. అయితే అతని ఆగడాలను భరించలేని కొందరు మహిళలు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ నిమ్మితం జూలై 14న నిందితుడు మరోసారి కోర్టుకు హాజరు కావాలని కోర్టు తెలిపింది. అయితే దీనిపై సింగపూర్ మినిస్ట్రి ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతినిధి శుక్రవారం మాట్లాడుతూ.. ఈ విషయం తెలియగానే స్కూల్ యాజమాన్యం 2018 జూలైలోనే అతన్ని విధుల నుంచి తొలగించిందన్నారు. అప్పటినుంచి అతను ఏ స్కూల్లో పాఠాలు బోధించడం లేదని తెలిపారు. ప్రవర్తనా నియమావళి కింద క్రమశిక్షణలో విఫలమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని, వారిని పదవిలోంచి తొలగిస్తామని అన్నారు. మహిళ యొక్క గోప్యతను భంగపరిచే విధంగా ప్రవర్తించిన వ్యక్తికి కఠినమైన జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించే అవకాశమున్నట్లు తెలిపారు. -
బ్లాడర్లో కేబుల్ : నిజం తెలిస్తే షాక్!
మనషుల మానసిక రుగ్మతకు, వింత ప్రవర్తనకు నిదర్శనమైన ఉదంతం ఒకటి అసోంలో వెలుగు చూసింది. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న వ్యక్తికి ఆపరేషన్ చేసిన వైద్యులు అతని మూత్రాశయంలో మొబైల్ హెడ్ ఫోన్ వైర్ ను చూసి విస్తుపోయారు. చివరికి ఆ కేబుల్ ను తొలగించి రోగి ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఈ ఘటన పూర్వాపరాలను పరిశీలిస్తే అసోంకు చెందిన రోగి (30) తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. పొరపాటున హెడ్ఫోన్ కేబుల్ను మింగేశానని చెప్పాడు. దీంతో మల పరీక్ష, ఎండోస్కోపీ పరీక్షలు చేసిన వైద్యులు, ఫలితం లేకపోవడంతో శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అయినా జీర్ణాశయంలో కేబుల్ జాడ దొరకలేదు. దీంతో ఆశ్చర్యపోయిన వైద్యులు ఆపరేషన్ బెడ్ మీదే ఎక్స్ రే పరీక్ష నిర్వహించారు. ఇక్కడే డాక్టర్లకు దిమ్మదిరిగే విషయం తెలిసింది. రోగి మూత్రాశయం లోపల దాదాపు రెండు అడుగుల పొడవైన కేబుల్ను గుర్తించారు. అతడు వైద్యులకు అబద్దం చెప్పాడనీ నోటి ద్వారా కాకుండా పురుషాంగం ద్వారా కేబుల్ చొప్పించబడిందని తేలిందని సర్జన్ డాక్టర్ వాలియుల్ ఇస్లాం వెల్లడించారు. “యురేత్రల్ సౌండింగ్'' అని పిలిచే ఒక రకమైన హస్త ప్రయోగమని, ఇది చాలా అరుదైన విషయమని పేర్కొన్నారు. ఐదు రోజుల తర్వాత నొప్పితో తమ దగ్గరకు వచ్చిన వ్యక్తి ఇలా అబద్ధం చెబుతాడని అస్సలు ఊహించలేదన్నారు. తన పాతికేళ్ల చరిత్రలో ఆపరేషన్ టేబుల్ మీద ఇలా జరగడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. ఈ సంగతి ముందే చెప్పి ఉంటే.. ఆపరేషన్ లేకుండానే కేబుల్ను తొలగించేవారిమని చెప్పారు. -
అలా జరిగితే నన్ను క్షమించండి: సోనూసూద్
ముంబై : కొన్ని వేల మంది వలస కార్మికులకు సహాయం అందిస్తూ వారికి బాసటగా నిలుస్తున్నారు బాలీవుడ్ స్టార్ సోనూసూద్. లాక్డౌన్లో ముంబైలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల వలస కూలీలను స్వంత ప్రదేశాలకు చేరుస్తున్నారు. తన సొంత ఖర్చుతో బస్సులను ఏర్పాటు చేసి వలస జీవులను సొంత రాష్ట్రాలకు పంపుతున్నారు. ఇప్పటివరకు ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, బీహార్లకు అనేక మంది కార్మికులను చేరవేశారు. అదే విధంగా పంజాబ్లోని వైద్యులకు పిపిఈ కిట్లు కూడా అందించిన సంగతి తెలిసిందే. ఇక ముంబైలోని తన హోటల్ను కోవిడ్ చికిత్సలో పని చేస్తున్న వైద్య సిబ్బంది బసకు ఇచ్చాడు. (సోనూసూద్.. నువ్వు రియల్ హీరో) తాజాగా బస్సు సేవల కోసం టోల్ ఫ్రీం నెంబర్ను సైతం ఏర్పాటు చేశారు. ఎవరికైనా సహాయం కావాలంటే ఈ నెంబర్కు కాల్ చేయాలని కోరారు. సహాయం కోసం ఎంతో మంది సోషల్ మీడియాలో సోనూసూద్ను సంప్రదిస్తున్నారు. వీరిలో చాలా మందికి వ్యక్తిగతంగా స్పందించి వారికి భరోసా ఇస్తున్నాడు. అయితే కొంతమంది వింతైన ప్రశ్నలు వేసినప్పటికీ ఏమాత్రం విస్కుకోకుండా వారందరికీ ఈ బాలీవుడ్ హీరో అదిరిపోయే సమాధానాలు ఇస్తున్నారు. తాజగా సోనూసూద్ ట్విటర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. తన మొబైల్ నోటిఫికేషన్ బార్ను వీడియో తీసి అభిమానులతో పంచుకున్నారు. (గర్ల్ ఫ్రెండ్ను కలవాలంటూ నటుడికి ట్వీట్!) आपके संदेश हमें इस रफ़्तार से मिल रहें हैं। मैं और मेरी टीम पूरी कोशिश कर रहें हैं हर किसी को मदद पहुँचे! लेकिन अगर इस में हम कुछ मेसजेज़ को मिस कर दें, उसके लिए मुझे क्षमा कीजिएगा 🙏 pic.twitter.com/wS7vVk9bjv — sonu sood (@SonuSood) May 27, 2020 ఈ వీడియోలో ఫోన్ స్క్రీన్ ఆన్ చేయగానే తమకు సహాయం చేయాలని ఎంతో మంది నుంచి అభ్యర్థనలు వేగంగా వచ్చి పడుతున్నాయి.‘మీ సందేశాలు ఇంత వేగంతో మాకు చేరుతున్నాయి. ప్రతి ఒక్కరికి సాయం చేసేందుకు నేను. నా బృందం మా వంతుగా తప్పని సరిగా ప్రయత్నిస్తాం. ఒకవేళ ఇందులోని కొన్ని అభ్యర్థనలను నేను తీర్చలేకపోతే నన్ను క్షమించండి అంటూ’ ట్వీట్ చేశారు. ఇక వీడియో షేర్ చేసిన కొన్ని క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (ఆమె లేకుండా ఇంట్లో పని చేయగలరా! ) -
ఫోన్లో మీ సీక్రెట్లు దాచేయండిలా!
ప్రస్తుతం మొబైల్ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అయిపోయింది. ఒకానొక కాలంలో వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే తన స్నేహితులు ఎవరో తెలుసుకుంటే సరిపోయేది. కానీ ఇప్పుడు అందరి జీవితాలు ఫేస్బుక్లు, వాట్సాప్లు, మొబైల్ ఫోన్లోనే ఉన్నాయి. ఒక్కసారి మన ఫోన్ ఎవరికైనా ఇచ్చినా, లేదా ఎవరికైనా దొరికిన మన జీవితంలోని సీక్రెట్స్ మొత్తం దాదాపు వాళ్లకి తెలిసిపోయినట్లే. అప్పుడప్పుడు ఇంట్లో వాళ్లకో, స్నేహితులకో, తెలిసి వాళ్లకో మన ఫోన్ ఇస్తూ ఉంటాం అలాంటప్పుడు వాళ్లకి మీ సీక్రెట్స్ తెలియకుండా దాచేయాలనుకుంటున్నారా? అయితే మీరు థర్డ్ పార్టీ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోకుండానే ఇలా చేయండి. మీ సీక్రెట్ ఫోటోలు, వీడియోలు, ఫైల్స్ అన్ని దాచేయండి. హిడెన్ పోల్డర్ క్రియేట్ చేయడం: 1. మీ ఫోన్లో ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి 2. స్టోరేజ్లోకి వెళ్లండి. 3. అక్కడ న్యూ ఫోల్డర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. 4. మీకు నచ్చిన ఫోల్డర్ నేమ్ పెట్టుకోండి 5. ఇప్పుడు దాన్ని హిడెన్ ఫోల్డర్ చేయాలనుకుంటే ఫోల్డర్ నేమ్కి ముందు డాట్ (.) పెట్టండి 6. మీరు హైడ్ చేయాలనుకున్న మొత్తం డేటాను ఈ ఫోల్డర్లోకి ట్రాన్స్ఫర్ చేయండి, అంతే దాచేయాలనుకున్న ఫైల్స్ అన్ని ఇంకెవరికి కనిపించవు. ఆల్రెడీ ఉన్న ఫోల్డర్ని హైడ్ చేయాలంటే... 1. మీ ఫోన్లో ఫైల్ మేనేజర్ యాప్ ఓపెన్ చేయండి. 2. మీరు ఏ ఫోల్డర్ దాచేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్లండి. 3. ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసి క్రియేట్ న్యూ ఫైల్ అనే ఆప్షన్కి వెళ్లండి. 4. అక్కడ ఫైల్ నేమ్ని .నోమీడియా (.nomedia) అని రాయండి. 5. అలా చేసిన తరువాత ఫైల్ మేనేజర్ యాప్ నుంచి బయటకు వచ్చి మీ ఫోన్ని రీస్టార్ట్ చేయండి. 6. ఇంకా మీ ఫైల్ ఎవరికి కనిపించదు. ఇంత వరకు బాగానే ఉంది. మరి దాచేసిన ఫైల్ని మనం చూడాలి అంటే ఏం చేయాలి అనుకుంటున్నారా? హైడ్ చేసిన ఫోల్డర్ని చూడాలనుకుంటే ... ఫైల్ మేనేజర్ యాప్లో సెట్టింగ్స్లోకి వెళ్లి షో హిడెన్ ఫైల్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అక్కడ మీరు హైడ్ చేసిన ఫోల్డర్ ఎక్కడ ఉందో చూడొచ్చు. ఇక ఆల్రెడీ ఉన్న ఫోల్డర్ని హైడ్ చేసిన వారు .నోమీడియా(.nomedia) ఫైల్ను ఫోల్డర్ నుంచి డిలీట్ చేసేయండి. మీరు దాచిన సీక్రెట్ను మీరు చూడగలుగుతారు. -
లాక్డౌన్: స్మార్ట్ ఫోన్కు బానిసవుతున్నారా?
అసలే కరోనా లాక్డౌన్ కాలం.. ఆపై ఖాళీగా ఇంట్లో ఉండేవాళ్లం.. సెల్ఫోన్ లేకపోతే!.. ఆ ఊహే బాగోలేదంటారా. మీరు ఆ ఊహలో బ్రతుకుతుంటే మాత్రం మీ జీవితాన్ని మీ చేతులారా నాశనం చేసుకుంటున్నారని గ్రహించండి. ఈ కొన్ని రోజుల కాలాన్ని గడపటానికి మీరు సెల్ఫోన్ను ఆశ్రయించినట్లైతే లాక్డౌన్ పూర్తిగా ఎత్తేసిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని గుర్తించండి. లాక్డౌన్ తర్వాత మీరు పనుల్లోకి వెళ్లిపోతారు. ఇన్ని రోజులు సెల్ఫోన్కు అతుక్కుపోయిన బుర్ర ఒక్కసారిగా పనిమీదకు మళ్లమంటే మొండికేస్తుంది. కుదరదని మంకు పట్టుపడుతుంది. పని మీద శ్రద్ధ పెట్టలేక, పని సమయంలో సెల్ఫోన్ వాడలేక ఒత్తిడికి లోనవుతారు. ( వైన్ షాపులు తెరవండి.. ఖజానా నింపుకోండి ) వ్యసనాన్ని చంపుకోలేక ఒక వేళ ఆఫీసులో కూడా ఫోన్ వాడుతూ కూర్చుంటే.. మీ నెత్తిన సెల్ఫోన్ పడ్డట్లే. సెల్ఫోన్ వ్యసనం మీ ఫ్యామిలీ లైఫ్పై, జాబ్ లైఫ్పై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా నిద్రపోయేటప్పుడు సెల్ఫోన్ వాడటం వల్ల నిద్ర సంబంధింత సమస్యలు రావటమే కాకుండా నిద్రలేమితో దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. సెల్ఫోన్ వాడకాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి : సెల్ఫోన్ నుంచి మీ దృష్టిని మరల్చడానికి వేరే పనుల్లో బిజీగా ఉండటానికి ప్రయత్నించండి. మీ సమయాన్ని మొత్తం భాగాలుగా విభజించి ఒక్కో సమయంలో ఒక్కో పని చేస్తూ గడపండి. దీర్ఘకాలంలో ఫలితాలనిచ్చే అంశాలపై దృష్టి పెట్టండి. ఓ గంట పుస్తకం చదవటం, ఓ గంట ఇంటి పనులు చేయటం.. ఇలా సమయాన్ని మీ ఇంటి వాతావరణానికి తగ్గట్లు ఎంచుకోండి. దీంతో మీకు శారీరకంగానూ, మానసికంగానూ ఉపయోగపడుతుంది. ఒక్కో సారి అవసరం లేకపోయినా సెల్ఫోన్ను చేతుల్లోకి తీసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు ఓ క్షణం ఆలోచించండి ‘‘ నేనెందుకు ఇప్పుడు సెల్ఫోన్ ముట్టుకున్నాను. ( ఆ విషయం మాకూ తెలుసు.. అదో వ్యూహం! ) నిజంగా దీంతో నాకు అవసరం ఉందా’’ అని. ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్ యూజర్స్ కనీసం మూడు గంటల పాటు సెల్ఫోన్తో కాలం వెళ్లదీస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా యాప్లకు వీలైనంత దూరంగా ఉండండి. అసలు అవసరం లేదనుకుంటే వాటిని డిలేట్ చేయటం మంచిది. ఇంట్లో ఉన్నపుడు వీలైనంత మీ సెల్ఫోన్ను దూరంగా ఉంచండి. నిద్రపోయే సమయంలో సెల్ఫోన్ను దరిచేరనీయకండి. -
అరచేతిలో బుల్లిపెట్టె
ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న మహిళ చేతిలో పాతకాలం నాటి రోటరీ డయల్తో కనిపిస్తున్న పరికరం అచ్చంగా మొబైల్ ఫోన్. ఇది పూర్తిగా పనిచేస్తుంది కూడా. జస్టీన్ హాప్ట్ అనే ఈ మహిళ స్పేస్ ఇంజనీర్గా పనిచేస్తోంది. స్మార్ట్ ఫోన్లంటే ఈమెకు మాచెడ్డ చిరాకు. ల్యాండ్ఫోన్ను ఎక్కడికంటే అక్కడకు తీసుకుపోయే వీలు లేదు. మొబైల్ఫోన్ వాడటం తప్పనిసరి. స్మార్ట్ఫోన్ల బెడద తప్పించుకోవడానికి ఈమె తన బుర్రకు పదును పెట్టి ఉపాయాన్ని ఆలోచించింది. బుర్రలో బల్బు వెలగడమే తరువాయి. ఈ ఎక్స్ట్రా స్మార్ట్ఫోన్కు రూపకల్పన చేసింది. పాతకాలం నాటి రోటరీ డయల్తో, అంగుళం మందం, మూడంగుళాల వెడల్పు ఉండేలా సరికొత్త మొబైల్ఫోన్ను తయారు చేసింది. దీని తయారీ కోసం టెలికం పరికరాలను తయారు చేసే సంస్థల నుంచి విడి భాగాలను తెప్పించుకుంది. ఇందులో ఆమె ‘ఏటీ అండ్ టీ’ కంపెనీకి చెందిన ప్రీ పెయిడ్ సిమ్కార్డును వాడుతోంది. ఈ ఫోన్ కూడా పాతకాలం నాటి ల్యాండ్ఫోన్ మాదిరిగా మాటలాడుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. స్మార్ట్ఫోన్లలో చిరాకుపెట్టే ఎస్ఎంఎస్, ఎంఎంఎస్లు, వాట్సాప్ వంటి యాప్ల పప్పులేవీ ఇందులో ఉడకవు. భలే ఉంది కదూ! దీని తయారీ కోసం ఆమె తెప్పించుకున్న పరికరాల విలువ 130 డాలర్లు (సుమారు రూ.9,600). దీని ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగానే ఇలాంటిది తమకూ కావాలని చాలామంది కోరారు. దీంతో ఆమె ఇలాంటి ఫోన్ తయారీకి కావలసిన పరికరాల కిట్ను, తయారీ పద్ధతి నోట్ను ఆన్లైన్లో 170 డాలర్లకు (దాదాపు రూ.12,500) విక్రయిస్తోంది. ఈ ధరకు మార్కెట్లో ఏకంగా స్మార్ట్ఫోన్ దొరుకుతుందిగా అనుకుంటున్నారా? అలాగే అనుకోండి. ఇలాంటిది మీ దగ్గర ఉంటే బాగుంటుందనుకుంటున్నారా? అలాగైతే ఆన్లైన్లో జస్టీన్ హోప్ట్కు ఆర్డర్ చేయండి. -
మొబైల్ ఫోన్ల ధరలకు రెక్కలు..
సాక్షి, న్యూఢిల్లీ : మార్కెట్లోకి ఏదైనా స్మార్ట్ ఫోన్ న్యూ మోడల్ రాగానే దాన్ని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరేవారితో పాటు బడ్జెట్ ధరలో మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసే వారికీ ప్రభుత్వం గట్టి షాక్ ఇవ్వనుంది. మొబైల్ ఫోన్లపై జీఎస్టీని పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. మొబైల్స్పై జీఎస్టీ ని 18 శాతానికి పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. శనివారం జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీలోనే ఈ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. మొబైల్ పోన్లతో పాటు ఫుట్వేర్, టెక్స్టైల్స్, ఫెర్టిలైజర్స్పై జీఎస్టీ రేటును పెంచనున్నారు. పన్ను వసూళ్ల రాబడిని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. కాగా, జీఎస్టీ వినియోగదారుల లావాదేవీలు , వ్యాపారుల ఇన్వాయిస్లపై ప్రతి నెలా లక్కీ డ్రాలు నిర్వహించి రూ .10 లక్షల నుంచి రూ .1 కోటి మధ్య లాటరీ ఆఫర్లను ప్రారంభించే ప్రతిపాదననూ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆమోదించవచ్చని భావిస్తున్నారు. చదవండి : జీఎస్టీ లాటరీ : ఇలా చేస్తే కోటి రూపాయలు మీవే! -
ఇ‘స్మార్ట్’ ఫోన్లున్నా బేసిక్ మోడళ్లే టాప్
సాక్షి, అమరావతి: రకరకాల ఆకర్షణలతో స్మార్ట్ ఫోన్లు వెల్లువలా వస్తున్నా దేశంలో మాత్రం ఫీచర్ ఫోన్లు (బేసిక్ మోడళ్లు) పైనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. టెక్నాలజీతో అవసరాలన్నీ తీరిపోయేలా స్మార్ట్ఫోన్లు మార్కెట్ను ముంచెత్తుతున్నా ఇప్పటికీ ఫీచర్ ఫోన్లనే చాలామంది నమ్ముకుంటున్నారు. దేశంలో 80 కోట్ల మందికిపైగా మొబైల్ ఫోన్ వినియోగదారులుండగా 45 కోట్ల మంది ఫీచర్ ఫోన్లే వాడుతున్నట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) విశ్లేషణలో తేలింది. 35 కోట్ల మంది మాత్రమే స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. మళ్లీ మొదటికి! మూడేళ్ల క్రితం స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే గత ఏడాది నుంచి స్మార్ట్ ఫోన్ల వాడకందారులు సైతం మళ్లీ ఫీచర్ ఫోన్లు కొంటున్నట్లు గుర్తించారు. 2018, 19లో స్మార్ట్ ఫోన్ల వినియోగం తగ్గింది. గతంలో స్మార్ట్ ఫోన్ల పట్ల ఆకర్షితులైన వారు కూడా ఫోన్లు మార్చుకునే సమయంలో ఫీచర్ ఫోన్ వైపు మళ్లినట్లు గుర్తించారు. ఎందుకంటే...? ఇంటర్నెట్పై అవగాహన లేకపోవడం, స్మార్ట్ ఫోన్లలో ఫీచర్లు వాడడం తెలియక చాలామంది ఫీచర్ ఫోన్లు వినియోగిస్తున్నారు. కార్మికులు, దిగువ మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఫీచర్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ధరలు కూడా మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి. ఫీచర్ ఫోన్లు వాడేవారిలో ఎక్కువ మంది రూ.వెయ్యి లోపు వాటినే కొనుగోలు చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల ధర ఎక్కువగా ఉండటం, నిర్వహణ భారంగా మారడం కూడా వీటిపై విముఖతకు కారణం. 2019 చివరి నాటికి దేశంలో 81 కోట్ల మంది మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నట్లు ఐడీసీ లెక్క తేల్చింది. టెలికాం ఆర్థిక పరిశోధనా విభాగం మాత్రం ఇది 118 కోట్లు దాటినట్లు పేర్కొంటోంది. ఐడీసీ వినియోగదారుల (యూజర్లు) సంఖ్యను లెక్కిస్తుండగా కేంద్ర ప్రభుత్వ విభాగం కనెక్షన్లు లెక్కిస్తుండడం వల్ల వ్యత్యాసం నెలకొన్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. -
ఆన్లైన్ కొనుగోళ్లలో ‘మొబైల్’ జోరు...
ముంబై: మొబైల్ ఫోన్ వాడకందారుల్లో 88 శాతం మంది ఆన్లైన్ కొనుగోళ్లు, చెల్లింపులను చేస్తున్నారని తాజా సర్వేలో తేలింది. ‘ఎంకామర్స్ రిపోర్ట్’ పేరిట పేపాల్, ఐపీఎస్ఓఎస్లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచ సగటు 77 శాతంగా ఉంటే, ఇంతకుమించి భారతీయులు మొబైల్ ఫోన్లను చెల్లింపుల కోసం వినియోగిస్తున్నారని తేలింది. ఇందులోనూ, ఏకంగా 98 శాతం మంది యాప్ల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. ఇక వచ్చే 12 నెలల్లో మొబైల్ ఆప్టిమైజేషన్కు ప్రాధాన్యతను ఇవ్వనున్నామని 45 శాతం మంది వ్యాపారులు చెప్పినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లోని 22,000 మంది వినియోగదారులు(18–74 ఏళ్ల మధ్య వయస్సువారు), 4,000 మంది వ్యాపారులను సర్వే చేయడం ద్వారా ఈ నివేదికను రూపొందించింది. -
చార్జింగ్లో ఉన్న మొబైల్ పేలి యువకుడి మృతి
స్మార్ట్ఫోన్ చార్జింగ్లో ఉండగా పేలిన మొబైల్ ఫోన్ ఒకయువకుడి ప్రాణాలుతీసింది. భవన నిర్మాణ కార్మికుడైన కునా ప్రధాన్ (22) తన ఫోన్కు చార్జింగ్ పెట్టి, మరో ముగ్గురు కార్మికులతో పాటు గదిలో నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒడిశాలోని పారాడిప్లో ఆదివారం రాత్రి ఈ విషాదం చోటు చేసుకుంది. పారాడిప్ పోలీస్ స్టేషన్ అధికారిక ఆర్కె సమల్ అందించిన సమాచారం ప్రకాచరం చార్జింగ్లో ఉన్న స్మార్ట్ఫోన్ ఒక్కసారిగా పేలడంతో ప్రధాన్ అక్కడిక్కడే చనిపోయాడు. సమాచారం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టంకోసం ఆసుపత్రికి తరలించారు. బాధితుడిని నాయగర్ జిల్లాలోని రాణ్పూరి ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. ట్రక్ యజమానుల సంఘం చేపట్టిన పారదీప్లో ఆలయ నిర్మాణ పనుల్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. -
14న సెల్ఫోన్స్ స్విచాఫ్ చేయండి!
చెన్నై, టీ.నగర్: బాలల దినోత్సవం నవంబరు 14వ తేదీన సెల్ఫోన్లు స్విచాఫ్ చేసి పిల్లలతో ఆనందంగా గడపాల్సిందిగా తల్లిదండ్రులకు పాఠశాల విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం అన్ని పాఠశాలలకు ఒక సర్క్యులర్ పంపింది. పాఠశాలల్లో నవంబరు 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ తరçఫున ఆరోజున సెల్ఫోన్లను లేకుండా గడపాల్సిందిగా పిలుపునిచ్చింది. ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు తల్లిదండ్రులు తమ సెల్ఫోన్లను స్విచాఫ్ చేసి పిల్లలతో గడపాలని, దీన్ని వారానికి ఒకసారి లేదా రోజూ కూడా అమలులోకి తీసుకురావచ్చని తెలిపింది. విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రుల వద్ద ఈ విషయంపై ఒత్తిడి తేవాలని కోరింది. పిల్లలు, ఉపాధ్యాయులు దీన్ని ఆచరణలో పెట్టాలని పేర్కొంది. -
మొబైల్ పోయిందా? కేంద్రం గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: మీ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారా? అయితే మీకు ఊరటనిచ్చే వార్త. తస్కరించిన ఫోన్ల ఆచూకీ కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగింది. ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సహకారంతో పైలట్ ప్రాజెక్టుగా ఒక వినూత్న కార్యక్రమాన్ని చుట్టింది. దొంగిలించబడిన మొబైల్స్ రిపోర్టింగ్ కోసం కేంద్ర కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ www.ceir.gov.in అనే వెబ్ పోర్టల్ను ప్రారంభించారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఇఐఆర్) పేరుతో మహారాష్ట్రలో పైలట్ ప్రాజెక్టుగా, బిఎస్ఎన్ఎల్ సహకారంతో దీన్ని ప్రారంభించారు. మొబైల్ ఫోన్ల, రీగ్రామింగ్తో సహా భద్రత, దొంగతనం, ఇతర సమస్యలను పరిష్కరించడానికి టెలికమ్యూనికేషన్ విభాగం (డీఓటీ) దీన్ని చేపట్టింది.కోల్పోయిన లేదా కొట్టేసిన లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను అన్ని నెట్ వర్క్లలో బ్లాక్ చేయడం, మొబైల్ ఫోన్లలో కీలకమైన నకిలీ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నిరోధించడం, నకిలీ మొబైల్ పరికరాల ఉపయోగాన్ని నిరోధించడం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యాలు. సీఈఐఆర్ గ్లోబల్ ఐఎమ్ఈఐ డేటాబేస్ కు అనుసంధానమై ఉంటుంది. దీని ద్వారా డేటాబేస్లో ఉన్న ఇతర ఐఎంఈఐ సంఖ్యలతో పోల్చి నకిలీ హ్యాండ్సెట్లను గుర్తించడానికి అనుమతిస్తుంది. ఫోన్ పోతే ఫిర్యాదు ఎలా చేయాలి మీరు మీ ఫోన్ను పోగొట్టుకున్నా లేదా అది ఎవరైనా దొంగిలించినా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆపై 14422 హెల్ప్లైన్ ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డాట్)కి తెలియజేయాలి. దీంతో సత్త్వరమే డాట్ మీ ఫోన్ను బ్లాక్ చేస్తుంది. తద్వారా దొంగిలించిన వ్యక్తి లేదా మహిళ ఆ పరికరాన్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తే వెంటనే గుర్తిస్తుంది. అంతేకాదు భవిష్యత్తులో దీన్ని ఉపయోగించడం కుదరదు. ఈ వ్యవహారంలో బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా లాంటి మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ డాట్కు సహకరిస్తాయి. -
వామ్మో ఈ ప్రిన్సిపాల్ యమ డేంజర్: వైరల్ వీడియో
సాక్షి, బెంగళూరు: కళాశాలకు విద్యార్థులు మొబైల్ ఫోన్లు తీసుకుపోవడం ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది. వెంట పుస్తకాలు ఉంటాయో లేదో చెప్పలేం కానీ చేతిలో ఐఫోన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే కాలేజీ తరగతి గదుల్లోకి ఫోన్లను తీసుకురావద్దని బెంగళూరులోని ఎంఈఎస్ చైతన్య పీయూ కాలేజీ కఠిన నిబంధన విధించింది. అయినా తీరు మార్చుకోని విద్యార్థులు అదేపనిగా తరగతి గదుల్లో ఫోన్ వాడుతున్నారు. లెక్చరర్ పాఠాలు చెబుతున్నా వాట్సప్ చాటింగ్స్లో మునిగిపోతున్నారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థుల ముందే తన ఆగ్రహావేశాలు ప్రదర్శించాడు. విద్యార్థుల వద్దనున్న ఫోన్లను తీసుకుని వారిముందే సుత్తెతో ముక్కలుముక్కలుగా పగలగొట్టాడు. మరెవరైనా ఇంకోసారి తరగతి గదిలోకి చరవాణి తీసుకువస్తే ఇదే విధంగా ముక్కలవుతుందని హెచ్చరించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్గా మారింది. -
ఒక చేత్తో డ్రైవింగ్ మరో చేతిలో సెల్ఫోన్
-
ఖైదీ కడుపులో నుంచి ఫోన్ రింగ్..
సాక్షి, న్యూఢిల్లీ: తీహార్ జైలులో విచారణలో ఉన్న ఒక ఖైదీని కోర్టులో ప్రవేశపెట్టిన తరువాత తిరిగి జైలుకు తీసువచ్చారు. ఆ ఖైదీని తనిఖీ చేస్తుండగా అతని కడుపులో నుంచి ఫోన్ రింగ్ వినిపించింది. తొలుత అది ఎక్కడి నుంచి వస్తున్నదనేది అధికారులు గుర్తించలేకపోయారు. అయితే ఖైదీ దగ్గరి నుంచి వస్తోందని మాత్రం గ్రహించారు. మరింతగా పరిశీలించేసరికి ఆ ఖైదీ కడుపులో నుంచి ఈ శబ్ధం వస్తున్నదని పసిగట్టారు. దీంతో ఆ ఖైదీని వారు ప్రశ్నించగా తాను అతిచిన్న ఫోనును, ఛార్జర్ లీడ్ను మిగేశానని తెలిపాడు. దీంతో జైలు అధికారులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. తరువాత పోలీసులు ఆ ఖైదీ కడుపులో నుంచి ఫోనును బయటకు తీసుకురాగలిగినా, ఛార్జర్ మాత్రం రాలేదు. ఇప్పటికీ అది అతని కడుపులోనే ఉండిపోయింది. ఈ ఘటన తీహార్ జైలు జరిగింది. కాగా ఈ ఖైదీ గతంలోనూ జైలు లోనికి ఫోను తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తూ పట్టబడ్డాడని అధికారులు తెలిపారు. -
తలకిందులుగా చెట్టుకు వేలాడదీసి..
హరిద్వార్ : మొబైల్ ఫోన్ చోరీ చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తిని కొందరు తలకిందులుగా చెట్టుకు కట్టేసి తీవ్రంగా హింసించిన ఘటన ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో వెలుగుచూసింది. చెట్టుకు తలకిందులుగా వ్యక్తిని వేలాడదీసిన ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా గత వారంలోనూ మొబైల్ ఫోన్ను దొంగిలించాడనే ఆరోపణలపై ఓ టీనేజర్ను దారుణంగా కొట్టడంతో తీవ్ర గాయాలైన బాధితుడు మరణించిన సంగతి తెలిసిందే. స్ధానికులు అతడిని ఇంటి నుంచి బయటకు ఈడ్చుకువచ్చి మూక దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో పోలీసులు తమ స్టేట్మెంట్ను నమోదు చేసుకున్నారని, గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో ఆ తర్వాత కేసు నమోదు చేశారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. -
టీనేజ్ అమ్మాయి మొబైల్ వాడితే జరిమానా..!
మెహసనా (గుజరాత్): పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా అన్ని రంగాల్లో తమదైన నైపుణ్యంతో మహిళామణులు దూసుకెళ్తున్నారు. ఇక ఈ స్మార్ట్ఫోన్ యుగంలో ప్రతి ఒక్కరికీ మొబైల్ లేనిదే పూట గడవదు..! అయితే, గుజరాత్లోని బనస్కాంత దంతివాడ ఠాకూర్ సంఘం మాత్రం భిన్న వాదన వినిపిస్తోంది. అమ్మాయిలకు కొత్త రూల్ విధించింది. పెళ్లికాని అమ్మాయిలు మొబైల్ ఫోన్లు వాడొద్దని హుకుం జారీ చేసింది. మెహసనా జిల్లా జలోల్ గ్రామంలో ఠాకూర్ సంఘం ఇటీవల ఒక సమావేశాన్ని నిర్వహించి, గ్రామ ప్రజలంతా కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త నిబంధనల ప్రకారం అవివాహితులైన అమ్మాయిలు మొబైల్ ఫోన్లు ఉపయోగించకూడదని తీర్మానించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారు శిక్షార్హులు. ఇందుకు శిక్షగా అమ్మాయి తండ్రి జరిమానాగా రూ.1.50 లక్షలు చెల్లించాలి. ఇవే కాకుండా.. వివాహ సమయాల్లో టపాసులు కాల్చడం, డీజే వాడటం వంటి అదనపు ఖర్చులు నిలిపివేయాలని నిర్ణయించారు. ఏ అమ్మాయి అయినా కుటుంబం అనుమతి లేకుండా వివాహం చేసుకుంటే అది నేరంగా పరిగణిస్తామని గ్రామస్తులు తీర్మానించారు. ఠాకూర్ సంఘం నాయకుడు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్ మాట్లాడుతూ... ‘వివాహాలలో ఖర్చులను తగ్గించడం వంటి కొన్ని నియమాలు బాగున్నాయి. టీనేజ్ అమ్మాయిలకు మొబైల్ ఫోన్లు అనుమతించనట్లే, అబ్బాయిల గురించి కూడా ఒక నియమం చేసుంటే బాగుండేది. నా వివాహం కూడా ప్రేమ వివాహం అయినందున ప్రేమ వివాహాలపై నియమాల గురించి నేను ఏమీ చెప్పలేను. మన దేశ రాజ్యాంగ నిబంధనలు అందరికీ వర్తిస్తాయ’ని అన్నారు. -
వచ్చే నెలలో మొబైల్ ట్రాకింగ్ వ్యవస్థ
న్యూఢిల్లీ: దొంగతనానికి గురైన లేదా పోయిన మొబైల్ ఫోన్స్ ఆనవాళ్లు పట్టుకునేందుకు ఉపయోగపడే ట్రాకింగ్ విధానాన్ని ఆగస్టులో అందుబాటులోకి తేవాలని టెలికం శాఖ యోచిస్తోంది. మొబైల్ ఫోన్ నుంచి సిమ్ కార్డు తీసేసినా, ఐఎంఈఐ నంబరును మార్చేసినా కూడా ట్రాకింగ్ చేయగలిగేంత శక్తివంతంగా ఈ విధానం ఉంటుందని అధికారి ఒకరు తెలిపారు. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ–డాట్) ఇప్పటికే ఈ టెక్నాలజీని సిద్ధం చేసిందని, ఆగస్టు నుంచి సర్వీసులు ప్రారంభం కావొచ్చని ఆయన వివరించారు. ప్రస్తుత పార్లమెంటు సెషన్ ముగిశాక .. సేవల ఆవిష్కరణ కోసం మంత్రితో టెలికం శాఖ చర్చించనుందని పేర్కొన్నారు. నకిలీ హ్యాండ్సెట్స్, మొబైల్ దొంగతనాల సమస్యను అరికట్టేందుకు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పేరిట ఏర్పాటైన మొబైల్ ఫోన్ ట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్రం రూ. 15 కోట్లు కేటాయించింది. పనిచేసేదిలా.. సిమ్ కార్డు తీసేసినా, ఐఎంఈఐ నంబరును మార్చినా కూడా చోరీకి గురైనా లేదా పోయిన ఫోను ఇతరత్రా ఏ నెట్వర్క్పైనా పనిచేయకుండా చేయగలిగేలా సీఈఐఆర్ టెక్నాలజీ ఉంటుంది. అన్ని మొబైల్ ఆపరేటర్ల ఐఎంఈఐ డేటాబేస్ను ఇది అనుసంధానిస్తుంది. ఒకరకంగా బ్లాక్లిస్ట్లో ఉన్న మొబైల్ టెర్మినల్స్ వివరాలను నెట్వర్క్ ఆపరేటర్లు పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు ఇది ఒక కేంద్రీయ వ్యవస్థలా పనిచేస్తుంది. తద్వారా ఒక నెట్వర్క్ సేవలు అందిస్తున్న మొబైల్ ఫోన్స్ ఒకవేళ చోరీకి గురైన పక్షంలో .. మిగతా టెల్కోలు కూడా ఆ మొబైల్కు టెలికం సేవలు అందకుండా ఆపివేయొచ్చు. దీనిపై పైలట్ ప్రాజెక్టును మహారాష్ట్రలో నిర్వహించారు. -
స్మార్ట్ఫోన్ లాక్ మీ వయసు చెబుతోంది!
స్మార్ట్ఫోన్ను మీరెలా లాక్ చేస్తారన్న విషయం ఆధారంగా మీ వయసు ఎంతో చెప్పేవచ్చునని అంటున్నారు బ్రిటిష్ కొలంబియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. అదెలా అనుకుంటున్నారా. చిన్న విషయం చూద్దాం. పాతతరం స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఫోన్ తనంతట తానే లాక్ అయిపోవాలని కోరుకుంటే.. కొత్తతరం వాళ్లు దీనికి భిన్నమైన ఆలోచన చేస్తారని ఈ అధ్యయనం చెబుతోంది. అంతేకాకుండా పాతతరం వాళ్లు పిన్ నెంబర్ను వాడితే.. కొత్తతరం వాళ్లు వేలిముద్రలు వాడతారు. స్మార్ట్ఫోన్ల వాడకానికి వయసుకు మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించేందుకు జరిగిన తొలి అధ్యయనం ఇదేనని అంటున్నారు కాన్స్టాంటిన్ బెజ్నోసోవ్ అంటున్నారు. వయసు మళ్లినవారు తమ స్మార్ట్ఫోన్ను అప్పుడప్పుడూ అన్ లాక్ చేస్తూంటారని చెప్పారు. ఇతరులు మన స్మార్ట్ఫోన్లను వాడకుండా చూసేందుకు ఏం చర్యలు తీసుకోవాలన్న విషయంపై తాము పరిశోధనలు చేశామని, ఈ క్రమంలో ఫోన్ల వాడకం తీరుతెన్నులు తెలిశాయని, వీటి ఆధారంగా భవిష్యత్తులో స్మార్ట్ఫోన్లను ఎలా డిజైన్ చేయాలో అంచనా వేయవచ్చునని బెజ్నోసోవ్ తెలిపారు. తాము 19 నుంచి 63 మధ్య వయసు వారిపై అధ్యయనం జరిపామని... వీరందరి ఫోన్లలో ప్రత్యేక అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసి రెండు నెలలపాటు పరిశీలన చేసినప్పుడు వీరందరూ ఏ సందర్భాల్లో లాక్ చేస్తారు? అన్లాక్ చేస్తారు... అన్న విషయం తెలిసింది. పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువ కాలం స్మార్ట్ఫోన్లు వాడతారని ఈ అధ్యయనం చెబుతోంది. అయితే వయసు పెరిగే కొద్దీ ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని.. 50 ఏళ్ల వయసులో మగవారు ఎక్కువగా ఫోన్ వాడితే.. మహిళలు తక్కువ వాడతారని బెజ్నెసోవ్ వివరించారు. -
కేబినెట్ భేటీలో మంత్రుల వాట్సాప్.. కీలక నిర్ణయం!
లక్నో: సీరియస్గా కేబినెట్ భేటీ లేదా సీఎం సమావేశాలు జరుగుతున్న సమయంలో కొందరు మంత్రులు తీరిగ్గా వాట్సాప్ మెసెజ్లు చదువుతున్నారంట. దీంతో చీరెత్రుకొచ్చిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కేబినెట్ సమావేశాల్లో ఎవరూ సెల్ఫోన్లు వాడరాదంటూ నిషేధం విధించారు. అంతేకాకుండా తన అధికారిక భేటీల్లోనూ ఎవరూ మొబైల్ ఫోన్లు వాడకుండా నిషేధించారు. ‘కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతున్న అంశంపైనే మంత్రులంతా శ్రద్ధ పెట్టాలని సీఎం భావిస్తున్నారు. మొబైల్ ఫోన్స్ వల్ల ఎవరూ తమ దృష్టిని మరల్చకూడదు. సమావేశాల్లో కొందరు మంత్రులు వాట్సాప్ మెసెజ్లు చదువుతూ బీజీగా ఉంటున్నారు. అందుకే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని సీఎం కార్యాలయంలోని ఓ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. ఎలక్ట్రానిక్ పరికరాల హ్యాకింగ్, ఇతరత్రా దుర్వినియోగపరిచే ముప్పు ఉండటం కూడా ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ఇంతకుమునుపు తమ సెల్ఫోన్లు సైలెంట్ మోడ్లో పెట్టుకొని సీఎం సమావేశాల్లో పాల్గొనేందుకు మంత్రులకు అనుమతి ఉండేది. ఇప్పుడు మంత్రులంతా నిర్దేశిత కౌంటర్లో తమ ఫోన్లను అప్పగించి.. టోకెన్ తీసుకొని.. సమావేశాలు ముగిసిన తర్వాత వాటిని తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. -
అతిగా ఆడుతున్నారా..?
స్మార్ట్ఫోన్.. ఈ పేరు ఎత్తగానే పిల్లలు మంచి క్రేజీగా ఫీలవుతారు. ఆన్లైన్ గేమ్స్.. ఈ పేరు వింటే ఎగిరి గంతేస్తుంటారు. స్మార్ట్ఫోన్ కనిపిస్తే చాలు చటుక్కున చేతిలోకి తీసుకోవడం నేటి పిల్లలకు పరిపాటి. ఆన్లైన్లో గేమ్స్ డౌన్లోడ్ చేయడం, గంటల తరబడి ఆడుకోవడం.. ఏ ఇంట్లో చూసినా ఇదే తంతు. ఒక్కప్పుడు టీవీలు, కంప్యూటర్లలోనే ఆడగలిగిన వీడియోగేమ్స్.. కాలక్రమంలో అనేక రకాలుగా రూపాంతరం చెంది క్రమంగా మామూలు ఫోన్లు, స్మార్ట్ఫోన్లలోకి దూరిపోయి ప్రపంచంలో సరికొత్త సంచలనంగా మారిపోయాయి. చాలామంది పిల్లలకు వీడియో గేమ్స్ ఆడటం ఇటీవల కాలంలో ఒక వ్యసనంగా మారిపోయింది. ప్రధానంగా 10 నుంచి 14 ఏళ్ల మధ్య ఉండే పిల్లలు వీటికి బానిసలుగా మారుతున్నారు. అది ఎంత తీవ్రంగా మారిందంటే తల్లిదండ్రులు వీడియో గేమ్స్ ఆడనివ్వడం లేదని అలిగి ప్రాణాలు తీసుకునేంతలా..! వీడియో గేమ్స్కి ఇప్పుడు పిల్లలు బానిసలుగా మారిపోతున్నారని ప్రపంచంలోని అనేక రీసెర్చ్ సంస్థలు చేసిన అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సైతం పలు సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం బ్రిటన్, అమెరికా, భారత్ దేశాల్లో చాలా మంది పిల్లలు వీడియో గేమ్స్ వ్యసనాల బారిన ఇప్పటికే పడ్డారని, మరికొంతమంది ఆ వ్యసనానికి గురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పిల్లలు వీడియో గేమ్స్కి బానిసలుగా మారుతుండటంలో తల్లిదండ్రుల పాత్ర కూడా ప్రముఖంగా ఉంది.వారి అల్లరిని తట్టుకోలేక తల్లిదండ్రులు సైతం పిల్లలకు మొబైల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు అయితే వారి పిల్లలు కోరిన వీడియో గేమ్లను సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసి మరీ ఈ విషయంలో వారికి సహకరిస్తున్నారు. అయితే వీడియో గేమ్స్కు ఎక్కువగా అలవాటు పడుతున్న పిల్లల్లో మానసిక ప్రవర్తన ప్రతికూలంగా మారుతుందని సైకియాట్రిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడియో గేమ్స్కి బానిసలుగా మారుతున్న పిల్లలు చదువుతో పాటు ఇతర విషయాలపై అసలు శ్రద్ధ పెట్టడం లేదని వారు చెబుతున్నారు. తల్లిదండ్రులు వారికి ఉన్నఫళంగా మొబైల్ ఇవ్వకుండా మానేస్తే పిల్లలు విపరీత చర్యలకు పాల్పడుతున్నారు. అయితే ఫోన్ ఇవ్వాలనే ఆలోచన మాకు లేకపోయినా వారి అల్లర్లను తట్టుకోలేకే వారికి ఫోన్లు ఇస్తున్నామని కొందరు తల్లిదండ్రులు చెబుతుండటం గమనార్హం. దీనివల్ల పిల్లలకు ఇబ్బందులు వస్తాయని తెలిసినా తప్పడం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. పిల్లలను మొబైల్ ఫోన్లు, అందులో ఉండే గేమ్స్కి దూరంగా ఉంచడం ఎలా? ఇది చాలామంది తల్లిదండ్రులను వేధించే ప్రశ్న. కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటే పిల్లలను వీడియో గేమ్స్కి బానిసలుగా కాకుండా చూడవచ్చని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. అతిగా ఆడితే నష్టమే.. వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడే పిల్లలు మానసిక సమస్యలు, డిప్రషన్తో బాధపడుతున్నట్లు మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.వీటికి ట్రీట్మెంట్ అంటే ఇతర వ్యసనాల కంటే భిన్నంగా ఇవ్వాల్సి ఉంటుంది. వీరికి ఇంటర్నెట్ను పరిమితంగా వాడుకోవడం నేర్పించాలి. టెక్నాలజీతో మానవాభివృద్ధికి ఎన్నిరకాల ఉపయోగాలు ఉంటాయో అంతవరకే వాటిని ఉపయోగిస్తూ గేమ్స్ డేటా వంటివాటిని పరిమితంగా వాడుకుంటేనే బాగుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్ల్లలు అదే పనిగా వీడియో గేమ్స్ ఆడుతుండటాన్ని గమనిస్తే అది ఒక వ్యసనంగా వారికి మారుతున్నట్లు గుర్తించాలి. పూర్తిగా పరిసరాలను మర్చిపోయి అందులో లీనమైపోవడం ఒక రకమైన మానసిక సమస్యగా పరిగణించాలంటున్నారు నిపుణులు. రోజంతా సెల్ఫోన్ల ముందు కూర్చొని గేమ్స్ ఆడుతున్న పిల్లల్లో మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లలు ఎప్పుడు చూసినా అదే పనిగా ఇంటర్నెట్ బ్రౌజింగ్, వీడియో గేమ్స్ ఆడటాన్ని మానసిక సమస్యలుగా పరిగణించాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎక్కువ సమయం వీడియో గేమ్స్కు కేటాయిస్తున్న వారిలో నిద్రలేమి, ఏకాగ్రత లోపం ఇంకా మతిమరుపు వంటి రుగ్మతలు చోటు చేసుకుంటున్నాయి. తదేకంగా వీడియో గేమ్స్ ఆడడం వల్ల కంటి చూపుపై ఒత్తిడి పెరిగి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అలాగే వీడియో గేమ్స్లో చూపెడుతున్న మితిమీరిన యాక్షన్, అశ్లీల దృశ్యాలు చిన్నారులను పెడదోవ పట్టించే అవకాశాలున్నాయి. అతిగా వీడియో గేమ్స్ ఆడటం వల్ల చిన్నవయసులోనే రక్తపోటు వచ్చే అవకాశాలున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీడియో గేమ్స్ ఆడడం వల్ల మూర్ఛ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఈ వ్యసనం వల్ల అనారోగ్యమే కాకుండా..పిల్లల్లో హింసా ప్రవృత్తి, దూకుడుతనం ఎక్కువ అవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇంకా..జీవక్రియ వేగం పెరగటం, చేతులకు ‘రిపిటీటివ్ స్ట్రెయిన్ ఇంజ్యూరీ‘ లాంటి సమస్యలు పెరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ‘గేమ్స్’ బాధితుల కోసం రిహాబిలిటేషన్ సెంటర్స్ భారత్లో గేమ్స్ మార్కెట్ నాలుగు రకాలుగా విస్తరించింది. అవి పీసీ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్, మొబైల్ గేమ్స్, కన్సల్ గేమ్స్. వీటికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. 2018 నాటికి ఇవి 40 బిలియన్ డాలర్లు దాటింది. గ్లోబల్ మార్కెట్లో ప్రస్తుతం 100 బిలియన్ డాలర్లను మించి వ్యాపారం జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా గేమింగ్ మార్కెట్లో అమెరికా, యూరప్ దేశాలతో పాటు జపాన్ ప్రథమ స్థానంలో ఉండగా, చైనా, భారత్ల్లో ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. పర్సనల్ కంప్యూటర్ వచ్చిన తొలిరోజుల్లో మేరియన్ టెట్రిస్ వంటి సాధారణ స్థాయి గేమ్స్ అందరినీ అలరించాయి. అప్పట్లో గ్రాఫిక్స్ పరిమితంగా ఉండేవి. కాలక్రమంలో మెరుగైన గ్రాఫిక్స్తో 2డీ, యానిమేషన్స్ ఇలా రూపాంతరం చెందాయి. నేడు ఫొటో రియలిస్టిక్, 3డీ గేమ్స్ వచ్చాయి. కంప్యూటర్లో ఉండే బీప్ అనే శబ్దంతో ఆరంభమై నేడు మ్యాజిక్, సౌండ్స్తో అలరిస్తున్నాయి. ఈ పాత గేమ్స్లో ఆటను కొద్దిసేపు గమనిస్తే చాలు గెలవడం తేలిగ్గానే ఉండేది. ఇప్పటి గేమ్స్ అలా కాదు. రోజుల తరబడి, సంవత్సరాల తరబడి ఆడినా కంప్లీట్ కావు. ఒక్క అమెరికాలోనే కోటి మందికి మించి ఇంటర్నెట్ గేమ్స్కు బానిసలుగా మారిపోయారు. కొరియాలో అయితే ఇలాంటి వారి కోసం రిహాబిలిటేషన్ సెంటర్లు విచ్చలవిడిగా వెలిశాయి. చైనా, జపాన్, తైవాన్లోనూ ఈ గేమింగ్ విపరీతంగా కనిపిస్తుంది. జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఇంటర్నెట్ ఎడిక్షన్ డిజార్ట్ సమస్య ఉన్న దేశాలు చాలానే ఉన్నాయి. గేమ్స్ ఆడనివ్వడం లేదని ఇటీవల పిల్లలు పాల్పడిన దుశ్చర్యలు ఎక్కువ సేపు సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాడని తండ్రి మందలించడాన్ని తట్టుకోలేక గతేడాది ఢిల్లీలో ఓ బాలుడు (15) తన తండ్రి పడుకున్నప్పుడు గొంతునులిమి చంపేశాడు గేమ్స్ ఎక్కువగా ఆడుతున్నాడని తల్లిదండ్రులు మందలించడంతో కోపం తట్టుకోలేక గతేడాది డిసెంబర్లో రాజస్థాన్లో ఓ బాలుడు తన తల్లిదండ్రులను కత్తితో తీవ్రంగా గాయపర్చాడు వీడియో గేమ్ ఆడుకుంటుండగా తన సోదరి సెల్ఫోన్ లాక్కుందనే కోపంతో ఆమెపై బ్లేడుతో ఓ బాలుడు దాడి చేసిన ఘటన పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్లో జరిగింది సెల్ఫోన్లో గేమ్స్ ఎక్కువగా ఆడుతున్నాడని తండ్రి మందలించడంతో బెంగళూరులోని తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడు ఇంటి నుంచి సెల్ఫోన్ తీసుకుని పారిపోయాడు తల్లిదండ్రులు ఏం చేయాలి? కొన్ని ఈ పేరెంటింగ్ టిప్స్ ద్వారా పిల్లల ఆలోచనలను మార్చవచ్చు. ఇంటికి కొన్ని నియమాలను రూపొందించాలి. ఉదాహరణకు ఎంతసేపు మొబైల్ వాడాలో పిల్లలకు పక్కాగా చెప్పాలి. పిల్లలతో మాట్లాడి ఇంటర్నెట్లో వాళ్లేం చూస్తున్నారో తెలుసుకోవాలి. వారి మీద వారికి తెలియకుండా నిఘా వేసి ఉంచాలి. ఎక్కువ సేవు గేమ్స్ ఆడుతున్నట్లు గానీ కనిపిస్తే వెంటనే వారికి అర్థమయ్యేటట్లు చెప్పి గేమ్స్ నుంచి వారి ఆలోచనలను వేరే అంశాలపైకి మరలేలా చర్యలు తీసుకోవాలి. ఏవో వీడియోలు, వెబ్సైట్లు చూసే బదులు సోషల్ మీడియాలో స్నేహితులతో గానీ బంధువులతో గానీ మాట్లాడమని సూచించాలి. ఏది కనిపిస్తే దానిపైన క్లిక్ చేయడం ప్రమాదకరమని వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. వారాంతాల్లో ఎక్కువ సమయం పిల్లలతో గడిపేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకుంటే పిల్లలు గేమ్స్ అంటూ పక్కదారి పట్టబోరని పలు పరిశోధనాత్మక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పిల్లలకు సరిపడని వెబ్సైట్లు ఫోన్లో కనిపించకుండా సెట్టింగ్స్ మార్చాలి. ఇంటర్నెట్లో వ్యక్తిగత సమాచారం పంచుకోవడం ప్రమాదకరమని తెలియజేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా, పిల్లలకు నేర్పే ముందు తల్లిదండ్రులు తమ అలవాట్లను మార్చుకోవాలి. - పక్కి రాకేష్ పట్నాయక్, సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఫోన్ కొట్టు.. ఓటు పట్టు..
ఆర్మూర్: హలో.. రాధ గారేనా మాట్లాడేది.. మీకు ఆసరా పథకంలో భాగంగా వితంతు పింఛన్ అందుతోందా.. పింఛన్ తీసుకోవడంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా.. ఇప్పుడు మీకు నెలకు వెయ్యి రూపాయల పింఛన్ వస్తోంది కదా.. పార్లమెంట్ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం నెలకు రెండు వేల 16 రూపాయల పింఛన్ ఇవ్వనుంది.. కాబట్టి మీరు నిజామాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకే ఓటు వేయండి అంటూ ఒక వ్యక్తి గొంతు రాధకు వివరించింది. ఈ విషయం తన కుటుంబ సభ్యులతో పాటు కాలనీవాసులకు చెప్పగా అయ్యో ఇలాంటి ఫోన్లు మా అందరికీ వస్తున్నాయంటూ ఆసరా పథకంలో భాగంగా వృద్ధాప్య పింఛన్, వికలాంగుల పింఛన్, వితంతు పింఛన్, బీడీ కార్మికుల జీవన భృతి పొందుతున్న మహిళలు చర్చించుకుంటున్నారు. రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా అవుతోందా.. ఎకరానికి ఎనిమిది వేల రూపాయల పెట్టుబడి వ్యయం అందిందా.. రైతు బీమా పథకంలో పేరు నమోదు చేపించుకున్నారా తదితర సమాచారాన్ని చేరవేస్తూ ఫోన్లు చేస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్, బీజేపీలు సైతం తాము కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న పథకాలను సైతం ఓటర్లకు ఫోన్ల ద్వారా వివరిస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ విజయాన్ని మూట గట్టుకోవడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా సద్వినియోగం చేసుకోవాలనే ఇలాంటి ప్రయత్నాల్లో ఉన్నారు. నేటి రోజుల్లో సెల్ఫోన్ ఉపయోగించని ఓటరు ఉండడన్నది ఎవరూ కాదనలేని నిజం. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఓటర్లను తమకు అనుకూలంగా మల్చుకొనే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రత్యేకంగా కాల్ సెంటర్ల వారితో ఒప్పందాలు చేసుకొని తమ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని లబ్ధిదారులు, ఓటర్ల ఫోన్ నంబర్లను వారికి చేరవేస్తున్నారు. ఇంకేముంది సదరు కాల్ సెంటర్ ఉద్యోగులు ఒకటికి పదిసార్లు ఓటర్లకు ఫోన్లు చేస్తూ తమ పార్టీ గొప్పతనాన్ని తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి బలాబలాలను ఓటర్లకు వివరిస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు ఒక అడుగు ముందుకు వేసి తనకు ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను విజ్ఞప్తి చేస్తూ వాయిస్ రికార్డు చేసి ఫోన్లు చేస్తూ ఆ వాయిస్ రికార్డును వినిపిస్తున్నారు. ఓటర్ ఫోన్కు పర్సనల్ మెసేజ్లను పంపిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహిస్తే ఇంటర్నెట్ ఉపయోగించే యువకులు, ఉద్యోగులు, చదువుకున్న వారికి మాత్రమే సమాచారం చేరడానికి ఆస్కారం ఉంది. కానీ ఫోన్ చేసి వివరాలు చెబితే సెల్ ఫోన్ ఉపయోగించే మహిళలు, వృద్ధులు, నిరక్ష్యరాస్యులకు సైతం సమాచారం చేరవేసే ఆస్కారం ఏర్పడుతోంది. ఇది గ్రహించిన అభ్యర్థులు సెల్ ఫోన్ల ద్వారా ఓటర్లకు ఫోన్లు చేయిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు. దీంతో సోషల్ మీడియాతో పాటు కొత్త పుంతలు తొక్కుతున్న ఎన్నికల ప్రచారంపై సెల్ ఫోన్లు ఉపయోగించే ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. -
త‘స్మార్ట్’ జాగ్రత్త
రిజర్వేషన్ కావాలన్నా.. సరుకులు కొనాలన్నా.. బిల్లులు కట్టాలన్నా.. ఒకటేమిటి.. దేనికైనా.. గుమ్మం కదలనక్కర లేదు. చాంతాడంత క్యూల్లో నిల్చోనక్కర లేదు. ఆపసోపాలు పడనక్కర లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. చిటికెలో పనులు చేసుకుంటున్నారు. ఎక్కువ సమయం ఫోన్లతోనే గడుపుతున్నారు. మాట్లాడుతూ.. చాటింగ్ చేస్తూ.. సినిమాలు చూస్తూ.. రోజులో సగటున నాలుగైదు గంటలు ఫోన్లకే వెచ్చిస్తున్నారు. చేతిలో ఉన్నంతసేపూ చాటింగ్.. లేదా చార్జింగ్.. చార్జింగ్ చేస్తూ మళ్లీ చాటింగ్.. ఇదే ప్రమాదకరంగా మారుతోంది. సెల్ఫోన్లు పేలిపోతూ ప్రాణాలు హరిస్తున్నాయి. ఫోన్ వినియోగంలో జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు రావని నిపుణులు సూచిస్తున్నారు. – విజయనగరం మున్సిపాలిటీ దాదాపు ప్రస్తుతం అందరూ స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. వీటితో ఎంత ప్రయోజనం ఉందో.. వినియోగంలో నిర్లక్ష్యం వహిస్తే అంత ముప్పు కూడా పొంచి ఉంది. మొబైల్ పేలుతున్న సంఘటనల్లో ఎక్కువ శాతం చవగ్గా కొనుగోలు చేసినవి.. బ్రాండెడ్ కానివి మాత్రమే ఉంటున్నాయి. తక్కువ ధరకు వస్తున్నాయని కొంటున్న ఫోన్లు ఎంతవరకు భద్రమో తెలుసుకోవాలి. మొబైల్స్లో బ్యాటరీ అత్యంత కీలకం. నాసిరకానివి లోపాలతో పేలుతుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఫోన్లలో ఆయా సంస్థలు భద్రత పరంగా తీసుకునే చర్యలు పెద్దగా ఉండవు. ఎక్కువ సేపు మాట్లాడితే చాలు వేడెక్కి పేలిపోతుంటాయి. చార్జింగ్లో అజాగ్రత్తలతో ముప్పు చార్జింగ్ అవుతుండగా చాలామంది మాట్లాడుతుంటారు. వాట్సాప్, వీడియోలు చూస్తుంటారు. వీడియో గేమ్స్ ఆడుతుంటారు. ప్రమాదమని తెలిసినా తేలిగ్గా తీసుకోవడంతో చిక్కులు వస్తున్నాయి. మొబైల్ను ఇతర విద్యుదుపకరణాలపై పెట్టడం సరికాదు. చార్జింగ్ పాయింటు ఉంది కదా అని రిఫ్రిజిరేటర్, టీవీపై కొందరు పెడుతుంటారు. అది ప్రమాదకరం. ఫోన్ కొన్నప్పుడు ఇచ్చిన చార్జర్నే వాడాలి. ఇతర చార్జర్లతో ఫలితమున్నట్లు కనిపించినా అవుట్పుట్, ఇన్పుట్ ఓల్టేజీలో తేడాలుంటే ప్రమాదాలు సంభవిస్తాయి. చార్జర్ పోతే అదే సంస్థకు చెందినది తీసుకోవాలి. చౌకగా వస్తుందని నకిలీ చార్జర్లు వాడితే మన్నిక మూడు కాలాలే. మెలకువగా ఉన్నంతసేపు ఫోన్లు రావడం, అంతర్జాలం చూడటంతో చార్జింగ్ కుదరడం లేదు. దీంతో రాత్రి నిద్రించే ముందు పెడుతున్నారు. ఆధునిక స్మార్ట్ ఫోన్లు అర్ధగంటలో చార్జింగ్ అవుతున్నాయి కాబట్టి.. ఉదయం లేచాక చార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీలో చార్జింగ్ పూర్తికాగానే ఆగిపోతుంది. పేలిపోడానికి కారణాలివే ఫోన్లు పేలడానికి ప్రధానంగా డిజైన్, బ్యాటరీ, తయారీలో లోపాలూ కారణమవుతాయి. చాలా సంస్థలు వీటిలో ఉపయోగించే పరికరాలను వేర్వేరు సంస్థలకు అప్పగిస్తుంటాయి. నిపుణులతో పాటు అంతగా నైపుణ్యం లేనివారూ ఉంటారు. చైనా మొబైల్స్తో కూడా అక్కడక్కడా సమస్యలు వస్తున్నాయి. తక్కువ ధరలో స్మార్ట్ఫోన్ అంటే బ్యాటరీ నాణ్యతలో రాజీ పడాల్సి వస్తుంది. ఆ మధ్య ఓ సంస్థ ఫోన్ స్లిమ్గా ఉండాలని బ్యాటరీ లోపలే ఉండేలా డిజై¯Œన్ చేసింది. అప్పటివరకు తీసి పెట్టుకునేలా ఉండేది. బ్యాటరీ లోపలే ఉండటం, ఆ పక్కన స్థలం లేకుండా పోవడంతో పేలిన సంఘటనలున్నాయి. మొబైల్స్ సైతం సంకోచ, వ్యాకోచాలకు గురవుతుంటాయి. లోపల తగినంత ఖాళీ స్థలం ఉంటే ఇబ్బంది ఉండదు. లేనివి వాతావరణ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది. చాలా ఫోన్లు బ్యాటరీ ఉబ్బిపోయి.. కవర్ ఊడిపోయిన దాఖలాలున్నాయి. చాలామంది బిగుతుగా ఉండే జీన్స్ ప్యాంట్లో ఫోన్లు పెట్టుకుంటారు. తగిన గాలి ఆడక కూడా పేలడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఎర్తింగ్ సమస్యలు ప్రమాదాలకు కారణమవుతుంటాయి. ఓసారి అంతటా పరిశీలించుకోవాలి. చార్జింగ్లో మాట్లాడొద్దు ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఆండ్రాయిడ్ ఫోన్లపైనే మక్కువ పెంచుకుంటున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి తేడా లేకుండా గంటల తరబడి వాట్సాప్లు, ఫెస్బుక్ల్లో చాటింగ్లో, వీడియో కాల్స్ పేరిట మాట్లాడుతున్నారు. బ్యాటరీలో చార్జింగ్ తగ్గుతుంటే ఆ సమయాన్ని కూడా విడిచిపెట్టడం లేదు. ఓ వైపు బ్యాటరీ చార్జ్ అవుతుండగానే.. మరో వైపు వారి పని కానిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇటీవల ఓ సంస్థ సెల్ఫోన్లు చార్జింగ్ అవుతుండగా బ్యాటరీలు పేలిపోయినట్టు వార్తలు వచ్చాయి. అలాంటి సమస్య ఎవరికైనా ఎదురుకావచ్చు. – ఎన్.లక్ష్మణరావు, సెల్ఫోన్ మెకానిక్, విజయనగరం. -
సెల్ ఫోన్ల దొంగ కోసం గాలింపు
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని పలు ప్రాంతా ల్లో సెల్ఫోన్లను చోరీ చేసిన దొంగ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ప్రయాణికులు బస్సు ఎక్కేటప్పుడు వారి జేబులో ఉన్న సెల్ఫోన్ను అతను ఎంతో చాకచాక్యంగా కొట్టేస్తాడు. కొన్ని రోజుల క్రితం సెల్ఫోన్ దొంగలిస్తూ సీసీ కెమెరాకు చిక్కాడు. త్రీ టౌన్ సీఐ జయానాయక్, ఎస్ఐ కృష్ణంరాజునాయక్ అతని ఫొటోలను పత్రికలకు విడుదల చేశారు. ఈ వ్యక్తి ఎక్కడైనా తారస పడితే 912100589, 9121100592 అనే నంబర్లకు ఫోన్ చేయాలని సీఐ, ఎస్ఐ కోరారు. సమాచారం ఇచ్చిన వారికి తగిన బహుమతి ఇస్తామన్నారు. -
ఫోన్కు బానిసైన కూతురిపై తండ్రి ఘాతుకం
సాక్షి, ముంబై : మొబైల్ ఫోన్ యువత జీవితాలను బలితీసుకుంటోంది. కన్నకూతురు నిత్యం ఫోన్లో మునిగితేలుతున్నదనే ఆగ్రహంతో తండ్రి ఆమెకు నిప్పుపెట్టిన ఘటన ముంబై మహానగరంలో వెలుగుచూసింది. పదేపదే ఫోన్లో సంభాషిస్తున్న కుమార్తె (16)ను తండ్రి మందలించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, నిందితుడు మహ్మద్ మన్సూరీ ఆగ్రహంతో బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించాడని పోలీసులు తెలిపారు. కాగా,డెబ్బై శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న బాలిక ప్రస్తుతం జేజే ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు చెప్పారు. ఘటన జరిగిన సమయంలో ఇతర కుటుంబ సభ్యులు ఎవరూ లేరని పేర్కొన్నారు.బాలికను స్ధానికులు ఆస్పత్రిలో చేర్పించారని పోలీసులు వెల్లడించారు. నిందితుడు మన్సూరీని అరెస్ట్ చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
యువతి స్నానం చేస్తుండగా..
సాక్షి, న్యూఢిల్లీ : యువతి స్నానం చేస్తుండగా సెల్లో ఫొటోలు తీసేందుకు యత్నించిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ ఘటన ఢిల్లీలోని శంకరపురలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. యువతి స్నానం చేసి వస్తుండగా పైఅంతస్తులో నివాసముండే 42 ఏళ్ల వ్యక్తి బాల్కనీలో ఉండడం గమనించారు. అతని చేతిలో మొబైల్ ఉండడం.. అంతకు ముందుకూడా తనతో అసభ్యంగా ప్రవర్తించి ఉండడంతో ఆమెకు అనుమానం కలిగింది. స్నానం చేస్తుండగా ఫొటోలు తీశాడేమోనని నిశ్చయించున్నారు. అదేవిషయమై అతన్ని ప్రశ్నించడంతో తటపటాయించాడు. పొంతనలేని సమాధానాలు చెప్తూ ఇంట్లోకి జారుకున్నాడు. జరిగిన విషయాన్ని ఇంట్లోని వారికి చెప్పిన యువతి తన తల్లిదండ్రులతో కలిసి నిందితున్ని నిలదీశారు. నిందితుడు తనకేమీ తెలియదని చెప్పి తప్పించుకోజూశాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్టు చేశామని, విచారణ ప్రారంభించామని తెలిపారు. ఓ ప్రముఖ హిందీ దిన పత్రికలో నిందితుడు టెక్నిషియన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. -
అమ్మాయిల ఫొటోలు చూస్తూ కెమెరాలకు బీఎస్పీ ఎమ్మెల్యే
యశవంతపుర (బెంగళూరు): కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో సోమవారం శాసనసభలో చర్చ జరుగుతుండగా, బీఎస్పీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎన్.మహేశ్ తన మొబైల్లో అమ్మాయిల ఫోటోలను వీక్షిస్తూ కెమెరాలకి చిక్కారు. సభ ప్రారంభానికి ముందు సభలోకి వచ్చి కూర్చున్న మహేశ్ స్మార్ట్ఫోన్లోని వాట్సాప్లో అమ్మాయిల ఫోటోలను చూడసాగారు. సభలో సభ్యులు మాట్లాడుతుండగా మహేశ్ ఫోన్లోనే నిమగ్నమయ్యారు. గతంలో బీజేపీ నేత యడ్యూరప్ప సీఎంగా ఉన్న సమయంలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు మొబైల్ఫోన్లో అశ్లీల దృశ్యాలు చూస్తూ కెమెరాలకు చిక్కిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సభలోకి మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడాన్ని నిషేధించారు. ఫోన్ల వినియోగానికి ప్రత్యేక గదిని కేటాయించారు. నిషేధం ఉన్నప్పటికీ మహేశ్ సభలోకి ఫోన్ తీసుకురావడం వివాదాస్పదమైంది. అయితే, తన కొడుకుకు వధువును వెతికే ప్రయత్నాల్లో భాగంగా ఓ మిత్రుడి పంపిన అమ్మాయిల ఫొటోలను తాను అసెంబ్లీలో చూశానని, ఈ విషయంలో దురుద్దేశాలు ఆపాదించరాదని, ఆ ఫొటోలను టీవీల్లో చూపించి.. వారి ప్రైవసీకి భంగం కలిగించవద్దని ఎమ్మెల్యే మహేశ్ మీడియాను కోరారు. -
సెల్ఫోన్ చార్జింగ్ పెడుతూ..
మోతె (కోదాడ) : సెల్ఫోన్ చార్జింగ్ పెడుతూ విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని తుమ్మగూడెంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మగూడెం గ్రామానికి చెందిన ఉబ్బపల్లి బాలయ్య భార్య ఉబ్బపల్లి మంగమ్మ(48) తెల్లవారుజామున తన ఇంట్లో సెల్ఫోన్ చార్జింగ్ పెట్టేందుకు ఓల్డర్లో ఫ్లగ్ పెడుతోంది. ఈ క్రమంలో బోర్డులో లూజ్ కనెక్షన్ ఉండడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. కుటుబం సభ్యులు బిగ్గరగా కేకలు వేయడంతో ఎస్సీ కాలనీవాసులు వచ్చి విద్యుత్ తీగను తొలగించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ఏరి యా ఆస్పత్రికి తరలించారు.మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. మృతురాలి భర్త బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నయోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై నాగయ్య తెలిపారు. -
అక్కాచెల్లెళ్ల మధ్య సెల్ఫోన్ గొడవ.. రైలు కిందపడి..
మంచిర్యాలక్రైం: మంచిర్యాల పట్టణంలో అక్కాచెల్లెళ్ల మధ్య సెల్ఫోన్ కోసం జరిగిన గొడవ అక్క ఆత్మహత్యకు కారణమైంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కంభం దామోదర్రెడ్డి పెద్ద కూతురు సుచిత (19) డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. శనివారం రాత్రి ఆమె తన చెల్లెలు హాసినితో కలసి ఇంట్లో సెల్ఫోన్ చూస్తుండగా.. ఫోన్ తనకే ఇవ్వాలంటూ చెల్లెలు గొడవ పడింది. ఇది గమనించిన తండ్రి ఇద్దరు కూతుళ్లను మందలించారు. పరీక్షలు వస్తున్నాయని, చదువుకోవాలని చీవాట్లు పెట్టారు. దీంతో మనస్తాపం చెందిన సుచిత తల్లిదండ్రులతో గొడవపడి రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు ఆమె కోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. ఆదివారం ఫ్లై ఓవర్ బ్రిడ్జికి కొంత దూరంలో రైలుపట్టాల పక్కనే సుచిత మృతదేహం కనిపించింది. రైలు కింద పడి సుచిత ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని హెడ్కానిస్టేబుల్ సత్తయ్య తెలిపారు. -
యువతి సెల్ఫోన్ చార్జింగ్ పెడుతుండగా.. విషాదం
బొంరాస్పేట: ఇంట్లో సెల్ఫోన్ చార్జింగ్ పెడుతూ విద్యుదాఘాతానికి గురైన ఓ గిరిజన యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండల పరిధిలోని వడిచర్ల పంచాయతీ ఊరెనికితండాలో శుక్రవారం చోటుచేసుకుంది. తండాలోని రుక్కిబాయి, రాంసింగ్ల కుమార్తె అర్చన(20) వ్యవసాయ కూలీ పనులు చేస్తూ తల్లిదండ్రులకు సహాయపడుతోంది. తల్లి రుక్కిబాయి తండాలోని పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ కార్మికురాలిగా పనిచేస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం తల్లికి బదులుగా పాఠశాలకు వెళ్లిన అర్చన వంటచేసి ఇంటికి వచ్చింది. ఇంట్లో సెల్ఫోన్ చార్జింగ్ పెడుతూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. అర్చన మృతితో తండాలో విషాదం అలుముకుంది. కాగా తండాలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు ఎర్తింగ్ సమస్య ఉండొచ్చని, సరిచేయాలని తండావాసులు కోరుతున్నారు. -
టెలి‘కామ్’ బాదుడు!
సాక్షి, బిజినెస్ విభాగం: రిలయన్స్ జియో రాకతో కకావికలమైన టెల్కో కంపెనీలు తమ ఆదాయాలను మెరుగుపర్చుకునే ప్రయత్నాలపై దృష్టి సారిస్తున్నాయి. ఫలితంగా ప్రీ–పెయిడ్ యూజర్ల నెత్తిన తప్పనిసరి కనీస రీచార్జ్ పిడుగు పడేశాయి. ఇప్పటిదాకా ఇస్తున్న లైఫ్టైమ్ వేలిడిటీని పక్కన పెట్టి ప్రతి నెలా కచ్చితంగా నిర్దిష్ట మొత్తంలో రీచార్జ్ చేసుకోవాల్సిందేనని లేకపోతే సర్వీసులు డిస్కనెక్ట్ చేస్తామని ఎస్ఎంఎస్లు పంపిస్తున్నాయి. రీచార్జ్ల కోసం టెల్కో దిగ్గజాలు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలు 28 రోజుల వేలిడిటీతో రూ. 100 లోపు కనీస ప్రీపెయిడ్ ప్యాక్స్ను ప్రవేశపెట్టాయి. వీటిలో రూ. 35, రూ. 65, రూ. 95 మొదలైన ప్యాక్స్ ఉన్నాయి. ఈ కనీస ప్లాన్స్తో రీచార్జ్ చేసుకోకపోతే 30 రోజుల్లోగా అవుట్గోయింగ్ కాల్స్, 45 రోజుల్లోగా ఇన్కమింగ్ కాల్స్ నిల్చిపోతాయి. అంటే ఈ కనీస ప్లాన్స్తో రీచార్జ్ చేసుకుంటేనే మొబైల్ సర్వీసులను .. ముఖ్యంగా ఇన్కమింగ్ కాల్స్ను అందుకోవచ్చు. ఈ కొత్త నిబంధన కారణంగా అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నా రీచార్జ్ గడువు ముగియడంతో ఇప్పటికే పలువురు ప్రీపెయిడ్ యూజర్లకు అవుట్గోయింగ్ కాల్స్ను నిలిపివేస్తున్నాయి. టెల్కోల నుంచి మెసేజిలు వస్తుండటం సాధారణమేనని వాటిని పెద్దగా పట్టించుకోని యూజర్లు.. కనీస రీచార్జ్పరమైన కొత్త మార్పుల వల్ల అకస్మాత్తుగా కాల్స్ ఆగిపోతుండటంతో గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇన్కమింగ్ కాల్స్ కోసం మాత్రమే ఎక్కువగా మొబైల్ ఫోన్స్ను ఉపయోగించే గ్రామీణ ప్రాంతాల్లో వారిపై ఈ విధానం ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. పెరగనున్న టెల్కోల ఆదాయాలు.. దీర్ఘకాలంగా రీచార్జ్ చేసుకోని కస్టమర్లు ఎయిర్టెల్లో 10 కోట్ల మంది, వొడాఫోన్ ఐడియాలో 15 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. కనీస రీచార్జ్ తప్పనిసరి కారణంగా వీరిలో ఎయిర్టెల్ నుంచి కనీసం సగం మంది బైటికి వెళ్లిపోయినా .. మిగిలిన వారి నుంచి ప్రతి నెలా ఆదాయం రానుంది. ఉజ్జాయింపుగా ఈ సంస్థలకు ఇప్పటిదాకా పాతిక కోట్ల మంది యూజర్లపై అడపాదడపా రూ. 250 కోట్లు వస్తుండ గా (రూ. 10 రీచార్జితో) .. ఇకపై యూజర్ల సంఖ్య సగం తగ్గినా కనీస రీచార్జీ రూ. 35 లెక్కన చూస్తే ప్రతి నెలా రూ. 437 కోట్లయినా రావచ్చని అంచనా. కనెక్షన్లు ఫుల్..ఆదాయం నిల్.. దేశీయంగా మొబైల్ ఫోన్ యూజర్లలో దాదాపు 95% మంది ప్రీపెయిడ్ యూజర్లే ఉంటారు. ఇప్పటిదాకా చాలా మటుకు కనెక్షన్స్ విషయంలో ఆర్నెల్లకోసారి అత్యంత తక్కువగా రూ. 10 రీచార్జ్ చేసుకున్నా సర్వీసులు, ఉచిత ఇన్కమింగ్ కాల్స్ కొనసాగేలా లైఫ్టైమ్ వేలిడిటీ వర్తింపచేస్తూ వస్తున్నాయి టెల్కోలు. కొత్త సబ్స్క్రయిబర్స్ను ఆకట్టుకునేందుకు టెలికం కంపెనీలు ఎప్పటికప్పుడు మరింత మెరుగైన ప్రయోజనాలతో కొంగొత్త టారిఫ్ ప్లాన్స్ను ప్రవేశపెడుతూ వస్తున్నాయి. దీంతో అనేక యూజర్లు అవసరం ఉన్నా లేకపోయినా.. రెండేసి..మూడేసి.. నాలుగేసి.. అంతకు పైగా సిమ్ కనెక్షన్లు తీసేసుకున్నారు. దీంతో ఫోన్లలో కూడా మార్పులు వచ్చాయి. డ్యుయల్ సిమ్ ఫోన్లు.. అంతకు మించి నాలుగైదు సిమ్లు వేసుకునే ఫోన్లు కూడా మార్కెట్లోకి హడావిడి చేశాయి. ఇవన్నీ పేరుకే కనెక్షన్లు గానీ వీటిల్లో టాక్టైమో.. లేదా డేటానో అయిపోయిందంటే పక్కన పెట్టేస్తున్నారు. ఫలితంగా టెల్కోల ఖాతాలో కనెక్షన్లు కనిపిస్తున్నా.. వాటి ద్వారా వచ్చే సగటు ఆదాయాలు పెద్దగా ఉండటం లేదు. ఇక 2016లో ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో సంచలన ప్లాన్స్తో టెలికం రంగాన్ని కుదిపేయడంతో పలు టెల్కోలు భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. జియోతో పోటీగా చార్జీలను భారీ స్థాయిలో తగ్గించాల్సి రావడంతో ఆదాయాలు దెబ్బతింటున్నాయి. మొత్తం మీద టెలికం రంగంలో కన్సాలిడేషన్కు దారి తీసింది ఇది. వొడాఫోన్–ఐడియాలు విలీనం కాగా.. టాటా డొకొమో మెదలైన వాటిని ఎయిర్టెల్ విలీనం చేసుకుంది. దీంతో ఆదాయం ఇవ్వని నామమాత్రపు కనెక్షన్లను వదిలిం చుకుని సిసలైన కస్టమర్లనే అట్టిపెట్టుకోవాలని, సగటు ఆదాయాలను పెంచుకోవాలనేది టెల్కోల వ్యూహం. అందుకే తప్పనిసరి రీచార్జ్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ నిర్ణయంతో కొందరు యూజర్లు తమ నెట్వర్క్ నుంచి వెళ్లిపోయినా.. ఉండే వారి దగ్గర్నుంచి పెరిగే ఆదాయాలతో ఆ నష్టం భర్తీ కాగలదని అవి భావిస్తున్నాయి. నిఖార్సయిన కస్టమర్ల సంఖ్యపైనా స్పష్టత వస్తుందని, దాని ప్రకారంగా ప్రణాళికలు చేసుకోవచ్చని యోచిస్తున్నాయి. రీచార్జ్ చేయకుంటే ఏమవుతుంది.. తక్షణం రీచార్జి చేసుకోకపోయినా.. పూర్తిగా సేవలు నిలిపివేయకుండా కొంత కాలం పాటు సమయమిస్తున్నాయి టెల్కోలు. పరిశ్రమ వర్గాల ప్రకారం ఉదాహరణకు.. డిసెంబర్ 1 2018న రూ. 35 కనీస రీచార్జి చేయించారనుకుందాం. 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మళ్లీ రీచార్జ్ చేయించుకోకుంటే 29వ తారీఖు నుంచి ముందుగా అవుట్గోయింగ్ కాల్స్ నిల్చిపోతాయి. కానీ మరో 15 రోజుల దాకా .. అంటే వచ్చే ఏడాది జనవరి 12 దాకా ఇన్కమింగ్ కాల్స్ మాత్రం అందుకోవచ్చు. ఈ 15 రోజుల గ్రేస్ పీరియడ్ ముగిసిపోయిన తర్వాత కూడా బ్యాలెన్స్ వేయించుకోకపోతే.. తదుపరి రీచార్జ్ చేసుకునే దాకా ఇన్కమింగ్ కాల్స్ కూడా నిల్చిపోతాయి. అయినప్పటికీ రీచార్జ్ చేసుకోకపోతే మరో 90 రోజుల పాటు దాకా లెక్కల్లో మీ కనెక్షన్ను టెలికం సంస్థ కొనసాగిస్తుంది. అంటే ఇన్కమింగ్ కాల్స్కి ఇచ్చే 15 రోజులతో పాటు మొత్తం 105 రోజుల మేర గ్రేస్ పీరియడ్ లభించినట్లవుతుంది. అది కూడా తీరిపోతే ఇక ఆ నంబరును వదులుకోవాల్సిందే. మళ్లీ సింగిల్ సిమ్ బాటేనా.. వివిధ ఆపరేటర్లు అందిస్తున్న ప్రయోజనాలను పొందేందుకు చాలా మంది సబ్స్క్రయిబర్స్ రెండు మూడు సిమ్లు ఉపయోగిస్తున్నారు. ఆగస్టు 2018 నాటికి 120 కోట్ల టెలికం కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో సుమారు 45 కోట్ల కనెక్షన్లు మల్టిపుల్ సిమ్ కార్డులవేనని అంచనా. తాజా పరిణామంతో తక్షణం యూజర్ల సంఖ్య కనీసం 3 కోట్ల మేర తగ్గొచ్చని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. టెల్కోల తాజా చర్యలతో యూజర్లు మళ్లీ సింగిల్ సిమ్ వైపు మళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ఆరు నెలల వ్యవధిలో కనీసం 6 కోట్ల మంది సబ్స్క్రయిబర్స్ తమ రెండో సిమ్ను వదిలించుకోవచ్చని అంచనా. -
గీత దాటితే.. చర్యలు తప్పవు
సాక్షి,బాన్సువాడ(నిజామాబాద్): ఎన్నికల్లో అభ్యర్థులు ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం టెక్నాలజీ విస్తరించడంతో పాటు స్మార్ట్ఫోన్ల రాకతో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లను వినియోగించుకోవడంలో ఎన్నికల సంఘం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. అభ్యర్థులకు సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతులను ‘సువిధ’ యాప్ ద్వారా అందజేస్తుండగా, తాజాగా ప్రజల చేతుల్లో బ్రహ్మాస్తంగా సీ–విజిల్ యాప్ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా అభ్యర్థులు చేసే అక్రమాలను ఫొటోలు, వీడియోల రూపంలో సేకరించి చర్యలకు ఉపక్రమించనుంది. ప్రజలు నేరుగా ఫొటోలు, వీడియోలను తీసి, సీ–విజిల్ యాప్లో అప్లోడ్ చేస్తే, ఆ ఫొటోలు జిల్లా ఎన్నికల అధికారి(కలెక్టర్)కు వెళ్తాయి. ఇలా వచ్చిన ఫొటోలు/వీడియోల్లో వాస్తవాలు ఉంటే 100 నిమిషాల్లోపు సంబంధిత అభ్యర్థిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు ప్రకటిస్తున్నారు. ఫొటోలు పంపిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. డౌన్లోడ్చేసుకోవడం ఇలా.. స్మార్ట్ ఫోన్ ఉన్న వ్యక్తి గూగుల్ యాప్లోకి వెళ్లి సీ–విజిల్ (G-VISIL) యాప్ అని టైప్ చేయాలి. ఆ యాప్ వచ్చిన వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి. జీపీఎస్ను ఆన్ చేసి, తమ పేరు, మొబైల్ నంబర్, అడ్రస్ను నమోదు చేయాలి. రాష్ట్రం, జిల్లా పేర్లను నమోదు చేశాక యాప్ ప్రారంభమవుతుంది. నేరుగా ఫొటో లేదా వీడియాను తీసి సెండ్ చేస్తే, అది సంబంధిత జిల్లా ఎన్నికల అధికారికి చేరుతుంది. ఆ ఫొటో ద్వారా 100 నిమిషాల్లోపు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన పక్షంలో చర్యలు తీసుకుంటారు. వీటిపై ఫిర్యాదు చేయవచ్చు అభ్యర్థులు, అనుచరులు ఓటర్లకు నగదు పంపిణీ మద్యం/మాదక ద్రవ్యాల పంపిణీ ఉచితంగా ఓటర్ల రవాణా కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రలోభపెట్టే వస్తువుల పంపిణీ ఓటర్లను బెదిరించడం మారణాయుధాలు కలిగి ఉండడం అసత్య వార్తల ప్రసారం, చెల్లింపు వార్తలు ప్రజల ఆస్తులను నష్ట పర్చడం, వినియోగించడం