నాకు మొబైల్‌ లేదు: సిద్ధూ | Karnataka CM Siddaramaiah said that he does not use mobile phone | Sakshi
Sakshi News home page

నాకు మొబైల్‌ లేదు: సిద్ధూ

Published Tue, Jul 2 2024 5:16 AM | Last Updated on Tue, Jul 2 2024 5:16 AM

Karnataka CM Siddaramaiah said that he does not use mobile phone

బనశంకరి: కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తాను మొబైల్‌ ఫోన్‌ వాడనని చెప్పారు. సోమవారం మీడియా ప్రశ్నకు బదులిస్తూ, ‘‘ఒకప్పుడు ఆర్నెల్లు మొబైల్‌ వాడాను. రాత్రి వేళ ఫోన్లు రావడం, నిద్రకు భంగం కలగడంతో పక్కన పెట్టా. ఏ విషయమైనా పీఏలు, గన్‌మెన్‌ వచ్చి చెబుతారు. 

సోషల్‌ మీడియాలో ఏం జరుగుతుందో నా కుమారుడు చెబుతాడు’’ అన్నారు. నాయకత్వ మార్పుపై హైకమాండ్‌ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని సిద్దరామయ్య అన్నారు. డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్‌కు సీఎంగా అవకాశమివ్వాలని ఇటీవల ఒక్కళిగ మతగురువు ఒకరు సిద్దరామయ్య సమక్షంలోనే కోరడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement