
బ్యాంక్ వాహనం నుంచి రూ. 1.35 కోట్లు దోపిడీ
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు బ్యాంక్ వాహనం నుంచి 1.35 కోట్ల రూపాయలను దోచుకెళ్లారు. బ్యాంక్ సిబ్బంది ఏటీఎంలలో డబ్బు నింపేందుకు తీసుకెళ్తుండగా దోపీడి జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఓ బ్యాంక్ ఏటీఎంలో డబ్బుల నింపుతుండగా, దొంగలు వాహనంలోని నగదును ఎత్తుకెళ్లారు. వాహనం డ్రైవర్, సెక్యూరిటీ గార్డు పాత్రపై పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరని అదుపులోకి తీసుకున్నారు.