
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో దొంగలు చెలరేగి పోయారు. భారీ నగదుతో వెళుతున్న క్యాష్వ్యాన్ పై కాల్పులు జరిపి సుమారు రూ.11లక్షల సొమ్మును ఎత్తుకళ్లారు. బైక్ వచ్చిన ముగ్గురు ఆగంతకులు ఈ దారుణానికి పాల్పడ్డారు. విజయ్ విహార్లో శనివారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ ఘటనలో క్యాషియర్ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.