గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీలో వర్గ విబేధాలు రచ్చకెక్కాయి.
గురుదాస్ పూర్: పంజాబ్ లోని గురుదాస్ పూర్, పఠాన్ కోట్ జిల్లాలో మళ్లీ అప్రమత్తత ప్రకటించారు. అనుమానిత వ్యక్తులు సంచారిస్తున్నారనే సమాచారంతో అప్రమత్తమైన భద్రత దళాలు బుధవారం నుంచి గాలింపు చేపట్టాయి. టిర్బీ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతానికి సమీపంలోని గ్రామాల్లో సైనికులు, పంజాబ్ పోలీసులు క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు.
ఈ ప్రాంతాల్లో చెరుకు తోటలు అధికంగా ఉండడంతో సోదాలు చేయడానికి భద్రత బలగాలు శ్రమించాల్సి వస్తోంది. పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో సైనిక బలగాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.