high court judge
-
లోక్పాల్ వర్సెస్ న్యాయమూర్తులు
ఉన్నత స్థాయిలోని అవినీతిని నిరోధించడానికి ‘లోక్పాల్’ను ఏర్పాటు చేశారు. సిట్టింగ్ హైకోర్టు న్యాయ మూర్తులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించే అధికారం తమకు ఉందని లోక్పాల్ అభిప్రాయపడింది. దీంతో లోక్పాల్ అధికారాల పరిధి, న్యాయ మూర్తులకు లభించే రక్షణల గురించిన ప్రశ్నలు చర్చనీయాంశాలయి నాయి. అంతేకాదు, న్యాయవ్యవస్థ స్వతంత్రత మీద నీలినీడలు ఏర్పడినాయి.2025 ఫిబ్రవరి 20న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సూర్యకాంత్, ఏఎస్ ఓకాలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం లోక్పాల్ జారీ చేసిన ఎంక్వైరీ ఉత్తర్వుల మీద చర్చించడానికి ప్రత్యేకంగా సమావేశమయ్యింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల లోక్పాల్ బెంచ్... ‘హైకోర్టు న్యాయమూర్తులు లోక్పాల్, లోకాయుక్త చట్టం–2013’ పరిధిలోకి వస్తారని అభిప్రాయపడింది. పార్లమెంట్ తయారు చేసిన చట్టం ద్వారా ఏర్పాటైన హైకోర్టులలోని న్యాయ మూర్తులు కాబట్టి వారు ఈ చట్టాల పరిధిలోకి వస్తారని లోక్పాల్ బెంచ్ అభిప్రాయపడింది.‘ఇది చాలా కలవరపెట్టే విషయం’ అని జస్టిస్ గవాయ్ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతకు ముందు రోజు ఈ అంశాన్ని సుప్రీంకోర్టు తనకు తానుగా స్వీకరించి విచారణ చేపట్టింది. ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలు జరుగకుండా ఉండటానికి సుప్రీంకోర్టు తన అధి కారాన్ని వినియోగించుకొని ఈ విషయంలో జోక్యం చేసుకుంది. లోక్పాల్ జారీ చేసిన ఉత్తర్వులపై స్టేని మంజూరు చేసింది.అంతేకాదు లోక్పాల్ విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తుల పేర్లు బహిర్గతం చేయకూడదని కూడా ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులపై విచారణ చేపట్టే ముందు లోక్పాల్ 1991వ సంవత్సరంలో న్యాయమూర్తి కె. వీరాస్వామి కేసుని కూడా ఉదహ రించింది. ఉన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తిని పబ్లిక్ సర్వెంట్స్ నిర్వచనం నుండి మినహాయించలేరు. అందుకని హైకోర్టు న్యాయమూర్తుల మీద తాము విచారణని చేపట్టినామని లోక్పాల్ తన ఉత్తర్వులలో పేర్కొంది.1991వ సంవత్సరంలో ‘కె. వీరాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రకారం – న్యాయ మూర్తులందరూ ‘అవినీతి నిరోధక చట్టం–1988’ ప్రకారం పబ్లిక్ సర్వెంట్స్ అని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఫిర్యాదు దాఖలైనప్పుడు కేసు నమోదు చేయడానికన్నా ముందు భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలని కూడా ఆ తీర్పులో పేర్కొన్నారు.న్యాయమూర్తులను – అవసరం లేని ప్రాసిక్యూషన్ నుంచి, అనవసర వేధింపుల నుండి రక్షించడానికి రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలి. ప్రధాన న్యాయమూర్తి తన ముందు ఉంచిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, ఆ విషయంలో సంతృప్తి చెందిన తరువాత సంబంధిత న్యాయ మూర్తిపై ప్రాసిక్యూషన్ ప్రారంభించడానికి లేదా ఎఫ్ఐఆర్ని విడుదల చేయడానికి రాష్ట్రపతికి తగు సలహాని ఇవ్వాలి. ఈ తీర్పుని ఆధారం చేసుకొని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, లోక్పాల్ ఖన్విల్కర్ నేతృత్వంలోని బెంచ్ న్యాయమూర్తులపై వచ్చిన ఫిర్యాదులను భారత ప్రధాన న్యాయమూర్తి పరిశీలనకి పంపింది. 2013వ చట్టంలోని సెక్షన్ 20(4) ప్రకారం ఫిర్యాదును పరిష్కరించడానికి అవసరమైన కాలపరిమితిని దృష్టిలో పెట్టుకొని కేసుని నాలుగు వారాల పాటు వాయిదా వేయాలని ఆదేశించింది.హైకోర్టు న్యాయమూర్తులు లోక్పాల్ అనుకున్నట్టు చట్ట బద్ధమైన అధికారులు మాత్రమే కాదని, వాళ్ళు రాజ్యాంగ బద్దమైన న్యాయమూర్తులని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గవాయ్, జస్టిస్ ఏఎస్ ఓకా విచారణ సందర్భంలో అన్నారు. సుప్రీంకోర్టు వెలి బుచ్చిన ఆందోళనలో భారత సొలిసి టర్ జనరల్ తుషార్ మెహతా, న్యాయవాది కపిల్ సిబాల్ కూడా పాలుపంచుకున్నారు. లోక్పాల్, లోకాయుక్త చట్టంలోని సెక్షన్ 14 పరిధిలోకి వస్తాయని లోక్పాల్ అభిప్రాయపడింది కానీ దాని యోగ్యతలను లోక్పాల్ ఇంకా పరిశీలించలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే లోక్పాల్ అభిప్రాయం తప్పని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 214(1)ను లోక్పాల్ విస్మరించిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ అధికరణం ప్రకారం హైకోర్టులను ఏర్పాటు చేస్తారు.రాజ్యాంగం కొన్ని వ్యవస్థలకు రక్షణలను కల్పించింది.అందులో రాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఎలక్షన్ కమిషనర్లు వస్తారు. వీళ్ళే కాదు హైకోర్టు న్యాయమూర్తులూ వస్తారు. లోక్పాల్ అభిప్రాయం న్యాయవ్యవస్థ స్వతంత్రతకు సవాలు విసురుతుంది. న్యాయ వ్యవస్థ స్వతంత్రత మీద నీలి నీడలు కమ్ముకుంటాయి. ఈ జోక్యం వల్ల అత్యున్నత న్యాయ వ్యవస్థ బలహీనపడుతుంది. న్యాయ వ్యవస్థలో పరోక్ష జోక్యాలు, ఒత్తిళ్లు పెరిగిపోతాయి. ప్రేరేపిత ఆరోపణల నుంచి రక్షణ లేకుండా పోతుంది. అయితే వారి మీద ఎలాంటి విచారణ లేకపోతే జవాబుదారీ తనం లేకుండా పోతుంది. హైకోర్టు న్యాయ మూర్తుల మీద వచ్చిన ఆరోపణలను విచారించడానికి, తగు చర్యలు తీసుకోవడానికి సరైన యంత్రాంగం లేదు. దీనివల్ల అవినీతికి స్థానం దొరికేలా ఉంటుంది. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. ప్రస్తుతం ఉన్న విధానం మెరుగు పడాల్సిన అవసరం ఉందని దేశ అత్యున్నత న్యాయస్థానం భావించింది. ఇటీవలి కాలంలో తమ పరిధికి మించి ఉత్తర్వులను, బెయిల్ షరతులను విధిస్తున్న హైకోర్టు న్యాయమూర్తులను చూస్తున్నాం. అదే విధంగా కేసు విచారణ సందర్భంలో, బయట సమావేశాల్లో రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు. వారి పరిధి నుంచి కేసుల ఉపసంహరణ లాంటి చర్యలను కూడా సుప్రీంకోర్టు తీసుకోవడం లేదు. న్యాయవ్యవస్థ స్వతంత్రత ఎంత ముఖ్యమో... జవాబు దారీ తనం కూడా అంతే ముఖ్యం. లోక్పాల్ అభిప్రాయం సరైంది రాకపోవచ్చు. కానీ చాలా అంశాలు సుప్రీం తీర్పు ముందుకు వస్తున్నాయి. సుప్రీం కోర్టు ఏం చేస్తుందో చూడాలి మరి!మంగారి రాజేందర్ వ్యాసకర్త తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ మాజీ డైరెక్టర్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు -
ఆ రాష్ట్రంలోనూ ‘లివ్ ఇన్’కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
జైపూర్: ‘లివ్ ఇన్ రిలేషన్’ జంటల విషయంలో రాజస్థాన్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తరహా జంటలు తమ సంబంధాన్ని అధికారికంగా నమోదు చేసుకునేందుకు ఒక పోర్టల్ను ప్రారంభించాలని రాజస్థాన్ హైకోర్టు సింగిల్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.హైకోర్టులో ‘లివ్ ఇన్’ జంటలు దాఖలు చేసిన పిటిషన్లో వారు తమకు భద్రత కల్పించాలని కోర్టును కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు సింగిల్ బెంచ్ .. ‘కొందరు యువతీ యువకులు ‘లివ్-ఇన్’ సంబంధంలో ఉంటున్నారు. వారి సంబంధాన్ని పెద్దలు, ఇతరులు అంగీకరించకపోవడం వల్ల, ఆ జంటలతో పాటు వారి కుటుంబాలు సమాజంలో హేళనను, ముప్పును ఎదుర్కొంటున్నాయి. అందుకే వారు తమ జీవితాలను, స్వేచ్ఛను కాపాడాలని కోరుతున్నారు.దీనిపై చట్టం రూపొందించే వరకు ‘లివ్-ఇన్’ సంబంధాలను అధికారం కలిగిన ట్రిబ్యునల్ వద్ద నమోదు చేయాలని జస్టిస్ అనూప్ కుమార్ ధండ్ పేర్కొన్నారు. ‘లివ్-ఇన్’ సంబంధంలో ఉండే స్త్రీ భాగస్వామికి భార్య లాంటిది కాదని హైకోర్టు పేర్కొంది. ఇటువంటి సంబంధంలో జీవించాలనే ఆలోచన కొత్తగా అనిపించవచ్చు. కానీ వాస్తవానికి దీని కారణంగా పలు సమస్యలు తలెత్తుతాయి. ఇటువంటి ‘లివ్ ఇన్’ సంబంధాల నమోదు విషయాన్ని పరిశీలించడానికి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి, ఈ తరహా జంటల ఫిర్యాదులను పరిశీలించి, వాటిని ఆ కమిటీ పరిష్కరించాలి. ఇందుకోసం ఒక వెబ్సైట్ లేదా వెబ్ పోర్టల్ ఉండాలి" అని హైకోర్టు సింగిల్ బెంచ్ పేర్కొంది. కాగా ఉత్తరాఖండ్లో ‘లివ్ ఇన్’లో ఉంటున్న జంటలకు రాష్ట్రప్రభుత్వం రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట అనంతరం భద్రత పెంపు -
హైకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరు న్యాయాధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు న్యాయాధికారులు (జిల్లా జడ్జిలు) కోటా నుంచి ఇద్దరు న్యాయాధికారుల పేర్లను కేంద్రానికి సిఫారసు చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్మానం చేసింది. జుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా ఉన్న అవధానం హరిహరనాథ శర్మ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ యడవల్లి లక్ష్మణరావును హైకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ ఇద్దరి నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపిన తరువాత అవి ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరుతాయి. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తరువాత వీరి నియామకాన్ని కేంద్ర న్యాయ శాఖ నోటిఫై చేస్తుంది.ముగ్గురిని సిఫారసు చేసిన హైకోర్టు కొలీజియంహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని హైకోర్టు కొలీజియం గత ఏడాది మేలో న్యాయాధికారుల కోటా నుంచి హరిహరనాథ శర్మ, లక్ష్మణరావుతో పాటు ప్రస్తుతం శ్రీకాకుళం ప్రధాన జిల్లా జడ్జిగా వ్యవహరిస్తున్న జునైద్ అహ్మద్ మౌలానా పేర్లను సుప్రీంకోర్టుకి సిఫారసు చేసింది. వీరిలో సుప్రీం కోర్టు ఇద్దరి పేర్లకు ఆమోద ముద్ర వేసింది. జునైద్ విషయంలో సుప్రీం కోర్టు ఏ నిర్ణయం తీసుకుందో తెలియాల్సి ఉంది. వాస్తవానికి ఈ పేర్లకు సుప్రీం కోర్టు కొలీజియం ఇంతకు ముందే ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే ఈ ఇద్దరికి సంబంధించి అదనపు వివరాలు అవసరం కావడంతో కొంత ఆలస్యం జరిగింది. ఈ ఇద్దరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరుకుంటుంది. మరో 7 పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఈ పోస్టులకు హైకోర్టు కొలీజియం త్వరలోనే కొందరి పేర్లను సిఫారసు చేయనుంది.అవధానం హరిహరనాథ శర్మ..కర్నూలుకి చెందిన అవధానం హరిహరనాథ శర్మ 1968 ఏప్రిల్ 16న జన్మించారు. తల్లిదండ్రులు సుబ్బమ్మ, రామచంద్రయ్య. తండ్రి పురోహితులు. శర్మ 1988లో కర్నూలులోని ఉస్మానియా కాలేజీలో బీఎస్సీ, 1993లో నెల్లూరు వీఆర్ కాలేజీలో బీఎల్ పూర్తిచేశారు. 1994లో న్యాయవాదిగా ఎన్రోల్ అయి, కర్నూలు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 1994 నుంచి 98 వరకు సీనియర్ న్యాయవాది రామకృష్ణారావు వద్ద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. 1998లో స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2007లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2017–18లో అనంతపురం ప్రధాన జిల్లా జడ్జిగా, 2020–22లో విశాఖపట్నం ప్రధాన జిల్లా జడ్జిగా పనిచేశారు. 2022లో హైకోర్టు రిజిస్ట్రార్గా బాధ్యతలు చేపట్టారు. 2023 నుంచి ఏపీ జుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. 2016లో నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టా అందుకున్నారు.డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు..ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు 1975 ఆగస్టు 3న జన్మించారు. పద్మావతి, వెంకటేశ్వరరావు తల్లిదండ్రులు. లక్ష్మణరావు ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం ప్రకాశం జిల్లాలో సాగింది. నెల్లూరు వీఆర్ లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యశించారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేసి రెండు మెరిట్ సర్టిఫికెట్లు సాధించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పొందారు. క్రిమినల్ లా, కంపెనీ లాలో బంగారు పతకాలు సాధించారు. 2000 సంవత్సరంలో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు కావలిలో కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2014లో జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన పరీక్షలో రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించారు. తొలుత ఏలూరులో మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేశారు. ఆ తరువాత రాష్ట్రంలో పలు చోట్ల వివిధ హోదాల్లో పనిచేశారు. 2021లో హైకోర్టు రిజిస్ట్రార్ (జుడిషియల్)గా నియమితులయ్యారు. ఆయన పనితీరు, క్రమశిక్షణ నచ్చిన హైకోర్టు ఆయన్ని రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ)గా నియమించింది. హైకోర్టు న్యాయమూర్తిగా ఈయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే 2038 వరకు సుదీర్ఘ కాలం పాటు ఆ పోస్టులో కొనసాగనున్నారు. -
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్పాల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలను జస్టిస్ సుజోయ్పాల్కు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశా రు. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ అలోక్అరాధే బాంబే హైకోర్టు చీఫ్గా బదిలీ అయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు. సీజే బదిలీతో ఏర్పడనున్న ఖాళీని హైకోర్టులో రెండవ సీనియర్ న్యాయ మూర్తిగా ఉన్న జస్టిస్ సుజోయ్పాల్తో భర్తీ చేశారు. రాజ్యాంగంలోని అధికరణ 223 ద్వారా వచ్చిన అధికారాల మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్పాల్ను రాష్ట్రపతి నియమించినట్టు న్యాయశాఖ పేర్కొంది. రాష్ట్రపతి తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు ఆయన సీజేగా కొనసాగుతారు. 2024 మార్చిలో తెలంగాణకు.. మధ్యప్రదేశ్లో 1964, జూన్ 21న జస్టిస్ సుజోయ్పాల్ జన్మించారు. బీకాం, ఎంఏ, ఎల్ఎల్బీ పూర్తిచేసి 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకున్నారు. సివిల్, రాజ్యాంగ, పారిశ్రామిక, సర్వీస్తోపాటు పలు బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్, బోర్డులకు న్యాయవాదిగా పనిచేశారు. 2011, మే 27న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2014, ఏప్రిల్ 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ సుజోయ్పాల్ కుమారుడు మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. దీంతో అక్కడి హైకోర్టు నుంచి బదిలీ చేయాలని ఆయన కోరుకోగా, రాష్ట్రపతి ఆమోదించారు. 2024, మార్చి 21న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. దాదాపు 10 నెలలుగా ఇక్కడ పనిచేస్తున్న ఆయన మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిబంధనల ఉల్లంఘన, గ్రూప్–1, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సహా పలు కీలక కేసులపై విచారణ చేపట్టారు. పలు కేసుల్లో తీర్పులు కూడా వెలువరించారు. కాగా, జస్టిస్ అలోక్అరాధే బదిలీతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 26కు చేరుకోనుంది. -
జిల్లా జడ్జిలకు హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి
సాక్షి,న్యూఢిల్లీ:నలుగురు జిల్లా జడ్జిలకు తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి లభించింది. శ్రీమతి రేణుకా యార, నందికొండ నర్సింగ్ రావు, తిరుమలాదేవి, మధుసూదనరావులను హైకోర్టు జడ్జిలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. దీంతోపాటు ఏపీ హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జిలను కొలీజియం సిఫారసు చేసింది. ఏపీలో జిల్లా జడ్జిలుగా పనిచేస్తున్న అవధానం హరిహరణాధ శర్మ,డాక్టర్ యడవల్లి లక్షణరావులకు ఏపీ హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి లభించింది. రాష్ట్రపతి ఆమోదంతో వీరి నియామకాలు అమలులోకి వస్తాయి. ఇదీ చదవండి: కేంద్రమంత్రికి మెటా క్షమాపణలు -
న్యాయమూర్తుల సంతానానికి హైకోర్టు జడ్జిలుగా నో చాన్స్!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రస్తుత, మాజీ న్యాయమూర్తుల సంతానం, అతి సమీప బంధువులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించరాదన్న ప్రతిపాదనను సుప్రీంకోర్టు కొలీజియం చురుగ్గా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అలాంటి వారి పేర్లను సిఫార్సు చేయరాదంటూ హైకోర్టు కొలీజియాలకు సూచిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తద్వారా అర్హులైన కొందరికి అన్యాయం జరిగినా బంధుప్రీతి వంటి ఆరోపణలకు తావుండదని, ఎంపిక ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుందని కొలీజియం సభ్యుడైన సీనియర్ న్యాయమూర్తి అభిప్రాయపడ్డట్టు సదరు వర్గాలు వెల్లడించాయి. తొలి తరం న్యాయవాదులతో పాటు విభిన్న సామాజికవర్గాల వారికి హైకోర్టు న్యాయమూర్తులుగా అవకాశం లభిస్తుందన్నది దీని ఉద్దేశమని వివరించాయి. మళ్లీ తెరపైకి ‘సంప్రదింపులు’ హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి మరో ఇటీవల కీలక పరిణామం కూడా చోటుచేసుకుంది. హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన అభ్యర్థులతో సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం డిసెంబర్ 22న వ్యక్తిగతంగా భేటీ అయింది. తద్వారా గత సంప్రదాయాన్ని పునరుద్ధరించింది. అనంతరం రాజస్తాన్, ఉత్తరాఖండ్, బాంబే, అలహాబాద్ హైకోర్టులకు న్యాయ మూర్తులుగా ఆరుగురు పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. దేశంలో మెజారిటీ ప్రజల అభిప్రాయమే సాగాలంటూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ‘సంప్రదింపు’ల నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటిదాకా హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి అభ్యర్థుల బయోడేటా, వారి అర్హత, సామర్థ్యాలపై కొలీజియం అంచనా, నిఘా సమాచారం తదితరాలను ప్రాతిపదికగా తీసుకుంటూ వస్తుండటం తెలిసిందే. -
ఇది హిందుస్తాన్
ప్రయాగ్రాజ్: దేశంలో మెజారిటీ ప్రజల ఇష్టానుసారం పాలన కొనసాగాలని చెప్పేందుకు మాత్రం సంకోచించనని అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ వ్యాఖ్యా నించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఆదివారం అలహాబాద్ హైకోర్టు లైబ్రెరీ హాల్లో విశ్వహిందూ పరిషత్ హైకోర్టు యూనిట్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అంశంపై ఆయన మాట్లాడారు. ‘‘మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే చట్టం నడుచుకోవాలి. కుటుంబంగా చూసినా, సమాజంగా చూసినా మెజారిటీ ప్రజల సంక్షేమం, సంతోషమే ముఖ్యం’’ అన్నారు. ముస్లింలలో ఉన్న బహుభార్యత్వం, త్రిపుల్ తలాఖ్, హలాలా వంటి విధానాలను జడ్జి పరోక్షంగా విమర్శించారు. ‘‘ మా పర్సనల్ లా వీటికి అంగీకరిస్తోందని అది ఏమాత్రం ఆమోదనీయం కాదు. మన శాస్త్రాలు, వేదాల్లో స్త్రీని శక్తిస్వరూపిణిగా భావించారు. నలుగురు భార్యలను కల్గి ఉంటాను, హలాలా, త్రిపుల్ తలాఖ్ను పాటిస్తానంటే కుదరదు. సామరస్యం, లింగ సమానత, సామ్యవాదమే యూసీసీ ధ్యేయం. అంతే తప్ప వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్, హిందూయిజాలను అది ప్రోత్సహించదు’’ అన్నారు. -
హైకోర్టు జడ్జీలుగా ముగ్గురు ప్రమాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా కుంచం మహేశ్వరరావు, తూటా చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్లు సోమవారం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో ఈ ముగ్గురితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అంతకుముందు.. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై. లక్ష్మణరావు ఈ ముగ్గురు నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీచేసిన ఉత్తర్వులను చదవి వినిపించారు. అనంతరం సీజే వారితో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత సీజే ఒక్కొక్కరికీ రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వులను అందచేశారు.ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేష్, విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ చల్లా కోదండరాం, జస్టిస్ మంతోజు గంగారావు, ప్రమాణం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) పసల పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, హైకోర్టు రిజిస్ట్రార్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.ప్రమాణం అనంతరం జస్టిస్ ధనశేఖర్ సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ గుహనాథన్ నరేందర్తో కలిసి కేసులను విచారించారు. జస్టిస్ మహేశ్వరరావు, జస్టిస్ గుణరంజన్లు సింగిల్ జడ్జీలుగా కేసులను విచారించారు. ప్రమాణం సందర్భంగా న్యాయవాదులు, శ్రేయోభిలాషులు వీరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ముగ్గురితో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. మరో 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను న్యాయాధికారులు, న్యాయవాదులతో భర్తీచేసేందుకు జనవరిలో చర్యలు చేపట్టే అవకాశం ఉంది. -
విద్వేష వ్యాఖ్యలొద్దు
న్యూఢిల్లీ: కేసుల విచారణ సందర్భంగా వాడే పదజాలం విషయంలో న్యాయస్థానాలు అత్యంత జాగరూకత వహించాలని సుప్రీంకోర్టు సూచించింది. పురుషాధిక్య భావజాలం, స్త్రీద్వేషం తదితరాలతో కూడిన వ్యాఖ్యలకు పూర్తిగా దూరంగా ఉండాలని హితవు పలికింది. కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీశానంద ఇటీవల ఒక కేసు విచారణ సందర్భంగా బెంగళూరులో ఒక ముస్లిం ప్రాబల్య ప్రాంతాన్ని పాకిస్తాన్తో పోల్చడం, మహిళా న్యాయవాదిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ ఉదంతంపై సుమోటో విచారణను సీజేఐ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం ముగించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోని ఏ ప్రాంతాన్నీ పాకిస్తాన్తో పోల్చకూడదని కుండబద్దలు కొట్టింది. అవి దేశ ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధమని గుర్తు చేసింది. ఇలా ప్రాంతాలను, సామాజికవర్గాలను ఉద్దేశించి అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదని స్పష్టం చేసింది. ‘‘న్యాయవ్యవస్థ నిష్పాక్షికతపై సమాజంలో అన్ని వర్గాల ప్రజలకూ పూర్తి విశ్వాసముండాలి. దీన్ని కాపాడాల్సిన బాధ్యత లాయర్ల నుంచి జడ్జిల దాకా అందరిపైనా ఉంది. న్యాయమూర్తులు యథాలాపంగా చేసే ఇలాంటి వ్యాఖ్యలు వారి వ్యక్తిగత అభిప్రాయాలకు, రాగద్వేషాలకు అద్దం పడతాయి. వాటి ప్రభావం మొత్తం న్యాయవ్యవస్థపై పడుతుంది’’ అంటూ హెచ్చరించింది.మరింత వెలుగే పరిష్కారం!న్యాయవ్యవస్థలో పారదర్శకత చాలా ముఖ్యమని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. కోర్టుల విచారణ ప్రక్రియపై సోషల్ మీడియాలో విద్వేష వ్యాప్తి పెద్ద సవాలుగా మారిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. దీనిపై సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘వెలుగుకు మరింత వెలుగే పరిష్కారం తప్ప చీకట్లు కాదు. అన్నిరకాల కోర్టుల్లోనూ విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయడం, తద్వారా న్యాయవ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడమే సమస్యకు పరిష్కారం’’ అని కుండబద్దలు కొట్టారు. -
అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: సీజేఐ
న్యూఢిల్లీ, సాక్షి: దేశంలో న్యాయస్థానాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, న్యాయమూర్తులు పక్షపాత వ్యాఖ్యల జోలికి పోవొద్దని దేశ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. కర్ణాటక న్యాయమూర్తి అభ్యంతరకర వ్యాఖ్యల సుమోటో కేసు విచారణ ముగింపు సందర్భంగా బుధవారం సీజేఐ ఇలా మాట్లాడారు. ‘‘భారత్లోని ఏ ప్రాంతాన్ని పాకిస్థాన్తో పోల్చడం సరికాదు. ఇది దేశ ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధం. పైగా కోర్టులు అప్రమత్తంగా ఉండాలి. న్యాయమూర్తులు కేసుల విచారణ టైంలో ద్వేషపూరితంగా, కేవలం ఒక వర్గాన్ని ఉద్దేశించేలా పక్షపాత వ్యాఖ్యలు చేయొద్దు’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. ఓ భూవ్యవహారానికి సంబంధించిన కేసులో హైకోర్టు జడ్జి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీషానంద విచారణ చేపట్టారు. ఆ ప్రాంతాన్ని పాకిస్థాన్తో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాక, ఓ మహిళా న్యాయవాది పైనా తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారమంతా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. దీంతో సుమోటోగా ఈ వ్యవహారాన్ని తీసుకున్న సీజేఐ బెంచ్.. వేదవ్యాసాచార్ను మందలించారు. ఆ టైంలోనే.. న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరాన్ని ఆ టైంలో సీజేఐ బెంచ్ వ్యాఖ్యానించింది కూడా. ఇక.. సదరు జడ్జి బహిరంగ క్షమాపణ చెప్పడంతో ఇవాళ సుమోటో ప్రొసీడింగ్స్ను విరమించుకుంది సీజేఐ ధర్మాసనం."Justice Vedavyasachar Srishananda Faces Backlash Over Gender-Insensitive Remark"Karnataka High Court pic.twitter.com/UG2O1gQwMC— ADV Pramod Kumar (@thelawyr) September 20, 2024One month old video of Karnataka High Court, Justice Vedavyasachar Srishananda while Criticizing the cops referred to an area (Gori Palya) in Bengaluru as Pakistan. Gori Palya is an area where a large number of Muslims live. He was referring to auto pooling in that area where… pic.twitter.com/H1FwKKEg7S— Mohammed Zubair (@zoo_bear) September 19, 2024 -
కర్ణాటక న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు సుమోటో కేసు
న్యూఢిల్లీ, సాక్షి: వివాదాస్పద వ్యాఖ్యల వీడియోతో సోషల్ మీడియాలో వైరల్ అయిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి వేదవ్యాసాచార్ శీర్షానందపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాల్సిందిగా కర్ణాటక హైకోర్టును ఆదేశించింది.సుప్రీంకోర్టు న్యాయవాదులు ఇందిరా జైసింగ్, సంజయ్ ఘోష్లు.. జస్టిస్ వేదవ్యాసాచార్ శీర్షానంద వ్యాఖ్యలతో కూడిన ‘ఎక్స్’ పోస్టును ప్రస్తావిస్తూ తగిన చర్యలను తీసుకోవాల్సిందిగా సీజేఐను అభ్యర్థించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్తో కూడిన ఐదుగురు సభ్యుల బెంచ్ ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించింది.ఈ సందర్భంగా సీజే మాట్లాడుతూ ‘‘ఇలాంటి అంశాలపై కొన్ని సాధారణ మార్గదర్శకాలను జారీ చేస్తూనే హైకోర్టు నుంచి నివేదిక తెప్పించండి’’ అని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణిని ఆదేశించారు. కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి పరిపాలన పరమైన అనుమతులు పొందిన తరువాత రిజిస్ట్రార్ జనరల్ తమకు నివేదిక అందించాలని స్పష్టం చేశారు. ఈ అంశంపై వచ్చే మంగళవారం మళ్లీ విచారణ చేస్తామని తెలిపారు.‘‘సోషల్ మీడియా విస్తృత వాడకంలో ఉన్న ఈ కాలంలో అందరూ మనల్ని (న్యాయమూర్తులు) చాలా నిశితంగా పరిశీలిస్తూంటారు. ఆ విషయాన్ని మనం గుర్తెరిగి వ్యవహరించాలి’’ అని కూడా సీజేఐ వ్యాఖ్యానించారు.ఇంతకీ కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచార్ శీర్షానంద ఏం మాట్లాడారంటే.. కొన్ని రోజుల క్రితం రెండు వీడియోలో ఎక్స్లో పోస్ట్ అయ్యాయి. అందులో జస్టిస్ వేదవ్యాసాచార్ శీర్షానంద మాట్లాడుతూ బెంగళూరులోని ఒక ప్రాంతాన్ని ‘పాకిస్థాన్’తో పోల్చారు. అక్కడ ఒక్కో ఆటోలో పది మంది ప్రయాణిస్తున్నా పోలీసులు పట్టించుకోరని ఆయన వ్యాఖ్యానించినట్లు వీడియోలో ఉంది. ఇది వాస్తవమని.. ఎంతటి పెద్ద అధికారి అయినా అక్కడ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోరని కూడా జడ్జి కన్నడలో తెలిపారు. ఇక రెండో వీడియోలో ఓ మహిళ న్యాయవాదిని ఉద్దేశించి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.One month old video of Karnataka High Court, Justice Vedavyasachar Srishananda while Criticizing the cops referred to an area (Gori Palya) in Bengaluru as Pakistan. Gori Palya is an area where a large number of Muslims live. He was referring to auto pooling in that area where… pic.twitter.com/H1FwKKEg7S— Mohammed Zubair (@zoo_bear) September 19, 2024 "Justice Vedavyasachar Srishananda Faces Backlash Over Gender-Insensitive Remark"Karnataka High Court pic.twitter.com/UG2O1gQwMC— ADV Pramod Kumar (@thelawyr) September 20, 2024 -
నాగార్జునకు ఊరట.. కూల్చివేత ఆపేయండి.. హైకోర్టు ఆర్డర్స్
-
Supreme Court: అనవసర మాటలొద్దు
న్యూఢిల్లీ: గతంలో సుప్రీంకోర్టు ఇచి్చన ఉత్తర్వులను ఉద్దేశిస్తూ పంజాబ్ హరియాణా హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎగువ కోర్టు పట్ల ఎనలేని గౌరవం చూపాలని, న్యాయ క్రమశిక్షణ పాటించాలని హితవు పలికింది. హరియాణాలోని గుర్గావ్లో ఒక భూవివాదానికి సంబంధించిన కేసులో మే మూడో తేదీన సుప్రీంకోర్టు ఒక ఉత్తర్వులు జారీచేసింది. అయితే జూలై 17వ తేదీన ఒక కేసును విచారిస్తున్న సందర్భంగా పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజ్బీర్ సహరావత్ సుప్రీంకోర్టును విమర్శించారు. ‘‘ హైకోర్టుల అధికారాలకు సుప్రీంకోర్టు యథాలాపంగా అడ్డు తగులుతోంది. ఇక తామే ‘సుప్రీం’ అన్నట్లుగా సుప్రీంకోర్టులో విపరీత ధోరణి కనిపిస్తోంది’’ అని జడ్జి సహరావత్ అన్నారు. అయితే ఆరోజు హైకోర్టులో కేసు విచారణ ప్రత్యక్ష ప్రసారం కావడంతో సంబంధిత వీడియో వైరల్గా మారింది. విషయం తెల్సుకున్న సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సూమోటోగా స్వీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషికేశ్ రాయ్ల ప్రత్యేక ధర్మాసనం ఈ అంశాన్ని బుధవారం విచారించింది. ‘‘ కింద కోర్టులు సుప్రీంకోర్టు తీర్పులను శిరసావహించాల్సిందే. ఇందులో వేరే ఆప్షన్ ఎంచుకునే అవకాశమే లేదు. ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధ విధి నిర్వహణ. కోర్టుల్లో తీర్పులపై పిటిషనర్లు, కక్షిదారులు అసంతృప్తి వ్యక్తంచేయొచ్చుగానీ జడ్జీలు తమ సొంత వ్యాఖ్యానాలు చేయకూడదు. దేశంలో ఇక ఏ న్యాయస్థానంలోనూ ఇలాంటివి పునరావృతం కాబోవని భావిస్తున్నాం. కేసు విచారణల ప్రత్యక్ష ప్రసారాల కాలంలో జడ్జీలు ఏవైనా వ్యాఖ్యానాలు చేసేటపుడు సంయమనం పాటించాలి. అనవసర మాటలొద్దు’’ అని హైకోర్టు జడ్జికి ధర్మాసనం మౌఖిక ఆదేశాలిచి్చంది. జిల్లా కోర్టులు మొదలు హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా రాజ్యాంగంలోని ప్రతి అంగంలోనూ క్రమశిక్షణ అనేది కొనసాగాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు ఖచి్చతంగా కోర్టు ధిక్కారమేనని పేర్కొన్న సుప్రీంకోర్టు.. ఆ జడ్జిపై చర్యలు తీసుకునేందుకు మాత్రం నిరాకరించింది. -
దంపతులలో ఎవరి తప్పూ లేకపోయినా విడాకులు తీసుకోవచ్చా?
పాశ్చాత్య దేశాలలో, ముఖ్యంగా అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో దంపతులలో ఏ తప్పూ లేకపోయినా ‘నో ఫాల్ట్ డివోర్స్’ (అపరాధరహిత విడాకులు) పేరుతో విడాకులు ఇచ్చే చట్టం అమలులో ఉంది. అలాగే ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’ (పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధం)లో కూడా విడాకులు తీసుకునేందుకు చాలా దేశాలలోని చట్టాలు వీలు కల్పిస్తున్నాయి. అయితే భారతదేశంలోని పెళ్లిళ్లను నియంత్రించే రెండు ప్రాథమిక చట్టాలైన హిందూ వివాహ చట్టం 1955, ప్రత్యేక వివాహ చట్టం 1954 అపరాధ రహిత విడాకులను, పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధంలో విడాకులను మంజూరు చేసేందుకు ఆ ప్రాతిపదికలను అంగీకరించవు.భార్య–భర్తల కొన్ని సంవత్సరాల పాటు విడిపోయి ఉండి, వారి వివాహ బంధం తిరిగి అతుక్కునే వీలులేనంతలా తెగిపోయి, ఇరువురు కలిసి బతికే ఆస్కారం లేకుండా పోయివున్న సందర్భాలను ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’ (పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధం) అంటారు. ఇలాంటి వివాహ బంధాలు కేవలం చట్టం దృష్టిలో మాత్రమే వివాహంగా మిగిలి ఉంటాయి. అలాగే ‘నాకు నా భార్యపై (లేదా భర్తపై) ఎటువంటి ఫిర్యాదులు లేవు, వారు వ్యక్తిగతంగా మంచివారే, మా ఇద్దరి మధ్య లేనిది సఖ్యత మాత్రమే.నాకు నా భార్య (లేదా భర్త) విడాకులు ఇవ్వను అంటున్నారు. అందుకే నాకు నో ఫాల్ట్ డివోర్స్ ఇవ్వండి’ అని అడిగితే భారతదేశం లోని ఏ చట్టం ప్రకారమూ విడాకులు ఇవ్వడం కుదరదు. భాగస్వామిపై హింసకు పాల్పడడం, అకారణంగా వదిలేసి వెళ్లడం, వివాహేతర సంబంధం కలిగి ఉండటం, నయం కాలేని అంటు వ్యాధులు కలిగి వుండటం, హేయమైన నేరారోపణ రుజువు కావటం, సంసార జీవనానికి పనికిరాకుండా ఉండడం, మతమార్పిడి చేసుకోవడం, కోర్టు ఆదేశం ఇచ్చినప్పటికీ తిరిగి సంసార జీవితం ఆరంభించకపోవడం వంటివి మాత్రమే విడాకులు తీసుకోవడానికి ప్రాతిపదికగా పరిగణించబడతాయి (గ్రౌండ్స్ ఫర్ డివోర్స్). కాని 1978 లోనే, 71వ లా కమిషన్ తన సిఫార్సులలో ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’ను విడాకులు తీసుకోవడానికి ఒక ప్రాతిపదికగా/కారణంగా గుర్తించేలా చట్టంలో మార్పులు చేయాలి అని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను పరిగణిస్తూ, ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు చాలా కేసులలో ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’ కింద విడాకులు మంజూరు చేసింది. అంతేకాదు విదేశాలలో నివసిస్తున్న భారతీయులు ఒకవేళ ఈ ప్రాతిపదికన విడాకులు తీసుకొని ఉంటే, భారతదేశంలోని ఏ చట్టంలోనూ ఆ ప్రాతిపదిక లేదు కాబట్టి విడాకులు చెల్లవు అనడం సమంజసం కాదు – అలా విదేశాలలో పొందిన విడాకులు చట్టబద్ధమే అని కొన్ని కేసులలో తీర్పునిచ్చింది.‘‘నో ఫాల్ట్ డివోర్స్’’ – ‘‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’’ వంటి చట్టాలకు భారత దేశం పూర్తిగా సిద్ధంగా లేకపోయినప్పటికీ, వీలైనంత మేర సఖ్యత కుదిర్చేలా ప్రయత్నించి, వీలుకాని పక్షంలో సత్వరమే విడాకులు మంజూరు చేసే లాగా చట్టం మారాలి. పరస్పర ఒప్పందం/అంగీకారం ఉంటే భార్యా భర్తలు ఇద్దరూ కలిసి వివాహం అయిన ఒక సంవత్సరం తర్వాత మ్యూచువల్ డివోర్స్ పొందవచ్చు. ఇదివరకు లాగా విడాకుల దరఖాస్తు చేసిన తరువాత ఆరు నెలలు ఆగవలసిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. – శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
పిల్లల నుంచి పోషణ కోసం.. తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించవచ్చా?
ప్రదీప్, శాంత భార్యాభర్తలు. ఇద్దరూ 60 ఏళ్లకు పైబడిన వారే! ఇద్దరికీ బీపీ, సుగర్లున్నాయి. వాళ్లకిద్దరు పిల్లలు. మంచి జీతాలు గల ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కానీ అమ్మానాన్నలను పూర్తిగాగాలికి వదిలేయడంతో దయనీయమైన స్థితిలో రోజులను గడుపుతున్నారు ఆ దంపతులు. పిల్లల నుంచి పోషణ కోసం వీరు కోర్టును ఆశ్రయించవచ్చా?తల్లిదండ్రుల, వయోవృద్ధుల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007 కింద తల్లిదండ్రులకు, వయోవృద్ధులకు చాలా హక్కులే ఉన్నాయి. ముఖ్యంగా తమను తాము పోషించుకోలేని, తమ సంక్షేమాన్ని, తమ ఆరోగ్యాన్ని తాము పర్యవేక్షించుకోలేని తల్లిదండ్రులు, వయోవృద్ధులకు... తమ పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు లేదా బంధువుల (వయోవృద్ధుల ఆస్తికి వారసులు లేదా ఆర్థికంగా గానీ, మరేరకంగా గానీ లబ్ధి పొందిన వారు)ను మెయింటెనెన్స్ అడిగే హక్కును కలిపిస్తోందీ చట్టం.ఈ చట్టం కింద వయోవృద్ధులు, తల్లిదండ్రులు నేరుగా ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చు (స్థానిక ఆర్డీఓ). అలా ఆశ్రయించలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ల పక్షాన ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటి ఏ సంస్థ అయినా పిటిషన్ దాఖలు చేయవచ్చు. నోటీసులు అందిన 90 రోజులలోగా పిటిషన్పై విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వవలసి ఉంటుంది. ఇంటెరిమ్ మెయింటెనెన్స్కు కూడా ఆదేశించవచ్చు. వారసులు, పిల్లలు లేదా బంధువులు ట్రిబ్యునల్ ముందుకు రానట్లయితే... ట్రిబ్యునల్ క్రిమినల్ కోర్ట్లా కూడా వ్యవహరించవచ్చు. స్థిరాస్తులకు సంబంధించి ఏ ఇతర చట్టాల్లో లేని వెసులుబాటు, హక్కు కేవలం ఈ చట్టంలోనే పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్ కలిగి ఉన్నారు.ఏ ఇతర ప్రాపర్టీ చట్టాలకిందైనా ఒకసారి అమ్మేసిన లేదా గిఫ్ట్ గా ఇచ్చిన స్థిరాస్తిని తిరిగి తీసుకోవడం కానీ రద్దు చేయడం కానీ కుదరదు. కానీ ఈ 2007 చట్టం కింద మాత్రం ఆస్తిని తమ సంతానానికి లేదా తన బంధువులకు లేదా మరే ఇతర వ్యక్తికైనా రాసిచ్చేటప్పుడు ‘మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యతను నిర్వర్తించాలి.. లాంటి నిబంధనతోనే ఈ ఆస్తిని రాసిస్తున్నాను’ అంటూ ఆస్తిపత్రాలలో పొందుపరచి.. దాన్ని సదరు వారసులు ఉల్లంఘిస్తే.. తమ ఆస్తిని తాము తిరిగి తీసేసుకోవచ్చు.చాలా సందర్భాలలో ఆస్తి రాయించుకున్న తర్వాత తల్లిదండ్రులను లేదా వృద్ధులను ఓల్డేజ్ హోమ్స్లో వదిలేయడం లేక సరిగ్గా పట్టించుకోకపోవడం చూస్తుంటాం. అలాంటి సందర్భాలకు ఈ చట్టం చక్కటి ఆయుధం. పైన తెలిపిన నిబంధన కలిగి ఉన్న ఆస్తి పత్రాలను మరెవరైనా కొనుగోలు చేస్తే, అలా కొనుక్కున్న వారిపైనా మెయింటెనెన్స్ విధించవచ్చు. అంతేకాదు వయోవృద్ధులను లేదా తల్లిదండ్రులను వదిలించుకుందామని వారిని ఎక్కడికైనా తీసుకెళ్లి వదిలేయడం లాంటివి చేస్తే అది నేరం. వారికి జరిమానాతో ΄ాటు జైలు శిక్ష కూడా ఉంటుంది.– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
పుణె పోర్షే కారు ఘటన.. మైనర్ను వెంటనే విడుదల చేయండి: హైకోర్టు
ముంబై: పుణె పోర్షే ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరు యువ ఇంజనీర్ల మరణానికి కారణమైన నిందితుడు మైనర్ బాలుడిని నిర్బంధం నుంచి వెంటనే విడుదల చేయాలని బాంబే హైకోర్టు మంగళవారం ఆదేశించింది.ప్రభుత్వ అబ్జర్వేషన్ హోమ్ నుంచి విడుదల చేయాలంటూ బాలుడి అత్త వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై జస్టిస్ భారతి, జస్టిస్ మజుషా దేశ్పాండే ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది. బాలుడి రిమాండ్ ఆర్డర్ చట్టవిరుద్ధమని పేర్కొంటూ దానిని కోర్టు పక్కన పెట్టింది.కేసును కప్పిపుచ్చుకునేందుకు బాలుడి తల్లిదండ్రులు, తాత ప్రయత్నించి అరెస్టు అయిన నేపథ్యంలో మైనర్ ప్రస్తుతం అతని అత్త సంరక్షణలో ఉంటాడని ధర్మాసనం పేర్కొంది. కాగా ఈ కేసులో నిందితుడికి త్వరితగతిన బెయిల్ మంజూరు చేయడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో జువైనల్ జస్టిస్ బోర్డు బాలుడికి రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.అసలేం జరిగిందంటే..కాగా మహారాష్ట్రలోని పుణెలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు(17 ఏళ్లు).. 12వ తరగతి ఫలితాలు రావడంతో మే 18న రాత్రి మిత్రులతో కలిసి మద్యం తాగి పార్టీ చేసుకున్నాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మత్తులో తూలుతూనే ఇద్దరు మిత్రులను తీసుకొని తన తండ్రికి చెందిన రూ. 2.5 కోట్ల ఖరీదైన పోర్షె కారులో ఇంటికి బయల్దేరాడు.అదే సమయంలోసాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న మధ్యప్రదేశ్కు చెందిన అనీష్, అశ్విని అనే ఇద్దరు యువతీ, యువకుడు ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో టెక్కీలు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని పోర్షె కారు నడుపుతున్న మైనర్.. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఢీకొంది. ప్రమాద తీవ్రతకు అనీష్, అశ్విని కొన్ని అడుగుల దూరం ఎగిరిపడి అక్కడికక్కడే చనిపోయారు.అయితే ప్రమాదానికి కారణమైన బాలుడిని రక్షించేందుకు పోలీస్స్టేషన్ నుంచి జువైనల్ జస్టిస్ బోర్డు వరకూ అడుగడుగునా ప్రయత్నాలు జరిగాయి. ప్రమాదం జరిగిన మర్నాడు నిందితుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపర్చగా.. అక్కడ న్యాయమూర్తి ఎల్ఎన్ దన్వాడే నిందితుడికి తక్షణమే బెయిల్ మంజూరు చేశారు. రోడ్డు ప్రమాదాలు-పరిష్కారాలపై 300 పదాలతో వ్యాసం రాయమన్నారు. 15 రోజులు ట్రాఫిక్ పోలీసుల వద్ద పనిచేయడం వంటి నిబంధనలు విధించారు ఈ బెయిల్ నిబంధనలు చూసి జనాలు నివ్వెరపోయారు. 15 గంటల్లోనే బెయిల్ మంజూరుచేయడం తీవ్ర విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. నిందితుడికి వ్యతిరేకంగా ఆందోళనలు జరగడం, ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడికి పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. తక్షణమే నిందితుడి తండ్రి, మద్యం విక్రయించిన రెస్టారంట్ల యజమానులపై రెండో ఎఫ్ఐఆర్ నమోదైంది. 22వ తేదీన బాలుడి బెయిల్ను రద్దు చేసి అబ్జర్వేషన్ హోమ్కు తరలించారు.పరారైన నిందితుడి తండ్రిని ఔరంగాబాద్లో అరెస్టు చేశారు. మరోవైపు డ్రైవర్ను ఈ కేసులో బలవంతంగా ఇరికించేందుకు యత్నించాడన్న ఆరోపణలపై నిందితుడి తాతను అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసులో నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని ఏకంగా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు. -
భార్యను సెకండ్ హ్యాండ్ అన్నందుకు.. రూ 3 కోట్లు జరిమానా విధించిన కోర్టు
కొన్ని భార్యభర్తల కేసులు కనువిప్పు కలిగిస్తాయి. ఎందుకంటే భార్యను తేలికగా చేస్తూ ఎలా పడితే అలా కించపరుస్తూ మాట్లాడే భర్తల ఆగడాలను ఎలా కట్టడి చేయాలో చెబుతాయి. అలాంటి గమ్మత్తైన ట్విస్టింగ్ కేసు ఇది! ఆ దంపతులిరువురిది సంపన్న కుటుంబ నేపథ్యం. ఇద్దరు ఉన్నత విద్యావంతులే. ఆ జంట వివాహం 1994 జనవరి 3వ తేదీన పెద్దల సమక్షంలో జరిగింది. ఆ తర్వాత ఇద్దరు అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగాలు చేశారు. అయితే అక్కడ చట్టాల ప్రకారం సెక్యూరిటీ కోసం అమెరికాలో మళ్లీ పెళ్లి చేసుకుంది ఆ జంట. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో వారి కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో 2005లో ఈ దంపతులు ముంబై తిరిగి వచ్చేశారు. ముంబైలోనే భార్య ఉద్యోగం సంపాదించింది. అయితే భర్తతో గొడవలు కారణంగా తల్లి ఇంట్లోనే ఉంటుంది. 2014లో భర్త తిరిగి అమెరికా వెళ్లిపోయాడు. 2017లో భార్యకు అమెరికా నుంచే విడాకుల నోటీసులు పంపాడు. అదే ఏడాది భార్య ఇండియాలోని ముంబై కోర్టులో గృహ హింస చట్టం కింద కేసు ఫైల్ చేసింది. ఏడాది తర్వాత అంటే 2018లో అమెరికా కోర్టు వారికి విడాకులు కూడా మంజూరు చేసింది. అసలు కథ ఇక్కడే మొదలైంది..ముంబై కోర్టులో భార్య దాఖలు చేసిన పిటీషన్ ఆసక్తికరంగా మారింది. సుదీర్ఘ విచారణకు దారితీసింది. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పెళ్లి తర్వాత హనీమూన్కని నేపాల్ వెళ్లిన తర్వాతే ఈ ఇరువురి మద్య గొడవలు ప్రారంభమయ్యాయి. భార్యను సెకండ్ హ్యాండ్ అంటూ పదేపదే కించపరిచే వాడు భర్త. అందుకు కారణం..అప్పటికే తన భార్యకు.. తన పెళ్లి కంటే ముందే నిశ్చితార్థం అయ్యి క్యాన్సిల్ కావటం. ఆ తర్వాత అతడితో పెళ్లి జరిగింది. దీంతో భర్త ఆమెను పదేపదే సెకండ్ హ్యాండ్ అని కించపరిచేవాడు. అలాగే అమెరికా వచ్చిన ఆమె తల్లిదండ్రును అత్యంత నీచంగా చూసేవాడు. పైగా ఆమె తండ్రికి గుండె ఆపరేషన్ జరిగితే మరో ఇంట్లో ఉంచమని గొడవ చేసేవాడని భార్య పిటిషన్లో స్పష్టం చేసింది. గృహ హింస తీవ్ర స్థాయిలో ఉందని.. అనేక మానసిక వేధింపులు, హింసకు గురైనట్లు భార్య తన పిటీషన్లో పేర్కొంది. భార్య వాదనలతో ఏకీభవించిన ముంబై కోర్టు.. 2017లో తీర్పు వెళ్లడించింది. భార్యకు ప్రతినెలా లక్షా 50 వేల రూపాయల భరణం, సెకండ్ హ్యాండ్ అంటూ కించపరిచినందుకు 3 కోట్ల రూపాయల పరిహారం, కోర్టు ఖర్చుల కింద 50 వేల రూపాయలు చెల్లించాలని భర్తను ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ..భర్త సెషన్స్ కోర్టుకు వెళ్లాడు. అక్కడ కూడా భార్యకు అనుకూలంగానే తీర్పు వచ్చింద. ఇక లాభం లేదని ఈ తీర్పులపై ముంబై హైకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేశాడు భర్త. సుదీర్ఘ విచారణ తర్వాత.. ముంబై హైకోర్టు కింది రెండు కోర్టుల తీర్పుని సమర్థిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. భార్యను సెకండ్ హ్యాండ్ అంటూ కించపరిచి.. మానసిక వేదనకు గురి చేసిన భర్త.. 3 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాల్సిందే అని ముంబై హైకోర్టు తీర్పు వెల్లడించింది. భార్య ఆత్మగౌరవాన్ని దెబ్బతిసే అధికారం భర్తకు లేదని స్పష్టం చేసింది. ఇరువురు ఉన్నత చదువులు చదువులు, మంచి ఉద్యగాల్లో స్థిరపడినవారు, పైగా సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు ఉన్నవారు.. అలాంటివారు మరోకరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడ సబబు కాదని పేర్కొంది. ముఖ్యంగా భార్యను సెకండ్ హ్యాండ్ అంటూ.. ఓ మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం అనేది సామాజిక రుగ్మతగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఇలాంటి వాటిని ఉపేక్షించటం అనేది సహించరాని నేరం అని పేర్కొంది. ఉన్నత పదవుల్లో ఉండేవారు.. మరొకరికి మార్గదర్శకంగా ఉండాలని వక్కాణించింది. అస్సలు ఒక మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు అంటూ మండిపడింది ముంబై హైకోర్టు. అందుకుగానూ భార్యకు రూ. 3 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందేనని భర్తను ఆదేశిస్తూ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు నిజంగా ఎందరో భర్తలకు కనువిప్పు అనే చెప్పాలి. ఎప్పుడూ భార్యను చులకన చేసి ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా భర్తలకు ఈ తీర్పు పెద్ద చెంపదెబ్బ అని చెప్పొచ్చు. (చదవండి: అందం కోసం పాము రక్తమా? ఎక్కడో తెలుసా!) -
సాయిబాబా నిర్దోషి
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాతోపాటు మరో ఐదుగురు నిందితులను బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ నిర్దోషులుగా ప్రకటించింది. 2017లో సాయిబాబాతో పాటు ఇతరులను దోషులుగా నిర్ధారిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై నాగ్పూర్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ వినయ్ జోషీ, జస్టిస్ వాల్మికి మెనెజెస్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. నిందితులపై వచ్చిన ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, అందుకే వారిపై అభియోగాలను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం తోసిపుచ్చింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, దేశంపై యుద్ధంపై చేసే కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ 2017 మార్చిలో సాయిబాబా, ఇతరులను మహారాష్ట్రలోని గడ్చిరోలీ సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. దీనిపై సాయిబాబా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 2022 అక్టోబరు 14న జస్టిస్ రోహిత్ నేతృత్వంలోని ధర్మాసనం సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి రోజు శనివారమైనప్పటికీ ప్రత్యేకంగా విచారించింది. హైకోర్టు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం జస్టిస్ షా, జస్టిస్ రవికుమార్ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి 2023 ఏప్రిల్ 19న బాంబే హైకోర్టు తీర్పును పక్కనపెట్టింది. ఈ తీర్పును మళ్లీ పరిశీలించాలని బాంబే హైకోర్టుకు పంపించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ జోషీ, జస్టిస్ వాల్మికిల హైకోర్టు ధర్మాసనం విచారించి, సాయిబాబా, ఇతరులను నిర్దోషులుగా ప్రకటించింది. ప్రొఫెసర్ సాయిబాబా 2014లో అరెస్టయ్యారు. ప్రస్తుతం నాగ్పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. పదేళ్ల పోరాటం తర్వాత ఊరట దక్కింది బాంబే హైకోర్టు తీర్పు పట్ల సాయిబాబా భార్య వసంత ఆనందం వ్యక్తం చేశారు. పదేళ్ల తర్వాత ఊరట లభించిందన్నారు. సాయిబాబాకు అండగా నిలిచిన లాయర్లకు, సామాజిక కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. తన భర్త పది సంవత్సరాలు జైలులో ఉన్నారని, ఆర్థికంగా, మానసికంగా తాము ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని చెప్పారు. సాయిబాబా గురించి ప్రజలకు వాస్తవాలు తెలుసని, ఆయన పట్ల వారికి సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో మహారాష్ట్ర సర్కారు పిటిషన్ మావోయిస్టులతో సంబంధాల కేసులో మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు మంగళవారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. సాయిబాబాతోపాటు ఇతరులను నిర్దోషులుగా నిర్ధారిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని మహారాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీరేంద్ర షరాఫ్ ఈ సందర్భంగా చెప్పారు. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును కొంతకాలం నిలిపివేయాలని కోరుతూ హైకోర్టు ధర్మాసనం ముందు అప్లికేషన్ దాఖలు చేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని పునఃపరిశీలించే అధికారం ఉండదని, ఇది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది. అడ్వొకేట్ జనరల్ దాఖలు చేసిన అప్లికేషన్ను కొట్టివేసింది. -
హైకోర్టును ఆశ్రయించిన ఐదేళ్ల బుడ్డోడు.. కారణమిదే!
యూపీలోని కాన్పూర్కు చెందిన ఓ బుడ్డోడు అలహాబాద్ హైకోర్టును ఒక ప్రత్యేక అభ్యర్థనతో ఆశ్రయించాడు. తాను చదువుకుంటున్న పాఠశాల సమీపంలో మద్యం దుకాణం ఉందని, దానిని తొలగించాలంటూ ఆ ఐదేళ్ల చిన్నారి హైకోర్టులో పిటిషన్ వేశాడు. మందుబాబులు పాఠశాలను అసాంఘిక కార్యకలాపాలకు ఆడ్డాగా మార్చారని ఆ చిన్నారి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారి కారణంగా తమ చదువులు దెబ్బతింటున్నాయని పేర్కొన్నాడు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని కోరింది. కాన్పూర్లోని ఓ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్న ఐదేళ్ల చిన్నారి అథర్వ తన కుటుంబ సభ్యుల సాయంతో కోర్టుకు ఈ ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన హైకోర్టు ప్రతి సంవత్సరం ఈ మద్యం దుకాణం కాంట్రాక్టును ఎలా పునరుద్ధరిస్తున్నారని యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ పాఠశాల కాన్పూర్ నగరంలోని ఆజాద్ నగర్ ప్రాంతంలో ఉంది. అక్కడికి 20 మీటర్ల దూరంలో మద్యం దుకాణం ఉంది. నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల తర్వాతే తెరవాలి. అయితే తరచూ ఉదయం ఆరు గంటల నుంచే ఇక్కడ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని అథర్వ కోర్టుకు తెలిపాడు. అథర్వ కుటుంబ సభ్యులు ఈ విషయమై కాన్పూర్ అధికారులకు, యూపీ ప్రభుత్వానికి అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాగా ఈ పాఠశాల 2019లో ప్రారంభమయ్యిందని, మద్యం దుకాణానికి సంబంధించిన ఒప్పందం దాదాపు 30 ఏళ్లనాటిదని వైన్స్ దుకాణ యజమాని వాదనకు దిగారు. ఈ నేపధ్యంలో అధర్వ తన కుటుంబ సభ్యుల సహకారంతో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా, జస్టిస్ క్షితిజ్ శైలేంద్రలతో కూడిన డివిజన్ బెంచ్ విచారిస్తోంది. ఈ కేసులో తదుపరి విచారణ మార్చి 13న జరగనుంది. -
న్యాయస్థానాల్లో ‘పెండింగ్’ భారం ఎంత?
దేశంలోని పలు కోర్టుల్లో లెక్కకుమించిన కేసులు పెండింగ్లో ఉంటున్నాయనే విషయం విదితమే. అయితే నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (ఎన్జేడీజి) అందించిన తాజా సమాచారం చూస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. దేశంలోని కోర్టుల్లో 4.47 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం 25 హైకోర్టుల్లో అలహాబాద్ హైకోర్టు 10.74 లక్షల కేసులతో ముందుంది. దీని తర్వాత బాంబే హైకోర్టులో 7.13 లక్షల కేసులు, రాజస్థాన్ హైకోర్టులో 6.67 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (ఎన్జీడీజీ) అందించిన తాజా డేటాలో ఈ వివరాలు ఉన్నాయి. 2018 నుంచి పెండింగ్ కేసుల సంఖ్య పెరిగింది. అలహాబాద్ హైకోర్టులో పెండింగ్ కేసులు 50.95 శాతం మేరకు పెరిగాయి. బాంబే హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు 53.85 శాతం మేరకు పెరిగాయి. అన్ని హైకోర్టుల్లో మొత్తం 62 లక్షల కేసులు పెండింగ్లో ఉండగా, వీటిలో 71.6 శాతం సివిల్ కేసులు, 28.4 శాతం క్రిమినల్ కేసులు. 2018 నుంచి ఈ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య పెరిగింది. 24.83 శాతం కేసులు 5 నుంచి 10 ఏళ్ల క్రితం నాటివి. 24.83 శాతం కేసులు 5 నుంచి 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. 18.25 శాతం కేసులు 10 నుంచి 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. పలు నివేదికల ప్రకారం పెండింగ్లో ఉన్న కేసులకు న్యాయమూర్తుల సంఖ్య సరిపోకపోవడమే ప్రధాన కారణం. 2022 మే నాటికి దాదాపు 25,600 మంది న్యాయమూర్తులు నాలుగు కోట్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసులను విచారించే లేదా తీర్పునిచ్చే పనిలో ఉన్నారు. -
భర్తకు ఆదాయం లేకపోయినా..మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందేనా?
ఇటీవల కాలంలో దంపతుల మధ్య సయోధ్య లేకపోవడం వల్లనో లేక ఇతరత్ర కారణాల వల్లనో విడాకులకు దారితీస్తున్నాయి. ఫ్యామిలీ కోర్టుల్లో అందుకు సంబంధించిన కేసులు సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇద్దరి సమ్మతంతో విడిపోయినప్పటికీ స్త్రీకి ఎంతో కొంత భరణం ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని క్లైయిమ్ చేసుకోవాల్సింది సదరు మహిళే. ఒకవేళ ఆమె క్లైయిమ్ చేసుకున్నప్పటికీ కొందరూ ప్రబుద్ధులు తనకు ఆదాయం లేదని, లేదా కుటుంబాన్ని చూసుకోవాల్సి ఉందంటూ భరణం ఇవ్వకుండా తప్పించుకునే ప్లాన్లు వేస్తుంటారు. దీంతో సదరు మహిళలు ఇబ్బందులు పడుతుంటారు. అయితే అలాంటి ఎత్తుగడలకు చెక్పెడుతూ అలహాబాద్ ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. అసలేం జరిగిందంటే..అలహాబాద్కు చెందిన ఓ జంటకు 2015లో వివాహం అయ్యింది. అదనపు కట్నం డిమాండ్ చేస్తున్నారని సదరు మహిళ అత్తమామలపై ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఆమె 2016 నుంచి తల్లిదండ్రులతోనే జీవిస్తుంది. అయితే ఫామిలీ కోర్టు ఆమెకు నెలకు రూ. 2000 భరణం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సదరు వ్యక్తి హైకోర్టుని ఆశ్రయించాడు. తనకు ఆదాయం లేదని, తన తల్లిదండ్రులను, అక్కచెల్లెళ్లను చూసుకోవాల్సి ఉండటంతో తాను భరణం చెల్లించలేనంటూ పిటీషన్ వేశాడు. అంతేగాదు తన భార్య టీచింగ్ ద్వారా నెలకు రూ. 10 వేలకు సంపాదిస్తున్నారని కాబట్టి తాను ఇవ్వలేనని పిటిషన్లో పేర్కొన్నాడు. అయితే ధర్మాసనం ఆదాయం లేకపోయినా లేదా ఉద్యోగం లేకపోయినా రోజూ కూలిగా రూ. 300 నుంచి రూ. 400 వరకు సంపాదించొచ్చు అంటూ ఆ వ్యక్తికి మొట్టికాయలు వేసింది. ఉద్యోగం ఉన్నా, లేకపోయినా విడిపోయిన భార్యకు మెయింటెనెన్స్ చెల్లించాల్సిందేనని పేర్కొంది ధర్మాసనం. ఆ వ్యక్తి పిటిషన్ను జస్టిస్ రేణూ అగర్వాల్ సారధ్యంలోని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ తోసి పుచ్చింది. సదరు వ్యక్తి ఆయన భార్యకు చెల్లించాల్సిన మొత్తం భరణం రికవరీ బాధ్యతలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ జడ్జిని ఆదేశించారు జస్టిస్ రేణు అగర్వాల్. అలాగే సదరు వ్యక్తి తన భార్య ఉద్యోగం చేస్తుందనేందుకు ఆధారాలు సమర్పించడంలో కూడా విఫలమయ్యారని హైకోర్టు పేర్కొంది. అదీగాక ఆ వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నందున కార్మికుడిగా పని చేసైనా భార్యకు భరణం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సదరు వ్యక్తి గతేడాది ఫిబ్రవరి 21న రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, సీఆర్పీసీ 125 సెక్షన్ కింద భార్యకు భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించడం జరిగింది. ఇలాంటి సమస్యలనే ఫేస్ చేస్తుంటే..భయపడొద్దు. ధైర్యంగా మహిళలకు అనుకూలమైన చట్టాల గురించి సవివరంగా తెలుసుకుని కోర్టులో పోరాడండి. అదే సమయంలో మహిళలు కూడా తమ వైవాహిక బంధాన్ని చిన్న చిన్న విషయాలకు తెంచుకునే యత్నం చేయకుండా పెద్దలతో సయోధ్య చేసుకునేలా ప్రయత్నించి, మను వివాహ వ్యవస్థను కాపాడుకునే యత్నం చేద్దాం. (చదవండి: జీవితాన్ని దిద్దుకుంది... పేదల పక్షాన నిలిచింది) -
వికేంద్రీకరణను అడ్డుకుంటున్న విజ్ఞత లేని పార్టీలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించకుండా కొన్ని విజ్ఞత లేని రాజకీయ పార్టీలు అడ్డుకుంటున్నాయని పరిపాలనా వికేంద్రీకరణ నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ హనుమంతు లజిపతిరాయ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన గురువారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ పరిపాలనా రాజధాని విషయంలో న్యాయపరమైన నిర్ణయం మరింత ఆలస్యం కావడంపై విచారం వ్యక్తంచేశారు. ఏదో ఒకరకమైన సాంకేతిక అంశాలను లేవనెత్తి సుప్రీంకోర్టులో త్వరితగతిన తీర్పు రాకుండా విజ్ఞత లేని రాజకీయ పార్టీలు అడ్డుకోవడాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలని నిర్ణయించే అధికారం ఆయా ముఖ్యమంత్రులకు లేదని తెలిపే అధికరణ భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఆయన స్పష్టంచేశారు. మారుతున్న అభివృద్ధి.. అవసరాల దృష్ట్యా పరిపాలనా వికేంద్రీకరణను ఇప్పటికే ప్రపంచంలో 14కు పైగా దేశాలు పాటిస్తున్నాయని చెప్పారు. మన దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో హైకోర్టు ఒకచోట ఉంటే శాసనసభ వ్యవహారాలు మరోచోట ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇవి చదవండి: Fact Check: ‘మీటర్ల’ కొద్దీ అసత్యాలు అల్లేస్తున్నారు! -
కొలీజియం సిఫార్సుల అమలేదీ?
న్యూఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం, నచి్చన జడ్జిలనే బదిలీ చేయడం, ఇతరులను పెండింగ్లో పెట్టడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి వైఖరి తప్పుడు సంకేతాలను పంపిస్తుందని వెల్లడించింది. 11 మంది జడ్జిలను బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేయగా, ఐదుగురిని కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. మరో ఆరుగురి బదిలీ వ్యవహారం పెండింగ్లో ఉంది. కొలీజియం సిఫార్సుల అమలు విషయంలో 2021 నాటి సుప్రీంకోర్టు తీర్పునకు కేంద్ర న్యాయ శాఖ కట్టుబడటం లేదని, కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపట్టాలని కోరుతూ బెంగళూరు అడ్వొకేట్స్ అసోసియేషన్తోపాటు మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధూలియా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. హైకోర్టు జడ్జిలుగా పలువురి పేర్లను కొలీజియం ఇటీవల సిఫార్సు చేయగా, 8 మంది పేర్లకు కేంద్రం ఇంకా ఆమోదం తెలియజేయాలని గుర్తుచేసింది. కేంద్రం జడ్జిలుగా నియమించిన వారికంటే వీరిలో కొందరు సీనియర్లు ఉన్నారని వెల్లడించింది. -
కుక్క కాటు.. ఒక్కో పంటి గాటుకు రూ.10వేల పరిహారం!
చండీగఢ్: కుక్క కాటు కేసులపై హర్యానా-పంజాబ్ హైకోర్టులు సంచలన తీర్పు వెలువరించింది. కుక్క కాటుపై రాష్ట్ర ప్రభుత్వాలే ప్రధాన బాధ్యత వహించాలని ధర్మాసనం తెలిపింది. కుక్క కాటు కేసుల్లో ఒక్కో పంటి గాటుకు రూ.10,000 నష్టపరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది. కుక్క కాటు ఘటనల్లో 0.2 సెంటీమీటర్ల కోత పడితే రూ.20,000 బాధితునికి చెల్లించాలని ఆదేశించింది. కుక్క కాటు కేసులో దాఖలైన 193 కేసుల్లో న్యాయస్థానం విచారణ చేపట్టింది. వీధికుక్కల బెడదపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది. వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 49 ఏళ్ల పరాగ్ దేశాయ్ అక్టోబర్లో వీది కుక్కలు వెంబడించిన ఘటనలో మరణించారు. వీధికుక్కలు ఆయన్ని వెంబడించగా పడిపోవడంతో తీవ్ర రక్తస్రావం అయిందని.. ఆ కారణంగా దేశాయ్ మరణించారని సంబంధిత ఆసుపత్రి ఇటీవల ప్రకటనలో పేర్కొంది. ఈ విషాద ఘటన అనంతరం సోషల్ మీడియాలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని పెద్ద ఎత్తున చర్చ సాగింది. పంజాబ్, హర్యానా, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్లలో నమోదైన కుక్క కాటు కేసులపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు కోరింది. జంతువుల దాడి కేసుల్లో చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని నిర్ణయించాలని తీర్పులో స్పష్టం చేసింది. అయితే.. వీది కుక్కలతో పాటు ఆవులు, ఎద్దులు, గాడిదలు, గేదెలు, అడవి, పెంపుడు జంతువులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇదీ చదవండి: Liquor Sale In Delhi: ‘దీపావళి మద్యం’తో ఢిల్లీ సర్కారుకు భారీ ఆదాయం! -
పొలిటికల్ నేతలపై క్రిమినల్ కేసులు.. సుప్రీం కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని(క్రిమినల్ కేసులకు సంబంధించి) కోరుతూ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అటువంటి కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి చర్యలు తీసుకునే బాధ్యతను సుప్రీంకోర్టు.. హైకోర్టులకు అప్పగించింది. వివరాల ప్రకారం.. దేశంలో తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించే విషయంలో, ఏకరీతి మార్గదర్శకాలను రూపొందించడం కష్టమని సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది. ఇదే సమయంలో అటువంటి కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి చర్యలు తీసుకునే బాధ్యతను హైకోర్టులకు అప్పగించింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయాలని, ఈ కేసులను ఏడాదిలోగా పరిష్కరించేలా చూడాలని అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించినట్లు పిటిషనర్, న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ్ తెలిపారు. Supreme Court issues directions for speedy disposal of criminal cases against MP/MLAs. Supreme Court says it would be difficult for it to form a uniform guideline for trial courts relating to speedy disposal of cases against MP/MLAs. Supreme Court asks High Courts to register a… pic.twitter.com/O2izpfV3Nl— ANI (@ANI) November 9, 2023 సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఇవే.. ►ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారాన్ని పర్యవేక్షించడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలి. ►కేసులు త్వరగా పరిష్కరించడాన్ని, పర్యవేక్షించడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తప్పనిసరిగా ప్రత్యేక టైటిల్ ఏర్పాటు చేయాలి ►అవసరాన్ని బట్టి ప్రత్యేక బెంచ్ క్రమ వ్యవధిలో కేసులు లిస్ట్ చేయాలి ►కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు హైకోర్టు తగిన ఆదేశాలు ఇవ్వాలి. VIDEO | "Today, the Supreme Court has given a historic verdict. The Supreme Court judgment has come with regard to our first prayer. The court has directed all the high courts to constitute a special bench to monitor cases of MPs, MLAs and ensure that these cases are decided… pic.twitter.com/WgcLerxIoR— Press Trust of India (@PTI_News) November 9, 2023 -
రాజ్ భవన్ లో ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ జి.నరేందర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం
-
ప్రేమ పెళ్లిళ్లను పెద్దలు కాదనలేరు: ఢిల్లీ హైకోర్టు
ఇకపై మేజర్లయిన పిల్లల పెళ్లిళ్లను పెద్దలు అడ్డుకోలేరు. వివాహానికి తగిన వయసు కలిగిన యువతీయువకులు తమకు ఇష్టమైన భాగస్వామిని వివాహం చేసుకోవచ్చని, ఇటువంటి సందర్భంలో ఆ జంటల వివాహానికి తల్లిదండ్రులు లేదా వారి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పలేరని, రాజ్యాంగం ఆ జంటకు రక్షణ కల్పిస్తుందని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్న జంటలకు పోలీసులు రక్షణ కల్పిస్తారని, అవసరమైన పక్షంలో వారి కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు రక్షణ అందిస్తారని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. భార్యాభర్తల వివాహ హక్కును ఏ విధంగానూ తక్కువ చేయకూడదని, ఇలాంటి జంటలకు రక్షణ కల్పించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత ఆ రాష్ట్రంపై ఉందని జస్టిస్ తుషార్ రావు గేదెల అభిప్రాయపడ్డారు. ఢిల్లీ హైకోర్టు ఒక కేసులో.. తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకున్న ఒక జంటకు పోలీసు రక్షణ కల్పిస్తూ, మేజర్లయిన యువతీయువకులు తమకు ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించిందని కోర్టు పేర్కొంది. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఒక జంట న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వీరిలో భర్తపై నమోదైన తప్పుడు ఎఫ్ఐఆర్ను గత ఆగస్టులో కోఆర్డినేట్ బెంచ్ రద్దు చేసిందని జస్టిస్ గేదెలకు చెప్పారు. కాగా ఎఫ్ఐఆర్ పెండింగ్లో ఉన్న సమయంలోనే వారు వివాహం చేసుకుని, ఆనందంగా జీవిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ దంపతులకు హాని జరగకుండా చూసుకోవాలని ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఇది కూడా చదవండి: ‘రెడ్ లైట్ ఆన్- వెహికిల్ ఆఫ్’ అంటే ఏమిటి? ఢిల్లీలో ఎందుకు అమలు చేస్తున్నారు? Right To Marry Person Of Choice Protected Under Constitution, Not Even Family Members Can Object: Delhi High Court @nupur_0111 https://t.co/JEDBQuyQI8 — Live Law (@LiveLawIndia) October 26, 2023 -
గురుద్వారలో ఇద్దరు యువతుల వివాహం
చండీఘడ్లోని జలంధర్కు చెందిన ఇద్దరు యువతులు ఖరార్ (మొహాలీ)లోని గురుద్వారాలో వివాహం చేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు ఇద్దరికీ జీవిత భద్రత, స్వేచ్ఛను అందంచాలని జలంధర్ ఎస్ఎస్పీని ఆదేశించింది. ఈ పిటిషన్ను దాఖలు చేసిన ఆ ఇద్దరు యువతులు తాము ఒకరినొకరు ఇష్టపడ్డామని, అక్టోబరు 18న ఖరార్లోని గురుద్వారాలో వివాహం చేసుకున్నామని హైకోర్టుకు తెలిపారు. అయితే ఈ వివాహం విషయంలో తమ కుటుంబ సభ్యులు సంతోషంగా లేరని, తమ ప్రాణాలకు ముప్పు ఉందని, వారు కోర్టుకు అందించిన లేఖలో పేర్కొన్నారు. దీనికి ముందు ఆ యువతులు జలంధర్ ఎస్ఎస్పీకి లేఖ ఇచ్చారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. వారి లేఖను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని జలంధర్ ఎస్ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. వారి ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరింది. ఇది కూడా చదవండి: ‘రెడ్ లైట్ ఆన్- వెహికిల్ ఆఫ్’ అంటే ఏమిటి? ఢిల్లీలో ఎందుకు అమలు చేస్తున్నారు? -
గొణుగుడు ఎందుకు: పొరపాటు జరిగింది, క్షమించండి!
అహ్మదాబాద్: ఇద్దరు న్యాయమూర్తుల వాగ్వాదానికి గుజరాత్ హైకోర్టు వేదికైంది. న్యాయమూర్తులు జస్టిస్ బీరేన్ వైష్ణవ్, జస్టిస్ మౌనా భట్ ధర్మాసనం సోమవారం ఓ కేసును విచారిస్తున్న సందర్భంగా ఈ ఉదంతం జరిగింది. కేసుకు సంబంధించిన కొన్ని అంశాలపై వారిద్దరూ విభేదించారు. అనంతరం జస్టిస్ వైష్ణవ్ వెలువరించిన తీర్పుతో జస్టిస్ భట్ ఏకీభవించలేదు. దాంతో, ‘కావాలంటే మీరు విభేదించండి. ఇప్పటికే ఒక కేసులో మనం విభేదించాం. ఇందులోనూ అలాగే చేయవచ్చు’ అని జస్టిస్ వైష్ణవ్ అన్నారు. ఇది కేవలం విభేదించడానికి సంబంధించిన విషయం కాదంటూ జస్టిస్ భట్ ఏదో చెప్పబోగా, ‘మరైతే గొణగకండి. విడి తీర్పు వెలువరించండి. మనమిక తదుపరి కేసులు చేపట్టబోవడం లేదు’ అంటూ తన స్థానం నుంచి లేచారు. ధర్మాసనం తదుపరి కేసులు ఆలకించబోదని చెబుతూ కోర్టు రూమ్ నుంచి వెళ్లిపోయారు. ఇదంతా కోర్టు రూములోని సీసీ కెమెరాలో రికార్డయింది. గుజరాత్ హైకోర్టులో అన్ని బెంచ్లు జరిపే విచారణలూ ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. జడ్జిల వాగ్వాదానికి సంబంధించిన వీడియోను కాసేపటికే యూట్యూబ్ నుంచి తొలగించారు. కానీ ఆ వీడియో అప్పటికే సామాజిక మాధ్యమాల వేదికనెక్కి తెగ చక్కర్లు కొడుతోంది. (మెక్డోనాల్డ్స్ హ్యాపీ మీల్ ఆర్డర్ చేస్తున్నారా ? ఈ మహిళ షాకింగ్ అనుభవం తెలిస్తే..!) అయితే గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి వైష్ణవ్ బుధవారం బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. సోమవారం నాటి సంఘటనలు జరగ కూడదు తప్పును అంగీకరిస్తున్నాను అంటూ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడి ఉండాల్సింది, పొరబడ్డాను అంటూ జస్టిస్ వైష్ణవ్ పేర్కొన్నారు. కాగా 2016, జనవరిలో సుప్రీంకోర్టులో దాదాపు ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఎంవై ఎక్బాల్ , అరుణ్ మిశ్రా మధ్య జరిగిన వాగ్వాదానికి విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు. (‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’) -
47 మంది హైకోర్టు మాజీ న్యాయమూర్తులకు సీనియర్ హోదా
సాక్షి, న్యూఢిల్లీ: 47 మంది హైకోర్టు మాజీ న్యాయమూర్తులకు సీనియర్ హోదా ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. వీరిలో తొమ్మిది మంది హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులున్నారు. ఈ నెల 16న జరిగిన ఫుల్ కోర్ట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ 47 మంది మాజీ న్యాయమూర్తుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల నుంచి ఏడుగురు ఉన్నారు. సీనియర్ హోదా పొందిన వారిలో తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ రెడ్డి కాంతారావు, జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్, జస్టిస్ అనుగు సంతోష్ రెడ్డి, జస్టిస్ డాక్టర్ అడ్డుల వెంకటేశ్వర రెడ్డి సీనియర్ హో దా పొందారు. అలాగే, ఏపీ హైకోర్టు మాజీ తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ వి.ఈశ్వ రయ్య, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్, మాజీ న్యాయ మూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఉన్నారు. -
ఏపీ హైకోర్టుకు నలుగురు అదనపు జడ్జీలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నలుగురు నియమితులయ్యారు. నూనెపల్లి హరినాథ్, మండవ కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు. వీరి నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు వీరు హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతారు. వీరితో శుక్రవారం ఉదయం హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయిస్తారు. కాగా.. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గుహనాథన్ నరేందర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారన్న విషయం తెలియాల్సి ఉంది. జస్టిస్ నరేందర్ రాష్ట్ర హైకోర్టులో నంబర్ త్రీ స్థానంలో ఉంటారు. ఇదే సమయంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్, జస్టిస్ దుప్పల వెంకటరమణ బదిలీకి సైతం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ గుజరాత్ హైకోర్టుకు, జస్టిస్ వెంకటరమణ మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చే న్యాయమూర్తులు, బదిలీపై వెళ్లే ఇద్దరు న్యాయమూర్తులతో కలిపి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరుతుంది. -
దేశవ్యాప్తంగా 16 మంది హైకోర్టు జడ్జిల బదిలీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 16 మంది హైకోర్టు జడ్జిలు బదిలీ అయ్యారు. గతంలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన పదహారు మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలను కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫై చేసింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్తో సంప్రదింపులు జరిపిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ట్రాన్స్ఫర్ అయిన జడ్జిల్లో ఏపీ హైకోర్టుకు చెందిన ఇద్దరు జడ్జిలు, తెలంగాణకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఉన్నారు. బదిలీ అయిన న్యాయమూర్తుల వారి జాబితా 1. జస్టిస్ ఎస్పీ కేసర్వాణి( అలహాబాద్ హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టుకు బదిలీ) 2. జస్టిస్ రాజ్ మోహన్ సింగ్( పంజాబ్-హర్యాణా హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ) 3. జస్టిస్ నరేందర్ జీ( కర్ణాటక హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ) 4. జస్టిస్ సుధీర్ సింగ్(పాట్నా హైకోర్టు నుంచి పంజాబ్, హర్యానా కోర్టుకు బదిలీ 5. జస్టిస్ ఎంవీ మురళిధరన్( మణిపూర్ హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టుకు బదిలీ) 6. జస్టిస్ మధురేష్ ప్రసాద్ (పాట్నా హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టుకు బదిలీ) ఎపి హైకోర్టులో ఇద్దరు జడ్జిలు బదిలీ 7. జస్టిస్ అరవింద్ సింగ్ సాంగ్వాన్ (పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ) 8. జస్టిస్ అవనీష్ జింగాన్ (పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ) 9. జస్టిస్ అరుణ్ మోంగా (పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ) 0. జస్టిస్ రాజేంద్ర కుమార్ (అలహాబాద్ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ) 11. జస్టిస్ నాని టాగియా [గువాహతి హైకోర్టు నుంచి పాట్నా హైకోర్టుకు బదిలీ) 12. జస్టిస్ సి మానవేంద్రనాథ్ రాయ్ [ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి హైకోర్టు గుజరాత్ హైకోర్టుకు బదిలీ) 13. జస్టిస్ మున్నూరి లక్ష్మణ్ [తెలంగాణ హైకోర్టు నుంచి రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ 14. జస్టిస్ జి అనుపమ చక్రవర్తి [తెలంగాణ హైకోర్టు నుంచి పాట్నా హైకోర్టుకు బదిలీ) 15. జస్టిస్ లపితా బెనర్జీ (అదనపు న్యాయమూర్తి) (కలకత్తా హైకోర్టు నుంచి పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ) 16. జస్టిస్ దుప్పల వెంకట రమణ (అదనపు న్యాయమూర్తి) (ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ) ‘‘ఇక్కడ క్లిక్ చేసి సాక్షి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
ఏపీ హైకోర్టు జడ్జిలుగా మరో నలుగురు
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నలుగురు నూతన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియ నియమించింది. సీనియర్ న్యాయవాదులు హరినాథ్, కిరణ్మయి, సుమిత్, విజయ్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం గత ఫిబ్రవరిలో న్యాయాధికారుల కోటా నుంచి ఇద్దరు న్యాయమూర్తులను ఏపీ హైకోర్టుకు నియమించిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరి నియామకంతో న్యాయాధికారుల కోటా పూర్తి కాగా, న్యాయవాదుల కోటాలో నలుగురు కొత్త జడ్జిలను ఏపీ హైకోర్టుకు కేటాయిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. -
'ఇదేం నివేదిక..?' వరదలపై ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు..
హైదరాబాద్: వరదలపై నివేదికను సమర్పించిన ప్రభుత్వంపై న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. ఈ అంశంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. రూ.500 కోట్ల పరిహారంలో ఎవరికి ఎంత సహాయం చేశారో వివరాలు సరిగా లేవని తెలిపింది. రూ.500 కోట్లు ఎలా ఖర్చు చేశారో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వరదలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను పేర్కొంటూ నివేదికను న్యాయస్థానానికి ప్రభుత్వం తరపు న్యాయవాది సమర్పించారు. నేడు దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే.. రూ.500 కోట్లు రూపాయలు పునరావాసం కోసం కేటాయించినట్లు ప్రభుత్వం రిపోర్ట్ లో పేర్కొంది. వరదల ప్రభావంతో 49 మంది మృతి చెందినట్లు కోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. అయితే.. రెండో సారి ప్రభుత్వం దాఖలు చేసిన నివేదిక కూడా అసంపూర్తిగా ఉందని వాదనలు వినిపించిన పిటిషనర్ తరుపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్.. వరద ప్రభావం , నష్టంపై మరో నివేదిక మెమోను న్యాయస్థానానికి సమర్పించారు. అంటువ్యాధులతో భాదపడుతున్న వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలో తెలపాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. చనిపోయిన 49 మందికి ఎంత నష్ట పరిహారం చెల్లించారో సమగ్ర నివేదిక సమర్పించాలని పేర్కొంది. తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద నివారణ, బాధితులకు సహాయం, పరిహారం అందజేత లాంటి వివరాలపై శాశ్వత నివారణ చర్యలు ఏం చేపట్టారో వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. రాష్ట్రంలో జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలేదంటూ డాక్టర్ చెరుకు సుధాకర్ 2020లో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తాజా వర్షాలు, వరదల నేపథ్యంలో దీనికి సంబంధించి ఓ మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలైంది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. హైకోర్టుకు ఓ నివేదికను సమర్పించింది. దీనిలో రూ.500 కోట్లను నష్టపరిహారంగా బాధితులకు పంచినట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలకు 240 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 6,443 ఇళ్లకు పాక్షిక నష్టం వాటిల్లింది. 1,59,960 ఎకరాల్లో పంటలు వరద బారిన పడ్డాయని తెలిపింది. ఈ మేరకు తాజాగా పూర్తి నివేదిక న్యాయస్థానం ముందు పెట్టింది. ఇదీ చదవండి: Telangana Floods: సహాయక చర్యలేం చేపట్టారు..? -
Nuh violence: బుల్డోజర్ యాక్షన్కు హైకోర్టు బ్రేక్..
చండీగఢ్: హర్యానాలోని నుహ్ జిల్లాలో అల్లర్లు చెలరేగిన తర్వాత అక్కడి ప్రభుత్వం బుల్డోజర్ యాక్షన్కు దిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఈ చర్యలను నిలిపివేయాలని హర్యానా, పంజాబ్ హైకోర్టులు తాజాగా ఆదేశాలు జారీ చేశాయి. దీంతో బుల్డోజర్తో బవనాల కూల్చివేత చర్యలను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు కూల్చివేత చర్యలను నిలిపివేయాలని రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్కట సంబంధిత అధికారులను ఆదేశించారు. హర్యానాలో మతపరమైన ఘర్షణలు చెలరేగిన అనంతరం ఈ వ్యవహారాన్ని కోర్టు సుమోటుగా తీసుకుని విచారణ చేపట్టింది. బుల్డోజర్ యాక్షన్లో ఇప్పటివరకు 350 గుడిసెలు, 50 సిమెంట్ నిర్మాణాలను ప్రభుత్వం కూల్చివేసింది. అయితే.. ప్రభుత్వ చర్య రాజకీయంగా విమర్శలకు దారితీసింది. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలు జరుగుతున్నాయని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. తాము అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. నూహ్ జిల్లాలో అల్లర్లకు కారణమైన సహారా హోటల్ను ఆదివారం బుల్డోజర్లు కూల్చివేశాయి. ఇదే భవనం పైనుండి అల్లరిమూకలు మతపరమైన ఊరేగింపుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇప్పటికే నాలుగు రోజులుగా కొనసాగుతోన్న ఈ ప్రక్రియలో సుమారు 50-60 ఇళ్ళు నేలమట్టమయ్యాయి. సంఘటనా స్థలానికి 20కి.మీ దూరంలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారి ఇళ్లతో పాటు సుమారు డజను దుకాణాలు, మందుల షాపులు ధ్వంసం చేసినట్లు తెలిపాయి పోలీసు వర్గాలు. విశ్వ హిందూ పరిషత్ రథయాత్రపై కొందరు అల్లరి మూకలు రాళ్ల దాడి చేయడంతో హర్యానాలో అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులు వాహనాలకు నిప్పంటించారు. ఊరేగింపులో పాల్గొన్న 2500 మంది భయంతో స్థానిక దేవాలయంలో ప్రాణాలు కాపాడుకున్నారు. అదే రోజు రాత్రి స్థానికంగా మసీదు దగ్దం కావడం అల్లర్ల తీవ్రతను మరింత పెంచింది. ఇదీ చదవండి: శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే నివాసంలో అలజడి.. వీడియో వైరల్.. -
దేశంలో 24 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ
ఢిల్లీ : దేశంలో 24 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఒకేసారి ఈ స్థాయిలో న్యాయమూర్తులను బదిలీ చేయడం బహుశా ఇదే అత్యధికం. ఏపీ, తెలంగాణ, పంజాబ్, గుజరాత్, అలహాబాద్, పట్నాతో సహా పలు హెకోర్టుల్లో పని చేస్తున్న జడ్జీలను బదిలీలను ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ మేరకు సీజేఐ నేతృత్వంలోని కొలీజియం ప్రతిపాదించింది. న్యాయమూర్తుల బదిలీ అంశం కొన్ని రోజులుగా కొలీజియం ప్రతిపాదిత ప్రముఖ అంశాల్లో ఒకటిగా ఉంది. బదిలీకి సంబంధించిన లేఖలు కూడా ఆయా న్యాయమూర్తులకు ఇప్పటికే పంపినట్లు తెలుస్తోంది. బదిలీ అంశాన్ని ఏ న్యాయమూర్తైనా పునపరిశీలించాలని కోరితే.. తుది నిర్ణయం కొలీజియందే ఉంటుంది. సీజేఐ ప్రతిపాదించిన బదిలీ పత్రాలను సంబంధిత కేంద్ర మంత్రి ప్రధానమంత్రికి సమర్పిస్తారు. ప్రధాని ఆయా ప్రతిపాదనలను రాష్ట్రపతికి సమర్పిస్తారు. ఇదీ చదవండి: Anti Sikh Riots Case: కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్పై హత్యానేరం అభియోగాలు -
'ఆత్మ గౌరవంతో రాజీ పడలేను..' హైకోర్టు జడ్జీ అర్ధాంతరంగా రాజీనామా..
ముంబయి: బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ రోహిత్ డియో అర్దాంతరంగా రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు కోర్టు హాల్లోనే ఆయన పేర్కొన్నారు. ఈ రోజు నాగ్పూర్లోని కోర్టు హాల్లో ఈ మేరకు ప్రకటించారు. ఆత్మగౌరవంలో రాజీపడలేనని ఆయన చెప్పినట్లు హాల్లో ఉన్న ఓ లాయర్ ఈ విషయాన్ని తెలిపారు. 'కోర్టులో ఉన్నవారందరికీ క్షమించమని కోరుతున్నా. మెరుగుపడాలనే మిమ్మల్ని అప్పడప్పుడు తిట్టాను. నేను కూడా మెరుగుపడాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నాకు ఉండదు. ఎందుకంటే మీరంతా నా కుటుంబ సభ్యులే. చెప్పడానికి చింతిస్తున్నా.. నా రాజీనామాను ఇచ్చేశాను. నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పనిచేయలేను. మీరంతా కష్టజీవులు' అని జడ్జి చెప్పినట్లు ప్రత్యక్షంగా ఉన్న ఓ లాయర్ చెప్పారు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే క్రమంలో మాత్రం తన వ్యక్తిగత కారణాలతోనే దేశ అధ్యక్షురాలికి రాజీనామా ఇచ్చినట్లు జస్టిస్ రోహిత్ డియో చెప్పారు. కీలక తీర్పులు.. అయితే.. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే కేసులో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సాయిబాబాను 2022లో జస్టిస్ రోహిత్ డియో నిర్దోషిగా ప్రకటించారు. ఆయనకు విధించిన జీవత ఖైదు శిక్షను పక్కకు పెట్టారు. ఉపా చట్టం కింద చెల్లుబాటు అయ్యే అవకాశం లేనప్పుడు విచారణ అనేదే శూన్యం అని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు నిలుపదల ఉత్తర్వులు ఇచ్చింది. ఆ కేసును మళ్లీ నూతనంగా విచారణ చేపట్టాలని నాగపూర్కు చెందిన హైకోర్టు బెంచ్కు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జస్టిస్ రోహిత్ డియో నాగపూర్కు చెందిన హైకోర్టు డివిజన్ బెంచ్లో సభ్యునిగా ఉన్నారు. ఇదే కాకుండా నాగపూర్-ముంబయి సమృద్ధి ఎక్స్ప్రెస్వేలో మైనర్ ఖనిజాల తవ్వకాల అంశంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కూడా జస్టిస్ రోహిత్ డియో స్టే విధించారు. 2017లో బాంబే హైకోర్టు జడ్జిగా నియమితులైన జస్టిస్ రోహిత్ డియో 2025 డిసెంబర్ వరకు కొనసాగనుండగా.. అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు 2016లో మహారాష్ట్ర ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్గా కూడా జస్టిస్ రోహిత్ డియో పనిచేశారు. ఇదీ చదవండి: జ్ఞానవాపి ముస్లిం కమిటీకి సుప్రీంలో చుక్కెదురు.. ASI సర్వేకు గ్రీన్ సిగ్నల్.. ఇటు పురావస్తు శాఖకు ఆదేశాలు -
ప్రొటోకాల్ అనేది విశేషాధికారం కాదు: సీజేఐ
ఢిల్లీ: న్యాయమూర్తుల ప్రొటోకాల్ అంశంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదేం విశేషాధికారం కాదని.. ఆ సౌకర్యాలతో ఇతరులకు ఇబ్బంది కలిగించడమూ సరికాదని, తద్వారా న్యాయవ్యవస్థపై ప్రజల్లో గౌరవమూ తగ్గిపోతుందన్న అభిప్రాయమూ ఆయన వ్యక్తం చేశారు. ఈ మేరకు పలు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు తన అభిప్రాయంతో కూడిన లేఖలు రాశాయన. తీర్పులతోనే కాదు.. ప్రొఫెషనల్ ఆటిట్యూడ్తోనూ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తరచూ వార్తల్లో నిలుస్తుండడం చూస్తున్నాం. సుప్రీం కోర్టు కఫేటేరియాను సందర్శించడం, న్యాయస్థానం కార్యాలయాల పని తీరుతో పాటు అక్కడ పని చేసే వాళ్ల పోస్టుల పేర్లను మార్చాలని(పారిశుద్ధ్య కార్మికులతో సహా) ప్రతిపాదించడం లాంటి చర్యలతో ప్రశంసలు అందుకున్నారాయన. ఈ క్రమంలో.. తాజాగా ఓ హైకోర్టు న్యాయమూర్తి తనకు రైలు ప్రయాణంలో ఎదురైన ఇబ్బందికర అనుభవం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సదరు రీజినల్ రైల్వే మేనేజర్ నుంచి కోర్టు రిజిస్ట్రార్ ద్వారా వివరణ కోరడం తెలిసే ఉంటుంది. ఈ పరిణామంపై స్పందించే క్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్.. పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు లేఖలు రాశారు. రైల్వే సిబ్బందిపై హైకోర్టుకు “క్రమశిక్షణా పరిధి’’ ఉండదని అని సీజేఐ డీవై చంద్రచూడ్ లేఖల్లో న్యాయమూర్తులకు గుర్తు చేశారు. అలాగే.. ప్రొటోకాల్ అనేది విశేషాధికారం కాదన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారాయన. ఈ క్రమంలో న్యాయవ్యవస్థలో స్వీయ ప్రతిబింబం, కౌన్సెలింగ్ అవసరమంటూ అభిప్రాయపడ్డారాయన. ‘‘న్యాయమూర్తులు తమకు అందుబాటులో ఉన్న ప్రొటోకాల్ సౌకర్యాలు ఉపయోగించుకోవడంలో తప్పు లేదు. కానీ, ఆ సమాజం నుంచి వాళ్లను వేరే చేసే విధంగా.. లేదంటే తమను తాము ప్రత్యేక వ్యక్తిగా చూపించుకునే ప్రయత్నం చేయకూడదు. కోర్టుల్లోనే కాదు.. బయటా న్యాయపరమైన అధికారాన్ని తెలివిగా అమలు చేయాలి. తద్వారా న్యాయవ్యవస్థపై విశ్వసనీయత, చట్టబద్ధతను.. అలాగే న్యాయమూర్తుల సమాజ గౌరవం నిలబడుతుంది. అంతేగానీ.. ఆ సౌకర్యాలతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. అలాగే.. న్యాయవ్యవస్థపై బహిరంగ విమర్శలు చేసేందుకు దారి తీయకూడదు. నా ఈ అభిప్రాయాలను తెలియజేస్తున్నానని.. ఇక మీ అభిప్రాయాలను తనతో పంచుకోవాల’’ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కోరారాయన. అలహాబాద్ హైకోర్టు జడ్జి గౌతమ్ చౌదరి తాజాగా రైలు ప్రయాణంలో ఇబ్బంది ఎదుర్కొన్నారు. తన భార్యతో కలిసి పురుషోత్తం ఎక్స్ప్రెస్లో న్యూఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్తున్న సమయంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైందట. రైలు ఆలస్యంతో పాటు సమయానికి భోజనం దొరక్కపోవడం లాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారట. ఆ సమయంలో ఆయన రైల్వే పోలీసులు, రైల్వే సిబ్బంది నుంచి బదులు కోసం చూడగా.. ఫలితం లేకుండా పోయిందట. దీంతో న్యాయమూర్తి అనే తన గౌరవానికి భంగం వాటిల్లిందటూ ఆయన ప్రయాగ్రాజ్లోని నార్త్ సెంట్రల రైల్వే జోన్ జనరల్ మేనేజర్ను వివరణ కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా లేఖ పంపించారు. ఇదీ చదవండి: ఇదేంది ఇది.. 100 పేజీల తీర్పు కాపీనా? -
తెలంగాణ హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణహైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసు చేసిన జాబితాలో న్యాయాధికారి సుజన కళాసికం, న్యాయవాదులు లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్కుమార్ జూకంటి పేర్లు ఉన్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కౌశల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదించి రాష్ట్రపతికి నివేదించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఈ ముగ్గురూ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులవుతారు. వీరి పేర్లకు రాష్ట్ర గవర్నర్, సీఎం గతంలోనే ఆమోదం తెలిపారు. చదవండి: Hyderabad: గూబ గుయ్మంటోంది.. నిద్రపోని మహానగరం అలిశెట్టి లక్ష్మీనారాయణ: నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామంలో హెడ్మాస్టర్ గంగాధర్, రాజుబాయ్ దంపతులకు 1968 మే 13న లక్ష్మీనారాయణ జన్మించారు. నిజామాబాద్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, కాకతీయ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1994లో బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేయించుకున్నారు. రాజ్యాంగ, ‘సివిల్ లా’లో నైపుణ్యం సాధించారు. ఆయన జాతీయ రహదారుల అభివృద్ధి అథారిటీ, ఎన్బీసీసీ, ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్తోపాటు పలు ఎల్బీసీ, బ్యాంకులకు స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నారు. కె.సుజన: నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన మధు సూదన్, ప్రమీల దంపతులకు కె.సుజన 1970 మార్చి 10న జన్మించారు. 1997లో బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు. 2010లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. జూనియర్ సివిల్ జడ్జిగా కొనసాగుతూనే 2012లో జిల్లా జడ్జి పరీక్షలు రాసి ఎంపికయ్యారు. కరీంనగర్ అదనపు జిల్లా జడ్జిగా, నిజామాబాద్ జిల్లా జడ్జిగా, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగాను, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్గా పనిచేశారు. గతేడాది నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా సుజన విధులు నిర్వర్తిస్తున్నారు. -
హైకోర్టు సంచలన తీర్పు: ఎంపీ రవీంద్రనాథ్ పదవి గోవింద
అఫిడవిట్లో సమర్పించిన సమాచారమే ఆయుధంగా.. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారులు పెట్టిన సంతకాలే సాక్ష్యాలుగా.. విచ్చలవిడిగా చేసిన డబ్బు పంపకాల దృశ్యాలే ధ్రువీకరణలుగా.. ఓసామాన్యుడు ఏకంగా ఓ ఎంపీపైనే గెలిచాడు.. అయితే ఇదంతా ఎన్నికల్లో కాదు.. న్యాయపోరాటంలో.. నీతి.. న్యాయం.. అనే ధర్మ సూత్రాలను పక్కనబెట్టి అంగ, అర్ధబలంతో అడ్డదారిన అందలమెక్కిన ఓ ప్రజాప్రతినిధిని.. ఓ ఓమాన్యుడు.. అసామాన్య రీతిలో ఎదిరించి కోర్టు ద్వారా చివరికి అతడి పదవికే ఎసరు తెచ్చాడు.. చట్టం ఎవరి చుట్టమూ కాదని నిరూపించాడు.. స్ఫూర్తి కలిగించే ఓటరు ‘మిలానీ’ పోరాటాన్ని మీరూ చదవండి. సాక్షి, చైన్నె: నియోజక వర్గంలోని ఓ ఓటరు అలుపెరగని పోరాటం.. ఏకంగా ఓ ఎంపీ సీటుకి ఎసరు తెచ్చింది. దీంతో అన్నాడీఎంకే ఎంపీ రవీంద్రనాథ్ చివరికి తన పదవిని కొల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యాయ పోరాటంలో సదరు ఓటరు సమర్పించిన ఆధారాలన్నీ ఎంపీకి వ్యతిరేకంగా నిర్ధారణ అయ్యాయి. ఫలితంగా ఎంపీగా రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదు అని కోర్టు ప్రకటించింది. అయితే తీర్పును రిజర్వ్ చేస్తూ.. అప్పీల్కు 30 రోజుల పాటు అవకాశం కల్పించింది. నేపథ్యం ఇదీ.. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్, మాజీ సీఎం ఓ పన్నీరు సెల్వం వారసుడు రవీంద్రనాథ్ 2019 లోక్సభ ఎన్నికలకు ముందు క్రియా శీలక రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన దృష్టి అంతా సొంత జిల్లా తేని మీదే పెట్టారు. ఎన్నికల్లో ఎంపీగా తేని నుంచే పోటీ చేశారు. ఈ కాలంలో రాష్ట్రంలో అన్నాడీఎంకే అధికారంలో ఉండటం, తన తండ్రి పన్నీరు సెల్వం డిప్యూటీ సీఎం, పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ కావడంతో రవీంద్రనాథ్కు అవకాశాలు కలిసి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం రవీంద్రనాథ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు మొదలు అనేక అక్రమాలు జరిగినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రంలో అన్నాడీఎంకే అధికారంలో ఉండడంతో స్థానిక ఎన్నికల అధికారి చూసి చూడనట్లు వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. చివరికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్పై రవీంద్రనాథ్ గెలుపొందారు. సొంత జిల్లాలో కీలక నియోజకవర్గాన్ని పన్నీరు తన కుటుంబ ఖాతాలో వేసుకుంది. తనయుడిని కేంద్ర మంత్రిని చేయడానికి సైతం ప్రయత్నించి, చివరకు అన్నాడీఎంకే గ్రూప్ రాజకీయాల పుణ్యమా అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కోర్టు సంచలన తీర్పు.. 2019 లోక్ సభ ఎన్నికలలో తేనిలో జరిగిన వ్యవహారాలపై పిటిషనర్ సమర్పించిన ఆధారాలను మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి సుందర్ పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ఆధారాలకు రవీంద్రనాథ్ వద్ద వివరణ కోరగా.. సమాధానం కరువైంది. ఇదే రవీంద్రనాథ్ పదవీ గండానికి కారణమైంది. దీంతో గురువారం న్యాయమూర్తి సుందర్ తుది తీర్పు వెలువరించారు. నామినేషన్ దాఖలు, పరిశీలనలో అధికార దుర్వినియోగం జరిగినట్టు ఆధారాలతో సహా నిర్ధారణ అయినట్లు ప్రకటించారు. రవీంద్రనాథ్ గెలుపు చెల్లదంటూ తీర్పు వెలువరించారు. దీంతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, అప్పీలుకు అవకాశం ఇవ్వాలని రవీంద్రనాథ్ తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేసుకోగా, న్యాయమూర్తి స్పందించారు. రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదు అని ఇచ్చిన తీర్పును 30 రోజులు పెండింగ్లో పెడుతున్నట్టు, అంతలోపు అప్పీల్కు వెళ్లవచ్చని గడువు కేటాయించారు. దీంతో అప్పీలు ప్రయత్నాలపై న్యాయవాదులు దృష్టి పెట్టారు. అయితే, అప్పీలుకు వెళ్లినా రవీంద్రనాథ్కు అనుకూలంగా స్టే వచ్చేది అనుమానమే అని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. తాము చేయాల్సిన పనిని సాధారణ ఓటరు మిలాని న్యాయ పోరాటంతో ఎంపీ రవీంద్రనాథ్కు పదవీ గండం సృష్టించడాన్ని అభినందిస్తున్నానని ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇలంగోవన్, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థి, ప్రస్తుత డీఎంకే నేత తమిళ్ సెల్వన్ పేర్కొనడం గమనార్హం వెనక్కి తగ్గని మిలానీ.. తేని నియోజకవర్గంలో రవీంథ్రనాథ్ గెలుపును వ్యతిరేకిస్తూ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఎవరూ కోర్టు తలుపు తట్ట లేదు. అయితే, ఆ నియోజకవర్గం ఓటరు అయిన మిలానీ మాత్రం స్పందించారు. నామినేషన్ దాఖలు మొదలు, ఫలితాల లెక్కింపు వరకు జరిగిన అవినీతి అక్రమాలు, అధికార దుర్వినియోగం, నగదు బట్వాడా తదితర అన్ని ఆధారాలనూ సేకరించారు. ఆయన గెలుపు అక్రమం అంటూ 2020లో హైకోర్టును ఆశ్రయించారు. ఆ నియోజకవర్గ ఓటరుగా తనను పరిచయం చేసుకుంటూ పిటిషన్ వేశారు. నామినేషన్ దాఖలు, పరిశీలనలో జరిగిన అక్రమాలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలకు ఆధారాలను కోర్టుముందు ఉంచారు. కరోనా కాలం పుణ్యమా రెండేళ్లు విచారణ ముందుకు సాగలేదు. అయితే గత ఏడాది కాలంగా ఈ కేసు విచారణ శరవేగంగా జరుగుతూ వచ్చింది. అదే సమయంలో అన్నాడీఎంకేలో చీలికతో పన్నీరు సెల్వం కొత్త శిబిరం తో రాజకీయ పయానాన్ని మొదలెట్టడంతో రవీంద్రనాథ్కు వ్యతిరేకంగా పళణి స్వామి శిబిరం లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. ఆయన్ని తమ పార్టీ ఎంపీగా పరిగణించ వద్దు అంటూ విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో గతంలో ఎప్పుడు సాగిన అక్రమాల వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగడం, రవీంద్రనాథ్ ఆస్తుల అటాచ్ వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితులలో ఓటరు మిలానీ రూపంలో ఏకంగా రవీంద్రనాథ్ తన ఎంపీ పదవి కోల్పోయే పరిస్థితి నెలకొంది. -
18 ఏళ్లు వద్దు.. ‘సమ్మతి’ వయసు 16కు తగ్గించండి: కేంద్రానికి హైకోర్టు వినతి
యువతులు తమ సమ్మతి మేరకు లైంగిక సంబంధాలను ఏర్పరుచుకునే వయసును 16 సంవత్సరాలకు తగ్గించాలని మధ్యప్రదేశ్ హైకోర్డుకు చెందిన గ్వాలియర్ బెంచ్ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ప్రస్తుతం ఇందుకోసం అనుమతించిన 18 ఏళ్ల వయసు కారణంగా పలు అనర్థాలు ఎదురవుతున్నాయని బెంచ్ పేర్కొంది. దీనికారణంగా యువతులపై అకృత్యాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై ఎఫ్ఐఆర్ రద్దు చేస్తూ.. జూన్ 27న ఒక కేసు ఉత్తర్వుల నేపధ్యంలో కోర్టు నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ అభ్యర్థన అందింది. ఈ కేసులో ఒక బాలికపై అత్యాచారం చేశాడంటూ ఒక వ్యక్తిపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేశారు. అతను 2020లో ఒక మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడని, ఆమెను గర్భవతిని చేశాడనే ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియా ప్రభావంతో.. ఈ కేసు తీర్పు సందర్భంగా న్యాయమూర్తి దీపక్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావంతో పాటు సులభంగా ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం కారణంగా 14 ఏళ్ల వయసుకే పిల్లలు అన్ని విషయాలు తెలుసుకుని, ముందుగానే యవ్వనంలోకి ప్రవేశిస్తున్నారని అన్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు త్వరగానే యవ్వనావస్థకు చేరుకుంటున్నందున ఒకరికొకరు ఆకర్షితులవుతున్నారని అన్నారు. ఫలితంగా వారు ఇష్టాపూర్వకంగానే శారీరక సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారని పేర్కొన్నారు. అందుకే సమాజంలో అనేక అనర్థాలు న్యాయమూర్తి తన ఉత్తర్వులలో.. తాను భారత ప్రభుత్వానికి ఒక విషయాన్ని అభ్యర్థించాలనుకుంటున్నానన్నారు. యువతుల విషయంలో లైంగిక సంబంధాలను ఏర్పరుచుకునేందుకు ఇప్పటి వరకూ ఉన్న నిర్ణీత వయసును 18 నుంచి 16 సంవత్సరాలకు తగ్గించే దిశగా ఆలోచించాలని కోరుతున్నానన్నారు. దీని వలన యువతులపై జరిగే అకృత్యాలను నివారించవచ్చని పేర్కొన్నారు. యువతులు లైంగిక సంబంధాలకు తమ సమ్మతి తెలియజేసే వయసు 18 ఏళ్లుగా ఉండటం వలన సమాజంలో అనేక అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. కేసు పూర్వాపరాలివే.. ఇక ఈ కేసు విషయానికొస్తే బాధితురాలు 2020లో మైనర్. ఆమె ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దగ్గర కోచింగ్ తరగతులకు హాజరయ్యేది. ఆ వ్యక్తి తనకు ఒకసారి మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి, అత్యాచారం చేశాడని ఆరోపించింది. అలాగే దానిని వీడియో తీశాడని, తరువాత బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. పురుషులు మాత్రమే దోషులు కారు కాగా ఆ మైనర్ బాలిక ఒక దూరపు బంధువుతో కూడా శారీరక సంబంధాలు పెట్టుకున్నదని కోర్టు పేర్కొంది. ఆ వయసులో ఉన్న బాలిక తన శారీరక, మానసిక, వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించి సొంత నిర్ణయాలు తీసుకోవడాన్ని న్యాయస్థానం సహేతుకంగా పరిగణిస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. సాధారణంగా యుక్తవయస్సులో అబ్బాయిలు, అమ్మాయిలు పరస్పరం స్నేహం ఏర్పరుచుకుని, ఆ తర్వాత ఆకర్షణ కారణంగా శారీరక సంబంధాలను ఏర్పరుచుకుంటారని, ఇటువంటి ఈ కేసులలో పురుషులు దోషులు కారని న్యాయమూర్తి తన ఆదేశాలలో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: కేంద్ర ఆర్డినెన్స్పై స్టే ఇవ్వండి -
ప్రభుత్వ ఉద్యోగిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
సాక్షి, అమరావతి: కోర్టు ముందు వాస్తవాలను దాచిపెట్టి కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసినందుకు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఓ పిటిషనర్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బదిలీని అడ్డుకునేందుకు అధికారులపై అతను దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. అంతేగాక రూ.25 వేలను ఖర్చుల కింద చెల్లించాలని, ఆ మొత్తాన్ని నాలుగు వారాల్లో ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం పేరు మీద జమ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఇటీవల తీర్పు వెలువరించారు. సర్వీసు నుంచి తొలగింపుపై పిటిషన్ తిరుపతి జిల్లా, నాయుడుపేటకు చెందిన అంబటి శ్రీనివాసులు నాయుడు ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్పీడీసీఎల్) ఉద్యోగి. ఇతన్ని సస్పెండ్ చేస్తూ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ మెమో జారీచేశారు. దాన్ని సవాలు చేస్తూ శ్రీనివాసులు నాయుడు గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్ ఆ మెమోను సస్పెండ్ చేస్తూ పిటిషనర్ శ్రీనివాసులు నాయుడిని ఉద్యోగం చేసుకోనివ్వాలంటూ ఏపీఎస్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం శ్రీనివాసులు నాయుడును ఉద్యోగంలోకి తీసుకున్న అధికారులు అతన్ని ఉదయగిరికి బదిలీ చేశారు. పోస్టింగ్ ఉత్తర్వుల గురించి పిటిషన్లో ఎక్కడా చెప్పలేదు శ్రీనివాసులు నాయుడు తరఫు న్యాయవాది ఆర్.సుధీర్కుమార్ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, అందువల్ల అతన్ని ఉదయగిరికి బదిలీ చేయడం తగదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్, అనారోగ్య సమస్యలన్నవి పూర్తిగా వేరని, వాటిని ప్రస్తుత కోర్టు ధిక్కార పిటిషన్లో విచారించజాలమని తేల్చిచెప్పారు. పోస్టింగ్ ఆర్డర్ను నేరుగా తీసుకునేందుకు పిటిషనర్ నిరాకరించడం, రిజిస్టర్ పోస్టు ద్వారా ఆ ఆర్డర్ను అందుకున్న విషయాన్ని దాచిపెట్టడం అన్నదే ఇక్కడ ప్రధాన విషయమన్నారు. శ్రీనివాసులు నాయుడు కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ ఈ కోర్టు ధిక్కార పిటిషన్ను దాఖలు చేశారని న్యాయమూర్తి తేల్చారు. ఈ మేరకు రూ.25వేలను ఖర్చుల కింద చెల్లించాలని శ్రీనివాసులు నాయుడును న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు ఆదేశాలను గౌరవించి విధుల్లోకి తీసుకున్నాం ఇదిలా ఉంటే కార్పొరేషన్ అధికారులు కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారంటూ శ్రీనివాసులు నాయుడు వారిపై హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్, ఎండీ కె.సంతోష్రావు, సూపరింటెండింగ్ ఇంజినీర్ బి.వెంకట సుబ్బయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జె.కృష్ణ ప్రసాద్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ సుధాకర్ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్ ప్రతివాదులుగా ఉన్న అధికారులకు నోటీసులు జారీచేశారు. ఇటీవల ఈ కోర్టు ధిక్కార వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ఏపీఎస్పీడీసీఎల్ తరఫు న్యాయవాదులు కొవ్వూరి వెంకట్రామిరెడ్డి, అభయ్ జైన్ వాదనలు వినిపిస్తూ, కోర్టు ఆదేశాల మేరకు పిటిషనర్ శ్రీనివాసులు నాయుడును విధులోకి తీసుకుని అతన్ని ఉదయగిరికి బదిలీ చేశారని తెలిపారు. పోస్టింగ్ ఆర్డర్ను ఈ ఏడాది ఫిబ్రవరి 1న పిటిషనర్కు అందచేయగా, ఆ ఆర్డర్ను నేరుగా తీసుకునేందుకు అతను నిరాకరించారని, దీంతో 7వ తేదీన రిజిస్టర్ పోస్టు ద్వారా పోస్టింగ్ ఆర్డర్ పంపగా, దాన్ని 8వ తేదీన అందుకున్నారంటూ, ఇందుకు సాక్ష్యంగా పోస్టల్ శాఖ ట్రాకింగ్ రిపోర్ట్ను వారు కోర్టు ముందుంచారు. బదిలీ తర్వాతవాత కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన శ్రీనివాసులు నాయుడు అధికారులు ఇచ్చిన పోస్టింగ్ ఆర్డర్ గురించి తన పిటిషన్లో పేర్కొనలేదని వెంకట్రామిరెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇది కోర్టు ముందు వాస్తవాలను దాచిపెట్టడమే అవుతుందన్నారు. -
కస్టడీకి అవకాశం ఇవ్వండి
సాక్షి, చైన్నె: సెంథిల్ బాలాజీని చట్టబద్ధంగానే అరెస్టు చేశామని, ఆయన్ను విచారించేందుకు అవకాశం ఇవ్వాలని కోరు తూ ఈడీ వర్గాలు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. ఆగమేఘాలపై ఆదివారం కోర్టుకు పిటిషన్ రూపంలో వివరాలను సమర్పించాయి. మంత్రి సెంథిల్ బాలాజీని మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో గుండెపోటు రావడంతో ఆయనకు శస్త్ర చికిత్స అనివార్యమైంది. ప్రస్తుతం బైపాస్ సర్జరీ అనంతరం ఆయన కావేరి ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో ఉన్నారు. ఈ పరిస్థితులలో తన భర్తను ఈడీ చట్టవిరుద్ధంగా అరెస్టు చేసినట్టు సెంథిల్బాలాజి సతీమణి మేఘల కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ సమయంలో మేఘల తరఫున వాదనలు ముగిశాయి. ఇందుకు వివరణ ఇవ్వాలని ఈడీని హైకోర్టు ఆదేశించింది. తర్వాత విచారణ 27వ తేదీ జరగాల్సిన నేపథ్యంలో ఆదివారమే ఆగమేఘాలపై ఈడీ వర్గాలు రిట్ పిటిషన్ను సిద్ధం చేసి కోర్టుకు సమర్పించడం గమనార్హం. ఇందులో సెంథిల్ను చట్టబద్ధంగానే అరెస్టు చేశామని వివరించారు. ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా అరెస్టు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. ఆయన్ను ఇంతవరకు తాము విచారించలేదని, కస్టడీకి అవకాశం ఇవ్వాలని కోర్టును కోరారు. అలాగే, అరెస్టుకు ముందుగా అధికారులతో సెంథిల్ దురుసుగా ప్రవర్తించారని, ఆయనకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని తారుమారు చేసే పరిస్థితులు ఉన్నట్టు కోర్టుకు ప్రత్యేకంగా వివరించడం గమనార్హం. అదే సమయంలో మేఘల తరఫున అనుబంధంగా మరో పిటిషన్ దాఖలు చేశారు. చట్టంలో పేర్కొనలేని అంశాలతో సమాచారం ఇచ్చినట్టు ఈడీ సూచించిందని వివరించారు. అలాగే, 13వ తేదీ రాత్రే విచారణ ముగించినట్టు పేర్కొన్నారని, రెండు గంటల అనంతరం అరెస్టు చూపించారని, రెండుగంటల పాటు తన భర్తను ఎక్కడ ఉంచారో వివరాలను కోర్టుకు ఈడీ తెలియజేయాలని పిటిషన్లో పేర్కొనడం గమనార్హం. -
బాంబే హైకోర్టులో మమతా బెనర్జీకి చుక్కెదురు!
ముంబై: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. డిసెంబర్ 2021లో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో జాతీయ గీతాన్ని అగౌరవపరిచారంటూ బీజేపీ సభ్యుడు దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదును కొట్టివేయాలని కోరుతూ మమతా బెనర్జీ దాఖలు చేసిన అప్పీల్ను బాంబే హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది. ఈ ఏడాది జనవరిలో గతంతో జారీ చేసిన సమన్లను పక్కకు పెట్టి, మమతాపై మళ్లీ కొత్తగా విచారణ ప్రారంభించాలని మేజిస్ట్రేట్ కోర్టును సెషన్స్ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో సెషన్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. తనపై నమోదైన కేసులను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై. జస్టిస్ అమిత్ బోర్కర్తో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం స్పందిస్తూ.. మెరిట్లపై ఫిర్యాదును నిర్ణయించకుండా సెషన్స్ జడ్జి అనుసరించిన విధానం, విచారణకు తిరిగి మేజిస్ట్రేట్కు పంపడం సుప్రీంకోర్టు ఆదేశానికి అనుగుణంగా ఉంది. కావున ప్రస్తుత కేసులో జోక్యం చేసుకోవాల్సిన అవసర లేదు’ అని పేర్కొన్నారు. కాగా 2022లో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో జాతీయ గీతాన్ని అగౌరవపరిచినందుకు మమతాపై చర్య తీసుకోవాలని కోరుతూ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ముంబై యూనిట్ ఆఫీస్ బేరర్ వివేకానంద్ గుప్తా మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదులో గుప్తా..మమతా బెనర్జీ 2021 మార్చిలో ముంబై పర్యటన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో లేచి నిలిబడలేదని పేర్కొన్నారు. జాతీయ గీతాన్ని మమత అవమానించారని ఆయన ఆరోపించారు. సీఎం బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీస్టేషన్ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్తో కూడిన డీవీడీని కోర్టుకు సమర్పించారు. ఐతే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గుప్తా మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. గుప్తా ఫిర్యాదును పరిగణలోనికి తీసుకున్న మెజిస్ట్రేట్ కోర్టు మమతాకు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో జనవరి 2023లో సెషన్కోర్టు న్యాయమూర్తి ఆర్కే రోకడే మెజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేసి, ఫిర్యాదు మళ్లీ పరిశీలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కాగా మమతా ప్రత్యేక కోర్టు సవాలు చేస్తూ.. సమన్లు రద్దు చేసి, తిరిగి విచారణకు పంపించే బదులు మొత్తం ఫిర్యాదును రద్దు చేయాల్సిందిగా హైకోర్టుని ఆశ్రయించి పిటీషన్ దాఖలు చేశారు. అందుకు హైకోర్టు నిరాకరిస్తూ..పిటీషన్ను కొట్టేసింది. (చదవండి: ఆరు అంతస్తుల హోటల్లో భారీ అగ్నిప్రమాదం) -
ఆకాంక్షలను నెరవేర్చండి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జీల నియామకం, బదిలీల విషయంలో కొలీజియం ఆకాంక్షలను(సిఫార్సులను) చాలావరకు నెరవేర్చాలని(ఆమోదించాలని) కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. కొలీజియం సిఫార్సులను ఆమోదించకుండా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ దాఖలైన రెండు పిటిషన్లపై జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. జడ్జీల నియామకానికి సంబంధించి కొన్ని అంశాల పట్ల తాము ఆందోళన చెందుతున్నట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణకు అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి హాజరు కాలేదు. కొలీజియం సిఫార్సులను చాలావరకు ఆమోదించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని అటార్నీ జనరల్కు తెలియజేయాలని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది. -
554 మంది జడ్జీల్లో 430 మంది జనరల్ కేటగిరీయే
న్యూఢిల్లీ: 2018 నుంచి హైకోర్టు జడ్జీలుగా నియమితులైన 554 మందిలో 430 మంది జనరల్ కేటగిరీకి చెందిన వారేనని న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు రాజ్యసభలో తెలిపారు. మిగిలిన వారిలో 58 మంది ఇతర వెనుకబడిన కులాలకు, 19 మంది షెడ్యూల్ కులాలకు చెందిన వారు కాగా, కేవలం ఆరుగురు షెడ్యూల్ తెగలకు, 27 మంది మైనారిటీలని వివరించారు. మొత్తమ్మీద 84 మంది మహిళా జడ్జీలున్నారని చెప్పారు. మొత్తం జడ్జీల్లో జనరల్ కేటగిరీకి చెందిన వారే 77% పైగా ఉన్నారన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాలకు రిజర్వేషన్లు లేవని మంత్రి పేర్కొన్నారు. అత్యున్నత న్యాయ వ్యవస్థలోనూ సామాజిక వైవిధ్యం సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. జడ్జీల నియామకాలకు ప్రతిపాదనలు పంపే సమయంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా జడ్జీల పేర్లను కూడా పరిశీలించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కోరుతోందని వెల్లడించారు. 2018 నుంచి ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో 30 మంది జడ్జీలు నియమితులయ్యారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా జడ్జీల్లో 612 మంది ఎస్సీలు, 204 మంది ఎస్టీలు, 1,329 మంది ఓబీసీలు, 1,406 మంది మహిళలు ఉన్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. -
యాదాద్రిలో హైకోర్టు జడ్జి మాధవిదేవి
యాదగిరిగుట్ట: రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవిదేవి శనివారం కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అర్చకులు, అధికారులు ఆమెకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆమె గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులను దర్శించుకున్నారు. ముఖ మండపంలో ఉత్సవమూర్తుల వద్ద అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన తదితర పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. జస్టిస్ మాధవిదేవికి ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. -
మారువేషంలో కొలీజియంలోకా?
అసలంటూ ప్రస్తుతం ఉనికిలోనే లేని ‘శోధన, మూల్యాంకన కమిటీ’లో ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఉండాలన్న కేంద్ర న్యాయమంత్రి సూచన తీవ్రమైనది! కేవలం న్యాయమూర్తులను మాత్రమే కలిగి ఉన్న కొలీజియంలో ప్రవేశించడానికి ప్రభుత్వం తెలివిగా మారువేషంలో వేస్తున్న తొలి అడుగుగా దీన్ని భావించాలి. న్యాయమూర్తుల ఎంపిక కమిటీలో ప్రభుత్వ ప్రాతినిధ్యం న్యాయవ్యవస్థ స్వతంత్రతను ధ్వంసం చేస్తుందని న్యాయ మూర్తుల నియామక కమిటీ చట్టం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయమంత్రి సూచన ఆ తీర్పును తోసిపుచ్చే ప్రయత్నమే. అలాగని హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల ప్రాతిపదికలో ఎలాంటి తప్పూ లేదని సూచించడం లేదు. ఇక్కడే శోధన ప్రారంభం కావలసి ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకాల కోసం ‘శోధన, మూల్యాంకన కమిటీ’ (సెర్చ్ కమ్ ఎవాల్యుయేషన్ కమిటీ)ని నియమించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్కు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లేఖ రాసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని చర్చించేముందుగా మంత్రి సూచించిన శోధన, మూల్యాంకన కమిటీ అనేది ఉనికిలో లేదని గమనించాలి. ప్రస్తుతం ఉనికిలో ఉన్న చట్టం ప్రకారం ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియం... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించినంతవరకూ ప్రధాన న్యాయమూర్తి, నలుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజయం సిఫార్సు చేస్తుంది. శోధన, మూల్యాంకన కమిటీ అవసరం ఇప్పుడు ఉందా? సమాధానం నిశ్చయాత్మకంగా అవును అన్నట్లయితే, అలాంటి కమిటీ పొందిక ఎలా ఉండాలి అనేది మరో ప్రశ్న. హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే తాను పనిచేసే హైకోర్టులో ఆయన్ని ప్రధాన న్యాయమూర్తిగా నియమించరు. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియ మించే సందర్భంలోనే సుప్రీంకోర్టులో రాష్ట్రాల భౌగోళిక ప్రాతి నిధ్యాన్ని లెక్కిస్తారు. కాబట్టి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ప్రాతి పదిక ఇప్పటికే స్పష్టంగా ఉంది. కాబట్టి, కొత్తగా శోధన, మూల్యాంకన కమిటీ అవసరం లేదని తెలుస్తున్నది. దీనికి బదులుగా సీనియారిటీ నిబంధనను పక్కన పెట్టి చేసే నియామకాలకు ప్రాతిపదిక అవసరం. పరిధి ప్రాతిపదికను పరిగణించే అవకాశం పైన చెప్పినట్టుగా పరిమితం. కాబట్టి కేంద్ర మంత్రి సూచించిన శోధన, మూల్యాంకన కమిటీ ఈ సంప్రదాయానికి చేసే జోడింపు పెద్దగా లేదనే చెప్పాలి. ఇక జడ్జీల పనితీరు మూల్యాంకనం కూడా సుప్రీంకోర్టు న్యాయ మూర్తుల విధి. సుప్రీంకోర్టుకు నియమించాల్సిన న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుల బాగోగులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులే చక్కగా మూల్యాంకన చేయగలరు. దీన్ని పక్కనబెడితే, న్యాయ నిర్ణయాలు చాలా తరచుగా సుప్రసిద్ధ న్యాయ పత్రికల్లో తీవ్రమైన విద్యాత్మక విమర్శలకు గురవుతుంటాయి. న్యాయమూర్తుల మూల్యాంకనకు ఇది సుపరిచితమైన పద్ధతి. ఇలాంటి పరిస్థితుల్లో శోధన, మూల్యాంకన కమిటీలో ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఉండాలన్న కేంద్ర న్యాయమంత్రి సూచన తీవ్రమైనది! కేవలం న్యాయమూర్తులను మాత్రమే కలిగి ఉన్న కొలీజియంలో ప్రవేశించడానికి ప్రభుత్వం తెలివిగా మారు వేషంలో వేస్తున్న తొలి అడుగుగా దీన్ని భావించాలి. స్పష్టంగా చెప్పాలంటే, భారత రాజ్యాంగం నిర్దేశించిన అధికా రాల విభజన సూత్రాన్ని న్యాయమంత్రి తాజా సూచన ధ్వంసం చేస్తుంది. ఈ అధికారాల విభజన రాజ్యాంగ ప్రాథమిక లక్షణాల్లో ఒకటి. అన్ని రాజ్యాంగ బద్ధ సంస్థల్లో న్యాయవ్యవస్థ మాత్రమే, ప్రభు త్వాన్ని ఎన్నుకున్న మెజారిటీ ప్రజాభిప్రాయానికి ప్రతితులనాత్మకంగా ప్రభుత్వ పనితీరు పట్ల నిరోధ సమతౌల్యాన్ని అందించగలదు. ప్రభుత్వ పనితీరుకు నిరోధ సమతౌల్యంగా ఉండాల్సిన న్యాయ మూర్తుల నియామక కమిటీలో అదే ప్రభుత్వం భాగమైతే, ప్రభుత్వ ఇతర విభాగాలను తనిఖీ చేసే కోర్టు విధిని అది ధ్వంసం చేస్తుంది. ఇది ‘కోళ్ళగూటిలోకి నక్కను స్వయంగా ఆహ్వానించడమే’ అవుతుంది. న్యాయమూర్తుల ఎంపిక కమిటీలో ప్రభుత్వ ప్రాతినిధ్యం అనేది న్యాయవ్యవస్థ స్వతంత్రతను ధ్వంసం చేస్తుందని న్యాయమూర్తుల నియామక కమిటీ చట్టం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో న్యాయ మంత్రి సూచన ఆ తీర్పును తోసిపుచ్చే ప్రయత్నమే. సుప్రీంకోర్టు ద్వారా ప్రకటితమైన చట్టాన్ని మార్చడానికి రెండు సుపరిచిత మార్గాలు ఉన్నాయి. మొదటిది, సముచితమైన శాసనం ద్వారా న్యాయస్థానం అన్వయించిన తీర్పు ప్రాతిపదికనే మార్చి వేయడం. రెండో మార్గం ఏమిటంటే, విస్తృత ధర్మాసనం ద్వారా ఆ తీర్పును తోసిపుచ్చడానికి ప్రయత్నించడం. ప్రభుత్వం ఈ రెండింటిలో ఏ ఒక్కదానికీ పూనుకోలేదు. బదులుగా, భారత ఉపరాష్ట్రపతి, న్యాయమంత్రి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే న్యాయస్థానం తీర్పునకు భిన్నంగా ప్రకటనలు చేస్తూ వచ్చారు. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రయ త్నంలో, మొత్తంగా న్యాయవ్యవస్థ చట్టబద్ధతనే రద్దుపరిచే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతూండటం గమనార్హం. న్యాయమూర్తుల నియామక విధానాన్ని మార్చాలని ప్రభుత్వం తీవ్రంగా భావిస్తూ ఉన్నట్లయితే, న్యాయమూర్తుల నియామక చట్టాన్ని తోసిపుచ్చిన తర్వాత ఒక కొత్త చట్టాన్ని తీసుకురాకుండా దాన్ని ఏదీ అడ్డుకోలేదు. అయితే ఈ మార్గాన్ని ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే చేపట్టడం లేదు. అసలు అలాంటి చట్టాన్ని రూపొందించే అవసరాన్నే ప్రభుత్వం పరిగణించలేదు. ఎందుకంటే, ప్రభు త్వంతో సంప్రదింపుల తర్వాతే నియామకాలను చేపడుతున్న పక్షంలో అలాంటి న్యాయమూర్తులతో ప్రభుత్వం ఎంతో సౌకర్యవంతంగా ఉంటూ వస్తోంది. రాష్ట్రపతి ఆదేశంతో నిమిత్తం లేకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని గానీ, న్యాయమూర్తులను గానీ కొలీజియం సిఫార్సు చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అలాగే కొలీజియం చేసిన ఏ సిఫారసు అయినా ప్రభుత్వానికి అసౌకర్యంగా మారి వ్యతిరేకించిన పక్షంలో అలాంటి సూచనలను న్యాయవ్యవస్థ వెనక్కు తీసుకోవడం కూడా జరిగేది కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా ఎన్నికైన జస్టిస్ ఎన్వీ రమణ యూపీఏ ప్రభుత్వ హయాంలో ఎంపికైన చివరి న్యాయమూర్తి కావడం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ప్రధాన న్యాయమూర్తులు ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే నియ మితులవుతూ వచ్చారు. అలాగని హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల ఎంపిక ప్రాతిపదికలో ఎలాంటి తప్పూ లేదని ఇక్కడ సూచించడం లేదు. ఇక్కడే శోధన ప్రారంభం కావలసి ఉంది. ముఖ్యంగా, హైకోర్టుల నియామకాల కోసం ప్రాతిపదిక గురించి న్యాయ మంత్రి తాజా లేఖ పేర్కొనడం లేదు. సమస్య ఇక్కడే ఉందని నేను నమ్ముతున్నాను. న్యాయమూర్తులను నియమించే దశలోనే శోధన, మూల్యాంకనకు ప్రాధాన్యత ఉంటుంది. అయితే న్యాయమూర్తులతో కూడిన కమిటీనే దాన్ని చేపట్టాలి. న్యాయమూర్తుల నియామకాలకు నిర్దిష్ట ప్రాతిపదిక ఉండాలి. ఆ ప్రాతిపదికను ముందుగానే ప్రకటించి ప్రచురించాలి. అందుబాటులో ఉన్న ఉత్తమ అభ్యర్థిని న్యాయమూర్తిగా ఎంపిక చేయడానికి సరైన మార్గం ఏదంటే, ప్రస్తుతం లోపభూయిష్టంగా ఉంటున్న న్యాయమూర్తుల నియామక వ్యవస్థను అధిగమించడం. దానికిగానూ సంబంధిత అభ్యర్థులు తమ ఆసక్తిని వ్యక్తపర్చడానికీ, స్వయంగా నామినేషన్ దాఖలు చేయడానికీ అనుమతించాలి. అప్పుడు మాత్రమే జడ్జీల నియమాకానికి చెందిన పరిగణన పరిధి విస్తృతం అవుతుంది. ప్రజలకు బహిరంగంగా తెలుస్తుంది కూడా. స్వీయ నామినేషన్ వ్యవస్థ మాత్రమే వర్గం, కులం, జాతి, లైంగిక ధోరణికి సంబంధించిన వైవిధ్యతకు హామీ ఇస్తుంది. ధర్మాసనంలో మనం చూడవలసిన బహుళత్వం, వైవిధ్యం గురించి అర్థం చేసు కోవడానికి అది వీలు కలిగిస్తుంది. ఇందిరా జైసింగ్ వ్యాసకర్త సీనియర్ న్యాయవాది, భారత మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ (‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ సౌజన్యంతో) -
హైకోర్టు జడ్జిలుగా మరో ఇద్దరు
సాక్షి, అమరావతి : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు న్యాయాధికారుల కోటా నుంచి పి. వెంకట జ్యోతిర్మయి, వి. గోపాలకృష్ణారావుల పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర హైకోర్టు కొలీజియం చేసిన సిఫారసుకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్లతో కూడిన కొలీజియం మంగళవారం సమావేశమై ఈ మేరకు తీర్మానం చేసింది. ఈ ఇద్దరి పేర్లను కేంద్రానికి పంపింది. వీరికి కేంద్రం ఆమోదం తెలిపిన తరువాత ఆ ఫైలు రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి నియామక ఉత్తర్వులు తరువాత వారి నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీచేస్తుంది. ఆ తరువాత వారి ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇక ఈ ఇద్దరు న్యాయాధికారుల్లో వెంకట జ్యోతిర్మయి ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా ప్రిన్సిపల్ జిల్లా జడ్జి (పీడీజే)గా వ్యవహరిస్తున్నారు. గోపాలకృష్ణ గుంటూరు మొదటి అదనపు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి పేర్లను హైకోర్టు కొలీజియం నాలుగు నెలల క్రితమే సుప్రీంకోర్టుకు పంపింది. వీరిద్దరి నియామకంతో ప్రస్తుతానికి న్యాయాధికారుల కోటా పూర్తవుతుంది. ఇదే సమయంలో వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరుకుంది. అలాగే, హైకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37 కాగా.. మరో ఐదు ఖాళీలుంటాయి. ఇవి న్యాయవాదుల కోటాకు సంబంధించినది. వీటిని సైతం భర్తీచేసేందుకు హైకోర్టు కొలీజియం త్వరలో న్యాయవాదుల పేర్లను సుప్రీంకోర్టుకు ప్రతిపాదించనుంది. మరోవైపు.. ఈ ఏడాది ముగ్గురు న్యాయమూర్తులు పదవీ విరమణ చేయనున్నారు. పి. వెంకట జ్యోతిర్మయి గుంటూరు జిల్లా, తెనాలిలో బాలాత్రిపుర సుందరి, పీవీకే శాస్త్రి దంపతులకు జన్మించారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు తెనాలిలోనే విద్యాభ్యాసం పూర్తిచేశారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. చదువులో టాపర్. మూడు బంగారు పతకాలు సాధించారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. వివిధ హోదాల్లో రాష్ట్రంలో పలుచోట్ల పనిచేశారు. 2022 ఏప్రిల్ 18 నుంచి ఇప్పటివరకు తూర్పు గోదావరి జిల్లా ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు కృష్ణాజిల్లా చల్లపల్లి గ్రామంలో కోటేశ్వరమ్మ, సోమయ్య దంపతులకు జన్మించారు. తండ్రి సబ్రిజిస్ట్రార్గా పనిచేశారు. పదవ తరగతి మచిలీపట్నం జైహింద్ పాఠశాలలో చదివారు. ఇంటర్ ఎస్ఆర్ వైఎస్పీ జూనియర్ కాలేజీలో పూర్తిచేశారు. డిగ్రీ, పీజీ మచిలీపట్నంలో చదివారు. 1994లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. 2007లో సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొందారు. 2016లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. గుంటూరు మొదటి అదనపు జిల్లా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. వీరి కుటుంబంలో న్యాయాధికారి అయిన మొదటి వ్యక్తి ఈయనే. కుమారుడు వి.రఘునాథ్ ఇటీవల జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై ప్రస్తుతం కర్నూలు జిల్లా, ఆత్మకూరు కోర్టులో పనిచేస్తున్నారు. -
మీకు జీవితఖైదు సరైనదే: షాక్ ఇచ్చిన హైకోర్టు
సాక్షి, శివాజీనగర: డబ్బు కోసం స్నేహితున్ని హత్య చేసిన కేసులో ముంబైకి చెందిన ఇద్దరు యువతులతో పాటు నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అర్జీని హైకోర్టు తోసిపుచ్చింది. తీర్పును రద్దు చేయాలని, లేదా సవరించాలని దోషులు రోహిత్ కుమార్– జార్ఖండ్, శివానీ ఠాకూర్, ప్రీతి రాజ్ – ముంబై, వారీస్– బిహార్.. వేసుకున్న అప్పీల్ను హైకోర్టు జడ్జి జస్టిస్ వీ.వీరప్ప ధర్మాసనం కొట్టివేసింది. హత్య కేసు వివరాలు.. వివరాలు.. వారిస్, తుషార్ రాజస్థాన్లో కలసి చదువుతుండేవారు. ఇంజనీరింగ్ చదివేందుకు తుషార్ బెంగళూరుకు వచ్చాడు. ధనవంతుల కుటుంబానికి చెందిన తుషార్ను కిడ్నాప్ చేయాలని వారిస్ కూడా బెంగళూరులో మకాం వేశాడు. ఇక్కడే ఉద్యోగం చేస్తున్న తన బంధువైన ప్రీతి, శివానిని తుషార్కు పరిచయం చేశాడు. నిందితులు 2011 జనవరి 14న తుషార్ను కిడ్నాప్ చేసి హత్యచేసి వీరసాగర రోడ్డు నీలగిరి తోపులో పడేశారు. జనవరి 16న అతని తండ్రికి కాల్ చేసి మీ కుమారుడిని కిడ్నాప్ చేశాం. రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో తుషార్ తండ్రి బిహార్ నుంచి బెంగళూరుకు వచ్చి పోలీస్లకు ఫిర్యాదు చేశారు. రైల్వేస్టేషన్ వద్ద డబ్బు ఇస్తామని పిలిపించగా రెండో నిందితుడు రోహిత్ వచ్చాడు. అతన్ని పట్టుకుని మిగతావారినీ అరెస్టు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ లో నేరం రుజువు కావడంతో 2014 నవంబరులో నలుగురికీ జీవిత ఖైదుని విధించింది. హైకోర్టు కూడా కింది కోర్టు తీర్పుని సమర్థించింది. (చదవండి: భార్య నుంచి కాపాడాలని మొర ) -
వెనకబడ్డ తరగతుల జడ్జిలు... హైకోర్టుల్లో 15 శాతమే
న్యూఢిల్లీ: దేశంలో గత ఐదేళ్లలో హైకోర్టుల్లో నియమితులైన న్యాయమూర్తుల్లో వెనుకబడిన తరగతులకు చెందినవారు కేవలం 15 శాతం మందే ఉన్నారని డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ వెల్లడించింది. బీజేపీ సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీని నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ఈ విషయాన్ని నివేదించింది. జడ్జిలను నియమించే అధికారాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని కొలీజియంకు కట్టబెట్టి 3 దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ హైకోర్టుల్లో బీసీ జడ్జిల సంఖ్య పెరగడం లేదని స్పష్టంచేసింది. జడ్జిలుగా ఎవరిని నియమించాలన్నది కొలీజియమే తేలుస్తుందని గుర్తుచేసింది. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను మాత్రమే ప్రభుత్వం ఆమోదించగలదని వెల్లడించింది. న్యాయస్థానాల్లో సామాజిక వైవిధ్యాన్ని ఇంకా సాధించలేకపోయామని డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయమూర్తుల నియామకం విషయంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలతోపాటు మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తరచుగా కొలీజియంను కోరుతూనే ఉందని వివరించింది. 2018 నుంచి 2022 డిసెంబర్ 19 వరకూ హైకోర్టుల్లో 537 మందిని జడ్జిలుగా నియమించగా, వీరిలో 1.3 శాతం మంది ఎస్టీలు, 2.8 శాతం మంది ఎస్సీలు, 11 శాతం మంది ఓబీసీలు, 2.6 శాతం మైనారిటీలు ఉన్నారని తెలియజేసింది. -
క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను శిక్షించవద్దు
మెరకముడిదాం: విద్యార్థులను క్రమశిక్షణ పేరుతో శిక్షించవద్దని హైకోర్టు జడ్జి చీమలపాటి రవి అన్నారు. తన స్వగ్రామమైన విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం బైరిపురంలో తన తల్లిదండ్రుల 60వ వివాహ వార్షికోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా భైరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం సందర్శించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ప్రేమతో కూడిన విద్యను అందించిన నాడే చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి సాయికళ్యాణ చక్రవర్తి, చీపురుపల్లి జూనియర్ సివిల్ జడ్జి విజయరామేశ్వరి పాల్గొన్నారు. -
సామాన్యులకు వెలుగు రేఖ పద్మనాభరెడ్డి
విశాఖ లీగల్: హైకోర్టు సీనియర్ న్యాయవాది, దివంగత సి.పద్మనాభరెడ్డి సామాన్యుల జీవితాల్లో వెలుగు రేఖగా నిలిచారని హైకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. శనివారం విశాఖలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో పద్మనాభరెడ్డి స్మారక ఉపన్యాస కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పద్మనాభరెడ్డి తనయుడు, హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. న్యాయవాదిగా తన తండ్రి నుంచి నేర్చుకున్న అనుభవ పాఠాల గురించి వివరించారు. న్యాయవాదులు, న్యాయమూర్తుల మధ్య సత్సంబంధాలు అవసరమన్నారు. న్యాయవాదులు కోర్టులో ప్రవర్తించే తీరు చాలా ముఖ్యమన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు, న్యాయపరమైన అంశాలు, చట్టాల గురించి వివరించారు. సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం వల్ల నేడు అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. చట్టం అందరికీ సమానమేనన్నారు. మహిళల చట్టాలు సమర్థవంతంగా అమలు జరగాలన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్.. ఎన్నికల నేరాలు, తప్పుడు హామీలు తదితరాల గురించి వివరించారు. పద్మనాభరెడ్డి భారత న్యాయవ్యవస్థకు కరదీపిక అని చెప్పారు. న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ మన్మథరావు మాట్లాడుతూ.. పద్మనాభరెడ్డి 60 వేలకు పైగా కేసులను వాదించారని చెప్పారు. న్యాయమూర్తి జస్టిస్ బి.శ్యామ్సుందర్ మాట్లాడుతూ.. సత్వర న్యాయం పొందాలంటే.. కేసు దాఖలు చేసే సమయంలో సీనియర్ల సలహాలు, సరైన ధ్రువీకరణ పత్రాలు అవసరమన్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.నగేష్ మాట్లాడుతూ.. కులాలు, మతాలు వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ అధ్యక్షుడు సురేశ్కుమార్, జాతీయ కార్యవర్గ సభ్యులు బొమ్మకంటి ప్రభాకర్, ముప్పాళ్ల సుబ్బారావు, చెలసాని అజయ్కుమార్, వి.చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు -
సుప్రీం జడ్జీలుగా ఐదుగురికి పదోన్నతి
న్యూఢిల్లీ: పేరుకుపోతున్న కేసుల సత్వర పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్థానం మరో ముందడుగు వేసింది. ఐదుగురు హైకోర్టు జడ్జీలను సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అంతకుముందు ఢిల్లీలో మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమైంది. ఆ తర్వాత సంబంధిత జడ్జీల పేర్ల జాబితాను కేంద్రానికి పంపింది. ఈ వివరాలను సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో పొందుపరిచింది. రాజస్తాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ పంకజ్ మిట్టల్, పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్, మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్, పట్నా హైకోర్టులో మరో జడ్జి జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ మనోజ్ మిశ్రాలను సుప్రీంకోర్టులో జడ్జీలుగా ఎంపికచేయాలంటూ కేంద్రానికి సిఫార్సుచేసింది. ఈ సిఫార్సులకు కేంద్రం ఆమోదముద్ర వేస్తే సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 33కు పెరుగుతుంది. మరోవైపు, ఉత్తరాఖండ్ హైకోర్టులో జడ్జి జస్టిస్ సంజయకుమార్ మిశ్రాను జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, గువాహటి హైకోర్టు జడ్జి ఎన్ కోటీశ్వర్ సింగ్ను జమ్మూకశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.వినోద్ చంద్రన్ను గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుచేసింది. -
రొటీన్కు భిన్నంగా ఆలోచించండి.. ఇంకెన్నాళ్లు ఇలా?
న్యూఢిల్లీ: హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీల భర్తీ విషయంలో కేంద్రం ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ కాల పరిమితికి కట్టుబడకపోవడం దురదృష్టకరమని న్యాయ, సిబ్బందిపై ఏర్పాటైన పార్లమెంటు కమిటీ ఆవేదన వెలిబుచ్చింది. ‘‘ఇదో నిరంతర సమస్యగా కొనసాగుతోంది. దీని పరిష్కారానికి కేంద్రం, న్యాయ వ్యవస్థ రొటీన్కు భిన్నంగా ఆలోచించాలి’’ అని గురువారం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో సూచించింది. కొలీజియం ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంపై కేంద్రం, సుప్రీంకోర్టు మధ్య వివాదం నానాటికీ తీవ్ర రూపు దాలుస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుశీల్కుమార్ మోదీ నేతృత్వంలోని కమిటీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విశేషం. హైకోర్టు న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి నిర్దిష్ట కాలావధిని సూచించలేమన్న కేంద్ర న్యాయ శాఖ వ్యాఖ్యలతో తాము ఏకీభవించడం లేదని నివేదికలో కమిటీ స్పష్టం చేసింది. ‘‘ఈ విషయంలో స్పష్టమైన కాలావధిని న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్ (ఎంఓపీ)లోనూ, రెండో జడ్జిల కేసులోనూ పేర్కొన్నారు. కానీ వాటికి న్యాయ, కార్య నిర్వాహక వ్యవస్థలు రెండూ కట్టుబడకపోవడం శోచనీయం’’ అంటూ సునిశిత విమర్శలు చేసింది. ‘‘పైగా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ఈ ఎంఓపీని సవరించే అంశం కేంద్రం, సుప్రీంకోర్టు మధ్య దాదాపు ఏడేళ్లుగా పరిశీలనలో ఉంది. ఇంతకాలమైనా దానిపై ఏకాభిప్రాయానికి రావడంలో అవి విఫలమవడం నిజంగా ఆశ్చర్యకరం’’ అంటూ ఆక్షేపించింది. ఇప్పటికైనా పరస్పరామోదంతో ఎంఓపీని సవరించి మరింత సమర్థంగా, పారదర్శకంగా తీర్చిదిద్దాలని సూచించింది. ‘‘2021 డిసెంబర్ 31 నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం తెలంగాణ, పటా్న, ఢిల్లీ హైకోర్టుల్లో సగానికి పైగా, మరో 10 హైకోర్టుల్లో 40 శాతానికి పైగా న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జనాభాతో పోలిస్తే న్యాయమూర్తుల నిష్పత్తి అసలే చాలా తక్కువగా ఉంది. అలాంటప్పుడు ఇలా పలు పెద్ద రాష్ట్రాల హైకోర్టుల్లో ఇన్నేసి ఖాళీలుండటం చాలా ఆందోళనకరం’’ అని అభిప్రాయపడింది. హైకోర్టుల్లో ఖాళీలెన్నో... దేశవ్యాప్తంగా 25 హైకోర్టులున్నాయి. గత డిసెంబర్ 5 నాటికి వాటిలో 1,108 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా 778 మందే ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన 20 పేర్లను పునఃపరిశీలించాలంటూ కేంద్రం నవంబర్ 25న తిప్పి పంపడం తెలిసిందే. -
హైకోర్టు తీర్పు తో ఇప్పటం గ్రామం పరువు పోయింది : స్థానికులు
-
టీడీపీ నేత నారాయణను విచారించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
Police Ramya: అమ్మా.. నీకు వందనం
ఆకలితో అలమటిస్తున్న పసికందుకు పాలిచ్చి రక్షించినందుకు పోలీసు అధికారిణిని హైకోర్టు న్యాయమూర్తితో సహా పలువురు అధికారులు ప్రశసించారు. ఈ ఘటన కోజికోడ్ చెవాయూర్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కోజికోడ్ చెవాయూర్ పోలీస్టేషన్లో సివిల్ పోలీస్ ఆఫీసర్గా ఎంఆర్ రమ్య విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం ఉదయం 22 ఏళ్ల మహిళ తన నవజాత శిశువు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. కుటుంబ కలహాల కారణంగా పసికందుని తల్లి వద్ద నుంచి ఎత్తుకెళ్లి ఉండవచ్చిన అనుమానించి.. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. పని నిమిత్తం బెంగుళూరు వెళ్లిన తండ్రితోనే ఆ పసికందు ఉండవచ్చనే అనుమానంతో వాయనాడ్ సరిహద్దులోని పోలీస్టేషన్లకు సమాచారం అందించారు. దీంతో సుల్తాన్బతేరి పోలీసులు సరిహద్దు వెంబడి వాహనాలను తనిఖీ చేస్తుండగా శిశువుతో ఉన్న తండ్రిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని వద్ద ఉన్న శిశువు ఆకలితో అలమటించి సొమ్మసిల్లింది. దీంతో పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఐతే బిడ్డ షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు వైద్యులు గుర్తించారు. ఆస్పత్రికి చేరు పోలీస్ అధికారి రమ్య తాను పాలిచ్చే తల్లినని చెప్పి వెంటనే ఆ పసిబిడ్డను అక్కున చేర్చుకుని పాలిచ్చారు. ఆ తర్వాత ఆ శిశువును తల్లి ఒడికి చేర్చారు. ఆ సమయంలో ఆమె చూపించిన ఉదార సేవకు ముగ్ధుడై హైకోర్టు న్యాయమూర్తి దేవన్ రామచంద్రన్ ఆమె చేసిన పనిని మెచ్చుకుంటూ పోలీసు ఉన్నతాధికారులకు లేఖ కూడా రాశారు. ఈ మేరకు పోలీస్ అధికారి రమ్యకు జడ్జి సర్టిఫికేట్ను పోలీస్ చీఫ్ అనిల్ అందించడమే ఆమె కుటుంబసభ్యులను పోలీసు ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించి ప్రశంసా పత్రంతో సత్కరించారు. అంతేకాదు ఆకలితో అలమటించిన పసికందు పట్ల సానుభూతితో రమ్య వ్యవహరించిన తీనే పోలీసు శాఖ ప్రతిష్టను పెంచిందని ఉన్నతాధికారులు అన్నారు. (చదవండి: చాక్లెట్ల దొంగతనం వైరల్ కావడంతో... విద్యార్థిని ఆత్మహత్య) -
రైతుల ముసుగులో నకిలీలు
-
బిగ్ క్వశ్చన్ : ఇప్పటికైనా పాదయాత్రలో ఓవర్ యాక్షన్ తగ్గిస్తారా ..?
-
హెచ్ఆర్సీ ఆదేశాలపై హైకోర్టు విస్మయం
సాక్షి, అమరావతి: భూ సేకరణ పరిహారం చెల్లింపులో జాప్యం చేసినందుకుగాను బాధితుడికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని జల వనరుల శాఖ అధికారులను ఆదేశిస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సీ) ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. భూ సేకరణ వ్యవహారాల్లో పరిహారం చెల్లింపునకు ఆదేశాలు జారీచేసే అధికారం హెచ్ఆర్సీకి ఎక్కడ ఉందని ప్రశ్నించింది. రూ.10 లక్షల పరిహారం చెల్లించాలన్న హెచ్ఆర్సీ ఆదేశాలను హైకోర్టు నిలిపేసింది.ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హెచ్ఆర్సీ రిజిస్ట్రార్, ఆరి్థక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, కర్నూలు కలెక్టర్, నంద్యాల ఆర్డీవోలను ఆదేశించింది. తదుపరి విచారణను సెపె్టంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 10 లక్షల పరిహారం ఇవ్వాలన్న హెచ్ఆర్సీ నంద్యాలలోని వీరాపురం చెరువును పునరుద్ధరించాలని 1993లో అధికారులు నిర్ణయించారు. అందుకు కొంత భూమిని సేకరించాలని నిర్ణయించి ముసాయిదా భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, సేకరించదలచిన భూములు పట్టా భూములు కాదని, ప్రభుత్వ భూములని తెలుసుకున్న అధికారులు ఆ నోటిఫికేషన్ను రద్దు చేశారు. దీనిపై కొందరు వ్యక్తులు 2003లో హైకోర్టును ఆశ్రయించి పరిహారం చెల్లించేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఆ భూములు పట్టా భూములు కాకపోవడం, ఆ భూములను సేకరించకపోవడం వల్ల వాటికి ఎలాంటి పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టేసింది. ఆ తరువాత మరికొందరు ఇదే అంశంపై 2013లో హైకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ పెండింగ్లో ఉంది. ఈ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తుల్లో ఒకరైన ఎంజేఎస్ రాజు 2021లో హెచ్ఆర్సీని ఆశ్రయించారు. పరిహారం చెల్లించకుండా అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన హెచ్ఆర్సీ రాజుకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని జల వనరుల శాఖ అధికారులను ఆదేశిస్తూ ఈ ఏడాది మే 5న ఉత్తర్వులిచి్చంది. హెచ్ఆర్సీకి ఆ అధికారం లేదన్న హైకోర్టు ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, నీటి పారుదల శాఖ అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున ప్రభుత్వ న్యాయవాది (నీటి పారుదలశాఖ) శీలం శివకుమారి వాదనలు వినిపిస్తూ.. హెచ్ఆర్సీ ముందు వాస్తవాలను ఉంచలేదన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని హెచ్ఆర్సీ సరైన దృష్టి కోణంలో చూడలేదన్నారు. భూ సేకరణ, పరిహారం తదితర అంశాలు హెచ్ఆర్సీ పరిధిలోకి రావని తెలిపారు. వివాదం హైకోర్టులో పెండింగ్లో ఉండగా, ఆ అంశంపై హెచ్ఆర్సీ జోక్యం తగదన్నారు. ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. భూ సేకరణ, పరిహారం వ్యవహారాల్లో హెచ్ఆర్సీ ఎలా జోక్యం చేసుకుంటుందని ధర్మాసనం ప్రశ్నించింది. పరిహారం చెల్లింపు అధికారం ఎక్కడ ఉందని నిలదీసింది. రూ.10 లక్షల పరిహారం చెల్లించాలంటూ హెచ్ఆర్సీ ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేసి.. కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. ఇది కూడా చదవండి: అప్పు పథంలో ఐదు రాష్ట్రాలు -
అదేం డ్రెస్సింగు? ఐఏఎస్కు మందలింపు
పాట్నా: ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి, కోర్టు ప్రోటోకాల్ ఫాలో కాక జడ్జి చేతిలో తిట్లు తిన్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. బీహార్ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు ఆనంద్ కిశోర్. సీఎం నితీశ్ కుమార్ ఆయన దగ్గర కూడా. ఓ కేసులో ఈమధ్యే ఆయన పాట్నా హైకోర్టుకు హాజరయ్యారు. అయితే ఆయన వేసుకున్న దుస్తులు జడ్జి పీబీ భజంత్రీకి చిరాకు తెప్పించాయి. ‘‘ఇదేమైనా సినిమాహాల్ అనుకుంటున్నారా? సాధారణ డ్రెస్సింగ్లో రావడానికి!. సివిల్స్ సర్వెంట్లు ఎలాంటి డ్రెస్లో కోర్టుకు రావాలో మీకు తెలియదా? ఎక్కడ శిక్షణ తీసుకున్నారు మీరు? ముస్సోరీ ట్రైనింగ్లో ఈ విషయాలేవీ మీకు చెప్పలేదా? మెడ కనిపించకుండా కాలర్ బటన్స్ పెట్టుకోవాలని, కనీసం మీద కోట్ అయినా ధరించాలి అని తెలియదా? అంటూ ఆ సీనియర్ అధికారిపై జడ్జి అసహనంగా వ్యక్తం చేశారు. -
రాజస్తాన్ హైకోర్టులో న్యాయమూర్తుల జంట
జైపూర్: రాజస్తాన్ హైకోర్టులో తొలిసారిగా భార్యభర్తలిద్దరూ న్యాయమూర్తులుగా సేవలందించనున్నారు. న్యాయమూర్తిగా జస్టిస్ శుభా మెహతా తాజాగా బాధ్యతలు చేపట్టారు. ఆమె భర్త జస్టిస్ మహేంద్ర గోయెల్ 2019 నుంచి అక్కడ న్యాయమూర్తిగా ఉన్నారు. మద్రాసు, పంజాబ్ హైకోర్టుల్లోనూ గతం ఇలా భార్యాభర్తలు న్యాయమూర్తులుగా చేశారు. మద్రాసు హైకోర్టులో జస్టిస్ మురళి శంకర్ కుప్పురాజు, ఆయన భార్య జస్టిస్ తమిళసెల్వి 2020లో ఒకేసారి న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు. 2019 నవంబర్లో పంజాబ్లో జస్టిస్ వివేక్ పురీ, ఆయన భార్య జస్టిస్ అర్చన పురీ కూడా ఒకే రోజు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. చదవండి: ఫ్యాక్టరీలో భారీ పేలుడు... 13 మంది మృతి -
భార్య నగ్న ఫొటోలను బంధువులకు షేర్ చేసిన భర్త.. ఆ తర్వాత..?
బనశంకరి: భార్యను అసహజ లైంగిక ప్రక్రియకు ఒత్తిడి చేయడం, ఆమెను నగ్న ఫోటోలు తీసి కుటుంబసభ్యులు, స్నేహితులకు పంపించిన సైకో భర్తపై పకడ్బంధీగా విచారణ జరపాలని మంగళవారం హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తండ్రి, బంధువులకు నగ్నఫొటోలు వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగి చత్తీస్గఢ్ రాయ్పూర్కు చెందిన యువతిని ప్రేమించి 2015లో పెళ్లి చేసుకున్నాడు. భర్త అసహజ లైంగిక ధోరణులతో భయపడిన ఆమె పుట్టింటికి చేరుకుంది. ఉన్మాదిగా మారిన భర్త ఆమె నగ్నఫోటోలు, వీడియోలను ఆమె తండ్రి, బంధుమిత్రులకు పంపాడు. దీంతో బాధితురాలు 2019లో రాయపుర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నేరం జరిగిన బెంగళూరులో కాబట్టి కేసును ఇక్కడి వివేకనగర బదిలీ చేశారు. కానీ, వివేకనగర పోలీసులు కేసును ఏమాత్రం సీరియస్గా తీసుకోలేదు. కనీస సాక్ష్యాధారాలను కూడా సేకరించలేదు. హైకోర్టును ఆశ్రయించిన భార్య ఫలితంగా కేసు వీగిపోయే ప్రమాదం ఉందని బాధితురాలు హైకోర్టులో కేసు వేశారు. న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న ఆమె అర్జీని విచారించి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. చార్జిషీటు సాదాసీదాగా ఉందని, తీవ్రమైన నేరాలను పేర్కొనలేదని, వీటన్నింటిని గమనిస్తుంటే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టలేదని, రాష్ట్ర డీజీపీ లేదా నగరపోలీస్ కమిషనర్ ఇలాంటి దర్యాప్తు చేపడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని జడ్జి ఆదేశించారు. పోలీస్ శాఖలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయమని చెప్పారు. ఇది కూడా చదవండి: మరో వ్యక్తితో వివాహేతర సంబంధం.. నగదు, ఇంటి కాగితాలు తీసుకుని.. -
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఎస్.ఎం.సుభాని
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా న్యాయవాది మెహబూబ్ సుభాని షేక్ (ఎస్.ఎం.సుభాని)ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం ఈనెల నాలుగోతేదీ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సుభాని పేరును కేంద్రానికి పంపింది. ఈ సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. అదే సమావేశంలో ఢిల్లీ హైకోర్టుకు ఏడుగురు న్యాయవాదుల్ని, పట్నా హైకోర్టుకు ఏడుగురు న్యాయవాదుల్ని న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం ఏడాది కాలంలో వేర్వేరు హైకోర్టులకు 195 మందిని న్యాయమూర్తులుగా నియమించాలని సిఫారసు చేసినట్లు కోర్టు వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ఎస్.ఎం.సుభాని పేరును న్యాయమూర్తి పోస్టుకు హైకోర్టు కొలీజియం గత ఏడాది సిఫారసు చేసింది. సుభానితో పాటు మరో ఏడుగురు న్యాయవాదుల పేర్లను కూడా సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సుభాని పేరును పక్కనపెట్టి మిగిలిన ఏడుగురు న్యాయవాదుల పేర్లకు ఆమోదముద్ర వేసింది. ఇప్పుడు ఆయన పేరును న్యాయమూర్తి పోస్టుకు సిఫారసు చేసింది. ఇదీ నేపథ్యం.. సుభాని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామంలో జన్మించారు. ఆ గ్రామంలోనే ప్రాథమిక విద్యను పూర్తిచేశారు. ఇంటర్, డిగ్రీ ఆంధ్ర లయోలా కాలేజీలో చదివారు. జేఎన్యూ న్యూఢిల్లీలో ఎంఏ పూర్తిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది ఏరాసు అయ్యపరెడ్డి వద్ద జూనియర్గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు ప్రభుత్వసంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. ప్రస్తుతం హైకోర్టులో ఏసీబీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్నారు. చదవండి: AP: వెయ్యి గ్రామాల్లో పూర్తయిన రీసర్వే -
న్యాయమూర్తులుగా 15 మంది
న్యూఢిల్లీ: ఏపీ, ఢిల్లీ, పాట్నా హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించాలంటూ 15 మంది జ్యుడీషియల్ అధికారులు, న్యాయవాదుల పేర్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అడ్వొకేట్ మహబూబ్ సుభానీ షేక్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ్జడ్జిగా నియమించాలని సూచించింది. ఢిల్లీ, పట్నా హైకోర్టులకు ఏడుగురు చొప్పున న్యాయమూర్తులుగా నియమించాలని ప్రతిపాదించింది. ఈ నెల 4న కొలీజియం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. -
ఏ కేసులోనూ అరెస్టు చేయొద్దని ఎలా ఆదేశిస్తారు ?
సాక్షి, హైదరాబాద్: పలువురిని మోసం చేశాడంటూ నమోదైన కేసుల్లో శ్రీధర్ కన్వెన్షన్ ఎండీ ఎస్.శ్రీధర్రావు ఆయన భార్య సంధ్యలను హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో నమోదైన ఏ కేసులోనూ అరెస్టు చేయరాదంటూ సింగిల్ జడ్జి జారీచేసిన ఉత్తర్వులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర నేతృత్వంలోని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. తమను మోసం చేశాడంటూ అనేక మంది వీరిపై ఫిర్యాదు చేస్తున్నారని, ఇటువంటి ఉత్తర్వులు జారీ చేయడం పోలీసుల దర్యాప్తును అడ్డుకోవడమేనని వ్యాఖ్యానించింది. శ్రీధర్రావు, సంధ్యలపై ఎన్ని కేసులు నమోదయ్యాయి, దర్యాప్తు పురోగతి ఏంటో తెలియజేస్తూ నివేదిక సమర్పించాలని హోంశాఖను ఆదేశించింది. క్రిమినల్, సివిల్, వాణిజ్య వివాదాల్లో శ్రీధర్రావు, సంధ్యలను అరెస్టు చేయరాదంటూ సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మణికొండకు చెందిన ఖుషిచంద్ వడ్డె దాఖలు చేసిన అప్పీల్ను ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని శ్రీధర్రావు, సంధ్యలను గతంలో ఆదేశించినా స్పందించకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. వివరణ ఇచ్చేందుకు గడువు కావాలని వీరి తరఫు సీనియర్ న్యాయవాది ఎంఎస్ ప్రసాద్ అభ్యర్థించడంతో ఒక రోజు గడువునిస్తూ విచారణను ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది. (చదవండి: ఆఫ్లు ఆఫయ్యాయి!) -
పెళ్లి చేసుకోకపోయినా ఖర్చులు రాబట్టుకోవచ్చు! హైకోర్టు కీలక తీర్పు
రాయ్పూర్: వివాహం కానప్పటికీ కుమార్తె తన తల్లిదండ్రుల నుంచి పెళ్లిఖర్చులను రాబట్టుకోవచ్చని ఛత్తీస్గఢ్ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్, 1956లోని నిబంధనల ప్రకారం.. పెళ్లికాని కుమార్తె తన తల్లిదండ్రుల నుంచి వివాహ ఖర్చులను క్లెయిమ్ చేసుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాకు చెందిన రాజేశ్వరి అనే 35 ఏళ్ల మహిళ దాఖలు చేసిన పిటిషన్ను బిలాస్పూర్లోని హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది. తన తండ్రి నుంచి వివాహ ఖర్చులు ఇప్పించాలని ఆమె వేసిన పిటిషన్ను జస్టిస్ గౌతమ్ భాదురి, జస్టిస్ సంజయ్ ఎస్ అగర్వాల్లతో కూడిన ధర్మాసనం మార్చి 21న విచారణకు అనుమతించిందని పిటిషనర్ న్యాయవాది ఎకె తివారి తెలిపారు. బిలాయ్ స్టీల్ ప్లాంట్(బీఎస్పీ) ఉద్యోగి అయిన తన తండ్రి భాను రామ్ కు పదవీ విరమణ ద్వారా రూ.55 లక్షలు రానున్నాయని.. ఇందులో తనకు రూ. 20 లక్షలు ఇచ్చేలా బీఎస్పీని ఆదేశించాలని 2016, జనవరి 7న దుర్గ్ జిల్లా కుటుంబ న్యాయస్థానాన్ని రాజేశ్వరి ఆశ్రయించారు. అయితే ఆమె అభ్యర్థనను జిల్లా కోర్టు తిరస్కరించింది. కుటుంబ న్యాయస్థానం ఆదేశాలను సవాల్ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. చట్టం ప్రకారం.. పెళ్లికాని కుమార్తె తన తండ్రి నుంచి వివాహ ఖర్చులను డిమాండ్ చేయవచ్చని.. ఆ ఖర్చు మెయింటెనెన్స్ పరిధిలోకి వస్తుందని హైకోర్టుకు విన్నవించినట్టు రాజేశ్వరి తరపు న్యాయవాది తివారి తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు వెలువరించిందని ఆయన చెప్పారు. ఛత్తీస్గఢ్ హైకోర్టు ఈ తరహా తీర్పు ఇవ్వడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. (క్లిక్: ఆ 72 మంది ఎంపీలతో ప్రధాని ఫొటో సెషన్) -
International Womens Day 2022 : స్త్రీకి స్త్రీయే శత్రువా? నేను ఒప్పుకోను!
మాకూ హక్కులు కావాలి, మాకూ అవకాశాలు కావాలి అని మహిళలు దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తున్నా ఇంకా లింగ-సమానత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితి. తమ ఉనికితోపాటు, పురుషులతో సమానంగా విద్యా, ఉద్యోగ, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం కోసం కృషి చేస్తున్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జీ రాధారాణిని సాక్షి.కామ్ పలకరించింది. మహిళలందరికీ విమెన్స్ డే శుభాకాంక్షలు అందించిన ఆమె పలు విషయాలను పంచుకున్నారు. ‘‘ఇప్పటి యంగ్ జనరేషన్కు లింగ వివక్ష ఎక్కడ ఉంది అనిపించవచ్చు. చాలామంది టీనేజర్లకు ఈ విమెన్ డేస్ అవీ... అవసరమా అనిపిస్తుంది. కానీ వన్స్ పెళ్లి చేసుకొని కుటుంబ జీవితంలోకి ఎంటరైన ప్రతీ మహిళకు వివక్ష ఏ రూపంలో ఉంటుందనేది కనబడుతుంది. అర్థం అవుతుంది. తరతరాలుగా వివక్ష అనేది మనం జీవితాల్లో అంతర్లీనంగా జీర్ణించుకుపోయింది. గతంలో భార్యను భర్త కొట్టడం సహజమే కదా అన్నట్టుగా ఉండేవాళ్లం. ఈ పరిస్థితి నేడు మారినా ఇంకా చాలా మారాలి. ఈ కాస్త మార్పు అయినా మన పోరాటం, ప్రశ్నించడం మూలంగానే వచ్చాయి. ఆలోచించడం, ప్రశ్నించడం అనే ప్రక్రియ నిరంతరం సాగాలి. ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఎక్కడ ఉన్నాం. ఎక్కడ లోపాలున్నాయి అనేది రివ్యూ చేసుకోవాలి. లోపాలను సరిదిద్దుకునేలా సమీక్షించుకోవాలి. మార్పుకోసం అవగాహన పెంచుకొని ముందుకు పోవాలి. అదే మార్చి 8 ఉద్దేశం. మహిళలకు న్యాయవాద వృత్తి సవాలే! ఏ ప్రొఫెషన్ను లైట్ తీసుకోకూడదు ఏ ప్రొఫెషన్ అయినా డెడికేటెడ్గా కమిటెడ్గా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. వృత్తిని తేలిగ్గా తీసుకోకుండా, నిబద్ధతగా పనిచేసుకుంటూ పోవాలి. జ్యుడీషియల్ ప్రొఫెషన్లో సాధారణంగా సీనియర్లతో పోలిస్తే జూనియర్లకు అందులోనూ మహిళలకు ముఖ్యంగా క్రిమినల్ లాయర్స్కు వృత్తిలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. కానీ సక్సెస్ఫుల్ విమెన్గా నిలవాలంటే ధైర్యంగా సవాళ్లను ఎదుర్కోవాలి. నిరుత్సాహ పడకుండా తామేంటో నిరూపించుకోగలగాలి. కుటుంబ సహకారం లేకుండా మహిళలు ముందుకు పోవడం చాలా కష్టం. నిజానికి మన బాధ్యతలు, పనితీరును బట్టి ఇంట్లో వాళ్లు అవగాహన పెంచుకుంటారు. ఇలాంటి పరిస్థితులన్నీ వర్కింగ్ విమెన్ పిల్లల గ్రోత్కు చాలా ఉపయోగపడతాయి. నాకు నా భర్త సహకారం చాలా ఉంది. పెళ్లి తరువాతే నేను గ్రాడ్యుయేషన్ చేశాను. ఆ తరువాత ఆయన సపోర్టుతోనే ఏలూరులో సీఆర్ఆర్ (ఈవినింగ్) లా కాలేజీలోలా చేశాను. మా కుటుంబలో ఎవరూ లీగల్ ప్రొఫెషనల్స్ లేరు. తండ్రులు, తాతలు, తెలిసినవాళ్లు ఎవరూ లేకుండానే ఈ స్థాయికి రాగలిగాను. ఇలానే అనుకున్న లక్ష్యం కోసం ప్రయత్నించి సాధించాలి. బార్ కౌన్సిల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి లీగల్ ప్రొఫెషనల్లోకి వచ్చేందుకు 33 శాతం రిజర్వేషన్ చాలా ఉపయోగపడుతోంది. చాలామంది మహిళలం సర్వీస్ కేండిడేట్స్గా వచ్చాం. అయితే బార్ నుంచి మహిళల ప్రాతినిధ్యం లభించకపోవడం ఒక లోపంగా కనిపిస్తోంది. అక్కడ పురుషుల డామినేషన్ కారణంగా మోర్ విమెన్ రావడం లేదు. ఇది మారాలి. బార్ నుంచి మహిళా లాయర్లు పెరగాలి. అలాగే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో లేడీ రిప్రజెంటేటివ్గా ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఇక్కడ మహిళల రిప్రజెంటేషన్ పెరగాలి. డెసిషన్ మేకింగ్ పవర్ ముఖ్యం నా దృష్టిలో చదువుకోని స్త్రీ అయినా సరే స్వంతంగా నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటమే సాధికారత. అలాగే చదువుకుని మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉండి కూడా స్వయంగా నిర్ణయం తీసుకోలేక పోవడం దురదృష్టకరం. మహిళలకు విద్య, ఉద్యోగం రావడమే ఒక ఎంపవర్మెంట్. ఎడ్యుకేషన్ మహిళల్లో విశ్వాసాన్ని నమ్మకాన్ని ఇవ్వాలి. ఇస్తుంది కూడా. బయటికి వెళ్లి ఉద్యోగం చేసుకుని ఎలాగైనా జీవించవచ్చు అనే ధైర్యం విద్య ద్వారానే వస్తుంది. ఉద్యోగం చేయాలా వద్దా, పిల్లల్ని కనాలా వద్దా, ప్రమోషన్ తీసుకోవాలా వద్దా లాంటి నిర్ణయాలు మహిళలు స్వయంగా తీసుకోగలగాలి. డెసిసిషన్ మేకింగ్ పవరే విమెన్కు కీలకం. మన ఇండియాలో చాలామంది మహిళలకు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? ఎంతమంది పిల్లలు కావాలి అనేది స్వయంగా నిర్ణయించుకునే స్థితిలో లేరు. అలాగే ట్రాన్సఫర్, ఉద్యోగంలో ప్రమోషన్ తీసుకోవాలా లేదా అనే సందిగ్దంలో చాలా మంది ఉద్యోగినులు కెరీర్ను వదులుకుంటున్నారు. పిల్లల కోసమో, భర్తల ఒత్తిడితోనో, లేదంటే కుటుంబం కారణంగానో ఉద్యోగాలను వదిలేయాల్సిన పరిస్థితి. దీనికి నేటి మహిళలు ఆలోచించాలి. దీనిపై మరింత అవగాహన పెంచుకోవాలి. అంతేకాదు ఎవరికి ఓటు వేయాలి అనే డెసిషన్ కూడా స్వయంగా మహిళలే తీసుకోవాలి. ఆ పవర్ రావాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి. స్త్రీలకు స్త్రీలే శత్రువులు అనేది నేను అసలు విశ్వసించను. మహిళల్లో ఈ భావజాలం మారేలా అవగాహన కల్పించలేకపోవడమే లోపం. దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. కాగా 1963 జూన్ 29న రాధారాణి గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు.1989లో న్యాయశాస్త్రంలో పట్టా పొంది న్యాయవాదిగా, ఏపీపీగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత 2008లో జిల్లా జడ్జిగా నియమితులై సంగారెడ్డి, నల్గొండ, సికింద్రాబాద్ ఫ్యామిలీ కోర్టు, నాంపల్లి కోర్టుల్లో పనిచేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా విధులు నిర్వంచారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. జీవితంలో అనుకున్న లక్ష్యాలను పట్టుదలగా సాధించి, ఉన్నత శిఖాలను అధిరోహించారు రాధారాణి. అంతేకాదు తాను కులాంతర వివాహం చేసుకుని, తన బిడ్డలకు కూడా కులాంతర వివాహాలను చేసి తానేంటో నిరూపించుకున్న రాధారాణిగారికి మహిళా దినోత్సవం సందర్భంగా హ్యాట్సాఫ్!!! -సాక్షి వెబ్ స్పెషల్ -
రామ్సింగ్పై తదుపరి చర్యలు నిలుపుదల
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఏఎస్పీ రామ్సింగ్పై కడప రిమ్స్ పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలుపుదల చేసింది. రామ్సింగ్పై యురేనియం కార్పొరేషన్ ఉద్యోగి ఉదయ్రెడ్డి దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదుకు సంబంధించిన రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని మేజిస్ట్రేట్ను హైకోర్టు ఆదేశించింది. కడప రిమ్స్ పోలీస్ ఇన్స్పెక్టర్, ఫిర్యాదుదారు ఉదయ్రెడ్డిలకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేశ్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. వివేకా హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ రామ్సింగ్ వేధిస్తున్నారంటూ ఉదయ్రెడ్డి కడప కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేయగా.. దానిని పరిశీలించిన మేజిస్ట్రేట్ నిబంధనల ప్రకారం దాన్ని పోలీసులకు పంపి విచారణ జరిపి కోర్టుకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు కడప రిమ్స్ పోలీసులు సీబీఐ అదనపు ఎస్పీ రామ్సింగ్పై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ రామ్సింగ్ హైకోర్టులో బుధవారం అత్యవసరంగా లంచ్మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రమేశ్ విచారణ జరిపారు. రామ్సింగ్ తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసులో దర్యాప్తును అడ్డుకునేందుకే ఉదయ్రెడ్డి తప్పుడు ఆరోపణలతో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారని హరినాథ్ తెలిపారు. ఉదయ్రెడ్డి ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పోలీసులు నిబంధనల ప్రకారం నడుచుకున్నారని తెలిపారు. మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాల మేరకే రామ్సింగ్పై కేసు నమోదు చేశారని వివరించారు. కోర్టు ఆదేశాలిచ్చినప్పుడు వాటిని అమలు చేయడం మినహా పోలీసులకు మరో మార్గం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. -
సర్ కాదు.. అందులో నుంచి బయటకు రండి!
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో మహిళా న్యాయమూర్తి, న్యాయవాది మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఢిల్లీ హైకోర్టులో ఓ కేసుకు సంబంధించిన వాదనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మహిళా న్యాయమూర్తి రేఖాపల్లిని ఉద్దేశిస్తూ ఓ అడ్వకేట్.. ‘సర్’ అని సంబోధించాడు. దీంతో వెంటనే స్పందించిన న్యాయమూర్తి రేఖాపల్లి.. తాను ‘సర్’ కాదని, ఆ భావన నుంచి బయటకు రావాలని చాకచక్యంగా సమాధానం ఇచ్చారు. జడ్జి మాటలకు స్పందించిన సదరు అడ్వొకేట్.. క్షమాపణ కోరుతూనే ఆ స్థానంలో ఎక్కువగా మగవారే కూర్చుంటారు కదా. ఆ ఉద్దేశంతోనే ఏమరపాటుతో అలా అనేశానని వివరణ ఇచ్చాడు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. An advocate keeps addressing Justice Rekha Palli of Delhi HC as "Sir". "I am not Sir. I hope you can make that out" - Justice Palli to lawyer. Lawyer - "Sorry, it's because of the Chair you are sitting in" pic.twitter.com/R8Gthtum9j — Live Law (@LiveLawIndia) February 16, 2022 -
హిజాబ్ వద్దు..కాషాయం వద్దు కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
-
మహిళా సాధికారతకు ప్రతీక.. పాకిస్తాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఆయేషా మాలిక్
సంప్రదాయ ముస్లిం మెజారిటీ గల పాకిస్థాన్ దేశ న్యాయ చరిత్రలో ఒక మహిళ న్యాయమూర్తిగా జస్టిస్ ఆయేషా మాలిక్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీం కోర్టులోని సెరిమోనియల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ ఆహ్మద్ 55 ఏళ్ల జస్టిస్ మాలిక్తో ప్రమాణం చేయించారు. దీనికి పెద్ద సంఖ్యలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అటార్నీ జనరల్, లాయర్లు, లా అధికారులు.. హాజరయ్యారు. జస్టిస్ మాలిక్ 2012లో లాహోర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇప్పుడు మొట్టమొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ విధంగా పాకిస్థాన్ న్యాయవ్యవస్థలో చరిత్ర సృష్టించారు ఆయేషా మాలిక్. జూన్ 2031లో పదవీ విరమణ పొందేవరకు ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతారు. జస్టిస్ మాలిక్ పదోన్నతిని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆమోదించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ గత శువ్రారం నోటిఫికేషన్ను జారీ చేసింది. జూన్ 2030లో పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం కూడా ఆయేషా మాలిక్కు ఉంది. ఆ విధంగా ఆమె మళ్లీ పాకిస్థాన్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి గా చరిత్రలో నిలిచిపోనున్నారు. ఆమె ఘనతను చెప్పే స్థాయి.. వేడుక ముగిసిన తర్వాత చీఫ్ జస్టిస్ అహ్మద్ విలేకరులతో మాట్లాడుతూ ‘జస్టిస్ మాలిక్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యేంత సమర్ధురాలు, ఆమె ఘనతను చెప్పేంత స్థాయి ఎవరికీ లేదు’ అన్నారు. సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి, జస్టిస్ మాలిక్ సాధించిన ‘మైలు రాళ్ల’కు అభినందనలు తెలిపారు. శ్రీ ఫవాద్ ట్వీట్ చేస్తూ ‘ఒక శక్తిమంతమైన చిత్రం. పాకిస్థాన్లో మహిళా సాధికారతకు ప్రతీక’ అని ప్రమాణ స్వీకారోత్సవ చిత్రంతో పాటు, జస్టిస్ ఆయేషా దేశ ‘న్యాయ వ్యవస్థ’కు ఒక ఆస్తిగా ఉంటారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. మహిళ అనే ఆశ్చర్యమా! లాహోర్ హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నప్పటికీ జస్టిస్ మాలిక్ అత్యుత్తమ స్థానానికి ఎంపికైనప్పుడు చాలామంది తమ కనుబొమలను పైకెత్తారు. ఆమె నామినేషన్ను పాకిస్థాన్ జ్యుడీషియల్ కమిషన్ (జేసీపీ) గతేడాది తిరస్కరించింది. కానీ, కమిషన్ ఈ నెల ప్రారంభంలో ఆమె పేరును రెండోసారి పరిశీలనకు తీసుకురాగా స్వల్ప మెజారిటీతో ఆమెదించింది. అత్యున్నత న్యాయవ్యవస్థకు న్యాయమూర్తులను నామినేట్ చేసే అత్యున్నత సంస్థ జెసీపీ సమావేశానికి చీఫ్ జస్టిస్ అహ్మద్ అధ్యక్షత వహించారు. సుపీరియర్ జ్యూడీషియరీ నియామకంపై జేసీపీ తర్వాత ద్వైపాక్షిక పార్లమెంటరీ కమిటీ ఆమోదం కోసం మాలిక్ నామినేషన్ ముందుకు వచ్చింది. మాలిక్ లాహోర్ హైకోర్ట్కి మొదటి మహిళా అత్యున్నత న్యాయమూర్తి కావడం వల్ల సీనియారిటీ సూత్రాన్ని పక్కన పెట్టి, కమిటీ ఆమె నామినేషన్ను ఆమోదించింది. సాధారణంగా హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. సుప్రీంకోర్టుకు వారి పదోన్నతిని ఆమోదించేటప్పుడు, గత సంవత్సరం ఆమె పేరును జేసీపీ తిరస్కరించడానికి ఇదీ ఓ కారణం. 1966లో జన్మించిన మాలిక్ పారిస్, న్యూయార్క్, కరాచీలోని పాఠశాలల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆమె లాహోర్లోని పాకిస్థాన్ కాలేజ్ ఆఫ్ లా లో ‘లా’ చదివారు. హార్వర్డ్ లా స్కూల్ నుండి ఎల్ఎల్ఎమ్ చేశారు. జూన్ 2021లో లైంగిక వేధింపుల నుండి బయటపడిన వారి పరీక్ష కోసం కన్యత్వ పరీక్షలు ‘చట్ట విరుద్ధం, పాకిస్థాన్ రాజ్యాంగానికీ వ్యతిరేకం’ అని ఆమె ఇచ్చిన తీర్పు ఒక మైలురాయి. సోమవారం ఇస్లామాబాద్లోని సుప్రీంకోర్టు భవనంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేస్తున్న ఆయేషా మాలిక్. -
వైకుంఠ ఏకాదశి వేళ తిరుమలలో ఏపీ హైకోర్టు జడ్జిలు
-
సకల శాస్త్రాలకు మాతృక వేద విజ్ఞానమే
తణుకు టౌన్: సకల శాస్త్రాలకు మన ప్రాచీన వేదాలే మూలమని.. న్యాయశాస్త్రానికి కూడా వేద విజ్ఞానమే మాతృక అనిరాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలోని శ్రీ పర్వత వర్దని సమేత నాగేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన వేదశాస్త్ర పండిత సత్కార సభ 13వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిర్రావూరి శ్రీరామచంద్రశర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ దుర్గా ప్రసాదరావు మాట్లాడుతూ.. వేదం శాస్త్రీయత కలిగిన శాస్త్రమని, ఇది మానవుని గురించి సమగ్రంగా చర్చించిన శాస్త్రమని చెప్పారు. వేదాలే ప్రపంచానికి మార్గనిర్దేశం చేశాయని, వేద విజ్ఞానంపై ప్రతి ఒక్కరూ గౌరవభావం పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా చిర్రావూరి శివరామకృష్ణ రాసిన ‘వేదవేదాంగ నివేదన’ పుస్తకాన్ని శృంగేరి విరూపాక్ష పీఠాధిపతి గంభీరానంద స్వామీజీ, హైకోర్టు జడ్జి దుర్గాప్రసాదరావు, హైకోర్టు అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, హైకోర్టు న్యాయవాదులు చల్లా ధనుంజయ, డాక్టర్ శాస్త్రి జంధ్యాల, వేద పండితులు కడియాల సీతారామ ఘనాపాటి, దోర్భల ప్రభాకరశర్మ, విశ్వనాథం గోపాలకృష్ణ, తహసీల్దార్ పీఎన్డీ ప్రసాద్, ఎంపీపీ రుద్రా ధనరాజు, గ్రామ సర్పంచ్ అడాడ బాబు, ఆలయ కమిటీ చైర్మన్ కోనాల మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత శ్రీ పర్వత వర్దని సమేత నాగేశ్వరస్వామి వారిని జస్టిస్ దుర్గాప్రసాదరావు కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. -
అక్షరాస్యత, స్వశక్తి ద్వారానే ఆర్థికాభివృద్ధి
పెదకాకాని (పొన్నూరు): అక్షరాస్యత, స్వశక్తిపై జీవనం సాగించేలా ప్రోత్సహించడంపైనే ప్రజల ఆర్థికాభివృద్ధి ఆధారపడి ఉంటుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకానిలోని విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ (వీఆర్వో) ప్రాంగణంలో ప్రొఫెసర్ ఎంఏ విన్డ్లీ లీగల్ సర్వీస్ సెంటర్ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జస్టిస్ దేవానంద్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా దురదృష్టవశాత్తు పలు విధానాల వల్ల పేదలు ఎటువంటి పరిపుష్టి సాధించకుండా పేదలుగానే మిగిలిపోయారన్నారు. న్యాయ సహాయం కోసం పేదలు ఇప్పటికీ ప్రాధేయపడటం చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందన్నారు. వీఆర్వో సంస్థ ఆధ్వర్యంలో స్థాపిస్తున్న లీగల్ సర్వీస్ సెంటర్ ద్వారా వాస్తవ లబ్ధిదారులకు అవసరమైన న్యాయ సహాయం ఉచితంగా అందాలన్నారు. తొలుత జస్టిస్ బట్టు దేవానంద్ చేతుల మీదుగా శంకుస్థాపన, శిలాఫలకం ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వలన జరిగాయి. ఈ కార్యక్రమంలో వీఆర్వో సంస్థ గ్రామ శాఖ ప్రెసిడెంట్ సిస్టర్ క్లీటస్డైసీ, సెక్రటరీ ఫాదర్ ధన్పాల్, విశ్రాంత ఐఏఎస్, గవర్నింగ్ బోర్డు సభ్యుడు డాక్టర్ టి.గోపాలరావు, నందిగామ సివిల్ జ్యుడిషియల్ జడ్జి జేసురత్నం, సంస్థ ట్రెజరర్ కవితా డేవిడ్, బాలస్వామి పాల్గొన్నారు. -
కొన్ని రోజులు కలిసుంటే సహజీవనం కాదు!
చండీగఢ్: ఇద్దరు వయోజనులు కొన్ని రోజులు కలిసి జీవించి, తాము సహజీవనం చేస్తున్నామని ప్రకటించుకోవడం నిజమైన సహజీవనం(లివ్ ఇన్ రిలేషన్) కిందకు రాదని పంజాబ్, హర్యానా హైకోర్టు అభిప్రాయపడింది. కలిసి జీవించే కాలం, ఈ కాలంలో ఇరువురు నెరవేర్చిన బాధ్యతలు, ఒకరికొకరు చేసుకున్న సాయం తదితర అనేక అంశాలను బట్టి సహజీవనాన్ని గుర్తించాల్సిఉంటుందని జస్టిస్ మనోజ్ బజాజ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా స్త్రీ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఒక జంట పెట్టుకున్న అభ్యర్ధనను కొట్టివేసింది. దీంతో పాటు సదరు జంటకు రూ. 25వేల జరిమానా విధించింది. చదవండి: ఎమ్మెల్యే ‘అత్యాచార’ కామెంట్లు.. తీవ్ర దుమారం -
చదువుల తల్లికి కోర్టు అండ.. అడ్మిషన్ ఫీజు అందించిన వైనం
లక్నో: ప్రతిష్టాత్మక ఐఐటీ బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్యూ)కి అర్హత సాధించినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా అడ్మిషన్ కోల్పోతున్నాను అంటూ దళిత సామాజిక వర్గానికి చెందిన బాలిక సంస్కృతి రంజన్ అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించింది. అయితే ఆమె జేఈఈ ఉమ్మడి పరీక్షలో 92 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, షెడ్యూల్డ్ కులాల విభాగంలో రెండు వేల ర్యాంకును సాధించింది. ఈ మేరకు సంస్కృతి రంజన్ హైకోర్టుకు హాజరై... ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా గణితం, కంప్యూటర్ కోర్సులకు సంబంధించిన ఐదేళ్ల కోర్సు ప్రవేశ రుసుము మొత్తం రూ 15 వేలు చెల్లించలేకపోతున్నాను. నా తండ్రి కిడ్ని వ్యాధి కారణంగా మా కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతోంది’’ అని తెలిపింది. (చదవండి: జపాన్లో తొలి ఒమిక్రాన్ కేసు..!!) అంతేకాక ‘‘నేను నా పరిస్థితిని వివరిస్తూ..అడ్మిషన్ గడువు తేదిని పొడిగించండి అంటూ జాయింట్ సీట్ల కేటాయింపు అథారిటీకి చాలాసార్లు లేఖ రాసినప్పటికీ వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అందువల్ల నన్ను కాలేజీలో చేర్చుకునేలా విశ్వవిద్యాలయానికి, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సీట్ల కేటాయింపు సంస్థకు ధర్మాసనం ఆదేశాలు ఇవ్వాలి" అని పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన దినేష్ కుమార్ సింగ్తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ యూనివర్సిటిలో మూడు రోజుల్లో రిపోర్టు చేయాల్సిందిగా పిటిషన్లో కోరింది. అయితే ధర్మాసనం ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితిని గుర్తించడమేకాక తన తండ్రి ఆరోగ్య దృష్ట్యా కిడ్ని మార్పిడి చేయించుకోమని సలహా సూచించింది. ఈ క్రమంలో న్యాయమూర్తి దినేశ్సింగ్ మాట్లాడుతూ..."అంతేకాదు మేము ఈ కేసుకి సంబంధించిన వాస్తవాలను పరిగణలోనికి తీసుకుని డబ్బుని అందజేస్తాం. పైగా ఒక దళిత యువతి ఐఐటీలో ప్రవేశం పొందాలనే తన కలను సాకారం చేసుకునేందుకు తనకు న్యాయం చేయమని కోరుతూ ఈ కోర్టు ముందుకి వచ్చింది. అందువల్లే ఈ కోర్టు స్వయంగా సీటు కేటాయింపు కోసం రూ. 15,000 విరాళంగా ఇస్తోంది." అని న్యాయమూర్తి దినేశ్ సింగ్ అన్నారు. (చదవండి: బాప్రే!... రెండు తలలు ఉన్న బల్లిని చూశారా!!) -
జైలుకు పంపించాలా?.. బీడీఏ, బీబీఎంపీపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, బనశంకరి(కర్ణాటక): బెంగళూరులో పార్కులు, మైదానాల్లో అక్రమ కట్టడాల నిర్మాణాల గురించి సర్వే నివేదిక అందజేయకపోవడంపై బీడీఏ, బీబీఎంపీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకరిద్దరిని జైలుకు పంపిస్తేగాని పరిస్థితి మారదని హెచ్చరించింది. న్యాయసేవల సమితి వేసిన పిటిషన్ను మంగళవారం విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్తి.. కోర్టు ఆదేశాలను సంస్థలు పట్టించుకోవడం లేదని అన్నారు. బీబీఎంపీ కమిషనర్ను జైలుకు పంపిస్తామన్నారు. పార్కులు, మైదానాల్లో అక్రమ కట్టడాల నిర్మాణాలను సహించేదిలేదు, పెద్దవాళ్లపై చర్యలు తీసుకోవడానికి మీరు వెనుకాడవచ్చు కానీ మేము భయపడబోం. తక్షణం చర్యలు తీసుకోకపోతే అదికారులకు ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. సర్వే నివేదిక అందజేయడానికి మరో వారం గడువు ఇవ్వాలని బీబీఎంపీ వకీలు కోరారు. సుప్రీంలో పాలికె ఎన్నికల కేసు బీబీఎంపీ ఎన్నికల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. బీబీఎంపీ ఎన్నికలు జరపాలని మాజీ కార్పొరేటర్లు శివరాజు, అబ్దుల్ వాజిద్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. గతంలో రెండునెలల్లోగా ఎన్నికలు జరపాలని హైకోర్టు అదేశించగా, ప్రభుత్వం ఇప్పట్లో నిర్వహించలేమని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల విషయమై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వివరాలను ఒక నెలలోగా అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
ఏడుగురు జడ్జిల నియామకానికి ఓకే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తుల నియామకంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జ్యుడీషియల్ అధికారులు పెరుగు శ్రీసుధ, చిళ్లకూర్ సుమలత, గురిజాల రాధారాణి, మున్నూరి లక్ష్మణ్, నూన్సావత్ తుకారాంజీ, అద్దుల వెంకటేశ్వరరెడ్డి, ఐటీఏటీ సభ్యురాలు పటోళ్ల మాధవిదేవిలకు పదోన్నతి కల్పిస్తూ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం సీజే కాకుండా పది మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఈ ఏడుగురి నియామకంతో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 17కు చేరనుంది. కొత్తగా నియమితులైన నలుగురు మహిళా న్యాయమూర్తులతో మొత్తం మహిళా జడ్జిల సంఖ్య 5కు చేరింది. హైకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 5కు చేరడం ఇదే తొలిసారి. పోస్టుల సంఖ్య పెంచాక.. తెలంగాణ హైకోర్టులో జడ్జి పోస్టుల సంఖ్య 24గా ఉండేది. ఇటీవలే పోస్టుల సంఖ్యను 42కి పెంచారు. ప్రస్తుతం కేవలం 10 మంది న్యాయమూర్తులే ఉండగా.. మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజా నియామకంతో న్యాయమూర్తుల సంఖ్య 17కు చేరింది. జిల్లా జడ్జిల నుంచి సీనియారిటీ ఆధారంగా హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. కానీ, చాలా ఏళ్లుగా పదోన్నతులు ఇవ్వలేదు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పడ్డాక ప్రతిపాదన వచ్చినా అమల్లోకి రాలేదు. తాజాగా జడ్జి పోస్టుల సంఖ్యను పెంచిన నేపథ్యంలో పదోన్నతులతో కొత్త నియామకాలు చేపట్టారు. న్యాయవాదుల నుంచి కూడా న్యాయమూర్తులుగా ఎంపిక చేయాల్సి ఉన్నట్లు సమాచారం. ఇదిలాఉండగా, ప్రస్తుతం హైకోర్టులో 2.32 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. కొత్త జడ్జిలు బాధ్యతలు స్వీకరించిన తరువాత కేసుల విచారణ వేగం పెరగనుంది. కొత్త న్యాయమూర్తులు వీరే.. పి.శ్రీసుధ: 1967, జూన్ 6న జన్మించారు. తొలుత నిజామాబాద్ అదనపు జిల్లా జడ్జిగా 2002లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. వివిధ స్థాయిలో పనిచేసిన ఆమె ప్రస్తుతం కో–ఆపరేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్గా ఉన్నారు. డాక్టర్ సి.సుమలత: 1972, ఫిబ్రవరి 5న నెల్లూరు జిల్లాలో జన్మించారు. 2006లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా ఉన్నారు. డాక్టర్ జి.రాధారాణి: 1963, జూన్ 29న జన్మించారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా చీఫ్ జడ్జిగా ఉన్నారు. ఎం.లక్ష్మణ్: వికారాబాద్ జిల్లాకు చెందిన ఈయన 1965, డిసెంబర్ 24న జన్మించారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తు తం లేబర్ కోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఎన్.తుకారాంజీ: 1973, ఫిబ్రవరి 24న జన్మిం చారు. 2007లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యా రు. ప్రస్తుతం హైదరాబాద్ క్రిమినల్ కోర్టుల మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా ఉన్నారు. ఎ.వెంకటేశ్వర్రెడ్డి: 1961, ఏప్రిల్ 1న జన్మించారు. 1994లో జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం సిటీ సివిల్ ఆవరణలోని స్మాల్ కాజెస్ చీఫ్ జడ్జిగా పనిచేస్తున్నారు. పి.మాధవిదేవి: ఆదాయ పన్నుశాఖ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) జ్యుడిషియల్ సభ్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. -
15 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ
సాక్షి, న్యూఢిల్లీ: పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిలహరిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేస్తూ మంగళవారం కేంద్రం ఉత్తర్వులిచ్చింది. వీరితో కలిపి దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులకు చెందిన 15 మంది న్యాయమూర్తుల బదిలీకి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు గత నెల 16న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మామిడన్న సత్యరత్న శ్రీ రామచంద్రరావును పంజాబ్, హరియాణాల హైకోర్టుకు బదిలీ చేశారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. -
ప్రశాంతంగా జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలు
పెదగంట్యాడ (గాజువాక)/విజయవాడ రూరల్/గుంటూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆధ్వర్యంలో నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జి రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. గాజువాకలోని బీసీ రోడ్డులో ఉన్న ఎస్వీఎస్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్లో మొత్తం 140 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 110 మంది హాజరయ్యారు. 30 మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్ష కేంద్రాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ పరిశీలించి, అక్కడి ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో ఉన్న వికాస్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్కుమార్ పరిశీలించారు. పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి వెళ్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావు తదితరులు ఆయనతో పాటు జిల్లా జడ్జి జి.రామకృష్ణ ఉన్నారు. ఈ కేంద్రంలో మొత్తం 50 మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 39 మంది మాత్రమే పరీక్ష రాశారని వికాస్ కళాశాలల చైర్మన్ నరెడ్ల నర్సిరెడ్డి తెలిపారు. అలాగే, గుంటూరు రూరల్ మండలం చల్లావారిపాలెంలోని బాలాజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బి బ్లాక్లో, వట్టిచెరుకూరు మండలం మలినేని ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పరీక్ష కేంద్రాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావు పరిశీలించారు. ఆయన వెంట రిజిస్ట్రార్ ఆలపాటి గిరిధర్, జిల్లా జడ్జి రవీంద్రబాబు ఉన్నారు. -
సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులపై కేంద్రం మౌనం
న్యూఢిల్లీ: హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో జడ్జీల నియామకం కోసం సుప్రీంకోర్టు కొలీజియం 68 మంది జ్యుడీషియల్ అధికారులు, న్యాయవాదుల పేర్లను సిఫారసు చేయగా, కేంద్రం ఇంకా స్పందించలేదని తెలిసింది. ఈ ఏడాది ఆగస్టు 8 నుంచి సెపె్టంబర్ 1 దాకా వివిధ హైకోర్టులు సిఫారసు చేసిన 100కు పైగా జ్యుడీషియల్ అధికారులు, అడ్వొకేట్ల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం పరిశీలించింది. ఇందులో నుంచి 12 హైకోర్టుల్లో జడ్జీల నియామకం కోసం చివరకు 68 పేర్లను ఎంపిక చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసిన ఈ 68 పేర్లపై కేంద్రం ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ 68 పేర్లలో కర్ణాటక నుంచి ఇద్దరి పేర్లను, జమ్మూకశ్మీర్ నుంచి ఒకరి పేరును కొలీజియం మూడోసారి కేంద్రానికి పంపడం గమనార్హం. మరో 10 మంది పేర్లను రెండోసారి సిఫారసు చేసింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా నియమించాలంటూ ఆగస్టు 17న కొలీజియం ముగ్గురు మహిళలతో సహా మొత్తం 9 పేర్లను కేంద్రానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర సర్కారు వేగంగా నిర్ణయం తీసుకుంది. సానుకూలంగా స్పందించింది. సుప్రీం చరిత్రలోనే తొలిసారిగా ఒకేరోజు 9 మంది ఆగస్టు 31న సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణం చేశారు. మొత్తం 25 హైకోర్టుల్లో మంజూరైన జడ్జీ పోస్టులు 1,098 కాగా. కేంద్ర న్యాయ శాఖ సమాచారం ప్రకారం.. సెపె్టంబర్ 1వ తేదీ నాటికి 465 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
అన్నీ పరిశీలించాకే జడ్జీల నియామకం
సాక్షి, న్యూఢిల్లీ: అనుభవం, అర్హత, ప్రభుత్వం నుంచి సేకరించిన వివరాలు ఇలా అన్నింటినీ పరిశీలించాకే హైకోర్టు న్యాయమూర్తుల నియామకం జరుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకం నిర్దిష్ట ప్రక్రియ మేరకు జరుగుతుందని, హైకోర్టు కొలీజియం అన్ని వివరాలు పరిశీలించాకే సిఫారసు చేస్తుందని పేర్కొంది. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వర్రెడ్డిని న్యాయమూర్తిగా నియమించాలన్న ప్రతిపాదనను సవాల్ చేస్తూ బి.శైలేష్ సక్సేనా అనే న్యాయవాది దాఖలు చేసిన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ జస్టిస్ సంజయ్ కిషన్కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్లతో కూడిన ధర్మాసనం సక్సేనాకు రూ.5 లక్షల జరిమానా విధించింది. చట్టపరమైన ప్రక్రియ దుర్వినియోగం గత ఆగస్టు 17న సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం... తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ వెంకటేశ్వర్రెడ్డి సహా ఆరుగురు న్యాయమూర్తుల నియామకంపై హైకోర్టు కొలీజియం చేసిన సిఫారసును ఆమోదించిన విషయం విదితమే. కాగా న్యాయమూర్తిగా వెంకటేశ్వర్రెడ్డిని నియమించాలన్న ప్రతిపాదనకు సంబంధించి కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం, హైకోర్టు రిజిస్ట్రార్ (నిఘా, పాలన)లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటూ సక్సేనా 2020లో ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సక్సేనా పిటిషన్ను సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది. ‘ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ వెంకటేశ్వర్రెడ్డిపై పిటిషనర్ పలు ఆరోపణలు చేశారు. అయితే పిటిషనర్పై పలు ఫిర్యాదులు ఉన్నాయనే అంశాన్ని మేం పరిగణనలోకి తీసుకున్నాం. ఈ మేరకు నాడు రిజిస్ట్రార్ జనరల్గా ఉన్న జస్టిస్ వెంకటేశ్వర్రెడ్డి చేసిన ఫిర్యాదుతో హైకోర్టు ఏకీభవించింది. ఈ నేపథ్యంలో చట్టపరమైన ప్రక్రియను పిటిషనర్ దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించాం. సుప్రీంకోర్టు అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ వెల్ఫేర్ ఫండ్కు నాలుగు వారాల్లోగా రూ.5 లక్షలు జమ చేయాలని ఆదేశిస్తూ రిటి పిటిషన్ కొట్టేస్తున్నాం..’అని ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొంది. -
హైకోర్టు జడ్జిలుగా 68 మంది పేర్లు
-
హైకోర్టు జడ్జిలుగా 68 మంది పేర్లు
న్యూఢిల్లీ: వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా 68మంది పేర్లను సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసింది. ఆగస్టు25, సెపె్టంబర్1న జరిపిన సమావేశాల్లో సీజేఐ జస్టిస్ రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కొలిజియం 112మంది పేర్లను పదోన్నతి కోసం పరిశీలించింది. ఇందులో 82మంది బార్కు చెందినవారు కాగా, 31మంది జ్యుడిషియల్ సర్వీసెస్కు చెందినవారు. వీరిలోనుంచి 68మంది పేర్లను 12 హైకోర్టులకు కొలిజియం రికమండ్ చేసింది. వీరిలో 44మంది బార్కు, 24 మంది జ్యుడిషియల్ సర్వీసెస్కు చెందినవారు. ఈ దఫా సిఫార్సుల్లో కూడా కొలిజియం చరిత్ర సృష్టించింది. తొలిసారి మిజోరాం నుంచి హైకోర్టు జడ్జి పదవికి ఒకరిని ఎంపిక చేసింది. మిజోరాంకు చెందిన ఎస్టీ జ్యుడిషియల్ అధికారి మర్లి వాంకుంగ్ను గౌహతి హైకోర్టుకు జడ్జిగా కొలిజియం రికమండ్ చేసింది. అలాగే సిఫార్సు చేసిన 68మందిలో 10మంది మహిళలున్నారు. ప్రస్తుతం సిఫార్సు చేసిన జడ్జిలను అలహాబాద్, రాజస్తాన్, కలకత్తా, జార్ఖండ్, జమ్ము కాశ్మీర్, మద్రాస్, మధ్యప్రదేశ్, కర్నాటక, పంజాబ్ అండ్ హర్యానా, కేరళ, చత్తీస్గఢ్, అస్సాం హైకోర్టుల్లో నియమిస్తారు. ఇటీవలే కొలిజయం ఏడుగురు జడ్జిలను తెలంగాణ హైకోర్టుకు, 9మందిని సుప్రీంకోర్టుకు రికమండ్ చేసింది. వీరందరితో ఒకేరోజు సీజేఐ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో సుప్రీంలో జడ్జిల సంఖ్య 33కు చేరింది. -
హైకోర్టు జడ్జీలుగా సుప్రీం కొలీజియం నుంచి 80 పేర్లు
న్యూఢిల్లీ: గత సంవత్సర కాలంలో వేర్వేరు హైకోర్టుల్లో జడ్జీలుగా నియమాకానికి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం 80 మంది పేర్లను కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిందని న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు గురువారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ పేర్లలో 45 మందిని జడ్జీలుగా నియమించడం పూర్తయిందని మంత్రి పేర్కొన్నారు. మిగతా వారి నియామకానికి సంబంధించిన ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొలీజియంల వద్ద వేర్వేరు దశల్లో కొనసాగుతోందని చెప్పారు. దేశవ్యాప్తంగా 25 హైకోర్టుల్లో 1,098 మంది జడ్జీల నియామకానికి అనుమతి ఉండగా ప్రస్తుతం 645 మంది జడ్జీలు విధుల్లో ఉన్నారు. 453 జడ్జీ పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ► 2020 ఏడాదిలో సివిల్స్ పరీక్షను రాయలేకపోయిన వారికి మరో అవకాశం ఇచ్చే ప్రతిపాదన ఏదీ తమ వద్ద పరిశీలనలో లేదని సిబ్బంది శిక్షణ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రూ.5 లక్షల జరిమానా
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టు బుధవారం రూ. 5 లక్షల జరిమానా విధించింది. బెంగాల్ ఎన్నికల సందర్భంగా కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కౌషిక్ చందాకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తూ మమత గతంలో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఆ పిటిషన్ను తోసిపుచ్చుతూ న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించారంటూ కోర్టు మమతకు జరిమానా విధించింది. కాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి దాఖలు చేసిన దరఖాస్తును జస్టిస్ కౌషిక్ చందా స్వయంగా తిరస్కరించారు. ఈ కేసును తన వ్యక్తిగత అభీష్టానుసారం విచారించకూడదని నిర్ణయించుకున్నారు. ఈ కేసును తన బెంచ్ నుంచి తొలగించారు. -
తలకు గన్నుపెట్టి భూమి పత్రాలను రాయించుకున్న ఎస్సై..
సాక్షి, హైదరాబాద్(భద్రాద్రి కొత్తగూడెం): ఓ సివిల్ వివాదంలో జోక్యం చేసుకొని గిరిజనులను పోలీస్స్టేషన్లో నిర్బంధించి తీవ్ర బెదిరింపులకు గురిచేసిన ములకలపల్లి ఎస్సైపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సివిల్ వివాదమని ఎస్పీకి ఎస్సై ఒక వైపు నివేదిక ఇస్తూ.. మరోవైపు చట్టవిరుద్ధంగా పిటిషనర్ భర్త, మామలను ఎలా నిర్బంధించారని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, భద్రాద్రి ఎస్పీలను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తన భర్త, మామలను ములకలపల్లి ఎస్సై వేధింపులకు గురిచేశాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ముల్కలపల్లి మండలం వేముగుంటకు చెందిన కొండూరు ఈశ్వరమ్మ గవర్నర్కు వినతిపత్రం సమర్పించింది. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ హైకోర్టుకు రాసిన లేఖను ధర్మాసనం గతంలో విచారణకు స్వీకరించింది. సీనియర్ న్యాయవాది డి.ప్రకాష్రెడ్డిని కోర్టు సహాయకారిగా (అమికస్క్యూరే) నియమించింది. ఈ పిటిషన్ మరోసారి విచారణకు వచ్చింది. ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు పిటిషనర్ భర్త, మామలను పోలీస్స్టేషన్లో నిర్బంధించారని, పోలీసులు చెబుతున్న సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయని ప్రకాష్రెడ్డి నివేదించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయలేదని తెలిపారు. తమకు వచ్చిన ఫిర్యాదుపై విచారణలో భాగంగా వారిని స్టేషన్కు పిలిపించారని, ఎస్సై ఎవరినీ బెదిరించలేదని హోంశాఖ తరఫున న్యాయవాది శ్రీకాంత్రెడ్డి నివేదించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది. ఈశ్వరమ్మ ఏం రాసిందంటే... ‘వేముగంటలో మాకు 6 ఎకరాల భూమి ఉంది. పాల్వంచ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ముందు దాఖలు చేసిన కేసులో తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది. అయినా మా ప్రత్యర్థులకు అనుకూలంగా ములకలపల్లి ఎస్సై నా భర్త, మామలను పోలీస్స్టేషన్కు పిలిపించి ఉదయం నుంచి రాత్రి వరకు నిర్బంధించారు. అన్ని రెవెన్యూ రికార్డులు, కోర్టు తీర్పులను చూపించినా ప్రత్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారు. తలకు గన్ను గురిపెట్టి ఆ భూమిపై హక్కులను వదులుకుంటున్నట్లు కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకున్నారు. ఆ భూమిలోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించారు. తమ ప్రత్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. సివిల్ వివాదంలో జోక్యం చేసుకొని అక్రమంగా తన భర్త, మామను నిర్బంధించి వేధింపులకు గురిచేసిన ఎస్సైపై చర్యలు తీసుకోండి’అని ఈశ్వరమ్మ గవర్నర్కు రాసిన లేఖలో కోరింది. చదవండి: నేషనల్ డాక్టర్స్ డే: థ్యాంక్యూ డాక్టర్ గారూ.. -
హైకోర్టు జడ్జిలకు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ లేఖ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మంగళవారం హైకోర్టు జడ్జిలకు లేఖ రాశారు. హైకోర్టు జడ్జి పోస్టుల భర్తీలో సుప్రీంకోర్టు ప్రాక్టీసింగ్ లాయర్లను.. పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోరారు. సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న లాయర్ల అనుభవాన్ని, నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని చీఫ్ జస్టిస్ రమణ.. హైకోర్టు జడ్జిలకు రాసిన లేఖలో కోరారు. హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకం కోసం సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సీజేఐకి ఇటీవల రాసిన లేఖను అనుసరించి ఈ చర్య తీసుకున్నట్లు ఎస్సీబీఏ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ తెలిపారు. ‘‘ఎస్సీబీఏ చేసిన అభ్యర్థనను సీజేఐ అంగీకరించారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులను తమ హైకోర్టులకు ఎలివేషన్ కోసం పరిగణించాలని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను అభ్యర్థించింది" అని సింగ్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. చదవండి: సుప్రీం తీర్పుల్లో వెలుగు నీడలు! -
హైకోర్టు జడ్డి మీదకు చెప్పులు...18 నెలల జైలు శిక్ష
అహ్మదాబాద్: 9 ఏళ్లుగా తన కేసును పెండింగ్లో పెడుతున్నారనే కోపంతో ఒక వ్యక్తి తీర్పు చెప్పే హైకోర్టు జడ్జిపైకి చెప్పులు విసిరాడు. దీనికి ప్రతిఫలంగా సదరు వ్యక్తి 18 నెలల జైలు శిక్ష అనుభవించనున్నాడు. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్ హైకోర్టులో చోటుచేసుకుంది.వివరాలు.. అహ్మదాబాద్కు చెందిన బావాజీ అనే వ్యక్తి భయావదర్ మున్సిపాలిటీలో పరిధిలో రోడ్డుపై టీస్టాల్ నడుపుకునేవాడు. అయితే 2012లో రోడ్డు విస్తరణలో భాగంగా బావాజీని టీస్టాల్ను తీసేయాలంటూ మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై బావాజీ గోండల్ సెషన్స్ కోర్టు నుంచి టీస్టాల్ పడగొట్టకుండా స్టే ఆర్డర్ను తెచ్చుకున్నాడు. దీంతో భయావదర్ మున్సిపాలిటీ అధికారులు బావాజీ స్టే ఆర్డర్పై అహ్మదాబాద్ హైకోర్టుకు అప్పీల్ చేసింది. కాగా హైకోర్టు బావాజీ స్టే ఆర్డర్ను రద్దు చేసి అతని టీస్టాల్ను తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు బావాజీ టీ స్టాల్ను తొలగించారు. తనకు ఆదాయం వచ్చేదానిని కోల్పోయిన అతను మానసికంగా దెబ్బతిన్నాడు. అప్పటినుంచి తనకు న్యాయం జరగాలంటూ తెలిసినవారి నుంచి అప్పులు తీసుకుంటూ హైకోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. తాజాగా మరోసారి కోర్టుకు వచ్చిన బావాజీ.. 9 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నా కనీసం తన కేసును హియరింగ్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. జడ్డి స్థానంలో ఉన్న మిర్జాపూర్ గ్రామీణ కోర్టు చీఫ్ జ్యుడిషీయల్ మెజిస్ట్రేట్ వి.ఏ ధాదళ్పై చెప్పులు విసిరాడు. ఈ పరిణామాన్ని ఊహించని జడ్డి షాక్కు గురయ్యాడు.. కానీ అదృష్టవశాత్తు ఆ చెప్పులు ఆయనకు తగల్లేదు. అక్కడే ఉన్న పోలీసులు బావాజీని అదుపులోకి తీసుకున్నారు. భారతీయ శిక్షా స్మృతి కింద సెక్షన్ 353 ప్రకారం ప్రభుత్వ విధుల్లో ఉన్న వ్యక్తిపై ఉద్దేశపూర్వకంగా దాడికి దిగినందుకుగాను అతనికి 18 నెలల జైలు శిక్షను విధిస్తున్నట్లు తీర్పు చెప్పారు. ఇది సాధారణ శిక్ష మాత్రమే అని.. శిక్షాకాలంలో సత్ఫప్రవర్తనతో మెలిగితే విడుదల చేసే నిబంధన అతనికి వర్తింస్తుందని తీర్పునిచ్చారు. కాగా ప్రస్తుతం బావాజీని సోలా పోలీస్ స్టేషన్కు తరలించారు. చదవండి: జైలుకెళ్లడం కోసం ప్రధాని మోదీకి బెదిరింపు కాల్ చేశాడట..! -
సుప్రీం, హైకోర్టుల్లో ఖాళీగా జడ్జీ పోస్టులు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేసేందుకు గాను కొలీజియం సిఫారసుల కోసం ఎదురు చూస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టులో 7 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉండగా, రెండు హైకోర్టులు శాశ్వత ప్రధాన న్యాయమూర్తులు లేకుండానే నడుస్తున్నాయని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్లో ఇద్దరు ఒకటిన్నర నెలల్లో రిటైర్ కానున్నారని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అవసరమైన సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోందని వివరించారు. జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తు(సీజేఐ)లుగా రిటైర్ కాగా, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ భానుమతి, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందూ మల్హోత్రా పదవీ విరమణ చేశారు. మరో న్యాయమూర్తి ఎం.శంతను గౌడర్ గత నెలలో కన్నుమూశారని ఆయన తెలిపారు. దీంతో సుప్రీంకోర్టులో 34 జడ్జీలకుగాను ప్రస్తుతం 27 మందే ఉన్నారని చెప్పారు. కోల్కతా, అలహాబాద్ హైకోర్టులు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులతోనే నడుస్తున్నాయన్నారు. దేశంలోని 25 హైకోర్టుల్లో కలిపి 1,080 జడ్జీలకు గాను ప్రస్తుతం 660 మంది ఉన్నారని చెప్పారు. పదోన్నతులు, రాజీనామాలు, పదవీ విరమణల కారణంగా జడ్జీల పోస్టుల్లో ఖాళీలు పెరుగుతున్నాయని తెలిపారు. హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకం కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య నిరంతరం సహకార ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం.. సుప్రీంకోర్టు జడ్జీలు, 25 హైకోర్టు జడ్జీల నియామకానికి సంబంధించిన పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తుంది. వాటిని పరిశీలించాక కేంద్రం ఆ సిఫారసులకు ఆమోదం తెలపవచ్చు లేదా పునఃపరిశీలనకు తిప్పి పంపవచ్చు. హైకోర్టులో జడ్జీల ఖాళీలపై హైకోర్టు కొలీజియం తన సిఫారసులను ముందుగా న్యాయ శాఖకు అందజేస్తుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలను వాటికి జత చేసి, ఆ సిఫారసులను న్యాయశాఖ తిరిగి సుప్రీం కోలీజియంకు పంపిస్తుంది. సీజేఐతోపాటు నలుగురు అత్యంత సీనియర్ జడ్జీలు సుప్రీంకోర్టు కొలీజియంలో ఉంటారు. ఇక్కడ చదవండి: 2-డీజీ మొత్తం ప్రపంచాన్ని కాపాడుతుంది: కేంద్ర ఆరోగ్య మంత్రి Ambulance Couple: పెళ్లి బహుమతిగా అంబులెన్స్! -
ముఫ్తీ పాస్పోర్ట్పై ఆదేశాలివ్వలేం
శ్రీనగర్: తనకు పాస్పోర్ట్ను జారీ చేయాలని అధికారులను ఆదేశించా లన్న జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ విజ్ఞప్తిని జమ్మూకశ్మీర్ హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. మెహబూబా ముఫ్తీకి పాస్పోరŠుట్ట జారీ చేయకూడదని పోలీస్ వెరిఫికేషన్ నివేదిక సిఫారసు చేసినందువల్ల పాస్పోర్ట్ అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారని న్యాయమూర్తి జస్టిస్ అలీ మొహమ్మద్ మాగ్రే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాస్పోర్ట్ను జారీ చేయాలని తాను ఆదేశించలేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో కోర్టు జోక్యం చేసు కునేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేద న్నారు. ‘పోలీస్ వెరిఫికేషన్ నివేదిక వ్యతిరేకం గా వచ్చినందున మీకు పాస్పోర్ట్ జారీ చేయలేమ’ని రీజనల్ పాస్పోర్ట్ అధికారి మార్చి 26న మెహ బూబా ముఫ్తీకి లేఖ రాశారు. దీనిపై ముఫ్తీ స్పం దిస్తూ.. ‘కశ్మీర్లో నెలకొందని చెబుతున్న సాధారణ స్థితికి ఇదే ఉదాహరణ’ అని వ్యాఖ్యానించారు. ‘నాకు పాస్పోర్ట్ జారీ చేయడం భారతదేశ భద్ర తకు ప్రమాదకరమని సీఐడీ నివేదిక ఇచ్చిందని చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రికి పాస్పోర్ట్ ఉండటం దేశ సార్వభౌమత్వానికి భంగకరమట’ అని ఆమె ట్వీట్ చేశారు. -
దేశవ్యాప్తంగా హైకోర్టు జడ్జీల ఖాళీలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో నలుగురు న్యాయమూర్తుల స్థానాలు ఖాళీగా ఉన్నాయని, కొత్తగా హైకోర్టు న్యాయమూర్తులను నియమించాలని కొన్ని నెలల క్రితం హైకోర్టులు చేసిన సిఫారసులపై సుప్రీంకోర్టు కొలీజియం ఇంకా తుది తీర్పునివ్వలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంలోని 25 హైకోర్టులలో మొత్తం 1,079 మంది న్యాయమూర్తులుండాల్సి ఉంటుంది. జనవరి 1వ తేదీ నాటికి 411 ఖాళీలున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల విషయంలో సుప్రీంకోర్టు కోలీజియం నుంచి న్యాయమంత్రిత్వ శాఖకు ఇంకా సిఫర్సులు అందలేదన్నారు. 2019 నవంబర్లో భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవీ విరమణ అనంతరం సుప్రీంకోర్టులో మొదటి ఖాళీ ఏర్పడిదని, ఆ తరువాత వరుసగా జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఆరుణ్ మిశ్రాల పదవీ విరమణలతో స్థానాలు ఖాళీలు ఏర్పడ్డాయన్నారు. మొత్తం 34 మందిని నియమించగా, ప్రస్తుతం 30 మందితో కోర్టు నడుస్తోంది. సుప్రీంకోర్టు లోని ఈ ఖాళీలను భర్తీ చేయడానికి కొలీజియం నుంచి ఇంత వరకు ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు రాలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. న్యాయమూర్తుల పదవీ విరమణ, రాజీనామా లేదా, పదోన్నతుల కారణంగా ఇటువంటి ఖాళీలు ఏర్పడతాయి. హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకం అనేది, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య నిరంతర ప్రక్రియ. దీనికి వివిధ రాజ్యాంగ అధికారుల నుంచి ఆమోదం అవసరమౌతుంది. 25 హైకోర్టులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి, సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదనలు చేస్తుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి, అవసరమైతే అంగీకరిస్తుంది. లేదా పునః పరిశీలిస్తుంది. హైకోర్టు కొలీజియం మొదట తమ సిఫార్సులను న్యాయమంత్రిత్వ శాఖకు పంపుతుంది. ఐబి నివేదికను వాటికి జతచేస్తుంది. దీన్ని సుప్రీంకోర్టు కొలీజియంకి పంపిస్తారు. ఈ కొలీజియం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్ న్యాయవాదులను ప్రతిపాదిస్తుంది. అయితే 23 మంది అభ్యర్థులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని పలుహైకోర్టు కొలీజియంలు చేసిన సిఫార్సులపై సుప్రీంకోర్టు కొలీజియం ఇంకా నిర్ణయం తీసులకోలేదని భావిస్తున్నారు. హైకోర్టుల ప్రతిపాదనలు నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయని వారు ఆరోపించారు. ఒక అభ్యర్థి ప్రతిపాదన దాదాపు మూడేళ్ళుగా ఉన్నత న్యాయస్థానం కొలీజియంలో పెండింగ్లో ఉంది. మరికొన్ని ప్రతిపాదనలు దాదాపు రెండేళ్ళుగా పెండింగ్లో ఉన్నాయని తెలుస్తోంది. మరో 47 రికమండేషన్స్ సుప్రీంకోర్టు కొలీజియంలో పెండింగ్లో ఉన్నాయన్నారు. దేశంలోని 25 హైకోర్టులలో మొత్తం 1,079 మంది న్యాయమూర్తులుండాల్సి ఉంటుంది. జనవరి 1వ తేదీనాటికి 411 ఖాళీలున్నాయి. ఇందులో అత్యధికంగా 64 మంది అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తుల నియమాకాలే పెండింగ్లో ఉన్నాయి. కొలీజియం సిఫార్సులను బట్టి ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి పేర్లను ఖరారు చేయడంలో కేంద్రం వైపు నుంచి జరిగిన ఆలస్యంపై బుధవారం సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశమని అభిప్రాయపడింది. కొన్ని కేసుల్లో కేంద్రం కొలీజియం సూచనలపై ప్రతిస్పందించేందుకు కేంద్రం ఏడాదికి పైగా సమయం తీసుకుందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. -
హైకోర్టు జడ్జి కారుపై ఆయిల్ పోసి నిరసన
తిరువనంతపురం: కోర్టులో విచారణ ఆలస్యమవడం.. తీర్పు ఎంతకీ రాకపోవడంతో ఓ యువకుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా జడ్జి కారుపై ఆయిల్ వేసిన ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. హైకోర్టుకు వచ్చిన న్యాయమూర్తి కారుపై తీవ్ర నిరసనతో ఆయిల్ పోయడంతో తెల్లటి కారు నల్లగా మారింది. ఈ ఘటనతో వెంటనే అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. రెండేళ్ల కిందట ఇంటి నుంచి తప్పిపోయిన జస్నా మరియా అదృశ్యం కేసు హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే ఈ తీర్పు రోజురోజుకు ఆలస్యమవుతూ రెండేళ్లు గడవడంతో కొట్టాయం ప్రాంతానికి చెందిన ఓ యువకుడు విసుగుచెందాడు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి శిర్సి కారుపై వాహనాలకు వినియోగించే ఆయిల్ చల్లాడు. ఈ ఘటనతో షాక్కు గురయిన తోటి న్యాయమూర్తులు, న్యాయవాదులు వెంటనే అతడిని పట్టుకోవాలని ఆదేశించడంతో భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంది. జడ్జి సెక్యూరిటీ ఆఫీసర్ నిందితుడిని పట్టుకుని సెంట్రల్ పోలీసులకు అప్పగించాడు. అయితే ఆ యువకుడు జస్నా కేసును త్వరగా తేల్చాలంటూ కొన్ని రోజులుగా హైకోర్టు ముందు నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఆ నిరసనలో భాగంగా ఉదయం జడ్జి శిర్సి కారు హైకోర్టు గేటు లోపలికి వస్తుండగా కారుపై ఆయిల్ గుప్పాడు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. -
ఇద్దరు మహిళా జడ్జీల కాల్చివేత
కాబూల్: అఫ్గానిస్తాన్లో దారుణం చోటుచేసుకుంది. సాయుధుడైన ఓ వ్యక్తి దేశ రాజధాని కాబూల్లోని హైకోర్టులో పని చేస్తున్న ఇద్దరు మహిళా జడ్జీలను ఆదివారం కాల్చి చంపాడు. జడ్జీలిద్దరూ కారులో ప్రయాణిస్తుండగా, కాల్పులు జరపడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై అఫ్గానిస్తాన్ సుప్రీంకోర్టు అధికార ప్రతినిధి అహ్మద్ ఫహిమ్ స్పందించారు. మరణించిన ఇద్దరు వ్యక్తులు హైకోర్టులో పనిచేస్తున్నవారేనని ధ్రువీకరించారు. అయితే వారి పేర్లను, ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ ఘటనకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకోలేదు. చదవండి: ప్రపంచంలో పవర్ఫుల్ పాస్పోర్ట్ ఏది? -
నన్ను తప్పుకోమని కోరటం ధిక్కారపూర్వక చర్యే!
సాక్షి,అమరావతి: అనుమానం నిజమైంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులూ వ్యక్తం చేస్తూ వచ్చిన ఆందోళన వాస్తవమేనని తేలింది. రిటైరవటానికి ఒక్క రోజు ముందు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ దొనడి రమేశ్లతో కూడిన ధర్మాసనం అటు సుప్రీంకోర్టుపై, ఇటు ముఖ్యమంత్రిపై, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏ పిటిషనరు కూడా వాదనల్లో లేవనెత్తని అంశాలను, అసలు పిటిషన్లో కూడా లేని అంశాలను... తమ ముందున్న కేసుతో సంబంధం లేని వివరాలను, ఫేక్ వెబ్సైట్లలో, సోషల్ మీడియాలో పొందుపరిచిన పలు అంశాలను ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది. ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేకున్నా సీఎం వైఎస్ జగన్ గురించి అభ్యంతరకరంగా తన తీర్పులో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతేకాక సుప్రీంకోర్టు గురించి, సుప్రీంకోర్టు కొలీజియం గురించి కూడా పలు వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ల బదిలీలను ధర్మాసనం పరోక్షంగా తప్పుపట్టింది. బదిలీ విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం తీరుపై కూడా ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. ధర్మాసనం తన 55 పేజీల్లో ఎక్కువ శాతాన్ని ఈ కేసుతో సంబంధం లేని విషయాల గురించి ప్రస్తావించడానికి కేటాయించింది. ఆ వ్యాఖ్యలు చూసే.. రెక్యూజ్ పిటిషన్ అసలు ఈ కేసు ఏంటంటే... మిషన్ బిల్డ్ ఏపీ కింద ప్రభుత్వ ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు సవాలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిగినపుడల్లా జస్టిస్ రాకేశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. దీంతో ఈ కేసును ఆయన విచారించకూడదని, ఆయనకు ప్రభుత్వంపై ముందే ఒక స్థిరాభిప్రాయం ఉన్నట్టు కనిపిస్తోంది కనక ఆయన విచారిస్తే న్యాయం జరిగే అవకాశం ఉండదని, కేసును వేరే బెంచ్కు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యరి్థంచింది. న్యాయవ్యవస్థ నిష్పాక్షికంగా ఉండటమే కాదు. నిష్పాక్షికంగా ఉన్నట్టు కనిపించాలి కూడా... అనే సూత్రాన్ని అనుసరించి ఇక్కడ అలా కనిపించటం లేదు కనక ఆయన ‘రెక్యూజ్’ కావాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. కానీ ఈ విచారణ నుంచి తప్పుకోవటానికి జస్టిస్ రాకేశ్ కుమార్ నిరాకరించారు. రెక్యూజ్ పిటిషన్పై కూడా తానే విచారణ చేపట్టారు. చివరకు పదవీ విరమణకు ఒక్కరోజు ముందు... రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చుతూ ఉత్తర్వులిచ్చారు. అంతేకాదు!! జస్టిస్ రాకేశ్ కుమార్ను విచారణను నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం తరఫున మిషన్ మిల్డ్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ అభ్యరి్థంచటం కోర్టు ధిక్కార చర్యే అవుతుందని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ అభ్యర్థన హానికరమైనదని, అది ఏ మాత్రం సాధ్యం కానిదని తెలిపింది. ప్రవీణ్ కుమార్ ప్రమాణపూర్వకంగా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ... ఆయన అఫిడవిట్లో పేర్కొన్న అంశాలకు ఏ ఆధారాలూ లేవంది. పెర్జురీ (తప్పుడు ఆఫిడవిట్) కింద ప్రవీణ్కుమార్పై క్రిమినల్ ప్రాసిక్యూషన్కు చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు సంబంధిత కోర్టులో ఫిర్యాదు చేయాలని హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ను ఆదేశించింది. అలాగే కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని ప్రవీణ్కుమార్ను ఆదేశిస్తూ ఆయనకు ఆరు వారాలు గడువిచి్చంది. తదుపరి విచారణను 2021 ఫిబ్రవరి రెండో వారానికి వాయిదా వేసింది. జస్టిస్ రాకేశ్కుమార్ రెక్యూజల్ కోసం ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను తప్పుపట్టిన ధర్మాసనం, ప్రభుత్వం నుంచి ఇలాంటి అభ్యర్థనను ఆశించలేదని తెలిపింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైనా సాధ్యమేనని, ఇలాంటి చర్యలకు న్యాయస్థానాలు భయపడవని వ్యాఖ్యానించింది. అకస్మాత్తుగా తీర్పు వెలువరించిన ధర్మాసనం మిషన్ బిల్డ్ ఏపీ కేసు విచారణకు వచ్చినపుడల్లా జస్టిస్ రాకేశ్కుమార్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందా.. రాష్ట్రంలో ఆర్థిక అత్యాయక పరిస్థితి ఉందా? అన్నారు. దీనిపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాజ్యాలపై మీరు (జస్టిస్ రాకేశ్ కుమార్) విచారణ జరిపితే, మాకు న్యాయం జరిగే పరిస్థితి ఉండదని పేర్కొంటూ... ఆయన విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ ప్రభుత్వం తరఫున ప్రవీణ్కుమార్ రెక్యూజ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రాకేశ్ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జస్టిస్ రాకేశ్ కుమార్, ప్రభుత్వం చెబుతున్న వ్యాఖ్యలను తాను చేయలేదన్నారు. కానీ దీన్ని అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి తోసిపుచ్చారు. ప్రవీణ్కుమార్ స్వయంగా విన్నారని, అలాగే తాను, తన తోటి న్యాయవాదులు కూడా విన్నామని చెప్పారు. అనంతరం ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. నిజానికి బుధవారం నాటి కేసుల విచారణ జాబితాలో ఈ కేసు లేదు. అకస్మాత్తుగా ఈ కేసులో తీర్పును వెలువరిస్తున్నట్లు ధర్మాసనం ఈ కేసుతో సంబంధం ఉన్న న్యాయవాదులకు తెలియజేయటం గమనార్హం. (న్యాయమే నెగ్గుతుంది: సీఎం వైఎస్ జగన్) -
ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఆందోళనకరం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా?.. అనేది తేలుస్తామంటూ ఈ ఏడాది అక్టోబర్ 1న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తమవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ కొందరు హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేస్తే ఆ వ్యాజ్యాల్లో ఓ న్యాయస్థానం ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం ఎప్పుడైనా, ఎక్కడైనా మనం చూశామా? అంటూ విస్మయం వ్యక్తం చేసింది. ఇన్నేళ్ల మీ అనుభవంలో మీరైనా ఇలాంటి ఉత్తర్వులు చూశారా? అంటూ ప్రతివాదుల తరఫు న్యాయవాదిని కూడా ప్రశ్నించింది. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆ న్యాయమూర్తులు భావించడానికి అంతగా ప్రభావితం చేసిన అంశాలేమున్నాయో అంతుబట్టడం లేదని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అన్న అంశాన్ని తేలుస్తామంటూ జస్టిస్ రాకేశ్ కుమార్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై తాజాగా సుప్రీంకోర్టు ‘స్టే’ విధించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ ‘స్టే’ ఉత్తర్వులు అమలులో ఉంటాయని స్పష్టం చేస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ముగిసిన తరువాత దీనిపై తదుపరి విచారణ చేపడతామని ప్రకటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే, న్యాయమూర్తులు ఏఎస్ బొప్పన్న, వి.రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుమోటోగా హైకోర్టు విచారణ.. తమ వారిని పోలీసులు అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని, వారిని కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పలు హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు కావడం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రాకేశ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే అకస్మాత్తుగా ధర్మాసనం రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అన్న అంశంపై తేలుస్తామని, ఆ దిశగా వాదనలు వినిపించాలని ప్రభుత్వ, పోలీసుల తరఫు న్యాయవాదులను ఆదేశిస్తూ అక్టోబర్ 1న ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యాంగం వైఫల్యం చెందినట్లు పిటిషనర్లు ఎవరూ పేర్కొనకున్నా, ఎలాంటి పిటిషన్ దాఖలు చేయకపోయినా కూడా ధర్మాసనం సుమోటోగా విచారణ ప్రారంభించింది. గత కొద్ది వారాలుగా రోజూ వారీ విచారణ ప్రారంభించింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. అయితే అసలు రాజ్యాంగ వైఫల్యంపై విచారణ జరిపే పరిధి హైకోర్టుకు లేదని, అందువల్ల అక్టోబర్ 1న జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రీకాల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రీకాల్ పిటిషన్ను జస్టిస్ రాకేశ్ కుమార్ ఒక్క నిమిషంలోనే కొట్టి వేశారు. కావాలంటే దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి, రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అన్న అంశంపై తేలుస్తామంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ అప్పీల్ దాఖలు చేసింది. రాజ్యాంగ వైఫల్యంపై అధికరణ 356 కింద రాష్ట్రపతి జోక్యం చేసుకోవచ్చే కానీ న్యాయస్థానాలు కాదని రాష్ట్ర ప్రభుత్వం తన అప్పీల్లో పేర్కొంది. ఈ అప్పీల్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతా, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది సర్వ సత్యనారాయణ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. హైకోర్టు ఉత్తర్వులు సబబు కాదు... హైకోర్టు ఆదేశాలు ఏ మాత్రం సబబు కాదని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు నివేదించారు. హెబియస్ కార్పస్ పిటిషన్లలో రాజ్యాంగ వైఫల్యంపై విచారణ జరుపుతామన్న హైకోర్టు ఉత్తర్వులు సహేతుకం కాదన్నారు. ఈ సమయంలో కేసు పూర్వాపరాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అక్టోబర్ 1న హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధిస్తున్నాం.. అని స్పష్టం చేసింది. రెండింటినీ వేర్వేరుగా చూడటం లేదు.. ప్రతివాది తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా (తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతీ కేసులో వాదనలు వినిపిస్తుంటారు) జోక్యం చేసుకుంటూ 14 హెబియస్ కార్పస్ పిటిషన్లను హైకోర్టు విచారించిందని, ఆ సందర్భంగా రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అన్న అంశంపై కూడా విచారణ జరపాలని నిర్ణయించిందని తెలిపారు. దీనిపై జస్టిస్ బాబ్డే స్పందిస్తూ తాము రెండింటినీ వేర్వేరుగా చూడటం లేదన్నారు. అసలు ఈ రోజు ఏం చెప్పదలచుకున్నారో స్పష్టంగా చెప్పండి.. అని లూథ్రానుద్దేశించి సీజే వ్యాఖ్యానించారు. తమ ముందున్న హెబియస్ కార్పస్ పిటిషన్లలో కనిపించిన అంశాల ఆధారంగా హైకోర్టు రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అన్న అంశంపై విచారణ జరుపుతోందని లూథ్రా పేర్కొన్నారు. హైకోర్టు అలాంటి ఉత్తర్వులెలా ఇవ్వగలదు? దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ (శాసన, న్యాయ, కార్యనిర్వాహక) కుప్పకూలిపోయానని భావించినప్పుడు హైకోర్టు మాత్రం రాజ్యాంగ వైఫల్యంపై అలాంటి ఉత్తర్వులు ఎలా ఇవ్వగలదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ప్రశ్నించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సబబేనా? అని అడిగారు. అసలు రాజ్యాంగం వైఫల్యం చెందిందని భావించేందుకు న్యాయమూర్తులను ప్రభావితం చేసినంత అంశాలు ఏమున్నాయో తమకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఇన్నేళ్లలో ఎప్పుడైనా చూశారా? కాగా రాజ్యాంగం వైఫల్యంపై హైకోర్టు కేవలం ప్రశ్న మాత్రమే లేవనెత్తిందని, అవి ఆదేశాలు కాదని సిద్దార్థ లూథ్రా పేర్కొనగా.. మీరెంత కాలం నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారని సీజే ప్రశ్నించారు. 29 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్నానని లూథ్రా బదులివ్వడంతో ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఏ కోర్టయినా ఇలాంటి కేసుల్లో (హెబియస్ కార్పస్) రాజ్యాంగం వైఫల్యంపై విచారణ జరుపుతామంటూ ఉత్తర్వులు ఇవ్వడం చూశారా? అంటూ జస్టిస్ బాబ్డే తిరిగి ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వులు అత్యున్నత న్యాయస్థానమైన తమకు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ సీజే ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
స్త్రీలపై అనుచిత వ్యాఖ్యలు.. సీఎస్ కర్ణన్ అరెస్ట్
చెన్నై: సుప్రీం కోర్టు, హై కోర్టు న్యాయమూర్తుల భార్యల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను రిటైర్డ్ జడ్జి సీఎస్ కర్ణన్ని చెన్నై సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అంతకుముందు బార్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు, పాండిచ్చేరి కర్ణన్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా మద్రాస్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కర్ణన్ మహిళలతో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల భార్యలపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు చేసినందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు మాజీ జస్టిస్ కర్ణన్ న్యాయవ్యవస్థలోని మహిళా సిబ్బందిపై జరిగే లైంగిక దాడులకు సంబంధించి పలు వ్యాఖ్యలు చేయడమే కాక సుప్రీం కోర్టు, హై కోర్టు న్యాయమూర్తుల భార్యలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ.. ఓ వీడియోను ఇంటర్నెట్లో షేర్ చేశారు. అంతేకాక కొంతమంది సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. వారిలో కొందరి పేర్లను కూడా వీడియాలో వెల్లడించారు. 2017 లో, కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న కాలంలో, జస్టిస్ కర్ణన్ కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు గాను సుప్రీం కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కర్ణన్ తన జైలు శిక్ష అనుభవించారు. -
ఆమెతో రాఖీ కట్టించుకో, 11 వేలు ఇవ్వు: కోర్టు
భోపాల్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నిందితుడికి మధ్యప్రదేశ్ హైకోర్టు వినూత్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 3న రక్షా బంధన్ సందర్భంగా బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె చేత రాఖీ కట్టించుకోవాలని ఆదేశించింది. అంతేగాక పండుగ సందర్భంగా సోదరికి అందజేసే కానుకల కింద రూ. 11 వేలు బహుమతిగా ఇవ్వాలని, ఆమె కొడుకుకు మరో రూ. 5 వేలు అందజేయాలని పేర్కొంది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇవన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. (మైనర్ అంగీకారంతోనే జరిగి ఉంటుంది.. కాబట్టి) అదే విధంగా ఇందుకు సంబంధించిన ఫొటోలు, రసీదులు కోర్టుకు సమర్పించాలని, అయితే తదుపరి విచారణపై ఈ అంశాలు ఎటువంటి ప్రభావం చూపవని స్పష్టం చేసింది. కేవలం బెయిలు పొందేందుకు మాత్రమే ఈ షరతులు వర్తిస్తాయని తెలిపింది. వివరాలు.. ఈ ఏడాది జూన్లో సదరు నిందితుడిపై లైంగిక ఆరోపణల కింద కేసు నమోదైంది. పొరుగింట్లో ప్రవేశించి మహిళపై అత్యాచార యత్నం చేసినట్లు ఫిర్యాదు నమోదు కావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడు బెయిలు కోసం అర్థించగా జూలై 30న కేసును విచారించిన ఇండోర్ ధర్మాసనం రూ. 50 వేల పూచీకత్తు కింద బెయిలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా.. ‘‘నిందితుడు తన భార్యతో కలిసి ఆగష్టు 3, 2020న ఉదయం 11 గంటలకు బాధితురాలి ఇంటికి వెళ్లాలి. ఆమె చేత రాఖీ కట్టించుకోవాలి. తనకు అన్ని విధాలుగా రక్షగా ఉంటాననే హామీ ఇవ్వాలి. (ఈ చెత్తనంతా భరించలేం: సుప్రీంకోర్టు) ఈ సంప్రదాయం ప్రకారం సోదరీమణులకు సోదరులు ఇచ్చే కానుక కింద రూ. 11 వేలు ఇవ్వాలి. ఆమె కొడుకుకు దుస్తులు, స్వీట్లు కొనుగోలు చేసేందుకు మరో రూ. 5 వేలు ఇవ్వాలి. ప్రాణాంతక వైరస్ విస్తరిస్తున్నందున కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సామాజిక దూరం, పరిశుభ్రత, మాస్కు ధరించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి’’అని జస్టిస్ రోహిత్ ఆర్య పేర్కొన్నారు. కాగా ఇటీవల గ్వాలియర్ బెంచ్ సైతం హత్యాయత్నం చేసిన ఓ వ్యక్తికి వింతైన షరతులతో బెయిలు మంజూరు చేసింది. గ్వాలియర్ జిల్లా ఆస్పత్రిలో చైనా వెలుపల తయారు చేసిన ఎల్ఈడీ టీవీని పెట్టించాలని ఆదేశించింది. -
ఆన్లైన్ క్లాసుల పై హైకోర్టు విచారణ
-
ఆన్లైన్ క్లాస్ల పై హైకోర్టులో విచారణ
-
ఏపీ హైకోర్టులో కీల పరిణామం
-
హైకోర్టులో ముగ్గురు జడ్జిల నియామకం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా న్యాయవాదులు బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్రెడ్డి, కన్నెగంటి లలితకుమారిలు నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం ఆమోదముద్ర వేస్తూ నియామక ఉత్తర్వులిచ్చారు. దీంతో వీరి నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. వీరు శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ప్రమాణం చేయించనున్నారు. ఈ ముగ్గురి నియామకంతో రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 21కి చేరుకోనుంది. వాస్తవానికి హైకోర్టు కొలీజియం మొత్తం ఆరుగురు న్యాయవాదుల పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసింది. హైకోర్టు పంపిన కృష్ణమోహన్, సురేష్రెడ్డి, లలితకుమారి, వి.మహేశ్వర్రెడ్డి, జీఎల్ నర్సింహారావు, కె.మన్మథరావుల పేర్లలో సుప్రీంకోర్టు కొలీజియం కృష్ణమోహన్, సురేష్రెడ్డి, లలితకుమారి పేర్లను మాత్రమే కేంద్రానికి పంపింది. ఈ ముగ్గురిలో లలిత పిన్న వయస్కురాలు. ప్రస్తుతం ఆమె వయస్సు 48 సంవత్సరాల, 11 నెలలు. ఈమె 2033 మే 4న, కృష్ణమోహన్ 2027, ఫిబ్రవరి 4న, సురేశ్రెడ్డి 2026, డిసెంబర్ 6న హైకోర్టు న్యాయమూర్తులుగా పదవీ విరమణ చేస్తారు. -
హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా రావు రఘునందన్రావు, బట్టు దేవానంద్, దొనడి రమేశ్, నైనాల జయసూర్య సోమవారం ప్రమాణం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో ఈ నలుగురి నియామక ఉత్తర్వులను రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ చదివి వినిపించారు. అనంతరం వీరిచే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి వేర్వేరుగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, తడకమళ్ల వినోద్కుమార్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.జగన్నాథరావు, అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, ప్రమాణం చేసిన నలుగురు న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, రిజిస్ట్రార్ జనరల్, ఇతర రిజిస్ట్రార్లు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారక తిరుమలరావు తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఈ నలుగురుని న్యాయవాదులు అభినందించారు. ఆ తరువాత సీజే జస్టిస్ జేకే మహేశ్వరితో కలిసి జస్టిస్ జయసూర్య కేసులను విచారించారు. మిగిలిన న్యాయమూర్తులు సింగిల్ జడ్జిలుగా కేసులు విచారించారు. ఈ నలుగురి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 19కి చేరింది. వీరిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 10న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా రావు రఘునందన్రావు, బట్టు దేవానంద్, దొనడి రమేశ్, నైనాల జయసూర్య నియమితులయ్యారు. వీరి నియామకానికి శుక్రవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 19కి చేరుకోనుంది. న్యాయవాదుల కోటా నుంచి ఈ నలుగురిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం గతేడాది జూలై 25న కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ నలుగురు న్యాయమూర్తులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి సోమవారం ప్రమాణం చేయించనున్నారు. రావు రఘునందన్రావు ఈయన 1964 జూన్ 30న రావు చిన్నారావు, విలసిత కుమారి దంపతులకు జన్మించారు. పాఠశాల విద్య హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సాగింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1988లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. సీనియర్ న్యాయవాది ఎస్.రవి వద్ద జూనియర్ న్యాయవాదిగా కెరీర్ను ఆరంభించారు. 1993 నుంచి 94 వరకు ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏజీపీ)గా, 1995లో అడ్వొకేట్ జనరల్కు సహకరించేందుకు స్పెషల్ ఏజీపీగా నియమితులయ్యారు. 1996 నుంచి స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. అనతి కాలంలోనే సివిల్, వాణిజ్య, రాజ్యాంగపరమైన కేసుల్లో మంచి పట్టు సాధించారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లకు న్యాయవాదిగా ఉన్నారు. ఏపీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ సీనియర్ న్యాయవాదుల ప్యానెల్లో చోటు దక్కించుకున్నారు. ఉమ్మడి హైకోర్టు రఘునందన్రావుకు సీనియర్ న్యాయవాది హోదానిచ్చి గౌరవించింది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బట్టు దేవానంద్ 1966 ఏప్రిల్ 14న కృష్ణా జిల్లా, గుడివాడ చౌదరిపేటలో వెంకటరత్నం, మనోరంజితం దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులు. గుడివాడ ఏజీకే పాఠశాలలో ఎస్ఎస్సీ, ఏఎన్ఆర్ కాలేజీలో ఇంటర్, బీఏ, ఆంధ్రా యూనివర్సిటీలో బీఎల్ చదివారు. గుడివాడ కళాశాలలో చదివేటప్పుడు విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. 1989లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. విశాఖపట్నంలో సీనియర్ న్యాయవాది ఎం.కె.సీతారామయ్య వద్ద 1989 నుంచి 1992 వరకు జూనియర్గా పనిచేస్తూ వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. 1993 నుంచి స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1996 నుంచి 2000 వరకు హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా పనిచేశారు. 2004 నుంచి బీఎస్ఎన్ఎల్కు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. పలు ఇన్సూరెన్స్ కంపెనీలకు సైతం న్యాయవాదిగా ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తించారు. నైనాల జయసూర్య పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 1968లో జన్మించారు. తల్లిదండ్రులు.. ఎన్వీవీ కృష్ణారావు, ఇందిరా దేవి. తండ్రి.. కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సీనియర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారు. జయసూర్య.. తణుకులో ఎస్ఎస్సీ, రాజమండ్రి ఏకేసీ జూనియర్ కాలేజీలో ఇంటర్, ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ, విజయవాడలోని వెలగపూడి దుర్గాబాయి సిద్ధార్థ కాలేజీ ఆఫ్ లాలో ఎల్ఎల్బీ చదివారు. 1992లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) తలారి అనంతబాబు వద్ద జూనియర్గా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 2003–04లో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా వ్యవహరించారు. 2009–14 మధ్య హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీఎస్టీసీ, ఎస్టీసీ, హుడా తదితర ప్రభుత్వ రంగ సంస్థల తరఫున కేసులు వాదించారు. బీహెచ్ఈఎల్, ఆప్కో, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ప్యానల్ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. దొనడి రమేశ్ 1965 జూన్ 27న చిత్తూరు జిల్లా సోమల మండలం కామనపల్లిలో జన్మించారు. తల్లిదండ్రులు.. డీవీ నారాయణ నాయుడు, అన్నపూర్ణ. నంజంపేటలో ఎస్ఎస్సీ, తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్, బీకాం, నెల్లూరు వీఆర్ లా కాలేజీలో బీఎల్ చదివారు. 1990లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నారాయణ వద్ద జూనియర్గా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. కొంతకాలం తర్వాత స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ఎక్కువగా పరిపాలనా ట్రిబ్యునల్లో కేసులు వాదించారు. 2000–2004 మధ్య హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2006–13 మధ్య కాలంలో హైకోర్టులో రాజీవ్ విద్యా మిషన్, సర్వ శిక్షాఅభియాన్కు న్యాయవాదిగా వ్యవహరించారు. 2014 నుంచి 2019 వరకు హైకోర్టులో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తించారు. -
హైకోర్టు రిజిస్ట్రార్కు రీ పోస్ట్మార్టం రిపోర్ట్
-
న్యాయ నియామకాల్లో జాప్యం
న్యాయవ్యవస్థ కంఠశోషే తప్ప దేశంలోని వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తుల పోస్టులు భర్తీ కాకుండానే ఉండిపోతున్నాయని మరోసారి వెల్లడైంది. మొత్తంగా 1,079 హైకోర్టు న్యాయమూర్తుల పదవులుండగా అందులో కేవలం 669మంది న్యాయమూర్తులు...అంటే 62 శాతంమంది మాత్రమే ఉన్నారని, 410 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. తగిన సంఖ్యలో న్యాయమూర్తులు లేకపోవడం వల్ల కేసుల పరిష్కా రంలో ఎంత జాప్యం చోటుచేసుకుంటున్నదో, న్యాయం కోసం ఎదురుచూస్తున్న సాధారణ పౌరులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కేంద్రానికి తెలియనిది కాదు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా న్యాయమూర్తుల నియామకం విషయంలో నిర్లక్ష్యమే కనబడుతోంది. సుప్రీంకోర్టు కొలీజి యానికీ, కేంద్రానికీ మధ్య విభేదాలు తలెత్తిన సందర్భాలు ఇటీవలికాలంలో చాలానే ఉన్నాయి. అయినా గత అయిదేళ్లలో చేసిన నియామకాలు గమనిస్తే అంతక్రితం కన్నా ఎంతో కొంత మెరుగనే చెప్పాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సరిపోదు. అలహాబాద్ హైకోర్టు 60 ఖాళీలతో అగ్రభాగాన ఉండగా, కలకత్తా హైకోర్టులో 32, ఢిల్లీ హైకోర్టులో 23, బొంబాయి హైకోర్టులో 29 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీలున్నాయి. అన్నిటికన్నా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిస్థితి మరీ అన్యాయం. అక్కడ 37మంది న్యాయమూర్తులకూ 15మంది మాత్రమే ఉన్నారు. గత జూన్లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ కొత్తగా న్యాయమూర్తుల్ని నియమించడంతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచాలని కోరారు. అలాగే అవసరమైతే రాజ్యాంగంలోని 128, 224ఏ అధికరణల కింద సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తుల్ని నిర్దిష్ట కాలానికి న్యాయమూర్తులుగా నియమిస్తే పెండింగ్ కేసుల బెడద తీరుతుందని సూచించారు. కానీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ అభిప్రాయమేమిటో తెలియదు. సుప్రీంకోర్టులో మొన్న జూన్ నాటికి 58,669 కేసులు పెండింగ్లో ఉన్నాయి. రోజూ కొత్తగా దాఖలయ్యే కేసుల సంఖ్య కూడా కలుపుకుంటే ప్రస్తుతం అవి మరింతగా పెరిగివుండొచ్చు. తగినంతమంది న్యాయమూర్తులు అందుబాటులో లేని కారణంగా అనేక ముఖ్య మైన కేసుల పరిష్కారం కూడా ఆలస్యమవుతోంది. కేసుల్లో చిక్కుకోవడం వల్లనో, న్యాయం కోసం న్యాయస్థానాల్ని ఆశ్రయించడం వల్లనో వాటి చుట్టూ తిరగకతప్పనివారికి ఈ జాప్యం వల్ల కలిగే ఖేదమేమిటన్నది బాగా తెలుసు. తమ కేసు చాన్నాళ్లుగా పెండింగ్లో ఉందని, త్వరగా పరిష్కరించాలని కోరే కక్షిదారులకు న్యాయస్థానాలనుంచి ఆశాజనకమైన జవాబు రావడం లేదు. అవి నిస్సహాయ స్థితిలో ఉండటమే అందుకు కారణం. మన దేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఏభై ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య 1,000 వరకూ ఉంటే...25 ఏళ్లనుంచి పెండింగ్లో ఉన్న కేసులు రెండు లక్షలపైనే. సివిల్ తగాదాలకు సంబంధించి మొత్తంగా 90 లక్షల కేసులు ఎటూ తెమలకుండా ఉన్నాయి. వీటిల్లో 20 లక్షలకుపైగా కేసుల్లో...అంటే 23 శాతం కేసుల్లో కనీసం సమన్లు కూడా జారీ చేయలేదని గత ఆగస్టులో జస్టిస్ గొగోయ్ చెప్పారంటే న్యాయమూర్తుల నియామకం సమస్య ఎలాంటి పరిస్థితులకు దారితీస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. క్రిమినల్ కేసుల పరిస్థితి ఇంతకన్నా ఘోరం. 2 కోట్ల 10 లక్షల క్రిమినల్ కేసుల్లో కోటి వరకూ కేసులు ఇంకా సమన్లు జారీ చేసే దశలోనే ఉన్నాయి. ఈ క్రిమినల్ కేసుల్లో 45 లక్షల వరకూ చిన్న తగాదాలకు సంబంధించినవి. ఇది ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తుంది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో మాత్రమే కాదు... కింది కోర్టుల్లో కూడా న్యాయాధికారుల కొరత తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా 5,000 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. ఇలా ఎక్కడికక్కడ అన్ని స్థాయిల్లోనూ ఖాళీలుంటే న్యాయం దక్కడం సాధ్యమేనా? ఉన్నత స్థాయి న్యాయస్థానాల్లో పదవుల భర్తీ విషయంలో జరుగుతున్న జాప్యం గురించి కనీసం కొలీజియాన్ని సాకుగా చూపడానికి ఉంది. కానీ జిల్లా కోర్టుల్లోనూ, సబా ర్డినేట్ కోర్టుల్లోనూ పూర్తికావాల్సిన నియామకాల మాటేమిటి? దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో నియామక విధానం తెస్తామని రవిశంకర్ ప్రసాద్ ఇప్పటికే చెప్పారు. ఆ విషయంలో కేంద్రం నుంచి ప్రతిపాదనలు వస్తే సానుకూలంగా స్పందిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఈమధ్యే అన్నారు గనుక ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందనుకోవాలి. న్యాయ మూర్తుల నియామకంలో చోటు చేసుకుంటున్న జాప్యం కేంద్రం, న్యాయవ్యవస్థల మధ్య నెలకొన్న ఆధిపత్య సమస్య లేదా అహంభావ సమస్య పర్యవసానంగా ఏర్పడిందని కొందరు న్యాయవేత్తలు చెబుతున్నారు. కానీ వీటి పర్యవసానాలు మాత్రం ప్రజలు అనుభవించవలసి వస్తున్నది. ఇది ఎడ తెగకుండా సాగడం సరైంది కాదు. న్యాయమూర్తుల నియామకాల్లో జాప్యం వల్ల ప్రజలకు సకాలంలో న్యాయం దక్కని దుస్థితి ఏర్పడింది. క్రిమినల్ కేసుల విచారణ ఏళ్లతరబడి పెండింగ్లో పడిపోవడం వల్ల ఆ కేసుల్లో నిందితులుగా ఉన్న నిరుపేదలు జైళ్లలో గడపవలసి వస్తోంది. కొందరైతే తమ నేరానికి అనుభవిం చాల్సిన శిక్షా కాలానికి మించి జైళ్లలో మగ్గుతున్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు బెయిల్ తెచ్చుకుం టున్నారు. అవసరమైన సంఖ్యలో న్యాయమూర్తులు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. అమెరికాలో పది లక్షలమంది జనాభాకు సగటున 107మంది న్యాయమూర్తులుంటే మన దేశంలో ఆ సంఖ్య పది మాత్రమే. అలాగే అక్కడి న్యాయమూర్తులు సగటున ఏడాదికి 81 కేసులు పరిష్కరిస్తుంటే మన న్యాయమూర్తులు 2,600 కేసులు పరిష్కరిస్తున్నారు. న్యాయమూర్తులపై ఈ స్థాయిలో భారం మోపడం ఎంత మాత్రం న్యాయం కాదు. కనుక ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణం కదలాలి. న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయాలి. -
సత్వరం న్యాయం అందించడం దైవ కార్యం
సాక్షి, అమరావతి: న్యాయవ్యవస్థపై ప్రజలు ఎంతో నమ్మకం ఉంచారని, శీఘ్రగతిన వారికి న్యాయాన్ని అందించినప్పుడే ఆ నమ్మకానికి సార్థకత చేకూరుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి అన్నారు. ప్రజలకు న్యాయం అందించడమన్నది దైవ కార్యమని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయాధికారుల తొలి సదస్సు ఆదివారం గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీ ప్రాంగణంలో జరిగింది. ఈ సదస్సులో హైకోర్టు న్యాయమూర్తులతో పాటు 13 జిల్లాలకు చెందిన దాదాపు 530 మంది న్యాయాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయాధికారులను ఉద్దేశించి సీజే జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ప్రారంభోపన్యాసం చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముకానివ్వకుండా చూసి న్యాయవ్యవస్థ ప్రతిష్టను పెంచాల్సిన బాధ్యత న్యాయాధికారులపై ఉందన్నారు. ప్రజలు మనదేశంలో న్యాయమూర్తులను దేవుళ్లలా భావిస్తారని, అందుకే న్యాయస్థానాలు ‘న్యాయ ఆలయాలు’ అయ్యాయన్నారు. దేశంలో ఎన్నో దేవాలయాలున్నా, తిరుమల, కాశీ ఇలా కొన్ని దేవస్థానాలకే అత్యంత పవిత్రత ఉందని, అలాగే అనేక రంగాలు ప్రజల కోసం పనిచేస్తున్నా, న్యాయవ్యవస్థకున్న ప్రత్యేకత వేరని తెలిపారు. న్యాయం అందించే బాధ్యత మన చేతుల్లోకి వచ్చిందంటే అది దైవకృప వల్ల మాత్రమే సాధ్యమైందని, అందువల్ల ప్రజలకు సత్వర న్యాయం అందించడాన్ని దైవ కార్యంగా భావించాలని ఆయన న్యాయాధికారులను కోరారు. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు ఏం చేయాలి.. ఈ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు.. వాటిని ఎలా అధిగమించాలి.. తదితర అంశాలపై సూచనలు, సలహాలు అందుకునేందుకే ఈ సదస్సును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సదస్సులో తీసుకునే నిర్ణయాలను తప్పనిసరిగా అమలు చేస్తామని తెలిపారు. హాజరైన న్యాయాధికారులు హైకోర్టు జడ్జిపై 12 వేల కేసుల భారం... అధికార గణాంకాల ప్రకారం హైకోర్టులో 1,90,431 కేసులు పెండింగ్లో ఉంటే, ప్రస్తుతం ఉన్నది 15 మంది న్యాయమూర్తులేనని సీజే తెలిపారు. ఆ ప్రకారం ఒక్కో న్యాయమూర్తిపై 12,695 కేసులను విచారించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. అలాగే కింది కోర్టుల్లో 5,67,630 పెండింగ్ కేసులు ఉంటే, ప్రస్తుతం ఉన్నది 529 మంది న్యాయాధికారులేనని చెప్పారు. పాత కేసుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వడంతో సరిపెట్టకుండా, కొత్త కేసులు పాత కేసులుగా మారకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దేశంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలు పెద్ద సంఖ్యలో కక్షిదారులుగా మారుతున్నాయని, ఇదే సమయంలో ప్రజల్లో వారి హక్కుల పట్ల అవగాహన పెరుగుతోందన్నారు. ఈ–ఫిర్యాదుల పరంపర చాలా వేగంగా పెరిగిందని, ఈ పరిస్థితుల్లో న్యాయాధికారులపై ఎంతో గురుతర బాధ్యత ఉందని ఆయన గుర్తు చేశారు. నైతికత విషయంలో రాజీపడొద్దు.. న్యాయవాదులు, న్యాయమూర్తుల మధ్య సత్సంబంధాలు ఉండటం వల్ల సమర్థవంతంగా న్యాయ పాలన అందించడం సాధ్యమవుతుందని జస్టిస్ మహేశ్వరి చెప్పారు. న్యాయపాలనలో న్యాయవాదుల పాత్ర చాలా కీలకమని, వారు కూడా న్యాయమూర్తులతో సమానమని తెలిపారు. నైతికత విషయంలో న్యాయమూర్తులు ఎన్నడూ కూడా రాజీపడాల్సిన అవసరం లేదని చెప్పారు. యువ న్యాయవాదులను ప్రోత్సహించాలన్నారు. సదస్సులో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ సీహెచ్ ప్రవీణ్కుమార్, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం.సీతారామమూర్తి, ఏపీ లా సెక్రటరీ మోహన్రెడ్డి, పలువురు న్యాయమూర్తులు, న్యాయాధికారులు పాల్గొన్నారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రాకేష్కుమార్ ప్రమాణం
సాక్షి, అమరావతి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్కుమార్ శుక్రవారం ప్రమాణం చేశారు. ఆయనతో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్మహేశ్వరి ప్రమాణం చేయించారు. అంతకుముందు జస్టిస్ రాకేష్కుమార్ నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్ను రిజిస్ట్రార్ జనరల్ (ఇన్చార్జి) రాజశేఖర్ చదివి వినిపించారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, జస్టిస్ రాకేష్కుమార్ కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. అనంతరం జస్టిస్ రాకేష్కుమార్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత జస్టిస్ మహేశ్వరితో కలిసి కేసులను విచారించారు. జస్టిస్ రాకేష్కుమార్ రాకతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 15కు చేరింది. -
కొలీజియం నిర్ణయాల్లో గోప్యత అవసరమే
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకానికి సంబంధించి కొలీజియంలో జరిగే చర్చలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టుకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే అభిప్రాయపడ్డారు. జడ్జీలుగా నియమించాలని సిఫారసు చేసేందుకు కొలీజియం తిరస్కరించిన వారికి సంబంధించి జరిగిన చర్చల వివరాలను వెల్లడించనక్కరలేదన్నారు. ఈ మేరకు బుధవారం పీటీఐ వార్తాసంస్థకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నవంబర్ 18న సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బాబ్డే బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. కేవలం సమాచారం తెలుసుకోవాలన్న పౌరుల కోరిక తీర్చడం కోసం వ్యక్తుల ప్రతిష్టకు సంబంధించిన విషయాన్ని బహిర్గత పరచడం సరికాదని తన అభిప్రాయమని జస్టిస్ బాబ్డే పేర్కొన్నారు. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని తీర్పునిచ్చిన 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే కూడా ఒకరు. న్యాయమూర్తులిచ్చే తీర్పులపై సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను కూడా జస్టిస్ బాబ్డే తప్పుపట్టారు. అలాంటి విమర్శలతో చాలామంది న్యాయమూర్తులు ఆవేదన చెందుతుంటారన్నారు. ‘ఉదాహరణకు.. ఒక హైకోర్టు జడ్జికి సుప్రీంజడ్జీగా పదోన్నతి కల్పించాలనుకుని, ఆ తరువాత పరిశీలనలో తమకందిన సమాచారం మేరకు సుప్రీంకోర్టు జడ్జీగా ఆయన సరికాదని కొలీజియం నిర్ణయిస్తుంది. ముందుగా, ఆయన పేరును పరిశీలించడం ఎందుకు? ఆ తరువాత పదోన్నతికి పనికిరాడని నిర్ణయించి, ఆ విషయాన్ని బహిర్గం చేయడం ఎందుకు? ఆ జడ్జీ ఆ తరువాత కూడా ఆ హైకోర్టులో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది కదా! అతనికి అది ఇబ్బందికరంగా ఉండదా?’ అని ప్రశ్నించారు. వారిని బాధపెట్టడం సరికాదన్నారు. -
పోలీసు, న్యాయవ్యవస్థ నాణేనికి రెండు ముఖాలు
సాక్షి, హైదరాబాద్: పోలీసు, న్యాయవ్యవస్థలు ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాల వంటివని హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ అన్నారు. సోమవారం హైదరాబాద్లో రాజాబహద్దూర్ వెంకటరామిరెడ్డి (ఆర్బీవీఆర్ఆర్) తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో 2019 కొత్త ఎస్సై(సివిల్) బ్యాచ్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ, పోలీస్ విధుల్లో వ్యత్యాసమున్నా లక్ష్యం ఒక్కటేనన్నారు. పోలీసు అధికారులు సమాజం పట్ల సున్నితత్వంతో వ్యవహరించాలన్నారు. ఫిర్యాదులతో వచ్చే ప్రజలతో సహనంతో వ్యవహరించాలన్నారు. డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న నేరాలపై శాస్త్రీయ దృక్పథం పెంచుకోవాలన్నారు. ప్రాథమిక హక్కులతోపాటు, చట్టాలన్నింటిపైనా పట్టు సాధించాలని సూచించారు. బృంద స్ఫూర్తి, స్మార్ట్వర్క్, సిటిజన్ ఫ్రెండ్లీ విధానాలకనుగుణంగా విధులు నిర్వహించాలన్నారు. ముడిరాళ్లను వజ్రాలుగా సానబెట్టే అవకాశం టీఎస్పీఏకి వచ్చిందని పోలీసు అకాడమీ డైరెక్టర్ వినయ్కుమార్ సింగ్ పేర్కొన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని ట్రైనీ ఎస్సైలకు సూచించారు. డిప్యూటీ డైరెక్టర్ బి.నవీన్కుమార్.. టీఎస్పీఏ నిబంధనలను వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జానకీషర్మిల తదితరులు పాల్గొన్నారు. -
ఎంగిలి ప్లేట్లు తీసిన న్యాయమూర్తి
సాక్షి, హైదరాబాద్ : ఆయన హైకోర్టు న్యాయమూర్తి. అధికారం.. హోదా.. చిటికేస్తే పనులు చేసిపెట్టే మనుషులు.. ఇలా అన్నీ ఉన్నా ఆయన వాటన్నింటినీ పక్కన పెట్టారు. ఆయనే స్వయంగా ఎంగిలి పేట్లు ఎత్తారు. ఈ ఘటనకు హైకోర్టు ప్రాంగణం వేదికైంది. శుక్రవారం సాయంత్రం హైకోర్టులో సీని యర్ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్కుమార్ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. న్యాయవాదులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అందరూ టీ తాగారు.. బిస్కెట్లు.. సమోసాలు తిన్నారు. ఎప్పటి లాగే ప్లేట్లు అక్కడే పడేసి వెళ్లిపోయారు. ఇదంతా గమనిస్తున్న జస్టిస్ చల్లా కోదండరామ్కు మనసు చివుక్కుమంది. న్యాయవాదులుగా బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి ఇలా ఎక్కడపడితే అక్కడ, అది కూడా హైకోర్టు ప్రాంగణాన్ని అపరిశుభ్రంగా మార్చడాన్ని భరించలేకపోయారు. వెంటనే స్వయంగా వచ్చి ఈ ప్రదేశం మొత్తం తిరుగుతూ న్యాయవాదులు పడేసిన ఎంగిలి ప్లేట్లను ఎత్తడం ప్రారంభించారు. మొదట్లో న్యాయవాదులకు ఆయన ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. ఆ తర్వాత ఎంగిలి ప్లేట్లు తీస్తున్నారని అర్థం చేసుకున్న న్యాయవాదులు వారు ఆయనతో పాటు ప్లేట్లను తీయడం ప్రారంభించారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సూర్యకరణ్రెడ్డి కూడా జస్టిస్ కోదండరామ్తో కలిసి ఈ ప్లేట్లను తీసేశారు. -
బదిలీ సిఫారసుపై న్యాయవాదుల భగ్గు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో న్యాయవాదులు తొలి సారి తమ నిరసన గళాన్ని విప్పారు. హైకోర్టులో నెంబర్ టు స్థానంలో ఉన్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్కుమార్ను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు జూనియర్ జడ్జిగా బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుపై న్యాయవాదులు మండిపడుతున్నారు. త్వరలో రాష్ట్ర కోటా నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావాల్సిన వ్యక్తిని, ఈ విధంగా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో 12వ స్థానానికి బదిలీ చేస్తుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సిఫారసును వెనక్కి తీసుకోవాలని, ఆయనను ఏదైనా హైకోర్టు సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియంను డిమాండ్ చేస్తున్నారు. జస్టిస్ సంజయ్కుమార్ బదిలీ సిఫా రసు నేపథ్యంలో హైకోర్టు న్యాయవాదుల సంఘం మంగళవారం అత్యవసరంగా ఏర్పా టు చేసిన సర్వసభ్య సమావేశానికి భారీస్థాయిలో న్యాయవాదులు పాల్గొన్నారు. కొలీజియం నిర్ణయానికి నిరసనగా మంగళవారం నుంచి శనివారం (3 నుంచి 7) వరకు కోర్టు విధులను బహిష్కరించాలని హైకోర్టు న్యాయవాదుల సంఘం తీర్మానించింది. 4 నుంచి 7వ రకు విధులను బహిష్కరించాలని కింది కోర్టు ల న్యాయవాద సంఘాలను సైతం హైకోర్టు న్యాయవాదుల సంఘం కోరింది. ఇటు ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం కూడా జస్టిస్ సంజయ్కుమార్కు అండగా నిలవాలని నిర్ణ యించింది. సుప్రీంకోర్టులో పిల్కు తీర్మానం.. సీనియర్ న్యాయవాదుల నేతృత్వంలోని సంఘం కార్యవర్గం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కొలీజియంలోని ఇతర న్యాయమూర్తులను కలవాలని కూడా తీర్మానించారు. ఇటు రాష్ట్రపతి, ప్రధాని, న్యాయశాఖ మంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా కలవాలని నిర్ణయించారు. న్యాయమూర్తుల నియామకాలు, ప్రధాన న్యాయమూర్తిగా పదో న్నతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిం చే విషయంలో మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయాలని హైకోర్టు న్యాయవాదుల సంఘం తీర్మానించింది. హైకోర్టులో ఉన్న న్యాయమూర్తుల ఖాళీలన్నింటినీ భర్తీ చేసే వరకు ఏ హైకోర్టు నుంచి కూడా న్యాయమూర్తులను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయరాదని సుప్రీంకోర్టు కొలీజియంకు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. బదిలీ అన్యాయం: టి.సూర్యకరణ్రెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ‘నెంబర్ టు స్థానంలోని న్యాయమూర్తిని అదే స్థానంలో మరో హైకోర్టుకు బదిలీ చేస్తే ఎవరికీ అభ్యంతరముండదు. 12వ స్థానంలో ఉండే లా బదిలీ చేయడం దేశంలో ఇదే తొలిసారి. ఏఆరోపణలు లేని జస్టిస్ సంజయ్కుమార్ను ఇలా బదిలీ చేయడం సరికాదు. 3 రాష్ట్రాల సీజేలు జస్టిస్ సంజయ్కుమార్ కంటే జూనియర్లు. జస్టిస్ సంజయ్కుమార్కు సీజేగా పదో న్నతి ఇవ్వకపోవడం అన్యాయమైతే ఇప్పు డు జూనియర్గా బదిలీ చేయడం న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయడమే..’ -
అవినీతికి ఫుల్స్టాప్
ఏం జరుగుతుందంటే...? రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ విలువైన పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయటానికి ముందుగానే సంబంధిత డాక్యుమెంట్ను న్యాయ పరిశీలన కోసం హైకోర్టు న్యాయమూర్తికి పంపిస్తారు. న్యాయమూర్తి దీనిపై ప్రజల నుంచి సూచనలు, సలహాల కోసం వారం రోజుల పాటు డాక్యుమెంట్ను అందరికీ అందుబాటులో ఉంచుతారు. అనంతరం న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిపుణుల బృందం వీటిని క్షుణ్నంగా పరిశీలించి 8 రోజుల పాటు సమీక్షిస్తుంది. ప్రజల సలహాల మేరకు తగిన మార్పులు చేర్పులు సూచిస్తుంది. వీటిని కచ్చితంగా అమలు చేస్తూ టెండర్ నోటిఫికేషన్ జారీ అవుతుంది. సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో తొలిసారిగా టెండర్ల ప్రక్రియలో అత్యుత్తమ విధానానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అవినీతి, అక్రమాలకు ఏమాత్రం తావులేకుండా ముందుగా న్యాయపరమైన పరిశీలన తరువాతే పారదర్శకంగా టెండర్లను ఆహ్వానించే చరిత్రాత్మక ఘట్టం శుక్రవారం ఆవిష్కృతమైంది. ఇందుకు సంబంధించిన బిల్లును కూలంకషంగా చర్చించిన అనంతరం శాసనసభ ఆమోదించింది. ప్రతిష్టాత్మకమైన ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు సభ్యుల హర్షధ్వానాల మధ్య స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే టెండర్లను పారదర్శకంగా ఖరారు చేసేందుకు న్యాయ పరిశీలనను ఏర్పాటు చేస్తామని అదే వేదిక నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా టెండర్ల విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి పారదర్శకత, ప్రజాధనం ఆదాకు పెద్దపీట వేస్తూ అక్రమాలు, పక్షపాతం, అవినీతి నిర్మూలనే లక్ష్యంగా కొత్తగా ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల (న్యాయపరమైన ముందస్తు సమీక్ష ద్వారా పారదర్శకత) చట్టం–2019 బిల్లు రూపుదిద్దుకుంది. ఈ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందడంతో త్వరలోనే చట్ట రూపం దాల్చనుంది. పారదర్శకతకు పెట్టపీట ఈ బిల్లు ద్వారా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ టెండర్ల ప్రక్రియలో పారదర్శకతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో టెండర్ల డాక్యుమెంట్ ముందస్తు పరిశీలన జరుగుతుంది. ప్రజల నుంచి అందిన సూచనల మేరకు, న్యాయమూర్తి పరిశీలన అనంతరం మార్పులు, చేర్పులతో టెండర్ల ప్రతిపాదనలను ఖరారు చేస్తూ బిడ్డింగ్కు వీలుగా బిల్లులో ప్రొవిజన్స్ ప్రతిపాదించారు. అందరికీ సమాన అవకాశాలు, నాణ్యతా ప్రమాణాలు, ఖర్చు విషయంలో జాగ్రత్త పాటించడమే లక్ష్యంగా బిల్లుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. అందరికీ సమాన అవకాశాలు.. కొత్త విధానంలో ఏదైనా పనిని ప్రతిపాదిస్తున్న ప్రతిశాఖ ఆ పత్రాలను న్యాయమూర్తికి సమర్పించాల్సి ఉంటుంది. టెండర్లను పిలవడానికి ముందుగానే అన్ని పీపీపీ, జాయింట్ వెంచర్లు, స్పెషల్ పర్సస్ వెహికల్స్ సహా ప్రభుత్వం చేపట్టే అన్ని ప్రాజెక్టులపైనా జడ్జి పరిశీలన చేయనున్నారు. పనులను ప్యాకేజీలుగా విభజించినా సరే మొత్తం పని విలువ రూ.100 కోట్లు దాటితే న్యాయపరిశీలన పరిధిలోకి రావాల్సిందేనని బిల్లులో స్పష్టం చేశారు. న్యాయమూర్తికి సూచనలు, సలహాలు అందిస్తున్న వారికి తగిన రక్షణను ప్రభుత్వమే కల్పించనుంది. జడ్జి సిఫార్సులను తప్పనిసరిగా సంబంధిత శాఖలన్నీ పాటించాల్సిందేనని బిల్లులో పేర్కొన్నారు. మొత్తం 15 రోజుల్లో టెండర్ ప్రతిపాదనలను ఖరారు చేయాలని, ఆ తరువాతే బిడ్డింగ్కు వెళ్లాలనే నిబంధన బిల్లులో పొందుపరిచారు. అర్హత ఉన్న కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశాలు కల్పించాలని బిల్లులో స్పష్టం చేశారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఈ విధానం ఉంటుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా, పనిగట్టుకుని ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే నిరోధించడానికి తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకునేలా న్యాయమూర్తికి వెసులుబాటు కల్పించారు. జడ్జి, జడ్జి వద్ద పనిచేస్తున్న సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా భావిస్తారు. ఈ చట్టం ద్వారా తీసుకునే నిర్ణయాలు, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం లేదా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ప్రతినిధులపై ఎట్టి దావా క్లెయిమ్ లేదా ఇతర న్యాయ ప్రొసీడింగ్స్ ఏవీ వేయకూడదు. బిల్లులోని ఆర్థిక మెమోరాండంలో నెలవారీ వ్యయం కోసం రూ.3 కోట్లు, ఇతర ఖర్చుల కోసం రూ.ఐదు కోట్లను ప్రాధమికంగా కేటాస్తున్నట్లు పేర్కొన్నారు. బిల్లులో కీలక అంశాలు ఇవీ... 1. ఏ టెండరైనా, ఏ పనైనా విలువ రూ.100 కోట్లు దాటితే టెండర్ పత్రాలను న్యాయమూర్తి పరిశీలనకు పంపుతారు. 2. తరువాత దాన్ని ప్రజా బాహుళ్యం (ఇంటర్నెట్, వెబ్ సైట్)లో 7 రోజుల పాటు అందరికీ అందుబాటులో ఉంచి ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. 3. న్యాయమూర్తికి సాంకేతిక తోడ్పాటు కోసం టెక్నికల్ టీమ్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జడ్జి కోరితే వేరేవారిని కూడా నియమిస్తుంది. వారికి జీతభత్యాలు ప్రభుత్వమే చెల్లిస్తుంది. 4. ప్రజల నుంచి అందే సూచనలు, సలహాలను న్యాయమూర్తి ఆధ్వర్యంలోని టెక్నికల్ బృందం 8 రోజుల పాటు సమీక్షిస్తుంది. సంబంధిత శాఖల అధికారులను పిలిచి అందుకు అనుగుణంగా టెండర్లలో మార్పులు చేర్పులు సూచిస్తుంది. 5. వారం రోజులు ప్రజా బాహుళ్యంలో, 8 రోజుల పాటు న్యాయమూర్తి పరిశీలనలో టెండర్ డాక్యుమెంట్ ఉంటుంది. 6. మొత్తం 15 రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుంది. 7. న్యాయమూర్తి సూచించిన మార్పుచేర్పులను తప్పనిసరిగా అమలు చేస్తూ టెండర్లను పిలుస్తారు. ఇదీ ప్రభుత్వ ఉద్దేశం... ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకతతో కూడిన వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తోంది. సమాన అవకాశాలు, వ్యయం, నాణ్యతా సూత్రాలను పాటిస్తూ సమర్ధవంతమైన రీతిలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను కల్పించాలని ధృఢంగా నిర్ణయించింది. ఈ లక్ష్యాలను సాధించేందుకు యావత్తు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మరీ ముఖ్యంగా రూ.100 కోట్లు అంతకు మించిన విలువ గల ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం సమగ్ర చట్టం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకోసం ఉన్నత న్యాయస్థానానికి చెందిన గౌరవ న్యాయమూర్తి ఆధ్వర్యంలో తగిన యంత్రాంగం ఏర్పాటుకు చట్టం తేవాలని నిర్ణయించింది. గౌరవ న్యాయమూర్తి విధులు నిర్వర్తించడానికి అవసరమైన నిపుణులు, సిబ్బందిని ఆయన కోరిన విధంగా సమకూర్చుతుంది’’ కొత్త చట్టం పరిధిలోకి వచ్చేవి (పీపీపీ ప్రాజెక్టులతో సహా ) 1.రోడ్లు (రాష్ట్ర రహదారులు, మేజర్ జిల్లా రోడ్లు, ఇతర జిల్లా రోడ్లు, గ్రామీణ రోడ్లు) వంతెనలు, బైపాస్లు 2. ఆరోగ్యం 3. భూమిని తిరిగి తీసుకొనుట 4. కాలువలు, ఆనకట్టలు 5. నీటిని సరఫరా చేయటం, శుభ్రపరచటం, పంపిణీ చేయుటం 6. వ్యర్ధ పదార్థాల నిర్వహణ 7. మురుగు, మురుగుపారుదల 8. పబ్లిక్ మార్కెట్లు 9. వర్తక ప్రదర్శన, సమ్మేళం, వస్తు ప్రదర్శన, సాంస్కృతిక కేంద్రాలు 10. పబ్లిక్ భవనాలు 11. దేశీయ జల రవాణా 12. గ్యాస్, గ్యాస్ పనులు 13. క్రీడలు, విహారాల మౌలిక సదుపాయాలు, పబ్లిక్ ఉద్యానవనములు, పార్కులు 14. రియల్ ఎస్టేట్ 15. ఇ–గవర్నెన్స్ ప్రాజెక్టులు, ఐటీ మౌలిక సదుపాయాలు 16. ప్రైవేట్ రంగ కంపెనీలు, కంపెనీల కన్సార్టియంతో ఉమ్మడి అభివృద్ధి ఒప్పందం, జాయింట్ వెంచర్ ద్వారా పట్టణాభివృద్ధి 17. ఫైబర్ గ్రిడ్, వై–ఫై సర్వీసులతో సహా టెలి కమ్యునికేషన్, బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులు 18. పునరుత్పాదక (సౌర–పవన) ఇంధన ప్రాజెక్టులతో సహా విద్యుత్ ఉత్పాదన, ప్రసారం, పంపిణీ 19. హై–వే ప్రాజెక్టులలో ఏకీకృత భాగంగా ఉన్న గృహ నిర్మాణం లేదా ఇతర కార్యకలాపాలతో సహా ఇతర హై–వే ప్రాజెక్టులు 20. ట్రాన్స్పోర్ట్ టెర్మినల్స్, డిపోలు 21. పట్టణ రవాణా ప్రాజెక్టులతో సహా రైల్వే వ్యవస్థ 22. ఓడ రేవులు, అంతర్దేశీయ ఓడరేవులు 23. లాజిస్టిక్ హబ్లు స్వేచ్ఛా వాణిజ్య ప్రదేశాలతో సహా పరిమితి లేకుండా వాటికి విమానాశ్రయాలు 24. ఆకర్షణీయ నగర ప్రాజెక్టులతో సహా పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు 25. విద్యా సంస్థలు -
‘ఎంతో పుణ్యం చేస్తేనే బ్రాహ్మణుడిగా పుడతాడు’
తిరువనంతపురం: కేరళ హై కోర్టు న్యాయమూర్తి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇక్కడ ఆయన ఎవరిని కించపర్చలేదు.. కానీ ఓ సామాజిక వర్గం వారిని కీర్తించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేరళకు చెందిన వి.చింతాబరేష్ హై కోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. రాజ్యాంగబద్దంగా ఒక ఉన్నత పదవిలో ఉన్న ఆయన.. ఏ సామాజిక వర్గానికి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. కానీ ఆ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా.. బ్రాహ్మణుల గుణగణాలను కీర్తించడంలో మునిగిపోయాడు చింతాబరేష్. వివరాలు.. కొద్ది రోజుల క్రితం చింతాబరేష్ తమిళ్ బ్రాహ్మణ్స్ గ్లోబల్ మీట్కు హాజరయ్యారు. సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘పూర్వజన్మ సుకృతం ఉంటేనే బ్రాహ్మణుడిగా పుడతారు. బ్రాహ్మణుడు ద్విజుడు.. అంటే రెండు జన్మలు కలవాడు. శుభ్రమైన అలవాట్లు, ఉన్నతమైన ఆలోచనలు, గొప్ప వ్యక్తిత్వం, శాఖహారి, కర్ణాటక సంగీతాన్ని ఇష్టపడే లక్షణాలన్ని ఒక్క బ్రాహ్మణుడిలో మాత్రమే ఉంటాయి. గత జన్మలో ఎన్నో మంచి పనులు చేస్తేనే ఈ బ్రాహ్మణ జన్మ లభిస్తుంది. ఇంత ఉన్నతులైన బ్రాహ్మణులకు సమాజంలో సముచిత స్థానం దక్కడం లేదు. వారు మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కుల ఆధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బ్రాహ్మణులు ఆందోళన చేయాలని’ ఈ సందర్భంగా చింతాబరేష్ పిలుపునిచ్చారు. దేశంలో ఉన్నతమైన పదవి దక్కించుకోవడానికి బ్రాహ్మణులకే ఎక్కువ అర్హతలు ఉన్నాయన్నారు చింతాబరేష్. బ్రాహ్మణ సమాజంలోకి ఇతరులను అనుమతించకూడదన్నారు. బ్రాహ్మణుడు స్వచ్ఛమైన లౌకికవాది.. ప్రజలను ప్రేమిస్తూ.. వారి శ్రేయస్సు కోసం ఉదారంగా విరాళాలు ఇచ్చేవాడు. అలాంటి వాడు అధికారంలో ఉండే జనాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం న్యాయమూర్తి వ్యాఖ్యల పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కాబోయే హిమాచల్ సీజేకు వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్కు హైకోర్టు గురువారం ఘనం గా వీడ్కోలు పలికింది. మొదటి కోర్టు హాల్లో జరిగిన వీడ్కోలు సభకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ అధ్యక్ష త వహించారు. జస్టిస్ రామసుబ్రమణియన్ను పదోన్నతిపై హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. కేసుల్ని సత్వరంగా పరిష్కరించడంలో, విభి న్న కేసుల్లో ఆయన అందించిన న్యాయసేవల్ని జస్టిస్ చౌహాన్ కొనియాడారు. ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నప్పటి నుంచి హైకోర్టులో న్యాయవాదు లు, సిబ్బంది అందించిన సహకారానికి జస్టిస్ రామసుబ్రమణియన్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, పలువురు న్యాయవాదులు, జస్టిస్ రామసుబ్రమణియన్ భార్య సరస్వతి, కుమారుడు దర్శన్, కోర్టు సిబ్బంది హాజరయ్యారు. ఈ బదిలీతో హైకోర్టులో ఏసీజేతో కలిపి న్యాయమూర్తుల సంఖ్య 11కు తగ్గింది. 13 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యాలయంలో కూడా జస్టిస్ రామసుబ్రమణియన్కు న్యాయవాదులు జ్ఞాపికను అందజేసి వీడ్కోలు పలికారు. ఇదిలా ఉండగా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చౌహాన్తో గవర్నర్ నరసింహన్ 22న ప్రమాణస్వీకారం చేయించనున్నారు. -
ప్రక్షాళన దిశగా..
-
అవినీతి రహిత పాలన దిశగా..
సాక్షి, అమరావతి: ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుం బిగించారు. అవినీతితో కునారిల్లిపోయిన టెండరింగ్ విధానంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అవినీతి జరిగిందని న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తున్న స్థితిని మార్చి, అవినీతికి ఏ మాత్రం ఆస్కారం లేకుండా న్యాయ వ్యవస్థ చేతికే టెండరింగ్ విధాన నిర్ణయాన్ని అప్పగించాలని నిర్ణయించారు. దేశంలోనే తొలిసారిగా, దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా గొప్ప పారదర్శక విధానానికి శ్రీకారం చుడుతూ అడుగు వేశారు. సీఎం పదవి స్వీకరిస్తూ, మే 30న తాను ప్రకటించిన విధంగా టెండర్ విధానంలో సంస్కరణలు కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ను వైఎస్ జగన్ కలిశారు. సాయంత్రం 6 గంటలకు ఏసీజే ఇంటికి వెళ్లిన ఆయన దాదాపు గంట పాటు అక్కడ గడిపారు. సీఎం వెంట ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం, అడ్వొకేట్ జనరల్గా నియమితులైన సుబ్రహ్మణ్యం శ్రీరామ్, అదనపు అడ్వొకేట్ జనరల్గా నియమితులు కానున్న పొన్నవోలు సుధాకర్రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఏసీజేను జగన్మోహన్రెడ్డి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం టెండర్లలో అవినీతికి ఆస్కారమే లేని పారదర్శక విధానాన్ని తీసుకు వచ్చేందుకు ప్రత్యేకమైన జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాల్సిందిగా ఏసీజేకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఇందు కోసం ప్రత్యేకించి ఒక హైకోర్టు జడ్జిని కేటాయించాలని కోరారు. హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలోని కమిషన్కు, సిబ్బందికి అయ్యే వ్యయం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కమిషన్ సూచన మేరకు టెండర్ల ప్రక్రియలో మార్పులు వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పిలిచే టెండర్లను ముందుగానే హైకోర్టు జడ్జి నేతృత్వంలోని కమిషన్కు పంపుతామని, టెండర్కు సంబంధించిన అంశాలపై జుడిషియల్ కమిషన్ సంబంధిత ప్రభుత్వ అధికారులతో చర్చించి మార్పు, చేర్పుల్ని సూచిస్తే ఆ ప్రకారంగానే టెండర్లు పిలుస్తామని ముఖ్యమంత్రి జగన్.. ఏసీజేకు విన్నవించారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒక టైలర్ మేడ్గా, అంటే.. కమీషన్ల కోసం తాను ముందుగానే నిర్ణయించుకున్న కాంట్రాక్టర్కు ఉన్న అనుభవం, అర్హతల ప్రకారం టెండర్ నిబంధనలు తయారు చేసి, వారికే టెండర్ దక్కేలా చేసిన విధానం వల్ల వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తున్న సమయంలోనే ప్రజలకు వివరించిన విషయం తెలిసిందే. ప్రతి టెండర్లోనూ 20 నుంచి 25 శాతం మేర అవినీతి జరిగిందని, ఆమేరకు ప్రజాధనాన్ని మిగిల్చే విధంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తామని కూడా ఆయన ఇదివరకే ప్రకటించారు. తద్వారా ఇరిగేషన్ కాంట్రాక్టులంటేనే అవినీతి, అక్రమాలకు మారుపేరుగా మారిన పరిస్థితి నుంచి పూర్తి పాదర్శకమైన విధానాన్ని అమలు చేయడానికి ముందడుగు వేశారు. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా సంస్కరణలు తీసుకురానున్నారు. -
ఇది న్యాయమేనా?!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మేఘాలయ హైకోర్టు ఒక దురదృష్టకర తీర్పు వెలువ రించింది. స్థానిక పత్రిక ‘షిల్లాంగ్ టైమ్స్’ సంపాదకురాలు పట్రిషియా ముఖిం, ప్రచురణకర్త శోభా చౌధురిలు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని నిర్ధారిస్తూ కోర్టు సమయం ముగిసేవరకూ న్యాయ స్థానంలో ఒక మూల కూర్చోవాలని శిక్ష విధించడంతోపాటు ఇద్దరూ చెరో రెండు లక్షల రూపా యలూ జరిమానా చెల్లించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. జరిమానా చెల్లించకపోతే ఆర్నెల్లు జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. అదేవిధంగా ఆ పత్రిక ముగిసిపోతుందని(నిషేధానికి గురవుతుందని) కూడా న్యాయస్థానం తేల్చిచెప్పింది. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఆరేళ్లక్రితం రిటైరైన జస్టిస్ శైలేంద్రకుమార్ 2010లో కోర్టు ధిక్కారం కింద శిక్షించే అధికారాన్ని దుర్వినియోగం చేయడం న్యాయమూర్తులకు రివాజుగా మారిందని వ్యాఖ్యానించారు. ఫలితంగా సరిగా ఆలోచించేవారికి, నమ్మినదానికి కట్టుబడి ఉండే సాహసికులకు ఇబ్బందులెదురవుతున్నా యని చెప్పారు. ఆయనే కాదు... వివిధ సందర్భాల్లో జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్, జస్టిస్ జేఎస్ వర్మ వంటి న్యాయకోవిదులు సైతం కోర్టు ధిక్కార నేరాన్ని న్యాయస్థానాలు అత్యంత జాగురూకతతో వినియోగించాలని హితవు పలికారు. న్యాయమూర్తుల పదవీ విరమణానంతరం వారికి అందా ల్సిన సదుపాయాలపై మేఘాలయ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ‘షిల్లాంగ్ టైమ్స్’ పత్రిక రెండు కథనాలు ప్రచురించింది. ఈ విషయంలో పత్రికపై ఎలాంటి చర్య తీసుకోవాలో సూచించడానికి కోర్టు సహాయకులుగా నియమించిన న్యాయవాదులపై సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేశా రని, ఆ పోస్టుల్లో న్యాయవ్యవస్థను హేళన చేశారని ధర్మాసనం భావించింది. మీడియా స్వేచ్ఛ అంటే మీడియా సంస్థలు ఇష్టానుసారం రాసే స్వేచ్ఛ కాదు. జరిగిన ఉదంతాలను, మాట్లాడిన మాటలను వక్రీకరించే స్వేచ్ఛ అంతకన్నా కాదు. అది భావ ప్రకటనా స్వేచ్ఛకు పూచీ పడుతున్న రాజ్యాంగంలోని 19(1)(ఏ) ద్వారా ప్రజలకు సమకూరిన హక్కు. ఈ హక్కును దుర్వినియోగం చేస్తూ, అవాంఛనీయ పోకడలకు పోతూ ఇష్టానుసారం ప్రవర్తించే మీడియా సంస్థలు లేకపోలేదు. ప్రజలకు గల తెలుసుకునే హక్కును గుర్తించి, గౌరవించి దాన్ని బాధ్యతగా వినియోగించని మీడియా సంస్థలు ఎంతో కాలం మనుగడ సాగించలేవు. ఎప్పటి కప్పుడు లోటుపాట్లను సరిదిద్దుకుంటూ, విశ్వసనీయతను పెంచుకోవడానికి ప్రయత్నించని సంస్థలు మీడియాలో మాత్రమే కాదు...ఏ రంగంలోనూ నిలబడలేవు. అత్యధిక మీడియా సంస్థలు ఎన్నో పరిమితుల్లో శక్తివంచన లేకుండా తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి. ఈ క్రమంలో వాటికి రాజకీయ నాయకుల నుంచి, అవినీతి అధికారుల నుంచి, భూ కబ్జాదారులనుంచి, మాఫియా ముఠాల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. నిజాలు వెల్లడించినందుకు, ప్రజల్ని అప్రమత్తం చేసి నందుకు ఎందరో పాత్రికేయులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో అత్యంత ప్రధానమైన న్యాయవ్యవస్థ మీడియాకు అండగా నిలబడాలని అందరూ కోరుకుంటారు. పౌరుల భావప్రకటనా స్వేచ్ఛ భద్రంగా ఉండాలంటే ఇదెంతో అవసరం. కానీ మేఘాలయ హైకోర్టు వెలువరించిన తీర్పు దానికి విరుద్ధంగా ఉంది. ‘షిల్లాంగ్ టైమ్స్’ ప్రచురించిన మొదటి కథనం నిరుడు డిసెంబర్ 6 నాటిది. జస్టిస్ ఎస్ఆర్ సేన్ ఇచ్చిన ఆ తీర్పు రిటైరైన న్యాయమూర్తులకూ, వారి కుటుంబాలకు కల్పించాల్సిన సదుపాయాలు, భద్రతకు సంబంధించింది. ఆ వార్త తీర్పులోని అంశాలను యధాతథంగా ఇచ్చింది తప్ప ఎలాంటి వ్యాఖ్యానమూ చేయలేదు. అదే నెల 12న ప్రచురించిన రెండో కథనం సైతం ఆ కోవలోనిదే. ఆ సదుపాయాల జాబితాను ఇచ్చింది. రిటైరైన న్యాయమూర్తులకు ప్రొటోకాల్ అమలు, గెస్ట్హౌస్ సదుపాయం, వారి కుటుంబసభ్యులకు వైద్యసాయం, ఇంకా మొబైల్/ఇంటర్నెట్ చార్జీలు ఇవ్వడం వంటివన్నీ అందులో ఉన్నాయి. అంతక్రితం మరో ఇద్దరు న్యాయమూర్తులు ఇచ్చిన ఈ మాదిరి తీర్పును ఆ కథనం ప్రస్తావించింది. రిటైరైనవారికి జడ్ కేటగిరి, వై కేటగిరి భద్రత కల్పించాలని ఆదేశిస్తూ ఇచ్చిన ఆ తీర్పును గుర్తుచేసింది. మార్చి నెలలో జస్టిస్ ఎస్ఆర్ సేన్ రిటైర్ కాబో తున్నారని తెలిపింది. అంతేతప్ప ఆయనకు ఎలాంటి ఉద్దేశాలనూ ఆపాదించలేదు. రిటైర్ కాబో తున్నవారు ఇలాంటి తీర్పులివ్వడం చట్టవిరుద్ధమనిగానీ, అనుచితమనిగానీ అనలేదు. అయినా ఆ కథనంపై ముఖిం బేషరతుగా క్షమాపణలు చెప్పారు. శిక్షను తప్పించుకోవడానికే ఆమె క్షమాపణ కోరుతున్నారని న్యాయమూర్తి భావించారు. విశేషమేమంటే రిటైరైన న్యాయమూర్తులకు వై కేటగిరి, జడ్ కేటగిరి భద్రత కల్పించాలంటూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రిటైరైన న్యాయమూర్తులకు సాధారణ భద్రత సరిపోతుందని తేల్చిచెప్పింది. కోర్టు ధిక్కార చట్టం ఏ ఏ అంశాలు కోర్టు ధిక్కారం కిందికొస్తాయో చెబుతోంది. న్యాయ కార్యకలాపాలను సముచితమైన, ఖచ్చితమైన సమాచారంతో తెలిపినా... న్యాయస్థానం వెలువ రించిన తీర్పులోని యోగ్యతాయోగ్యతలపై సముచితమైన విమర్శ, వ్యాఖ్య చేసినా కోర్టు ధిక్కారం కిందకు రాదని చట్టం చెబుతోంది. దాని ప్రకారం తప్పుడు రాతలు, దురుద్దేశపూర్వకమైన రాతలు మాత్రం కోర్టు ధిక్కారమవుతాయి. ఎందుకంటే అవి న్యాయమూర్తుల ప్రవర్తనపై సంశయాలను కలిగిస్తాయి. అంతిమంగా దేశంలో న్యాయ పాలనకు విఘాతం కలిగిస్తాయి. కానీ ‘షిల్లాంగ్ టైమ్స్’ కథనాలు ఈ పరిధిలోకొస్తాయని అనుకోలేం. అవి తీర్పును తప్పుబట్టలేదు. వ్యక్తిగత ప్రయో జనాలు పొందేందుకే ఈ తీర్పునిచ్చారనలేదు. అయినా కోర్టు ధిక్కార చట్టం కింద చర్యలు తీసుకోవడం విచారకరం. ఈ విషయంలో ఎడిటర్స్ గిల్డ్, పాత్రికేయ సంఘాలు వ్యక్తం చేస్తున్న ఆందోళన సహేతుకమైనది. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని పత్రికాస్వేచ్ఛను పరి రక్షిస్తుందని ఆశిద్దాం. -
విజయవాడ చేరుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు
-
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్
-
దిమ్మతిరిగిపోయే హైకోర్టు తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : ‘హిందువులంతా సహజంగానే భారత పౌరులు’ అనే ఆరెస్సెస్ నినాదాన్ని పునరుద్ఘాటిస్తూ మేఘాలయ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఆర్ సేన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి దిమ్మతిరిగిపోయే తీర్పును వెలువరించారు. ‘2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారత పౌరసత్వ సవరణ బిల్లు ప్రకారం దేశంలోని హిందువులు, సిక్కులు, జైనులు, బుద్ధిస్టులు, పార్శీలు, క్రైస్తవులు, ఖాసీలు, జెంటియాలు, గారోలులకు భారత పౌరసత్వం మంజూరు చేయండి’ అంటూ తీర్పు చెప్పారు. ఇప్పటికే భారత్లో శాశ్వత నివాసం ఉంటున్న వీరికే కాకుండా భవిష్యత్తులో భారత్కు వచ్చే ఈ జాతులకు చెందిన వారందరికి భారత పౌరసత్వం మంజూరు చేయాల్సిందేనన్నారు. వీరంతా కూడా హిందువుల కిందకే వస్తారని పరోక్షంగా చెప్పారు. బహూశ హిందూ ఓ మతం కాదని, అది ఓ జీవన విధానమన్న బీజేపీ విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకొని ఈ ఆదేశాలు జారీ చేసినట్లున్నారు. ఆ మాటకొస్తే ఆరెస్సెస్ చెప్పే చరిత్ర ప్రకారం ‘అఖండ్ భారత్’ అంటే అఫ్ఘానిస్తాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలు కూడా వస్తాయని అన్నారు. ఆ మాటకొస్తే ఆ దేశాల పౌరులకు కూడా పౌరసత్వం మంజూరు చేయాల్సి ఉంటుందన్న హెచ్చరిక కాబోలు! అంతేకాకుండా తానిచ్చిన ఈ తీర్పు ప్రతిని ప్రధాన మంత్రి, కేంద్ర న్యాయ, హోం మంత్రులకు కూడా పంపించాలని సూచించారు. తాము పుట్టిన నేల, తాము పూర్వికులు నమ్ముకున్న నేల భారత్ అయినప్పుడు అందరికి పౌరసత్వం ఇవ్వాల్సిందేనని జస్టిస్ సేన్ చెప్పారు. ఈ దేశం నుంచి పాకిస్థాన్ మతం ప్రాతిపదికన విడిపోయి ఇస్లామిక్ రాజ్యాంగ ప్రకటించుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ అప్పుడే భారత్ కూడా తమది ‘హిందూ’ రాజ్యమని ప్రకటించుకొని ఉండాల్సిందని, లౌకిక రాజ్యం కనుక భారత్లోని అన్ని మతాల వారికి పౌరసత్వ హక్కు ఉంటుందన్నారు. భారత గడ్డపై స్థిర నివాసం ఏర్పరుచుకొని, భారతీయ చట్టాలను గౌరవిస్తున్న ముస్లింలకు కూడా పౌరసత్వం ఇవ్వాల్సిందేనన్నారు. 2016లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంలోని ముస్లిం మతస్థుల ప్రస్తావన కూడా లేని విషయాన్ని ఆయన దష్టిలో పెట్టుకున్నట్లుంది. భారతీయ పౌరులెవరో తేల్చడానికి అస్సాంలో సవరించిన పౌరసత్వ జాబితాలో గల్లంతయిన 40 లక్షల మందికి కూడా పౌరసత్వం ఇవ్వాల్సిందేనని జస్టిస్ సేన్ పరోక్షంగా సూచించారు. బంగ్లా ముస్లింలుగా భావిస్తున్న వారంతా బెంగాల్ నుంచి వచ్చినవాల్లేనని, బెంగాల్ పలు సార్లు హింసాకాండతో విడిపోయిందని, ఫలితంగా శరణార్థులు భారత్లోని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన చరిత్ర పుటల్లోని పలు అంశాలను ప్రస్తావించారు. అస్సాం దురాక్రమణ గురించి, బెంగాల్ విభజన, బంగ్లాదేశ్ యుద్ధం తదితర అనేక అంశాలను ఆయన గుర్తు చేశారు. చరిత్రకు సంబంధించి కోర్టు నియమించిన కమిటీలు సమర్పించిన వివిధ నివేదికల్లోని అంశాలను ప్రస్తావించారు. పాకిస్థాన్ విడిపోయినప్పుడు భారత్ తనది ‘హిందూ’ దేశంగా ప్రకటించుకొని ఉండాల్సిందన్న సేన్ వ్యాఖ్యలపై సీపీఎం నాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ జడ్జీని తొలగించాల్సిందిగా డిమాండ్ చేసింది. దీనిపై కూడా జస్టిస్ సేన్ స్పందిస్తూ ‘నేను లౌకిక వాదానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాను. మత పరమైన వేధింపులకు, దాడులకు గురైన వారికి న్యాయం జరగాలన్నదే నా అభిమతం’ అని చెప్పారు. -
రాజీనామాను ఉపసంహరించుకున్న జస్టిస్ బాలయోగి
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నక్కా బాలయోగి తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ బాలయోగి న్యాయమూర్తి పదవికి రాజీనామా చేయగా, ఈ నెల 15 నుంచి ఆ రాజీనామా అమల్లోకి వస్తుందంటూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 3న నోటిఫికేషన్ ఇచ్చింది. ఈలోపే జస్టిస్ బాలయోగి తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. రాజ్యాంగ పరమైన పోస్టుల్లో ఉన్న వ్యక్తులు రాజీనామా సమర్పించినప్పుడు, అది ఫలానారోజు నుంచి అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్లో పేర్కొంటే, ఆలోపు రాజీనామాను ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంది. ఒకవేళ నోటిఫికేషన్లో ఫలానా తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొనకపోతే ఆ రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని భావించాల్సి ఉంటుంది. ఈ నెల 15 నుంచి జస్టిస్ బాలయోగి రాజీనామా అమల్లోకి వస్తుందని పేర్కొన్న నేపథ్యంలో ఆయన గడువులోపే తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. దీంతో ఆయన 2019 జనవరి 14న పదవీ విరమణ చేయనున్నారు. -
అన్నికోణాల్లో పరిశీలించి తీర్పు ఇవ్వాలి
లీగల్(కడప అర్బన్): కేసులకు సంబంధించి తీర్పులిచ్చేటప్పుడు అన్నికోణాల్లో పరిశీలించాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, పోర్ట్ఫోలియో జడ్జి జి. శ్యాం ప్రసాద్ అన్నారు. హైకోర్టు, న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయమూర్తులకు కేసుల్లో తీర్పు ఇచ్చే విధానం, నూతనంగా ఆలోచించేవిధానం గురించి వర్క్షాపు నిర్వహించారు. వర్క్షాపును ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చట్టాలను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించేది న్యాయమూర్తులేనన్నారు. కొత్తగా విధుల్లోకి వచ్చిన మేజిస్ట్రేట్లు ఆవేశపడకూడదన్నారు. కేసుల విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి, న్యాయవాదుల వాదనలను ఓపికగా వినాలన్నారు. ప్రొసీజర్లాను ప్రతి న్యాయమూర్తి అనుసరించాలన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టులవారు ఇచ్చిన తీర్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తొలుత ఆయన గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కోర్టు ఆవరణలో మొక్కనాటి నీళ్లు పోశారు. అనంతరం న్యాయమూర్తులందరూ ఆయనతో కలిసి గ్రూప్ఫొటో దిగారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి కేజి శంకర్, గుంటూరు న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షుడు మహమ్మద్ సుల్తానా సిరాజుద్దీన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్. ప్రవీణ్కుమార్, శాశ్వతలోక్ అదాలత్ చైర్మన్ విష్ణుప్రసాద్ రెడ్డి, జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి సుధాకర్, నాల్గవ అదనపు న్యాయమూర్తి చక్రపాణి, ఆరో అదనపు న్యాయమూర్తి బి. మంజరి, మేజిస్ట్రేట్లు ప్రత్యూషకుమారి, పద్మశ్రీ, పవన్కుమార్, అశోక్కుమార్ పాల్గొన్నారు. -
30 రోజుల్లో 33 మంది జడ్జీల నియామకం
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దేశంలోని వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టులో జడ్జీల నియామక వేగం పెరిగింది. జస్టిస్ గొగోయ్ గతనెల 3న 46వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 30 రోజుల్లో ఆయన ఆరు సార్లు కొలీజియం భేటీని నిర్వహించారు. కొలీజియంలో సీజేఐతో కలుపుకుని ఐదుగురు జడ్జీలున్నారు. కలకత్తా, బాంబే, సిక్కిం, గౌహతి, ఉత్తరాఖండ్ హైకోర్టులకు ప్రధాన జడ్జీలను కొలీజియం నియమించింది. బాంబే, కలకత్తా హైకోర్టుల్లోనే న్యాయమూర్తులుగా పనిచేస్తున్న ఎన్హెచ్ పాటిల్, డీకే గుప్తాలను అవే హైకోర్టుల ప్రధాన జడ్జీలుగా నియమించేందుకు ఎంవోపీ (మెమరాండం ఆఫ్ ప్రొసీజర్)ను కొలీజియం వినియోగించింది. సాధారణంగా ఇలా చేయడం అరుదు. కర్ణాటక, కేరళ, మద్రాస్, గౌహతి, మధ్యప్రదేశ్, కలకత్తా, పంజాబ్, హరియాణ, అలహాబాద్, ఒడిశా, ఉత్తరాఖండ్ హైకోర్టులకు కొత్త జడ్జీల పేర్లను కొలీజియం ప్రతిపాదించింది. -
పిటిషన్పై హైకోర్టు విచారణ రేపటికి వాయిదా
-
హైకోర్టు జడ్జి పోస్టులకు ఏడుగురి పేర్లు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల ఖాళీల భర్తీలో భాగంగా న్యాయమూర్తుల పోస్టులకు న్యాయాధికారుల కోటా నుంచి ఏడుగురి పేర్లను సుప్రీంకోర్టుకు హైకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. దీనికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తులు జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్తో కూడిన కొలీజియం ఇటీవల ప్రత్యేకంగా సమావేశమైంది. కొలీజియం పంపిన ఏడుగురు న్యాయాధికారుల జాబితా కేంద్రానికి కూడా చేరింది. కొలీజియం సిఫారసు చేసిన న్యాయాధికారుల్లో విశాఖపట్నం ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్ జిల్లా జడ్జి బొడ్డుపల్లి శ్రీ భానుమతి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ) చీకటి మానవేంద్రనాథ్రాయ్, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి పి.శ్రీసుధ, సీబీఐ కోర్టుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి మటం వెంకటరమణ, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ చిల్లకూర్ సుమలత, గుంటూరు ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్ జడ్జి హరిహరనాథశర్మ, తూర్పు గోదావరి ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్ జడ్జి ఎన్.తుకారాంజీ ఉన్నారు. ఈ పేర్లతో పాటు న్యాయవాదుల కోటా నుంచి వెళ్లిన ఏడుగురు న్యాయవాదుల పేర్లకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్ తన అభిప్రాయాలను కేంద్రానికి పంపగా, ఏపీ సీఎం చంద్రబాబు ఇంకా తన అభిప్రాయాలను పంపలేదని తెలిసింది. -
పది లక్షల మందికి 19 మంది జడ్జీలు
న్యూఢిల్లీ: దేశంలో ప్రతి పది లక్షల మందికి సరాసరిన 19 మంది చొప్పున జడ్జీలున్నారని కేంద్ర న్యాయ శాఖ వెల్లడించింది. దిగువ కోర్టుల్లోని ఐదు వేల మందితోపాటు దేశవ్యాప్తంగా మొత్తం 6వేల మంది జడ్జీల కొరత ఉందని స్పష్టం చేసింది. పార్లమెంట్లో చర్చ కోసం రూపొందించిన ఈ నివేదికను న్యాయ శాఖ ఈ ఏడాది మార్చిలో తయారు చేసింది. దీని ప్రకారం దేశంలో జడ్జీలు– ప్రజల నిష్పత్తి 10,00,000:19.49గా ఉంది. దిగువ కోర్టుల్లో 5,748, హైకోర్టుల్లో 406 జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దిగువ కోర్టుల్లో ఆమోదిత సిబ్బంది సంఖ్య 22,474 కాగా ప్రస్తుతం 16,726 మందే పనిచేస్తున్నారు. అలాగే, హైకోర్టుల్లో 1079 గాను ప్రస్తుతం 673 మంది సిబ్బందే ఉన్నారు. సుప్రీంకోర్టులో 31 మంది న్యాయమూర్తులకు గాను 25 మంది ఉన్నారు. ప్రతి పది లక్షల మంది ప్రజలకు 50 మంది జడ్జీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని 1987లోనే న్యాయ కమిషన్ ప్రతిపాదించగా ఇప్పటికీ ఆ పరిస్థితి మారలేదని 2016లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఆందోళన వ్యక్తం చేశారు. జడ్జీల పోస్టుల్లో ఖాళీల కారణంగా దేశ వ్యాప్తంగా జిల్లా, దిగువ స్థాయి కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య 2.76 కోట్లకు చేరిందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఇటీవల తెలిపారు. -
జస్టిస్ సురేశ్ కెయిత్ బదిలీకి సుప్రీంకోర్టు సిఫారసు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్కుమార్ కెయిత్ బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రానికి రెండు రోజుల క్రితం సిఫారసు చేసింది. ఢిల్లీ హైకోర్టు నుంచి ఉమ్మడి హైకోర్టుకు బదిలీపై వచ్చిన జస్టిస్ కెయిత్ తనను తిరిగి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ ఈ ఏడాది జూలై 9న సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. తాను ఎందుకు ఢిల్లీకి బదిలీ కోరుతున్నానో కారణాలు కూడా వివరించారు. రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు కొలీజియం సమావేశం జరగ్గా, అందులో జస్టిస్ కెయిత్ బదిలీ అంశం చర్చకు వచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఎ.కె.సిక్రీలతో కూడిన కొలీజియం జస్టిస్ కెయిత్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించింది. ఆయన కోరుకున్న విధంగా తిరిగి ఆయనను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు కేంద్రానికి సిఫారసు చేస్తూ తీర్మానం చేసింది. కొలీజియం సిఫారసును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపుతుంది. అనంతరం బదిలీ ఉత్తర్వులపై రాష్ట్రపతి సంతకం చేస్తారు. 2008లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ కెయిత్ నియమితులయ్యారు. 2013లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులై, 2016లో ఉమ్మడి హైకోర్టుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో 6వ స్థానంలో కొనసాగుతున్నారు. -
ఒక్క వాయిదాకు లక్షల్లో ఫీజులా?!
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఒక్కో వాయిదాకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల చొప్పున ఫీజులు వసూలు చేస్తుండటంపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వామననావు అభ్యంతరం తెలిపారు. ఇలా భారీ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తుండటంపై పునరాలోచన చేయాలని కోరారు. కోర్టులో కేసు విచారణకు రాకపోయినా ఫీజు తీసుకుంటున్నారని, ఈ తరహా దోపిడీ విధానానికి స్వస్తి పలకాలని కోరారు. ఢిల్లీలో రాజీకి వచ్చిన ఒక కేసులో రూ.30 లక్షల ఫీజు తీసుకున్నారని, ఈ విధానం కొనసాగితే రాజీకొచ్చిన కంపెనీల పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్లో అంతర్జాతీయ వివాదాల పరిష్కారాల ప్రత్యామ్నాయ కేంద్రం (ఐసీఏఆర్డీ)–హైదరాబాద్ సెంటర్, తెలంగాణ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సంయుక్తంగా ‘వాణిజ్య వివాదాల సత్వర పరిష్కారం–న్యాయ సంస్కరణలు’అనే అంశంపై సదస్సు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. కేసులో వాదనలకు ఒక్క వాయిదాకే రూ.లక్షలు వసూలు చేసే విధానాన్ని నియంత్రించాలని, ఈ తరహా న్యాయ సంస్కరణలు చాలా అవసరమని అన్నారు. వాది ప్రతివాదులు కేసును రాజీ చేసేందుకు మధ్య వర్తిత్వ వాదనలు ఫైవ్ స్టార్ హోటల్స్లో నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘పేటెంట్ రైట్స్’పై శిక్షణ ఇవ్వాలి పేటెంట్ రైట్స్ గురించి మాట్లాడుతూ.. కింది కోర్టుల్లో చాలా మంది జడ్జీలకు ఈ అంశంపై అవగాహన లేదని, వారికి జ్యుడీషియల్ అకాడమీలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని జస్టిస్ వామనరావు అన్నారు. ఐసీఏఆర్డీకి వచ్చిన కేసు మూడు నెలల్లో పరిష్కారం అవుతోందని, కేసులు రాజీ చేయడంలో ప్రపంచంలో భారత్ 145వ స్థానంలో ఉండేదని, సంస్కరణల ఫలితంగా 100వ స్థానానికి వచ్చిందని ఐసీఏఆర్డీ–హైదరాబాద్ కేంద్ర కార్యదర్శి జేఎల్ఎన్ మూర్తి చెప్పారు. గ్రామీణ జనాభాను దృష్టిలో పెట్టుకుని పేటెంట్ రైట్స్ తీసుకురావాలని వర్డిక్ట్ ఐపీ వ్యవస్థాపకుడు అశోక్ రామ్ కుమార్ అన్నారు. సాఫ్ట్వేర్లో భారతీయులు, ప్రధానంగా తెలుగు వారు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నా సాఫ్ట్వేర్పై పేటెంట్ రైట్స్ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పేటెంట్ రైట్స్ పొందడం వల్లే రెడ్డి ల్యాబ్స్ ఉత్పత్తి చేసిన మందును గత ఇరవై ఏళ్లుగా ఇతర దేశాలు ఉత్పత్తి చేయనీయకుండా అడ్డుకుందని, ఇదే తరహాలో గ్రామీణ స్థాయిలో పేటెంట్ రైట్స్ పొందాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పారు. సీఐఐ డైరెక్టర్ సుభజిత్ షా తదితరులు ప్రసంగించారు. -
ఏయే ఆస్తులు కొంటారో స్పష్టంగా చెప్పండి
-
అలా తెలంగాణకు న్యాయం జరగదు
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయాధికారుల విభజనకు సీనియారిటీని ప్రాతిపదికగా ఎంచుకుంటే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టుకు తెలంగాణ న్యాయాధికారుల సంఘం నివేదించింది. స్థానికత ఆధారంగానే విభజించాలని విజ్ఞప్తి చేసింది. న్యాయాధికారుల విభజనలో సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకోవాలని హైకోర్టు రూపొందించిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ తెలంగాణ న్యాయాధికారుల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్ జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. మంగళవారం ఈ మేరకు తెలంగాణ న్యాయాధికారుల సంఘం తరఫున సీనియర్ న్యాయవాదులు సల్మాన్ ఖుర్షీద్, హుజేఫా అహ్మదీ తమ వాదనలు వినిపించారు. స్థానికత ఆధారంగానే విభజించండి సల్మాన్ ఖుర్షీద్ తన వాదనలు ప్రారంభిస్తూ ‘‘న్యాయాధికారుల పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. తెలంగాణ నుంచి అతి తక్కువ మంది ఉన్నారు. ఏపీకి చెందిన సీనియర్ న్యాయాధికారులు తెలంగాణను ఎంచుకుంటే.. తెలంగాణ న్యాయాధికారులకు న్యాయం జరగదు. సామాజిక, ఆర్థిక అంశాల్లో తెలంగాణ అభివృద్ధి కోసమే ఈ విభజన అంటూ లక్ష్యాలు, కారణాలు శీర్షికన ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం పేర్కొంది. ఇదే విషయం సెక్షన్ 80లో కూడా ప్రతిబింబించింది. అందువల్ల సీనియారిటీ ప్రాతిపదికన కాకుండా నేటివిటీ ఆధారంగా న్యాయాధికారుల విభజన జరపాలి.. లేదంటే తెలంగాణలో, ఏపీలో ఏపీ అధికారులే సీనియర్లుగా ఉండి పదోన్నతులు పొందుతారు’’అని నివేదించారు. మరో సీనియర్ న్యాయవాది హుజేఫా అహ్మది వాదిస్తూ ‘‘ఇతర శాఖల అధికారుల విభజన సందర్భంలో కూడా కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (డీవోపీటీ) ఇదే రకమైన మార్గదర్శకాలను ఖరారు చేసింది. అన్ని శాఖలు ఆయా మార్గదర్శకాలకు అనుగుణంగా విడిపోయినా.. న్యాయశాఖలో మాత్రం అలా అమలు చేయలేదు’’అని పేర్కొన్నారు. ఒకవేళ మిగిలిపోతే ఎలా? ఈ సమయంలో జస్టిస్ ఏకే సిక్రీ జోక్యం చేసుకుంటూ ‘‘తెలంగాణలో తెలంగాణ అధికారులు తక్కువగా ఉన్నారనుకుందాం. వారిని తెలంగాణకు కేటాయించారనుకుందాం. ఇంకా అక్కడ ఖాళీలు ఏర్పడి.. ఏపీలో మాత్రం ఏపీ అధికారులతో భర్తీ చేసినా అధికారులు మిగిలిపోతే వారిని ఎక్కడ కేటాయిస్తారు?’’అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున హరిన్ రావల్ స్పందిస్తూ.. ‘‘రాష్ట్రం ఏర్పడింది ఇక్కడి వారిని స్థానికత ప్రాతిపదికన నియమించుకోవడానికి..’’అని వివరించబోయారు. దీనికి జస్టిస్ ఏకే సిక్రీ.. ‘‘నాకు సమస్య అర్థమైంది. వారిని ఇక్కడ ఎందుకు అనుమతించాలని మీరు చెప్పాలనుకుంటున్నారు’’అని అన్నారు. హరిన్ రావల్ స్పందిస్తూ ‘‘ఏపీ అధికారులు సీనియారిటీ ప్రాతిపదికన హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందే అవకాశాన్ని బట్టి ఏపీని ఎంచుకుంటారు. వారికంటే కొద్దిగా తక్కువ సీనియారిటీ ఉన్న వారు తెలంగాణను ఎంచుకుంటారు. తెలంగాణలో ఉన్నదే కొద్దిమంది కాబట్టి ఏపీ వారే సీనియర్లుగా ఉండి వారే ఇక్కడ పదోన్నతి పొందుతారు. అంతిమంగా తెలంగాణ వారు హైకోర్టు న్యాయమూర్తులు కాలేరు’’అని వివరించారు. వాళ్లను కాదనలేం కదా.. హరిన్ రావల్ వాదనపై జస్టిస్ సిక్రీ స్పందిస్తూ ‘‘నియామక పోటీలో వారు అధికారులుగా వచ్చి సీనియారిటీ పొందారు. వాళ్లను కాదనలేం కదా? నేటివిటీ ఆధారంగా అయితే ఇక్కడ తెలంగాణ వారిని ముందుగా కేటాయించి.. తదుపరి వారికంటే సీనియారిటీ ఉన్న ఏపీ అధికారులను జూనియర్లుగా నియమించాల్సి వస్తుంది కదా..’అని ప్రశ్నించారు. కానీ సీనియారిటీ ప్రాతిపదిక అయితే తెలంగాణలో తెలంగాణ అధికారులు ఎప్పటికీ జూనియర్లుగానే ఉంటారని హరిన్ రావల్ పేర్కొన్నారు. హుజేఫా అహ్మది వాదిస్తూ ‘‘పొరుగు రాష్ట్రానికి చెందిన అధికారులకే ఈ పోస్టులు వెళితే తెలంగాణ అధికారులు ఎన్నడూ హైకోర్టు న్యాయమూర్తులు కాలేరు. ఎందుకంటే హైకోర్టు న్యాయమూర్తిగా వెళ్లాలంటే ఫీడర్ పోస్టు జిల్లా న్యాయమూర్తి పోస్టే..’’అని వివరించారు. ‘‘డీవోపీటీ ఇచ్చిన మార్గదర్శకాలను అన్ని శాఖలు అంగీకరించాయి. కానీ హైకోర్టు ఎందుకు అంగీకరించదు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని విభిన్న ప్రాంతాల ప్రజలకు 371డీ సమాన అవకాశాలను కల్పిస్తోంది. ఈ కేసులో దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి’’అని కోరారు. దీనికి ఏపీ న్యాయాధికారుల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు స్పందిస్తూ.. 371డీ న్యాయ శాఖకు వర్తించదని నివేదించారు. ఈ పోస్టులకు దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీ పడొచ్చని వాదించారు. రెండు పట్టికలు సిద్ధం చేయండి ఇప్పటికే ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా సీనియారిటీ ప్రాతిపదికన అయితే ఏ రాష్ట్రానికి ఎంతమంది వెళ్తున్నారు? నేటివిటీ ఆధారంగా అయితే ఏ రాష్ట్రానికి ఎంత మంది వెళ్తున్నారు? అనే అంశాలపై రెండు పట్టికలను సిద్ధం చేయాలని హైకోర్టు రిజిస్ట్రీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ఆర్.వెంకటరమణికి ధర్మాసనం సూచించింది. విచారణను బుధవారానికి వాయిదా వేసింది. విచారణకు తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది ఉదయ కుమార్ సాగర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మరో సీనియర్ న్యాయ వాది వీవీఎస్ రావు, కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ మణిందర్సింగ్ హాజరయ్యారు. -
జోగుళాంబ క్షేత్రంలో హైకోర్టు జడ్జి
జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్): తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక శక్తి పీఠం అలంపూర్ శ్రీ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఆదివారం హైకోర్టు జడ్జి వెంకటశేష సాయి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ మేరకు వారికి ఆలయ ఈఓ నరహరి గురురాజ ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముందుగా ప్రధాన ఆలయమైన బాలబ్రహ్మేశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం జోగుళాంబ అమ్మవారికి శ్రీచక్రార్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారకి క్షేత్ర ప్రాశస్త్యం తెలియజేశారు. తీర్థ, ప్రసాదాలు అందజేసి శేషవస్త్రాలతో వారిని సత్కరించారు. వీరి వెంట కర్నూలు జిల్లా జడ్జి అననుపమచ్రక్రవర్తి, కర్నూలు అడిషనల్ జిల్లా జడ్జి శ్యాంప్రసాద్, కర్నూలు సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ రావు, అలంపూర్ జూనియర్ సివిల్ జడ్జి ఏ.రాధిక, ఎస్.ఐ గడ్డంకాశి , ఏ.ఎస్.ఐ సుబ్బారెడ్డి కోర్టు జూనియర్ అసిస్టెంట్ చిన్నరాజు, పుష్పప్రియ, గిరి ఉన్నారు. -
బార్ కౌన్సిల్స్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారుల నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ న్యాయవాద మండళ్లకి (బార్ కౌన్సిల్స్) ఈ నెల 29న జరగనున్న ఎన్నికలకు రిటర్నింగ్ అధికారులు నియమితులయ్యారు. తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణ, ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు వ్యవహరిస్తారు. ఈ మేరకు బార్ కౌన్సిల్ కార్యదర్శిరేణుక బుధవారం పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 29న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఏపీ ఎన్నికలకు 107 నామినేషన్లు, తెలంగాణ ఎన్నికలకు 86 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. గుర్తింపు కార్డు చూపిన ఓటర్కి బ్యాలెట్ ఇస్తారని, ఏపీలో జూలై 11న, రాష్ట్రంలో జూలై 23న కౌంటింగ్ జరుగుతుందని అన్నారు. -
బీసీలకు బాబు వెన్నుపోటు
సాక్షి, అమరావతి: ‘టీడీపీకి బీసీలే వెన్నుముక.. వారు లేనిదే టీడీపీ లేదు’.. అని పదే పదే నమ్మబలుకుతూ.. ఆ వర్గాల ప్రజలకు నమ్మకద్రోహం చేస్తున్నారంటూ హైకోర్టు రిటైర్డు జడ్జి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య చేసిన ఆరోపణలకు సీఎం చంద్రబాబు వివరణ ఇవ్వకపోవడంపై రాజకీయ పార్టీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. వెనుకబడిన తరగతులకు చెందిన న్యాయవాదులను.. న్యాయమూర్తులు కానివ్వకుండా ఎందుకు అడ్డుకుపడ్డారని ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసం.. సీట్ల కోసం బీసీలను చంద్రబాబు వాడుకుని, ఆ వర్గాల సంక్షేమానికి వచ్చేసరికి వదిలేస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని ఎత్తిచూపుతున్నారు. బీసీ, ఎస్సీ, బ్రాహ్మణ వర్గాలకు చెందిన నలుగురు న్యాయవాదులకు విషయ పరిజ్ఞానం, వ్యక్తిత్వంలేదని.. సచ్ఛీలురు కారని కేంద్ర న్యాయశాఖ మంత్రికి లేఖ రాసి, హైకోర్టు జడ్జిలు కానివ్వకుండా సీఎం చంద్రబాబు అడ్డుపడిన తీరును జస్టిస్ ఈశ్వరయ్య సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టడం ఆ వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తప్పుడు నివేదికలు ఎందుకు ఇచ్చారో వివరణ ఇవ్వాలంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు సమాధానమివ్వాలి : ఆర్.కృష్ణయ్య ఓట్ల కోసమే బీసీలను వాడుకుంటున్న చంద్రబాబు, ఆ తర్వాత వారి వెన్ను విరుస్తున్నారనడానికి జస్టిస్ ఈశ్వరయ్య చేసిన ఆరోపణలు అద్దంపడతున్నాయని బీసీల సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య అభివర్ణించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే జస్టిస్ ఈశ్వరయ్య చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, వెనుకబడిన వర్గాలకు చెందిన న్యాయవాదులను జడ్జిలు కాకుండా ఎందుకు అడ్డుపడ్డారో చెప్పాలంటూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ట్విట్టర్లో సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. తెలివి, పరిజ్ఞానం లేవంటూ బీసీ న్యాయవాదులను జడ్జిలుగా నియమించవద్దని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు సీఎం చంద్రబాబు లేఖ రాసి.. ఆ వర్గాల ప్రజలపట్ల తనకు ఎంత చిత్తశుద్ధి ఉందన్నది చాటిచెప్పారంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కపిలేశ్వరయ్య ఎద్దేవా చేశారు. బీసీలకు నమ్మకద్రోహం చేసిన సీఎం చంద్రబాబును ఆ వర్గానికే చెందిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. బీసీలను రాజకీయంగా.. ఆర్థికంగా.. సామాజికంగా దెబ్బతీయడానికి సీఎం చంద్రబాబు కుతంత్రాలు పన్నుతున్నారన్నది మరోసారి తేటతెల్లమైందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. సామాజికంగా అభివృద్ధి చెందకుండా చేసేందుకే ‘ఆదరణ–2’ పేరుతో కులవృత్తుల పరికరాలు అంటకట్టి, ఆ వర్గాల ప్రజలకు హైకోర్టు జడ్జిలు వంటి ఉన్నత పదవులు దక్కకుండా అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు, ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నిలదీస్తున్నా సీఎం చంద్రబాబు నోరుమెదపకపోవడంలో ఆంతర్యమేమిటని వారంతా ప్రశ్నిస్తున్నారు. వివాదం ఇదీ.. రాష్ట్రానికి చెందిన న్యాయవాదులు అమర్నాథ్ గౌడ్, అభినవ్కుమార్ చావలి, గంగారావు, డీవీ సోమయాజులు, విజయలక్ష్మి, కేశవరావులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు జడ్జిల కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఆ ఆరుగురు న్యాయవాదులపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని సీఎం చంద్రబాబును కేంద్ర న్యాయశాఖ కోరింది. బీసీ వర్గాలకు చెందిన అమర్నాథ్ గౌడ్, అభినవ్ కుమార్ చావలి, ఎస్సీ వర్గానికి చెందిన గంగారావు, బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన డీవీ సోమయాజులకు విషయ పరిజ్ఞానం లేదని.. వ్యక్తిత్వం లేదని.. సచ్ఛీలుకారంటూ మార్చి 21, 2017న సీఎం చంద్రబాబు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు లేఖ రాశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన విజయలక్ష్మి, వెలమ వర్గానికి చెందిన కేశవరావులకు అనుకూలంగా నివేదిక పంపారు. కేంద్ర నిఘా వర్గాల ద్వారా ఆరుగురు న్యాయవాదులపై కేంద్రం ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకుంది. ఆరుగురు న్యాయవాదులకూ న్యాయమూర్తులుగా నియమించవచ్చునని కేంద్ర నిఘా వర్గాలు నివేదిక ఇవ్వడంతో.. ఆ మేరకు కేంద్రం వారిని హైకోర్టు జడ్జిలు నియమించింది. బీసీ, ఎస్సీ, బ్రాహ్మణ సామాజిక వర్గాలకు చెందిన నలుగురు న్యాయవాదులను న్యాయమూర్తులు కానివ్వకుండా అడ్డుపడేందుకు కేంద్రానికి సీఎం చంద్రబాబు రాసిన లేఖలను సోమవారం జస్టిస్ ఈశ్వరయ్య బయటపెట్టడం తీవ్ర సంచలనం రేపింది. సీఎం చంద్రబాబు తీరుపై ప్రధాన రాజకీయ పార్టీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. బీసీలు బుద్ధి చెబుతారు బీసీ న్యాయవాదులు జడ్జిలు కాకుండా వారికి వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీసీలు తగిన బుద్ధి చెబుతారు. బీసీ న్యాయవాదులకు జరుగుతున్న అన్యాయాన్ని ఈశ్వరయ్య బయట పెట్టకుంటే దేశానికి తెలిసేది కాదు. ప్రధానమంత్రిగా బీసీ ఉంటే ఆయనను కూడా చంద్రబాబు తిట్టారు. గ్రామాల్లో పేద బీసీ పిల్లల గురించి సీఎం ఆలోచించడం లేదు. న్యాయవాదులకు రావాల్సిన స్కాలర్షిప్లు రాకుండా చేస్తున్నారు. ఇటువంటి వ్యవహారాలు చేసే వారిని ప్రజలు క్షమించరు. – పృథ్వీరాజ్, బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు నిజం కాబట్టే సీఎం స్పందించలేదు ఈశ్వరయ్య నిజం చెప్పారు కాబట్టి సీఎం స్పందించడంలేదు. బీసీలకు రాజకీయాల్లో సరైన ప్రాతినిధ్యం లేదు. స్థానిక సంస్థల్లో మాత్రమే ఉంది. చట్ట సభల్లో లేదు. ఎంబీసీలకు ఎదుగుదలే లేదు. ముస్లింలకు, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం బీసీలకు అన్యాయం చేయడమే. ముఖ్యమంత్రి ఎన్నికల్లో 116 వాగ్దానాలు చేశారు. ఒక్కటీ అమలుచేయడంలేదు. ఒకే సామాజికవర్గానికి ఎక్కువ పోస్టులు ఇస్తున్నారు. 2004, 2009, 2014ఎన్నికల్లో బీసీలకు సగం సీట్లు ఇస్తానని చంద్రబాబు చెప్పారు. 40 సీట్లకు మించలేదు. వైఎస్ఆర్ 67 మందికి ఇచ్చారు. – రామకృష్ణయ్య, బీసీ సంఘం నేత -
మానవత్వం చాటిన న్యాయమూర్తి
కాకినాడ లీగల్ : రోడ్డుపై పడి ఉన్న వృద్ధుడిని చూసిన హైకోర్టు జస్టిస్ శివశంకరరావు కారు దిగి పరిశీలించి వెంటనే కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేసి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే హైకోర్టుకు జస్టిస్ శివశంకరరావు జిల్లాలోని పలు పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి బుధవారం వచ్చారు. అన్నవరంలో సత్యనారాయణస్వామిని దర్శించుకుని అక్కడ నుంచి రాజమహేంద్రవరం కారులో వెళ్తుండగా పెద్దాపురం ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో పడి ఉన్న వృద్ధుడిని చూశారు. వెంటనే కారుదిగి వృద్ధుడిని పరిశీలించగా స్పహకోల్పోయి ఉన్నట్టు గుర్తించారు. రాజమహేంద్రవరం ప్రధాన జిల్లా జడ్జి ఎన్.తుకారామ్జీకి ఫోన్లో సమాచారం తెలియజేసి ప్రభుత్వాస్పత్రిలో వైద్యసేవలు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ప్రధాన జిల్లాజడ్జి పెద్దాపురం మండల లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం తెలియజేశారు. వెంటనే వారు అక్కడకు చేరుకుని వృద్ధుడికి ప్రాథమిక వైద్య సేవలు అందజేసి, అంబులెన్స్లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి పంపించి కాకినాడ మండల లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యులకు వివరాలు తెలియజేశారు. దీంతో కాకినాడ మండల లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యులు ప్రభుత్వాస్పత్రిలోకి తీసుకువెళ్లగా ఆస్పత్రిలో ముందుగా పేరు, ఊరు, ఎటువంటి సమాచారం లేని వ్యక్తులకు ఓపీ ఇవ్వలేమంటూ సిబ్బంది నిరాకరించారు. దీంతో న్యాయమూర్తికి విషయం తెలియజేశారు. న్యాయమూర్తి జీజీహెచ్ సూపరింటెండెంట్కు ఫోన్ చేసి అనాథకు వైద్యసేవలు అందజేయాలని సూచించారు. దీంతో అనాథను ఆస్పత్రిలో చేర్చుకోవడానికి అంగీకరించి వైద్యులకు, సిబ్బందికి వైద్యసేవలు అందజేయాలని సూపరింటెండెంట్ సూచించారు. పేరు, ఊరు చెప్పలేకుండా ఉన్న అతని మానసిక పరిస్థితి బాగుండకపోవడంతో వైద్యులు అతనిని ప్రత్యేక వార్డులో ఉంచి సేవలు అందిస్తున్నారు. మతిస్థిమితంలేని ఆ అనాథకు క్షౌవరం చేయించి, శుభ్రంగా స్నానం చేయించి వైద్య సేవలు అందిస్తున్నారు. -
శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు
సాక్షి, తిరుమల: ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉమాదేవి, జస్టిస్ చల్లా కోదండరామ్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో వారు వేర్వేరుగా ఆలయానికి వచ్చారు. ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ వారికి ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
డాక్టర్ కావాలనుకుని.. జడ్జినయ్యా!
హైదరాబాద్: దేశంలోని అత్యున్నత స్థాయి వ్యవస్థలో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నానని హైకోర్టు న్యాయమూర్తి తొడుపునూరి అమర్నాథ్గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని తన నివాసం లో ‘సాక్షి’తో మాట్లాడారు. కృషి, పట్టుదలతో శ్రమి స్తే తగిన గుర్తింపు లభిస్తుందనడానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. వైద్యుడిని కావాలన్న ఉద్దేశంతో ఎంసెట్ రాశానని, అది వీలుకాకపోవడంతో డిగ్రీ చేసి ఎంబీఏ చదవాలని అనుకున్నానన్నారు. ఇలా మథనపడుతున్న నేపథ్యంలో తన బాబాయ్ సలహాతో న్యాయ విద్యను అభ్యసించినట్లు చెప్పారు. పట్టుదలతో లా చదివి న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టినట్లు వివరించారు. సమాజ సేవ కోసం కృషి..: సమాజ సేవ కోసం తన వంతు కృషి చేసేందుకు ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ స్థాపించినట్లు చెప్పారు. దానికి తానే చైర్మన్గా వ్యవహరిస్తున్నానన్నారు. దీని ద్వారా మూడేళ్లలో సుమారు 300లకుపైగా కేసులను పరిష్కరించినట్లు అమర్నాథ్గౌడ్ తెలిపారు. అలాగే 18 ఏళ్ల నుంచి లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో విధాలుగా ఉచిత సేవలు అందిస్తున్నామన్నారు. వృద్ధాశ్రమం, సికింద్రా బాద్ అడ్డగుట్టలోని ప్రభుత్వ స్కూల్ను దత్తత తీసుకుని కావాల్సిన సౌకర్యాలు సమకూర్చినట్లు తెలిపారు. సమాజానికి సేవ చేయడంలోనే అసలైన సంతృప్తి ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం, హైదరాబాద్లో బస్ షెల్టర్లు లేక విద్యార్థులు, సామాన్యులు ఇబ్బం దులు పడటం వంటి సమస్యలపై తాను స్పందించి న్యాయసేవ అందించానన్నా రు. ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదులందరూ కలుపుగోలుగా ఉంటూ తన ఉన్నతికి సహకరించారన్నారు. హైకోర్టు బార్ అసోసియేషన్ నుంచి బెంచ్ వరకు వచ్చిన వారందరితో కలసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్యారడైజ్ ఫ్యామిలీగా..: 1965 మార్చి 1న తొడుపునూరి కృష్ణగౌడ్, సావిత్రమ్మకు రెండవ సంతానంగా అమర్నాథ్గౌడ్ జన్మించారు. వెస్లీ జూనియర్ కాలేజీలో ఇంటర్, బేగంపేట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీఎస్సీ చదివారు. మహారాష్ట్రలోని శివాజీ లా కళాశాలలో ఎల్ఎల్బీ పూర్తి చేసి 1980లో న్యాయవాదిగా నమోదయ్యారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వంగ ఈశ్వరయ్య వద్ద వృత్తి జీవితం ప్రారంభించానన్నారు. తమకు ప్యారడైజ్ అనే థియేటర్ ఉండటంతో అంతా ప్యారడైజ్ ఫ్యామిలీగా పిలిచేవారన్నారు. -
హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
ప్రమాణం చేయించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయమూర్తులు గా ఆరుగురు ప్రమాణ స్వీకారం చేశారు. డీవీ ఎస్ఎస్ సోమయాజులు, కొంగర విజయలక్ష్మి, పోట్లపల్లి కేశవరావు, మంతోజ్ గంగారావు, అభినంద్కుమార్ షావిలి, టి.అమర్నాథ్ గౌడ్లతో హైకోర్టులో జరిగిన కార్యక్రమంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ ప్రమాణం చేయిం చారు. ఈ కార్యక్రమంలో ప్రమాణం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, బంధువు లు పాల్గొన్నారు. అనంతరం వీరిని న్యాయవా దులు వ్యక్తిగతంగా కలసి అభినందించారు. ఈ ఆరుగురిని న్యాయమూర్తులుగా నియమి స్తూ రాష్ట్రపతి ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రమాణం అనం తరం సీనియర్ న్యాయమూర్తులతో కలసి కేసు లు విచారించారు. తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తితో కలసి జస్టిస్ మంతోజ్ గంగారావు, జస్టిస్ రామసుబ్రమణియన్తో కలసి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ సి.వి.నాగా ర్జునరెడ్డితో కలసి జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ పి.వి.సంజయ్కుమార్తో కలసి జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్, జస్టిస్ సురేశ్ కుమార్ కెయిత్తో కలసి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయా జులు, జస్టిస్ రాజా ఇలంగోతో కలసి జస్టిస్ కేశవరావులు కేసులను విచారించారు. -
44 హైకోర్టు జడ్జి పోస్టుల భర్తీకి కసరత్తు
న్యూఢిల్లీ: వివిధ హైకోర్టుల్లో 44 జడ్జి పోస్టుల భర్తీ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన 44 పేర్లను రెండు సార్లు తిరస్కరించిన ప్రభుత్వం.. కొలీజయం తన సిఫార్సును పునరుద్ఘాటించడంతో దిగివచ్చినట్లు సమాచారం. అలహాబాద్ హైకోర్టుకు 29 మంది, కర్ణాటక హైకోర్టుకు ఇద్దరు, కోల్కతా హైకోర్టుకు ఏడుగురు, మద్రాస్ హైకోర్టుకు ఆరుగురు పేర్లను ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. కొలీజియం రెండోసారి సిఫార్సు చేసిన అభ్యర్థులను ప్రభుత్వం జడ్జీలుగా నియమించడం ఆనవాయితీ. అయితే ఇటీవల మోదీ ప్రభుత్వం కొలీజియం సిఫార్సులను రెండుసార్లు తిరస్కరించి పునఃపరిశీలన కోసం తిరిగి కొలీజియానికి పంపింది. -
సుఖేష్ బుట్టలో దినకరన్ ఎలా పడ్డాడో తెలుసా?
అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న టీటీవీ దినకరన్.. చాలా తేలిగ్గా బుట్టలో పడిపోయాడట. సుఖేష్ చంద్రశేఖర్ తనను తాను హైకోర్టు జడ్జిగా పరిచేయం చేసుకుంటే నిజమేననుకుని నమ్మేసి ఎన్నికల కమిషన్ అధికారులకు లంచం ఇప్పించడానికి అతడే సరైన వ్యక్తి అనుకున్నాడట. ఈ విషయం ఢిల్లీ పోలీసుల విచారణలో తేలింది. ఏప్రిల్ 16న సుఖేష్ అరెస్టు కావడానికి సరిగ్గా 20 గంటల ముందు అతడికి దినకరన్ ఫోన్ చేశాడు. రెండాకుల గుర్తు తమకే దక్కాలన్న ఆశతో ఉన్న దినకరన్.. సుఖేష్ బుట్టలో సులభంగా పడిపోయాడు. వరుసగా మూడోరోజు కూడా దినకరన్ను ఢిల్లీ క్రైం బ్రాంచి పోలీసులు విచారించనున్నారు. ఆదివారం కూడా అర్ధరాత్రి 1 గంట వరకు విచారణ కొనసాగుతూనే ఉంది. తమ వద్ద ఉన్న పక్కా సాక్ష్యాలతో దినకరన్ను పోలీసులు ఉక్కిరిబిక్కిరి చేశారు. సుఖేష్.. చాలా సుఖ పురుషుడు! అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా శశికళ నియమించిన టీటీవీ దినకరన్.. ఆ తర్వాత పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఒకటైపోయే సూచనలు కనిపించడంతో పార్టీనుంచి తప్పుకోవాల్సి వచ్చింది. శశికళ, దినకరన్ కుటుంబ సభ్యులెవరూ పార్టీలో ఉండటానికి వీల్లేదని గట్టిగా డిమాండ్లు రావడంతో దినకరన్ వెళ్లక తప్పలేదు. సరిగ్గా ఇదే సమయంలో పోలీసులు సుఖేష్ చంద్రశేఖర్ను ఢిల్లీలో అరెస్టు చేయడం, అతడిచ్చిన సమాచారంతో దినకరన్కు నోటీసులు పంపడం తెలిసిందే. తాను పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటానని, అయితే తనను పదవి నుంచి తొలగించాలంటే మాత్రం అది కేవలం ఒక్క శశికళ వల్లే అవుతుందని చెప్పారు. కాగా జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ ప్రస్తుతం బెంగళూరు జైల్లో నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. -
హైకోర్టు న్యాయమూర్తులకు సత్కారం
అమలాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం అమలాపురం టౌన్: తూర్పు గోదావరి జిల్లా అమలాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోనసీమకు చెందిన ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులను ఆదివారం ఘనంగా సత్కరించారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బులుసు శివశంకరరావు, జస్టిస్ నక్కా బాలయోగి, తమిళనాడు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధర్మారావును న్యాయవాదులు సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. అమలాపురం బార్ అసోసియేషన్ భవన నిర్మాణానికి హైకోర్టు నుంచి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. -
సుప్రీం ఎదుట హాజరైన జస్టిస్ కర్ణన్
వివరణ ఇచ్చేందుకు 4 వారాల గడువిచ్చిన ధర్మాసనం న్యూఢిల్లీ: వివాదాస్పద కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఎదుట శుక్ర వారం జస్టిస్ కర్ణన్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. భారత న్యాయ చరిత్రలో ఒక సిట్టింగ్ న్యాయమూర్తి సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట హాజరు కావడం ఇదే తొలిసారి. ఆయన హాజరును నమోదు చేసుకున్న న్యాయస్థానం.. వివిధ సంద ర్భాల్లో తోటి న్యాయమూర్తులకు సంబం ధించి చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వివరణ ఇచ్చేందుకు ఆయనకు నాలుగు వారాల గడువు ఇచ్చింది. అయితే తనకు తిరిగి న్యాయాధికారాలు పునరుద్ధరిం చాలంటూ కర్ణన్ చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా తోటి న్యాయమూర్తులపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ధర్మాసనం కర్ణన్కు సూచించింది. అయితే తన స్పందనను వెంటనే తెలియజేయడానికి ఆయన అంగీకరించకపోవడంతో.. సమయం తీసుకోవాలని, న్యాయ సహాయం కూడా పొందవచ్చని పేర్కొంది. జస్టిస్ కర్ణన్ తన వాదనలు వినిపిస్తూ.. తన వాదనలను వినకుండానే సుప్రీంకోర్టు తన న్యాయాధి కారాలను తొలగించిందని చెప్పారు. తనపై సుమోటోగా కోర్టు ధిక్కార అభియోగాలు నమోదు చేయడంపై తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ప్రధానికి ఫిర్యాదు చేశానని చెప్పారు. తన వాదనలను వినకుండానే తనను తప్పించారన్నారు. సాధారణ ప్రజల ముందు తన గౌరవానికి భంగం కలిగిందని చెప్పారు. పోలీసు అధికారులు తన కార్యాలయానికి వచ్చి వారంట్ అందజేశారని, ఇది తన ఒక్కడికే జరిగిన అవమానం కాదని, మొత్తం న్యాయ వ్యవస్థకే అగౌరవమని చెప్పారు. దీనిపై ధర్మాసనంస్పందిస్తూ.. తొలుత జస్టిస్ కర్ణన్కు నోటీసులు జారీ చేశామని, అయితే ఆయన కోర్టు ఎదుట హాజరు కాకపోవడం వల్లే బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. -
పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలి
నల్లగొండ లీగల్ : జిల్లాలోని వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు న్యాయవాదులు సహకారం అందించాలని హైకోర్టు న్యాయమూర్తి డా.షమీమ్ అక్తర్ అన్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన సందర్భంగా శనివారం నల్లగొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సన్మానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు నిరంతరం వివిధ కోర్టు తీర్పులను అధ్యయనం చేస్తూ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని కోరారు. తాను నల్లగొండలో న్యాయవ్యాదిగా పనిచేస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా, ఆ తర్వాత హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి ఎం.ఆర్. సునీత, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కల్లూరి యాదయ్య, కొండ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏకాగ్రతతో చదువుకోవాలి నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని హైకోర్టు జడ్జి షమీమ్ అక్తర్ అన్నారు. పట్టణంలోని డ్వాబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంధుల పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం సందర్భంగా బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎవరో వస్తారని ఎదురు చూడకుండా మన ప్రయత్నం చేసుకుంటూ పోవాలన్నారు. తాను కూడా ఎంతో కష్టపడి చదువుకొని ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు. అంధులమని బాధపడకుండా కష్టపడి చదవాలని సూచించారు. డ్యాబ్ సంస్థ కోసం తన వంతు సహకారం అందస్తానని తెలిపారు. అంతకు ముందు స్వపరిపాలన దినోత్సవంలో ఉత్తమ ప్రతిభ కనభర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి సునీత, ప్రభాకర్రావు, పిన్నపురెడ్డి రామకృష్ణారెడ్డి, యాదయ్య, ఎంఏ. అజీజ్, డ్వాబ్ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టు జడ్జిపై కోర్టు ధిక్కార చర్యలు!
దేశ న్యాయవ్యవస్థలోనే ఇంతవరకు ఎన్నడూ జరగని ఘటన ఒకటి జరిగింది. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు ఇతర న్యాయమూర్తులపై ఆరోపణలు చేసినందుకు కలకత్తా హైకోర్టు సిటింగ్ జడ్జి జస్టిస్ సిఎస్ కర్నన్పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నిర్ణయించారు. ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ కురియన్ జోసెఫ్లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును బుధవారం విచారించనుంది. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిటింగ్ జడ్జిపై కోర్టు ధిక్కార విచారణ జరిపేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు కూడా కొంతమంది సిటింగ్ జడ్జిలపై ఆరోపణలు వచ్చినా, వాళ్ల తొలగింపునకు సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిందిగా పార్లమెంటుకు ప్రధాన న్యాయమూర్తి సూచించారు. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కె. కౌల్ మీద కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటానని చెప్పి జస్టిస్ కర్నన్ 2015లో మద్రాస్ హైకోర్టును పెను సంక్షోభంలోకి నెట్టేశారు. జస్టిస్ కౌల్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని తాజాగా కొలీజియం సూచించింది. మరో న్యాయమూర్తి విద్యార్హతల విషయంలో సీబీఐ విచారణ కోరారని, తన పనిలో కౌల్ అడ్డుపడుతున్నారని కర్నన్ ఆరోపించారు. తాను దళితుడిని కాబట్టి కులవివక్ష చూపుతున్నారని, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనను వేధిస్తున్నారని కూడా ఆరోపించారు. ఆ తర్వాత తనను బదిలీ చేయగా, సుప్రీం ఉత్తర్వులపై కర్నన్ స్టే విధించారు. -
శ్రీవారి సేవలో సిక్కీం హైకోర్టు న్యాయమూర్తి
-
హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు
► వారం రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు ►వీరి నియామకంతో 27కు చేరనున్న న్యాయమూర్తుల సంఖ్య ►ఇంకా భర్తీ చేయాల్సిన పోస్టులు 34 సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా జయలకర్ ఉమాదేవి, నక్కా బాలయోగి, తెల్లప్రోలు రజనీ, డాక్టర్ షమీమ్ అక్తర్ నియమితులు కానున్నారు. ఇప్పటికే వీరి నియామకానికి సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో ఇటీవలే వీరి నియామకపు ఫైల్పై ప్రధానమంత్రి సంతకం చేశారు. ఆ తరువాత పూర్తి కావాల్సిన విధి విధానాలు కూడా దాదాపు పూర్తయ్యాయి. రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ వచ్చే వారంలోపు వీరి నియామకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఉమాదేవి ప్రస్తుతం సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా, బాలయోగి సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. టి.రజనీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా, షమీమ్ అక్తర్ ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్(జుడీషియల్)గా పనిచేస్తున్నారు. ఈ నలుగురి నియామకంతో ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 27కు చేరనున్నది. ఇంకా భర్తీ కావాల్సిన పోస్టులు 34 ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర పని ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రస్తుత న్యాయ మూర్తులకు ఈ నలుగురి నియామకంతో కొంత పని భారం తగ్గే అవకాశం ఉంది. ఈ నలుగురి పేర్లను న్యాయమూర్తుల పదవులకు సిఫారసు చేస్తూ ఉమ్మడి హైకోర్టు కొలీజియం గత ఏడాది సిఫారసు చేసింది. అయితే వీరి నియామకం విషయంలో కేంద్రం వైపు నుంచి అసాధారణ జాప్యం జరుగుతూ వచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం విషయంలో జరుగుతున్న జాప్యంపై ఇటీవల సుప్రీంకోర్టు మండిపడిన నేపథ్యంలో కేంద్ర న్యాయ శాఖ ఈ నలుగురి పేర్లకు ఆమోదముద్ర వేసింది. తరువాత సుప్రీంకోర్టు సైతం వీరి నియామకానికి సానుకూలంగా స్పందించ డంతో సంబంధిత ఫైల్ ప్రధానికి చేరింది. ఇటీవల ఆయన ఫైల్పై సంతకం చేయడంతో రాష్ట్రపతి కార్యాలయానికి చేరింది. జె.ఉమాదేవి: 1959 సెప్టెంబర్ 26న అనంతపురం జిల్లాలో జన్మించారు. 1986లో కృష్ణ దేవరాయ వర్సిటీలో బీఎల్ పూర్తి చేశారు. అదే ఏడాది న్యాయవాదిగా ఎన్ రోల్ అయ్యారు. 1996లో జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. తరువాత ఉమ్మడి రాష్ట్రంలో పలు హోదాల్లో వివిధ జిల్లాల్లో పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నక్కా బాలయోగి: 1957 జనవరి 15న తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. 1980లో ఆంధ్రా వర్సిటీ నుంచి లా డిగ్రీ సాధించారు. అదే ఏడాది న్యాయవాదిగా ఎన్ రోల్ అయ్యారు. 1985లో డిస్ట్రిక్ మునిసిఫ్ మేజిస్ట్రేట్గా నియమితులయ్యారు. ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో పలు జిల్లాల్లో పనిచేశారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రధాన న్యాయాధికారిగా కూడా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా ఉన్నారు. టి.రజనీ: 1958 నవంబర్ 6న ప్రకాశం జిల్లాలో జన్మించారు. 1980లో ఆంధ్రా వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1981లో న్యాయవాదిగా ఎన్ రోల్ అయ్యారు. 1982లో గుంటూరులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2002లో న్యాయాధికారిగా నియమితుల య్యారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు హోదాల్లో వివిధ జిల్లాల్లో పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డాక్టర్ షమీమ్ అక్తర్: 1961 జనవరి 1న నల్లగొండ జిల్లాలో జన్మించారు. 1986లో నాగ్పూర్ వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1997లో పీజీ కాలేజ్ ఆఫ్ లా హైదరాబాద్ నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 2001లో ఉస్మానియా నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. 1986లో న్యాయవాదిగా ఎన్ రోల్ అయ్యారు. 2002లో జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పలు హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్(జుడీషియల్)గా బాధ్య తలు నిర్వర్తిస్తున్నారు. -
శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
తిరుమల : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రధాన న్యాయమూర్తి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. -
కల్యాణ మండపం ఏమాయె..!
పురావస్తుశాఖ నిర్లక్ష్యాన్ని ప్రస్తావించిన హైకోర్టు జడ్జి రాజశేఖర్ హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల గుడి ప్రాంగణంలో కల్యాణ మండపం 15 నెలల్లో నిర్మిస్తామని పురావస్తుశాఖ 2008లో హైకోర్టుకు లిఖితపూర్వక హామీ ఇచ్చిందని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు జడ్జి రాజశేఖర్ గుర్తు చేశారు. ఇప్పటికీ దాన్ని నిర్మించకపోవడం ఆశాఖ నిర్లక్ష్యానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. చరిత్రాత్మక శ్రీ రుద్రేశ్వర ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాజశేఖర్ దంపతులు దర్శించుకున్నారు. దేవాలయ ఈఓ వద్దిరాజు రాజేందర్రావు, ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, వేదపండితులు ఆలయమర్యాదలతో ఆయన్ను స్వాగతించారు. పూజల అనంతరం ఆలయ నాట్యమండపంలో తీర్థప్రసాదాలు, శేషవస్రా్తలు, మహాదాశీర్వచనం ఇచ్చారు. 8 ఏళ్ల క్రితం దేవాలయ కల్యాణమండపం విషయమై భక్తులు హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారని జడ్జి తెలిపారు. నాడు తాను కేంద్ర పురావస్తుశాఖ తరఫున వాదించానని తెలిపారు. ఆ సమయంలో పురావస్తుశాఖ అధికారులు 15 నెలల్లో పూర్తిచేస్తామని హైకోర్టుకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నేటికీ దాన్ని పూర్తి చేయకపోవడం కోర్టును నిర్లక్ష్యం చేసినట్లేనన్నారు. ఇప్పుడు ఎవరైనా హైకోర్టులో రిట్పిటిషన్ దాఖలు చేస్తే పురావస్తుశాఖ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జడ్జి వెంట సీఐ సంపత్రావు, పోలీస్ అధికారులు ఉన్నారు. ఘనంగా లక్షబిల్వార్చన కార్తీకమాసోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం 5 గంటల నుంచి మహిళలు దేవాలయప్రాంగణంలో దీపదానాలు చేశారు. బహుళ షష్టి తిథిని పురస్కరించుకొని స్వామివారిని బిల్వ దళాధిపతిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ , అర్చకులు పెండ్యాల సందీప్శర్మ, పానుగంటి ప్రణవ్లు మహాగణపతికి అభిషేకం జరిపారు. శ్రీరుద్రేశ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. శివపంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ శ్రీమహాలక్ష్మి ఉద్భవించిన మారేడుదళాలతో లక్షబిల్వార్చన చేశారు. ప్రముఖ శివభక్తుడు దాత ముపదాసు సురేష్బాబు దంపతులు దీనికి యాజమాన్యం వహించారు. సాయంత్రం ప్రదోషకాల పూజలు జరిగాయి. ప్రదోషకాల పూజలలో జిల్లా ఫోర్త్ క్లాస్ కోర్టు జడ్జి గోవిందలక్ష్మి పాల్గొన్నారు. శ్రీరుద్రేశ్వరునికి పూజలు నిర్వహించారు. నేడు.. కార్తీకమాసం నాల్గో సోమవారం రుద్రేశ్వరునికి పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తున్నామని ప్రధానార్చకులు తెలిపారు. భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించుకోవచ్చునని సూచించారు.