-
భార్యను సెకండ్ హ్యాండ్ అన్నందుకు.. రూ 3 కోట్లు జరిమానా విధించిన కోర్టు
కొన్ని భార్యభర్తల కేసులు కనువిప్పు కలిగిస్తాయి. ఎందుకంటే భార్యను తేలికగా చేస్తూ ఎలా పడితే అలా కించపరుస్తూ మాట్లాడే భర్తల ఆగడాలను ఎలా కట్టడి చేయాలో చెబుతాయి. అలాంటి గమ్మత్తైన ట్విస్టింగ్ కేసు ఇది! ఆ దంపతులిరువురిది సంపన్న కుటుంబ నేపథ్యం. ఇద్దరు ఉన్నత విద్యావంతులే. ఆ జంట వివాహం 1994 జనవరి 3వ తేదీన పెద్దల సమక్షంలో జరిగింది. ఆ తర్వాత ఇద్దరు అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగాలు చేశారు. అయితే అక్కడ చట్టాల ప్రకారం సెక్యూరిటీ కోసం అమెరికాలో మళ్లీ పెళ్లి చేసుకుంది ఆ జంట. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో వారి కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో 2005లో ఈ దంపతులు ముంబై తిరిగి వచ్చేశారు. ముంబైలోనే భార్య ఉద్యోగం సంపాదించింది. అయితే భర్తతో గొడవలు కారణంగా తల్లి ఇంట్లోనే ఉంటుంది. 2014లో భర్త తిరిగి అమెరికా వెళ్లిపోయాడు. 2017లో భార్యకు అమెరికా నుంచే విడాకుల నోటీసులు పంపాడు. అదే ఏడాది భార్య ఇండియాలోని ముంబై కోర్టులో గృహ హింస చట్టం కింద కేసు ఫైల్ చేసింది. ఏడాది తర్వాత అంటే 2018లో అమెరికా కోర్టు వారికి విడాకులు కూడా మంజూరు చేసింది. అసలు కథ ఇక్కడే మొదలైంది..ముంబై కోర్టులో భార్య దాఖలు చేసిన పిటీషన్ ఆసక్తికరంగా మారింది. సుదీర్ఘ విచారణకు దారితీసింది. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పెళ్లి తర్వాత హనీమూన్కని నేపాల్ వెళ్లిన తర్వాతే ఈ ఇరువురి మద్య గొడవలు ప్రారంభమయ్యాయి. భార్యను సెకండ్ హ్యాండ్ అంటూ పదేపదే కించపరిచే వాడు భర్త. అందుకు కారణం..అప్పటికే తన భార్యకు.. తన పెళ్లి కంటే ముందే నిశ్చితార్థం అయ్యి క్యాన్సిల్ కావటం. ఆ తర్వాత అతడితో పెళ్లి జరిగింది. దీంతో భర్త ఆమెను పదేపదే సెకండ్ హ్యాండ్ అని కించపరిచేవాడు. అలాగే అమెరికా వచ్చిన ఆమె తల్లిదండ్రును అత్యంత నీచంగా చూసేవాడు. పైగా ఆమె తండ్రికి గుండె ఆపరేషన్ జరిగితే మరో ఇంట్లో ఉంచమని గొడవ చేసేవాడని భార్య పిటిషన్లో స్పష్టం చేసింది. గృహ హింస తీవ్ర స్థాయిలో ఉందని.. అనేక మానసిక వేధింపులు, హింసకు గురైనట్లు భార్య తన పిటీషన్లో పేర్కొంది. భార్య వాదనలతో ఏకీభవించిన ముంబై కోర్టు.. 2017లో తీర్పు వెళ్లడించింది. భార్యకు ప్రతినెలా లక్షా 50 వేల రూపాయల భరణం, సెకండ్ హ్యాండ్ అంటూ కించపరిచినందుకు 3 కోట్ల రూపాయల పరిహారం, కోర్టు ఖర్చుల కింద 50 వేల రూపాయలు చెల్లించాలని భర్తను ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ..భర్త సెషన్స్ కోర్టుకు వెళ్లాడు. అక్కడ కూడా భార్యకు అనుకూలంగానే తీర్పు వచ్చింద. ఇక లాభం లేదని ఈ తీర్పులపై ముంబై హైకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేశాడు భర్త. సుదీర్ఘ విచారణ తర్వాత.. ముంబై హైకోర్టు కింది రెండు కోర్టుల తీర్పుని సమర్థిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. భార్యను సెకండ్ హ్యాండ్ అంటూ కించపరిచి.. మానసిక వేదనకు గురి చేసిన భర్త.. 3 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాల్సిందే అని ముంబై హైకోర్టు తీర్పు వెల్లడించింది. భార్య ఆత్మగౌరవాన్ని దెబ్బతిసే అధికారం భర్తకు లేదని స్పష్టం చేసింది. ఇరువురు ఉన్నత చదువులు చదువులు, మంచి ఉద్యగాల్లో స్థిరపడినవారు, పైగా సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు ఉన్నవారు.. అలాంటివారు మరోకరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడ సబబు కాదని పేర్కొంది. ముఖ్యంగా భార్యను సెకండ్ హ్యాండ్ అంటూ.. ఓ మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం అనేది సామాజిక రుగ్మతగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఇలాంటి వాటిని ఉపేక్షించటం అనేది సహించరాని నేరం అని పేర్కొంది. ఉన్నత పదవుల్లో ఉండేవారు.. మరొకరికి మార్గదర్శకంగా ఉండాలని వక్కాణించింది. అస్సలు ఒక మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు అంటూ మండిపడింది ముంబై హైకోర్టు. అందుకుగానూ భార్యకు రూ. 3 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందేనని భర్తను ఆదేశిస్తూ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు నిజంగా ఎందరో భర్తలకు కనువిప్పు అనే చెప్పాలి. ఎప్పుడూ భార్యను చులకన చేసి ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా భర్తలకు ఈ తీర్పు పెద్ద చెంపదెబ్బ అని చెప్పొచ్చు. (చదవండి: అందం కోసం పాము రక్తమా? ఎక్కడో తెలుసా!) -
సాయిబాబా నిర్దోషి
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాతోపాటు మరో ఐదుగురు నిందితులను బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ నిర్దోషులుగా ప్రకటించింది. 2017లో సాయిబాబాతో పాటు ఇతరులను దోషులుగా నిర్ధారిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై నాగ్పూర్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ వినయ్ జోషీ, జస్టిస్ వాల్మికి మెనెజెస్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. నిందితులపై వచ్చిన ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, అందుకే వారిపై అభియోగాలను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం తోసిపుచ్చింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, దేశంపై యుద్ధంపై చేసే కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ 2017 మార్చిలో సాయిబాబా, ఇతరులను మహారాష్ట్రలోని గడ్చిరోలీ సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. దీనిపై సాయిబాబా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 2022 అక్టోబరు 14న జస్టిస్ రోహిత్ నేతృత్వంలోని ధర్మాసనం సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి రోజు శనివారమైనప్పటికీ ప్రత్యేకంగా విచారించింది. హైకోర్టు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం జస్టిస్ షా, జస్టిస్ రవికుమార్ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి 2023 ఏప్రిల్ 19న బాంబే హైకోర్టు తీర్పును పక్కనపెట్టింది. ఈ తీర్పును మళ్లీ పరిశీలించాలని బాంబే హైకోర్టుకు పంపించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ జోషీ, జస్టిస్ వాల్మికిల హైకోర్టు ధర్మాసనం విచారించి, సాయిబాబా, ఇతరులను నిర్దోషులుగా ప్రకటించింది. ప్రొఫెసర్ సాయిబాబా 2014లో అరెస్టయ్యారు. ప్రస్తుతం నాగ్పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. పదేళ్ల పోరాటం తర్వాత ఊరట దక్కింది బాంబే హైకోర్టు తీర్పు పట్ల సాయిబాబా భార్య వసంత ఆనందం వ్యక్తం చేశారు. పదేళ్ల తర్వాత ఊరట లభించిందన్నారు. సాయిబాబాకు అండగా నిలిచిన లాయర్లకు, సామాజిక కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. తన భర్త పది సంవత్సరాలు జైలులో ఉన్నారని, ఆర్థికంగా, మానసికంగా తాము ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని చెప్పారు. సాయిబాబా గురించి ప్రజలకు వాస్తవాలు తెలుసని, ఆయన పట్ల వారికి సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో మహారాష్ట్ర సర్కారు పిటిషన్ మావోయిస్టులతో సంబంధాల కేసులో మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు మంగళవారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. సాయిబాబాతోపాటు ఇతరులను నిర్దోషులుగా నిర్ధారిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని మహారాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీరేంద్ర షరాఫ్ ఈ సందర్భంగా చెప్పారు. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును కొంతకాలం నిలిపివేయాలని కోరుతూ హైకోర్టు ధర్మాసనం ముందు అప్లికేషన్ దాఖలు చేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని పునఃపరిశీలించే అధికారం ఉండదని, ఇది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది. అడ్వొకేట్ జనరల్ దాఖలు చేసిన అప్లికేషన్ను కొట్టివేసింది. -
హైకోర్టును ఆశ్రయించిన ఐదేళ్ల బుడ్డోడు.. కారణమిదే!
యూపీలోని కాన్పూర్కు చెందిన ఓ బుడ్డోడు అలహాబాద్ హైకోర్టును ఒక ప్రత్యేక అభ్యర్థనతో ఆశ్రయించాడు. తాను చదువుకుంటున్న పాఠశాల సమీపంలో మద్యం దుకాణం ఉందని, దానిని తొలగించాలంటూ ఆ ఐదేళ్ల చిన్నారి హైకోర్టులో పిటిషన్ వేశాడు. మందుబాబులు పాఠశాలను అసాంఘిక కార్యకలాపాలకు ఆడ్డాగా మార్చారని ఆ చిన్నారి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారి కారణంగా తమ చదువులు దెబ్బతింటున్నాయని పేర్కొన్నాడు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని కోరింది. కాన్పూర్లోని ఓ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్న ఐదేళ్ల చిన్నారి అథర్వ తన కుటుంబ సభ్యుల సాయంతో కోర్టుకు ఈ ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన హైకోర్టు ప్రతి సంవత్సరం ఈ మద్యం దుకాణం కాంట్రాక్టును ఎలా పునరుద్ధరిస్తున్నారని యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ పాఠశాల కాన్పూర్ నగరంలోని ఆజాద్ నగర్ ప్రాంతంలో ఉంది. అక్కడికి 20 మీటర్ల దూరంలో మద్యం దుకాణం ఉంది. నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల తర్వాతే తెరవాలి. అయితే తరచూ ఉదయం ఆరు గంటల నుంచే ఇక్కడ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని అథర్వ కోర్టుకు తెలిపాడు. అథర్వ కుటుంబ సభ్యులు ఈ విషయమై కాన్పూర్ అధికారులకు, యూపీ ప్రభుత్వానికి అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాగా ఈ పాఠశాల 2019లో ప్రారంభమయ్యిందని, మద్యం దుకాణానికి సంబంధించిన ఒప్పందం దాదాపు 30 ఏళ్లనాటిదని వైన్స్ దుకాణ యజమాని వాదనకు దిగారు. ఈ నేపధ్యంలో అధర్వ తన కుటుంబ సభ్యుల సహకారంతో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా, జస్టిస్ క్షితిజ్ శైలేంద్రలతో కూడిన డివిజన్ బెంచ్ విచారిస్తోంది. ఈ కేసులో తదుపరి విచారణ మార్చి 13న జరగనుంది. -
న్యాయస్థానాల్లో ‘పెండింగ్’ భారం ఎంత?
దేశంలోని పలు కోర్టుల్లో లెక్కకుమించిన కేసులు పెండింగ్లో ఉంటున్నాయనే విషయం విదితమే. అయితే నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (ఎన్జేడీజి) అందించిన తాజా సమాచారం చూస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. దేశంలోని కోర్టుల్లో 4.47 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం 25 హైకోర్టుల్లో అలహాబాద్ హైకోర్టు 10.74 లక్షల కేసులతో ముందుంది. దీని తర్వాత బాంబే హైకోర్టులో 7.13 లక్షల కేసులు, రాజస్థాన్ హైకోర్టులో 6.67 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (ఎన్జీడీజీ) అందించిన తాజా డేటాలో ఈ వివరాలు ఉన్నాయి. 2018 నుంచి పెండింగ్ కేసుల సంఖ్య పెరిగింది. అలహాబాద్ హైకోర్టులో పెండింగ్ కేసులు 50.95 శాతం మేరకు పెరిగాయి. బాంబే హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు 53.85 శాతం మేరకు పెరిగాయి. అన్ని హైకోర్టుల్లో మొత్తం 62 లక్షల కేసులు పెండింగ్లో ఉండగా, వీటిలో 71.6 శాతం సివిల్ కేసులు, 28.4 శాతం క్రిమినల్ కేసులు. 2018 నుంచి ఈ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య పెరిగింది. 24.83 శాతం కేసులు 5 నుంచి 10 ఏళ్ల క్రితం నాటివి. 24.83 శాతం కేసులు 5 నుంచి 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. 18.25 శాతం కేసులు 10 నుంచి 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. పలు నివేదికల ప్రకారం పెండింగ్లో ఉన్న కేసులకు న్యాయమూర్తుల సంఖ్య సరిపోకపోవడమే ప్రధాన కారణం. 2022 మే నాటికి దాదాపు 25,600 మంది న్యాయమూర్తులు నాలుగు కోట్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసులను విచారించే లేదా తీర్పునిచ్చే పనిలో ఉన్నారు. -
భర్తకు ఆదాయం లేకపోయినా..మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందేనా?
ఇటీవల కాలంలో దంపతుల మధ్య సయోధ్య లేకపోవడం వల్లనో లేక ఇతరత్ర కారణాల వల్లనో విడాకులకు దారితీస్తున్నాయి. ఫ్యామిలీ కోర్టుల్లో అందుకు సంబంధించిన కేసులు సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇద్దరి సమ్మతంతో విడిపోయినప్పటికీ స్త్రీకి ఎంతో కొంత భరణం ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని క్లైయిమ్ చేసుకోవాల్సింది సదరు మహిళే. ఒకవేళ ఆమె క్లైయిమ్ చేసుకున్నప్పటికీ కొందరూ ప్రబుద్ధులు తనకు ఆదాయం లేదని, లేదా కుటుంబాన్ని చూసుకోవాల్సి ఉందంటూ భరణం ఇవ్వకుండా తప్పించుకునే ప్లాన్లు వేస్తుంటారు. దీంతో సదరు మహిళలు ఇబ్బందులు పడుతుంటారు. అయితే అలాంటి ఎత్తుగడలకు చెక్పెడుతూ అలహాబాద్ ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. అసలేం జరిగిందంటే..అలహాబాద్కు చెందిన ఓ జంటకు 2015లో వివాహం అయ్యింది. అదనపు కట్నం డిమాండ్ చేస్తున్నారని సదరు మహిళ అత్తమామలపై ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఆమె 2016 నుంచి తల్లిదండ్రులతోనే జీవిస్తుంది. అయితే ఫామిలీ కోర్టు ఆమెకు నెలకు రూ. 2000 భరణం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సదరు వ్యక్తి హైకోర్టుని ఆశ్రయించాడు. తనకు ఆదాయం లేదని, తన తల్లిదండ్రులను, అక్కచెల్లెళ్లను చూసుకోవాల్సి ఉండటంతో తాను భరణం చెల్లించలేనంటూ పిటీషన్ వేశాడు. అంతేగాదు తన భార్య టీచింగ్ ద్వారా నెలకు రూ. 10 వేలకు సంపాదిస్తున్నారని కాబట్టి తాను ఇవ్వలేనని పిటిషన్లో పేర్కొన్నాడు. అయితే ధర్మాసనం ఆదాయం లేకపోయినా లేదా ఉద్యోగం లేకపోయినా రోజూ కూలిగా రూ. 300 నుంచి రూ. 400 వరకు సంపాదించొచ్చు అంటూ ఆ వ్యక్తికి మొట్టికాయలు వేసింది. ఉద్యోగం ఉన్నా, లేకపోయినా విడిపోయిన భార్యకు మెయింటెనెన్స్ చెల్లించాల్సిందేనని పేర్కొంది ధర్మాసనం. ఆ వ్యక్తి పిటిషన్ను జస్టిస్ రేణూ అగర్వాల్ సారధ్యంలోని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ తోసి పుచ్చింది. సదరు వ్యక్తి ఆయన భార్యకు చెల్లించాల్సిన మొత్తం భరణం రికవరీ బాధ్యతలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ జడ్జిని ఆదేశించారు జస్టిస్ రేణు అగర్వాల్. అలాగే సదరు వ్యక్తి తన భార్య ఉద్యోగం చేస్తుందనేందుకు ఆధారాలు సమర్పించడంలో కూడా విఫలమయ్యారని హైకోర్టు పేర్కొంది. అదీగాక ఆ వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నందున కార్మికుడిగా పని చేసైనా భార్యకు భరణం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సదరు వ్యక్తి గతేడాది ఫిబ్రవరి 21న రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, సీఆర్పీసీ 125 సెక్షన్ కింద భార్యకు భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించడం జరిగింది. ఇలాంటి సమస్యలనే ఫేస్ చేస్తుంటే..భయపడొద్దు. ధైర్యంగా మహిళలకు అనుకూలమైన చట్టాల గురించి సవివరంగా తెలుసుకుని కోర్టులో పోరాడండి. అదే సమయంలో మహిళలు కూడా తమ వైవాహిక బంధాన్ని చిన్న చిన్న విషయాలకు తెంచుకునే యత్నం చేయకుండా పెద్దలతో సయోధ్య చేసుకునేలా ప్రయత్నించి, మను వివాహ వ్యవస్థను కాపాడుకునే యత్నం చేద్దాం. (చదవండి: జీవితాన్ని దిద్దుకుంది... పేదల పక్షాన నిలిచింది) -
వికేంద్రీకరణను అడ్డుకుంటున్న విజ్ఞత లేని పార్టీలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించకుండా కొన్ని విజ్ఞత లేని రాజకీయ పార్టీలు అడ్డుకుంటున్నాయని పరిపాలనా వికేంద్రీకరణ నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ హనుమంతు లజిపతిరాయ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన గురువారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ పరిపాలనా రాజధాని విషయంలో న్యాయపరమైన నిర్ణయం మరింత ఆలస్యం కావడంపై విచారం వ్యక్తంచేశారు. ఏదో ఒకరకమైన సాంకేతిక అంశాలను లేవనెత్తి సుప్రీంకోర్టులో త్వరితగతిన తీర్పు రాకుండా విజ్ఞత లేని రాజకీయ పార్టీలు అడ్డుకోవడాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలని నిర్ణయించే అధికారం ఆయా ముఖ్యమంత్రులకు లేదని తెలిపే అధికరణ భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఆయన స్పష్టంచేశారు. మారుతున్న అభివృద్ధి.. అవసరాల దృష్ట్యా పరిపాలనా వికేంద్రీకరణను ఇప్పటికే ప్రపంచంలో 14కు పైగా దేశాలు పాటిస్తున్నాయని చెప్పారు. మన దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో హైకోర్టు ఒకచోట ఉంటే శాసనసభ వ్యవహారాలు మరోచోట ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇవి చదవండి: Fact Check: ‘మీటర్ల’ కొద్దీ అసత్యాలు అల్లేస్తున్నారు! -
కొలీజియం సిఫార్సుల అమలేదీ?
న్యూఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం, నచి్చన జడ్జిలనే బదిలీ చేయడం, ఇతరులను పెండింగ్లో పెట్టడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి వైఖరి తప్పుడు సంకేతాలను పంపిస్తుందని వెల్లడించింది. 11 మంది జడ్జిలను బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేయగా, ఐదుగురిని కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. మరో ఆరుగురి బదిలీ వ్యవహారం పెండింగ్లో ఉంది. కొలీజియం సిఫార్సుల అమలు విషయంలో 2021 నాటి సుప్రీంకోర్టు తీర్పునకు కేంద్ర న్యాయ శాఖ కట్టుబడటం లేదని, కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపట్టాలని కోరుతూ బెంగళూరు అడ్వొకేట్స్ అసోసియేషన్తోపాటు మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధూలియా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. హైకోర్టు జడ్జిలుగా పలువురి పేర్లను కొలీజియం ఇటీవల సిఫార్సు చేయగా, 8 మంది పేర్లకు కేంద్రం ఇంకా ఆమోదం తెలియజేయాలని గుర్తుచేసింది. కేంద్రం జడ్జిలుగా నియమించిన వారికంటే వీరిలో కొందరు సీనియర్లు ఉన్నారని వెల్లడించింది. -
కుక్క కాటు.. ఒక్కో పంటి గాటుకు రూ.10వేల పరిహారం!
చండీగఢ్: కుక్క కాటు కేసులపై హర్యానా-పంజాబ్ హైకోర్టులు సంచలన తీర్పు వెలువరించింది. కుక్క కాటుపై రాష్ట్ర ప్రభుత్వాలే ప్రధాన బాధ్యత వహించాలని ధర్మాసనం తెలిపింది. కుక్క కాటు కేసుల్లో ఒక్కో పంటి గాటుకు రూ.10,000 నష్టపరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది. కుక్క కాటు ఘటనల్లో 0.2 సెంటీమీటర్ల కోత పడితే రూ.20,000 బాధితునికి చెల్లించాలని ఆదేశించింది. కుక్క కాటు కేసులో దాఖలైన 193 కేసుల్లో న్యాయస్థానం విచారణ చేపట్టింది. వీధికుక్కల బెడదపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది. వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 49 ఏళ్ల పరాగ్ దేశాయ్ అక్టోబర్లో వీది కుక్కలు వెంబడించిన ఘటనలో మరణించారు. వీధికుక్కలు ఆయన్ని వెంబడించగా పడిపోవడంతో తీవ్ర రక్తస్రావం అయిందని.. ఆ కారణంగా దేశాయ్ మరణించారని సంబంధిత ఆసుపత్రి ఇటీవల ప్రకటనలో పేర్కొంది. ఈ విషాద ఘటన అనంతరం సోషల్ మీడియాలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని పెద్ద ఎత్తున చర్చ సాగింది. పంజాబ్, హర్యానా, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్లలో నమోదైన కుక్క కాటు కేసులపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు కోరింది. జంతువుల దాడి కేసుల్లో చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని నిర్ణయించాలని తీర్పులో స్పష్టం చేసింది. అయితే.. వీది కుక్కలతో పాటు ఆవులు, ఎద్దులు, గాడిదలు, గేదెలు, అడవి, పెంపుడు జంతువులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇదీ చదవండి: Liquor Sale In Delhi: ‘దీపావళి మద్యం’తో ఢిల్లీ సర్కారుకు భారీ ఆదాయం! -
పొలిటికల్ నేతలపై క్రిమినల్ కేసులు.. సుప్రీం కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని(క్రిమినల్ కేసులకు సంబంధించి) కోరుతూ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అటువంటి కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి చర్యలు తీసుకునే బాధ్యతను సుప్రీంకోర్టు.. హైకోర్టులకు అప్పగించింది. వివరాల ప్రకారం.. దేశంలో తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించే విషయంలో, ఏకరీతి మార్గదర్శకాలను రూపొందించడం కష్టమని సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది. ఇదే సమయంలో అటువంటి కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి చర్యలు తీసుకునే బాధ్యతను హైకోర్టులకు అప్పగించింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయాలని, ఈ కేసులను ఏడాదిలోగా పరిష్కరించేలా చూడాలని అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించినట్లు పిటిషనర్, న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ్ తెలిపారు. Supreme Court issues directions for speedy disposal of criminal cases against MP/MLAs. Supreme Court says it would be difficult for it to form a uniform guideline for trial courts relating to speedy disposal of cases against MP/MLAs. Supreme Court asks High Courts to register a… pic.twitter.com/O2izpfV3Nl— ANI (@ANI) November 9, 2023 సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఇవే.. ►ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారాన్ని పర్యవేక్షించడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలి. ►కేసులు త్వరగా పరిష్కరించడాన్ని, పర్యవేక్షించడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తప్పనిసరిగా ప్రత్యేక టైటిల్ ఏర్పాటు చేయాలి ►అవసరాన్ని బట్టి ప్రత్యేక బెంచ్ క్రమ వ్యవధిలో కేసులు లిస్ట్ చేయాలి ►కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు హైకోర్టు తగిన ఆదేశాలు ఇవ్వాలి. VIDEO | "Today, the Supreme Court has given a historic verdict. The Supreme Court judgment has come with regard to our first prayer. The court has directed all the high courts to constitute a special bench to monitor cases of MPs, MLAs and ensure that these cases are decided… pic.twitter.com/WgcLerxIoR— Press Trust of India (@PTI_News) November 9, 2023 -
రాజ్ భవన్ లో ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ జి.నరేందర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం
-
ప్రేమ పెళ్లిళ్లను పెద్దలు కాదనలేరు: ఢిల్లీ హైకోర్టు
ఇకపై మేజర్లయిన పిల్లల పెళ్లిళ్లను పెద్దలు అడ్డుకోలేరు. వివాహానికి తగిన వయసు కలిగిన యువతీయువకులు తమకు ఇష్టమైన భాగస్వామిని వివాహం చేసుకోవచ్చని, ఇటువంటి సందర్భంలో ఆ జంటల వివాహానికి తల్లిదండ్రులు లేదా వారి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పలేరని, రాజ్యాంగం ఆ జంటకు రక్షణ కల్పిస్తుందని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్న జంటలకు పోలీసులు రక్షణ కల్పిస్తారని, అవసరమైన పక్షంలో వారి కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు రక్షణ అందిస్తారని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. భార్యాభర్తల వివాహ హక్కును ఏ విధంగానూ తక్కువ చేయకూడదని, ఇలాంటి జంటలకు రక్షణ కల్పించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత ఆ రాష్ట్రంపై ఉందని జస్టిస్ తుషార్ రావు గేదెల అభిప్రాయపడ్డారు. ఢిల్లీ హైకోర్టు ఒక కేసులో.. తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకున్న ఒక జంటకు పోలీసు రక్షణ కల్పిస్తూ, మేజర్లయిన యువతీయువకులు తమకు ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించిందని కోర్టు పేర్కొంది. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఒక జంట న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వీరిలో భర్తపై నమోదైన తప్పుడు ఎఫ్ఐఆర్ను గత ఆగస్టులో కోఆర్డినేట్ బెంచ్ రద్దు చేసిందని జస్టిస్ గేదెలకు చెప్పారు. కాగా ఎఫ్ఐఆర్ పెండింగ్లో ఉన్న సమయంలోనే వారు వివాహం చేసుకుని, ఆనందంగా జీవిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ దంపతులకు హాని జరగకుండా చూసుకోవాలని ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఇది కూడా చదవండి: ‘రెడ్ లైట్ ఆన్- వెహికిల్ ఆఫ్’ అంటే ఏమిటి? ఢిల్లీలో ఎందుకు అమలు చేస్తున్నారు? Right To Marry Person Of Choice Protected Under Constitution, Not Even Family Members Can Object: Delhi High Court @nupur_0111 https://t.co/JEDBQuyQI8 — Live Law (@LiveLawIndia) October 26, 2023 -
గురుద్వారలో ఇద్దరు యువతుల వివాహం
చండీఘడ్లోని జలంధర్కు చెందిన ఇద్దరు యువతులు ఖరార్ (మొహాలీ)లోని గురుద్వారాలో వివాహం చేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు ఇద్దరికీ జీవిత భద్రత, స్వేచ్ఛను అందంచాలని జలంధర్ ఎస్ఎస్పీని ఆదేశించింది. ఈ పిటిషన్ను దాఖలు చేసిన ఆ ఇద్దరు యువతులు తాము ఒకరినొకరు ఇష్టపడ్డామని, అక్టోబరు 18న ఖరార్లోని గురుద్వారాలో వివాహం చేసుకున్నామని హైకోర్టుకు తెలిపారు. అయితే ఈ వివాహం విషయంలో తమ కుటుంబ సభ్యులు సంతోషంగా లేరని, తమ ప్రాణాలకు ముప్పు ఉందని, వారు కోర్టుకు అందించిన లేఖలో పేర్కొన్నారు. దీనికి ముందు ఆ యువతులు జలంధర్ ఎస్ఎస్పీకి లేఖ ఇచ్చారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. వారి లేఖను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని జలంధర్ ఎస్ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. వారి ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరింది. ఇది కూడా చదవండి: ‘రెడ్ లైట్ ఆన్- వెహికిల్ ఆఫ్’ అంటే ఏమిటి? ఢిల్లీలో ఎందుకు అమలు చేస్తున్నారు? -
గొణుగుడు ఎందుకు: పొరపాటు జరిగింది, క్షమించండి!
అహ్మదాబాద్: ఇద్దరు న్యాయమూర్తుల వాగ్వాదానికి గుజరాత్ హైకోర్టు వేదికైంది. న్యాయమూర్తులు జస్టిస్ బీరేన్ వైష్ణవ్, జస్టిస్ మౌనా భట్ ధర్మాసనం సోమవారం ఓ కేసును విచారిస్తున్న సందర్భంగా ఈ ఉదంతం జరిగింది. కేసుకు సంబంధించిన కొన్ని అంశాలపై వారిద్దరూ విభేదించారు. అనంతరం జస్టిస్ వైష్ణవ్ వెలువరించిన తీర్పుతో జస్టిస్ భట్ ఏకీభవించలేదు. దాంతో, ‘కావాలంటే మీరు విభేదించండి. ఇప్పటికే ఒక కేసులో మనం విభేదించాం. ఇందులోనూ అలాగే చేయవచ్చు’ అని జస్టిస్ వైష్ణవ్ అన్నారు. ఇది కేవలం విభేదించడానికి సంబంధించిన విషయం కాదంటూ జస్టిస్ భట్ ఏదో చెప్పబోగా, ‘మరైతే గొణగకండి. విడి తీర్పు వెలువరించండి. మనమిక తదుపరి కేసులు చేపట్టబోవడం లేదు’ అంటూ తన స్థానం నుంచి లేచారు. ధర్మాసనం తదుపరి కేసులు ఆలకించబోదని చెబుతూ కోర్టు రూమ్ నుంచి వెళ్లిపోయారు. ఇదంతా కోర్టు రూములోని సీసీ కెమెరాలో రికార్డయింది. గుజరాత్ హైకోర్టులో అన్ని బెంచ్లు జరిపే విచారణలూ ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. జడ్జిల వాగ్వాదానికి సంబంధించిన వీడియోను కాసేపటికే యూట్యూబ్ నుంచి తొలగించారు. కానీ ఆ వీడియో అప్పటికే సామాజిక మాధ్యమాల వేదికనెక్కి తెగ చక్కర్లు కొడుతోంది. (మెక్డోనాల్డ్స్ హ్యాపీ మీల్ ఆర్డర్ చేస్తున్నారా ? ఈ మహిళ షాకింగ్ అనుభవం తెలిస్తే..!) అయితే గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి వైష్ణవ్ బుధవారం బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. సోమవారం నాటి సంఘటనలు జరగ కూడదు తప్పును అంగీకరిస్తున్నాను అంటూ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడి ఉండాల్సింది, పొరబడ్డాను అంటూ జస్టిస్ వైష్ణవ్ పేర్కొన్నారు. కాగా 2016, జనవరిలో సుప్రీంకోర్టులో దాదాపు ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఎంవై ఎక్బాల్ , అరుణ్ మిశ్రా మధ్య జరిగిన వాగ్వాదానికి విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు. (‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’) -
47 మంది హైకోర్టు మాజీ న్యాయమూర్తులకు సీనియర్ హోదా
సాక్షి, న్యూఢిల్లీ: 47 మంది హైకోర్టు మాజీ న్యాయమూర్తులకు సీనియర్ హోదా ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. వీరిలో తొమ్మిది మంది హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులున్నారు. ఈ నెల 16న జరిగిన ఫుల్ కోర్ట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ 47 మంది మాజీ న్యాయమూర్తుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల నుంచి ఏడుగురు ఉన్నారు. సీనియర్ హోదా పొందిన వారిలో తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ రెడ్డి కాంతారావు, జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్, జస్టిస్ అనుగు సంతోష్ రెడ్డి, జస్టిస్ డాక్టర్ అడ్డుల వెంకటేశ్వర రెడ్డి సీనియర్ హో దా పొందారు. అలాగే, ఏపీ హైకోర్టు మాజీ తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ వి.ఈశ్వ రయ్య, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్, మాజీ న్యాయ మూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఉన్నారు. -
ఏపీ హైకోర్టుకు నలుగురు అదనపు జడ్జీలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నలుగురు నియమితులయ్యారు. నూనెపల్లి హరినాథ్, మండవ కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు. వీరి నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు వీరు హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతారు. వీరితో శుక్రవారం ఉదయం హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయిస్తారు. కాగా.. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గుహనాథన్ నరేందర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారన్న విషయం తెలియాల్సి ఉంది. జస్టిస్ నరేందర్ రాష్ట్ర హైకోర్టులో నంబర్ త్రీ స్థానంలో ఉంటారు. ఇదే సమయంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్, జస్టిస్ దుప్పల వెంకటరమణ బదిలీకి సైతం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ గుజరాత్ హైకోర్టుకు, జస్టిస్ వెంకటరమణ మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చే న్యాయమూర్తులు, బదిలీపై వెళ్లే ఇద్దరు న్యాయమూర్తులతో కలిపి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరుతుంది. -
దేశవ్యాప్తంగా 16 మంది హైకోర్టు జడ్జిల బదిలీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 16 మంది హైకోర్టు జడ్జిలు బదిలీ అయ్యారు. గతంలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన పదహారు మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలను కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫై చేసింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్తో సంప్రదింపులు జరిపిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ట్రాన్స్ఫర్ అయిన జడ్జిల్లో ఏపీ హైకోర్టుకు చెందిన ఇద్దరు జడ్జిలు, తెలంగాణకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఉన్నారు. బదిలీ అయిన న్యాయమూర్తుల వారి జాబితా 1. జస్టిస్ ఎస్పీ కేసర్వాణి( అలహాబాద్ హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టుకు బదిలీ) 2. జస్టిస్ రాజ్ మోహన్ సింగ్( పంజాబ్-హర్యాణా హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ) 3. జస్టిస్ నరేందర్ జీ( కర్ణాటక హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ) 4. జస్టిస్ సుధీర్ సింగ్(పాట్నా హైకోర్టు నుంచి పంజాబ్, హర్యానా కోర్టుకు బదిలీ 5. జస్టిస్ ఎంవీ మురళిధరన్( మణిపూర్ హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టుకు బదిలీ) 6. జస్టిస్ మధురేష్ ప్రసాద్ (పాట్నా హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టుకు బదిలీ) ఎపి హైకోర్టులో ఇద్దరు జడ్జిలు బదిలీ 7. జస్టిస్ అరవింద్ సింగ్ సాంగ్వాన్ (పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ) 8. జస్టిస్ అవనీష్ జింగాన్ (పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ) 9. జస్టిస్ అరుణ్ మోంగా (పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ) 0. జస్టిస్ రాజేంద్ర కుమార్ (అలహాబాద్ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ) 11. జస్టిస్ నాని టాగియా [గువాహతి హైకోర్టు నుంచి పాట్నా హైకోర్టుకు బదిలీ) 12. జస్టిస్ సి మానవేంద్రనాథ్ రాయ్ [ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి హైకోర్టు గుజరాత్ హైకోర్టుకు బదిలీ) 13. జస్టిస్ మున్నూరి లక్ష్మణ్ [తెలంగాణ హైకోర్టు నుంచి రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ 14. జస్టిస్ జి అనుపమ చక్రవర్తి [తెలంగాణ హైకోర్టు నుంచి పాట్నా హైకోర్టుకు బదిలీ) 15. జస్టిస్ లపితా బెనర్జీ (అదనపు న్యాయమూర్తి) (కలకత్తా హైకోర్టు నుంచి పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ) 16. జస్టిస్ దుప్పల వెంకట రమణ (అదనపు న్యాయమూర్తి) (ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ) ‘‘ఇక్కడ క్లిక్ చేసి సాక్షి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
ఏపీ హైకోర్టు జడ్జిలుగా మరో నలుగురు
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నలుగురు నూతన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియ నియమించింది. సీనియర్ న్యాయవాదులు హరినాథ్, కిరణ్మయి, సుమిత్, విజయ్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం గత ఫిబ్రవరిలో న్యాయాధికారుల కోటా నుంచి ఇద్దరు న్యాయమూర్తులను ఏపీ హైకోర్టుకు నియమించిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరి నియామకంతో న్యాయాధికారుల కోటా పూర్తి కాగా, న్యాయవాదుల కోటాలో నలుగురు కొత్త జడ్జిలను ఏపీ హైకోర్టుకు కేటాయిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. -
'ఇదేం నివేదిక..?' వరదలపై ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు..
హైదరాబాద్: వరదలపై నివేదికను సమర్పించిన ప్రభుత్వంపై న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. ఈ అంశంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. రూ.500 కోట్ల పరిహారంలో ఎవరికి ఎంత సహాయం చేశారో వివరాలు సరిగా లేవని తెలిపింది. రూ.500 కోట్లు ఎలా ఖర్చు చేశారో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వరదలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను పేర్కొంటూ నివేదికను న్యాయస్థానానికి ప్రభుత్వం తరపు న్యాయవాది సమర్పించారు. నేడు దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే.. రూ.500 కోట్లు రూపాయలు పునరావాసం కోసం కేటాయించినట్లు ప్రభుత్వం రిపోర్ట్ లో పేర్కొంది. వరదల ప్రభావంతో 49 మంది మృతి చెందినట్లు కోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. అయితే.. రెండో సారి ప్రభుత్వం దాఖలు చేసిన నివేదిక కూడా అసంపూర్తిగా ఉందని వాదనలు వినిపించిన పిటిషనర్ తరుపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్.. వరద ప్రభావం , నష్టంపై మరో నివేదిక మెమోను న్యాయస్థానానికి సమర్పించారు. అంటువ్యాధులతో భాదపడుతున్న వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలో తెలపాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. చనిపోయిన 49 మందికి ఎంత నష్ట పరిహారం చెల్లించారో సమగ్ర నివేదిక సమర్పించాలని పేర్కొంది. తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద నివారణ, బాధితులకు సహాయం, పరిహారం అందజేత లాంటి వివరాలపై శాశ్వత నివారణ చర్యలు ఏం చేపట్టారో వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. రాష్ట్రంలో జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలేదంటూ డాక్టర్ చెరుకు సుధాకర్ 2020లో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తాజా వర్షాలు, వరదల నేపథ్యంలో దీనికి సంబంధించి ఓ మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలైంది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. హైకోర్టుకు ఓ నివేదికను సమర్పించింది. దీనిలో రూ.500 కోట్లను నష్టపరిహారంగా బాధితులకు పంచినట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలకు 240 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 6,443 ఇళ్లకు పాక్షిక నష్టం వాటిల్లింది. 1,59,960 ఎకరాల్లో పంటలు వరద బారిన పడ్డాయని తెలిపింది. ఈ మేరకు తాజాగా పూర్తి నివేదిక న్యాయస్థానం ముందు పెట్టింది. ఇదీ చదవండి: Telangana Floods: సహాయక చర్యలేం చేపట్టారు..? -
Nuh violence: బుల్డోజర్ యాక్షన్కు హైకోర్టు బ్రేక్..
చండీగఢ్: హర్యానాలోని నుహ్ జిల్లాలో అల్లర్లు చెలరేగిన తర్వాత అక్కడి ప్రభుత్వం బుల్డోజర్ యాక్షన్కు దిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఈ చర్యలను నిలిపివేయాలని హర్యానా, పంజాబ్ హైకోర్టులు తాజాగా ఆదేశాలు జారీ చేశాయి. దీంతో బుల్డోజర్తో బవనాల కూల్చివేత చర్యలను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు కూల్చివేత చర్యలను నిలిపివేయాలని రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్కట సంబంధిత అధికారులను ఆదేశించారు. హర్యానాలో మతపరమైన ఘర్షణలు చెలరేగిన అనంతరం ఈ వ్యవహారాన్ని కోర్టు సుమోటుగా తీసుకుని విచారణ చేపట్టింది. బుల్డోజర్ యాక్షన్లో ఇప్పటివరకు 350 గుడిసెలు, 50 సిమెంట్ నిర్మాణాలను ప్రభుత్వం కూల్చివేసింది. అయితే.. ప్రభుత్వ చర్య రాజకీయంగా విమర్శలకు దారితీసింది. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలు జరుగుతున్నాయని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. తాము అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. నూహ్ జిల్లాలో అల్లర్లకు కారణమైన సహారా హోటల్ను ఆదివారం బుల్డోజర్లు కూల్చివేశాయి. ఇదే భవనం పైనుండి అల్లరిమూకలు మతపరమైన ఊరేగింపుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇప్పటికే నాలుగు రోజులుగా కొనసాగుతోన్న ఈ ప్రక్రియలో సుమారు 50-60 ఇళ్ళు నేలమట్టమయ్యాయి. సంఘటనా స్థలానికి 20కి.మీ దూరంలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారి ఇళ్లతో పాటు సుమారు డజను దుకాణాలు, మందుల షాపులు ధ్వంసం చేసినట్లు తెలిపాయి పోలీసు వర్గాలు. విశ్వ హిందూ పరిషత్ రథయాత్రపై కొందరు అల్లరి మూకలు రాళ్ల దాడి చేయడంతో హర్యానాలో అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులు వాహనాలకు నిప్పంటించారు. ఊరేగింపులో పాల్గొన్న 2500 మంది భయంతో స్థానిక దేవాలయంలో ప్రాణాలు కాపాడుకున్నారు. అదే రోజు రాత్రి స్థానికంగా మసీదు దగ్దం కావడం అల్లర్ల తీవ్రతను మరింత పెంచింది. ఇదీ చదవండి: శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే నివాసంలో అలజడి.. వీడియో వైరల్.. -
దేశంలో 24 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ
ఢిల్లీ : దేశంలో 24 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఒకేసారి ఈ స్థాయిలో న్యాయమూర్తులను బదిలీ చేయడం బహుశా ఇదే అత్యధికం. ఏపీ, తెలంగాణ, పంజాబ్, గుజరాత్, అలహాబాద్, పట్నాతో సహా పలు హెకోర్టుల్లో పని చేస్తున్న జడ్జీలను బదిలీలను ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ మేరకు సీజేఐ నేతృత్వంలోని కొలీజియం ప్రతిపాదించింది. న్యాయమూర్తుల బదిలీ అంశం కొన్ని రోజులుగా కొలీజియం ప్రతిపాదిత ప్రముఖ అంశాల్లో ఒకటిగా ఉంది. బదిలీకి సంబంధించిన లేఖలు కూడా ఆయా న్యాయమూర్తులకు ఇప్పటికే పంపినట్లు తెలుస్తోంది. బదిలీ అంశాన్ని ఏ న్యాయమూర్తైనా పునపరిశీలించాలని కోరితే.. తుది నిర్ణయం కొలీజియందే ఉంటుంది. సీజేఐ ప్రతిపాదించిన బదిలీ పత్రాలను సంబంధిత కేంద్ర మంత్రి ప్రధానమంత్రికి సమర్పిస్తారు. ప్రధాని ఆయా ప్రతిపాదనలను రాష్ట్రపతికి సమర్పిస్తారు. ఇదీ చదవండి: Anti Sikh Riots Case: కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్పై హత్యానేరం అభియోగాలు -
'ఆత్మ గౌరవంతో రాజీ పడలేను..' హైకోర్టు జడ్జీ అర్ధాంతరంగా రాజీనామా..
ముంబయి: బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ రోహిత్ డియో అర్దాంతరంగా రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు కోర్టు హాల్లోనే ఆయన పేర్కొన్నారు. ఈ రోజు నాగ్పూర్లోని కోర్టు హాల్లో ఈ మేరకు ప్రకటించారు. ఆత్మగౌరవంలో రాజీపడలేనని ఆయన చెప్పినట్లు హాల్లో ఉన్న ఓ లాయర్ ఈ విషయాన్ని తెలిపారు. 'కోర్టులో ఉన్నవారందరికీ క్షమించమని కోరుతున్నా. మెరుగుపడాలనే మిమ్మల్ని అప్పడప్పుడు తిట్టాను. నేను కూడా మెరుగుపడాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నాకు ఉండదు. ఎందుకంటే మీరంతా నా కుటుంబ సభ్యులే. చెప్పడానికి చింతిస్తున్నా.. నా రాజీనామాను ఇచ్చేశాను. నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పనిచేయలేను. మీరంతా కష్టజీవులు' అని జడ్జి చెప్పినట్లు ప్రత్యక్షంగా ఉన్న ఓ లాయర్ చెప్పారు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే క్రమంలో మాత్రం తన వ్యక్తిగత కారణాలతోనే దేశ అధ్యక్షురాలికి రాజీనామా ఇచ్చినట్లు జస్టిస్ రోహిత్ డియో చెప్పారు. కీలక తీర్పులు.. అయితే.. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే కేసులో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సాయిబాబాను 2022లో జస్టిస్ రోహిత్ డియో నిర్దోషిగా ప్రకటించారు. ఆయనకు విధించిన జీవత ఖైదు శిక్షను పక్కకు పెట్టారు. ఉపా చట్టం కింద చెల్లుబాటు అయ్యే అవకాశం లేనప్పుడు విచారణ అనేదే శూన్యం అని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు నిలుపదల ఉత్తర్వులు ఇచ్చింది. ఆ కేసును మళ్లీ నూతనంగా విచారణ చేపట్టాలని నాగపూర్కు చెందిన హైకోర్టు బెంచ్కు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జస్టిస్ రోహిత్ డియో నాగపూర్కు చెందిన హైకోర్టు డివిజన్ బెంచ్లో సభ్యునిగా ఉన్నారు. ఇదే కాకుండా నాగపూర్-ముంబయి సమృద్ధి ఎక్స్ప్రెస్వేలో మైనర్ ఖనిజాల తవ్వకాల అంశంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కూడా జస్టిస్ రోహిత్ డియో స్టే విధించారు. 2017లో బాంబే హైకోర్టు జడ్జిగా నియమితులైన జస్టిస్ రోహిత్ డియో 2025 డిసెంబర్ వరకు కొనసాగనుండగా.. అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు 2016లో మహారాష్ట్ర ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్గా కూడా జస్టిస్ రోహిత్ డియో పనిచేశారు. ఇదీ చదవండి: జ్ఞానవాపి ముస్లిం కమిటీకి సుప్రీంలో చుక్కెదురు.. ASI సర్వేకు గ్రీన్ సిగ్నల్.. ఇటు పురావస్తు శాఖకు ఆదేశాలు -
ప్రొటోకాల్ అనేది విశేషాధికారం కాదు: సీజేఐ
ఢిల్లీ: న్యాయమూర్తుల ప్రొటోకాల్ అంశంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదేం విశేషాధికారం కాదని.. ఆ సౌకర్యాలతో ఇతరులకు ఇబ్బంది కలిగించడమూ సరికాదని, తద్వారా న్యాయవ్యవస్థపై ప్రజల్లో గౌరవమూ తగ్గిపోతుందన్న అభిప్రాయమూ ఆయన వ్యక్తం చేశారు. ఈ మేరకు పలు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు తన అభిప్రాయంతో కూడిన లేఖలు రాశాయన. తీర్పులతోనే కాదు.. ప్రొఫెషనల్ ఆటిట్యూడ్తోనూ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తరచూ వార్తల్లో నిలుస్తుండడం చూస్తున్నాం. సుప్రీం కోర్టు కఫేటేరియాను సందర్శించడం, న్యాయస్థానం కార్యాలయాల పని తీరుతో పాటు అక్కడ పని చేసే వాళ్ల పోస్టుల పేర్లను మార్చాలని(పారిశుద్ధ్య కార్మికులతో సహా) ప్రతిపాదించడం లాంటి చర్యలతో ప్రశంసలు అందుకున్నారాయన. ఈ క్రమంలో.. తాజాగా ఓ హైకోర్టు న్యాయమూర్తి తనకు రైలు ప్రయాణంలో ఎదురైన ఇబ్బందికర అనుభవం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సదరు రీజినల్ రైల్వే మేనేజర్ నుంచి కోర్టు రిజిస్ట్రార్ ద్వారా వివరణ కోరడం తెలిసే ఉంటుంది. ఈ పరిణామంపై స్పందించే క్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్.. పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు లేఖలు రాశారు. రైల్వే సిబ్బందిపై హైకోర్టుకు “క్రమశిక్షణా పరిధి’’ ఉండదని అని సీజేఐ డీవై చంద్రచూడ్ లేఖల్లో న్యాయమూర్తులకు గుర్తు చేశారు. అలాగే.. ప్రొటోకాల్ అనేది విశేషాధికారం కాదన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారాయన. ఈ క్రమంలో న్యాయవ్యవస్థలో స్వీయ ప్రతిబింబం, కౌన్సెలింగ్ అవసరమంటూ అభిప్రాయపడ్డారాయన. ‘‘న్యాయమూర్తులు తమకు అందుబాటులో ఉన్న ప్రొటోకాల్ సౌకర్యాలు ఉపయోగించుకోవడంలో తప్పు లేదు. కానీ, ఆ సమాజం నుంచి వాళ్లను వేరే చేసే విధంగా.. లేదంటే తమను తాము ప్రత్యేక వ్యక్తిగా చూపించుకునే ప్రయత్నం చేయకూడదు. కోర్టుల్లోనే కాదు.. బయటా న్యాయపరమైన అధికారాన్ని తెలివిగా అమలు చేయాలి. తద్వారా న్యాయవ్యవస్థపై విశ్వసనీయత, చట్టబద్ధతను.. అలాగే న్యాయమూర్తుల సమాజ గౌరవం నిలబడుతుంది. అంతేగానీ.. ఆ సౌకర్యాలతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. అలాగే.. న్యాయవ్యవస్థపై బహిరంగ విమర్శలు చేసేందుకు దారి తీయకూడదు. నా ఈ అభిప్రాయాలను తెలియజేస్తున్నానని.. ఇక మీ అభిప్రాయాలను తనతో పంచుకోవాల’’ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కోరారాయన. అలహాబాద్ హైకోర్టు జడ్జి గౌతమ్ చౌదరి తాజాగా రైలు ప్రయాణంలో ఇబ్బంది ఎదుర్కొన్నారు. తన భార్యతో కలిసి పురుషోత్తం ఎక్స్ప్రెస్లో న్యూఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్తున్న సమయంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైందట. రైలు ఆలస్యంతో పాటు సమయానికి భోజనం దొరక్కపోవడం లాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారట. ఆ సమయంలో ఆయన రైల్వే పోలీసులు, రైల్వే సిబ్బంది నుంచి బదులు కోసం చూడగా.. ఫలితం లేకుండా పోయిందట. దీంతో న్యాయమూర్తి అనే తన గౌరవానికి భంగం వాటిల్లిందటూ ఆయన ప్రయాగ్రాజ్లోని నార్త్ సెంట్రల రైల్వే జోన్ జనరల్ మేనేజర్ను వివరణ కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా లేఖ పంపించారు. ఇదీ చదవండి: ఇదేంది ఇది.. 100 పేజీల తీర్పు కాపీనా? -
తెలంగాణ హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణహైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసు చేసిన జాబితాలో న్యాయాధికారి సుజన కళాసికం, న్యాయవాదులు లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్కుమార్ జూకంటి పేర్లు ఉన్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కౌశల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదించి రాష్ట్రపతికి నివేదించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఈ ముగ్గురూ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులవుతారు. వీరి పేర్లకు రాష్ట్ర గవర్నర్, సీఎం గతంలోనే ఆమోదం తెలిపారు. చదవండి: Hyderabad: గూబ గుయ్మంటోంది.. నిద్రపోని మహానగరం అలిశెట్టి లక్ష్మీనారాయణ: నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామంలో హెడ్మాస్టర్ గంగాధర్, రాజుబాయ్ దంపతులకు 1968 మే 13న లక్ష్మీనారాయణ జన్మించారు. నిజామాబాద్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, కాకతీయ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1994లో బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేయించుకున్నారు. రాజ్యాంగ, ‘సివిల్ లా’లో నైపుణ్యం సాధించారు. ఆయన జాతీయ రహదారుల అభివృద్ధి అథారిటీ, ఎన్బీసీసీ, ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్తోపాటు పలు ఎల్బీసీ, బ్యాంకులకు స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నారు. కె.సుజన: నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన మధు సూదన్, ప్రమీల దంపతులకు కె.సుజన 1970 మార్చి 10న జన్మించారు. 1997లో బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు. 2010లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. జూనియర్ సివిల్ జడ్జిగా కొనసాగుతూనే 2012లో జిల్లా జడ్జి పరీక్షలు రాసి ఎంపికయ్యారు. కరీంనగర్ అదనపు జిల్లా జడ్జిగా, నిజామాబాద్ జిల్లా జడ్జిగా, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగాను, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్గా పనిచేశారు. గతేడాది నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా సుజన విధులు నిర్వర్తిస్తున్నారు. -
హైకోర్టు సంచలన తీర్పు: ఎంపీ రవీంద్రనాథ్ పదవి గోవింద
అఫిడవిట్లో సమర్పించిన సమాచారమే ఆయుధంగా.. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారులు పెట్టిన సంతకాలే సాక్ష్యాలుగా.. విచ్చలవిడిగా చేసిన డబ్బు పంపకాల దృశ్యాలే ధ్రువీకరణలుగా.. ఓసామాన్యుడు ఏకంగా ఓ ఎంపీపైనే గెలిచాడు.. అయితే ఇదంతా ఎన్నికల్లో కాదు.. న్యాయపోరాటంలో.. నీతి.. న్యాయం.. అనే ధర్మ సూత్రాలను పక్కనబెట్టి అంగ, అర్ధబలంతో అడ్డదారిన అందలమెక్కిన ఓ ప్రజాప్రతినిధిని.. ఓ ఓమాన్యుడు.. అసామాన్య రీతిలో ఎదిరించి కోర్టు ద్వారా చివరికి అతడి పదవికే ఎసరు తెచ్చాడు.. చట్టం ఎవరి చుట్టమూ కాదని నిరూపించాడు.. స్ఫూర్తి కలిగించే ఓటరు ‘మిలానీ’ పోరాటాన్ని మీరూ చదవండి. సాక్షి, చైన్నె: నియోజక వర్గంలోని ఓ ఓటరు అలుపెరగని పోరాటం.. ఏకంగా ఓ ఎంపీ సీటుకి ఎసరు తెచ్చింది. దీంతో అన్నాడీఎంకే ఎంపీ రవీంద్రనాథ్ చివరికి తన పదవిని కొల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యాయ పోరాటంలో సదరు ఓటరు సమర్పించిన ఆధారాలన్నీ ఎంపీకి వ్యతిరేకంగా నిర్ధారణ అయ్యాయి. ఫలితంగా ఎంపీగా రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదు అని కోర్టు ప్రకటించింది. అయితే తీర్పును రిజర్వ్ చేస్తూ.. అప్పీల్కు 30 రోజుల పాటు అవకాశం కల్పించింది. నేపథ్యం ఇదీ.. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్, మాజీ సీఎం ఓ పన్నీరు సెల్వం వారసుడు రవీంద్రనాథ్ 2019 లోక్సభ ఎన్నికలకు ముందు క్రియా శీలక రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన దృష్టి అంతా సొంత జిల్లా తేని మీదే పెట్టారు. ఎన్నికల్లో ఎంపీగా తేని నుంచే పోటీ చేశారు. ఈ కాలంలో రాష్ట్రంలో అన్నాడీఎంకే అధికారంలో ఉండటం, తన తండ్రి పన్నీరు సెల్వం డిప్యూటీ సీఎం, పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ కావడంతో రవీంద్రనాథ్కు అవకాశాలు కలిసి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం రవీంద్రనాథ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు మొదలు అనేక అక్రమాలు జరిగినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రంలో అన్నాడీఎంకే అధికారంలో ఉండడంతో స్థానిక ఎన్నికల అధికారి చూసి చూడనట్లు వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. చివరికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్పై రవీంద్రనాథ్ గెలుపొందారు. సొంత జిల్లాలో కీలక నియోజకవర్గాన్ని పన్నీరు తన కుటుంబ ఖాతాలో వేసుకుంది. తనయుడిని కేంద్ర మంత్రిని చేయడానికి సైతం ప్రయత్నించి, చివరకు అన్నాడీఎంకే గ్రూప్ రాజకీయాల పుణ్యమా అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కోర్టు సంచలన తీర్పు.. 2019 లోక్ సభ ఎన్నికలలో తేనిలో జరిగిన వ్యవహారాలపై పిటిషనర్ సమర్పించిన ఆధారాలను మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి సుందర్ పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ఆధారాలకు రవీంద్రనాథ్ వద్ద వివరణ కోరగా.. సమాధానం కరువైంది. ఇదే రవీంద్రనాథ్ పదవీ గండానికి కారణమైంది. దీంతో గురువారం న్యాయమూర్తి సుందర్ తుది తీర్పు వెలువరించారు. నామినేషన్ దాఖలు, పరిశీలనలో అధికార దుర్వినియోగం జరిగినట్టు ఆధారాలతో సహా నిర్ధారణ అయినట్లు ప్రకటించారు. రవీంద్రనాథ్ గెలుపు చెల్లదంటూ తీర్పు వెలువరించారు. దీంతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, అప్పీలుకు అవకాశం ఇవ్వాలని రవీంద్రనాథ్ తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేసుకోగా, న్యాయమూర్తి స్పందించారు. రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదు అని ఇచ్చిన తీర్పును 30 రోజులు పెండింగ్లో పెడుతున్నట్టు, అంతలోపు అప్పీల్కు వెళ్లవచ్చని గడువు కేటాయించారు. దీంతో అప్పీలు ప్రయత్నాలపై న్యాయవాదులు దృష్టి పెట్టారు. అయితే, అప్పీలుకు వెళ్లినా రవీంద్రనాథ్కు అనుకూలంగా స్టే వచ్చేది అనుమానమే అని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. తాము చేయాల్సిన పనిని సాధారణ ఓటరు మిలాని న్యాయ పోరాటంతో ఎంపీ రవీంద్రనాథ్కు పదవీ గండం సృష్టించడాన్ని అభినందిస్తున్నానని ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇలంగోవన్, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థి, ప్రస్తుత డీఎంకే నేత తమిళ్ సెల్వన్ పేర్కొనడం గమనార్హం వెనక్కి తగ్గని మిలానీ.. తేని నియోజకవర్గంలో రవీంథ్రనాథ్ గెలుపును వ్యతిరేకిస్తూ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఎవరూ కోర్టు తలుపు తట్ట లేదు. అయితే, ఆ నియోజకవర్గం ఓటరు అయిన మిలానీ మాత్రం స్పందించారు. నామినేషన్ దాఖలు మొదలు, ఫలితాల లెక్కింపు వరకు జరిగిన అవినీతి అక్రమాలు, అధికార దుర్వినియోగం, నగదు బట్వాడా తదితర అన్ని ఆధారాలనూ సేకరించారు. ఆయన గెలుపు అక్రమం అంటూ 2020లో హైకోర్టును ఆశ్రయించారు. ఆ నియోజకవర్గ ఓటరుగా తనను పరిచయం చేసుకుంటూ పిటిషన్ వేశారు. నామినేషన్ దాఖలు, పరిశీలనలో జరిగిన అక్రమాలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలకు ఆధారాలను కోర్టుముందు ఉంచారు. కరోనా కాలం పుణ్యమా రెండేళ్లు విచారణ ముందుకు సాగలేదు. అయితే గత ఏడాది కాలంగా ఈ కేసు విచారణ శరవేగంగా జరుగుతూ వచ్చింది. అదే సమయంలో అన్నాడీఎంకేలో చీలికతో పన్నీరు సెల్వం కొత్త శిబిరం తో రాజకీయ పయానాన్ని మొదలెట్టడంతో రవీంద్రనాథ్కు వ్యతిరేకంగా పళణి స్వామి శిబిరం లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. ఆయన్ని తమ పార్టీ ఎంపీగా పరిగణించ వద్దు అంటూ విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో గతంలో ఎప్పుడు సాగిన అక్రమాల వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగడం, రవీంద్రనాథ్ ఆస్తుల అటాచ్ వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితులలో ఓటరు మిలానీ రూపంలో ఏకంగా రవీంద్రనాథ్ తన ఎంపీ పదవి కోల్పోయే పరిస్థితి నెలకొంది. -
18 ఏళ్లు వద్దు.. ‘సమ్మతి’ వయసు 16కు తగ్గించండి: కేంద్రానికి హైకోర్టు వినతి
యువతులు తమ సమ్మతి మేరకు లైంగిక సంబంధాలను ఏర్పరుచుకునే వయసును 16 సంవత్సరాలకు తగ్గించాలని మధ్యప్రదేశ్ హైకోర్డుకు చెందిన గ్వాలియర్ బెంచ్ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ప్రస్తుతం ఇందుకోసం అనుమతించిన 18 ఏళ్ల వయసు కారణంగా పలు అనర్థాలు ఎదురవుతున్నాయని బెంచ్ పేర్కొంది. దీనికారణంగా యువతులపై అకృత్యాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై ఎఫ్ఐఆర్ రద్దు చేస్తూ.. జూన్ 27న ఒక కేసు ఉత్తర్వుల నేపధ్యంలో కోర్టు నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ అభ్యర్థన అందింది. ఈ కేసులో ఒక బాలికపై అత్యాచారం చేశాడంటూ ఒక వ్యక్తిపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేశారు. అతను 2020లో ఒక మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడని, ఆమెను గర్భవతిని చేశాడనే ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియా ప్రభావంతో.. ఈ కేసు తీర్పు సందర్భంగా న్యాయమూర్తి దీపక్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావంతో పాటు సులభంగా ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం కారణంగా 14 ఏళ్ల వయసుకే పిల్లలు అన్ని విషయాలు తెలుసుకుని, ముందుగానే యవ్వనంలోకి ప్రవేశిస్తున్నారని అన్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు త్వరగానే యవ్వనావస్థకు చేరుకుంటున్నందున ఒకరికొకరు ఆకర్షితులవుతున్నారని అన్నారు. ఫలితంగా వారు ఇష్టాపూర్వకంగానే శారీరక సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారని పేర్కొన్నారు. అందుకే సమాజంలో అనేక అనర్థాలు న్యాయమూర్తి తన ఉత్తర్వులలో.. తాను భారత ప్రభుత్వానికి ఒక విషయాన్ని అభ్యర్థించాలనుకుంటున్నానన్నారు. యువతుల విషయంలో లైంగిక సంబంధాలను ఏర్పరుచుకునేందుకు ఇప్పటి వరకూ ఉన్న నిర్ణీత వయసును 18 నుంచి 16 సంవత్సరాలకు తగ్గించే దిశగా ఆలోచించాలని కోరుతున్నానన్నారు. దీని వలన యువతులపై జరిగే అకృత్యాలను నివారించవచ్చని పేర్కొన్నారు. యువతులు లైంగిక సంబంధాలకు తమ సమ్మతి తెలియజేసే వయసు 18 ఏళ్లుగా ఉండటం వలన సమాజంలో అనేక అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. కేసు పూర్వాపరాలివే.. ఇక ఈ కేసు విషయానికొస్తే బాధితురాలు 2020లో మైనర్. ఆమె ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దగ్గర కోచింగ్ తరగతులకు హాజరయ్యేది. ఆ వ్యక్తి తనకు ఒకసారి మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి, అత్యాచారం చేశాడని ఆరోపించింది. అలాగే దానిని వీడియో తీశాడని, తరువాత బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. పురుషులు మాత్రమే దోషులు కారు కాగా ఆ మైనర్ బాలిక ఒక దూరపు బంధువుతో కూడా శారీరక సంబంధాలు పెట్టుకున్నదని కోర్టు పేర్కొంది. ఆ వయసులో ఉన్న బాలిక తన శారీరక, మానసిక, వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించి సొంత నిర్ణయాలు తీసుకోవడాన్ని న్యాయస్థానం సహేతుకంగా పరిగణిస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. సాధారణంగా యుక్తవయస్సులో అబ్బాయిలు, అమ్మాయిలు పరస్పరం స్నేహం ఏర్పరుచుకుని, ఆ తర్వాత ఆకర్షణ కారణంగా శారీరక సంబంధాలను ఏర్పరుచుకుంటారని, ఇటువంటి ఈ కేసులలో పురుషులు దోషులు కారని న్యాయమూర్తి తన ఆదేశాలలో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: కేంద్ర ఆర్డినెన్స్పై స్టే ఇవ్వండి
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
బుల్లితెర నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!
అతనితో డేటింగ్.. తొలిసారి నోరువిప్పిన ముద్దుగుమ్మ!
త్వరలో లాంచ్ కానున్న కొత్త బెంట్లీ కారు ఇదే.. ఫోటోలు
AP: ఎన్నికల హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు
ఐపీఎల్లో విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే!
Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
స్వాతి మలివాల్పై దాడి.. ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్బంప్సే!
Sangeetha Sringeri: పునీత్ రాజ్కుమార్ సమాధి వద్ద నటి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
తప్పక చదవండి
- Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement