భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ(డీఆర్డీవో) స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన పృథ్వీ-2 అణ్వస్త్ర క్షిపణి మరోసారి సత్తా చాటింది.
బాలాసోర్(ఒడిశా): భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ(డీఆర్డీవో) స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన పృథ్వీ-2 అణ్వస్త్ర క్షిపణి మరోసారి సత్తా చాటింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ వద్ద గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి గురువారం ఉదయం 9:20 గంటలకు పృథ్వీ-2 క్షిపణిని సైన్యం విజయవంతంగా పరీక్షించింది.