న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గం గురువారమిక్కడ సమావేశమైంది. ఈ భేటీలో పార్లమెంట్ సమావేశాల తేదీని మంత్రివర్గం ఖరారు చేయనుంది. అలాగే రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు కేటాయించే అంశంపైనా చర్చించి ఆర్డినెన్స్ను తీసుకురానుంది. కాగా లోక్సభ కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక కోసం వచ్చే నెల మొదట్లో స్వల్పకాలం పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నారు. ఇవి 4-12 తేదీల మద్య జరిగే అవకాశముంది. ఈ షెడ్యూల్ను కేబినెట్ ఖరారు చేయనుంది.
ప్రారంభమైన కేంద్ర కేబినెట్ సమావేశం
Published Thu, May 29 2014 11:30 AM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM
Advertisement