న్యూఢిల్లీ: దేశ 67వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్సింగ్, లోక్సభ స్పీకర్ మీరాకుమార్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆధునిక భారత నిర్మాణం కోసం ప్రజలంతా పనిచేయాలని అన్సారీ తన సందేశంలో సూచించగా పాకిస్థాన్తో శాంతి, స్నేహం, సహకారం కొనసాగాలని కోరుకుంటున్నట్లు ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు.