కూతుళ్లూ పెన్షన్‌కు అర్హులే: కేంద్రం | Widowed, divorced daughters eligible for family pension: Government | Sakshi
Sakshi News home page

కూతుళ్లూ పెన్షన్‌కు అర్హులే: కేంద్రం

Published Wed, Sep 18 2013 1:30 AM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM

Widowed, divorced daughters eligible for family pension: Government

న్యూఢిల్లీ: మరణించిన ప్రభుత్వోద్యోగి తాలూకు పింఛన్ పొందేందుకు భర్త చనిపోయిన, విడాకులు తీసుకున్న కూతుళ్లు కూడా అర్హులేనని కేంద్రం ప్రకటించింది. సిబ్బంది శాఖ ఇటీవలే ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. ఈ అంశంపై పలు కేంద్ర ప్రభుత్వ శాఖలు ఇటీవల పదేపదే వివరణ కోరుతున్న నేపథ్యంలో వాటన్నింటికీ సర్క్యులర్‌ను పంపింది.
 
  ‘పింఛన్‌ను పిల్లలకు కూడా చెల్లించవచ్చు. ఎందుకంటే వారిని ఉద్యోగిపైనా, అతని/ఆమె భాగస్వామిపైనా ఆధారపడి ఉన్నవారిగానే భావించడం జరుగుతుంది. కనీస కుటుంబ పింఛన్ మొత్తంతో సమానంగా గానీ, అంతకంటే ఎక్కువ గానీ సం పాదన లేని వారిని పిల్లలుగా, తమ తల్లిదండ్రులపై ఆధారపడి ఉన్నవారిగా పరిగణిస్తారు. కాబట్టి ప్రభుత్వోద్యోగి మరణించే నాటికి ఈ నిబంధనల పరిధిలోకి వచ్చే పిల్లలంతా పెన్షన్‌కు అర్హులే. భర్త చనిపోయిన లేదా విడాకులు తీసుకున్న కూతురికీ తండ్రి పింఛన్ పొందేందుకు అర్హత ఉంటుంది’ అని అందులో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement