ఆగ్రా: ఓ అమ్మాయి ముందు అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంతో ఓ యువకుడిని కొట్టి చంపారు. ఈ ఘటన ఆగ్రాలోని షా గంజ్ ఏరియాలో చోటుచేసుకుంది. మొత్తం ఐదుగురిపై కేసులు నమోదవ్వగా ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. పోలీసుల వివరాల ప్రకారం జీతు(22) అనే యువకుడు బాగా తాగేసి ఓ అమ్మాయి తనను దాటేసుకుని వెళ్తుండగా బహిరంగంగా మూత్రం పోయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారంతా మూకుమ్మడిగా దాడి చేయగా గుండెపోటుకులోనై అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడికి పాల్పడిన అమ్మాయి తండ్రి మరికొందరు పరారీలో ఉన్నారు.