ఉస్మానియా యూనివర్సిటీ కలర్ఫుల్గా మారింది. ఎటు చూసినా ఉత్సాహభరిత వాతావరణం కనిపించింది. వర్సిటీ అంతర్ కళాశాలల సాంస్కృతిక పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి.క్యాంపస్లోని ఠాగూర్ ఆడిటోరియం ఈ కళల సంబరానికి వేదికయింది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ పోటీలను ఓయూ స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ లక్ష్మయ్య ప్రారంభించారు.
వర్సిటీలో ఉన్నత విద్యతో పాటు వివిధ కళల్లో కూడా విద్యార్థులు రాణించాలన్నారు. ఈ పోటీల్లో ఎంపికైన విద్యార్థులు అంతర్ విశ్వవిద్యాలయాల సాంస్కృతిక పోటీలకు అర్హత సాధిస్తారని ఆయన తెలిపారు.
భరత నాట్యం, కూచిపూడి, జానపద, బంజార, ఆదివాసి నృత్యాల్ని విద్యార్థులు ప్రదర్శించారు.
ముగ్గుల పోటీలు, పెయింటింగ్, స్పాట్ పెయింటింగ్, ఫొటోగ్రఫీ పోటీలు ఆడిటోరియం ఆవరణకు కొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి.
‘ఉస్మానియా’ వాకిట్లో కళల సంబరం
Published Thu, Nov 7 2013 7:16 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM
Advertisement
Advertisement