‘ముందస్తు’పై కోర్టుకు!  | AICC Wants File A Complaint Against Early Elections In Telangana | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం?

Published Fri, Sep 7 2018 1:45 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

AICC Wants File A Complaint Against Early Elections In Telangana - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంలో జరగనున్న ముందస్తు ఎన్నికలపై కోర్టుకెళ్లాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ జరుగుతోందని, 13 లక్షల మంది యువకులు ఓటు హక్కు కోసం వేచి చూస్తున్నారని, జనవరి 1 తర్వాతే ఎన్నికలు జరిగితే వారు ఎన్నికల్లో పాల్గొంటారని, అలా కాదని ముందస్తుకెళితే కోర్టుకెళ్లాలని కాంగ్రెస్‌ నిర్ణయించినట్లు తెలిసింది. అసెంబ్లీని రద్దు చేయాలంటూ తెలంగాణ సీఎం, కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడం.. ఇందుకు గవర్నర్‌ కూడా ఆమోదించడంతో ప్రక్రియపై కమిషన్‌ సందిగ్ధంలో పడిపోయిందని ఆ పార్టీ నేతలు అంటున్నట్లు సమాచారం. జాబితా సవరణ జరుగుతున్నపుడు ఎన్నికలు ఇంతవరకు జరగలేదని, అసెంబ్లీ రద్దయినా వచ్చే ఏడాదికి ముందు ఎన్నికలు జరగవని వారు చెబుతున్నట్లు తెలిసింది.

ఈ విషయమై గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ ప్రస్తావిస్తూ.. ‘రాష్ట్రంలో ఓటర్ల జాబితా ముసాయిదాను సెప్టెంబర్‌ 1నే కమిషన్‌ విడుదల చేసింది. ఇందుకు అక్టోబర్‌ 31 వరకు సమయమిచ్చింది. నవంబర్‌ 30 వరకు ధ్రువీకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత చివరగా జాబితా సవరణ చేసి జనవరి 4న తుది జాబితా వెల్లడిస్తామంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు రాష్ట్రంలో ఎన్నికలు జరపకూడదు’అని పేర్కొంది. ఎన్నికలు కనీసం రెండు నెలలు కూడా లేని ఇలాంటి పరిస్థితి కమిషన్‌ను సందిగ్ధంలోకి నెడుతుందని చెప్పింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement