ఎందుకంత చిన్నచూపు? | Attacks on dalits more under Chandrababu rule: Meruga Nagarjuna | Sakshi
Sakshi News home page

ఎందుకంత చిన్నచూపు?

Published Wed, Nov 29 2017 12:55 PM | Last Updated on Tue, May 29 2018 2:44 PM

Attacks on dalits more under Chandrababu rule: Meruga Nagarjuna - Sakshi

సాక్షి, విజయవాడ: చంద్రబాబు పాలనలో దళితులకు రక్షణ కరువైందని వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో రోజుకు 12 మంది రైతులపై దాడులు జరుగుతున్నాయని, జాతీయ నేర గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. దళితులంటే చంద్రబాబుకు ఎందుకంత చిన్నచూపని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం దళితులను అంటరానివారిగా చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

గుంటూరులో ఆత్మహత్య చేసుకున్న దళిత ఉద్యోగి రవికుమార్‌ కుటుంబానికి ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని వెల్లడించారు. అతడి ఆత్మహత్యకు కారణమైన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. రవి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. దళితులపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నా చార్జిషీట్లు దాఖలు చేయడం లేదన్నారు. చంద్రబాబు దళిత ద్రోహిగా మిగిలిపోతారని మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement