Meruga Nagarjuna
-
అది ‘విద్యా మీట్’ కాదు..దగా మీట్: మేరుగ నాగార్జున
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హాయంలో విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని, మధ్యాహ్న భోజనం దగ్గర్నుంచి స్కూళ్ల బాగు వరకు అన్నిటినీ అభివృద్ధి చేశారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున గుర్తుచేశారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం(డిసెంబర్7) మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు.‘45 వేలకు పైగా స్కూళ్లను నాడునేడు కింద వైఎస్ జగన్ బాగు చేశారు. చంద్రబాబు వచ్చాక ఇంగ్లీషు మీడియం,ట్యాబులు,మంచి మధ్యాహ్న భోజనం ఇలా అన్నిటినీ దూరం చేశారు.ఇవన్నీ బాగుచేయడం వదిలేసి ఇప్పుడు విద్యా మీట్ పెడతారంట.అది విద్యా మీట్ కాదు.దగా మీట్. విద్యారంగంలో వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలను నిలిపేసి ఏం చేయదలచుకున్నారు? రూ.3,900 కోట్ల బకాయిల గురించి మాట్లాడకుండా ఈ విద్యామీట్లు ఎందుకు పెడుతున్నారు?జగన్ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం పెడితే చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు.చంద్రబాబు ప్రభుత్వపు కుట్రలకు విద్యారంగం పూర్తిగా నాశనం అయింది.ఉన్నత విద్యామండలిలో కూడా దారుణాలు జరుగుతున్నాయి.ఇరవై మంది వైస్ ఛాన్సిలర్లను బెదిరించి రాజీనామాలు చేయించారు.ఇప్పటికీ కొత్తగా ఎవరినీ నియమించలేదు.దీన్నిబట్టే విద్యారంగంపై ఈ ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు.విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసింది.రూ.72వేల కోట్లు కేటాయించి విద్యారంగంలో వైఎస్ జగన్ పెద్దఎత్తున సంస్కరణలు తీసుకొచ్చారు.అంతకుమించి చేయాలనుకుంటే చంద్రబాబు కూడా అభివృద్ధి చేయాలి. అంతేకానీ విద్యా రంగాన్ని నాశనం చేయొద్దు’అని మేరుగ నాగార్జున అన్నారు.ఇదీ చదవండి: బాబూ ఒక్కో రైతుకు రూ.20 వేల ఆర్థిక సాయం ఏమైంది..? -
తెనాలిలో యువతిపై పెమ్మసాని అనుచరుడి పాశవిక దాడి
సాక్షి ప్రతినిధి, గుంటూరు/తెనాలి రూరల్: టీడీపీకి చెందిన రౌడీషీటర్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడి పాశవిక దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ యువతి చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఆదివారం తెనాలిలో ఈ దారుణం చోటు చేసుకుంది. తెనాలి అయితానగర్కు చెందిన 26 ఏళ్ల యువతి ఓ స్పీచ్ అండ్ హియరింగ్ థెరపీ సెంటర్లో పనిచేస్తోంది. శనివారం సాయంత్రం డ్యూటీకి వెళ్లిన బాధితురాలిని కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన రౌడీషీటర్ రాగి నవీన్ (కొంతకాలంగా తెనాలిలో నివాసం ఉంటున్నాడు) తన పుట్టిన రోజు అని నమ్మించి వెంట తీసుకువెళ్లాడు.కొద్ది గంటల అనంతరం తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి పరారయ్యాడు. అనంతరం అక్కడకు చేరుకున్న యువతి తల్లిదండ్రులు వైద్యుల సూచనల మేరకు మంగళగిరి, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఎయిమ్స్ సహా పలు ప్రైవేటు వైద్యశాలలకు తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆదివారం తెల్లవారుజామున తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తీసుకురాగా అక్కడి వైద్యులు గుంటూరు సమగ్ర వైద్యశాలకు పంపారు. వెంటిలేటర్పై ఉన్న బాధితురాలి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలు..తమ కుమార్తెపై నిందితుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఒంటిపై పలు చోట్ల గాయాలున్నాయని.. మెడ, తల కమిలిపోయిందని, దాడి చేసి గాయపర్చినట్లు నల్ల మచ్చలు శరీరంపై ఉన్నాయని బాధితురాలి తల్లి విలపించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పెమ్మసాని అనుచరుడిగా..బాధితురాలిపై దాడి చేసిన నిందితుడు నవీన్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడు. ఎన్నికల్లో పెమ్మసాని తరఫున ప్రచారం నిర్వహించాడు. ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ నిస్సార్ బాషా తెలిపారు.పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలుగుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ పరామర్శించారు. యువతి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితురాలిపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా హింసించినట్లు తెలుస్తోందని మేరుగు నాగార్జున పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ముచ్చుమర్రి, హిందూపురం, పిఠాపురం, బద్వేలు, ఇప్పుడు తెనాలిలో మహిళలపై వరుసగా దాడుల ఘటనలు వెలుగులోకి వచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు. -
కళ్ళు లేని కబోదిలా హోంమంత్రి అనిత.. తెనాలి ఘటనపై మేరుగ ఆగ్రహం
సాక్షి, గుంటూరు: టీడీపీ కార్యకర్త ,రౌడీ షీటర్ నవీన్ చేతిలో గాయపడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధిర సహాన కుటుంబ సభ్యుల్ని వైఎస్సార్సీపీ నేతలు మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్లు పరామర్శించారు.అనంతరం మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ‘తెనాలిలో యువతిపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. టీడీపీకి చెందిన రౌడీ షీటర్ నవీన్.. మదిర సహాన అనే యువతిని కొట్టి హింసించి దాడి చేశాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళలు, చిన్న పిల్లలపై దాడులు పెరిగిపోయాయి. చంద్రబాబు పరిపాలన మొత్తం మారణ హోమానికి తెర లేపుతున్నారుహోంమంత్రి అనిత కళ్ళు లేని కబోధిలా ఉన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆడబిడ్డకు ఏ కష్టం వచ్చినా వారికి న్యాయం జరిగేది. దిశ పోలీసులు క్షణాల్లో స్పందించే వారు. ఇప్పుడు అదే దిశ యాప్ ఏమైంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. బాధితురాలికి ప్రభుత్వం అండగా నిలవాలి’ అని మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి మూడు మర్డర్లు.. ఆరు హత్యాచారాలు తరహాలో పాలన కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతలు దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతుంది. ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారు అని ఆరోపణలు చేశారు.అధికారంలోకి వచ్చాక మరి వాళ్ళందరిని తీసుకువచ్చి ఎందుకు తల్లిదండ్రులను అప్పగించలేదు. ఆడపిల్ల జోలికి వస్తే తాట తీస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు. సహానాను నవీన్ అనే టీడీపీ కార్యకర్త, రౌడీషీటర్ దారుణంగా కొట్టి హింసించాడు. యువతి శరీరంపై గాయలయ్యాయి. బాధితురాలు ఇప్పుడు కోమాలోకి వెళ్లింది. ఇంతటి దారుణికి ఒడిగట్టిన నిందితుణ్ని కాపాడటానికి కూటమి నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారని దుయ్యబట్టారు. -
చంద్రబాబు.. మరి ఇప్పుడు కప్పదాటు మాటలు ఎందుకు?
సాక్షి,తాడేపల్లి: ఈవీఎంలపై మాట్లాడటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిగ్గుందా? అని నిలదీశారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. కేంద్రంతో కలిసి ఉన్నప్పుడు ఒకమాట, లేనప్పుడు ఇంకోమాట మాట్లాడటం ఆయనకు అలవాటన్నారు మేరుగ. గత ఎన్నికల తర్వాత ఈవీఎంలపై ప్రజలకు అనుమానం కల్గిందని, ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఈసీపై ఉందన్నారు. ఈరోజు(శుక్రవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన మేరుగ.. ఈవీఎంలపై అనేక అనుమానాలున్నాయరు‘విజయనగరంలో ఒక ఈవీఎం ఫుల్ చార్జింగ్తో ఉండటంతో మాకు అనుమానం వచ్చింది. ఒంగోలులో ఓట్ల విషయంలో కూడా అనుమానం వచ్చింది. దీనిపై మేము కోర్టుకు వెళ్లాం. హర్యానా ఎన్నికల ఫలితాల్లో కూడా ఇలాంటి అనుమానాలే ఉన్నాయని మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. బ్యాలెట్ ద్వారా ఎన్నికలకు వెళ్లడం ఉత్తమం అని జగన్ అన్నారు. దీనిపై మేము ప్రశ్నిస్తే చంద్రబాబు కోప్పడుతున్నారు. గతంలో ఈవీఎంలపై ఆరోపణలు చంద్రబాబే చేశారు. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేశారు. మరి ఇప్పుడు కప్పదాటు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? అని మేరుగ నాగార్జున మండిపడ్డారు. సంపన్న దేశాలు సైతం బ్యాలెట్ వైపు మొగ్గుచూపుతున్నాయనే విషయాన్ని గ్రహించాలని ఈ సందర్భంగా మేరుగ గుర్తు చేశారు. -
అరాచకాలకు అడ్డాగా ఏపీ: మేరుగ నాగార్జున
సాక్షి,తాడేపల్లి:కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అరాచకాలకు అడ్డాగా మారిందని,దగ్గరుండి మరీ కూటమి నేతలే దాడులు చేయిస్తున్నారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.ఆదివారం(సెప్టెంబర్29) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మేరుగ మాట్లాడారు.‘పోలీసులు కూడా దాడి చేసే వారికే సలాం కొడుతున్నారు.ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది.కూటమి ఎమ్మెల్యేలు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు.ఇళ్లకు వెళ్లి జనాల చొక్కాలు పట్టుకుని బయటకు లాగుతున్నారు.అడ్డగోలుగా దాడులు చేస్తున్నారు.చంద్రబాబు వైఖరి వల్లే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి.ఈ దాడులను ఆపాలని ఏనాడూ చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు?జగన్ సీఎంగా ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలు తప్పుదారిలో నడిస్తే చర్యలు తీసుకున్నారు.చంద్రబాబు హయాంలో ప్రత్యర్థులు కదిలినా మెదిలినా కేసులు పెడుతున్నారు. మక్కెలు విరగ్గొడతానంటూ ఏకంగా సీఎం చంద్రబాబే మాట్లాడటం దేనికి సంకేతం?మూడు నెలల్లోనే ఇంతటి దారుణాలకు ఎవరు బాధ్యులు?ఎమ్మెల్యేలు దాడులు చేయటానికి చంద్రబాబు లైసెన్సులు ఇచ్చేశారు.తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి వ్యవహారశైలికి నిరసనగా సొంత పార్టీ వారే ధర్నాలు చేశారు.తనను వ్యతిరేకించే వారిని ఇంటికొచ్చి కొడతానంటున్న కొలికిపూడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?కాకినాడలో ప్రొఫెసర్ మీద ఎమ్మెల్యే నానాజీ దాడి చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?ఇంకో ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఏకంగా అంబేద్కర్ ఫ్లెక్సీనే తొలిగిస్తే ఏం చర్యలు తీసుకున్నారు?అఖిలప్రియ దాడులకు పాల్పడితే ఏం చేశారు?కోట్ల సూర్యప్రకాష్రెడ్డి వాల్మీకి కులస్తులపై దాడి చేస్తే ఏం చర్యలు తీసుకున్నారు?ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అరాచకాలపై ఏం చర్యలు తీసుకున్నారు?ఇన్ని దారుణాలు మీ ఎమ్మెల్యేలే చేస్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నట్టు?ఇవే పరిస్థితులు కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం’అని మేరుగ హెచ్చరించారు. -
దళితనేతను పరామర్శిస్తే అంత చులకనా?: మేరుగ
తాడేపల్లి, సాక్షి: రాష్ట్రంలో అరాచకాలతో దరిద్రమైన పరిపాలన సాగుతుందోని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. అక్రమంగా అరెస్టైన మాజీ ఎంపీ నందిగం సురేష్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడాన్ని టీడీపీ, దాని అనుకూల మీడియా తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ పరిణామాలపై తాడేపల్లిలో మేరుగ స్పందించారు.. ‘‘నందిగం సురేష్ కుటుంబానికి వైఎస్ జగన్ అండగా నిలిచారు. దానికే టీడీపీ నేతలు గావుకేకలు పెడుతున్నారు. చంద్రబాబు అయితే ఏకంగా.. ఒక ముద్దాయిని చూడడానికి జైలుకు వెళ్లారని జగన్ను ఉద్దేశించి అంటున్నారు. ఒక దళిత నేతను పరామర్శించడానికి వెళ్తే అంత చులకనా?. ఏం గతంలో చంద్రబాబు జైలుకు వెళ్లలేదా?. దళితులంటే మొదటి నుంచి చంద్రబాబుకి చిన్నచూపు. అందుకే అలా మాట్లాడారు... వరదల్లో బొట్లు కొట్టుకొస్తే వైసీపీ వాళ్ళు చేయించారని కథ అల్లుతున్నారు. మరి కిందకు కొట్టుకుపోయిన మరో రెండు బోట్ల కోసం ఎందుకు మాట్లాడడం లేదు?. బోట్ల యజమాని ఉషాద్రి పాదయాత్రలో లోకేష్ ని కలవలేదా?. ఇలాంటి కేసులో నందిగం సురేష్ను ఇరికించాలని చూస్తున్నారు. వరదల సమయంలో అసలు తలశిల రఘురాం అసలు ఇక్కడ లేనే లేరు. అలాంటి వ్యక్తి పై అక్రమ కేసు పెట్టాలని చూడడం దారుణం.రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలు కొనసాగుతున్నాయి. మొన్ననే మాజీ ఎమ్మెల్యే శంకర్రావు పై దాడికి పాల్పడ్డారు.పల్నాడు లో సోషల్ మీడియా కార్యకర్తలు షేక్ మాబు, రాజశేఖర్ రెడ్డి పై దాడి చేశారు. పోలీసులకు చెప్పినా రక్షించకుండా హింసిస్తున్నారు అని మేరుగ ఆరోపించారు. -
త్వరలో ప్రధాని మోదీని కలుస్తాం: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, కృష్ణా: దేశ రాజధానిలో ఢిల్లీలో వైఎస్సార్సీపీ చేసిన ధర్నా విజయవంతమైంది. పలు జాతీయ పార్టీలు వైఎస్సార్సీపీకి సంఘీభావం తెలిపాయి. ఏపీలో రాజ్యాంగబద్ధ పాలన జరుగుతోందా? అని పార్టీల నాయకులు ప్రశ్నించారు. ఇవాళ (గురువారం) ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకున్నారు. వారికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భారత్ మీడియాతో మాట్లాడారు.‘‘ ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరికట్టడానికి ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్ సారథ్యంలో ధర్నా నిర్వహించాం. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఫొటోలు ప్రదర్శించి నిరసన తెలియజేసాం. ..ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్తోపాటు మరికొన్ని పార్టీలు మాకు మద్దతు తెలిపాయి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దుర్మార్గపు పాలన ఎలా ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవాలి. త్వరలో దేశ ప్రధానమంత్రిని కలిసి పరిస్థితి వివరిస్తాం’ అని అన్నారు.‘టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకుండానే ఇన్ని అరాచకాలు జరిగాయి. ఏపీలో రాష్ట్రపతి పాలన అవసరమని ఢిల్లీలో నిరసన తెలిపితే అనేక పార్టీలు సంఘీభావం తెలియజేశారు. రాష్ట్రంలో ప్రజలను చంద్రబాబు భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. వైఎస్ జగన్ సారధ్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం విజయవంతం అయింది’ అని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. -
బాబు శ్వేతపత్రం ఓ బూటకం
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం ఓ బూటకమని, అబద్ధాలతో కూడిన నిందల పత్రమని మాజీ మంత్రి మేరుగ నాగార్జున దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిందలు మోపి, అనరాని మాటలు అనడానికే ఈ తంతు సాగించారని మండిపడ్డారు.ఆయన సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్ను ఉద్దేశించి చంద్రబాబు అత్యంత దారుణంగా పొగరు, కొవ్వు, ఉన్మాదం, మదం వంటి పదజాలం వాడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సీఎం స్థానంలో ఉన్న బాబు నోటి నుంచి వచ్చిన ప్రతి అక్షరానికి అకౌంట్బులిటీ ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలన్నారు. శ్వేతపత్రంలోని ప్రతి అంశం టీడీపీ వారికి సంబంధించినవేనని చెప్పారు. నాగార్జున చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..హామీలు అమలు చేయకుండా దృష్టిని మళ్లించడానికేచంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేసి, ఇప్పుడు ఇస్తున్న పథకాలను కూడా ఆపేసి, డబ్బుల్లేవని చెబుతున్నారు. ఎన్నికలప్పుడు ఈ విషయం తెలియదా? హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే శ్వేతపత్రాల తంతు తీసుకొచ్చారు. బాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. ఇచ్చిన మాట మీద నిలబడే నాయకుడు జగన్ మాత్రమేనని, అలా నిలబడలేకే బాబు దూషణలకు పరిమితమయ్యారు.దసపల్లా భూములు ప్రభుత్వానివి కావని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అయినా దాన్ని పట్టుకుని బాబు నిస్సిగ్గుగా ఆరోపణలు చేస్తున్నారు. ఇన్ని మాట్లాడుతున్న చంద్రబాబు గీతం కాలేజీ అక్రమాలపై ఎందుకు నోరెత్తరు? వందల కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిని గీతం వర్సిటీ ముసుగులో మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి స్వాహా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందులో 24.13 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. దీనిపై ఎందుకు మాట్లాడరు?ఇళ్ల పట్టాలపై నిరాధార ఆరోపణలువైఎస్ జగన్ నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలపైనా చంద్రబాబువి నిరాధార ఆరోపణలు. వైఎస్ జగన్ 28వేల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకిచ్చారు. మరో 25వేల ఎకరాలు అత్యంత పారదర్శకంగా కొనుగోలు చేసి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నా ఎప్పుడైనా ఒక్క కుటుంబానికి సెంటు భూమైనా ఇచ్చారా? పైపెచ్చు కేసులతో అడ్డుకున్నారు. రాజధానిలో 52 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు. ఆ స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టించే దమ్ము బాబుకు ఉందా?ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దు చేయించండిల్యాండ్ రీసర్వే, టైట్లింగ్ చట్టంపైనా చంద్రబాబు అవహేళనగా, తప్పుడు మాటలు కూడా మాట్లాడారు. చంద్రబాబు తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఆ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అది సరైంది కాదని అనుకుంటే, బాబే ప్రధానమంత్రి మోదీని ఒప్పించి, ఆ చట్టాన్ని రద్దు చేయించవచ్చు. ఆ ధైర్యం చంద్రబాబుకు ఉందా?అడ్డూ అదుపూ లేకుండా ఇసుక దోపిడీఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి అడ్డూ అదుపూ లేకుండా ఇసుకను దోచుకుంటున్నారు. ఇసుక ఉచితం అని చెప్పి సీనరేజ్, రవాణా చార్జీల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదీ గర్భాల్లో ఉన్న ఇసుకను కొల్లగొట్టిన గజదొంగలు కూడా బాబు పార్టీ మనుషులే. వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఒక్కటీ పారదర్శకంగా చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్లాట్ఫాం మీద టెండర్లు పిలిచారు. మా ఇసుక విధానం వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్లు, ఐదేళ్లలో రూ.3,825 కోట్లు ఆదాయం వచ్చింది.గతంలో బాబు పాలనలో ఇన్ని వేల కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయి? దశాబ్దాలుగా గనులను దోచుకుని, అడ్డగోలుగా సంపాదించింది బాబు మనుషులే. ఆయన హయాంలో మైన్స్పై ఆదాయంలో పెరుగుదల (సీఏజీఆర్) 17 శాతం నమోదైతే, వైఎస్ జగన్ హయాంలో 40 శాతం. అంటే దోపిడీ బాబు మనుషులు చేసినట్టు కాదా? బాబు హయాంలో నిరుపేదలకు ఒక్కరికి కూడా ఒక ఎకరం భూమి ఇవ్వలేదు.పైగా రికార్డుల్లో క్లారిటీ లేదంటూ లేనిపోని సాకులు చూపి లక్షలాది ఎకరాలను నిషేధిత జాబితా (22 ఏ)లో చేర్చారు. దీంతో ఆ భూములపై హక్కులు దక్కక, ఆపత్కాలంలో అమ్ముకునే అవకాశం లేక లక్షలాది రైతు కుటుంబాలు నానా ఇబ్బంది పడ్డాయి. అందుకే జగన్ చుక్కల భూములు, నిషేధిత భూములను ఆ జాబితాల నుంచి తొలగించి, అటవీ, ఇనాం భూములు సాగు చేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పించి, మేలు చేశారు. -
టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
సాక్షి, తాడేపల్లి: ఏపీ ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారని అన్నారు మంత్రి మేరుగ నాగార్జున. జూన్ నాలుగో తేదీన వైఎస్సార్సీపీ కొత్త చరిత్ర సృష్టించబోతుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందని వ్యాఖ్యలు చేశారు.కాగా, మంత్రి మేరుగ నాగర్జున బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుంది. ఇది పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగిన యుద్ధం. ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారు. జూన్ నాలుగో తేదీన వైఎస్సార్సీపీ సునామీ రాబోతుంది. పేదలు వైఎస్సార్సీపీకి ఓటు వేశారని దాడులు చేశారు.టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్ట్రేషన్లోకి వెళ్లాడు. పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచాలని కోరినా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. కేంద్రంతో కుమ్మక్కై చంద్రబాబు ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డారు. పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారు.అధికారంలోకి రాగానే ఎన్నికల్లో అక్రమాలకు వంతపాడిన పోలీసు అధికారులపై విచారణ జరిపిస్తాం. ఘోరాతి ఘోరంగా ఎన్నికల్లో టీడీపీ నేతలు దాడులు చేశారు. వైఎస్సార్సీపీకి అండగా నిలిచిన ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై పనిగట్టుకొని దాడులకు ఉసిగొల్పారు. డీబీటీల ద్వారా నిధులు ప్రజల ఖాతాల్లోకి రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
‘‘ఫించన్లు ఆపి మొసలి కన్నీరా..?’’ బాబుపై మంత్రి మేరుగ ఫైర్
సాక్షి, తాడేపల్లి: పింఛన్లు ఆపించి తగుదునమ్మా అంటూ చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ఫైర్ అయ్యారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మేరుగ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పరిస్థితి చూస్తుంటే ఎంతటికైనా దిగజారి రాజకీయాలు చేసి, రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచాలని చూస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ‘ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుపై బాధ్యతగా ఉండే రాజకీయ నాయకుడిలా చంద్రబాబు లేనే లేడు. స్వయాన ఆయన బంధువు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తిని పక్కన పెట్టుకుని వాలంటీర్ వ్యవస్థపై కుట్రలు చేశాడు. నిమ్మగడ్డ సర్వీసులో ఉన్నప్పుడు మాపై కుట్రలు కుతంత్రాలతో పనిచేశాడు. ఆయన ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వానికి బద్ధ విరోధిలా పనిచేశారు. ఆయనే ఈ రోజు దేశంలోనే గొప్ప సంస్కరణగా నిలిచిన వాలంటీర్ వ్యవస్థపై కత్తి కట్టాడు. పేద ప్రజలు, నిస్సహాయులను ఆదుకోడానికి, సంక్షేమ కార్యక్రమాలను సక్రమమైన పద్దతిలో చేరవేసే ఉద్ధేశంతో వాలంటీర్ వ్యవస్థను సీఎం జగన్ పెట్టారు. అలాంటి వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా పింఛన్లు పంచకూడదని నీ బంధువు ద్వారా కోర్టులకు, ఎన్నికల కమిషన్కు వెళ్లి ఆ వ్యవస్థను నిలిపేశావంటే ఎంత దిగజారావో అర్ధం అవుతోంది. వాలంటీర్లు పింఛన్లు పంచకూడదని కేసులు వేయించి, తగుదునమ్మా అంటూ మళ్లీ పింఛన్లు పంచాలంటే సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నావు. రాష్ట్రంలో వాలంటీర్లు ఎలాంటి సర్వీసులు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. వాలంటీర్ వ్యవస్థను ఆపి రాజకీయంగా లబ్ధిపొందాలనేదే చంద్రబాబు ఆలోచన. ఏదో ఒక విధంగా గందరగోళం సృష్టించి లబ్ధిపొందాలనే ఆలోచనతోనే చంద్రబాబు ఈ తప్పుడు చర్యకు పాల్పడ్డాడు. ఈ రోజు పింఛన్లు రాక అనేక ఇబ్బందులు పడటానికి కారణం చంద్రబాబే. ఇదంతా చేసి ఎందుకు పింఛన్లు పంచలేదని ఇప్పుడు నువ్వే మాట్లాడుతున్నావు. అంతా నువ్వే చేసి తగుదునమ్మా అంటూ మెసేజ్లు పెట్టడం ఏంటి? ఎవరితో ఆపించావో నీకు తెలుసు. ఆపించిన వ్యక్తి ఎవరో నీకు తెలుసు. నువ్వు ప్రజల్ని మోసం చేయడానికి ఎక్స్(ట్విట్టర్)లో మెసేజ్లు పెడుతున్నావు. నువ్వొచ్చాక పింఛన్లు ఇస్తావా? నువ్వు వచ్చేది ఏంటి బోడిగుండు? నువ్వు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల్లో హామీ ఇస్తున్నావు. ఈ రాష్ట్రంలో నువ్వు ఏడవలేక, 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టుకోలేక అరువు తెచ్చుకున్నావు. ఎస్సీ, ఎస్టీలను అపహాస్యం చేశావ్..ఎస్సీల్లో పుట్టకూడదు అని చెప్పావు. బీసీల తోకలను కత్తిరిస్తానన్నావు..బీసీలు జడ్జిలుగా పనికిరానన్నావు. నువ్వు డబ్బులున్న వారి అడుగులకు మడుగులు వత్తుతున్నావు. నా పేదవాళ్లు, నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. టిప్పర్ డ్రైవర్లే నిన్ను పాతాళానికి తొక్కేస్తారు చూడు చంద్రబాబు. టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చారంటూ మాట్లాడతావా? ఎంత మదంతో ఉన్నావు.. మా పల్లెల్లోకి వచ్చి నువ్వు ఓట్లు అడుగుతావా? ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని నువ్వు అపహాస్యం చేస్తే పేదవారి స్థితిగతులను మార్చడానికి సీఎం జగన్ పనిచేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్గా ఉన్న నా ఎస్సీ సోదరుడికి...అంబేద్కర్ గారు కల్పించిన అవకాశాన్ని సీఎం జగన్ అమలు చేస్తున్నారు. మా డ్రైవర్లు అంటే నీకు అంత తేలిక. ఆటోలు, టిప్పర్లు, లారీలు నడుపుతున్న ప్రతి డ్రైవర్ చంద్రబాబు అంతాన్ని పంతంగా తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నారు. చరిత్ర పునరావృతం అవుతుంది. కాసుకో చంద్రబాబూ..నీ కుట్రలు, కుతంత్రాలు సీఎం జగన్ ముందు చెల్లవు. మా పార్టీలో ఉన్నదంతా పేదలు. వారే జగన్ గారిని అక్కున చేర్చుకుంటున్నారు. ఏ బ్లేడో, ఏ కత్తో..ఎక్కడ జరిగిందో పవన్ కల్యాణే చెప్పాలి. విలువలు లేని మాటలు, విశ్వసనీయత లేని మాటలు పవన్ కల్యాణ్ మాట్లాడుతుంటే మేమెందుకు సమాధానం చెప్పాలి? వారెన్ని మాటలు మాట్లాడినా ప్రజలు వారిని తుంగలో తొక్కుతారు’ అని మేరుగ మండిపడ్డారు. ఇదీ చదవండి.. ఏపీలో రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ.. విధి విధానాలివే -
చంద్రబాబుకు మంత్రి మేరుగ నాగార్జున సవాల్
సాక్షి, విజయవాడ: ప్రతిపక్షనేత చంద్రబాబుకు మంత్రి మేరుగ నాగార్జున సవాల్ విసిరారు. ఏపీ అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు తాము సిద్దమని వెల్లడించారు. తమతో చర్చకు చంద్రబాబు సిద్ధమా అని ప్రశ్నించారు. విజయవాడ అంబేద్కర్ విగ్రహం వద్దకు బాబు రావాలని చాలెంజ్ చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ ఎవరైనా చర్చకు రావాలని అన్నారు. సైకిల్ను జనం తొక్కేశారని, మడతపెట్టి పక్కన పడేశారని విమర్శించారు. త్వరలోనే మళ్ళీ అదే జరుగుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు దళిత ద్రోహి అని మండిపడ్డారు. కళ్యాణమస్తు, షాదీతోఫా కింద రూ. 78.53 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారని మంత్రి పేర్కొన్నారు. పెళ్లికానుక కింద చంద్రబాబు 70 కోట్లు ఇవ్వకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. ఆ మొత్తాన్ని కూడా సీఎం జగన్ ఇచ్చారన్నారు. వైఎస్ జగన్ నిబద్ధత కలిగిన నాయకుడు అని, ఆయన్ని నమ్ముకుని నడుస్తున్నామన్నారు. ఎవరైనా పక్కకు వెళ్లినా తిరిగి పార్టీలోకి వస్తారని చెప్పారు. -
Ap: ‘వైఎస్ఆర్ కళ్యాణమస్తు’ పేదలకు వరం
తాడేపల్లి: వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా స్కీమ్లపై సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి జరిగిన వర్చువల్ సమావేశంలో మాట్లాడిన మంత్రి మేరుగ నాగార్జున , లబ్ధిదారులు పథకాలు అద్భుతమని కొనియాడారు. సమావేశంలో వారేమన్నారంటే వారి మాటల్లోనే.. గొప్ప పథకం: మేరుగ నాగార్జున, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అందరికీ నమస్కారం, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకం మన రాష్ట్రంలో గొప్ప ప్రెస్టీజియస్ పథకం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలలో గౌరవ ప్రదంగా వివాహం నిర్వహించుకునేలా ఏర్పాటుచేసిన కార్యక్రమం ఇది. ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంటే ప్రతిపక్షాలు ఇప్పటికీ కళ్ళులేని కబోదుల్లా కళ్యాణమస్తు తీసేశారంటున్నారు. వారికి చెంపపెట్టు ఈ స్కీమ్. ఈ మధ్య బెంగళూరులో సామాజిక న్యాయంపై దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరిగింది. ఈ కళ్యాణమస్తు కూడా చదువుకు లింక్ అయింది, అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా ఏపీలో నిరక్షరాస్యత తగ్గిందని చెప్పడంతో ప్రతి ఒక్కరూ మన రాష్ట్రాన్ని పొగిడారు. సీఎంగా మీరు చేస్తున్న ఈ గొప్ప విప్లవం సామాజిక విప్లవానికి తెరతీసింది. ఏపీ ప్రజానీకం దీనిని గమనించాలని కోరుకుంటున్నాను. పేదల ఇండ్లలో వెలుగు నింపుతున్నారు: భార్గవి, లబ్ధిదారు, ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లా అన్నా, మాది నిరుపేద కుటుంబం, మాలాంటి నిరుపేద కుటుంబంలో ఆడపిల్లకు ఇంత సాయం చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు అన్నా, నేను ఎస్సీని, పెళ్ళి చేయడం అంటే ఈ రోజుల్లో ఎంత భారమో అందరికీ తెలిసిందే. కానీ మీరు నేనున్నా మీకు తోడుగా అనే భరోసా కల్పించారు. మీరు అందరూ చదువుకునేలా చేస్తున్నారు. బాల్యవివాహాలు తగ్గుతున్నాయి, అక్షరాస్యత పెరుగుతోంది. మీ వల్లే ఇదంతా సాధ్యమవుతోంది. మీరు ప్రవేశపెట్టిన అనేక పథకాల వల్ల పేదలు ఆనందంగా ఉన్నారు. మా కుటుంబంలో మేం చాలా లబ్ధిపొందాం, మాకు పథకాలు అందాయి. మీరు ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్ధ, సచివాలయ వ్యవస్ధ చాలా ఉపయోగపడుతున్నాయి. నాడు నేడు ద్వారా కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి చదువులు చెబుతున్నారు. స్కూల్స్ రూపురేఖలు మార్చేశారు. పేదల ఇండ్లలో వెలుగులు నింపుతున్నారు. గతంలో రేషన్ కోసం ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు ఇంటి ముందుకే అన్నీ వస్తున్నాయి. మళ్ళీ మీరే సీఎంగా రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. థ్యాంక్యూ అన్నా. ఇదీ చదవండి.. పేద కుటుంబాలకు జగనన్న కానుక -
‘మంగళగిరిలో లోకేష్ను మడత పెట్టేస్తాం’
గుంటూరు: మంగళగిరి నియోజకవర్గంలో బీసీ సీటులో నారా లోకేష్ పోటీ చేయటం దారుణమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. జోగి రమేష్ బుధవారం మంగళగిరి వైఎస్సార్సీపీ సామాజిక సాధికార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ లోకేష్ను మడత పెట్టేస్తుందని అన్నారు. వైఎస్సాఆర్సీపీ దెబ్బకు లోకేష్ పారిపోతాడని అన్నారు. మంగళగిరి అని పలకటమే చేతకాని లోకేష్ మంగళగిరిలో పోటీ చేయటమా? అని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తున్నాయి రకరకాల వేషాలలో దొంగలు వస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలునిచ్చారు. సీఎం జగన్కు అండగా ఉండాలి.. అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని విధాల పైకి తీసుకురావాలని ఎంతోమంది మేధావులు ఆలోచన చేశారని మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే మేధావుల ఆలోచనలనకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని విధాల పైకి తీసుకొచ్చారు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని.. ఆయనకు అందరూ అండగా ఉండాలని అన్నారు. బీసీలను అణగదొక్కి లోకేష్ పోటీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు పేదలకు దేవుడని వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవి అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్లోనే సామాజిక న్యాయం అమలవుతుందని తెలిపారు. మంగళగిరిలో బీసీలను అణగదొక్కి లోకేష్ పోటీ చేస్తున్నాడని మండిపడ్డారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అగ్రవర్ణాల సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కనపెట్టి మంగళగిరి సీటును బీసీలు కేటాయించారని అన్నారు. వైఎస్సార్సీపీ మరోసారి గెలిపించుకోకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతారని ఎంపీ నందిగాం సురేష్ అన్నారు. దొంగల ముఠా.. పచ్చ మీడియా చెప్పే విషయాలను రాసే కథనాలను ప్రజలు నమ్మవద్దని తెలిపారు. -
AP: సీఎం జగన్ హయాంలో పేదరికం తగ్గింది: మంత్రి మేరుగ
సాక్షి, తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఏపీలో 12 శాతం ఉన్న పేదరికం 6 శాతానికి తగ్గిందని, సీఎం జగన్ లోతైన ఆలోచనాసరళి సత్ఫాలితాలను చూపిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. తాడేపల్లిలోని సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ స్కీమ్లను రాష్ట్రంలో పర్యటిస్తున్న జస్టిస్ బాలకృష్ణ కమిటీ ప్రశంసించినట్లు తెలిపారు. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారని కమిటీ సభ్యులు మెచ్చుకున్నట్లు చెప్పారు. ‘ప్రతిపక్షాలు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయి. చంద్రబాబు మరోసారి అధికారం కోసం అర్రులు చాచుతున్నారు. బడుగు బలహీ వర్గాలను సీఎం జగన్కు దూరం చెసేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే ఒక్క కార్యక్రమం చంద్రబాబు గతంలో చేయలేదు. మేధావులు జగన్ పాలనను మెచ్చుకుంటున్నారు.175 నియోజక వర్గాల్లో చంద్రబాబు అభ్యర్థులను పెట్టలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్కు స్థిరత్వం లేదు. 2014లో టీడీపీతో కలిసి పనిచేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తండ్రీ కొడుకులు అవినీతి పరులని స్వయంగా చెప్పాడు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ త్వరలో ఆవిష్కరించనున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేక పోయారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని రాష్ట్రంలో పర్యటిస్తున్న జస్టిస్ బాల కిషన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీకి కోరామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతికి ఎలా పని చేస్తుందో వివరించామని చెప్పారు. గతంలో దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎస్సీలు గతంలో సామజిక అసమానతలను ఎదుర్కొనేవారు. సామాజిక పరిస్థితుల దృష్ట్యా వారు మతం మారారు. మతం మారినా ఇంకా ఎస్సీలతోనే కలిసి జీవిస్తున్నారు. జైనులుగా బుద్దులుగా మారిన ఎస్సీలు ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్ల లబ్ది పొందుతున్నారు. ఎస్సీలకు ఈ నాలుగేళ్లలో రూ.58 వేల కోట్లు ఖర్చు చేశాం’ అని మేరుగ తెలిపారు. ఇదీచదవండి..లోకేశ్పై అనుచిత వ్యాఖ్యలు.. అచ్చెన్నాయుడిపై వేటు -
మా అభ్యర్థుల్ని మారిస్తే మీకేంటి నొప్పి: మంత్రి మేరుగ
సాక్షి, తాడేపల్లి: వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను మారిస్తే రామోజీరావు, రాధాకృష్ణలకు నొప్పేంటని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. తాడేపల్లిలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ అభ్యర్థులను చూస్తే రామోజీ రావు, రాధాకృష్ణలకు భయం పుడుతోందని చెప్పారు. అందుకే ఇష్టానుసారం వార్తలు రాస్తున్నారని విమర్శించారు. ఓసీ నియోజకవర్గాలలో కూడా సీఎం జగన్ ఇతరులకు అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. చంద్రబాబుకు ఆయన పార్టీ ఇక కనుమరుగు అవుతుందనే భయం పుట్టిందన్నారు. టీడీపీకి బీటీమ్ పురంధేశ్వరి పార్టీ బీటీమ్ అన్నారు. చంద్రబాబు కోసం తెగ తాపత్రయం పడుతోందన్నారు. ఆమె ఇంట్లో ఒక్కొకరు ఒక్కొక పార్టీలో ఉన్నారని, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా పురంధేశ్వరి వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడుతున్నారని మేరుగ ఫైరయ్యారు. చంద్రబాబు ఒక పొలిటికల్ బ్రోకర్ ‘చంద్రబాబు ఒక పొలిటికల్ బ్రోకర్. సీఎం జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలకు న్యాయం జరుగుతోంది. అంబేద్కర్ కోరుకున్న పాలన ఏపీలో ఉంది. గతంలో ఇచ్చిన హామీల్లొ ఒక్కదానినైనా చంద్రబాబు నెరవేర్చారా. మా పార్టీ అభ్యర్థులను మారిస్తే మీకు నొప్పేంటి. మా అభ్యర్థులను చూస్తే రామోజీ, రాధాకృష్ణలకు భయం పుడుతోంది. అందుకే ఇష్టానుసారం వార్తలు రాస్తున్నారు. పేదలను చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా ..బీసీలు జడ్జిలుగా పనికిరారని లేఖలు రాసింది చంద్రబాబు కాదా’ అని మేరుగ ప్రశ్నించారు. బాబు రాజకీయ జీవితమంతా పొత్తులే ‘మా పార్టీలో ఎస్సీలను మార్చితే ఇంకో ఎస్సీకే అవకాశం వస్తుంది. అందరికీ అవకాశం కల్పించాలన్నదే జగన్ లక్ష్యం. అందరం కలిసి జగన్ని గెలిపిస్తాం. ఎంఎస్ బాబు మా ఎమ్మెల్యే, ఆయన మా వాడు. మా సీఎం జగన్ అందరివాడు, అందరికీ న్యాయం చేస్తారు. ఇప్పుడు టికెట్ రాకపోయినా సరైన రీతిలో జగన్ న్యాయం చేస్తారు. నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం చూస్తే.. ఆయన పొత్తు పెట్టుకోని పార్టీ ఏమైనా ఉందా..? ఆయన కాంగ్రెస్తో, బీజేపీతో, కమ్యూనిస్టులతో, ఆఖరుకు జనసేన పార్టీతోనూ పొత్తులు పెట్టుకున్నాడు. ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజల ముందు నిలబడి గెలిచే దమ్ముంటే మూకుమ్మడిగా పార్టీల్ని కూడగట్టి పొత్తులు పెట్టుకోవడం ఎందుకు’ అని మేరుగ నిలదీశారు. బాబుకు బుద్ధిచెప్పేందుకు ఎస్సీలు సిద్ధం ‘సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన ఏనాడైనా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురించి పట్టించుకున్నావా..? రాజకీయాల్లో మమ్మల్ని ఉద్దేశించి నువ్వు చేసిన హేళనలు, అసమానతలు మాకు గుర్తుకురావని అనుకుంటున్నావా..? ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండగా, మళ్లీ మేము గుర్తుకొస్తున్నామా..? ఒకపక్క, మా జాతి సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ మా నాయకుడు వైఎస్ జగన్ పనిచేస్తున్నారు. మా కులాన్ని అవహేళన చేసినటువంటి నిన్ను అంత తేలిగ్గా వదులుతామా..? నీకు బుద్ధిచెప్పేందుకు ఎస్సీలంతా సిద్ధంగా ఉన్నారు’అని మేరుగ తెలిపారు. మీ కుట్రలన్నీ చివరికి నీటిమూటలే.. ‘చంద్రబాబు విషకూటమిలో పచ్చమీడియా ప్రధాన భూమిక పోషిస్తోంది. ఈ పచ్చమీడియా రోజూ కారుకూతలు రాస్తూ.. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు.. జరగనివి కూడా జరిగినట్లు అభూతకల్పనలు, కట్టుకథలతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయా వర్గాలను రెచ్చగొడుతూ కార్మిక సంఘాలతో ఉద్యమాలు చేయిస్తున్నారు. మీరెంత విషాన్ని నూరిపోసి, కుట్రలతో దొంగ ఉద్యమాలు చేయించినా అవన్నీ చివరికి నీటిమూటలుగానే తేలుతాయి. మీరు గుడ్డ కాల్చి మామీద వేయడానికి తప్పుడు కార్యక్రమాలు చేయిస్తున్నారనేది ఈ రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు’ అని మేరుగ అన్నారు. మళ్లీ సీఎంగా జగనన్నే అనేది ప్రజా నినాదం ‘పేదల ఆకలి చూసి తిండి పెట్టేది ఎవరు..? భావితరాల భవిష్యత్తు కోసం ఎవరు చూస్తున్నారు..? బడుగు, బలహీనవర్గాలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా నిలబెట్టి ప్రోత్సహించే నాయకుడు ఎవరనేది ప్రజల్లో చాలా స్పష్టత ఉంది. అందుకే, వైఎస్ఆర్సీపీకి రాష్ట్రంలో అడుగడుగునా ఆదరణ లభిస్తోంది. మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిగా తెచ్చుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. అందుకే, మళ్లీ సీఎం జగనన్ననే అనేది ప్రజా నినాదమైంది. మీ పచ్చమీడియా పైత్యం, ఎన్ని వెర్రితలలేసినా ప్రజలు మీ మాటల్ని, రాతల్ని నమ్మరు గాక నమ్మరు’ అని మేరుగ నాగార్జున అన్నారు. ఇదీచదవండి..పొత్తుల కోసం కుటుంబాల్ని చీలుస్తారు: సీఎం జగన్ -
‘అడ్డంకులెన్నొచ్చినా ఏపీలో సంక్షేమం ఆగలేదు’
సాక్షి,అనంతపురం:ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. అనంతరపురం జిల్లా రాప్తాడులో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభలో మంత్రులు మేరుగ నాగార్జున, గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు డిపాజిట్లు కూడా దక్కలేదని, బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్కు రాలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను నమ్మే స్థితిలో జనం లేరన్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ‘టీడీపీ భవిష్యత్తుకు గ్యారంటీ లేదన్న విషయం గుర్తుంచుకోవాలి. తన ముగ్గురు భార్యలకు పవన్ కళ్యాణ్ గ్యారెంటీ ఇస్తారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఆశాకిరణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే సామాజిక న్యాయం సాధ్యం అయింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పట్టం కట్టి మళ్లీ వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలి’ అని పిలుపునిచ్చారు. బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ మాట్లాడుతూ ‘తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఒక్క స్థానంలోనూ పోటీ చేయలేదు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ సంబరాలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు డిపాజిట్లు కూడా రాలేదు’ అని సురేష్ గుర్తు చేశారు. ‘ఇచ్చిన హామీలను ఏనాడూ చంద్రబాబు అమలు చేయలేదు. జగన్ పాలనలో 99 శాతం హామీలు నెరవేరాయి. పేదల సంక్షేమానికి చంద్రబాబు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. టీడీపీ పాలనలో రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షనిజం ఉండేది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో ముఠా కక్షలు అంతమయ్యాయి’ అని సురేష్ తెలిపారు. ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ ‘తెలంగాణ ఎన్నికల్లో ఓటమి భయంతో చంద్రబాబు పోటీ చేయలేదు. పోటీ చేసిన పవన్ కళ్యాణ్కు డిపాజిట్లు కూడా రాలేదు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు నాయుడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అత్యధికంగా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదే’ అని ఎంపీ మాధవ్ కొనియాడారు. పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ మాట్లాడుతూ ‘ఎస్సీ ఎస్టీ బీసీలను కులవృత్తులకే పరిమితం చేయాలని చంద్రబాబు నాయుడు కుట్రలు చేశారు. సీఎం జగన్ పాలనలో అణగారిన వర్గాలకు ఆత్మగౌరవం లభించింది’ అని తెలిపారు. ఈ బస్సు యాత్రలో ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, శంకర్ నారాయణ, డాక్టర్ తిప్పేస్వామి, అనంతవెంకటరామిరెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, ఎంపీలు నందిగాం సురేష్, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, జెడ్పీ చైర్మన్ బోయగిరిజమ్మ, మేయర్ మహమ్మద్ వాసీం, అహుడా ఛైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, రజక కార్పొరేషన్ చైర్మన్ రంగన్న, డీసీసీబీ చైర్మన్ లిఖిత, ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఇదీచదవండి..అందులో కోటి 30 లక్షల మంది ప్రయాణం.. -
‘పేదలకు ఇండ్లు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిదే’
సాక్షి, ఇచ్చాపురం: వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇఛ్చాపురంలో జెండా ఊపి బస్సు యాత్రను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేరుగు నాగార్జున, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. ఇక, బస్సు యాత్ర సందర్భంగా ఇచ్చాఫురం బహిరంగ సభలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. అవినీతి లేకుండా ప్రజలకు సంక్షేమ పలాలు డైరెక్ట్గా ఇస్తున్నాం. ప్రజలు అది గమనించాలి. ఒకేసారి 32 లక్షల మందికి ఇళ్లు ఇస్తే చిన్న స్థలం ఇచ్చారని చంద్రబాబు అనడం హాస్యాస్పదం. టీడీపీ నేతలకు మాట్లాడే అర్హత లేదు. అవినీతి లేకుండా చేసిన ఘనత మన ప్రభుత్వానిదే. ఏ ఒక్కరూ తలవంచకుండా ఆత్మగౌరవంతో పేద ప్రజలు ఉన్నారు. 2014 ఎన్నికల్లో గెలిపిస్తే రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశాడు. రాష్ట్రం కోసం చంద్రబాబు కష్టపడుతున్నాడు అనడం హాస్యాస్పదంగా ఉంది. సిల్క్ కుంభకోణం కేసులో చంద్రబాబు అన్ని ఆధారాలతో దొరికిపోయాడు. ఈడీ, ఐటీల వద్ద స్కిల్ స్కామ్కు సంబంధించిన వివరాలున్నాయి. వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయడంలో బాబు ఫెయిల్ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాకే ఇక్కడ అభివృద్ధి జరిగింది. ఇటువంటి ప్రభుత్వం కొనసాగించాల్సిన బాధ్యత మీపై ఉంది. రాబోయే ఎన్నికలు మనకు ఓ సవాల్. ఇక్కడ ఇంకా చాలా మందికి మంచి మంచి పదవులు రాబోతున్నాయి. అన్ని కులాలను సమానంగా చూస్తున్నాం.. రాబోయే ఎన్నికల్లో ఇచ్ఛాపురంలో మనం గెలవాలి. పేదలకు ఇల్లు ఇచ్చిన ఘనత మాదే. మంచి భవిష్యత్తు ఉండాలని బడి, వైద్యం, విద్య అందించాం. స్వార్ధం కోసం వచ్చే వారిని దూరం పెట్టాలి అని పిలుపునిచ్చారు. ఇచ్చాపురం క్యాడర్ అందరూ పనిచేయాలని కోరారు. సభలో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మత్స్యకార సోదరులారా మన సమస్య మీద చంద్రబాబునాయుడు వద్దకు వెళితే మీ డొక్కా తీస్తా, తోలుతీస్తా అని బెదిరించారు. గడిచిన ఎన్నికల్లో తొక్కతీసి ఇప్పుడు రాజమండ్రి జైల్లో చిప్పకూడు తినిపించాం. ఎస్సీ, ఎస్టీలో పుట్టడానికి మనం కోరుకుంటామా అని చంద్రబాబు అన్నారు. కానీ, మన ప్రభుత్వంలో దళితుడే ఉప ముఖ్యమంత్రి అయ్యారు. బీసీలు జడ్జీలుగా పనికిరారని చంద్రబాబు ఆనాడు సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. అటువంటి చంద్రబాబుని క్షమించకూడదు. వైద్యం, విద్యను పూర్తిగా చంద్రబాబు నిర్వీర్యం చేశారు.. బహిరంగ సభలో మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తలెత్తుకు ఉన్నారంటే మన సీఎం జగన్ వల్లే. పేదవాడు, దళితులు, మైనార్టీలు విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడేవారు. సీఎం జగన్ వచ్చాక స్థితి గతులు పెరిగి కార్పోరేట్ వైద్యం పేదలకు అందించారు. విద్యలో ఇంగ్లీష్ మీడియం పెడితే చంద్రబాబు కోర్టుకు వెళ్లి ఆపాలని చూశారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి కావడం వల్లే మన కులాలు మంచి స్థితిలో ఉన్నాయి. పేదల పక్షపాతి సీఎం జగన్.. పెత్తందార్ల పక్షపాతి చంద్రబాబు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
సంక్షేమ పథంలో సాహసోపేత అడుగులు
ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి వరకూ తీసుకున్న నిర్ణయాలన్నీ ఒక ఎత్తు, దళితుల భూముల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం మరోఎత్తు. ఒకవైపు పేద లకు కొత్తగా ప్రభుత్వ భూముల్ని అసైన్ చేస్తూ, మరోవైపు అందని ద్రాక్షలా ఉన్న భూములపై దళితు లకు పూర్తి స్థాయి యాజమాన్య హక్కులను కల్పిస్తున్నారు. పేదలకు చోటే లేదన్న అమ రావతి రాజధాని భూముల్లో నిరుపేదలకు ఇళ్లను నిర్మిస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాలు చరిత్రాత్మకం. మహానేత డా‘‘ వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న ప్పుడు భూమిలేని నిరుపేదలకు భూములను ఇచ్చారు. ఆ తర్వాత ఇంతకాలానికి మళ్లీ ఆయన తనయుడు సీఎం జగన్ పేదలకు భూ పంపిణీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,935 మంది భూమిలేని నిరుపేదలకు 54,129.45 ఎకరాలను అసైన్ చేయాలని జగన్ ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. అలాగే 3 కేటగిరీల్లో 9,062 ఎకరాల లంక భూముల విషయంలోనూ రైతులకు అనుకూలంగా అసైన్మెంట్ పట్టాలు, 5 ఏళ్ల లీజు ఇవ్వడానికి తీసుకున్న నిర్ణయానికి కూడా కేబి నెట్లో ఆమోద ముద్ర వేశారు. ‘ల్యాండ్ పర్చేజ్’ స్కీమ్ కింద దళిత రైతులకు కొని ఇచ్చిన భూములపై వారికి పూర్తి స్థాయి యాజమాన్యపు హక్కులు కల్పించాలన్న చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకో వడంతో దాదాపు రూ. 2 వేల కోట్ల విలువైన భూములపై దళిత రైతులకు పూర్తి హక్కులు లభించనున్నాయి. 14,223 మంది దళిత రైతులు గతంలో వారు పొందిన భూములకు సంబంధించి వారు కట్టాల్సిన రుణాలను కూడా మాఫీ చేశారు. అలాగే దళిత రైతులకు వారి భూములపై యాజ మాన్య హక్కులను కల్పించడానికి అవసరమైన రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా మాఫీ చేస్తూ, ప్రభుత్వమే ఖర్చులు భరించి వారి భూములు రిజిష్టర్ చేసి ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన హక్కు పత్రాల పంపిణీకి ఆగస్టు మొదటి వారంలో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు అసైన్ చేసిన పేద రైతుల పరిస్థితి కూడా ల్యాండ్ పర్చేజ్ స్కీమ్లో భూములు పొందిన పేద దళిత రైతుల్లాగే ఉంది. తాము తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు ‘డీకేటీ’ పట్టాలు పొందిన రైతులకు కూడా వాటిపై పూర్తి హక్కులు ఉండవు. ఈ భూమలన్నీ నిషేధిత జాబితాలో ఉన్న కార ణంగా ఇవి రిజిష్టర్ అయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే అసైన్డ్ భూములపై కూడా పేద రైతులకు పూర్తి స్థాయి యాజమాన్యపు హక్కులు కల్పించి ఇతర రైతుల తరహాలోనే వారు కూడా తమ భూములను అవసరమై నప్పుడు క్రయ, విక్రయాలు చేసుకోవడానికి వీలుగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసు కున్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద సాహసోపేత మైన నిర్ణయం. ఆయా భూములను అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు అనుభవించేలా ఆమోదముద్ర వేశారు. ఇది మాత్రమే కాదు, గ్రామాల్లోని కుల వృత్తులు చేసు కునేవారికి ఇచ్చిన ఇనాం భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు కూడా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీంతో రజక, నాయీబ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ వంటి ఇతర కులవృత్తులకు సంబంధించిన వారి భూముల విలువలు పెరగనున్నాయి. వారి కష్టాలు శాశ్వ తంగా తీరిపోనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత వాడలలో చాలా వాటికి ఇప్పటి వరకూ శ్మశానాలు లేని కారణంగా దళితులు మరణించినప్పుడు వారికి అంత్యక్రియలు చేయడం కూడా ఇబ్బంది కరంగా ఉండేది. వారి కష్టాన్ని గుర్తించి గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికల కోసం భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా ఎస్సీల శ్మశాన వాటికల కోసం ప్రత్యేకంగా ఒకేసారి భూములను కేటాయించడం ఇదే తొలిసారి. ఒక గ్రామానికి ఒక ఎకరా వరకూ శ్మశానం కోసం ఇవ్వనున్న ప్రభుత్వం ఈ భూమి కేటాయింపు అధికారం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. రాష్ట్రంలోని 1,966 రెవిన్యూ గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికలు లేవని సర్వే ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రాజధాని ప్రాంతమైన అమరావతి కేవలం ఒక సామాజిక వర్గానికే చెందిన ధనిక రాజధాని ప్రాంతంగా మిగిలిపోకూడదని సీఎం జగన్ భావించారు. ఈ కారణంగానే అత్యంత ఖరీదైన రాజధాని భూముల్లోనూ పేదలకు భాగస్వామ్యం ఉండాలని వారికి రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలను ఇచ్చారు. అత్యంత నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారితో పాటుగా అగ్ర కులాల్లోనూ ఆర్థికంగా వెనుకబడిన పేదలకు పట్టాలు ఇవ్వాలని సీఎం సంకల్పించినప్పుడు ప్రతిపక్షాలవారు రాజధాని రైతులతో సుప్రీం కోర్టులోనూ కేసులు వేయించారు. వీటినేమీ పట్టించుకోకుండా ఏపీ ఆర్–5 జోన్లో 50 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 24న సీఆర్డీఏప్రాంతంలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం అవ్వబోతు న్నాయి. ఈ పనులను ప్రారంభిస్తూ సీఎం స్వయంగాశంకుస్థాపన కూడా చేయనున్నారు. సీఎం జగన్ చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు అగ్రకులాల్లోని పేద వర్గాల కోసమేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కారణంగానే రాష్ట్రంలోని పేద వర్గాలకు చెందిన వారందరూ కుల, మతాలకు అతీతంగా మరోసారి జగనన్నకు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. -డా‘‘ మేరుగు నాగార్జున వ్యాసకర్త ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
నైతికతకు నిలువుటద్దం..నిజంగా నవశకమే
ఎన్నికల్లో గెలవడం కోసం నోటికొచ్చిన వాగ్దానాలు చేయడం, తర్వాత వాటిని మరిచిపోవడం మామూలే అనే అభిప్రాయం ప్రజానీకంలో పాతుకుపోయింది. కానీ అటువంటి అభిప్రాయాన్ని తారుమారు చేస్తూ మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాల్లో 98 శాతం నెరవేర్చింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం. ఇక ముందెవరైనా హామీ ఇవ్వాలంటే జగన్ నెలకొల్పిన ఈ ప్రమాణం అందుకోవాలి. అందుకే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయపార్టీలు ఎన్నికల్లో గెలవడం కోసం అనేక హామీలు ఇస్తూ ఉంటాయి. వాటిని తమ మేని ఫెస్టోలో చేర్చి ప్రచారం చేసుకోవడం కూడా సహజం. అయితే గెలి చిన తర్వాత ఆ హామీలను అమలు చేయడంలోనే ఆయా పార్టీలు, లేదా నాయకుల మను గడ ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు నేతృత్వం వహిస్తున్న టీడీపీ, వైసీపీల పనితీరును అంచనా వేయాలి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు అమలు చేయలేని వాగ్దానాలెన్నో చేశారు. ఏకంగా 650 వాగ్దానాలు చేస్తూ వాటిని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల్లో గెలిచారు. అయితే సీఎం అయ్యాక ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో కనీసం 10 శాతం కూడా నెర వేర్చలేదు. సీఎంగా కొనసాగిన ఐదేళ్ల కాలంలో మేని ఫెస్టోను ఏ మేరకు అమలు చేశాననే విష యాన్ని కనీసం సమీక్షించుకోవడానికి కూడా ఆయనకు తీరిక దొరకలేదు. అంతకుముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు 1994, 1999లలో కూడా రెండు సార్లు సీఎంగా పని చేశారు. ఆ సమయాల్లో కూడా తన పార్టీ మేనిఫెస్టోను అమలు చేయడంగానీ, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం గానీ చంద్రబాబు చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో చంద్రబాబు తాను సీఎంగా కొనసాగిన 2014 –19 మధ్య కాలంలో ఉద్యోగాల విషయంలో రాష్ట్రంలోని యువతకు, రుణమాఫీ విషయంలో మహిళలకు, రైతులకు ఇచ్చిన హామీ లను నెరవేర్చకుండా కాలయాపన చేశారు. పైగా బాబు ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాల్లో కూడా అర్హులైన వారందరికీ లబ్ధి కలి గించకుండా పైరవీలకు, అక్రమాలకు పెద్దపీట వేస్తూ ‘జన్మభూమి కమిటీ’ల పేరుతో ప్రజ లను దోచుకోవడానికి టీడీపీ శ్రేణులను ప్రజల మీదికి వదిలారు. అలా ఐదేళ్లు గడిచి పోతుండగా 2019 నాటి ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహిళలకు ‘పసుపు కుంకుమ’ లాంటి పథ కాల ద్వారా ప్రజలను మభ్యపెట్టి మరోసారి అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు నైజమేమిటో అప్పటికే బాగా అర్థమైన రాష్ట్ర ప్రజలు ఆయనను ఓడించి ఇంటికి పంపారు. జగన్మోహన్ రెడ్డి తన ‘నవరత్నాల’ పథ కాలతో పాటుగా ప్రజలకు చేసే ఇతర మేళ్లని గురించి రూపొందించిన మేనిఫెస్టోను ఇంటింటికీ పంచారు. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలతో పోల్చారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే మేనిఫెస్టోను అమలు చేయడం ప్రారంభించారు. జగన్ మూడేళ్ల పరిపాలనలోనే తన మేని ఫెస్టోలో 98 శాతం హామీలను నెరవేర్చారు. అంతటితో ఆగిపోకుండా మేనిఫెస్టోలో హామీ ఇవ్వని కొత్త పథకాలను కూడా అమలు చేయడం మొదలు పెట్టారు. డీబీటీ, నాన్– డీబీటీ పథకాల ద్వారా గత నాలుగేళ్ల కాలంలో ప్రజలకు సుమారుగా రూ. 2.82 లక్షల కోట్ల రూపాయలను అందించినా అందులో ఎక్కడా ఒక్క పైసా అవినీతి కూడా జరిగిందని ఎవరూ చెప్పలేని విధంగా పూర్తి నీతివంతమైన పరిపాలనను అందించడం జగన్ సృష్టించిన మరో చరిత్ర. అంతేకాదు దేశ చరిత్రలోనే మొదటి సారిగా ఒకేసారి 1.26 లక్షల ప్రభుత్వ ఉద్యోగా లను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేశారు. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయడం ఇవాళ దేశమే అబ్బురపడు తున్న అభివృద్ధి. పథకాలను అందించడంలో అర్హతే ప్రామాణికంగా తీసుకొని కుల, మత, ప్రాంతీయ, వర్గ, వర్ణ, రాజకీయ పార్టీ విబేధా లకు తావివ్వకుండా చూడటం జగన్ నైతికతకు నిలువుటద్దం. 2014 ఎన్నికల్లో వాడుకొని మోసం చేసిన పవన్ కల్యాణ్తో మళ్లీ పొత్తుకోసం వెంపర్లా డటం, గతంలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన నరేంద్ర మోదీ చెలిమి కోసం ఇప్పుడు తహతహలాడటం చంద్రబాబు అనై తిక విధానానికి నిదర్శనమైతే, అప్పుడూ ఇప్పుడూ కూడా కేవలం ప్రజలనే నమ్ముకొని ఒంటరిగా బరిలో నిలబడటానికి సిద్ధపడటం జగన్ నైతికతకు తార్కాణం. ఈ నేపథ్యంలోనే 2024లో రాబోయే ఎన్నికల కోసం చంద్రబాబు అప్పుడే తన మేని ఫెస్టోను ప్రకటించేశారు. షరా మామూలుగా తాను గతంలో ప్రజలకు ఏం చేసింది చెప్పకుండా ఇక ఇప్పుడేదో చేసేస్తాననే రీతిలో రాజమండ్రిలో టీడీపీ మేనిఫెస్టోను ప్రకటించారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మేనిఫెస్టోలోని అంశాలకే పేర్లు మార్చి తన మేని ఫెస్టోగా ప్రకటించడం గమనార్హం. ఆయన భావ దారిద్య్రం ఏ స్థాయికి చేరిందంటే జగన్ పరిపాలనలో తల్లులందరి మన్ననలు పొందిన ‘అమ్మఒడి’ పథకానికి ‘అమ్మకు వందనం’ అని పేరుమార్చి తన మేనిఫెస్టోలో పెట్టేసుకున్నారు. అసలు ఎన్నడూ తన హామీలను నెరవేర్చని చంద్ర బాబు ప్రకటించిన మేనిఫెస్టోకి విలువేముంటుంది? అయినా చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోపైన, జగన్ పరిపాలనపై చేస్తున్న ఆరోపణల మీద బహిరంగ చర్చకు రావాలని మేము చేసిన సవాల్కు ఇప్పటివరకూ బాబు నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఇదివరకు అధికారమిచ్చి అందలం ఎక్కిస్తే చంద్రబాబు, ఆయన అనుచరగణం చేసిందేమిటో బాగా తెలి సిన రాష్ట్ర ప్రజలు ఇప్పుడు చంద్రబాబు మేని ఫెస్టో పేరిట కొత్తగా ఇస్తున్న హామీలను నమ్మే అవకాశం ఏ మాత్రం లేదు. :::డా. మేరుగు నాగార్జున, వ్యాసకర్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు నిజంగా నవశకమే... ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి 2019 వరకూ రెండే పార్టీల పాలన సాగింది. దీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీ అధికా రంలో ఉండగా, ఆ తర్వాత కాంగ్రెస్ అధి ష్ఠానం చేసిన అపరా ధాల వల్ల నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ అధి కారాన్ని చేజిక్కించుకుంది. ప్రజల నమ్మకాన్ని ఎన్టీఆర్ వమ్ము చేయలేదు. ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ అవసరమని భావించి ఆ దిశగా కొత్త సంక్షేమానికి తెర తీశారు. సమాజంలో అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంక్షేమ ఫలాలు దక్కేలా చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీని లాక్కొని అధికారంలోకి వచ్చారు. అక్ర మంగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారు. ప్రజల ప్రాథమిక అవసరాలను పక్కన పెట్టి నేల విడిచి సాము చేశారు. హైటెక్ అంటూ కొన్ని వర్గాలకు రాష్ట్ర సంపదను దోచిపెట్టి పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచారు. విజన్ 2020 అంటూ త్రిశంకు స్వర్గంలో తేలియాడుతూ ప్రజలను గాలికొదిలేశారు. సరిగ్గా ఇదే సమయంలో వైఎస్ రాజ శేఖరరెడ్డి ‘నేనున్నా’ అంటూ తెలుగు ప్రజలకు భరోసా ఇచ్చారు. మండు వేసవిలో కాళ్లకు బొబ్బలు వచ్చినా ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రాంతాలలో తన ప్రజా ప్రస్థానాన్ని పూర్తి చేసి అధికారంలోకి వచ్చారు. వచ్చీ రాగానే ప్రజలను తమ అగచాట్ల నుంచి విముక్తి కలిగించేలా పదుల సంఖ్యలో సంక్షేమ పథకాలు అమలు చేశారు. కరవు కాటకాలతో అల్లాడు తున్న ప్రజలకు ఊపిరి పోశారు. వైఎస్ఆర్ పాలించిన ఐదేళ్ల మూడు నెలల్లో ప్రజలు హాయిగా, సంతోషంగా గుండెలో మీద చేతులు వేసుకుని బతికారు. ఆయన ఆకస్మిక మరణం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలను బాధించింది. వైఎస్ఆర్ స్ఫూర్తితోనే నేను రాజకీయా ల్లోకి అడుగు పెట్టాను. జడ్పీటీసీ సభ్యుడి స్థాయి నుంచి జడ్పీ ఛైర్మన్, ఎమ్మెల్యేగా ఎది గాను. వైఎస్ మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి మాదిరిగా తయారైంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమతుల్యత దెబ్బతింది. ప్రాంతీయ వాదా లతో అట్టుడికి పోయింది. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ విభజన, మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం జరిగి పోయాయి. ఎప్పుడూ ఎవరో ఒకరి సహాయంతో లేదా అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చే చంద్రబాబు చేతుల్లో ఆంధ్రప్రదేశ్ మరోసారి దోపిడీకి గురైంది. 40 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ, గొప్ప విజనరీ అని డప్పాలు కొట్టుకునే చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి ఓడిపోయారు. ఇదే సమయంలో దిక్సూచిలా వైఎస్ఆర్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు కనిపించారు. నేను విన్నా... నేను కన్నా... నేను ఉన్నా అంటూ ప్రజల ఆదరాభిమానాలతో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్కు కూడా ఇవ్వని భారీ మెజారిటీని ప్రజలు జగన్కు ఇచ్చారు. తన పాదయాత్రలో కనిపించిన, వినిపించిన ప్రజల కష్టాలను, అవస్థలను మేనిఫెస్టోగా రూపొందించారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాను, బైబిలు మాదిరిగా భావించి అందులో పొందుపరిచిన ప్రతి అంశాన్ని తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. నాలుగేళ్లలో 98.5 శాతం హామీ లను అమలు చేయడం చాలా గొప్ప విషయం. ఓ వైపు చంద్రబాబు ఖజానా ఖాళీ చేసినా... మరో వైపు కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలైనా... ఏ మాత్రం బెదరకుండా మొక్కవోని ధైర్యంతో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకే వెళ్లారు. కేంద్రం నుంచి రావాల్సినవి రాబట్టు కుంటూ, పొదుపు మంత్రం పాటిస్తూ చంద్ర బాబు హయాంలో చెల్లాచెదురైన ఆర్థిక వ్యవ స్థను గాడిలో పెట్టి ఓ వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధిని రెండు కళ్లుగా అడుగులు ముందుకు వేస్తున్నారు. విద్యా, వైద్య రంగా లలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. చదువు ఒక్కటే భావితరాలకు తర గని ఆస్తి అని చెప్పి విద్యార్థుల పాలిట మేన మామగా మారారు. ప్రతి పేద వాడి ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం చక్కగా ఉంటుందని భావించారు. రైతు సంక్షేమమే ప్రధానంగా భావించి గత టీడీపీ హయాంలో పడకేసిన వ్యవసాయాన్ని పండుగ చేశారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లు వరుసగా టకటకా చెబితే పది లక్షల బహుమతి ప్రకటించా! ఇంతవరకూ నా వద్దకు వచ్చి ఎవరూ చెప్పలేక పోయారు. అంటే అన్ని పథకాలను ఆయన ప్రజలకు అందిస్తున్నారు. అన్ని ప్రాంతాలకూ, అన్ని వర్గాలకూ సమ న్యాయం చేయడం సాధ్యమని ఈ నాలుగేళ్లలో జగన్ నిరూపించారు. పరిపాలనలో పారదర్శ కత, ప్రజల గుమ్మం ముందుకు ప్రభుత్వం వెళ్లడం, అవినీతికి అవకాశం లేకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో నగదు బదిలీ, వాలంటీర్ల సేవలు తదితరాలు గతంలో ఎన్నడూ లేనివి. ఇవన్నీ కొత్తగా ప్రవేశపెట్టిన జగన్ పెద్ద విజనరీ. ప్రతిపక్షాల విమర్శలు, పచ్చ మీడియా దాడులకు అదరని, బెదరని గొప్ప ధైర్యశాలి. నాలుగేళ్ల పాలనతో 42 ఏళ్ల రాజ కీయ సీనియర్ అని చెప్పుకొనే చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టించారు. జగన్ పాలన నిజంగా నవ శకమే! :::వ్యాసకర్త రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి డా‘‘ కారుమూరి వెంకట నాగేశ్వరరావు (వైఎస్పార్సీపీ ప్రభుత్వానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా) -
చంద్రబాబుని తరిమి తరిమి కొడతారు..!
-
ఎస్సీ గురుకుల ఉపాధ్యాయుల వేతనాలు పెంపు
సాక్షి, అమరావతి: ఎస్సీ గురుకులాల్లో పని చేస్తున్న 1791 మంది పార్ట్ టైమ్ టీచర్ల వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. టీచర్లతో పాటుగా వ్యాయామ ఉపాధ్యాయులు, హెల్త్ సూపర్ వైజర్ల వేతనాలను కూడా పెంచామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకులాల్లో పని చేస్తున్న జూనియర్ లెక్చరర్లు, పీజీటీలు, టీజీటీలు, పీఇటీలు, హెల్త్ సూపర్ వైజర్లు వేతనాలను పెంచాలంటూ ఉపాధ్యాయులు చేసిన విజ్ఞప్తి మేరకు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నాగార్జున వివరించారు. గతంలో జూనియర్ లెక్చరర్ల (జేఎల్)వేతనం రూ.18 వేలు ఉండగా దీనిని రూ.24,150 లకు పెంచామని చెప్పారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల (పీజీటీ) వేతనం రూ.16,100 ఉండగా దీన్ని కూడా రూ.24,150కు పెంచామని తెలిపారు. ట్రైన్డ్ గ్యాడ్యుయేట్ టీచర్ల( టీజీటీ) వేతనం రూ.14,800 ఉండగా దీన్ని రూ.19,350కు పెంచడం జరిగిందన్నారు. అలాగే వ్యాయామ ఉపాధ్యాయుల (పీఇటీ) వేతనం రూ.10,900 ఉండగా దీనిని రూ.16,350కు, హైల్త్ సూపర్ వైజర్, స్టాఫ్ నర్స్ ల వేతనం రూ.12,900 ఉండగా దానిని రూ.19,350లకు పెంచడం జరిగిందని నాగార్జున వివరించారు. ఈ పెంపుదలతో 1791 మంది పార్ట్ టైమ్ టీచర్లతో పాటుగా ఇతర సిబ్బందికి ప్రయోజనం చేకూరిందని తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసామన్నారు. 2019 తర్వాత పార్ట్ టైమ్ టీచర్లు, ఇతర సిబ్బంది వేతనాలను పెంచడం ఇదే ప్రథమం అని మంత్రి చెప్పారు. కాగా తమ కష్టాలను గుర్తించి తమ వేతనాలను పెంచినందుకు గురుకుల విద్యాలయాల సంస్థ ఉద్యోగుల జేఏసీ నేతలు,టీచర్లు శుక్రవారం మంత్రి మేరుగు నాగార్జునను కలిసి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగానే మంత్రిని సన్మానించారు. ఈ సందర్భంగానే జేఏసీ ఛైర్మెన్ నాగభూషణం మాట్లాడుతూ, తాము కోరిన వెంటనే బీజీ సమావేశంలో ఈ అంశాన్ని చేర్చి తమకు మంత్రి తమకు న్యాయం చేసారని చెప్పారు. బీసీ వెల్ఫేర్ టీచర్లతో సమానంగా పీజీటీలు, టీజీటీల వేతనాలను పెంచే విషయాన్ని కూడా పరిశీలించాలని మంత్రి నాగార్జునను కోరారు. -
‘ఏపీలో రూ.65 కోట్లతో లెదర్ పరిశ్రమాభివృద్ధి’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.65 కోట్లతో లెదర్ పరిశ్రమాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా లెదర్ పరిశ్రమాభివృద్ధి సంస్థకు చెందిన భూములు, భవనాలన్నింటినీ ఉపయోగంలోకి తీసుకురావడానికి కార్యాచరణ పథకాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ చర్మపరిశ్రమాభివృద్ధి సంస్థ (లిడ్ క్యాప్) కార్యకలాపాలను మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డున ఆటోనగర్ గేట్లో లిడ్ క్యాప్ కు అత్యంత విలువైన భూమి ఉందని చెప్పారు. ఇది కాకుండా శ్రీకాకుళం జిల్లాలోని వెన్నెలవలస, పార్వతీపురం జిల్లాలోని అద్దపుశీల, ఏలూరు జిల్లాలోని నూజివీడు, పల్నాడు జిల్లాలోని అడిగొప్పుల, ప్రకాశం జిల్లాలోని యడవల్లి, అనంతపురం జిల్లాలోని రాచపల్లి, రాళ్ల అనంతపురం, కృష్ణా జిల్లాలోని జి.కొండూరు, తిరుపతి జిల్లా కేంద్రాల్లో మొత్తం 133.74 ఎకరాల భూములు ఉన్నాయని తెలిపారు. ఈ భూముల్లో అత్యధికంగా అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఉన్నాయన్నారు. వీటిలో భవనాలతో పాటుగా శిక్షణలకు ఉపయోగపడే షెడ్లు కూడా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఈ భూములు, భవనాలన్నింటినీ ఉపయోగంలోకి తెచ్చేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని వివరించారు. పీఎం అజయ్ పథకం కింద ఇదివరకు మంజూరైన రూ.11.50 కోట్ల నిధులతో కృష్ణా జిల్లాలోని జి.కొండూరు, ప్రకాశం జిల్లాలోని యడవల్లిలలో రెండు పాదరక్షల తయారీ (ఫుట్ వేర్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్) కేంద్రాల నిర్మాణాలు ప్రారంభం కానున్నాయని నాగార్జున వెల్లడించారు. దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. విజయవాడ ఆటోనగర్ గేట్ లో ఉన్న భూమిలో చర్మ ఉత్పత్తుల శిక్షణ, విక్రయాలకు అవసరమైన ఒక పెద్ద భవనాన్ని నిర్మించే ప్రతిపాదన ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9 మినీ లెదర్ పార్క్ లను నిర్మించడానికి కూడా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇదికాకుండా రూ.65 కోట్లతో లిడ్ క్యాప్ లో పలు అభివృద్ధి పనులను చేపట్టనున్నామని, దీనిలో భాగంగానే పాదరక్షల కు సంబంధించిన కామన్ ఫెసిలిటీ సెంటర్ ను రూ.10 కోట్లతోనూ, చర్మపరిశ్రమకు సంబంధించిన శిక్షణల కోసం మరో కామన్ ఫెసిలిటీ సెంటర్ ను రూ.30 కోట్లతోనూ, కొత్త భవనాల నిర్మాణాలను రూ.15 కోట్లతోనూ, ప్రస్తుతం ఉన్న భవనాల అభివృద్ధిని రూ.10 కోట్లతోనూ చేపట్టనున్నామని మంత్రి వివరించారు. అలాగే లిడ్ క్యాప్ను మరింత బలోపేతం చేయడానికి ఉన్న ఇతర అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రాష్ట్రంలో చర్మపరిశ్రమాభివృద్ధికి, చర్మకారుల సంక్షేమానికి కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. లిడ్ క్యాప్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. తాను సూచించిన ప్రతిపాదనలు, కోరిన వివరాలతో వారం రోజుల్లో మరోసారి సమీక్షా సమావేశానికి రావాలని లిడ్ క్యాప్ అధికారులను నాగార్జున ఆదేశించారు. ఈ కార్యక్రమంలో లిడ్ క్యాప్ ఎండీ శంకర్, జీఎం నల్లమోతు అధికారి, ఫెలో శ్యామ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఎస్సీ కుటుంబాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా మేలు జరుగుతోంది
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలో వైఎస్సార్సీపీ ఎస్సీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ స్వామి, మేరుగు నాగార్జున, విశ్వరూప్, ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. రాష్ట్రంలో ఎస్సీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై చర్చించారు. ఈ భేటీలో సజ్జల రామాకృష్ణారెడ్డి, చెవిరెడ్డి, గురుమూర్తి కూడా పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో మసిపూసి మారేడుకాయ చేసినట్లు ఎస్సీలకు కొన్ని పథకాలు పెట్టి అవి కేవలం టీడీపీ కార్యకర్తలకు అందేలా చేసి అవినీతికి పాల్పడిన పరిస్థితి ఉందని, వాటన్నింటినీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరిదిద్దిందని తెలిపారు. 'ఈరోజు ఎస్సీ కుటుంబాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా మేలు కల్గించేలా సంస్థాగత మార్పులు, సంస్కరణలు చేస్తూ ప్రధానంగా విద్య, వైద్యం వంటి అంశాల్లో గత నాలుగు సంవత్సరాలుగా సీఎం జగన్ అందించిన పరిపాలన మీద ఈరోజు చర్చించాం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సంక్షేమ పథకాల మీద ప్రతిపక్షాలు వక్రభాష్యంతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి. వాటిని తిప్పికొట్టి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించాలని ఈరోజు తీర్మానించాం. ప్రధానంగా ఈ ప్రభుత్వం మూల సూత్రాలు జవాబుదారీతనం, పారదర్శకత, అవినీతి రహిత పాలనను నాలుగు సంవత్సారాలుగా ఏ విధంగా అందిస్తున్నారనే విషయంపైనా చర్చించాం. రాబోయే రోజుల్లో ఎస్సీ కుటుంబాలు ఏకతాటిపైకి వచ్చి తమకు అందుతున్న సంక్షేమ పథకాలు భవిష్యత్తులోనూ కొనసాగాలంటే జగన్ను మరోసారి సీఎం చేయాల్సిన అవసరంపై కూడా చర్చించాం.' అని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. పార్టీల తీరు మారాలి: సజ్జల సజ్జల మాట్లాడుతూ.. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పార్టీల తీరు మారాలన్నారు. మన ఆలోచనలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. చదవండి: జగనన్న కాలంలో ఏపీ వైద్యారోగ్యానికి స్వర్ణయగం: మంత్రి రజిని -
‘చంద్రబాబు వీధి రౌడీ మాదిరిగా వ్యవహరిస్తున్నారు’
సాక్షి, తాడేపల్లి : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబు వీధి రౌడీలా వ్యవహరించారని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. చంద్రబాబుకు దళితులపై ఎందుకంత కక్ష్య అని ప్రశ్నించారు మంత్రి మేరుగ. ‘ నిన్న చంద్రబాబు వీధి రౌడీలా వ్యవహరించారు. ఎన్ని అఘాయిత్యాలు చేయాలనుకున్నారో చూశాం. దళితులపై ఎలా దాడులు చేయించారో చూశాం. చంద్రబాబు కూసాలు కదులుతున్నాయని దిక్కులేక రోడ్డున పడ్డారు. తండ్రి, కొడుకులు బరితెగించిన రాక్షసులు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అన్నారు. దళితులు ఏం పీకుతారు? అని లోకేష్ అన్నాడు. అనలేదని కుటుంబం మీద ఒట్టేసి చెప్పగలవా?, అమలాపురంలో కూడా దళితుల ఇళ్లపై దాడులు చేయించారు. మా దళితులపై ఎందుకంత కక్ష? , మమ్మల్ని అవమానించిన చంద్రబాబును రాజకీయంగా భూస్థాపితం చేస్తాం. ఒళ్లు దగ్గర పెట్టుకుని రాజకీయాలు చేయమని హెచ్చరిస్తున్నాం. అంబేద్కర్ విగ్రహాన్ని ముళ్లపొదల్లో పడేయించిన వ్యక్తి చంద్రబాబు. సీఎం జగన్ 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిస్తున్నారు. అదీ జగన్కి దళితులపై ఉన్న ప్రేమ. రాజధానిలో దళితులు ఉండకూడదని అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో వైఎఎస్సార్సీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయని సర్వేలో తేలటంతో చంద్రబాబుకు వణుకు పుట్టింది.అందుకే దాడులకు పాల్పడుతున్నారు. మావాళ్లపై రాళ్లతో దాడి చేశారు.కుట్రలు చేయటంలో చంద్రబాబు సిద్దహస్తుడు’అని ధ్వజమెత్తారు మంత్రి మేరుగ నాగార్జున -
చంద్రబాబు చెప్పేవన్నీ అభూత కల్పనలే: మంత్రి మేరుగ
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు అన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. ఆయనవి అన్నీ దిగజారుడు రాజకీయాలే. అంటూ ఫైరయ్యారు. కాగా, మంత్రి మేరుగ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రాష్ట్రానికి 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నా ఒక్క మంచి పని కూడా చేయలేదు. అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. కరోనాకు భయపడి పక్క రాష్ట్రం పారిపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అన్ని వర్గాల అభివృద్ది జరిగింది. డీబీటీ రూపంలో లక్షల కోట్ల రూపాయలు బదిలీ చేశాం. టీడీపీ హయాంలో ఒక్క మంచి పథకమైనా ఉందా?. చంద్రబాబుకు అధికార యావ తప్ప మరొకటి లేదు. చంద్రబాబు చెప్పేవన్నీ అభూత కల్పనలే. చంద్రబాబువి అన్నీ దిగజారుడు రాజకీయాలే. పేదల కోసం చంద్రబాబు చేసిందేమీ లేదు. పేదలను పీల్చి పిప్పి చేసిన వ్యక్తి చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు మళ్లీ బుద్ధి చెబుతారు. -
స్కిల్ స్కాంలో చంద్రబాబు ఏ1 ముద్దాయి: మంత్రి మేరుగ
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో చోటుచేసుకున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాం బయటపడిన విషయం తెలిసిందే. కాగా, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్కిల్ స్కాంపై చర్చ జరిగింది. స్కాంకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సహా ఎమ్మెల్యేలు, మంత్రులు వివరాలు వెల్లడించారు. తాజాగా స్కిల్ స్కాంపై మంత్రి మేరుగ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి మేరుగ మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు ఏ1 ముద్దాయి. స్కిల్ కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ చంద్రబాబే. పథకం ప్రకారమే రూ. 371 కోట్లను దోచుకున్నారు. స్కిల్ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే అసెంబ్లీ సాక్షిగా దళిత ఎమ్మెల్యేలపై దాడి చేయించాడు. దళిత ఎమ్మెల్యేలపై దాడి వ్యవహారంలో చంద్రబాబు, అచ్చెన్నాయుడుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి. స్పీకర్ పట్ల టీడీపీ సభ్యులు దారుణంగా వ్యవహరించారు. స్కిల్ స్కాం నుంచి చంద్రబాబును ఎవరూ కాపాడలేరు. -
ఎస్సీ హాస్టల్ ఉద్యోగుల వేతన సమస్యకు చెక్.. 411 మందికి గుడ్న్యూస్
సాక్షి, అమరావతి: పోస్ట్ మెట్రిక్ ఎస్సీ హాస్టళ్లలో ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఉద్యోగులు ఏళ్ల తరబడిగా ఎదుర్కొంటున్న వేతన సమస్యను రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున పరిష్కరించారు. ఇకపై వారు వేతనాలు సకాలంలో అందుకొనేలా ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్(ఆప్కాస్)కు వారి సేవలను అనుసంధానం చేసారు. వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ఉన్న 160 పోస్ట్ మెట్రిక్ ఎస్సీ హాస్టళ్లలో వంటపని, పారిశుద్ధ్యం ఉద్యోగులుగా పని చేస్తున్న వారిలో 411 మందికి ప్రైవేటు సంస్థల ద్వారా వేతనాలను చెల్లించేవారు. అయితే, ఈ విధానంలో ఆ ఉద్యోగులకు వేతనాలు అందడం ఆలస్యం అవుతుండటంతో ఉద్యోగులు విధుల నుంచి తప్పుకుంటున్న కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. అందుకే తమ వేతనాలు అందరితో పాటుగా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు తెలిపారు. కాగా, ఈ సమస్య మంత్రి మేరుగు నాగార్జున దృష్టికి రావడంతో వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం థర్డ్ పార్టీ విధానంలో పని చేస్తున్న ఈ ఉద్యోగుల సేవలను ప్రీ మెట్రిక్ ఎస్సీ హాస్టళ్లలో ఇదివరకే మంజూరైన పోస్టుల స్థానంలో ఉపయోగించుకోవాలన్నారు. అలాగే, వారి వేతనాలను ఆప్కాస్ ద్వారా ఆలస్యం లేకుండా ప్రతినెలా అందరితో పాటుగా చెల్లించాలిని అధికారులు ప్రతిపాదించగా మంత్రి.. ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్రెడ్డి దృష్టి తీసుకెళ్లారు. అనంతరం, ఈ ప్రతిపాదనపై సీఎం జగన్ ఆమోదముద్ర వేసారు. దీంతో, ఈ ఉద్యోగులు ఇప్పటి వరకూ వేతనాల కోసం పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయి. అదే విధంగా పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో ఉద్యోగులు లేని కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడే దుస్థితికి కూడా తెరపడింది. ప్రస్తుతం ఆప్కాస్కు అనుసంధానం చేసిన 411 మంది పోస్ట్ మెట్రిక్ ఎస్సీ హాస్టల్ ఉద్యోగులలో 37 మందిని శ్రీకాకుళం, 52 మందిని విజయనగరం, 17 మందిని విశాఖపట్నం, 120 మందిని తూర్పుగోదావరి, 82 మందిని కృష్ణా,62 మందిని ప్రకాశం, 41 మందిని అనంతపురం జిల్లాలకు చెందిన హాస్టళ్లకు కేటాయిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తమ సమస్యను పరిష్కరించడంలో తమ కష్టాలు తీర్చిన సీఎం జగన్కు, చొరవ చూపిన మంత్రి మేరుగు నాగార్జునకు ఉద్యోగులు తమ ధన్యవాదాలు తెలిపారు. -
గురుకులాల్లో ఆరోగ్య పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలు విద్యార్థులకు మేలు చేస్తున్నాయి. విద్యార్థులకు ప్రతి వారం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు వారి ఆరోగ్య సమస్యల్ని గుర్తించి సత్వర చికిత్సను అందిస్తున్నారు. పేద పిల్లలు కావడంతో పోషకాహారం అందక రక్తహీనత వంటి సమస్యలతో బాధపడే వారిని గుర్తించి చికిత్సను అందించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ 185 గురుకులాల్లో విద్యార్థులకు ఎనీమియా, పోషకాహార లోపానికి సంబంధించిన వైద్య పరీక్షలు పూర్తి చేశారు. మరోవైపు విద్యార్థుల్లో పోషకాహార లోపం తలెత్తకుండా పోషక విలువతో కూడిన ప్రత్యేక మెనూను అమలు చేస్తున్నారు. దృష్టిలోపంతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించే ప్రక్రియ చేపట్టారు. వైఎస్సార్ కంటి వెలుగు బృందాలతో ఇప్పటివరకు 91 గురుకులాల్లో నేత్ర పరీక్షలు నిర్వహించారు. వారిలో కంటి సమస్యలున్న వారిని గుర్తించి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. మిగిలిన గురుకులాల్లోనూ నేత్ర పరీక్షలను కొనసాగిస్తున్నారు. దంత సమస్యలను గుర్తించేందుకు ఇప్పటివరకూ 68 గురుకులాల్లో పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు. మిగిలిన వాటిలోనూ దంత పరీక్షలు కొనసాగుతున్నాయి. కౌమార దశలోని బాలికలకు సమాజంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలపై అవగాహన కల్పించేలా ‘వాయిస్ ఫర్ గరల్స్ సంస్థ’ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాలకు చెందిన 800 మంది బాలికలకు ఇప్పటికే ఈ శిక్షణ పూర్తి చేశారు. విద్యార్థులలో మానసిక ఆరోగ్య సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి వీలుగా బోధన, బోధనేతర సిబ్బందికి ముంబైకి చెందిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. గురుకులాల్లో విద్యతోపాటు వైద్యం.. పోషకాహారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో గురుకులాల్లో చదివే విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. పేద పిల్లల పెద్ద చదువులకు వారధిగా నిలుస్తున్న అంబేడ్కర్ గురుకులాల్లో విద్యతోపాటు వైద్యం, పోషకాహారం అందించేలా ప్రత్యేక దృష్టి సారించాం. ప్రధానంగా నేత్ర, దంత, పోషకాహార లోపం, రక్తహీనత, మానసిక వైద్య సేవలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆడ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారికి తగిన అవగాహన కల్పించి చైతన్యం తెచ్చేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
‘కన్నా ఒళ్లు దగ్గర పెట్టుకో.. మాది కూడా గుంటూరు జిల్లానే’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున సీరియస్ కామెంట్స్ చేశారు. కుట్రలు, కుతంత్రాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని తీవ్ర విమర్శలు చేశారు. కాగా, మంత్రి మేరుగ నాగార్జున శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అణగదొక్కబడ్డారు. రానున్న రోజుల్లో చంద్రబాబును ప్రజలు బహిష్కరించే పరిస్థితి వస్తుంది. నోరు ఉంది కదా అని ఎలా మాట్లాడిన చెల్లుబాటు అవుతుందనుకోవడం చంద్రబాబు భ్రమ. చంద్రబాబు బ్రతుకే హింసాత్మకమైనది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు. కన్నా ఒళ్లు దగ్గర పెట్టుకో.. మాది కూడా గుంటూరు జిల్లానే. అసలు కన్నా లక్ష్మీనారాయణ ఎవరు? ఆయన క్యారెక్టర్ ఏంటి అని ప్రశ్నించారు. కన్నా ఆటలు మా దగ్గర సాగవు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
సామాజిక న్యాయ నిర్మాత సీఎం జగన్
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్నంత కాలం సామాజిక న్యాయ నిర్మాతగా, సామాజిక విప్లవకారుడిగా సీఎం వైఎస్ జగన్ పేరు నిలిచిపోతుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 60 శాతానికి పైగా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినందుకు మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున మంగళవారం విజయవాడలోని పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పుష్పాభిషేకం, సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనలు, ఆశయాల్ని సీఎం జగన్ అమలు చేసి చూపించారని తెలిపారు. సామాజిక న్యాయం అంటే ఇలా ఉండాలని రుజువు చేశారన్నారు. పంచాయతీ మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఉన్నత శిఖరాలకు ఎక్కిస్తున్నారని చెప్పారు. సామాజిక న్యాయానికి రూపకల్పన చేసి పెత్తందారీ వ్యవస్థను బద్దలు కొట్టారని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సీఎం జగన్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దేశంలోనే ఎవరూ చేయలేదు.. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. గత ఎన్నికలకు ముందు జరిగిన బీసీ సభలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్కు దక్కుతుందన్నారు. తాజాగా 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 14 ఎస్సీ, ఎస్టీ, బీసీలకే కేటాయించారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో, దేశంలో బడుగు, బలహీనవర్గాలకు ఇంత పెద్ద మొత్తంలో ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. గతంలో పనిచేసిన వారు బీసీలకు అంత చేశాం.. ఇంత చేశామంటూ మాటలు మాత్రమే చెప్పారని ఎద్దేవా చేశారు. తాము ఊహించనంతగా సీఎం వైఎస్ జగన్ బీసీలకు 68 శాతానికిపైగా సీట్లు కేటాయించారన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా రాజ్యాధికారంలో బడుగులకు అత్యున్నత స్థానం కల్పించినందుకు గర్వపడుతున్నామన్నారు. ఏపీ దేశానికే రోల్మోడల్గా నిలుస్తుందన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో మహనీయులు కన్న కలలు నెరవేరుతున్నాయని చెప్పారు. శాసనమండలిలో 14 స్థానాలు కేటాయించడం నభూతో న భవిష్యత్ అని అన్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ ఎం.శివరామకృష్ణ పాల్గొన్నారు. -
AP: శరవేగంగా అంబేద్కర్ విగ్రహ నిర్మాణ ఏర్పాట్లు..
సాక్షి, అమరావతి: ఢిల్లీలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. విగ్రహ నిర్మాణ పనుల్లో ఎక్కడా ఎటువంటి ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో నిర్ణీత గడువు ప్రకారంగానే ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుందని ఆయన చెప్పారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆవిష్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించడానికి అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఛైర్మెన్ మేరుగు నాగార్జున ఆధ్వర్యంలో రాష్ట్ర నలుగురు మంత్రుల బృందం మంగళవారం ఢిల్లీలోని స్టుడియోను సందర్శించింది. ఈ క్రమంలో అక్కడ జరుగుతున్న విగ్రహ నిర్మాణపనులను పరిశీలించింది. ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర దేవాదాయధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులు ఈ బృందంలో ఉన్నారు. మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించడం ఇది రెండవసారి. ఈ సందర్భంగానే మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహాన్ని రాబోయే అంబేద్కర్ జయంతి రోజున ఆవిష్కరించాలని సీఎం వైఎస్ జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. విగ్రహ నిర్మాణ పనులను మంత్రులతో పాటుగా ముఖ్యమంత్రి కూడా స్వయంగా సమీక్షిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో అటు విజయవాడ స్వరాజ్ మైదాన్లో అంబేద్కర్ స్మృతివనానికి సంబంధించిన నిర్మాణ పనులు, ఇటు ఢిల్లీలో రూపుదిద్దుకుంటున్న విగ్రహ నిర్మాణ పనులు కూడా వేగంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. ఒకవైపు విగ్రహ నిర్మాణానికి సంబంధించిన పనులు జరుగుతుండగానే మరోవైపున విగ్రహ ప్రాంతానికి చేరుకొనే రహదారులు, ప్రహారీ, లోపలివైపున పాదచారులు నడయాడేందుకు అంతర్గత రోడ్లు, విగ్రహ ప్రాంగణం చుట్టూ సుందరీకరణ పనులను కూడా పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే విగ్రహానికి సంబంధించిన పలు విడిభాగాలు విజయవాడకు చేరుకున్నాయన్నారు. రూ.268 కోట్లతో నిర్మించాలనుకున్న ఈ అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ వ్యయం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఖర్చు ఎంతగా పెరిగినప్పటికీ స్మృతివనం పనుల్లో ఎక్కడా ఆలస్యం జరగకుండా అన్ని చర్యలూ తీసుకోవడం జరుగుతోందని వివరించారు. ఈ సందర్భంగానే మంత్రులు విగ్రహాన్ని నిర్మిస్తున్న శిల్పులతో మాట్లాడారు. ప్రస్తుతం విజయవాడకు చేరుకున్న విగ్రహం విడిభాగాలు కాకుండా విగ్రహానికి సంబంధించిన ఇతర భాగాలు ఎప్పటికి రాష్ట్రానికి చేరుకుంటాయనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. కాగా మంత్రుల బృందంతో పాటుగా సాంఘిక సంక్షేమశాఖ, ఏపీఐఐసి, కేపీసీలకు చెందిన పలువురు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. -
సబ్ప్లాన్ అంటే లోకేష్కు తెలుసా?: మంత్రి మేరుగ నాగార్జున
సాక్షి, విజయవాడ: దళితుల గురించి మాట్లాడే అర్హత నారా లోకేష్కు లేదని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. సబ్ప్లాన్ అంటే లోకేష్కు అసలు తెలుసా? అని ప్రశ్నించారు. పాదయాత్రలో జనం లేక లోకేష్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. దళితులను మోసం చేసిన చరిత్ర.. దళితుల నిధులను పక్కదారి పట్టించిన ఘనత చంద్రబాబుదేననని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు సబ్ ప్లాన్ను నాశనం చేశాడని.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సబ్ప్లాన్ను అమలు చేశారని గుర్తు చేశారు. దళితుల అభ్యున్నతికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ ప్లాన్ కింద నిధులు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఒక్క రూపాయి అవినీతి లేకుండా పరిపాలన అందిస్తున్నామన్నారు. ‘దళితుల మీద దాడి చేస్తే నీపైన ఏంటి.. మీ నాన్న పైన కూడా కేసు పెడతాం. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పొలంబడి, రైతు క్షేత్రాలు, నేప్కీన్లు, పెళ్లి కానుక, ఎన్టీఆర్ సుజల స్రవంతికి ఖర్చు పెట్టామని చంద్రబాబు చూపించాడు. ఎస్సీ, ఎస్టీ, పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్య, ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకున్నది మీ బాబు, నువ్వు కాదా?. విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం పెడుతుంటే టీడీపీ ఓర్వలేకపోతోంది. గతంలో ఎస్సీలకు రుణాలు పేరుతో అవినీతికి పాల్పడ్డారు. చంద్రబాబు హయాంలో దళితులపై జరిగిన దాడులపై చర్చించడానికి నేను సిద్ధం’ అంటూ లోకేష్కు మంత్రి సవాల్ విసిరారు. -
త్వరలో ఎస్సీ సదస్సు
సాక్షి, అమరావతి: దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. దళితులకు సంక్షేమ పథకాల అమలుపై తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సమీక్ష జరిగింది. పార్టీ ఎస్సీ విభాగాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకునేలా చైతన్యం చేయడంపై చర్చించారు. దళితుల్లో నాయకత్వాన్ని పెంపొందించేలా చురుకైన కార్యకర్తలు, నేతలను గుర్తించి ప్రోత్సహించాలని నిర్ణయించారు. సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి నాగార్జున మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ ప్రభుత్వంలో దళితులకు జరుగుతున్న మేలు, చేకూరుతున్న ప్రయోజనాలను వివరిస్తూ త్వరలో రాష్ట్రస్థాయి ఎస్సీ సదస్సు నిర్వహిస్తామని ప్రకటించారు. దళితులను మోసగించేందుకు టీడీపీ పన్నుతున్న కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ సూచించారు. చంద్రబాబు హయాంలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎంపీ నందిగం సురేష్ పేర్కొన్నారు. ఎస్సీ విభాగానికి సంబంధించి అన్ని కమిటీలను బలోపేతం చేస్తామని సామాజిక న్యాయ సలహాదారుడు జూపూడి ప్రభాకరరావు తెలిపారు. సీఎం జగన్ అమలు చేస్తున్న కార్యక్రమాలను జగనన్న సందేశం పేరుతో ఇంటింటికీ తీసుకు వెళ్తామని చెప్పారు. -
పవన్.. నిజాలు తెలుసుకో
సాక్షి, అమరావతి: చంద్రబాబు దర్శకత్వంలోనే పవన్ కళ్యాణ్ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్పై సమావేశం నిర్వహించారని పురపాలక, సాంఘిక సంక్షేమ శాఖల మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున మండిపడ్డారు. సబ్ ప్లాన్పై ఈనాడు పత్రిక తప్పుడు రాతలతో ఎక్కాలు అప్పజెబుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సంతృప్త స్థాయిలో.. ఎక్కడా అవినీతికి తావు లేకుండా ఎస్సీ, ఎస్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని పథకాలు అమలు చేస్తున్నారనే విషయాన్ని పవన్ తెలుసుకోవాలన్నారు. పవన్కు లెక్కలు, నిజాలు తెలియకపోతే తాము చెబుతామన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పాలన చూసి ఓర్వలేక రామోజీరావు తప్పుడు రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే ఎస్సీ, ఎస్టీలకు అధిక లబ్ధి చేకూరిందన్నారు. రామోజీ తన స్వగ్రామంలో ఏ వర్గానికి ఎంత లబ్ధి జరిగిందో తెలుసుకోవాలని హితవు పలికారు. ఐదేళ్లలో ఎస్సీలకు టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ.33,635 కోట్లేనన్నారు. అదే తమ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలోనే ఎస్సీల సంక్షేమం కోసం రూ.48,909 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఎస్టీల కోసం కేవలం రూ.12,487 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే, తమ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలోనే రూ.15,589 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఇవాళే పవన్కు ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ గుర్తుకు వచ్చిందా? అని నిలదీశారు. చంద్రబాబు సబ్ప్లాన్ నిధులు దారి మళ్లించినప్పుడు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. దత్తపుత్రుడు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జనాభా ప్రాతిపదికన సబ్ ప్లాన్ను గతంలో ఎలా వినియోగించారో పవన్ తెలుసుకోవాలన్నారు. దళిత ద్రోహి, దళిత వ్యతిరేకి అయిన చంద్రబాబును పవన్ ఎలా సమర్థిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వర్చువల్గా పాల్గొన్నారు. -
‘చంద్రబాబు హయాంలో అరాచకాలను ఎందుకు ప్రశ్నించలేదు’
తాడేపల్లి: సబ్ప్లాన్పై రామోజీరావు వాస్తవాలు తెలుసుకుని రాతలు రాస్తే బాగుంటుంది మంత్రి మేరుగ నాగార్జున చురకలంటించారు. సబ్ప్లాన్ నిధులను బాబు పక్కదారి పట్టించినప్పుడు ఎక్కడున్నావ్ రామోజీ అంటూ మంత్రి మేరుగ నిలదీశారు. ‘సబ్ప్లాన్పై రామోజీ వాస్తవాలు తెలుసుకోవాలి. చంద్రబాబు హయాంలో నీ రాతలు ఏమయ్యాయి?. సబ్ప్లాన్ నిధులను బాబు పక్కదారి పట్టించినప్పుడు ఎక్కడున్నావ్?. చంద్రబాబు హయాంలో అరాచకాలను ఎందుకు ప్రశ్నించలేదు. ప్రభుత్వంపై దత్తపుత్రుడు అవాస్తవాలు మాట్లాడుతున్నాడు.దళిత వ్యతిరేకి చంద్రబాబుకు పవన్ ఎలా మద్దతు తెలిపారు’ అని మేరుగ ప్రశ్నించారు. -
ఏప్రిల్ 14కు అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం పూర్తి
సాక్షి, అమరావతి: విజయవాడ స్వరాజ్ మైదానంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ నిర్మాణ పనులు ఏప్రిల్ 14కు పూర్తయ్యేలా చర్యలు చేపట్టామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. ఈ విగ్రహ నిర్మాణ పనుల్ని గురువారం మంత్రులు నాగార్జున, ఆదిమూలపు సురేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ గత ప్రభుత్వం అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి ఐదేళ్లు కాలయాపన చేసిందని విమర్శించారు. చేతల మనిషిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసి చూపిస్తున్నారన్నారు. దేశచరిత్రలో నిలిచిపోయేలా విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసేందుకు సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. అంబేడ్కర్ విగ్రహానికి సంబంధించిన బూట్లు వచ్చాయని, మిగిలిన భాగాలు దశలవారీగా వస్తాయని ఆయన తెలిపారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు పోలీసులు సూచించిన ప్రాంతాల్లో కాకుండా ఇరుకుసందుల్లోను, ఇబ్బందికరమైన రోడ్లపైన ఇష్టానుసారం సభలు జరపడంతో నిండుప్రాణాలు బలిగొన్న ఘటనలు ఆందోళన కలిగించాయని చెప్పారు. ప్రతిపక్షంలోను ప్రచారయావను ఆపుకోలేక 11 నిండుప్రాణాలు పోవడానికి చంద్రబాబు నిర్వహించిన సభలే కారణమని చెప్పారు. -
మృతుల కుటుంబాలకు అండగా ప్రభుత్వం
గుంటూరు ఈస్ట్: చంద్రన్న కానుక సభలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందినవారి కుటుంబాలకు, గాయపడినవారికి రాష్ట్ర ప్రభుత్వ సహాయాన్ని మంత్రులు, వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు మంగళవారం పంపిణీ చేశారు. మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, విడదల రజిని, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరిధర్, కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి మృతుల ఇళ్లకువెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. గాయపడి జీజీహెచ్లో చికిత్స పొందుతున్న మొత్తం 19 మందికి రూ.50 వేల చొప్పున చెక్కులు అందించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యచికిత్స అందించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా మంత్రులు.. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సభ అనుమతి కోరుతూ చేసిన దరఖాస్తులను మీడియాకు చూపించారు. అందులో ఎక్కడా కానుకలు ఇస్తున్నట్లు లేకపోవడాన్ని ప్రస్తావించారు. టీడీపీ తప్పుడు ప్రచారాలను దుయ్యబట్టారు. మానవ ప్రేరిత దుర్ఘటనే మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఇది దురదృష్టకర ఘటనని, దిగ్భ్రాంతి కలిగించిందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందారని, బాధితులకు సహాయాన్ని పంపారని తెలిపారు. ఇది మానవ ప్రేరిత దుర్ఘటనేనన్నారు. టీడీపీ నేతలు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇది జరిగేది కాదని చెప్పారు. కానుకల పేరిట వేలాదిమంది పేద మహిళలను సభకు తరలించి ముఖ్యమంత్రిని విమర్శించడమే ధ్యేయంగా చంద్రబాబు సభను నడిపారని మండిపడ్డారు. జరిగిన తప్పిదానికి సిగ్గుపడాల్సిందిపోయి వైఎస్సార్సీపీ నాయకులపై ఎదురుదాడికి దిగడం దుర్మార్గమని చెప్పారు. పుష్కరాల్లో, కందుకూరులో, గుంటూరులో సామాన్య ప్రజలు చనిపోవడం క్షమించరాని నేరమని చెప్పారు. కానుకలు పేదల ఇంటికి పంపించి ఉంటే ఈ దుర్ఘటన జరిగేది కాదుకదా అని పేర్కొన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని బహిరంగసభలకు విరామం చెప్పాలని ఆయన సూచించారు. చంద్రబాబుది నీచ ప్రవృత్తి మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ కందుకూరు సభలో ఎనిమిదిమంది చనిపోతే, వారికి కులాలు అంటగట్టి తన వెంట ఉన్నారని చంద్రబాబు ప్రకటించడం అతడి నీచమైన ప్రవృత్తిని తెలియజేస్తోందని విమర్శించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సభకు అనుమతి కోరారేగానీ, అందులో కానుకల విషయం ప్రస్తావించలేదని చెప్పారు. పోలీసులు అప్రమత్తంగా ఉండటం వల్లే ప్రమాద తీవ్రత తగ్గిందని, లేకపోతే పెద్దసంఖ్యలో చనిపోయేవారని పేర్కొన్నారు. చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని కోరారు. చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మరణాలకు కారణమవుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఉనికి కోల్పోయింది మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితులకు ఆర్థికసాయం అందజేశామని చెప్పారు. గాయపడినవారికి ప్రత్యేక వైద్యం అందిస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రచారయావతో ప్రజలను సభకు తరలించేందుకు కానుకల పేరుతో మోసం చేశారని విమర్శించారు. టీడీపీ ఉనికి కోల్పోయిందన్నారు. సభ అయ్యేవరకు కానుకలు ఇవ్వకుండా మహిళలను గంటల తరబడి నిలబెట్టడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సభకు అనుమతి కోరి ఇప్పుడు తప్పంతా ఫౌండేషన్ మీదకు నెట్టడం సిగ్గుచేటని చెప్పారు. జగనన్న పాలనలో మహిళలు పథకాలు అందుకుని సంతోషంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీ వల్లే 40 మంది చనిపోయారని, ఈ మరణాలన్నింటికీ ఆయనే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మేయర్ కావటి శివనాగమనోహర్నాయుడు, డిప్యూటీ మేయర్లు డైమండ్బాబు, షేక్ షజిల, మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్, వైఎస్సార్సీపీ కార్యనిర్వాహకమండలి సభ్యుడు తాడిశెట్టి మురళి, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
‘కందుకూరు, గుంటూరు ఘటనలపై చంద్రబాబే ప్రధాన ముద్దాయి’
గుంటూరు: చంద్రన్న కానుక పేరుతో రెండు రోజుల క్రితం గుంటూరులో చంద్రబాబు నిర్వహించిన షోలో తొక్కిసలాట కారణంగా చనిపోయిన కుటుంబాలను మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజనీ, మేరుగ నాగార్జునలు పరామర్శించారు. కుటుంబాలను పరామర్శించిన మంత్రులు ఆ బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు. అనంతరం మంత్రులు మాట్లాడారు. ‘చంద్రన్న కానుక పేరుతో అమాయకుల్ని బలితీసుకున్నారు. చంద్రబాబు సభలు, ర్యాలీలకు విరామం పాటించాలి’ అని అంబటి పేర్కొన్నారు. చంద్రన్న కానుక పేరుతో అమాయకులు బలైపోయారు. బాధిత కుటుంబాలను పరిమర్శిచి చెక్కులు అందజేశాం. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పి 40 మందిని బలితీసుకున్నారు. చంద్రబాబు సభకు టీడీపీ నేతలే అనుమతి తీసుకున్నారు. గుంటూరు ఘటనను ఎన్ఆర్ఐ సంస్థపై నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు’ అని విడదల రజనీ విమర్శించారు. ‘పేదల కడుపు కొట్టాలని చంద్రబాబు ఆలోచన.చంద్రబాబు పేద బతుకులను చిద్రం చేస్తున్నారు.చంద్రబాబు సభలో చనిపోయిన కుటుంబాలకు పరిహారం అందించాం. చంద్రబాబు సభలో చనిపోయిన కుటుంబాలకు పరిహారం అందించాం. కందుకూరు, గుంటూరు ఘటనలకు సంబంధించి చంద్రబాబే ప్రధాన ముద్దాయి’ అని మేరుగ నాగార్జున మండిపడ్డారు. -
తెలంగాణలో టీడీపీని ఎప్పుడో అమ్మేశారు: మేరుగ
-
చంద్రబాబు ఏరోజూ దళితులను పట్టించుకోలేదు : మేరుగ నాగార్జున
-
వాహనాల అడ్వాన్స్ అక్రమాలపై సీఐడీ విచారణ
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వివిధ రకాల వాహనాలు సరఫరా చేయడానికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి కోట్లాది రూపాయలు అడ్వాన్స్గా తీసుకుని వాహనాలను సరఫరా చేయని డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటుగా సీఐడీ విచారణ చేయించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని ఎస్సీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన 11వ కమిటీ ఆఫ్ పర్సన్స్ (సీఓపీ) సమావేశంలో మంత్రి నాగార్జున పలు అంశాలపై సమీక్షించారు. ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్పై వచ్చి వివిధ జిల్లాల్లో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు(ఈడీ)గా పనిచేస్తున్న వారిలో ఏడాదికాలం సర్వీసును పూర్తి చేసిన వారిని సొంత శాఖలకు వెనక్కు పంపాలని మంత్రి ఆదేశించారు. -
చంద్రబాబు ఎప్పటికీ దళిత ద్రోహే
తిరుపతి ఎడ్యుకేషన్/అలిపిరి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎప్పటికీ దళిత వ్యతిరేకేనని, అది ఎన్నటికీ మారదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. తిరుపతిలోని ఎస్వీయూ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన దళితుల ఆత్మీయ సదస్సుకు ఆయన విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడారు. చంద్రబాబు హయాంలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయని, మహిళా ప్రజాప్రతినిధులపై దాడులు జరిగినా, దళిత మహిళను వివస్త్రను చేసినా చంద్రబాబు నోరు మెదపలేదన్నారు. పైగా దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా... అంటూ దళితులను అవమానించేలా మాట్లాడిన ఘనత చంద్రబాబుదేనన్నారు. దళితులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వారి అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న కృషిని ఓర్వలేక బురదజల్లే కార్యక్రమానికి తెరతీశారంటూ విమర్శించారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా దళితులకు సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక సీఎం జగన్ అపి అన్నారు. సబ్ ప్లాన్ కంటే అధికంగా దళితులకు ఖర్చు చేస్తున్న ఏకైక సీఎం జగన్ అని స్పష్టం చేశారు. రాష్ట్ర అటవీ, భూగర్భ గనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని తూ.చ. తప్పకుండా పాటిస్తూ రాష్ట్రంలో అసమానత్వాన్ని తొలగించి సమానత్వం కోసం కృషి చేస్తున్న నాయకుడు సీఎం జగన్ అని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 98.44శాతం ఎన్నికల హామీలను అమలుచేసిన ఘనత జగన్దేనన్నారు. అంబేడ్కర్ ఆశయాలను ఔపోసనం చేసుకుని వాటిని చక్కగా అమలుచేస్తున్న జగన్కు దళితులందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, మంత్రి ఆర్కే రోజా, ఎంపీలు డాక్టర్ గురుమూర్తి, రెడ్డప్ప, తిరుపతి, సత్యవేడు, గూడూరు, పలమనేరు ఎమ్మేల్యేలు భూమన కరుణాకర్రెడ్డి, ఆదిమూలం, వరప్రసాద్, వెంకటె గౌడ, తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రాంతాల్లో సభపెట్టి మూడు రాజధానులు వద్దని చెప్పగలవా? చంద్రబాబు ఉత్తరాంధ్ర, తిరుపతిలో బహిరంగ సమావేశాలు పెట్టి మూడు రాజధానులు వద్దని మాట్లాడగలడా... అని మంత్రి మేరుగు నాగార్జున సవాల్ విసిరారు. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కుమారుడి స్నేహితులే పవన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని విమర్శించారు. ‘నీ వాళ్ల చేతితోనే నేడు రాళ్లు వేయించుకున్నావు.. భవిష్యత్లో ప్రజలే నీపై రాళ్లు వేస్తారు’ అంటూ చంద్రబాబుపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటం గ్రామంలో అభివృద్ధి పనులు చేయడంతోపాటు రోడ్డు విస్తరణ చేస్తుంటే అవగాహన లేకుండా జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. -
అన్ని పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత: మంత్రి నాగార్జున
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాలకు పెద్దపీట వేశారని సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా వైఎస్ జగన్ పాలన సాగుతోందన్నారు. ఈ మేరకు సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ.. అన్ని పదవుల్లో బీజీలకు ప్రాధానం ఇచ్చారన్నారు. పేద పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చిన ఘనత జగన్దేనన్నారు. నాడు-నేడు కింద స్కూళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. చదువుకునే పిల్లలకు అమ్మ ఒడి, 31 లక్షల మందికి మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అగ్రతాంబూలం ఇచ్చిన ప్రబుత్వం తమదేనని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం బీసీలను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. ఏ రోజైనా చంద్రబాబు పేదల గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు. కనీసం కార్పొరేటర్గా కూడా గెలవని లోకేష్ సీఎ జనగ్ను విమర్శిచడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చదవండి: ‘పాదయాత్ర రద్దుపై విచారణ.. అవసరమైతే పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం’ -
‘దళిత జాతిని అవమానపర్చిన చరిత్ర చంద్రబాబుది’
సాక్షి, విజయవాడ: గత ప్రభుత్వం రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు అవమానం జరిగేలా వ్యవహరిస్తే.. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆయన భారీ విగ్రహ ఏర్పాటుతో గౌరవిస్తోందని ఏపీ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. బుధవారం నగరంలో ఏర్పాటు చేయబోతున్న భారీ విగ్రహ పనులను ఆయన పరిశీలించి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెడతారని మేం ఊహించలేదు. ఇంత ఖరీదైన స్థలంలో విగ్రహ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. దేశంలోనే ఎక్కడా లేనట్లుగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. విగ్రహ తయారీ హర్యానాలో జరుగుతోంది. విగ్రహ ఏర్పాటు కోసం నిర్మాణ వ్యయం పెరిగినా.. ముందుకే వెళ్తున్నాం. సీఎం జగన్ నిర్ణయం నభూతో.. నభవిష్యత్. ఇచ్చిన మాటమీద నిలబడే నాయకుడు సీఎం జగన్. 2023 ఏప్రిల్ 14 నాటికి విగ్రహం ఏర్పాటు చేసి తీరతాం అని ఉద్ఘాటించారు మంత్రి నాగార్జున. గత ప్రభుత్వం అంబేద్కర్ ను అగౌరవ పరిచేలా వ్యవహరించింది. అంబేద్కర్ ఆలోచనలను అవహేళన చేసిన వ్యక్తి చంద్రబాబు. దళిత జాతిని అవమాన పరిచిన చరిత్ర చంద్రబాబుది. అంబేద్కర్ విగ్రహం వద్ద చంద్రబాబు గురించి మాట్లాడటం కూడా అవమానమే అంటూ పేర్కొన్నారు. టీడీపీపై ఫైర్ టీడీపీ నేతలకు ఉత్తరాంధ్ర ఇప్పుడు గుర్తుకొచ్చిందా?. 14 ఏళ్లలో చంద్రబాబుకు ఉత్తరాంధ్ర గుర్తుకు రాలేదా?. గత ఐదేళ్లలో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ఎందుకు గుర్తుకు రాలేదు?. మూడు రాజధానుల పై జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాకే చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ పుట్టుకొచ్చిందా?. చంద్రబాబు, టీడీపీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయ్. రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు యాత్ర చేయిస్తున్నాడు. అమరావతి ప్రాంతంలో రైతుల కోసం కూడా చంద్రబాబు ఆలోచన చేయలేదు అని మంత్రి మేరుగ విమర్శించారు. -
‘అసైన్డ్’ బదలాయింపులో ప్రజలకు మేలు జరగాలి
సాక్షి, అమరావతి: ప్రజలకు మేలు జరిగి, ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా అసైన్డ్ భూముల బదలాయింపునకు మెరుగైన సిఫారసులు చేయాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యేలను కోరారు. అసైన్డ్ భూములపై ఆయన అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం శుక్రవారం మంగళగిరిలోని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సమాజ హితం కోసం చట్టాలను ప్రభుత్వం కాలానుగుణంగా సమీక్షించుకుని, అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆరువిడతల భూ పంపిణీకి తాను నేతృత్వం వహించానని గుర్తుచేశారు. తండ్రి అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పయనిస్తున్నారని కొనియాడారు. ప్రజలకు భూమి మరింత అందుబాటులోకి తీసుకొచ్చి వారి జీవన ప్రమాణాలు పెంచేలా సీఎం అన్నివిధాలా కృషిచేస్తున్నారని తెలిపారు. భూమి వ్యవసాయం, ఇతర రంగాలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. వ్యవసాయ భూమి తమ చేతుల్లో ఉంటే రైతుల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని, అదే ఆత్మవిశ్వాసం అసైన్డ్ భూములున్నవారికి సైతం కలిగించేలా కమిటీ కృషిచేయాలని కోరారు. గతంలో మాదిరిగా గ్రామాల్లో పెత్తందారులు పేదవర్గాల నుంచి భూములు లాక్కునేందుకు వీల్లేదన్నారు. అసైన్మెంట్దారులైన పేదవారికి బహుళ ప్రయోజనాలు చేకూర్చేలా కమిటీ సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. పక్క రాష్ట్రాలతో పోల్చి అసైన్డ్ భూములకు సంబంధించి రైతులు పొందిన ప్రయోజనాలు పరిశీలించాలన్నారు. అవసరమైతే తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని సూచించారు. కమిటీ సభ్యురాలైన హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ పట్టా భూముల మధ్యలో అసైన్డ్ భూములు ఉన్నాయని, వాటిని గుర్తించి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు కోర్టులో కేసులు వేస్తున్నారని తెలిపారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు మేలు జరిగేలా అసైన్డ్ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడడానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీని నియమించడం గొప్ప పరిణామమన్నారు. ఈ సమావేశంలో తొలుత అసైన్డ్ భూములపై చట్టాలు, సవరణలు, కలెక్టర్ల నివేదికలు, గత కమిటీ సిఫార్సులు తదితర అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సీసీఎల్ఏ, స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్ కమిటీకి వివరించారు. అదనపు సీసీఎల్ఏ ఇంతియాజ్, సీసీఎల్ఏ ల్యాండ్స్ జాయింట్ సెక్రటరీ జి.గణేష్కుమార్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
మంత్రులపై దాడి ఘటనకు పవన్ బాధ్యత వహించాలి : హోంమంత్రి తానేటి వనిత
-
మహిళల మానప్రాణాలతో చెలగాటమా?
సాక్షి, అమరావతి: టీడీపీ నేతలు తమకు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం వర్తించదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. వారికి కొమ్ముకాస్తున్న పచ్చ మీడియా వ్యవహారశైలి కూడా అలాగే ఉందన్నారు. చింతకాయల విజయ్ సోషల్ మీడియా అరాచకవాది.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మేరుగు నాగార్జున ఆదివారం మీడియాతో మాట్లా డారు. ‘మహిళల మానప్రాణాలపై ఇష్టం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయటం కరెక్టేనా? ఇంత సిగ్గుమాలిన పనులు చేసే వ్యక్తిని రామోజీరావు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేసినందుకు మా పార్టీ వాళ్లకు కూడా ఒళ్లు మండి అయ్యన్నపాత్రుడి కుటుంబంలోని మహిళలనో, నారా భువనేశ్వరినో, బ్రాహ్మణినో, లేకపోతే రామోజీరావు కోడలినో, మనవరాలినో ఇలాంటి వ్యాఖ్యలే చేస్తే వారికెలా ఉంటుంది? అప్పుడు కూడా... అలాంటి కామెంట్లు చేసిన వారిని ఈనాడు ఇలాగే సమర్థిస్తుందా?’ అని ప్రశ్నించారు. సీఐడీ వారు విజయ్ కోసం వెళితే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ‘ఒక మహిళ మీద అభ్యంతరకర పోస్టులు పెట్టడాన్ని వీరు సమర్థిస్తారా? ఐటీడీపీ అనే దానిలో ఈ విజయ్ దారుణమైన పోస్టులు పెట్టాడు. మహిళల శీలాన్ని అవమానించేలా, ప్రజలు అసహ్యించుకునేలా విజయ్ పోస్టులు ఉంటున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ధన, మానాలను దోచుకున్న వ్యక్తులు ఈ టీడీపీ వాళ్లు. టీడీపీ అధికార వెబ్సైట్ ఐటీడీపీ ద్వారా పోస్టులు పెట్టారు. అందుకే విచారణ కోసం పోలీసులు పిలిచారు. అదేమైనా తప్పా? ఇలాంటి వ్యక్తులను ఎల్లో మీడియా ఎందుకు వెనుకేసుకుని వస్తోంది?. చింతకాయల విజయ్ చేసే ఘోరమైన ఇతర వ్యాపారాలను చంద్రబాబు, లోకేశ్ సమర్థిస్తున్నారు. వీరంతా రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? అని మంత్రి ప్రశ్నించారు. ‘దేశంలో ఎవరూ చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెచ్చిన సీఎం జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారు. చింతకాయల విజయ్ కంటే ఎక్కువగా మేం మాట్లాడతాం. తిడతాం. కానీ మాకు సంస్కారం ఉండబట్టి అలా చేయడం లేదు. టీడీపీ వారికి సిగ్గు అనేది లేదు. చింతకాయల విజయ్ అనే వ్యక్తిపై చట్టం తనపని తాను చేసుకుం టుంది. మహిళలపై సీఐడీ దౌర్జన్యం అంటూ తప్పు డు మాటలు మాట్లాడటం సరికాదు’ అని అన్నారు. మాకు విచక్షణ ఉంది ... చంద్రబాబు భార్య మీద, కోడలి మీద, రామోజీరావు భార్య మీద, కోడలి మీద, మనవరాళ్ల మీద రాధాకృష్ణ కూతురు మీద.. ఇలా వారి ఇళ్లలో ఉన్న మహిళల మీద ఏనాడూ తాము ఇటువంటి విమర్శలకు దిగడం లేదని మంత్రి స్పష్టంచేశారు. ‘మా పార్టీ ప్రజలకు చేసిన మంచిని, మేలును నమ్ముకున్న పార్టీనే తప్ప దిగజారుడు ప్రచారాన్ని నమ్ముకోలేదు. ఇంత నిగ్రహంగా మా నాయకత్వం, మేము ఉన్నా ఎవరో ఒకరు సహనం కోల్పోయి ప్రతిస్పందనగా పోస్టింగ్ పెడితే, నానా యాగీ చేస్తున్నారు. చింతకాయల విజయ్కు నోటీసు ఇస్తే, ఆయన తండ్రి అయ్యన్నపాత్రుడు ఇష్టం వచ్చినట్లు తిట్టారు. మేమూ తిట్టగలం. కానీ మాకు సంస్కారం ఉంది. అయ్యన్నపాత్రుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి. విజయ్ శిక్షార్హుడు’ అని అన్నారు. టీడీపీ నేతలకు నిజంగా సిగ్గు ఉంటే చింతకాయల విజయ్ను సమర్థించకూడదన్నారు. -
మహిళలను కించపరుస్తూ ట్విట్లు చేయడం సబబేనా ..? : మేరుగ నాగార్జున
-
ఐటీడీపీ పేరుతో చింతకాయల విజయ్ చేసే పని అదా?: మేరుగ నాగార్జున
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతలు తమకు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం వర్తించదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. పచ్చమీడియా వ్యవహారశైలి కూడా అలాగే ఉందన్నారు. చింతకాయల విజయ్ సోషల్ మీడియా అరాచకవాది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను పెట్టే పోస్టులు ఎంతో దారుణంగా ఉంటాయన్నారు. వాటిపై సీఐడీ విచారణ చేస్తుంటే అదికూడా తప్పు అనేలాగా ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అసలు ఎల్లోమీడియా జర్నలిజం చేస్తోందా? అంటూ ప్రశ్నించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'పోలీసులు విజయ్ ఇంటికి వెళ్తే వీరంతా గగ్గోలు పెడుతున్నారు. సీఐడీ వారు దొంగని పట్టుకోవటానికి వెళ్తే తప్పా?. ఒక మహిళ మీద అభ్యంతరకర పోస్టులు పెట్టడాన్ని వీరు సమర్ధిస్తారా?. మహిళల మాన, ప్రాణాల గురించి అసభ్యకర పోస్టులు పెట్టాడు. ఐటీడీపీ అనే దాంట్లో ఈ విజయ్ దారుణమైన పోస్టులు పెట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ధన, మానాలను దోచుకున్న వ్యక్తులు ఈ టీడీపీ వాళ్లు. అలాంటి వ్యక్తులను ఎల్లోమీడియా ఎందుకు వెనుకేసుకుని వస్తుంది?. వీరి అఘాయిత్యాలపై ప్రతిఘటనగా మావాళ్లు ఎవరైనా పోస్టులు పెడితే తట్టుకోలేకపోతున్నారు. చింతకాయల విజయ్ చేసే ఘోరమైన ఇతర వ్యాపారాలకు చంద్రబాబు, లోకేష్లు సమర్ధిస్తున్నారు. వీరంతా రాష్ట్రాన్ని ఏం చేయదలచుకున్నారని' మంత్రి ప్రశ్నించారు. 'దేశంలో ఎవరూ చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెచ్చిన జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారు. చింతకాయల విజయ్ కంటే ఎక్కువగా మేము మాట్లాడతాము, తిడతాము. కానీ మాకు సంస్కారం ఉండబట్టి అలా చేయడంలేదు. టీడీపీ వారికి అసలు సిగ్గు అనేది లేదు. చింతకాయల విజయ్ అనే వ్యక్తిపై చట్టం తనపని తాను చేసుకుంటుంది. మహిళలపై సీఐడీ దౌర్జన్యం అంటూ తప్పుడు మాటలు మాట్లాడటం సరికాదు' అని మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. చదవండి: (వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు) -
వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్, జంగా కృష్ణమూర్తి, పోతుల సునీత, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
జోరు తగ్గించవయ్యా.. జోకర్ బాలయ్య ..!: అంబటి రాంబాబు
సాక్షి, విజయవాడ: తమ హయాంలో ఒక్క ప్రభుత్వ ఆస్పత్రి కూడా కట్టలేకపోయిన టీడీపీ నాయకులు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం పేరు మార్చగానే కొందరు గగ్గోలు పెట్టడాన్ని మంత్రులు మేరుగ నాగార్జున, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు ఖండించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన విమర్శలకు మంత్రులు ట్విటర్ వేదికగా స్పందించారు. బాలకృష్ణా... హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఎప్పుడు పెట్టారు? ఆయనను మీరంతా కలిసి చంపేశాకే కదా? చేసిన పాపం పేరు పెడితే పోతుందా బాలకృష్ణా.? — Merugu Nagarjuna (@merugunag) September 24, 2022 బాలకృష్ణా... ఒక్క ప్రభుత్వ ఆస్పత్రి కూడా టీడీపీ హయాంలో కట్టకపోయినా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఎలా పెట్టుకున్నారు.? — Merugu Nagarjuna (@merugunag) September 24, 2022 జోరు తగ్గించవయ్యా.. జోకర్ బాలయ్య ..! — Ambati Rambabu (@AmbatiRambabu) September 24, 2022 Both are not same… ఎన్టీఆర్ మీద బాబు చెప్పులు వేయిస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి పూలు వేయించారు జగన్ pic.twitter.com/zAiGZdvH9G — Gudivada Amarnath (@gudivadaamar) September 24, 2022 -
ఏప్రిల్ 14న విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ
సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడ నడిబొడ్డున ఏప్రిల్ 14వ తేదీన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఏపీ మంత్రి, అంబేడ్కర్ విగ్రహ మంత్రుల కమిటీ చైర్మన్ మేరుగు నాగార్జున చెప్పారు. సీఎం జగన్మోహన్రెడ్డి.. అంబేడ్కర్ ఆలోచన విధానాన్ని భుజాన వేసుకుని నడుస్తున్నారని తెలిపారు. హరియాణలోని మానేసర్లో రూపుదిద్దుకుంటున్న అంబేడ్కర్ విగ్రహ నమూనాను కమిటీ సభ్యులు, మంత్రులు ఆదిమూలపు సురేశ్, కొట్టు సత్యనారాయణ, అధికారులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. విగ్రహ తయారీదారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విగ్రహ తయారీ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న సామాజిక న్యాయానికి ప్రతీకగా అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఈ విగ్రహం రూపొందుతోందని తెలిపారు. అంబేడ్కర్ చెప్పిన సామాజిక న్యాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. దళితులు, బడుగు, బలహీనవర్గాలకు ప్రభుత్వం అండగా ఉందన్నారు. విజయవాడలో రూ.2 వేల కోట్ల విలువైన స్థలంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బలహీనవర్గాల ఆత్మగౌరవానికి ఈ విగ్రహం ప్రతీకగా నిలవనుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో అంబేడ్కర్ విగ్రహానికి రూ.100 కోట్లు కేటాయించి అరకొర పనులు చేశారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.270 కోట్లు కేటాయించడంతోపాటు అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ అంబేడ్కర్కు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అనేక పోలికలున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని తెలిపారు. అంబేడ్కర్ విగ్రహ రూపశిల్పి నరేష్ కుమావత్ మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం తయారు చేసే అవకాశం సీఎం జగన్మోహన్రెడ్డి తమకు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. -
కండకావరంతోనే లోకేశ్ దుర్భాషలు
సాక్షి, అమరావతి: అధికారం పోయిందనే అక్కసుతో అడ్డగోలు విమర్శలు చేస్తున్న చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, టీడీపీ నేతలు వైఎస్సార్ కుటుంబంపై నోరు పారేసుకుంటే నాలుక కోస్తామని మంత్రి మేరుగు నాగార్జున హెచ్చరించారు. గురువారం వెలగపూడిలోని సచివాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కనీసం పంచాయతీ సభ్యుడిగా కూడా గెలవలేని నారా లోకేష్ కండకావరంతో అభ్యంతరకరమైన భాషలో మాట్లాడుతున్నారని మంత్రి నాగార్జున మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదంటూ లోకేష్ పేర్కొనటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. చంద్రబాబు హయాంలో దళితుల వెలి, దళిత మహిళలను వివస్త్రలను చేయడం, దాడులను ప్రజలు మరిచిపోలేదన్నారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? జడ్జీలుగా పని చేసేందుకు బీసీలు పనికిరారు అని దురహంకార వ్యాఖ్యలు చేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. బహిరంగ చర్చకు వస్తే దళిత ద్రోహులెవరో తేల్చుకుందామని లోకేష్కు సవాల్ విసిరారు. ఇటు ఆణిముత్యాలు.. అటు ముద్దపప్పు దళితుల సంక్షేమం కోసం కృషి చేస్తోంది వైఎస్సార్ కుటుంబమేనని మంత్రి నాగార్జున పేర్కొన్నారు. వైఎస్ రాజారెడ్డి ఈ దేశానికి ఆణిముత్యాల్లాంటి గొప్ప నాయకులను అందిస్తే లోకేశ్ లాంటి ముద్దపప్పును నారా కుటుంబం అందించిందని వ్యాఖ్యానించారు. దళితులతో వియ్యం అందుకుని అంబేడ్కర్ భావజాలాన్ని భుజాలపై మోస్తున్న కుటుంబం వైఎస్ రాజశేఖరరెడ్డిదని చెప్పారు. వైఎస్ రాజారెడ్డి, వైఎస్సార్, సీఎం జగన్, విజయమ్మ, షర్మిలమ్మ, భారతమ్మలపై టీడీపీ నేతలు నోటికొచ్చినట్టు వాగితే నాలుకలు తెగ్గోస్తానని హెచ్చరించారు. తండ్రిని అడ్డుపెట్టుకొని మంత్రి పదవి సంపాదించి కోట్లు కొల్లగొట్టిన లోకేష్కు సీఎం జగన్ గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా లేదన్నారు. నాడు సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ అనే దళిత మేధావి చంద్రబాబు నాయుడి కారణంగా ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదన్నారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల స్థలాలిస్తే సామాజిక అసమతుల్యత ఏర్పడుతుందని అడ్డుపడ్డ వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఎస్సీ హాస్టళ్లను మూసివేసిన చరిత్ర కూడా ఆయనదేనన్నారు. అక్కడక్కడా జరిగిన కొన్ని ఘటనలపై సీఎం వైఎస్ జగన్ తక్షణమే స్పందించిన తీరును జాతీయ ఎస్సీ కమిషన్ కూడా ప్రశంసించిందని మంత్రి నాగార్జున గుర్తు చేశారు. -
దళితుల మీద దాడి చేయించిన వ్యక్తి చంద్రబాబు : మేరుగ నాగార్జున
-
ఎస్సీ గురుకులాల్లో సీబీఎస్ఈ బోధన
సాక్షి, అమరావతి: ఎస్సీ సంక్షేమ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఈ ఏడాది నుంచి సీబీఎస్ఈ సిలబస్లో విద్యాబోధన ప్రారంభించినట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. సీబీఎస్ఈ విధానంలో విద్యాబోధన కోసం టీచర్లకు అవసరమైన శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో విద్యాబోధన మెరుగుదల కోసం తీసుకుంటున్న చర్యలపై అధికారులతో మంత్రి నాగార్జున సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎస్సీ గురుకులాల్లో 8వ తరగతి నుంచి సీబీఎస్ఈ సిలబస్ను ప్రారంభించామన్నారు. కొత్త విధానంలో విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు గురుకులానికి చెందిన ఉపాధ్యాయులకు అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ ద్వారా శిక్షణ ఇప్పించినట్టు తెలిపారు. గురుకుల విద్యార్థులకు బోధన మరింత సరళీకృతం చేసేందుకు డిజిటల్ క్లాస్ రూములు, వర్చువల్ క్లాస్ రూముల ద్వారా పాఠాలు చెప్పేందుకు ప్రణాళికను రూపొందించినట్టు తెలిపారు. పరీక్షల విధానంలోనూ మార్పులను తెచ్చామన్నారు. ముఖ్యంగా 9, 10 తరగతులు, ఇంటర్ విద్యార్థులకు ప్రతివారం పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని, ముందుగా రెండు టెస్ట్లు నిర్వహించాకే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ విధంగా వారాంతపు పరీక్షలు కాకుండా ప్రధానమైన ఏడు టెస్టులు, పరీక్షలు పెట్టడం ద్వారా విద్యార్థులు వారు విన్న పాఠాలను పూర్తిగా అవగతం చేసుకుని ఎలాంటి పరీక్షలకైనా సిద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టినట్టు చెప్పారు. విద్యార్థుల్లో పాజిటివ్ దృక్పథం కోసం అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్ సంస్థలు ముందుకొచ్చాయని, వాటితో త్వరలోనే ఒప్పందాలు కూడా చేసుకుంటున్నట్టు చెప్పారు. సమావేశంలో ఎస్సీ గురుకులాల సంస్థ కార్యదర్శి పావనమూర్తి, డిప్యూటీ అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ బీవీ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
Jagananna Videshi Vidya: అర్హులందరికీ విదేశీవిద్యకు ఆర్థికసాయం
సాక్షి, అమరావతి: జగనన్న విదేశీవిద్య పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఆర్థికసాయాన్ని అందిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. జగనన్న విదేశీవిద్య పథకానికి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఆయన సోమవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న విదేశీవిద్య పథకంలో ఏడాదికి ఇంతమందికే ఇవ్వాలన్న పరిమితి లేదని స్పష్టం చేశారు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటుగా అల్పాదాయం కలిగిన అగ్రవర్ణాల వారికి కూడా విదేశీవిద్యను అందుబాటులోకి తెస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఈ పథకానికి జ్ఞానభూమి పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. రూ.8 లక్షలలోపు వార్షికాదాయం కలిగిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ పథకంలో లబ్ధిపొందడానికి అర్హులేనని పేర్కొన్నారు. ఆయా కేటగిరీల దరఖాస్తులను రాష్ట్రస్థాయి అధికారిక కమిటీలు పరిశీలించి వాటిలో అర్హులైన విద్యార్థుల జాబితాను తమ శాఖకు ఇస్తాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లలో శిక్షణపొందే వారికి మెరుగైన శిక్షణ అందేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. స్టడీ సర్కిళ్లకు పూర్వ వైభవం తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ ఇన్చార్జి కార్యదర్శి ఏఎండీ ఇంతియాజ్, డైరెక్టర్ కె.హర్షవర్ధన్, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసులు, డిప్యుటీ సెక్రటరీ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చేందుకు బాబు యత్నం
మధురవాడ (భీమిలి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలతో అద్భుత పాలన అందిస్తుంటే.. అది చూసి ఓర్వలేక 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు రాజకీయ దాడులు, అరాచకాలతో ఏపీని రావణ కాష్టంగా మార్చేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. శనివారం మధురవాడ రిక్షా కాలనీలో బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడారు. తమకు మంచి భోజనం, నాణ్యమైన విద్య అందడంతో పాటు ఉపాధ్యాయులు కూడా చాలా బాగా చూసుకుంటున్నారని విద్యార్థులు చెప్పారు. అయినా మరింత నాణ్యమైన భోజనం అందించేందుకు త్వరలో మెనూ మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి మేరుగ చెప్పారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. మూడేళ్ల పాటు ప్రతి పక్షం అన్నది ఎక్కడుందో తెలీదని.. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు మీ అంతు చూస్తాననడం, ఫ్లెక్సీలు చించడం, ముఖ్యమంత్రిని తిట్టించడం, దాడులు వంటివి చేయిస్తున్నారన్నారు. ‘చంద్రబాబూ.. నీ రథ చక్రాలు ఊడిపోతున్నాయని తెలిసి ఈ విధంగా చేస్తున్నావు. జగన్మోహన్రెడ్డి రథ చక్రాలు కింద నలిగిపోయావు. రాబోయే రోజుల్లో నీకు పుట్టగతులు ఉండవు’ అని హెచ్చరించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్తుంటే ప్రజలు నీరాజనాలు పడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వారికి కూడా ఇంటికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతోందని, వారంతా సంతోషంగా ఉన్నారన్నారు. ఇది చూసి చంద్రబాబుకు వణుకు పుడుతోందన్నారు. -
అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి
సాక్షి, అమరావతి: విజయవాడలో చేపట్టిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో జరుగుతోన్న అంబేడ్కర్ ప్రాజెక్ట్ పనులను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విగ్రహం ఏర్పాటు చేయనున్న వేదిక వద్ద జరుగుతోన్న కాంక్రీట్, కన్వెన్షన్ సెంటర్ పనులను పరిశీలించారు. నిర్ణీత గడువులోగా విగ్రహ నిర్మాణ పనులను పూర్తి చేయడం కోసం రాత్రి పగలు పనిచేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అధికారులు చెప్పిన విధంగానే విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా జరగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న అంబేడ్కర్ జయంతి రోజున విగ్రహాన్ని ఆవిష్కరించాలని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని, పనులు ఆలస్యం కాకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. -
అరాచకాలకు కేరాఫ్ టీడీపీ.. లోకేశ్ గురించి మాట్లాడాలంటే సిగ్గేస్తుంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సామాజిక విప్లవం సృష్టించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన చూసి ఓర్వలేక.. ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా వైఎస్సార్సీపీ వెంటే నడుస్తున్నారన్న దుగ్ధతో.. దుష్ట చతుష్టయం గురివింద గింజల్లా వ్యవహరిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. నాలుగు రోజులుగా వీడియోలంటూ గందరగోళం సృష్టిస్తున్న వారి నిజ స్వరూపం అనంతపురం ఎస్పీ ప్రకటనతో బట్టబయలు అయిందని తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయమే మహిళలపై అరాచకాలు, అఘాయిత్యాలకు కేంద్రంగా మారిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అది ఫేక్ వీడియో అని తేలిపోయిందని, దీంతో ఎంపీ గోరంట్ల మాధవ్ను బద్నాం చేయాలనే టీడీపీ ప్రయత్నం బెడిసి కొట్టిందని చెప్పారు. ఇది మార్ఫింగ్ వీడియో అని తొలి రోజే ఎంపీ మాధవ్ చెప్పారన్నారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. విదేశాల నుంచి కుట్రలు ► ఎల్లో విష నాగులు ప్రపంచమంతా విస్తరించాయి. ఎంపీ మాధవ్ పేరుతో ఆ వీడియో యూకే నుంచి టీడీపీ సోషల్ మీడియా ద్వారా విడుదలైంది. దుష్టచతుష్టయం విదేశాల నుంచి కూడా కుట్రలు చేస్తోంది. బాబు బతుకంతా కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు. ► చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తానన్నారు. ఎస్సీలు, బీసీలు జడ్జీలుగా పనికిరారు అన్నారు. ఎస్టీ, మైనారిటీలకు మంత్రి పదవి ఇచ్చిన పాపాన పోలేదు. చంద్రబాబు చేలో మేస్తే.. ఆయన పుత్ర రత్నం, ఆ పార్టీ నాయకులు గట్టున మేస్తారా? ► అసలు లోకేశ్ గురించి మాట్లాడాలంటేనే సిగ్గేస్తుంది. అతను మహిళల పట్ల ప్రవర్తించే తీరేంటో చూడండి. (లోకేశ్ పలువురు మహిళలలతో అసభ్యంగా ఉన్న ఫొటోలు చూపుతూ..) అశ్లీలతకు, మహిళలను కించ పరచటంలో తెలుగుదేశం పార్టీ పేటెంట్ పొందింది. ఓటుకు కోట్లు, కాల్మనీ సెక్స్ రాకెట్లు.. టీడీపీకి మాత్రమే సొంతమైన వ్యవహారాలు. ఇదే బాబు ఏడేళ్ల క్రితం ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ► సీఎం జగన్ ఈ రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. మహిళా పక్షపాతిగా, దళిత బహుజన బాంధవుడుగా పరిపాలన సాగిస్తున్నారు. సీఎం జగన్ ప్రజాదరణ ఇలానే సాగితే.. తాము అధికారంలోకి రావడం కల్ల అన్న కలవరంతోనే టీడీపీ నేతలు గుడ్డ కాల్చి మా మొహాన వేస్తున్నారు. ► ఈ సంస్కృతి ఇలాగే కొనసాగిస్తే.. తస్మాత్ జాగ్రత్త. విష నాగులు ఎక్కడ దాక్కున్నా బయటకు లాక్కొస్తాం. ఎవర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చంద్రబాబు తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు. -
పేద పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట
ప్రజలకు ఉపయోగపడే పథకాలను అమలు చేయడంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డిల పాలనలు తిరుగులేని తార్కాణం. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకం వైసీపీ పాలనలో వెలువడిన మరో ఆణిముత్యం. చంద్రబాబు నాయుడు హయాంలో అమలు చేసిన విదేశీ విద్యా దీవెన పథకానికి నిర్దుష్టమైన నియ మాలు లేవు. ఏడాదికి 100 మంది ఎస్టీలకు, 300 మంది ఎస్సీలకు, 400 మంది కాపులకు, 500 మంది మైనారిటీలకు, 1,000 మంది బీసీలకు పరిమితం చేశారు. పేదల్లో ఉన్న అగ్ర వర్ణాల వారిని అనర్హులుగా చేశారు. మొత్తం మీద ఏడాదికి 2,300 మందికి మించకుండా విద్యార్థులను ఎంపిక చేశారు. అయితే ఈ కొద్ది మంది ఎంపికలోనూ అనేక అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకున్నాయి. పరిమితికి మించిన ఆదాయం కలిగిన కుటుంబాల పిల్లలకు కూడా ఈ పథకం వర్తింప చేశారు. అలాగే ఎంపికైన విద్యార్థులలో కొంత మంది అనుమతి లేకుండానే చదివే యూనివర్సిటీలు, దేశాలూ మార్చుకున్నారు. కొంత మంది అయితే అసలు కోర్సు పూర్తి చేయకుండానే ఆర్థిక సహాయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే విదేశీ విద్యా పథకంలో ఉన్న లోపాలన్నింటినీ సరిదిద్ది, అక్రమాలకు తావు లేకుండా పూర్తిగా పారదర్శక విధానంలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా ముఖ్యమంత్రి జగన్ ‘జగనన్న విదేశీ విద్య’ పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకంలో ముందుగా యూనివర్సిటీల నాణ్యతా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రపంచ స్థాయిలో ఇచ్చే క్యూఎస్ (క్వాక్వరెల్లి సిమండ్స్) ర్యాంకింగ్లో 1 నుంచి 200 లోపు ర్యాంకులు కలిగిన యూనివర్సిటీల్లో చదవడం వల్ల విద్యా ర్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 1 నుంచి 100 దాకా క్యూఎస్ ర్యాంకులు కలిగిన యూనివర్సిటీల్లో చదవడానికి సీట్లు సంపాదించిన విద్యార్థులకు పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలనీ, అదే విధంగా 101 నుంచి 200 దాకా క్యూఎస్ ర్యాంకింగ్ కలిగిన యూని వర్సిటీలకు ఎంపికైన విద్యార్థులకు రూ. 50 లక్షల వరకూ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలనీ నిర్ణయించారు. బాబు హయాంలో అమలు చేసిన విదేశీ విద్యా పథకంలో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు రూ. 15 లక్షలు, కాపులు, బీసీలకు రూ.10 లక్షలు మాత్రమే ఆర్థిక సహాయం చేసే వారు. దీన్ని బట్టి చంద్రబాబు ప్రభుత్వంలో అమలు చేసిన విదేశీ విద్యా పథకం కంటే జగనన్న విదేశీ విద్యా పథకంలో విద్యా ర్థులకు అందించే ఆర్థిక సాయాన్ని ఎంత ఎక్కువగా పెంచారో గమనించవచ్చు. అంతే కాదు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమలు చేసిన విదేశీ విద్యా పథకంలో ఏడాదికి 2,300 మందిని మాత్రమే ఎంపిక చేయాలన్న పరిమితి ఉండేది. కానీ జగనన్న విదేశీ విద్యా పథకంలో అలాంటి పరిమితి ఏదీ లేదు. క్యూఎస్ 200 లోపు ర్యాంకులు కలిగిన యూనివర్సిటీలకు ఎంతమంది విద్యార్థులు ఎంపికైతే అంత మందికీ కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇది కాకుండా గతంలో కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికే పరిమితమైన ఈ పథకాన్ని అగ్రకులాల్లో పరిమిత ఆదాయం కలిగిన వారికి కూడా వర్తింపజేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీనికితోడుగా గతంలో ఉన్న ఆర్థిక పరిమితి రూ. 6 లక్షలను రూ. 8 లక్షలకు కూడా పెంచారు. ఈ విధంగా పేద పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అపరిమితమైన ప్రయోజనాలతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసు కొచ్చింది. ప్రతి యేటా సెప్టెంబర్ – డిసెంబర్, జనవరి–మే మాసాల్లో అర్హుల గుర్తింపు కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేయడం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే విదేశీ విద్యా పథకాన్ని నిలిపివేశారని చంద్రబాబు నాయుడు విమర్శించడం దారుణం. ఆయనకు ప్రజా ప్రయో జనాల కంటే రాజకీయాలే ప్రధానమని ఈ పథకాన్ని విమర్శించడం బట్టి అర్థమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంత మంచి పథకాన్ని తీసుకురావడంతో సరిపెట్టకుండా టాప్ 200 యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించడంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారి పిల్లలు ఇబ్బంది పడకుండా వారికి ప్రత్యేకమైన శిక్షణను ఇప్పించాలని కూడా యోచిస్తుండటం ఆయన విశాల ధృక్పథానికి నిదర్శనం. (క్లిక్: అనవసర ఉద్యమాలు ఎందుకు?) - డాక్టర్ మేరుగు నాగార్జున ఏపీ సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు -
తప్పు చేసిన బాబు కుప్పి గంతులా!
సాక్షి, అమరావతి: విదేశీ విద్యా దీవెన పథకం అమలులో అనేక తప్పులకు ఆస్కారమిచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ పథకం ఆగిపోయిందంటూ కుప్పి గంతులు వేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. ఆయన గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 2016–17 నుంచి ఎంపికైన 3,326 మంది విద్యార్థులకు రూ.318 కోట్ల బకాయిలను టీడీపీ ప్రభుత్వం చెల్లించలేదని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఈ విదేశీ విద్యా పథకం అమల్లో అనేక అక్రమాలు జరిగినట్టు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలిందని చెప్పారు. కొందరు విద్యార్థులు డబ్బులు పొంది కోర్సు పూర్తి చేయకుండానే రాష్ట్రానికి తిరిగి వచ్చేశారన్నారు. ఇదే కాకుండా లబ్ధిదారుల ఎంపికలో ఆదాయ పరిమితి పాటించకపోవడం, ఇంట్లో ఒకరికి మించి లబ్ధి కలిగించడం, ఒక చోట సీటు అని చెప్పి మరొక చోట చేరడం, ఎక్కడ చదువుతున్నారో కనీసం చిరునామా కూడా తెలియకపోవడం, అధీకృత సంస్థకు సమాచారం ఇవ్వకపోవడం వంటి అనేక అక్రమాలు జరిగినట్టు గుర్తించారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇటువంటి అక్రమాలకు తావులేకుండా అర్హతే ప్రామాణికంగా ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేస్తోందని మంత్రి చెప్పారు. రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పథకాన్ని నూతన మార్గదర్శకాలతో రూపొందించినట్లు చెప్పారు. క్యూఎస్ ర్యాంకింగ్ పొందిన 200 ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన నిరుపేద విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన వారికి పూర్తిగా, 100 నుంచి 200 ర్యాంకింగ్లో ఉన్న విద్యాలయాల్లో సీట్లు పొందిన విద్యార్థులకు రూ.50 లక్షల వరకు ఫీజు రీయింబర్స్మెంట్ చేయనున్నట్లు తెలిపారు. సంతృప్త స్థాయిలో అర్హులు అందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. -
ఎస్సీ మహిళలకు బస్ డ్రైవింగ్లో శిక్షణ
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ద్వారా ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వనున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. ఎస్సీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలపై వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శిక్షణ అనంతరం వారికి ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో డ్రైవర్లుగా అవకాశం కల్పిస్తామన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల సౌజన్యంతో నర్సింగ్ కోర్సుల్లో కూడా శిక్షణ ఇస్తామని చెప్పారు. భారీ వాహనాల కొనుగోలు కోసం ఇచ్చే రుణ మొత్తాన్ని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎన్ఎస్కేఎఫ్డీసీ పథకం కింద విదేశాల్లో పీజీ చేసేవారికి రూ.20 లక్షలు, స్వదేశంలో పీజీ చేసే వారికి రూ.15 లక్షల వరకు రుణాలు అందిస్తామన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, డైరెక్టర్ కె.హర్షవర్ధన్, గురుకులాల కార్యదర్శి పావనమూర్తి, లిడ్క్యాప్ సీఎండీ డోలా శంకర్, ఎస్సీ కార్పొరేషన్ జీఎం కరుణకుమారి పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై అవగాహన అంతకుముందు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై మంత్రి మేరుగ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. దళితులు, గిరిజనులను వేధించకూడదని అగ్రవర్ణాల వారికి, తప్పుడు కేసులు పెట్టకూడదని ఎస్సీ, ఎస్టీలకు అవగాహన కల్పించాలన్నారు. తహశీల్దార్లు, ఎస్సైలు వారానికి ఓసారి గ్రామాల్లోకి వెళ్లి ప్రజల్ని చైతన్య పరచాలన్నారు. ఈ చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో అతి తక్కువ శాతం నిందితులకు మాత్రమే శిక్షలు పడుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త జిల్లాలు ఏర్పడినందున అన్ని జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కేసులను విచారించే డీఎస్పీలను నియమించాలన్నారు. ఈ సమావేశంలో సీఐడీ పీసీఆర్ ఎస్పీ రత్న, జేడీ ప్రాసిక్యూషన్ అజయ్కుమార్ పాల్గొన్నారు. -
అంబేడ్కర్ జయంతిలోపే విగ్రహం పూర్తి
సాక్షి, అమరావతి: అంబేడ్కర్ జయంతికి ముందే 125 అడుగుల విగ్రహ నిర్మాణ పనులను పూర్తిచేయాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున అధికారుల్ని ఆదేశించారు. నిర్ణీత సమయానికి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రులు, అధికారులతో కూడిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు కమిటీ మంగళవారం తాడేపల్లిలోని ఎస్సీ గురుకులం ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది. మంత్రి మేరుగ నాగార్జునతో పాటు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరవగా పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ వచ్చే ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి నాటికి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని చెప్పారు. విగ్రహ నిర్మాణానికి అడ్డుగా ఉన్న భవనాల తొలగింపు పనులను ఏపీఐఐసీ అధికారులు వేగంగా పూర్తిచేయాలన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ 12.5 అడుగులు, 25 అడుగుల అంబేడ్కర్ నమూనా విగ్రహాల్లో కమిటీ సూచించిన మార్పులను చేయాలని చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విగ్రహం ఏర్పాటులో సమస్యలుంటే కమిటీ దృష్టికి తీసుకురావాలని, వాటిని సీఎం సహకారంతో పరిష్కరిస్తామని చెప్పారు. మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ అంబేడ్కర్ ముఖాకృతి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విగ్రహం ముఖాకృతిని 125 అడుగుల విగ్రహానికి తగిన సైజులో మట్టితో నమూనా రూపొందిస్తామని శిల్పి నరేష్కుమార్ చెప్పారు. అనంతరం కమిటీ అనుమతితో కాంస్య విగ్రహ తయారీని ప్రారంభిస్తామన్నారు. నమూనా విగ్రహాన్ని పరిశీలించేందుకు మంత్రుల బృందం ఢిల్లీలోని తమ స్టూడియోకు రావాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు వర్చువల్గా హాజరైన ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్, డైరెక్టర్ హర్షవర్ధన్, ఏపీఐఐసీ, కేపీసీలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.నికి అడ్డుగా ఉన్న భవనాల తొలగింపు పనులు త్వరగా పూర్తి చేయండి -
ఆనందబాబు బతుకేంటో అందరికీ తెలుసు: మంత్రి మేరుగ నాగార్జున
సాక్షి, గుంటూరు: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇసుక, మట్టి అడ్డగోలుగా దోచేశాడంటూ సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఈ మేరకు ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. 'నక్కా ఆనందబాబు బతుకేంటో అందరికీ తెలుసు. నియోజకవర్గంలో జగన్ అన్న కాలనీల్లో ఇళ్లకు అన్ని అనుమతులతో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. మట్టి తవ్వకాలకు పంచాయతీ తీర్మానాలు, కలెక్టర్ అనుమతులు ఉన్నాయి. నక్కా ఆనందబాబు అక్రమ మట్టి తవ్వకాలు అంటూ హడావిడి చేయడానికి ప్రయత్నించారు. ఆనందబాబుకు ప్రజలే బుద్ధి చెప్పారు. నియోజకవర్గంలో ఏ ఊరు వెళ్లిన ఇలాంటి పరిస్థితి ఉంటుందని' మంత్రి మేరుగ నాగార్జున హెచ్చరించారు. చదవండి: (నా శవాన్ని ముందుబెట్టి.. చంద్రబాబు ఓట్లు అడుక్కుంటాడేమో!) -
AP: రాష్ట్రంలో సామాజిక విప్లవం
అనంతపురం సప్తగిరి సర్కిల్: రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సామాజిక విప్లవంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయంగా పదవులను కట్టబెట్టి సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. గత మూడేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న సామాజిక న్యాయాన్ని తెలియజేసేందుకు బస్సు యాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. యాత్ర విజయవంతానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రి ఉషశ్రీచరణ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు,ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డితో కలిసి ప్రజాప్రతినిధులతో మంగళవారం ఆయన స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల హక్కులను హరించి అణగారిన వర్గాలుగా చూసిన చరిత్ర గత పాలకులదైతే, అన్నింటా పెద్దపీట వేసి వారి ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు దోహదపడిన వ్యక్తి జగనన్న అని కొనియాడారు. విద్యతోనే అభ్యున్నతి సాధ్యమని నమ్మి ఫీజు రీయింబర్స్మెంట్ అందించి సమాజంలో ఉన్నతంగా జీవించేలా ఉద్యోగావకాశాలు కల్పించారన్నారు. సీఎం జగన్ తీసుకొచ్చిన సామాజిక విప్లవం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. మంత్రివర్గంలో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. ఈ నెల 26 నుంచి 29 వరకూ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు సాగే సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాల రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి నాగార్జున విమర్శించారు. బీసీలను అన్నింటా వంచించిన చంద్రబాబును కొన్ని మీడియా సంస్థలు, పెయిడ్ ఆర్టిస్టులు అట్టిపెట్టుకుని అభూతకల్పనలు సృష్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ నేతలు ఎన్ని అరాచకాలు చేపట్టినా కళ్లులేని కబోధిలాగా ఉన్న చంద్రబాబు.. నేడు చిన్న ఘటనను కూడా పెద్దదిగా చూపించాలనుకోవడం ఆయన రెండునాల్కల ధోరణికి నిదర్శనమన్నారు. ఎస్సీ కులంలో ఎవరైనా పుడతారా అని హేళన చేసిన విషయాన్ని ఇంకా ఎవరూ మరువలేదన్నారు. కరోనా విజృంభించిన సమయంలో హైదరాబాద్ పారిపోయిన ఆయనను చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. ఓ ఎస్సీ అమ్మాయి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్తుంటే లోకేష్ వస్తున్నాడంటూ ఆపి శవాల మీద పేలాలు ఏరుకున్నారని, వారిని నమ్మొద్దని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయ భేరి యాత్ర చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమమని, ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ముందుండి నడిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ముస్లింల దోస్త్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని అభివర్ణించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకున్నాయని, అయితే ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. పప్పు నాయుడు, తుప్పునాయుడుల పార్టీకి 2024లో పాడె కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బీసీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించి సమాజంలో గుర్తింపునిచ్చిందని తెలిపారు. 57 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం విప్లవాత్మకమని పేర్కొన్నారు. రాష్ట్ర వక్ఫ్బోర్డు అధ్యక్షుడు ఖాదర్బాషా మాట్లాడుతూ మైనార్టీలకు మేయర్లుగా, చైర్మన్లుగా, డైరెక్టర్లుగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో శాసనమండలి విప్ వెన్నపూస గోపాల్రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ మొహమ్మద్ వసీం సలీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయ భాస్కర్రెడ్డి, వాసంతి సాహిత్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహమ్మద్, రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి, రాష్ట్ర నాటక అకాడమీ చైర్పర్సన్ హరిత, పార్టీ నాయకులు కాగజ్ఘర్ రిజ్వాన్, రమేష్గౌడ్, కృష్ణవేణి, రాధాయాదవ్, కుళ్లాయిస్వామి, శ్రీనివాసులు, అనిల్కుమార్ గౌడ్, కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బీసీలంటే బెస్ట్ క్లాస్ అని నిరూపించారు.. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్బోన్ ఆఫ్ ది సొసైటీ, బెస్ట్ క్లాస్ ఆఫ్ ది సొసైటీ అని సీఎం వైఎస్ జగన్ నిరూపించారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్ తెలిపారు. ఎంతో ఉన్నత లక్ష్యంతో బడుగు, బలహీన వర్గాల వారికి పదవులను కట్టబెట్టిన ఘనత ముఖ్యమంత్రిదేనని కొనియాడారు. గత ప్రభుత్వంలో మైనార్టీ శాఖ మంత్రిగా పల్లె రఘునాథ రెడ్డిని నియమించారని, ముస్లిం వర్గానికి చెందిన ఒక్కరికి కూడా మంత్రి పదవి కేటాయించలేదని దుయ్యబట్టారు. సమష్టిగా సాగి సామాజిక న్యాయ భేరి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. -
YSRCP Bus Yatra: జయహో జగనిజం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నీ అబద్ధాలు చెబుతూ పర్యటిస్తున్నారని.. వైఎస్సార్ సీపీ మాత్రం నిజాలు చెప్పేందుకే బస్సుయాత్రకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. బహుజనులకు చేకూరిన ప్రయోజనాన్ని ప్రజలందరికీ చాటిచెప్పేందుకు సామాజిక న్యాయభేరి–జయహో జగనన్న నినాదంతో ఈ నెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టామని, దీనిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి కార్యాలయంలో గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్నాయుడు అధ్యక్షతన సోమవారం రాత్రి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బస్సుయాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ముఖ్యఅతిథి మేరుగ నాగార్జున మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడేళ్లలోనే సామాజిక విప్లవం సృష్టించారని, ఇది దేశ చరిత్రలోనే సువర్ణాధ్యాయమని అభివర్ణించారు. బాబూజగ్జీవన్రాం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, పెరియార్ రామస్వామి, జ్యోతీరావుపూలే, అబుల్ కలాం ఆజాద్, కొమరం భీమ్ వంటి మహామహుల ఆలోచనలను సీఎం ఆచరించి చూపుతున్నారని కొనియాడారు. దీనిని సహించలేక ప్రతిపక్షం ప్రభుత్వంపై బురద జల్లేందుకు యత్నిస్తోందని మేరుగ మండిపడ్డారు. ప్రతిపక్షం కుట్రలను తిప్పికొట్టే ప్రయత్నంలో కార్యకర్తలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించి సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతోందన్నారు. బస్సు యాత్రలో భాగంగా 26న విజయనగరం, 27న రాజమండ్రి, 28న నరసరావుపేట, 29న అనంతపురంలో బహిరంగ సభలు జరుగుతాయని వివరించారు. వక్ఫ్ బోర్డు చైర్మన్, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్బాషా, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, మేయర్ కావటి మనోహర్నాయుడు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరి మాట్లాడుతూ సీఎం జగన్ ఒక అభినవ పూలే, ఒక అభినవ అంబేడ్కర్ అని కొనియాడారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీల, పలు కార్పొరేషన్ల చైర్మన్లు చిల్లపల్లి మోహనరావు, షేక్ ఆసిఫ్, కాకుమాను రాజశేఖర్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టి ఈ నెల 30వ తేదీకి సరిగ్గా మూడేళ్ళు నిండుతుందని, ఈ మూడేళ్లలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి ఆయన చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన 17మంది మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ బస్సుయాత్ర ద్వారా సామాజిక భేరీ మోగిస్తున్నట్లు తెలిపారు. 26న శ్రీకాకుళంలో మొదలయ్యే ఈ బస్సుయాత్ర 28వ తేదీ మధ్యాహ్నానికి గుంటూరు జిల్లాలో ప్రవేశిస్తుందని వివరించారు. -
ఎస్సీ విద్యార్థులకు జేఈఈ, నీట్లలో ఉచిత శిక్షణ
సాక్షి, అమరావతి: ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని విద్యార్థులు తమ తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పిలుపునిచ్చారు. విద్యార్థులు విజయాలు సాధించడానికి అవసరమైన ప్రతి సౌకర్యాన్ని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల ఆధ్వర్యంలో ఎస్సీ విద్యార్థులకు ఐఐటీ జేఈఈ, నీట్కు షార్ట్ టర్మ్ కోచింగ్ను వర్చువల్ విధానం ద్వారా సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. గతంలో మూడు కేంద్రాల్లోనే శిక్షణ ఇవ్వగా.. ఈ ఏడాది నుంచి 8 కేంద్రాల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు వెల్లడించారు. బాలికలకు మధురవాడ (విశాఖ), ఈడ్పుగల్లు (పెనమలూరు), సింగరాయకొండ (ప్రకాశం), చిన్నచౌక్ (కడప)లలో ఉచిత శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే బాలురకు కొత్తూరు (అనపర్తి), చిల్లకూరు (నెల్లూరు), అడవి తక్కెళ్లపాడు (గుంటూరు), చిన్నటేకూరు (కర్నూలు)ల్లో ఇస్తున్నామని తెలిపారు. వీటిలో ఎస్సీ విద్యార్థులకు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో శిక్షణ ఉంటుందన్నారు. అంబేడ్కర్ గురుకులాల ఆధ్వర్యంలో ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ ఒకటి చొప్పున పోటీ పరీక్షల కేంద్రాలను ప్రారంభించడానికి కూడా కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి ఆయా కేంద్రాల్లోని కొందరు విద్యార్థులతో వర్చువల్గా మాట్లాడారు. తమకు ఈ అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి పావనమూర్తి పాల్గొన్నారు. -
అంబేడ్కర్ ఆశయాలకనుగుణంగా పాలన
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పాలన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆశయాలనుగుణంగా ఉందని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. దళితులంతా బానిసలు కాదు.. అంబేడ్కర్ వారసులని ఈ మూడేళ్ల పాలనలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపించారన్నారు. ఈ నెల 26న శ్రీకాకుళంతో ప్రారంభమయ్యే ‘సామాజిక న్యాయభేరి’ బస్సుయాత్ర నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి సాగుతుందని, 29న అనంతపురంలో ముగుస్తుందని చెప్పారు. విశాఖపట్నంలోని పార్టీ నగర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ పాలన అందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రానున్న ఎన్నికల్లో అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. సీఎంకు మద్దతుగా, ఈ ప్రభుత్వానికి అండగా చేపడుతున్న ఈ సామాజిక బస్సుయాత్రను జైత్రయాత్రగా సాగేలా అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజన్నదొర మాట్లాడుతూ వైఎస్సార్సీపీ మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలను చూసి యావత్ దేశం ప్రశంసలు కురిపించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాముఖ్యతను దావోస్ పర్యటనలో సీఎం వివరించనున్నారని తెలిపారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ రెండురోజుల కిందట ఒక దళితుడు హత్యకు గురైతే దావోస్ పర్యటనలో ఉన్న సీఎం జగన్మోహన్రెడ్డి నేరుగా డీజీపీకి ఫోన్చేసి ఈహత్యలో నిందితులను శిక్షించాలని ఆదేశించారని గుర్తుచేశారు. ఇది దళితులపై తమ నాయకుడికి ఉన్న ప్రేమ, అభిమానం, ఆప్యాయతలని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అండతో గద్దెనెక్కిన చంద్రబాబు వారికి పూర్తిగా అన్యాయం చేశాడన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్ర భవిష్యత్తు, భావితరాలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పాలన అందిస్తున్నారని చెప్పారు. బ్యాక్బోన్ క్లాస్ అని నిరూపించిన సీఎం ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్బోన్ క్లాస్ అని నిరూపించారని పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతికి, వారి జీవనవిధానాలకనుగుణంగా, సామాజికంగా, రాజకీయంగా అధిక ప్రాధాన్యత కల్పించారని చెప్పారు. వక్ఫ్బోర్డు చైర్మన్ ఖాదర్బాషా మాట్లాడుతూ చట్టసభల సభ్యులుగా, మంత్రులుగా పలువురు ముస్లింలకు వకాశం కల్పించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వంశీకృష్ణశ్రీనివాస్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు జాన్వెస్లీ, కోలా గురువులు, బొడ్డేడ ప్రసాద్, పి.సుజాత, నెడ్క్యాప్ చైర్మన్ రాజు, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎవరైనా చనిపోతే గ్రద్దల్లా అక్కడకు వెళ్లి నిలబడేతత్వం ప్రదర్శిస్తున్నారు:మంత్రి మేరుగ
-
దళితులపై దాడి చేస్తే ఎంతటి వారినైనా శిక్షిస్తాం: మంత్రి మేరుగ
సాక్షి, శ్రీకాకుళం: సుబ్రహ్మణ్యం మరణం విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ఈ క్రమంలో మంత్రి మేరుగ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఘటన జరిగిన వెంటనే , ప్రక్కదారి పట్టకుండా, చట్టం క్రింద అంతా సమానులే అంటూ భాద్యులు ఎవరైనా శిక్షపడాల్సిందేనన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దన్యవాదాలు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని. వారికి మనోదైర్యం కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. సుబ్రహ్మణ్యం దళితులు.. అతని మృతి విషయంలో ఎమ్మెల్సీపై అనుమానం వ్యక్తం చేస్తే కేసు నమోదు చేసాం. అది మా పార్టీలో ఉన్న నైతికత. చంద్రబాబు నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. దళిత సంక్షేమాన్ని కోరే నాయకుడు సీఎం జగన్. దళితులకు సీఎం జగన్ ఒక పెట్టని కోట. సుబ్రహ్మణ్యానిది కచ్చితంగా హాత్యే, ఆయన మృతిపై మేము చాలా భాదపడుతున్నాం. వందకు 100శాతం సుబ్రహ్మణ్యం కుటుంబానికి అండగా ఉంటాం. చిత్తశుద్దితో కేసుని విచారణ చేస్తున్నాం. దళితులు మీద దాడిచేస్తే ఎలాంటి వాడైనా శిక్షించి తీరుతాం. అనంత బాబుని కేసులో ముద్దాయిగా చేశాం. తప్పు చేస్తే కచ్చితంగా శిక్షపడుతుంది. ఎవరైనా చనిపోతే గ్రద్దల్లా అక్కడకు వెళ్లి నిలబడేతత్వం ప్రదర్శిస్తున్నారు. శవాలు తీసుకెళ్తే లోకేష్ వస్తారని చెబుతున్నారు. దళితులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయవద్దు. చంద్రబాబు ఆరోపణలను చూస్తూ ఊరుకోవడానికి సిద్దంగా లేం. 120 అడుగుల అంబేడ్కర్ విగ్రహాం పెట్టిన చరిత్ర, అంబేడ్కర్ పేరు జిల్లాకు పెట్టిన చరిత్ర, దళితులతో వియ్యం అందిన కుటుంబం మా ముఖ్యమంత్రి జగన్ది. దళిత కులంలో ఎవరూ పుట్టకూడదని చెప్పిన నీచుడు చంద్రబాబు. టీడీపీ నేతలు దళితులను అడ్డం పెట్టుకుని కపట నాటకాలు ఆడాలని చూస్తున్నారు. దళితులపై దాడులు చేస్తే ఊరుకోము’’ అంటూ హెచ్చరించారు. ఇది కూడా చదవండి: పోలవరాన్ని సందర్శించిన మంత్రి అంబటి రాంబాబు -
ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండాలి
ఒంగోలు అర్బన్: జిల్లాల పునర్విభజన తర్వాత పెద్ద జిల్లాగా ఏర్పడిన ప్రకాశం జిల్లా అభివృద్ధికి అధికార యంత్రాంగం సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర సంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. స్పందన భవనంలో ఇన్చార్జ్ మంత్రి అధ్యక్షతన శుక్రవారం డీఆర్సీ (జిల్లా సమీక్ష సమావేశం) నిర్వహించారు. దీనిలో ఇన్చార్జ్ మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా నీటి సరఫరా సక్రమంగా చేయాలన్నారు. గృహాల నిర్మాణాలతో పాటు ప్రజలకు ఇసుక కొరత లేకుండా నిరంతరం అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణాలకు స్థానికంగా ఎడ్ల బండ్లు, టైర్ బండ్లపై ఇసుక తీసుకెళ్లే వారిపై సెబ్ అధికారులు చర్యలు తీసుకోవడం మంచిది కాదన్నారు. అటువంటి చర్యలపై అందరు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక అవసరాల కోసం జీవో ప్రకారం ఇసుకను తీసుకెళ్తే అడ్డుకోవడం వలన ప్రజలకు ఇబ్బందులు రావడంతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. పంచాయతీ అధికారులు ఇసుక రవాణాను పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో నాలుగు ఇసుక డిపోలే అందుబాటులో ఉంచడంపై జేపీ వెంచర్స్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి ఒక ఇసుక డిపో ఉండాలన్నారు. ఇసుక సరఫరాలో విఫలమైతే ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని హెచ్చరించారు. తాను ఇన్చార్జ్ మంత్రిగా ప్రకాశం జిల్లాకు ఉండటం సంతోషంగా ఉందని తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములు, శ్మశాన భూములు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే ఒంగోలు శివారు ప్రాంతం అయిన పేర్నమిట్టలో ఆంధ్రకేసరి యూనివర్శిటీ స్థలం కూడా ఆక్రమణలకు గురవుతున్నట్లు సమావేశంలో తెలిపారు. యూనివర్శిటీ భూములను పరిరక్షించాలని ఇన్చార్జ్ మంత్రి కలెక్టర్కు తెలిపారు. చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురి కాకుండా సరిహద్దుల్లో కందకాలు తవ్వాలని సూచించారు. కమ్యూనిటీ, ఏరియా ఆస్పత్రులతో పాటు జిల్లా ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా పర్యవేక్షణ ఉండాలన్నారు. సదరమ్ సర్టిఫికెట్ల జారీలో అక్రమాలు జరిగాయనే ఫిర్యాదులపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యల రాకుండా పైప్లైన్ లేని ప్రాంతాల్లో ప్రజల అవసరాల మేరకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలన్నారు. నీటి సరఫరాలో మూగ జీవాలను పరిగణలోకి తీసుకుని నీటిని అందించాలని అధికారులకు సూచించారు. ఆర్డబ్ల్యూఎస్, పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పశ్చిమ ప్రాంతంలోని ఎమ్మెల్యేలు తాగునీటి సమస్యను ప్రధానంగా ప్రస్తావించారని, సమస్యను అధిగమించేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో పరిష్కరించాలన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టు బాధితుల సర్వే ప్రక్రియ త్వరగా పూర్తి చేసి నిర్వాసితులకు నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. కనిగిరిలో ఈ సంవత్సరంలో ట్రిపుల్ ఐటీ క్లాసు ప్రారంభించేందుకు తాత్కాలిక ప్రాతిపదికన అవసరమైన వసతులు కల్పించాలని ఆ మేరకు అధికారులు దృష్టి సారించాలని అన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ ట్యాంకర్లతో నీటి సరఫరా చేసినందుకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన చెల్లించాలని కోరారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వాగులు, వంకల నుంచి సారవంతమైన మట్టిని పొలాలకు చేరవేసుకునేందుకు రైతులకు అనుమతి ఇవ్వాలని కోరారు. సదరమ్ సర్టిఫికెట్ల జారీలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలన్నారు. వెలిగొండ మొదటి దశ కింద ఎత్తిపోతల పథకం పనులు త్వరగా చేపట్టేందుకు టెండర్లు నిర్వహించాలన్నారు. కాకర్ల ముంపు ప్రాంత వాసులకు వెంటనే పరిహారం అందచేయాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉన్న నాటు సారాను అరికట్టాలన్నారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ ఓటీఎస్ కింద నగదు చెల్లించిన పేదలకు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయిందని, వెంటనే ప్రక్రియను ప్రారంభించి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. దొనకొండ, కురిచేడు మండలాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. దర్శి నగర పంచాయతీలో జల జీవన్ మిషన్ కింద మంజూరైన రూ.6.50 కోట్ల నిధులు వెనక్కి వెళ్లకుండా పనులు చేపట్టాలని కోరారు. పింఛన్ పంపిణీలో సాంకేతిక సమస్యలు పరిష్కరించాలన్నారు. పంచాయతీల్లో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు త్వరగా ప్రారంభించి జిల్లాలో సాగు, తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలన్నారు. ఇసుక సరఫరాలో సెబ్ అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్నారు. సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు సంబంధిత అధికారులు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ డీఆర్సీ సమావేశాల్లో చర్చించిన అంశాలను అధికార యంత్రాంగం దృష్టి సారించి ఫలితాలు సాధించాలన్నారు. గత డీఆర్సీలో ప్రస్తావించిన అంశాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న వాటిని కార్యరూపంలోకి తీసుకురావాలన్నారు. కమిటీ సభ్యుల సూచనల మేరకు వారి సమస్యల పరిష్కారానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, జిల్లా రెవెన్యూ అధికారి పులి శ్రీనివాసులు అన్నీ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ మార్కాపురంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నెలకు రెండు పంచాయతీలను లక్ష్యంగా పెట్టుకుని సమగ్రమైన ప్రణాళికతో తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. సెర్ప్ ప్రోత్సాహంతో స్వయం సహాయక సంఘాల ద్వారా పరిశ్రమలు స్థాపించేలా చూడాలన్నారు. పీడీసీసీ బ్యాంకు చైర్మన్ మాదాసి వెంకయ్య మాట్లాడుతూ అనధికారిక చేపల ఉత్పత్తి కేంద్రాలను అరికట్టాలని కోరారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వాటికి చట్టబద్ధత కల్పించాలన్నారు. శిథిలావస్థకు చేరిన తుఫాను షెల్టర్లను తొలగించి నూతనంగా నిర్మాణాలు చేయాలన్నారు. శింగరాయకొండలో దేవదాయ భూములుగా నమోదైన రెండు వేల ఎకరాల భూముల సమస్యను పరిష్కరించాలని కోరారు. టంగుటూరులో తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇంటింటికీ కుళాయిల ఏర్పాటు కోసం రూ.136 కోట్లతో చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోయాయని కమిటీలో తెలిపారు. తిరిగి ఆ పనులు సత్వరమే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రిపుల్ ఐటీ తాత్కాలిక భవనాల నిర్మాణాలకు రూ.25 కోట్లు కేటాయించాలన్నారు. కనిగిరి రెవన్యూ డివిజన్ పరిధిలో వచ్చే ప్రభుత్వ కార్యాలయ సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కంబాలదిన్నె పాఠశాలలో చెట్ల కింద తరగతులు నిర్వహిస్తున్నారని, నాడు–నేడు కింద పాఠశాలను అభివృద్ధి చేయాలని కోరారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ ఆంధ్రకేసరి యూనివర్శిటీ స్థలం ఆక్రమణలకు గురికాకుండా చూడాలన్నారు. ప్రమాదాలకు నిలయంగా మారిన ఒంగోలు–పొదిలి రహదారిని నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేయాలన్నారు. గుండ్లకమ్మ నుంచి ఆయా ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేసే పైపులైన్లు మరమ్మతులు చేయాలని కోరారు. గుండ్లకమ్మ రిజర్వాయర్లో చేపల అక్రమ వేటను అరికట్టాలన్నారు. పారిశ్రామికవాడ నుంచి వచ్చే ఆదాయంలో 40 శాతం నిధులు స్థానిక ప్రాంతాలకు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు. ఉప్పుగుండూరులో 100 పడకల ఆస్పత్రికి ప్రతిపాదనలు పంపాలని కోరారు. -
సీఎం జగన్కు రుణపడి ఉంటాం
గుంటూరు ఈస్ట్: బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న మాకు.. కుటుంబసభ్యుడి కంటే ఎక్కువగా ఎంతో అండగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు రుణపడి ఉంటామని రమ్య తల్లి జ్యోతి కృతజ్ఞతలు తెలియజేశారు. రమ్యను హత్య చేసిన శశికృష్ణకు కోర్టు ఉరిశిక్ష విధించిన నేపథ్యంలో శనివారం గుంటూరులో ఆమె తల్లి జ్యోతి మీడియాతో మాట్లాడారు. ‘ఎంతో ముద్దుగా పెంచుకున్న బిడ్డను.. ఎవడో వచ్చి చంపేస్తే ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఇలాంటి పరిస్థితిని భవిష్యత్లో తల్లిదండ్రులెవ్వరూ అనుభవించకూడదు. ఘటన జరిగినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాకు అండగా ఉన్నారు. మా కుటుంబం పక్షాన ఉండి, స్వయంగా మమ్మల్ని పిలిపించుకుని మాట్లాడటమే కాకుండా ఎప్పటికప్పుడు మా మంచి చెడ్డలు చూస్తూ ధైర్యం నింపారు. ఆర్థికంగానూ సాయం చేసి తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు. నా బిడ్డను చంపిన వ్యక్తికి ఉరి శిక్ష పడేలా చర్యలు తీసుకున్నందుకు ధన్యవాదాలు’ అని రమ్య తల్లి జ్యోతి పేర్కొన్నారు. మంత్రి మేరుగ పరామర్శ గుంటూరు నగరంపాలెంలోని రమ్య కుటుంబసభ్యులను మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, మేయర్ కావటి మనోహర్నాయుడు, డిప్యూటీ మేయర్లు సజిల, వనమా బాలవజ్రబాబు పరామర్శించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండటానికి ప్రభుత్వం దిశ బిల్లును తీసుకొచ్చిందని మంత్రి మేరుగ పేర్కొన్నారు. దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని.. కష్ట సమయంలో వినియోగించాలని సూచించారు. టీడీపీ నాయకులు శవాల మీద పేలాలు ఏరుకునే తరహాలో ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. -
ఏప్రిల్ 14 నాటికి అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం పూర్తి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వచ్చే ఏప్రిల్ 14 నాటికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం, స్మృతివనం వనులు పూర్తి చేయాలని మంత్రుల కమిటీ చైర్మన్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేస్తున్న అంబేడ్కర్ కాంస్య విగ్రహం, స్మృతి వనం నిర్మాణ పనులను బుధవారం ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, అధికారులతో కలిసి మంత్రి మేరుగ పరిశీలించారు. ముందుగా నమూనా విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మేరుగ మీడియాతో మాట్లాడుతూ ప్రతి 15 రోజులకోసారి నిర్మాణ పనులను సమీక్షిస్తామని, సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ఈ విగ్రహం, స్మృతివనం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. -
ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి, ఇంటర్మీడియట్లలో ప్రవేశాల (అడ్మిషన్ల) కోసం ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా రాత పరీక్షలు నిర్వహించారు. ఐదో తరగతిలో 14,940 సీట్లు ఉండగా ఆన్లైన్ ద్వారా 61,670 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 49,890 మంది రాతపరీక్షకు హాజరయ్యారు. వారికి 188 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్, ఐఐటీ, మెడికల్ అకాడమీలలో ప్రవేశానికి 13,560 సీట్లు ఉండగా ఆన్లైన్ ద్వారా 42,831 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో 37,492 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలో 185 కేంద్రాల్లో మధ్యాహ్నాం 2 గంటల నుంచి 4 గంటల వరకు వీరికి రాత పరీక్ష నిర్వహించారు. కాగా, పామర్రు పరీక్షా కేంద్రాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పరిశీలించారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్తోపాటు అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.పావనమూర్తి ఉన్నారు. -
గురుకులాలపై పటిష్ట పర్యవేక్షణ తప్పనిసరి
సాక్షి, అమరావతి: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలపై పటిష్ట పర్యవేక్షణ ఉండాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికారులు ఉత్సవ విగ్రహాల్లా ఉంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విద్యాలయాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించేవారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని స్థాయిల్లో నాణ్యతా ప్రమాణాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని సచివాలయంలో గురువారం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థపై మంత్రి మేరుగ సమీక్ష నిర్వహించారు. కొన్ని గురుకుల పాఠశాలల్లో అధ్వాన్న పరిస్థితులు ఉన్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. విద్యా సంస్థల్లో సమస్యలను పరిష్కరించడానికి, నాణ్యతా ప్రమాణాలను పెంచడానికి అధికారులు తరచూ తనిఖీలు చేయాలని సూచించారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఫలితాలు సాధించేలా గురుకుల విద్యా సంస్థల టీచర్లు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతతో ఉండాలన్నారు. 6 ఉమ్మడి జిల్లాల్లో రూ.94.3 కోట్లతో క్రీడా ప్రతిభా కేంద్రాలను నిర్మిస్తామన్నారు. విశాఖపట్నం జిల్లా దేవరాపల్లిలో బాలురకు బాక్సింగ్, తూర్పుగోదావరి జిల్లా తునిలో బాలికలకు విలు విద్య, కృష్ణా జిల్లా కృష్ణారావుపాలెంలో బాలురకు అథ్లెటిక్స్, ప్రకాశం జిల్లా పెదపావనిలో బాలికలకు అథ్లెటిక్స్, కర్నూలు జిల్లా జూపాడు బంగ్లాలో బాలురకు కబడ్డీ, వైఎస్సార్ జిల్లా చిన్నచౌక్లో బాలికలకు ఫెన్సింగ్లో శిక్షణ ఇస్తామన్నారు. ఈ సమీక్షలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి నాయక్, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి పావనమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పథకాల రద్దుకు ‘పచ్చ’ కుట్ర.. విషం కక్కుతున్న ఎల్లో బ్యాచ్
సాక్షి, అమరావతి: ‘సీఎం వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్సార్సీపీ సర్కారు అమలుచేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలపై పక్కా ప్రణాళికతో కులనాగులు విషం కక్కుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఏం చెప్పదలచుకుందో ‘ఈనాడు’తో చెప్పిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ రద్దుచేయాలనే కుట్రకు చంద్రబాబు అండ్ కో బరితెగించారు. తమకు పొరపాటున ఎవరైనా ఓటువేస్తే రాష్ట్రంలో పేదలకు అమలవుతున్న సంక్షేమ పథకాలకు సర్వ మంగళం పాడాలన్న చంద్రబాబు కర్కశ మనస్తత్వాని ఈనాడు పత్రిక అద్దంపట్టింది. పేదలంటే వీరికి ఎంత కడుపుమంటో అర్థంమవుతోంది’.. అని ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి, మంత్రులు మేరుగ నాగార్జున, గుడివాడ అమర్నాథ్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ప్రభుత్వం డబ్బు పంచే తమాషాలు ఆపాలి’.. అంటూ ఈనాడులో వచ్చిన కథనంపై వీరు ముగ్గురూ మంగళవారం వేర్వేరుగా నిర్వహించిన మీడియా సమావేశాల్లో స్పందించారు. ‘ప్రభుత్వం ఏవో రెండు మూడు కార్యక్రమాలు అమలుచేస్తూ మిగిలిన వాటిని నిలిపివేస్తేనే మనకు మనుగడ ఉంటుంది’ అని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో చెప్పించి ఈనాడులో ప్రచురించడం దుర్మార్గమన్నారు. వారు ఇంకా ఏమన్నారంటే.. ఆ ఐఏఎస్లు అప్పుడేం చేశారు? పేదలకు ఆగర్భ శత్రువుల్లా మాట్లాడటం దారుణం. తాను అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలులో ఉన్న సంక్షేమ పథకాలను రద్దుచేస్తాననే సంకేతాన్ని ‘ఈనాడు’ ద్వారా చంద్రబాబు ఇచ్చారు. సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నదంటూ మాజీ ఐఏఎస్లు మాట్లాడం దారుణం. ఈనాడులో రాసిన వార్తకు వంతపాడిన ఐఏఎస్ అధికారులిద్దరూ గత ప్రభుత్వ హయాంలో కీలక పదవుల్లో పనిచేశారు. అప్పుడు చంద్రబాబు పెద్దఎత్తున అప్పులు తెచ్చిన సొమ్మును దుర్వినియోగం చేస్తుంటే.. అలాగే, పోలవరం చూడటానికి, సింగపూర్ ఏజెన్సీకి, అమరావతి డిజైన్లకు చంద్రబాబు వందలాది కోట్లు దుబారా చేస్తుంటే వీరిరువురూ ఏంచేశారు? రాష్ట్రంలో పేదలందరూ బాగుండాలన్నది సీఎం వైఎస్ జగన్ ఆలోచనైతే.. టీడీపీ నేతలు మాత్రమే బాగుండాలన్నది చంద్రబాబు నైజం. జగన్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం జరగలేదు. కానీ, చంద్రబాబు అధికారంలో ఉండి ఉంటే.. సంక్షేమ పథకాలకు ఖర్చుచేసే సొమ్ములో సగం టీడీపీ నేతలకు, జన్మభూమి కమిటీల్లోని ఆ పార్టీ కార్యకర్తలు, ఆయన జేబుల్లోకి చేరేవి. మంత్రివర్గంలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ అవకాశమిస్తే దానిని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడు. ఎలాగైనా చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు తపనపడుతున్నారు. కానీ.. అది జరగని పని. మీ కుట్రలను ప్రజలు డేగకళ్లతో గమనిస్తున్నారు. వారు మళ్లీ కొట్టే దెబ్బకు చంద్రబాబు అండ్ కోకు కూసాలు కదలడం ఖాయం. పథకాలపై ఎల్లో బ్యాచ్ ఉద్దేశం ఇదా? ► అమ్మఒడి, చేయూత, వైఎస్సార్ ఆసరాను ఆపేయాలా? ► 52.4 లక్షల రైతు కుటుంబాలకు అందించిన వైఎస్సార్ ‘రైతుభరోసా’ను నిలిపేయాలా? ► 31 లక్షల కుటుంబాలకు లబ్ధిచేకూర్చే ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం చెయ్యొద్దా? ► విద్యా దీవెన, వసతి దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా కానుకను అడ్డుకోవాలనేది వారి ఉద్దేశమా? ► జగనన్న గోరుముద్ద పథకానికి మంగళం పాడాలా? ► ఆసుపత్రులను చక్కగా తీర్చిదిద్దుతున్న నాడు–నేడు పథకాన్ని అటకెక్కించాలా? ► చంద్రబాబు మాదిరిగా రైతులకు సున్నావడ్డీ, పంటల బీమాను ఆపేయాలా? ► అలాగే, డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు ఆపేయాలన్నది రామోజీరావు, చంద్రబాబు ఉద్దేశమా? ► వైఎస్సార్ పెన్షన్ కానుక కూడా ఇవ్వొద్దా? ► వైఎస్సార్ నేతన్న నేస్తం, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాలను నిలిపివేయాలా? ► జగనన్న చేదోడు, జగనన్న తోడు, వైఎస్సార్ వాహన మిత్ర వంటి పథకాలను ఏం చేయాలన్నది మీ ఉద్దేశ్యం? ► వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఆసరా వంటి గొప్ప పథకాలను అటకెక్కించాలా? ► వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని ఆపేయాలా? -
టీడీపీ అభిప్రాయాలని ఈనాడు ద్వారా చెప్పించారు: మేరుగ నాగార్జున
తాడేపల్లి: పేద విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలుస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ప్రభుత్వంపై బురదజల్లడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఆసరా పథకంతో లక్షల కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. టీడీపీ అభిప్రాయాలని ఈనాడు ద్వారా చెప్పించారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు ఆగిపోవాలని వారు భావిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు ఈ కుట్రలని గమనించాలని కోరుతున్నానని తెలిపారు. చంద్రబాబుకి ఎవరైనా ఓటేస్తే ఈ పథకాలు ఆపేస్తామని చెప్పకనే చెప్పారని అన్నారు. జగనన్న అమ్మ ఒడి ద్వారా 44 లక్షలపైన తల్లులకి అమలు చేస్తున్నామని తెలిపారు. ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. -
ఆరోగ్యశ్రీ చాలా గొప్ప పథకం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ఎంతో గొప్పదని.. ఈ పథకం ద్వారా ఎంతోమంది పేదలు మెరుగైన వైద్య సేవలు పొందుతున్నారని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వ్యాఖ్యానించారు. ఆదివారం గుంటూరులోని సాయిభాస్కర్ ఆస్పత్రిలో ‘న్యూ రివిజన్ నీ రీప్లేస్మెంట్ బ్లాక్’ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఈహెచ్ఎస్ లబ్ధిదారులతో సంభాషించారు. అనంతర ఆయన మాట్లాడుతూ.. వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం ధైర్యాన్ని ఇస్తోందన్నారు. రూ.25 లక్షల విలువైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలలో ఉపయోగించే ఇంప్లాంట్లను ప్రభుత్వానికి విరాళంగా అందించడమే కాకుండా, ఉన్నతి ఫౌండేషన్ ద్వారా డాక్టర్ నరేంద్రరెడ్డి అందిస్తున్న సేవలను అభినందించారు. గుంటూరు సర్వజన వైద్యశాలలో డాక్టర్ నరేంద్రరెడ్డి 100 ఉచిత మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేయడం గొప్ప విషయమన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్, ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి, ఎస్పీ ఆరిఫ్హఫీజ్, జేసీ రాజకుమారి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి, మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారు ఎస్ఎం జియావుద్దీన్, హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు. -
సీఎంకు దళిత, బహుజనులు వెన్నుదన్నుగా ఉండాలి
సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావజాలంతో కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వంలో దళిత, బహుజనులకు లభిస్తున్న ఆదరణ చరిత్రాత్మకమైందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. రాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరితను గుంటూరులోని ఆమె నివాసంలో నాగార్జున శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దళిత, బహుజనులందరూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలవాలని కోరారు. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కిన నాగార్జునను సుచరిత అభినందించారు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం 10.30 గంటలకు వెలగపూడి సచివాలయంలో మేరుగు నాగార్జున తన శాఖ బాధ్యతలు చేపడతారని ఆయన కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
సామాజిక విప్లవానికి నాంది పలికిన సీఎం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో సామాజిక విప్లవానికి నాంది పలికారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. జగన్ దళిత సంక్షేమాన్ని భుజాన వేసుకున్నారని, దేశ చరిత్రలో తొలిసారిగా 70 శాతం మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చి సామాజిక విప్లవానికి నాంది పలికారని చెప్పారు. సోమవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి ఏకంగా రూ.1.32 లక్షల కోట్లు సీఎం జగన్ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. 31లక్షల మంది పేద, బడుగు, బలహీన వర్గాల వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, 17 వేల జగనన్న కాలనీలతో ఊళ్లకు ఊళ్లే నిర్మిస్తున్నారని చెప్పారు. 14ఏళ్లు సీఎం చేసిన చంద్రబాబు పేదలకు కట్టిన ఇళ్లు ఎన్ని అని ప్రశ్నించారు. ఒక్క ఇంటి పట్టా అయినా ఇచ్చారా అని అన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్లో కింది స్థాయి నుంచి మార్పులు చేస్తూ పేదవాడి గడప వద్దకే పాలన తెస్తున్న సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. బాబుకు చెప్పుకోవడానికి ఒక్క మంచీ లేదన్నారు. మరే రాష్ట్రంలోనూ ఇటువంటి పరిపాలన లేదు అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, సాహు మహరాజ్, పెరియార్ రామస్వామి, జగ్జీవన్ రామ్ కన్న కలలను నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో సామాజిక సంస్కరణలు జరుగుతున్నాయని తెలిపారు. మరే రాష్ట్రంలోనూ ఇటువంటి పాలన జరగదని చెప్పారు. అణచివేతకు గురైన వర్గాల ఉన్నతి కోసం ఇంత చేస్తున్న సీఎం జగన్ని అభినందించాల్సింది పోయి, టీడీపీ, చంద్రబాబు, ఎల్లో మీడియా ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. 2014లో అధికారంలోకి వచ్చిన బాబు కేబినెట్లో ఎస్టీ, మైనార్టీలకు చోటు కల్పించలేదన్నారు. బాబు కేబినెట్లో బడుగు బలహీన వర్గాలకు కేవలం 42 శాతం ఇస్తే... సీఎం జగన్ తొలి కేబినెట్లో 60 శాతం, ఇప్పుడు 70 శాతం పదవులు ఇచ్చారని తెలిపారు.