కాంగ్రెస్‌కు‘శక్తి’ | Congress Begins Operation Social Media | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు‘శక్తి’

Jun 8 2018 12:39 PM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Begins Operation Social Media  - Sakshi

పార్టీకి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.

సాక్షి, రంగారెడ్డి : పార్టీకి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ప్రస్తుతం రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నసామాజిక మాధ్యమాల ద్వారా పార్టీని మరింత ప్రజల దరికి చేర్చాలని సంకల్పించింది. ఇందులో భాగంగా ‘శక్తి’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌తో సంస్థాగత కార్యక్రమాలేగాకుం డా సమకాలీన రాజకీయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు కలుగుతుందని ఏఐసీసీ భావిస్తోంది.

ఈ క్రమంలోనే గురువారం ‘శక్తి’ యాప్‌పై పార్టీ నేతలకు జాతీయ కోఆర్డినేటర్‌ యశ్వంత్‌ శుక్లా, పార్టీ ప్రతినిధులు స్వప్న, ఆశోక్‌ వర్గీస్‌ గాంధీభవన్‌లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్,  పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, పార్టీ నేతలు నందికంటి శ్రీధర్, రవికుమార్‌యాదవ్‌  పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement