
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రకు సెక్రటేరియట్ వస్తుందంటే చంద్రబాబుతో పాటు రామోజీరావుకి కూడా నిద్ర పట్టడంలేదని, వీరిద్దరు చరిత్రలో ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. సోమవారం ఈనాడు పత్రికలో వచ్చిన వార్తను చూస్తే వారిద్దరి అక్కసు ప్రజలకు అర్థమవుతుందన్నారు. ఈ వార్తను టీడీపీ నేతలు మరో రెండు ఆంగ్లపత్రికల్లో కూడా తమ పలుకుబడి ఉపయోగించి ప్రచురింపజేశారని తెలిపారు. సోమవారం ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులో ముఖ్యాంశాలు..
► ఎప్పుడో 1 కోటీ 60 లక్షల ఏళ్ల క్రితం తూర్పు గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు సముద్రంలో చీలిక ఏర్పడిందని, 68 లక్షల ఏళ్లకు పూర్వం నుంచి 30 లక్షల ఏళ్ల పూర్వం వరకు ఆ చీలికలో అలజడి ఉండేదని ఈనాడులో రాశారు.
► ఆ చీలిక వల్ల భవిష్యత్తులో ఉత్తరాంధ్రలో ఎప్పుడైనా భూకంపాలు రావచ్చునని ఎవరో ఓ ప్రొఫెసర్ను పట్టుకుని ఉద్దేశపూర్వకంగా చెప్పించారు.
► 30 లక్షల ఏళ్ల క్రితమే ఆగిన అలజడి, ఇప్పుడు చంద్రబాబు దిగిపోవటంతో మళ్లీ రామోజీలో రేగినట్లుంది. విశాఖ ఇమేజిని, ఉత్తరాంధ్ర ప్రాభవాన్ని దెబ్బతీయటానికి చంద్రబాబుతో కలిసి రామోజీ ఇంతలా దిగజారిపోతారా?
Comments
Please login to add a commentAdd a comment