Karanam Dharmasri
-
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
తాడేపల్లి: వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు జరిగాయి. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా కరణం ధర్మశ్రీను నియమించారు. చోడవరం నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్తగా బూడి ముత్యాల నాయుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా తిప్పల దేవన్ రెడ్డి, పి.గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్తగా గన్నవరపు శ్రీనివాస రావు, కాగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికూటి అశోక్ బాబును నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. -
మీ రాజీనామా స్టీల్ ప్లాంట్ సమస్యకు పరిష్కారం కాదు.. !
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్సదే విజయం: ధర్మశ్రీ
-
మళ్లీ జగనే అధికారంలోకి వస్తారు
-
కళ్లు ఉన్న కబోది లోకేషం..
-
ప్రతి నెల లోకేష్ జేబులోకి 500 కోట్లు
-
చోడవరంలో సామాజిక సాధికార యాత్రకు భారీ ఏర్పాట్లు
-
రైతు సంక్షేమం కోసం ఆలోచించే నాయకుడు సీఎం జగన్
-
చంద్రబాబు అరెస్ట్ అక్రమం కాదు.. అనివార్యం: మంత్రి అంబటి
సాక్షి, అమరావతి: చంద్రబాబుది అక్రమ అరెస్టుకాదని, అనివార్యమైన అరెస్టు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అరెస్టు చేయటం వలన సింపతి వస్తుందని టీడీపీ, ఎల్లోమీడియా చూసిందని, దీన్ని కక్షసాధింపుగా ప్రజలు చూస్తారని భావించారు కానీ అవేవీ జరగలేదని అన్నారు. భారీగా అక్రమాలు చేసినా చంద్రబాబును అరెస్టు చేయకపోతే రాజ్యాంగానికి విలువ ఏముంటుందని పేర్కొన్నారు. సీఐడీవారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం వలన కేసుకు అనుగుణంగా వారు వ్యవహరించారని చెప్పారు,. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా చేసినందునే చంద్రబాబు అరెస్టు అయ్యారని మంత్రి అంబటి అన్నారు. స్కిల్ కేసులో ఇప్పుడు అరెస్టు అయ్యారని.. ఇంకా రింగు రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లోనూ విచారణ జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు ముందు చాలా లోతైన విచారణ జరిగిందన్నారు. షెల్ కంపెనీలకు డబ్బు తరలించి, తర్వాత తన ఖాతాలోకి వేసుకున్నట్టు తేలిందని పేర్కొనఆనరు. సీమెన్స్ కంపెనీతో సంబంధం లేకుండానే వ్యవహారం నడిపారన్నారు. ఆ కంపెనీ కూడా ఈ విషయం చెప్పిందని, రూ.330 కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని లూటీ చేశారని విమర్శించారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరు మంత్రి అంబటి మాట్లాడుతూ.. అన్యాయంగా అరెస్టు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏంటి? ఎన్నికలకు ముందు అరెస్టు చేస్తే చంద్రబాబుకు సింపతీ పెరుగుతుందని మాకు తెలీదా? కానీ వ్యవస్థలు సక్రమంగా పని తమపని తాము చేసుకునేలా మేము ఫ్రీహ్యాండ్ ఇచ్చాం. చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరు. సీమెన్స్ కంపెనీ ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టలేదు. రూ.330 కోట్లు ఇవ్వటానికి వీల్లేదని సీఎస్ కృష్ణారావుతో సహా ఫైనాన్స్ అధికారులు నోట్ ఫైల్ రాశారు. కానీ చంద్రబాబు ఒత్తిడి చేసి నిధులు విడుదల చేయించారు. అంతదారుణంగా అక్రమాలు చేస్తే అరెస్టు చేయకూడదా?. చట్టబద్దంగానే సీఐడీ అరెస్టు చేసింది. చంద్రబాబు పిఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పరారయ్యారు. చంద్రబాబు సహకారంతోనే వారిద్దరూ పరారయ్యారు. ఫైబర్ నెట్, రింగ్ రోడ్ విచారణ కూడా జరుగుతుంది. ఎంతటి వారైనా తప్పు చేస్తే చట్టం, న్యాయం సహించదు. రోడ్డుమీదకు వచ్చి గొడవలు చేస్తే సహించేదిలేదు. ప్రజలకు ఇబ్బందులు కల్హిస్తే అణచివేస్తాం. ప్రజల నుండి దూరం చేయలేరంటూ పొలిటికల్ డైలాగులు కుదరవు. కోర్టులో వాస్తవాలు చెప్పుకుంటే మంచిది. ప్రభుత్వ సొమ్ము కాజేసిన సంగతిని పవన్ కల్యాణ్ తెలుసుకుని మాట్లాడాలి. వాసస్తవాలు తెలియాలంటే ఆ వివరాలు మేము పవన్కు పంఇస్తాం. పవన్ వత్తాసు పలకటం ఏంటి షూటింగ్ వదిలి బయటకు రాలేని పవన్, ప్రజలను రోడ్డు మీదకు రమ్మనటం ఏంటి?. గావుకేకలు షూటింగ్లో పెట్టటం కాదు, బయటకు వచ్చి మాట్లాడాలి. ఒక దోపిడీ దారునికి పవన్ కల్యాణ్ వత్తాసు పలకటం ఏంటి?. చంద్రబాబు, పవన్.. ఇద్దరూ ఎవరికి ఆపద వచ్చినా పూలబొకేలు ఇచ్చుకుంటుంటారు. ఇప్పుడు చంద్రబాబు వద్దకు వచ్చి ఒక పూలబొకేని పవన్ ఇస్తే మంచిది. చంద్రబాబు, పవన్ అవినీతి గోదావరిలో దిగాలనుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు. బీజేపీ అధ్యక్షురాలు కూడా మా బావ అవినీతి చేయలేదని చెప్పటం లేదు. అరెస్టు ప్రొసీజర్ గురించే ఆమె మాట్లాడుతున్నారు. అంతేకానీ మా బావ నీతిమంతుడని చెప్పలేదంటేనే అర్థం చేసుకోవచ్చు. లోకేష్ పాత్ర కూడా ఉందని తేలితే ఆయన్ని కూడా అరెస్టు చేస్తారు. చదవండి: చంద్రబాబు పాపం పండింది: మంత్రి అమర్నాథ్ తప్పు చేశానని చంద్రబాబుకు తెలుసు రాజకీయ కక్షతో బాబును అరెస్ట్ చేయించాల్సిన అవసరం మాకు లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాజకీయమే చేయాలంటే 4 ఏళ్లుగా బాబు, లోకేష్ బయట తిరేవారు కాదని అన్నారు. రాష్ట్ర ఖజానాను దోచుకున్న బాబుకు కచ్చితంగా శిక్ష పడాల్సిందేనని వ్యాఖ్యనించారు. తప్పు చేశానని చంద్రబాబుకు తెలుసని పేర్కొన్నారు. బాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై 2018లో జీఎస్టీ కేసు పెట్టిందని డొల్ల కంపెనీల ద్వారా లావాదేవీలు జరిగాయని తేలిందన్నారు. చంద్రబాబు ఒత్తిడి మేరకు చేశామని సెక్రటరీనే ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. ఇప్పుడు MOU అని సిమెన్స్ కంపెనీ కోర్టులో వాంగ్మూలం ఇచ్చిందని గుర్తు చేశారు. యువతను చంద్రబాబు మోసం చేశాడని విమర్శించారు. యువతకు స్కిల్స్ నేర్చించలేదు కానీ.. తన స్కిల్స్తో వ్యవస్థను మేనేజ్ చేశాడని దుయ్యబట్టారు. స్కిల్ డెవెలప్మెంట్ స్కామ్ శాంపిల్ మాత్రమే.. ఇలాంటి స్కామ్లు చాలా చేశాడని అన్నారు. అన్నీ కేసుల్లో స్టేలపైనే ఎవరి పాపాలు పండుతాయో ఎవరికి శిక్ష వెయ్యాలో ఆ దేవుడికి బాగా తెలుసు. దివంగత ఎన్టార్ ఆత్మ క్షోభ , బాధ కూడా గతంలో వినిపించారు.. అది ఇప్పటికి పాపం పండింది. చంద్రబాబు చేసిన అక్రమాలు ఒక్కటి కాదు. ఏలేటి స్కామ్, లిక్కర్ స్కామ్లో అన్ని కేసులలో స్టేలపైనే జీవిస్తున్నాడు. పాపలన్నీ బద్దలైనాయిఅన్నింటికి శిక్ష తప్పదు. -మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చట్టానికి ఎవరూ అతీతులు కాదు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు సక్రమమే. చట్టానికి ఎవరు అతీతులు కాదు.. గతంలోనూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల అరెస్టులు జరిగాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో వేల కోట్ల అక్రమాలకు చంద్రబాబు పాత్ర ఉంది కనుకనే అరెస్ట్ చేశారు. - నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు అరెస్టుకు రాజకీయ సంబంధం లేదు చంద్రబాబు అరెస్టును స్వాగతిస్తున్నాం. ఆయన అరెస్టుకు రాజకీయానికి సంబంధం లేదు. స్కిల్ డెవలప్ మెంట్లో ఏం జరిగింది అనేది అసెంబ్లీ సాక్షిగా పూర్తిగా చర్చించాం. అసలు సంబంధంలేని సీమెన్ కంపెనీ పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు. సీమెన్ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తితో మాట్లాడి ఈ విధంగా అవినీతికి పాల్పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ కంపెనీ కూడా ఎంక్వయిరీ చేసి దీనికి మాకు సంబంధం లేదని తేల్చేసింది. పూర్తిస్థాయిలో చర్చించి రూ. 370 కోట్లు ఏ విధంగా అవినీతి జరిగింది అని ప్రభుత్వ సంస్థలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతే చంద్రబాబును అరెస్టు చేశారు. దీనిలో ఏ విధమైన రాజకీయ కోణం గానీ కక్ష సాధింపులు గాని లేవు. దొరికిపోయాడు కాబట్టే నన్ను ఏ క్షణమైనా అరెస్టు చేస్తారంటూ మూడు రోజుల నుంచి చంద్రబాబు చెబుతున్నాడు. -నందిగామ ఎమ్మెల్యే,మొండితోక జగన్ మోహన్ రావు చంద్రబాబు అరెస్టు సమంజసమే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిలో కూరుకు పోయారు. సీఐడీ పూర్తిస్థాయిలో విచారణ జరిపింది. 2018లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిధులు దారిమళ్లాయి. హవాలా రూపంలో చంద్రబాబు స్కాంకు పాల్పడ్డాడు. చంద్రబాబు అరెస్టు సమంజసమే. అవినీతికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేస్తే రాజకీయం చేయడం తగదు. -అనకాపల్లి జిల్లా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చంద్రబాబు నాయుడు అవినీతి సామ్రాట్ చంద్రబాబు నాయుడు అవినీతి సామ్రాట్. స్కిల్ డెవలప్మెంట్ స్కాం సూత్రధారి చంద్రబాబే. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అనేక కుంభకోణాల్లో భాగస్వామి. చంద్రబాబు వేల కోట్ల అక్రమాల్లో స్కిల్ డెవలప్మెంట్ స్కాం చాలా చిన్నది. చంద్రబాబు పాపం పండింది.. చంద్రబాబు ను జైలుకు పంపాలి. -రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పూర్తి ఆధారాలతో అరెస్ట్ చంద్రబాబు నాయుడు అరెస్టుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పూర్తి ఆధారాలతోనే ఆయన్ను అరెస్ట్ చేశారు. కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలనుకుంటే 2021లోనే అరెస్టు చేయొచ్చు. స్కిల్ డెవలప్మెంట్ పేరిట ప్రజల సొమ్ము రూ. 360 కోట్లు దోచేసశాడు. జీఎస్టీ,ఇంటెలిజెన్స్, ఐటీ, ఈడీ, సెబ్ ఇలా అన్ని కూడా మూడు సంవత్సరాల నుంచి దర్యాప్తు చేస్తూ పూర్తి ఆధారాలతో అరెస్టు చేశారు. - ఎమ్మెల్యే తలారి వెంకట్రావు -
నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తున్న అప్పన్న స్వామి
-
‘తుని–సబ్బవరం’ను జాతీయ రహదారిగా మార్చండి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలోని తుని–సబ్బవరం రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని కేంద్ర జాతీయ రహదారులు, రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విజ్ఞప్తి చేశారు. బుధవారం కేంద్ర మంత్రితో భేటీ అనంతరం ధర్మశ్రీ మీడియాతో మాట్లాడారు. 133 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రహదారికి రూ.2,200 కోట్లు ఖర్చవుతుందన్నారు. దీనికి సంబంధించి డీపీఆర్ కూడా పూర్తయిందని చెప్పారు. రహదారి పనులు వేగంగా చేపట్టాలని కేంద్రమంత్రికి వినతి పత్రం అందజేశానన్నారు. ఈ రహదారి పూర్తయితే ఏడు నియోజకవర్గాల్లో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. -
‘జనసేన’ సైకో చర్య.. దాడి ఘటనపై మంత్రి జోగి రమేష్ హెచ్చరిక
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎయిర్పోర్టు వద్ద తనపై దాడి జరిగిందని మంత్రి జోగి రమేష్ తెలిపారు. కర్రలు, రాళ్లతో దాడికి దిగారని, ఈ ఘటనలో తమ వాళ్లకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. కాగా విశాఖ ఎయిర్పోర్టు వద్ద జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. గర్జన సభ నుంచి ఎయిర్పోర్టు వెళ్తుండగా వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేష్ కార్లపై దాడికి తెగబడ్డారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. జనసేన కార్యకర్తల విధ్వంసంతో ఎయిర్పోర్టులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. జనసేన కార్యకర్త దాడిలో మంత్రి జోగి రమేష్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. మంత్రి రోజా సహాయకుడితోపాటు పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై మంత్రి జోగి స్పందిస్తూ.. గర్జనను పక్కదారి పట్టించేందుకే తాగుబోతులతో దాడులు జరిపించారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదని హెచ్చరించారు. తమతో పెట్టుకుంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో తిరగలేడని ధ్వజమెత్తారు. సంబంధిత వార్త: విశాఖ ఎయిర్పోర్టు వద్ద జనసేన కార్యకర్తల వీరంగం.. పవన్ సమాధానం చెప్పాలి వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేష్లపై విశాఖ ఎయిర్పోర్టులో జనసైనికుల దాడిపై తక్షణమే పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. వైజాగ్ ఎయిర్పోర్టులు మంత్రులు రోజా, జోగి రమేష్ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఒక్క ఎమ్మెల్యే లేకపోతేనే ఎంత దౌర్జన్యం చేస్తే.. ఐదారు సీట్లు గెలిస్తే ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారోనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి సంబంధించిన విజువల్స్, ఫోటోలు ఉన్నాయని.. దాడి చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. వై వి సుబ్బారెడ్డి,జోగి రమేష్ లపై విశాఖ ఎయిర్పోర్టులో జనసైనికుల దాడిపై తక్షణమే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి!— Ambati Rambabu (@AmbatiRambabu) October 15, 2022 గర్జనను పక్కదారి పట్టించేందుకే గర్జనను పక్కదారి పట్టించేందుకే జనసేన దాడులు చేసిందని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. వందమంది రౌడీలతో దాడులు చేశారని తెలిపారు. జనసేన చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పవన్ కల్యాణ్ రౌడీయిజం చేస్తున్నాడా? దాడి ఘటనపై పవన్ తక్షణమే సమాధానం చెప్పాలి. మీకు వందమంది ఉంటే.. మాకు పదివేల మంది ఉన్నారు. పవన్ పిచ్చి వేషాలు వేస్తే చీరెస్తాం’ -ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ -
మంత్రుల కార్లపై కర్రలు , రాళ్లతో దాడిచేసిన జనసేన కార్యకర్తలు
-
వికేంద్రీకరణ కోసం రాజీనామాకు నేను సిద్ధం: కరణం ధర్మశ్రీ
-
స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను అందించిన కరణం ధర్మశ్రీ
సాక్షి, విశాఖపట్నం: వికేంద్రీకరణ కోసం రాజీనామాకు సిద్ధమని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈక్రమంలోనే విశాఖపట్నంలో వికేంద్రీకరణకు మద్దతుగా జరుగుతున్న జేఏసీ మీటింగ్లో స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్కు అందజేశారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు దమ్ముంటే వికేంద్రీకరణ వ్యతిరేకంగా రాజీనామా చేయాలని సవాల్ చేశారు. అమరావతికి మద్దతుగా అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి తిరిగి పోటీ చేయాలని కరణం ధర్మశ్రీ సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే, ఈనెల 15న విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహిస్తామని వికేంద్రీకరణ జేఏసీ ప్రకటించింది. టూ టౌన్ అంబేడ్కర్ విగ్రహం నుంచి ర్యాలీ జరుగుతుందని తెలిపింది. త్వరలో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు కూడా వెల్లడించింది. చదవండి: (Visakhapatnam: అవసరమైతే రాజీనామాకు సిద్ధం: అవంతి శ్రీనివాస్) -
ఎన్టీఆర్పై ప్రేమ ఉన్నట్టు ఇప్పుడు డ్రామాలు చేస్తున్నారు: కరణం ధర్మశ్రీ
-
ధర్మశ్రీకి అందలం.. అభిమానుల ఆనందం
చోడవరం(అనకాపల్లి జిల్లా): అనుభవజ్ఞుడికి సముచిత స్థానం లభించింది. ఆయన సేవలకు తగిన గుర్తింపు దక్కింది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని ప్రభుత్వ విప్గా నియమించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చోడవరం నియోజకవర్గంతోపాటు అనకాపల్లి జిల్లాలో అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. బీఈడీ బీఎల్ చదవిన ధర్మశ్రీ రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలని భావించి యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2004లో వైఎస్సార్ హయాంలో మాడుగుల ఎమ్మెల్యేగా, డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ధర్మశ్రీ వైఎస్సార్సీపీలో రాష్ట్ర కార్యదర్శిగా పదవి నిర్వహించారు. 2019లో చోడవరం ఎమ్మెల్యేగా 30 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన ఆ యనను ఈ ఏడాది ప్రారంభంలో కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి పార్టీని బలోపేతంగా చేస్తూ నియోజకవర్గాల పార్టీ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయడంలో తన వంతు పాత్ర పోషించారు. ఈ పరిస్థితుల్లో తాజాగా రాష్ట్రప్రభుత్వంలో కీలకమైన ప్రభుత్వ విప్ పదవికి ధర్మశ్రీని నియమించడంపై సర్వత్రా ఆనందం వ్యక్తమైంది. చోడవరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి, బాణసంచాలు కాల్చి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడువాక సత్యారావు, జెడ్పీటీసీ మారిశెట్టి విజయశ్రీకాంత్, ఎంపీపీ గాడి కాసు అప్పారావు, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు నాగులాపల్లి రాంబాబు, వైఎస్ ఎంపీపీలు బైన ఈశ్వరరావు, బుద్ద గంగరాజు, ఎంపీటీసీల ఫ్లోర్లీడర్ పల్లా రమణ, మార్కెట్ కమిటీ చైర్మన్ గూనూరు శంకరరావు, మండల ప్రతినిధి దొడ్డి వెంకట్రావు(డీవీఆర్), పట్టణ ప్రతినిధి దేవరపల్లి సత్య పాల్గొన్నారు. -
డీఎస్సీకి ఎంపికైన ఎమ్మెల్యే ధర్మశ్రీ
చోడవరం: రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 1998 డీఎస్సీలో ఎంపికయ్యారు. రాజకీయాల్లోకి రాకముందు.. సుమారు పాతికేళ్ల క్రితం ధర్మశ్రీ డీఎస్సీ రాసి అర్హత సాధించారు. ఇన్నాళ్లకు ఆయనకు టీచర్గా ఉద్యోగావకాశం వచ్చింది. ఈ విషయమై ఆయనను కదిలించగా.. ‘అప్పుడు నా వయసు సుమారు 30 ఏళ్లు. మద్రాసు అన్నామలై యూనివర్సిటీలో బీఈడీ చదివాను. ఉపాధ్యాయునిగా స్థిరపడాలనుకున్నాను. 1998 డీఎస్సీ రాశాను. అర్హత సాధించినా అది పెండింగ్లో పడటంతో న్యాయవిద్య (బీఎల్) చదవడం ప్రారంభించాను. ఆ సమయంలోనే రాజకీయ అరంగేట్రం చేసి కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగంలో క్రియాశీలకంగా వ్యవహరించాను. ఈ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అనుచరునిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని, ఈ రోజు వైఎస్సార్సీపీలో సముచిత స్థానంలో ఉన్నాను. అప్పుడే ఉద్యోగం వస్తే రాజకీయాల కంటే ఉపాధ్యాయ వృత్తికే ప్రాధాన్యం ఇచ్చేవాడిని. సీఎం జగన్మోహనరెడ్డి తీసుకున్న చొరవ వల్ల పాతికేళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయుల స్వప్నం నెరవేరింది. ముఖ్యమంత్రికి డీఎస్సీ 1998 బ్యాచ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా’ అన్నారు. -
సీఎం జగన్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, అనకాపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటం, కార్యకర్తల కృషి వలనే వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిందని టీటీడీ ఛైర్మన్, ఉమ్మడి విశాఖ జిల్లా కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అనకాపల్లి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా కరణం ధర్మశ్రీ ఆదివారం వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ గెలిచిన తర్వాత మూడేళ్లు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టారు. కార్యకర్తలకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుంది. పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దాదాపు అన్ని హామీలను అమలు చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సీఎం ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదు. నవరత్నాల ద్వారా సీఎం జగన్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఎల్లో మీడియా పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తోంది. ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలి. గడపగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి' అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. చదవండి: (మీరెంతమంది కలిసొచ్చినా.. సీఎం జగన్ సింగిల్గానే: దాడిశెట్టి రాజా) ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ.. చంద్రబాబును మించిన ఐరెన్ లెగ్ ఎవరూ లేరు. చంద్రబాబు ఐరెన్ లెగ్ 1 అయితే లోకేష్ 2. చంద్రబాబు పాలనలో అంతా కరువు కటకాలే. సీఎంగా జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సుభిక్షంగా ఉంది. వైఎస్ జగన్ గోల్డెన్ లెగ్ అని మంత్రి అమరనాథ్ అన్నారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. ధర్మశ్రీని అనకాపల్లి జిల్లా అధ్యక్షుడుగా నియమించడం సంతోషకరమైన విషయం. వచ్చే ఎన్నికల్లో వైస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుంది. అందుకు కలిసి కట్టుగా అందరం పని చేస్తాము. అనకాపల్లి జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటాము. వైవీ సుబ్బారెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ రావడం మన అదృష్టం. సీఎం జగన్ పాలనలో ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు. మే 11 నుంచి ప్రారంభం కానున్న గడప గడపకు వైస్సార్సీపీని విజయవంతం చేస్తామ'ని మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. చదవండి: (పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ కౌంటర్) -
పార్టీ నిర్ణయాలకు అంతా కట్టుబడి ఉండాలి
చోడవరం (అనకాపల్లి జిల్లా): వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం చోడవరంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి స్థానం కల్పించకపోవడంతో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధపడటంతో వారందర్నీ ఎమ్మెల్యే నివారించారు. పదవులు వస్తుంటాయి, పోతుంటాయని.. ప్రజలకు ఎప్పుడూ సేవచేసే అదృష్టం వచ్చినప్పుడు దానికి న్యాయం చేయాలన్నారు. వివిధ సమీకరణాల వల్ల తనకు మంత్రి వర్గంలో స్థానం దక్కకపోయినప్పటికీ సీఎం జగన్మోహన్రెడ్డి అభిమానం తనపైన, నియోజకవర్గ ప్రజలపైన ఎప్పుడూ ఉంటుందన్నారు. పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా అంకిత భావంతో రానున్న రోజుల్లో పార్టీ అభివృద్ధికి మరింత పనిచేయాలన్నారు. సమావేశంలో జెడ్పీటీసీలు మారిశెట్టి విజయశ్రీకాంత్, దొండా రాంబాబు, పోతల లక్ష్మీశ్రీనివాస్, తలారి రమణమ్మ, ఎంపీపీ గాడి కాసు, యర్రంశెట్టి శ్రీనివాసరావు, పైల రాజు, మండల అధ్యక్షులు పల్లా నర్సింగరావు, మడ్డు అప్పలనాయుడు, కంచిపాటి జగన్నాథరావు, కొళ్లిమళ్ల అచ్చెంనాయుడు, డీసీసీబీ డైరెక్టర్ మూడెడ్ల శంకరరావు, విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నిజం చెప్పడం మా నైజం, ఇజం
-
టీడీపీ తీరును రాష్ట్ర ప్రజలు ఛీదరించుకుంటున్నారు
-
చంద్రబాబు ఇచ్చిన నెల జీతం తీసుకుని పట్టాభి మాట్లాడుతున్నారు: ధర్మశ్రీ
-
అక్కసుతోనే అయ్యన్నపాత్రుడు పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు
-
‘చంద్రబాబుది బషీర్బాగ్ కాల్పుల చరిత్ర’
సాక్షి, విజయవాడ: రైతులు, వ్యవసాయం గురించి మాడ్లాడే నైతికత ప్రతిపక్ష నేత చంద్రబాబుకి లేదని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం పట్ల టీడీపీకి చిత్తశుద్ది ఉంటే 23 సీట్లు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. బషీర్బాగ్లో రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. దివంగత వైఎస్సార్ ఉచిత విద్యుత్ అంటే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని విమర్శించిన బాబుకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని దుయ్యబట్టారు. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడం చంద్రబాబుకి అలవాటన్నారు. తమది రైతుల సంక్షేమ ప్రభుత్వమని, పార్టీ పేరులోనే రైతు ఉందని గుర్తుచేశారు. ‘నివర్’ తుపాన్తో నష్టపోయిన రైతాంగాన్ని ప్రతిపక్షనేతగా పరామర్శించని బాబు అసెంబ్లీలో రైతుల గురించి ఏం మాడ్లాడతారని సూటిగా ప్రశ్నించారు. రూ. 86 వేల కోట్లను మాఫీ చేస్తానని గత ఎన్నికలలో హామీ ఇచ్చి ఎంత మాఫీ చేశారో చెప్పగలరా అని నిలదీశారు. రాష్ట్రంలో 50 లక్షలమంది రైతులకి రైతు భరోసా పధకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం తమదని నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులందరినీ అసదుకుంటామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ప్రకటించారని తెలిపారు. రైతులకి వేలకోట్ల రూపాయిలని బకాయిలు పెట్టిన చంద్రబాబు రైతుల గురించి ఏముఖం పెట్టుకుని మాడ్లాడతారని గుడివాడ అమర్నాథ్ అన్నారు. అదే విధంగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. రైతు పేరు ఎత్తే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. రైతు ద్రోహి, రైతులను అరెస్ట్ చేయించిన ఘనత చంద్రబాబుదని మండిపడ్డారు. తుఫాన్ వల్ల నష్ట పోయిన రైతులను ఏనాడు చంద్రబాబు ఆదుకోలేదన్నారు. రైతు పక్షపాతి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తుఫాన్ పరిహారం ప్రకటించిన తర్వాత చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ప్రారంభమయ్యాయి. మొదటి అంశంగా సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. -
వైఎస్సార్సీపీలో చేరిన ప్రముఖ కన్నడ నటుడు
సాక్షి, రోలుగుంట (చోడవరం): ప్రముఖ కన్నడ సినీ నటుడు గొంది సిద్ధూ తన అనుచరులతో ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. ఆయన సొంత ఊరు.. విశాఖ జిల్లా రోలుగుంట మండలం బీబీపట్నం. రత్నంపేటలో జరిగిన సభలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పార్టీ కండువా వేసి సిద్ధూను ఆహ్వానించారు. ఈ సందర్భంగా నటుడు సిద్ధూ మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ గ్రామానికి వచ్చిన కరణం ధర్మశ్రీ బోరు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి ఎమ్మెల్యే అయిన వెంటనే నెరవేర్చారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం వైఎస్ జగన్ ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు. అంతేకాకుండా పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలుచేయడంలో ఆయనను మించిన సీఎం ఎవరూ ఉండరని, ఉండబోరని కొనియాడారు. (అవినీతిపై తిరుగులేని అస్త్రం) -
విశాఖ ఎమ్మెల్యేలతో విజయ సాయిరెడ్డి భేటీ
సాక్షి, విశాఖపట్నం: జిల్లా అభివృద్ధిపై రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి శుక్రవారం ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్లో ఉన్న వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా నాడు నేడుతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ రకంగా సమాయత్తం కావాలి అనే అంశంపై ఆయన ఎమ్మెల్యేలతో చర్చించారు. కొన్ని పనుల్లో అధికారుల అలసత్వం వల్ల జాప్యం జరుగుతోందన్న అంశాన్ని కూడా ఈ సమావేశంలో ఆయన లేవనేత్తారు. ఈ నేపథ్యంలో విశాఖ మన్యంలో పర్యాటక అభివృద్ధి అంశాలను అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ విజయసాయిరెడ్డికి వివరించారు. జొలాపుట్ నుంచి పాదువా వరకు జల మార్గంలో టూరిజం అభివృద్ధి చేయనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. (చదవండి: 'విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోంది') ఆనకాపళ్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. విశాఖ ఎమ్మెల్యేల్లో అధిష్టానంపై అసంతృప్తితో ఉందన్న ప్రచారంపై ఆయన మండిపడ్డారు. టీడీపీ నేతలు తమ ఉనికి కాపాడుకునేందుకే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అదే విధంగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందన్న ప్రచారంలో నిజం లేదని పేర్కొన్నారు. డీఆర్సి మీటింగ్లో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వ్యక్తం చేశారని టీడీపీకి అనుబంధంగా ఉన్న కొన్ని వార్త సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా నిన్న అమరావతి వెళ్లలేదని, సీఎం కార్యాలయంలో ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు. అయితే జిల్లా అభివృద్ధి పార్టీ కార్యకర్తల ప్రగతి అంశాలపై కూడా విజయసాయి రెడ్డి సుదీర్ఘ చర్చ జరిపారు. రానున్నకాలంలో జిల్లాల విస్తరణ నేపథ్యం కార్యకర్తలకు పదవుల కేటాయింపు అలాగే అభివృద్ధి అంశాలపై చర్చ కొనసాగినట్లు రాజ్యసభ సభ్యులు పేర్కొన్నారు. (చదవండి: ఆ ఘనత సీఎం జగన్కే దక్కుతుంది) -
కరణం వారి పెళ్లి సందడి
సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహ వేడుకకు నగరానికి శుక్రవారం విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విమానాశ్రయంలో రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు సీఎంకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులను సీఎం ఆప్యాయంగా పలకరించారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డుమార్గంలో బీచ్రోడ్డులోని కల్యాణ వేదిక పార్క్ హోటల్లో వివాహానికి సాయంత్రం 6.06 గంటలకు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి తిరిగి 6.50 విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో సీఎంకు ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి, కలెక్టర్ వినయ్చంద్, జీవీఎంసీ కమిషనర్ జి.సృజన, పోలీస్ కమిషనర్ మనీష్కుమార్ సిన్హా, విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి రంగారావు, ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు, జేసీ వేణుగోపాల్రెడ్డి వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి వెంట జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వల్లభనేని బాలశౌరి, సీఎం ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలసిల రఘురాం తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యేలు అదీప్రాజ్, ఉమాశంకర్ గణేష్లను పలకరిస్తున్న సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి, చిత్రంలో మంత్రి ముత్తంశెట్టి తరలివచ్చిన నేతలు విమానాశ్రయంలో సీఎంకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో నాయకులు తరలివచ్చారు. స్వాగతం పలికిన వారిలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్ గణేష్, గొల్ల బాబురావు, అన్నంరెడ్డి అదీప్రాజ్, వాసుపల్లి గణేష్కుమార్, జక్కంపూడి రాజా, పార్టీ అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు శరగడం చినఅప్పలనాయుడు, సమన్వయకర్తలు కె.కె రాజు, అక్కరమాని విజయనిర్మల, గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్, మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు, పార్టీ సీనియర్ నేతలు సీతంరాజు సుధాకర్, జాన్వెస్లీ, వరుదు కల్యాణి, తుల్లి చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. సీఎం వైఎస్ జగన్కు స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే ధర్మశ్రీ, చిత్రంలో ఎమ్మెల్యే అమర్నాథ్, తదితరులు వేదిక వద్ద సందడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకావడంతో వివాహ వేదిక వద్ద సందడి వాతావరణం నెలకొంది. వధూవరులు సుమ, చిన్నంనాయడుకు సీఎం పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేయగా.. వారు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎమ్మెల్యే ధర్మశ్రీ కుటుంబసభ్యులతో వేదికపైనే కాసేపు మాట్లాడిన సీఎం, వివాహానికి హాజరైన పార్టీ శ్రేణులందర్నీ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. మంత్రులు పాముల పుష్ప శ్రీవాణి, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, ఎంపీలు గొడ్డేటి మాధవి, బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నా«థ్, కె.భాగ్యలక్ష్మి, కన్నబాబురాజు, బొత్స అప్పలనర్సయ్య, సంబంగి వెంకటచిన అప్పలనాయుడు, చంద్రశేఖర్రెడ్డి, గొర్లె కిరణ్, కడుబండి శ్రీనివాసరావు, రాపాక వరప్రసాద్, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు సూర్య నారాయణ రాజు, కుంభా రవిబాబు, తిప్పల గురు మూర్తి రెడ్డి, కిల్లి కృపారాణి, పక్కి దివాకర్, తైనాల విజయ్కుమార్ తదితరులు వధూవరులను ఆశీర్వదించారు. -
ఎమ్మెల్యే ధర్మశ్రీ కుమార్తె వివాహానికి సీఎం జగన్
-
నూతన వధూవరులకు సీఎం జగన్ ఆశీర్వాదం
సాక్షి, విశాఖ: చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జరయ్యారు. నగరంలోని ది పార్క్ హోటల్లో జరిగిన ఈ వేడుకలో నూతన వధూవరులు సుమ-చిన్నం నాయుడును సీఎం జగన్ ఆశీర్వదించారు. ఈ వివాహానికి ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎంలు పుష్పశ్రీ వాణి, ధర్మాన కృష్ణదాస్, ఎంపీలు విజయసాయిరెడ్డి, మాధవి, బెల్లన చంద్రశేఖర్, బాలశౌరి, ఎంవీవీ సత్యనారాయణ, మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అవంతి శ్రీనివాసరావు, చెల్లుబోయిన వేణుగోపాల్, ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అదీప్ రాజ్, ఉమాశంకర్ గణేష్,గొల్ల బాబూరావు, సంబంగి చిన్న అప్పల నాయుడు, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, పలువురు వైఎస్సార్ సీపీ నేతలు హాజరయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి గన్నవరం తిరుగు ప్రయాణం అయ్యారు. (కుమార్తె వివాహానికి సీఎంను ఆహ్వానించిన ధర్మశ్రీ) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కుమార్తె వివాహానికి సీఎంను ఆహ్వానించిన ధర్మశ్రీ
సాక్షి, చోడవరం: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ శనివారం తాడేపల్లిలో కలిశారు. ఈనెల 30న విశాఖపట్నంలో జరగనున్న తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని సీఎంను ఎమ్మెల్యే ఆహ్వానించారు. వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. -
‘చంద్రబాబుకు ప్రేమలేదు.. అంతా డ్రామా’
సాక్షి, విశాఖపట్నం: దళితులపై చంద్రబాబుకు ప్రేమ లేదని.. ప్రేమ ఉన్నట్లు డ్రామా ఆడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దళిత యువకుడిపై దాడి ఘటనలో పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారని, 12 గంటల్లోనే దోషులను పట్టుకున్నారని తెలిపారు. చంద్రబాబు హయాంలో దళితులపై దాడులు జరిగితే ఎలాంటి చర్యల్లేవని.. దళితులపై టీడీపీ నేతలు దాడులు చేస్తే ఆయన ఎందుకు మాట్లాడలేదని ధర్మశ్రీ ప్రశ్నించారు. (చదవండి: బాబూ.. విశాఖపై ఎందుకు విషం?) ‘దళితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేస్తున్నారు. ఇళ్ల పట్టాలు ఇస్తుంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. కులాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని’’ ఆయన మండిపడ్డారు. తప్పు చేస్తే ఎంతటివారినైనా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తోందన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పనుల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించామని పేర్కొన్నారు. సీఎం జగన్ ఎప్పుడూ దళితుల పక్షానే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర లో చంద్రబాబు కులరాజకీయాలు చేస్తే సహించేది లేదని, బాధ్యతయుతమైన ప్రతిపక్ష నేత గా వ్యవహరించాలని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హితవు పలికారు.(చదవండి: చంద్రబాబు దళిత ద్రోహి: దళిత నేతలు) -
బాబూ.. విశాఖపై ఎందుకు విషం?
సాక్షి, అమరావతి: చంద్రబాబు రాజకీయ పార్టీ లీడరా.. లేక రియల్ ఎస్టేట్ బ్రోకరా.. అర్థం కావడం లేదని, అమరావతి ఉద్యమం అనేది పచ్చి బూటకమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. 250 రోజుల ఉద్యమం అని చెప్పుకుంటూ పది మందిని చూపుతూ ఉద్యమం అంటున్నారని ఎద్దేవా చేశారు. తన వాళ్ల భూములు కాపాడుకోవడానికే చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► జూమ్ బాబు అమరావతి కబుర్లు పచ్చి బూటకం. అమరావతి ఉద్యమం పేరుతో బాబు రోజుకొక డ్రామా ఆడుతున్నారు. లేనిది ఉన్నట్టుగా చూపిస్తూ అందరినీ మోసం చేస్తున్నారు. ► విశాఖ అంటే చంద్రబాబు ఎందుకు విషం కక్కుతున్నారో అర్థం కావటం లేదు. వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. వైజాగ్ రాజధానిని అడ్డుకుంటే టీడీపీ నేతలు ద్రోహులుగా మిగిలిపోతారు. ► చంద్రబాబు చేయిస్తున్న జూమ్ ఉద్యమానికి సీపీఐ, సీపీఎం మద్దతు తెలుపుతూ కారల్ మార్క్స్ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. పేదలకు కూడు, గూడు, గుడ్డ ఇవ్వటం కమ్యూనిస్టు పార్టీల సిద్ధాంతం. కానీ రాష్ట్రంలో వారి తీరు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. చంద్రబాబు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అని పేరు మార్చుకుంటే సరి. ► దళితులపై ప్రేమ లేనందువల్లే రాజధానిలో దళితులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను బాబు అడ్డుకుంటున్నారు. ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బాబు.. రమేష్ ఆస్పత్రి వ్యవహారంలో ఎందుకు నోరు మెదపడం లేదు? ► మాకు అన్ని ప్రాంతాలు సమానమే. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది. న్యాయస్థానాలు అంటే మాకు గౌరవం ఉంది. ఏ విషయంలోనైనా అంతిమ విజయం మాదే. ► విశాఖ విషయంలో టీడీపీ ప్రజా ప్రతినిధులతో రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరాలి. ప్రజల మనోభావాలేంటో అప్పుడు బాబుకు అర్థం అవుతాయి. -
అమరావతి ఉద్యమం పచ్చి భూటకం
-
అమరావతి ఉద్యమం పచ్చి భూటకం
సాక్షి, తాడేపల్లి: అమరావతి ఉద్యమం అనేది పచ్చి భూటకమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. 250 రోజుల ఉద్యమం అని చెప్పుకుంటూ పది మందితో ఉద్యమం నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేయిస్తున్న జూమ్ ఉద్యమానికి లెఫ్ట్ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని విమర్శించారు. కారల్ మార్క్స్ సిద్ధాంతాలకు విరుద్ధంగా సీపీఐ, సీపీఐంలు వ్యవహరిస్తున్నాయన్నారు. కమ్యూనిస్టు పార్టీలు.. చంద్రబాబు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అని మార్చుకోవాలని హితవు పలికారు. అసలు లేని అమరావతి ఉద్యమాన్ని అంతర్జాతీయ ఉద్యమంగా ప్రచారం చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (చదవండి: ఉత్తరాంధ్ర ద్రోహులు చంద్రబాబు, రామోజీ) మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తావా? అని చంద్రబాబును నిలదీశారు. ఎందుకు విశాఖపట్నంపై విషం కక్కుతున్నావని మండిపడ్డారు. దళితులపై ప్రేమ ఉంటే రాజధానిలో దళితులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. వైజాగ్ రాజధానిని అడ్డుకుంటే టీడీపీ నేతలు ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలో చర్యలు తీసుకోమని డిమాండ్ చేసిన బాబు రమేష్ హాస్పిటల్ వ్యవహారంలో ఎందుకు నోరు మీదపడం లేదని ఎమ్మెల్యే కరణం ప్రశ్నించారు. (చదవండి: తప్పుడు ఆరోపణలు ఉపేక్షించం) -
మోదీపై అప్పుడు విమర్శలు.. ఇప్పుడు పొగడ్తలు
సాక్షి, విశాఖపట్నం: అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మోదీపై విమర్శలు చేసిన చంద్రబాబు.. అధికారం పోయిన తర్వాత పొగడ్తల వర్షం కురిపిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు. మంగళవారం విశాఖలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ► భార్యను ఏలుకోలేనోడు దేశాన్ని ఎలా ఏలుతాడని, రాజకీయాల్లో జూనియర్ అని, మోదీని ఓడిస్తానని చంద్రబాబు విసిరిన సవాల్ను గుర్తు చేశారు. ► తన ఐదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలను దగా చేసి, ఇప్పుడు ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నారని చెప్పడం విడ్డూరం. ► బాబు డ్రామాలే.. టీడీపీని కోమాలోకి తీసుకెళ్లాయి. ► విశాఖపై విషం చిమ్మితే చంద్రబాబుకి, ఆయన పార్టీకి పుట్టగతుల్లేకుండా చేస్తాం. మీ అనుకూల మీడియాలో చేస్తున్న విమర్శలను ఉత్తరాంధ్ర ప్రజలు గమనిస్తున్నారు. ► సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర సంక్షేమానికి రూ.59,425 కోట్ల కేటాయింపులు చేయడమే కాకుండా వాటిని ఖర్చు చేశారు. ► గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం సంక్షేమానికి రూ.90వేల కోట్లు కేటాయించి.. రూ.44,535 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. -
'చంద్రబాబును నమ్మితే రాజకీయ సమాధి ఖాయం'
సాక్షి, విశాఖపట్నం : విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడుకు అభ్యంతరమెందుకని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అభిప్రాయపడ్డారు. కొత్త రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం వచ్చే విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చుతో రాజధాని పూర్తవుతుంది. కేవలం 10వేల కోట్ల చొప్పున వెచ్చిస్తే అమరావతి, కర్నూల్, విశాఖలో రాజధానుల నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులని విశాఖ రాజధానిగా చంద్రబాబు వ్యతిరేకిస్తే ఉద్యమాలు తప్పవన్నారు. జూమ్ టీవీల్లో మాట్లాడితే ప్రజలు వినే పరిస్థితుల్లో లేరన్నారు. చంద్రబాబునాయుడు ఎన్ని అడ్డంకులు పెట్టినా విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు ఖాయమన్నారు. టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మితే వారి రాజకీయ సమాధి ఖాయమని ధర్మశ్రీ ఎద్దేవా చేశారు. -
ఓడిపోవడం వల్లనే పవన్కు ఉత్తరాంధ్రపై ద్వేషం
సాక్షి, విశాఖపట్నం: పవన్కల్యాణ్ రాజకీయాలకు పనికిరారని వైఎస్సార్సీపీ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. జనసేన పార్టీ ఎందుకు పెట్టారో తెలియని పరిస్థితిలో పవన్ ఉన్నారన్నారు. గాజువాక వుడా కాలనీలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తే మీకేంటి బాధ? గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసి పవన్ ఓడిపోవడంతో ఉత్తరాంధ్రపై ద్వేషం పెంచుకున్నారు. ► విశాఖ ప్రజలు ఛీదరించారని ఆ ప్రాంతం అభివృద్ధి కాకుండా అడ్డుపుల్ల వేసేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది. ► ప్రశ్నించడం కోసం అంటూ పార్టీ పెట్టి ఆరు నెలలకోసారి ఒక ప్రశ్న వేసి తర్వాత కనిపించని పవన్ మూడు రాజధానులు ఎలా ఇస్తారని ప్రశ్నించడం హాస్యాస్పదం. ► టీడీపీతో ఐదేళ్ల పాటు కాపురం చేసిన పవన్కు అమరావతి.. అప్పుడు భ్రమరావతిగా కనిపించలేదా? ► నిజమైన రాజకీయ నాయకుడు అయితే నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాటాలు చేయాలి ► భూస్థాపితం అయిన పార్టీల నాయకులు ఉనికిని చాటుకోవడం కోసమే పనికిరాని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. -
‘పవన్.. పార్ట్ టైం పొలిటీషియన్’
సాక్షి, విశాఖపట్నం: రాజధాని అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. పవన్.. పార్ట్ టైం పొలిటీషియన్గా ఉంటూ కేవలం చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్నారని విమర్శించారు. విశాఖ గాజువాక నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు విశాఖలో రాజధానిని వ్యతిరేకించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అమరావతిపై పవన్ కల్యాణ్ ఒక్కడికే ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని ఆరోపించారు. రామ్ గోపాల్ వర్మ, పవన్ కల్యాణ్పై సెటైర్లు వేస్తూ సినిమా తీస్తున్న నేపథ్యంలో.. ఆ బాధలో నిన్నటి వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నామని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరారు.. ఆయనకు రాష్ట్ర పరిస్థితులపై అవగాహన లేదని విమర్శించారు. మూడు రాజధానుల అంశాన్ని ప్రజలు స్వాగతిస్తుంటే పవన్ వ్యతిరేకించడం ఏంటన్నారు కరణం. (వర్మ ఆఫీస్పై జనసేన కార్యకర్తల దాడి) ఉత్తరాంధ్రలో పరిపాలనా రాజధాని వస్తే నీకేమి బాధ అని కరణం ధర్మశ్రీ, పవన్ని ప్రశ్నించారు. మూడు రాజదానులు రావు అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పాదంగా ఉన్నాయన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్పి.. ఒక్క సీటుకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. ఇంతా జరిగినా ఇంకా పవన్ కల్యాణ్లో మార్పు రాకపోవడం దురదృష్టకరం అన్నారు. పవన్ది జనసేన కాదు.. కళసేన అని తీవ్ర విమర్శలు చేశారు. మూడు రాజధానులు రావడం ఖాయమన్నారు. ఒక విధానం అంటూ లేకుండా ఆరునెలలుకు ఒకసారి బయటకు వచ్చి తప్పుడు ప్రచారాలు చేసి కనుమరుగవ్వడం పవన్ కల్యాణ్కు అలవాటన్నారు. ఈ విషయంలో ఉత్తరాంధ్ర ప్రజలు పవన్ కల్యాణ్కు తగిన బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రజల వద్దకే పాలన కోసం సచివాలయం... వాలంటీర్ల వ్యవస్థలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారని కరణం ధర్మశ్రీ తెలిపారు. (‘ఏమిటీ రాతలు.. ఎవరిది చెప్పింది’) అంతేకాక తన నియోజకవర్గంలో గోవాడ చక్కెర ఫ్యాక్టరీని, చెరుకు రైతులని సీఎం వైఎస్ జగన్ కాపాడారని కరణః ధర్మశ్రీ తెలిపారు. సీఎం రైతులకు, పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే విమర్శలు చేయడం తగదన్నారు. కరోనా వైరస్కు సంభంధించి ఏపీలో రోజుకు వేలల్లో టెస్ట్ చేస్తున్నారని.. దేశంలోనే కరోనా టెస్టులు చెయ్యడం, నియంత్రణ చర్యలు తీసుకోవడంలో ఏపీ ముందుందని ప్రశంసించారు. -
ఉత్తరాంధ్ర ద్రోహులు చంద్రబాబు, రామోజీ
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రకు సెక్రటేరియట్ వస్తుందంటే చంద్రబాబుతో పాటు రామోజీరావుకి కూడా నిద్ర పట్టడంలేదని, వీరిద్దరు చరిత్రలో ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. సోమవారం ఈనాడు పత్రికలో వచ్చిన వార్తను చూస్తే వారిద్దరి అక్కసు ప్రజలకు అర్థమవుతుందన్నారు. ఈ వార్తను టీడీపీ నేతలు మరో రెండు ఆంగ్లపత్రికల్లో కూడా తమ పలుకుబడి ఉపయోగించి ప్రచురింపజేశారని తెలిపారు. సోమవారం ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులో ముఖ్యాంశాలు.. ► ఎప్పుడో 1 కోటీ 60 లక్షల ఏళ్ల క్రితం తూర్పు గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు సముద్రంలో చీలిక ఏర్పడిందని, 68 లక్షల ఏళ్లకు పూర్వం నుంచి 30 లక్షల ఏళ్ల పూర్వం వరకు ఆ చీలికలో అలజడి ఉండేదని ఈనాడులో రాశారు. ► ఆ చీలిక వల్ల భవిష్యత్తులో ఉత్తరాంధ్రలో ఎప్పుడైనా భూకంపాలు రావచ్చునని ఎవరో ఓ ప్రొఫెసర్ను పట్టుకుని ఉద్దేశపూర్వకంగా చెప్పించారు. ► 30 లక్షల ఏళ్ల క్రితమే ఆగిన అలజడి, ఇప్పుడు చంద్రబాబు దిగిపోవటంతో మళ్లీ రామోజీలో రేగినట్లుంది. విశాఖ ఇమేజిని, ఉత్తరాంధ్ర ప్రాభవాన్ని దెబ్బతీయటానికి చంద్రబాబుతో కలిసి రామోజీ ఇంతలా దిగజారిపోతారా? -
‘ఏమిటీ రాతలు.. ఎవరిది చెప్పింది’
సాక్షి, విశాఖపట్నం: సోమవారం ఈనాడు పేపర్లో వచ్చిన ‘తీరంలో చీలిక’ వార్తపై ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీనిలో ఆయన ‘ఉత్తరాంధ్రకు సెక్రెటేరియట్ వస్తుందంటే, చంద్రబాబు నాయుడుతోపాటు రామోజీరావుగారికి కూడా నిద్ర పట్టటం లేదని ఈ రోజు ‘ఈనాడు’లో వచ్చిన వార్తను చూస్తే అర్థమవుతోంది. ఈ వార్తను తెలుగుదేశం నేతలు తమ పలుకుబడి ఉపయోగించి మరో రెండు ఆంగ్లపత్రికల్లో కూడా ప్రచురింపజేశారు. ఇంతకీ ఈ వార్తలో ఏముందంటే... ఎప్పుడో 1 కోటీ 60 లక్షల సంవత్సరాల క్రితం తూర్పు గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు 300 కిలోమీటర్ల మేర సముద్రంలో చీలిక ఏర్పడిందట. దాన్ని చూపించటానికి... ఓ పటం వేసి విశాఖపట్టణం అని రాశారు. 68 లక్షల సంవత్సరాల పూర్వం నుంచి 30 లక్షల సంవత్సరాల పూర్వం వరకు ఆ చీలికలో అలజడి ఉండేదట. ఇంతవరకూ మాత్రమే రాస్తే అది ఈనాడు ఎందుకవుతుంది’ అంటూ ఎద్దేవా చేశారు. ఏమిటీ రాతలు రామోజీరావుగారూ.. ‘అందుకే ఆ సముద్ర గర్భంలో చీలిక వల్ల భవిష్యత్తులో ఉత్తరాంధ్రలో ఎప్పుడైనా భూకంపాలు రావచ్చునని ఎవరో ఓ ప్రొఫెసర్ను పట్టుకుని చెప్పించారు. పనిలోపనిగా, అమరావతి ఒక్కచోటే రాజధాని ఉండాలని కూడా ఆ శాస్త్రవేత్తలతోనే చెప్పించి ఉంటే మరింత బాగుండేది. మొట్టమొదటగా మీరు పెట్టిన ఈనాడు విశాఖలోనే. మీ డాల్ఫిన్ హోటల్ విశాఖలోనే. మీ ఆస్తులు విశాఖలోనే. విశాఖకు ముప్పుందంటున్న మీరు మీ ఆస్తులన్నింటినీ ఖాళీ చేయించి మీ ఉద్యోగుల్ని ఇక్కడ నుంచి తక్షణం బయటకు తీసుకువెళ్ళిపోతారా. అసలు విశాఖకు ముప్పుందా.. ఎవరిది చెప్పింది’ అని ప్రశ్నించారు. అంతేకాక ‘మనకు ఆధారాలతో తెలిసిన మానవ చరిత్ర సింధు నాగరికత నుంచే కదా. అంటే కేవలం 6 వేల సంవత్సరాల నుంచే కదా. మరి 30 లక్షల సంవత్సరాల క్రితమే ఆగిపోయిన అలజడి... ఇప్పుడు చంద్రబాబు నాయుడు దిగిపోవటం వల్ల మళ్ళీ మీలో రేగిందా.. లేక... అమరావతిలో చంద్రబాబు కొనుగోలు చేసిన భూములమీద మీకు కూడా ప్రేమానురాగాలు పెరిగాయా’ అని ప్రశ్నించారు. (ఇంకా ఎందుకు నవ్వులపాలవుతారు?) అంతేకాక ‘విజయవాడలోనే సెక్రెటేరియట్, హైకోర్టు ఉంటే... హైదరాబాద్లో రామోజీ ఫిలింసిటీకి డిమాండ్ పడిపోకుండా ఉండాలన్నది మీ ఆలోచనలా ఉంది. విశాఖపట్టణం అభద్రం... మొత్తంగా తూర్పు గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు అంతా అభద్రం అనే వార్త రాసే ముందు అందులో నిజానిజాలతో సంబంధం లేకుండా ఎలా అచ్చువేస్తారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను భయపెట్టాలని ఎందుకు చూస్తున్నారు. మీ చంద్రబాబు ప్రయోజనాలు, మీ తెలుగుదేశం ప్రయోజనాలు తప్ప మీకు ప్రజా ప్రయోజనాలు పట్టవా. ఈస్ట్రన్ నేవెల్ కమాండ్ ఎక్కడ ఉంది.. విశాఖలోనే కదా. సబ్మెరైన్ బేస్ భారతదేశానికి ఎక్కడ ఉంది.. విశాఖలోనే కదా. అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేంద్రం విశాఖ. ఇది రాష్ట్రంలోనే అతి పెద్ద నగరం. విశాఖ ఇమేజిని, ఉత్తరాంధ్ర ప్రాభవాన్ని దెబ్బతీయటానికి చంద్రబాబుతో కలిసి ఇంతకు దిగజారతారా. దీన్ని జర్నలిజం అంటారా’ అంటూ ధర్మశ్రీ వరుస ప్రశ్నలు కురిపించారు. -
ధర్మశ్రీ చతురత!
చోడవరం: జిల్లాలో చోడవరం నియోజకవర్గం ఓ సంచలనం సృష్టించింది. గతంలో ఎప్పుడూలేని విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు జెడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేయడంలో సీనియర్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రదర్శించిన చతురుత ప్రత్యర్థి పార్టీ నాయకులకు దిమ్మతిరిగేలా చేసింది. గతంలో టీడీపీకి కంచుకోగా ఉన్న చోడవరం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయంతో సత్తా చూపిన వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికంగా ఏకగ్రీవ స్థానాలు దక్కించుకొని మరోసారి ప్రత్యర్థుల స్థానాల్లో పాగా వేసింది. నియోజకవర్గంలో నాలుగు జెడ్పీటీసీ, 77 ఎంపీటీసీ స్థానాలు ఉండగా చరిత్రలో ఎప్పుడూలేని విధంగా రోలుగుంట, రావికమతం మండలాల జెడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవంగా వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 11 ఎంపీటీసీ స్థానాలు కూడా ఏకగ్రీవం కాగా మరో 30 స్థానాలు టీడీపీ అభ్యర్థులు విత్డ్రా అయ్యేలా చేయడంలో ఎమ్మెల్యే ధర్మశ్రీ చేసిన ప్రయత్నం పార్టీ కేడర్లో నూతనుత్సాహాన్ని నింపింది. రోలుగుంట, రావికమతం జెడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఆయన పావులు కదిపి విజయం సా«ధించారు. రోలుగుంట జెడ్పీటీసీ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకోగా రావికమతం జెడ్పీటీసీ స్థానం టీడీపీ అభ్యర్థి విత్డ్రా అయ్యారు. జనసేన అభ్యర్థి విత్డ్రాకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ సమాయానికి ఆయన అందుబాటులో లేకపోవడంతో పోటీ కేవలం నామమాత్రంగానే మారింది. దీనితో జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఈ నియోజకవర్గంలో రెండు జెడ్పీటీసీలను వైఎస్సార్సీపీ దక్కించుకున్నట్టయ్యింది. ఇక చోడవరం, బుచ్చెయ్యపేట జెడ్పీటీసీ స్థానాలు కూడా ఆ పార్టీ దక్కించుకునేలా ధర్మశ్రీ చూపిన చొరవ ఆ పార్టీ విజయానికి చేరువ చేసినట్టుగా ఉంది. నాలుగు మండలాల్లో 80 శాతానికి పైగా ఎంపీటీసీ స్థానాలు దర్కించుకుని నాలుగు ఎంపీపీ స్థానాలు కూడా వైఎస్సార్సీపీ దక్కించుకునేలా ఎమ్మెల్యే ధర్మశ్రీ పావులు కదిపి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను సైతం తమకు అనుకూలంగా మార్చుకొని సత్తాచాటారు. ధర్మశ్రీ చొరవ వైఎస్సార్సీపీలో నూతనుత్తేజాన్ని నింపింది. స్థానిక ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేస్తామని ఎమ్మెల్యే ధర్మశ్రీ చెప్పారు. -
పింఛన్ కార్దులు పంపిణీ చేసిన ధర్మశ్రీ
-
‘బాబు విశాఖ ప్రజలపై విషం చిమ్ముతున్నారు’
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. జిల్లాలో మంత్రి అవంతి శ్రీనివాస్ నిర్వహించిన జీవీఎంసీ సమీక్షలో ఆయనతోపాటు ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కురసాల కన్నబాబు, భాగ్యలక్ష్మీ, గొల్ల బాబూరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. విశాఖ ప్రజలు చంద్రబాబుకి నాలుగు సీట్లు ఇస్తే ఆయన ప్రజలపై అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. ఒకే ప్రాంతంలో అభివృద్ది వల్ల ఇతర ప్రాంతాలకి నష్టమని చంద్రబాబు తీరువల్ల ప్రజలు నష్టపోయే పరిస్ధితి వచ్చిందని విమర్శిచారు. చంద్రబాబు తన స్ధాయి మరిచి విశాఖ, రాయలసీమపై కుట్రలు చేస్తున్నారని, పెద్దల సభలో టీడీపీ నుంచి ఎక్కవ మంది అవగాహన లేని వారే ఉన్నారు ఎద్దేవా చేశారు. కౌన్సుల్ రద్దు కాకుండా చంద్రబాబు బీజేపీ నేతలతో టచ్లో ఉండటం దారుణమన్నారు. చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలని, ఓట్లేసిన విశాఖ ప్రజలను చంద్రబాబు వెన్నుపోటు పోడుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మాటలకు మద్దతిస్తున్న విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఎమ్మెల్యేలు రోడ్లపైకి వస్తే ప్రజలు తన్నేలా ఉన్నారని, విశాఖపై కుట్రలు చేస్తున్న చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ: చంద్రబాబు విశాఖపై విషం చిమ్ముతున్నారన్నారు. ఉత్తరాంధ్రపై కుట్రలు పన్నుతున్న చంద్రబాబును ఈ ప్రాంతంలో అడుగుపెట్టనీయమన్నారు. విశాఖ సుందరమైన నగరం...దేశంలోనే విశాఖకు 9 వ స్ధానం ఉందని పేర్కొన్నారు. విశాఖ ప్రజలు చేసిన అన్యాయమేంటని, మిమ్మల్ని గెలిపించడమే విశాఖ ప్రజలు చేసిన శాపమా అని ప్రశ్నించారు. కాగా బీజేపీని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, అమిత్ షాను ఘోరాతి ఘోరంగా తిట్టిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామని .. రాజధాని భూములని రైతులకి తిరిగి ఇచ్చేస్తామని బీజేపీ మ్యానిఫెస్టోలోనే ఉందని తెలిపారు. వికేంద్రీకరణను బీజేపీ వ్యతిరేకిస్తే వారి మేనిఫెస్టోను వారే వ్యతిరేకించినట్లే అన్నారు. ఇక మార్చి నాటికి విశాఖకు పరిపాలనా రాజధాని వస్తుందనుకుంటున్నానని ఆయన అభిప్రాయపడ్డారు. వివిధ శాఖల అధికారులతో మంత్రి అవంతి సమీక్ష ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ: గతంలో విశాఖపై ప్రశంసలు కురిపించలేదా చంద్రబాబు అని ప్రశ్నించారు. ఇపుడు చంద్రబాబుకి విశాఖ ఎందుకు చేదుగా మారిందని, దురుద్దేశపూర్వకంగానే చంద్రబాబు విశాఖ పరిపాలన రాజధానిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. విశాఖ ప్రజలు చంద్రబాబుకి నాలుగు సీట్లు ఇస్తే మీరు ప్రజలకేం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రతిపక్షనాయకుడు కాదు...ఒక వర్గానికి మాత్రమే నేత అన్నారు. విశాఖలో నాలుగు సీట్లు ఇచ్చిన ప్రజలే చంద్రబాబు తీరును ఛీ కొడుతున్నారని, రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో చంద్రబాబుకి ప్రజలే తగిన బుద్ది చెబుతారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ: చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్దిని కుతంత్రాలతో అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకి రాజకీయ సమాధి కట్టేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్దంగా ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఆయన ఒక ప్రాంతానికే పరిమితమయ్యారన్నారు. చంద్రబాబును ఈ ప్రాంతంలో అడుగుపెట్టనివ్వమని, విశాఖ పరిపాలనా రాజధానిగా వచ్చేవరకు పోరాటం చేస్తామన్నారు. వెన్నుపోటు రాజకీయాలు, కుళ్లు, కుతంత్రాలు, కుట్రలు చంద్రబాబు నైజమని విమర్శించారు. ఆదరించిన ఉత్తరాంధ్రకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని, దమ్ముంటే 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజలలోకి వెళ్లామని ఆయన సవాలు విసిరారు. ఇక ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ: చంద్రబాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, వికేంద్రీకరణ అమలు జరిగితే రాష్ట్రం సువర్ణయుగంగా మారుతుందన్నారు. వికేంద్రీకరణబిల్లు అమలు ద్వారా ఏపీ దేశంలోనే అగ్రాగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఆరు నెలల సంక్షేమ పాల చూసి టీడీపీ నేతలు సైతం సీఎం జగన్కు జై కొడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు తీరుమారకుంటే 23 నుంచి 3కి తగ్గిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. -
వివిధ శాఖల అధికారులతో మంత్రి అవంతి సమీక్ష
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో నాణ్యతతో కూడిన అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని పర్యాటక శాఖ మంత్రి అవంతీ శ్రీనివాస్ అధికారులను అదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, వివిధ శాఖల జిల్లా అధికారులతో పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ వంటి పనులపై జీవీఎంసీ సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో రోడ్లు భవనాలు, తాగునీటి ప్రాజెక్టులు మొదలైనవి నిర్మించే క్రమంలో నాణ్యతను తప్పకుండా పాటించాలని అధికారులకు మంత్రి సూచించారు. ఆర్థిక సంవత్సరం పుర్తవుతున్నందున మంజురైనా అభివృద్ధి పనులన్నింటినీ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతంలోని 10 నియోజకవర్గాలకు సంబంధించి జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయా అధికారులతో, ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల వారిగా సమీక్షించారు. రోడ్లు, తాగునీటి పనులు, భవనాలు ఎన్ని మంజూరు అయ్యాయో, వాటిలో పూర్తి అయినవి, వివిధ దశల్లో ఉన్న నిర్మాణ పనుల వివరాలు, సమస్యలపై చర్చించారు. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాలను వెంటనే పూర్తి చేయాలనన్నారు. ప్రభుత్వ విప్ బూడి ముత్యాలు నాయుడు మాట్లాడుతూ.. నిర్మాణాలు చేసేటప్పుడు ఎక్కడైనా పొరపాటు జరిగితే వెంటనే సరి చేసుకోవాలన్నారు. నాణ్యతా లోపాలను గుర్తించినట్లయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హచ్చరించారు. ఇక జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ అధికారులు సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వివిధ శాఖల అధికారులతో సమన్వయంతో సంప్రదించి పనులు చేపట్లాలని సూచించారు. నియోజకవర్గ ఇంచార్జీలు, అధికారులు ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి అభివృద్ధి పనులను సమీక్షిస్తూ ఉండాలనిన్నారు. కాగా ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు యువీ సూర్యనారాయణ రాజు, కరణం ధర్మశ్రీ, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మీ జిల్లా పంచాయతీ అధికారి ఆర్ గోవిందరావుతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యానికి చంద్రబాబు తూట్లు పొడిచారు
-
‘చంద్రబాబు వాదనలో పస ఉంటే చర్చకు రావాలి’
సాక్షి, అమరావతి : ప్రజాస్వామ్య విలువలు పెంచే విధంగా శాసనసభలో చర్చాలకు రావాలని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సూచించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ శాసన సభ్యులు పరిపాలన వికేంద్రీకరణకు అనుకూలంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు వాదనలో పస ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. శాసన సభలో చర్చకు దూరంగా ఉండటం, శాసన సభ ఆమోదం తెలిపిన బిల్లులు అడ్డుకోవడం, జాప్యం చేయడంపై ధైర్యంగా చర్చకు రావాలని ప్రతిపక్షాన్ని డిమాండ్ చేశారు. నాడు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మాట్లాడిన మాటలు, దివంగత ఎన్టీఆర్, వెంకయ్య నాయుడు మాట్లాడిన మాటల గురించి చర్చించుకుందామన్నారు. ఆంగ్లభాషా బిల్లుపై చర్చకు రాకుండా కాలయాపన చేశారని, నేడు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి చంద్రబాబు తూట్లు పొడిచినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేయరని స్పష్టం చేశారు, సీఎం వైఎస్ జగన్ ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరిస్తారన్నారు. దేశంలోనే ఒక ముఖ్యమంత్రి కుమారుడు సొంతంగా పార్టీ పెట్టి సీఎంగా నిలిచిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందని ప్రశంసించారు. -
షరీఫ్కు చైర్మన్గా కొనసాగే అర్హత లేదు : డిప్యూటీ
సాక్షి, అమరావతి : శాసన మండలి చైర్మన్ అహ్మద్ షరీఫ్కు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని డిప్యూటీ సీఎం, మండలి సభా నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. తక్షణమే ఆ పదవికి రాజీనామ చెయ్యాలని డిమాండ్ చేశారు. విచక్షణాధికారం పేరుతో అసహ్యంగా వ్యవహరిచారని అసహనం వ్యక్తం చేశారు. బిల్లు సెలెక్ట్ కమిటీకి ఇంకా వెళ్లలేదని, చైర్మన్ మళ్లీ సభను నిర్వహించాలని అన్నారు. సెలెక్ట్ కమిటీకి పంపాలనన నిర్ణయంపూ ఓటింగ్ జరగకపోతే అది చెల్లదని, టీడీపీ నాయకులు సంకలు గుద్దు కోవడంలో అర్థం లేదన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడే అర్హత కోల్పోయాడని అన్నారు. ఆయనకు ప్రజాస్వామ్య విలువలు తెలియమని, చట్ట సభలను దారుణంగా అవమానించారని దుయ్యబట్టారు.(‘మండలి చైర్మన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు’) మండలి నిబంధనలను చైర్మన్ ఉల్లఘించారు శాసన మండలి చైర్మన్ క్షమించరాని నేరం చేశారని చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. సభను రాజ్యాంగానికి అనుగుణంగా నడపడం చేతకనప్పుడు రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేకశారు. విచక్షణాధికారాన్ని సభలో డోలాయమనం ఉన్నప్పుడు వాడాలని, అంతే కాని ఇలా నిబంధనలను అతిక్రమించడానికి విచక్షణను వాడకూడదని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని, మండలి నిబంధనలను మండలి చైర్మన్ ఉల్లఘించారని మండిపడ్డారు. అసలు సెలెక్ట్ కమిటీకి పంపడానికి ఆస్కారమే లేదని, టీడీపీ కార్యకర్తలా చైర్మన్ చంద్రబాబు ఆదేశాలను అమలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలెక్ట్ కమిటీని ప్రకటించాలని, సభ ఆమోదం పొందాలని తెలియకపోతే ఎలా అని శ్నించారు. ఒక్క నిమిషం కూడా చైర్మన్కి ఆ స్థానంలో ఉండే అర్హత లేదని అభిప్రాయపడ్డారు. చదవండి : సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ మండలికి కళంకం తీసుకు వచ్చారు శాసన మండలి వ్యవస్థను చైర్మన్ నీరు గార్చారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన మాట్లాడుతూ.. చట్ట విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి పంపించారని, శాసనమండలిలో నిన్న జరిగిన తీరు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని అభివర్ణించారు. మోషన్ మూవ్ చేయకుండానే సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపండం సరికాదని సూచించారు. ఇష్టం లేకుండానే సెలెక్ట్ కమిటీకి పంపామని చైర్మన్ చెప్పడం ప్రజాస్వామ్యానికి మచ్చ తేవడమే అని పేర్కొన్నారు. గ్యాలరీలో ఉన్న చంద్రబాబు ఆయన ఎమ్మెల్యేలు చైర్మన్ని తప్పుదోవ పట్టించి.. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛైర్మన్ చర్యను తీవ్రంగా ఖండింస్తున్నామన్నారు. -
‘టీడీపీ విన్యాసాలు సర్కస్లా ఉన్నాయి’
సాక్షి, అమరావతి: టీడీపీకి పబ్లిసిటీ కావాలి కానీ రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. శాసన మండలిలో టీడీపీ సభ్యులు దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసలు టీడీపీ సభ్యులు ఎందుకు ఆందోళన చేస్తున్నారో వారికే తెలియదని ఎద్దేవా చేశారు. టీడీపీకి స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్రంపై ప్రేమ లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు తీరు ఇలానే ఉంటే టీడీపీలో ఎవరూ మిగలరని హెచ్చరించారు. బినామీల కోసం బాబు ఆరాటం కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. టీడీపీ విన్యాసాలు సర్కస్ను తలపిస్తున్నాయన్నారు. బినామీల కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నాడని విమర్శించారు. ఎల్లో మీడియాతో చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి ఒకే ప్రాంతంలో కేంద్రీకరించవద్దని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అన్ని కమిటీలు కూడా వికేంద్రీకరణనే సూచించాయన్నారు. పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. రాజధాని రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని విధాలా న్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. వెనుకబాటు ప్రాంతాలపై సీఎం జగన్ దృష్టి సారించారన్నారు. చదవండి: స్పీకర్పై టీడీపీ ఎమ్మెల్యే దాడికి యత్నం -
బాబూ.. రేపు సాక్ష్యాలతో సహా మీడియా ముందుంచుతాం!
అమరావతి: రాజధాని పేరుతో చంద్రబాబు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని, ఆయనపై సుప్రీం కోర్టు, హైకోర్టు సుమోటో కేసు నమోదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ డిమాండ్ చేశారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ధర్మశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో అనేక మంది అమాయక రైతుల మాగాణి భూములను చంద్రబాబు తన సన్నిహితులకు, కోటరీకి ధారదత్తం చేశారు. రైతుల సొమ్మును నొక్కేశారు. ఇక్కడి రైతుల ఆవేదనను పట్టించుకోలేదు. భూ దందా విధానం హుందాగా వ్యవహరిస్తున్నట్లు బయటకు చెబుతూనే.. మరోపక్క లోకేష్, అప్పటి మంత్రులు యనమల, పత్తిపాటి, దూళిపాళ్ల నరేంద్ర, పయ్యవుల కేవశ్ ఇలా ఎంతో మందితో రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేయించారు. రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. చంద్రబాబు రాజ్యాంగ ప్రమాణాన్ని తుంగలో తొక్కారు. చదవండి: ఆ ఎమ్మెల్యేలు దున్నేశారు..! చదవండి: ‘ఆ వసూళ్లకు లెక్కలు లేవు.. ఇప్పుడు మరో జోలె’ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెబుతూ ప్రజలను మోసం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు మరోలాగా మాట్లాడుతున్నారు. రైతులను అడ్డం పెట్టుకొని చేస్తున్న నాటకాలు, బూటకాలు తేటతెల్లం చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబును యూటర్న్ పితామహుడని అందరూ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ హిట్లర్గా ఆయన పేరు సార్ధకం చేసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు విలువైన భూములు తీసుకొని కోట్లకు పడగలెత్తారు. ఇప్పుడేమో జోలె పట్టి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదంతా కూడా రాజకీయ లబ్ధి కోసమే. రాజధాని ప్రాంతంలోని అమాయక రైతులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ రోజు వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిపై సీబీఐ విచారణను డిమాండ్ చేయగా.. చంద్రబాబు సభలో బెదిరిస్తూ మాట్లాడారు. మా ప్రభుత్వం రాజధానిపై సీబీఐ విచారణ చేయిస్తుంది. ఇప్పటికే సీఐడీ కూడా రంగంలోకి దిగింది. ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిన చంద్రబాబుపై కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ సుమోటాగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన చంద్రబాబు రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడు. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సీఎంగా ఉంటూ కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్కు 14 ఎకరాలు ధారదత్తం చేశారు. 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 30 వరకు చంద్రబాబు ఎల్లో గ్యాంగ్ అమరావతి పేరుతో భూదందాకు పాల్పడింది. ఈ రోజు జోలె పట్టి చందాలు వసూలు చేస్తున్నారు. పక్షపాతం వచ్చినట్లు మాట్లాడితే మీకు శిక్ష పడక తప్పదు. మీ అవినీతిని ప్రజల ముందు ఉంచబోతున్నాం. నల్లధనాన్ని కప్పి పుచ్చుకునేందుకు భూములు తక్కువ రేట్లకు కొన్నట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అందరిపై కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. బినామీదారుల వివరాలు కూడా మీడియా ముందు పెడతాం. చంద్రబాబు హయాంలో షేర్ మార్కెట్లో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడితే రెండేళ్లు జైలు శిక్ష వేయాలన్నారు. ఆ రోజు రాజధాని పేరుతో కోట్లాది రూపాయాలు నొక్కేశారు. మిమ్మల్ని ఎన్నేళ్లు జైల్లో పెట్టాలో చెప్పాలి. సీఎం వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత భూదందాకు పాల్పడినట్లు రుజువు చేస్తే ఎలాంటి చర్యలకైనా తాను సిద్ధం. చదవండి: ఈలోగా ఇటు వాళ్లను అటు పంపిస్తాడు! రాజధాని ప్రాంతం రైతులు చంద్రబాబు హయాంలో బాగుపడింది లేదు. చంద్రబాబు మిమ్మల్ని అడ్డుపెట్టుకొని వ్యాపారం చేశారు. అన్ని ప్రాంతాలు వైఎస్సార్సీపీకి సమానమే. కృష్ణా, గుంటూరు జిల్లాలను కూడా ఈ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. జీఎన్ రావు, బోస్టర్ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ, హైపవర్ కమిటీల నివేదికల ఆధారంగా రాజధాని విషయంలో ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించాలి. రాజధాని రైతులు మోసం చేసిన చంద్రబాబుపై పోరాటం చేయాలి. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. గతంలో ఇచ్చిన దానికంటే మెరుగైన ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పటికే హైపవర్ కమిటీ రాజధాని రైతుల మనోభావాలను సీఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లింది. అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి జరగాలని, ఇక్కడ మూడు ప్రాంతాల్లో రాజధాని నిర్మాణాలు ఉండాలని, ఏ ప్రాంతం వివక్షకు గురికాకూడదని, గత ప్రభుత్వం మాదిరిగా అమాయకప్రజలను అడ్డుపెట్టుకొని మేం నాయకులుగా చలామణి అవ్వాలన్న ఆలోచన ఎప్పుడు కూడా మాకు ఉండదు. ఎందుకంటే వైయస్ జగన్ రైతు పక్షపాతి. రైతులకు మేలు చేయాలనే మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు చేసిన భూదందాల విషయంలో హైకోర్టు, సుప్రీం కోర్టు, కేంద్రం సుమోటోగా స్వీకరించాలి. చంద్రబాబు ఇకనైనా నాటకాలు ఆపేసి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు ఇప్పటికైనా మారాలి. రాజధాని ప్రాంతంలో జరిగిన అన్ని అంశాలను రేపు ఆధారాలతో సహా మీడియా ముందు ఉంచుతుంది. ఇప్పటికే సీఐడీ విచారణ పూర్తి చేసింది. ఇదే వివరాలను కోర్టు ముందు కూడా ఉంచుతాం. చదవండి: 'గుండు సున్నా దేనితో కలిసినా ఫలితం జీరోనే' -
‘బాబుకు పోయేకాలం దగ్గరపడింది’
సాక్షి, తాడేపల్లి: చోడవరం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత కరణం ధర్మశ్రీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ బాబుపై మండిపడ్డారు. జేఏసీ ముసుగులో చంద్రబాబు టీడీపీ నేతలతో ఉద్యమం చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాడేపల్లిలో ఎమ్మెల్యే ధర్మశ్రీ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబుకు పోయేకాలం దగ్గరపడిందన్నారు. జోలు పడితే జాలి వస్తుందని విన్యాసాలు చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అంటే బాబుకు ఎందుకంత కడుపు మంటని నిలదీశారు. చంద్రబాబు ఒక ఉన్మాదిలా ఉత్తరాంధ్రపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో బినామీ భూములు లేవని రాజధానిని వ్యతిరేకిస్తున్నారా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో ఉత్తరాంధ్ర బాబుకు అండగా నిలవలేదా అని ప్రశ్నించారు. ‘వైజాగ్ రాజధాని అయితే రాష్ట్రానికి ఆదాయంతో పాటు యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ముంబైతో సమానంగా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. రాయలసీమలో హైకోర్టు పెడితే నాలుగు జిరాక్స్ మిషన్లు వస్తాయని రాయలసీమ ప్రాంతాన్ని అవమాన పరుస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాజువాకలో ఓడిపోయాడు కాబట్టి ఉత్తరాంద్రపై విద్వేషం చూపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు వేర్వేరు కాదు. ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. గొప్పల కోసం అప్పులు చేసి అమరావతిలో గ్రాఫిక్స్ చూపించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడి ఉండటానికి కారణం చంద్రబాబే. బాబును తెలివిలేని వాడిగా ప్రజలు భావిస్తున్నారు. పరిపాలన అభివృద్ధి ద్వారా అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావిస్తున్నార’ని కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు. చదవండి: చంద్రబాబు గోబ్యాక్..! -
‘ఆ ఘనత ఏపీ సీఎం వైఎస్ జగన్దే’
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో ఉన్న నాలుగు చెక్కర ఫ్యాక్టరీల అభివృద్ధికి రూ. 100 కోట్ల గ్రాంటు మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కొనియాడారు. సీఎం జగన్ మరో ఎన్నికల హామిని నెరవేర్చారంటూ సంతోషం వ్యక్తం చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సహకార చక్కెర కర్మాగారాలను ఆదుకునేందుకు రూ. 200 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హయాంలో గోవాడ చెక్కెర ఫ్యాక్టరీ రూ.150 కోట్ల నష్టాల ఊబిలో ఉందని అన్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి రూ. 40.25కోట్లు మంజూరైందని, రెండు రోజుల్లో గోవాడ చెక్కర కర్మాగారం రైతులు, కార్మికులకు రూ. 18.28 కోట్లు చెల్లించనున్నట్లు తెలిపారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో రూ. 22 కోట్లతో డిస్టలరీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రూ. 47 కోట్లు గ్రాంటు రూపంలో ఇవ్వడం వల్ల రైతులకు, కార్మికులకు ఏంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ రైతు పక్షపాతి : బీశెట్టి సత్యవతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల పక్షపాతి అని అనకాపల్లి ఎంపీ బీశెట్టి సత్యవతి అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో చక్కెర ఫ్యాక్టరీలు మూలన పడ్డాయని ఆరోపించారు. సీఎం జగన్ రైతు బాంధవుడని కొనియాడారు. -
బాబు తీరు చూస్తుంటే పిచ్చిపట్టినట్లు ఉంది
-
ప్రాసలతో ఆకట్టుకున్న ధర్మశ్రీ
-
టోపీ పెట్టి.. బీపీ పెంచారు.. హ్యాపీగా ఉంచారా?
సాక్షి, అమరావతి: రైతు భరోసా పథకం ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు అండగా నిలిచారని, ఇది అద్భుతమైన పథకమని వైఎస్సార్సీపీ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. రైతు భరోసా పథకంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని అన్నారు. కౌలు రైతు చట్టం తీసుకువచ్చి వారి ప్రయోజనాలు కాపాడుతున్నామని చెప్పారు. ఆక్వా రైతులను కూడా ఆదుకున్న ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. తన ప్రసంగంలో ప్రాసలతో ఎమ్మెల్యే ధర్మశ్రీ సభ్యులను ఆకట్టుకున్నారు. ‘ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని ప్రకటించే పవిత్ర రూపం రైతు అని.. రాజు చేతిలోని ధర్మదండం కన్నా రైతు చేతిలోని నాగలి మిన్నా’ అని ఓ కవి చెప్పారని గుర్తు చేశారు. ధర్మశ్రీ ప్రసంగం సాగిందిలా.. ►ప్రపంచ నాగరికతకు మూలపురుషుడు వ్యవసాయదారుడు. కర్షకుడు సమాజంలో హర్షకుడు అవ్వాలని భవిష్యత్తులో రైతు విమర్శింపపడకూదని.. దేశానికి, భావి తరానికి నేతగా, అన్నదాతగా మారాలని, తలరాత మార్చాలన్న ఉద్దేశంతోనే రైతు భరోసా పథకానికి సీఎం జగన్ రూపకల్పన చేశారు. ►రైతే రాజుగా భావించిన మనసున్న మారాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని పేర్కొంటూ.. ‘అన్నదాతలే ఆయన ధ్యాస, శ్వాస, ఆశ, ఆకాంక్ష’ అన్నారు. ►రైతు భరోసాతో సీఎం జగన్.. ‘అన్నదాతకు అండగా, రైతునేస్తంకు కొండగా, ఆదుకోవాలని మెండుగా, జగనన్న నిలిచాడు తోడుగా, మన రాష్ట్ర రైతుకు నీడగా’ నిలిచారని ధర్మశ్రీ ప్రశంసించారు. ►చంద్రబాబు రుణమాఫీ అని చెప్పి టోపి పెట్టారని ఎద్దేవా చేస్తూ.. ‘మాఫీ అని చెప్పి, ఏపీ రైతులందరికీ టోపీ పెట్టి హ్యాపీగా పదవులు పొంది రైతులకు బీపీ పెంచారు తప్పా.. టీడీపీ హయాంలో ఏరోజైనా రైతులు హ్యాపీగా ఉన్నారా’ అంటూ ప్రశ్నించారు. ►కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఎంతోగానో ఉపయోగపడిందని చెబుతూ.. ‘కౌలు రైతులు సమాజంలో తిరిగాలని, మరింత ఎదగాలని, ఆర్థికంగా పెరగాలని, గౌరవంగా ఒదగాలని’ అన్నారు. సంబంధిత వార్తలు.. శవ రాజకీయాలు బాబుకు అలవాటే: సీఎం జగన్ చంద్రబాబుపై వంశీ ఆగ్రహం చంద్రబాబులా ప్రచారం చేసుకోలేదు ఆదాయం తగ్గుదలపై టీడీపీ తప్పుడు ప్రకటన వంశీ ప్రసంగిస్తే అంత ఉలుకెందుకు? -
‘హెరిటేజ్లో ధరలన్నీ అధికమే’
సాక్షి, అమరావతి: దేశమంతా ఉల్లి అధిక ధరలతో ఇబ్బంది పడుతున్నా.. మన రాష్ట్రంలో కేజీకి రూ. 25లకే అందిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. ఆయన సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. ప్రజలకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. ప్రభుత్వం రూ.150 నుంచి రూ. 200 వరకు ఉల్లిపాయలను కొనుగోలు చేసి ప్రజలకు కేవలం రూ. 25లకు అందిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కార్యాలయం నుంచి ప్రతిరోజు మార్కెటింగ్ శాఖ, ఎస్టేట్ అధికారులతో సమీక్షలు చేస్తున్నారని తెలిపారు. అధిక వర్షాభావం వలన ఉల్లిపాయల ఇబ్బందులు వచ్చాయని ధర్మశ్రీ వ్యాఖ్యానించారు. ఉల్లిని కావాలని స్టాక్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని ఆయన గుర్తుచేశారు. హెరిటేజ్లో ఉల్లిపాయల ధర రూ.200 ఉందని.. ప్రజలపై ప్రేమ ఉంటే హెరిటేజ్లో తక్కువ ధరకు ఉల్లిపాయలు ఎందుకు విక్రయించట్లేదని ప్రశ్నించారు. హెరిటేజ్లో నిత్యావసర వస్తువులు అన్నీ అధిక ధరలే.. మందు రేట్లు పెరిగితే మాత్రం చంద్రబాబు, లోకేష్కి భాదేస్తోందని ఎమ్మెల్యే ధర్మశ్రీ మండిపడ్డారు. అదే విధంగా హెరిటేజ్లో ఉల్లి అమ్మకాల ధరలకు సంబంధించిన ప్లకార్డులను కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మీడియాకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. హోదా కన్నా ప్యాకేజీనే ముద్దు అన్నది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాలుక ఎటుపడితే అటు మళ్లిస్తారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసుతో భయపడి పారిపోయింది చంద్రబాబు కాదా అని విమర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం తీరు చట్టవిరుద్ధంగా ఉందని ఎమ్మెల్యే మేరుగు నాగార్జున మండిపడ్డారు. -
విశాఖ ఉత్సవ్ బ్రోచర్లను విడుదల చేసిన మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్నం: దేశానికి ముంబై ఎంత ముఖ్యమో.. ఆంధ్రప్రదేశ్కు విశాఖపట్నం అంత ముఖ్య నగరమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం విశాఖపట్నంలో ఆయన, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు డిసెంబర్ 28, 29 తేదీలలో జరగనున్న‘విశాఖ ఉత్సవ్’ బ్రోచర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విశాఖ నగరానికి తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. అంతర్జాతీయంగా విశాఖ బ్రాండ్ ఇమేజ్ పేరిగేలా విశాఖ ఉత్సవాలను నిర్వహించబోతున్నామని తెలిపారు. టూరిజం ప్రమోషన్లలో భాగంగా ఈ ‘విశాఖ ఉత్సవ్’ను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి రోజుకు లక్షల మంది పర్యాటకులు రానున్నట్లు అంచనాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. అలాగే విశాఖ ఉత్సవాలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మెహరెడ్డిలు ముఖ్య అతిథులుగా హజరుకానున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ ఉత్సవాలలో స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కళాకారుల కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఆనందించే విధంగా ‘విశాఖ ఉత్సవ్’ను నిర్వహించబోతున్నట్లు తెలిపారు. అదేవిధంగా జనవరిలో కాకినాడ బీచ్ ఫెస్టివల్ను, నెల్లూరులో కైట్ ఫెస్టివల్ను నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కలెక్టర్ వినయ్చంద్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, తిప్పల నాగిరెడ్డి, యువి రమణమూర్తి రాజు, పోలీసు కమిషనర్ ఆర్కె మీనా తదితరుల పాల్గొన్నారు. -
పతనావస్థలో టీడీపీ : మల్లాది విష్ణు
సాక్షి, విశాఖపట్నం: హైందవ సాంప్రదాయాన్ని కాపాడే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. ఆదివారం చోడవరం మండలం వెంకన్న పాలెంలో జరిగిన బ్రాహ్మణ కార్తీక వన సమారాధనలో ఆయనతో పాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై కొన్ని దుష్టశక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అన్ని వర్గాలకు మేలు జరిగేవిధంగా సీఎం నిర్ణయాలు తీసుకుంటారన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయన మాట వినడం లేదు.. టీడీపీ నేతలు, కొన్ని పత్రికలు దిగజారి వ్యవహరిస్తున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కుల,మతాలతో సంబంధం లేకుండా ప్రజలందరూ 151 అసెంబ్లీ స్థానాల్లో గెలిపించి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు పూర్తికాక ముందే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం మొదలు పెట్టారని ధ్వజమెత్తారు. రాజకీయంగా ఎదుర్కొలేక చంద్రబాబు, పవన్కల్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, మత పరమైన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి రూ.500 కోట్లు బడ్జెట్ కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అన్నారు. టీడీపీలో సంక్షోభం ఏర్పడిందని.. చంద్రబాబుపై సొంత పార్టీ నాయకులే తిరగబడుతున్నారని వ్యాఖ్యానించారు. ఏపీలో టీడీపీ పతనావస్థకు చేరుకుందన్నారు. చంద్రబాబు దీక్ష చేస్తే 14 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారని, సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు మాట వినడం లేదని ఎద్దేవా చేశారు. -
‘గంజి లేని స్థితి నుంచి బెంజ్ కారు వరకు’
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ హయాంలో నాలుకతో కూడా ఇసుకను ఎత్తుకు పోయారని చోడవరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఎద్దేవా చేశారు. చోడవరం మండలం నర్సాపురం వద్ద ఇసు డిపోను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇసుక డిపోతో చోడవరంలో ఇసుక సమస్యలు తీరనున్నాయన్నారు. వర్షాకాలంలో వరదల వల్ల కొంత ఇసుక కొరత ఏర్పడిందని, ఇప్పడు ఆ సమస్య లేదని స్పష్టం చేశారు. ఇసుక విషయంలో ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధంతం చేస్తున్నాయని మండిపడ్డారు. టీడీపీ నాయకులు గంజి లేని స్థితి నుంచి ఇసుక అమ్మకం చేపట్టి బెంజ్ కార్లలో తిరుగుతున్నారని దుయ్యబట్టారు. అలాగే మద్యం అమ్మకాల సమయపాలన వల్ల రాష్ట్రంలో క్రైం రేటు తగ్గిందని తెలిపారు. తెలుగు భాష గురించి మాట్లాడే వ్యక్తులు వారి పిల్లలను మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఆర్డీఓ సీతారాం రాజు, గనులశాఖ ఏడీ తమ్మినాయుడు, ప్రత్యేక అధికారి అనిత పాల్గొన్నారు. -
చంద్రబాబు, లోకేష్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి
సాక్షి, విశాఖపట్నం: ఏపీ స్పీకర్ స్థానాన్ని అగౌరవపరుస్తూ, అప్రతిష్టపాలు చేసేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈపేపర్లో రాసిన రాతలకు సంబంధించి చంద్రబాబు, లోకేష్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ డిమాండ్ చేశారు. సోమవారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర బిడ్డ, బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్గా ఎన్నికైతే.. ఒక బలహీనవర్గానికి చెందిన వ్యక్తి ఆ కుర్చీలో కూర్చున్నాడన్నా అక్కసుతోనే చంద్రబాబు, లోకేష్లు ఇంత నీచానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అసభ్య పదజాలంతో స్పీకర్ను దూషించడం వారి కుల దురహంకారానికి అద్దం పడుతోందన్నారు. సీఎం వైఎస్ జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల తలరాతలు మార్చే నిర్ణయాలు తీసుకుంటుండటం వారికి మింగుడు పడటం లేదన్నారు. బీసీలను నీచంగా చూస్తూ.. అవాకులు, చవాకులు పేలితే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడొచి్చన 23 సీట్లు కూడా రావన్నారు. స్పీకర్పై చేసిన వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఇసుక మాఫియా డాన్ కవాతుకు ముఖ్య అతిథా ?
సాక్షి, విశాఖపట్నం: గత ఐదేళ్లలో ఇసుకను దోచుకుతిన్న టీడీపీతో కలిసి జనసేన లాంగ్మార్చ్ చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. లాంగ్మార్చ్తో పవన్కల్యాణ్, చంద్రబాబుల మధ్య బంధం బహిర్గతమైందన్నారు. శనివారం మద్దిలపాలెంలో గల పార్టీ నగర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన సుపుత్రుడు రాజకీయాలకు పనికిరాడని దత్తపుత్రుడైన పవన్కల్యాణ్తో ఫ్యాకేజీకి మాట్లాడి లాంగ్మార్చ్ చేయిస్తున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నుంచి వందల కోట్లు తీసుకుని గాజువాక, భీమవరాలలో పవన్కల్యాణ్ ఖర్చుపెట్టిన విషయం నిజం కాదా అని విమర్శించారు. కృష్ణానది పక్కన ఉన్న విజయవాడలో గానీ, గోదావరి పక్కన ఉన్న రాజమండ్రిలో గానీ పవన్కల్యాణ్ లాంగ్మార్చ్ పెట్టగలడా అని ప్రశ్నించారు.ఇది లాంగ్ మార్చ్కాదు, రాంగ్మార్చ్ అని విమర్శించారు. కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి ఎక్కువగా ఉందని, అందుకనే ఇసుక కొరత ఉందని ప్రజలందరికీ తెలుస న్నారు. సొంత బావ హరికృష్ణ శవం సాక్షిగా శవరాజకీయాలు చేసిన చరిత్ర చంద్రబాబుదని చెప్పారు. సమావేశంలో మట్లాడుతున్న చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్యాకేజీ కోసం చంద్రబాబు డైరెక్షన్లో పవన్ నటిస్తున్నాడని ఎద్దేవాచేశారు. రైతులు పల్లెల్లో సంతోషంగా ఉన్నారన్నారు. ఐదేళ్లలో టీడీపీ నేతలు ఇసుక దోపిడీచేస్తే పవన్కల్యాణ్ లాంగ్మార్చ్ కాదు కదా..షార్ట్ మార్చ్ కూడా చేయలేదని విమర్శించారు. మా ప్రభుత్వంలో రూ.4.90కే రవాణా చేస్తామంటే వారికే అనుమతిస్తున్నామన్నారు. సుమారు 267 రీచ్లు ఉంటే వరద కారణంగా కేవలం 67 రీచ్లలో మాత్రమే ఇసుక లభ్యమవుతోందని చెప్పారు. వరద ఉధృతి తగ్గిన తరువాత అక్రమాలకు తావులేకుండా పూర్తి స్థాయిలో ఇసుక అందిస్తామన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు, అతని డ్రామా ట్రూప్ అంతా కుటిల రాజకీయాలు మాని ప్రజల క్షేమం కోసం పనిచేయాలని కోరారు. ప్రభుత్వానికి సలహాలివ్వండి, వాటిని స్వీకరించి ..ప్రజల క్షేమం కోసం పనిచేద్దామన్నారు. కాదని అభివృద్ధికి అడ్డుపడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, సీనియర్నేత కొయ్య ప్రసాద్రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగేంద్ర, ముఖ్యనాయకులు మంత్రి రాజశేఖర్, సతీష్వర్మ తదితరులు పాల్గొన్నారు. సాక్షి, విశాఖపట్నం: సినిమాల్లో అనేక బ్యానర్లు, ప్రొడక్షన్లలో పనిచేసిన పవన్కల్యాణ్ రాజకీయాల్లో నారావారి ప్రొడక్షన్లో ప్యాకేజీలకోసం పనిచేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. శనివారం మద్దిలపాలెం నగరపార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నదులు ఏ విధంగా పొంగిపొర్లుతున్నాయో ప్రజలందరికీ తెలుసని, ఒక్క సీటు గెలిచిన పిల్లసేన పార్టీ ..23 సీట్లు గెలిచిన ఇంకుడు గుంతల పార్టీ అయిన టీడీపీతో కలిసి లాంగ్మార్చ్ చేస్తామనడం హాస్యస్పదంగా ఉందన్నారు. పవన్కల్యాణ్ సినిమాల్లో నటించడం ఎందుకు మానేశారో మొదట్లో ఎవరికీ అర్థం కాలేదని, సినిమాల్లో కన్నా చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలే ఎక్కువని మానేశారని ప్రజలకు ఇప్పుడు అర్థమైందన్నారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా ఇసుక కొరత ఏర్పడిందని, వరద ఉధృతి తగ్గిన తర్వాత ఆ సమస్యను అధిగమిస్తామన్నారు. వైఎస్ జగన్ సీఎం అయితే పేరు మార్చుకుంటానని పవన్కల్యాణ్ గత ఎన్నికల్లో ప్రగల్బాలు పలికాడని, మరి ఇప్పుడు నారా పవన్కల్యాణ్ అని ఎందుకు మార్చుకోలేదని విమర్శించారు. గాజువాకలో ఓటమి తర్వాత అక్కడి వారిని కలవని పవన్ ఇప్పుడు బాబు డైరెక్షన్లో హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన వైఖరి నచ్చకే విశాఖలో మాజీ మంత్రి బాలరాజు రాజీనామా చేశారన్నారు. ఇసుక మాఫియా డాన్ ముఖ్య అతిథా ? గత ఐదేళ్లలో ఇసుక దోపిడీ చేసిన అచ్చెన్నాయుడు టీడీపీ నుంచి లాంగ్మార్చ్కి ముఖ్య అతిథిగా పాల్గొంటుండడంపై ఆయన తీవ్రంగా విమరించారు. డ్రగ్ మాఫియా డాన్ అయ్యన్నపాత్రుడు, లిక్కర్ మాఫియా డాన్ వెలగపూడి రామకృష్ణబాబులను పక్కనపెట్టుకుని లాంగ్మార్చ్ చేస్తారా అని విమర్శించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వందరోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఉద్దానం సమస్యను పరిష్కరించడమే మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, సీనియర్నేత కొయ్య ప్రసాదరెడ్డి, అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, పేర్ల విజయచంద్ర, ముఖ్యనాయకులు మంత్రి రాజశేఖర్, పరూఖి, జీవీ కృష్ణారావు పాల్గొన్నారు. -
‘సొంత కొడుకు పనికిరాడనే.. అతనితో..’
సాక్షి, విశాఖపట్టణం : చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీతో జనసేన అధినేత పవన్కల్యాణ్ హడావుడి చేస్తున్నారని చోడవరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. జనసేన రేపు (ఆదివారం) విశాఖలో తలపెట్టిన లాంగ్మార్చ్ కార్యక్రమం నేపథ్యంలో పవన్ కల్యాణ్ను ఉద్దేశిస్తూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘నీ ఎన్నికల ఖర్చు కోసం చంద్రబాబు వద్ద వంద కోట్లు తీసుకుంది నిజం కాదా? ఆ డబ్బుతోనే నీవు భీమవరం, గాజువాకల్లో పోటీ చేయలేదా? ఇప్పుడు ఇసుక పేరుతో డ్రామాలాడుతున్నావు. గత ఐదేళ్లలో టీడీపీ నేతల దోపిడీ గురించి ఎందుకు లాంగ్మార్చ్ చేయలేదు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కరాల్లో అమాయకులు చనిపోతే లాంగ్మార్చ్ ఎందుకు చేయలేదు? చింతమనేని వనజాక్షిపై దాడి చేసినప్పుడు, కాల్ మనీ కేసులో ఆడవాళ్ల శీలం దోచుకున్నప్పుడు ఎందుకు లాంగ్ మార్చ్ చేయలేదు’అని ఎమెల్యే పవన్ను సూటిగా ప్రశ్నించారు. ‘గంజికి కూడా గతిలేని కొందరు టీడీపీ నాయకులు ఇసుక దోపిడీతో నేడు బెంజీ కార్లలో తిరుగుతున్నారు. వర్షాల వల్ల ఇసుక తవ్వలేని పరిస్థితులు తలెత్తితే మీకు కనపడటం లేదా? ఇసుక అక్రమ రవాణా అంటున్నారు, ఎక్కడ జరుగుతుందో నిరూపించాలి. చంద్రబాబు డైరెక్షన్లో నువ్ నటిస్తున్నావు. నీ వృత్తి అదే కదా. మీ మధ్య ఒప్పందాన్ని బయటపెట్టాలి. అందరినీ మోసం చేసిన చంద్రబాబును నువ్వు ఎలా నమ్ముతున్నావో అర్థం కావడం లేదు. సొంత పుత్రుడు పనికిరాడనే దత్తపుత్రుడివైన నిన్ను చంద్రబాబు ఉసిగొల్పుతున్నాడు. ఎక్కడినుంచో వచ్చి విశాఖ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తే ఇక్కడి ప్రజలు అమాయకులు కారు’ అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. -
చంద్రబాబు, పవన్ నాటకాలాడుతున్నరు
-
'తప్పుడు రాతలు రాస్తున్న వ్యక్తులను ఉపేక్షించం'
సాక్షి, విశాఖపట్నం : తప్పుడు రాతలు రాస్తున్న వ్యక్తులు ఎలాంటివారైనా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపడుతున్నఅభివృద్ధిని ఓర్వలేకే ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని ఆరోపించారు.విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పోలవరం టెండర్ల ద్వారా ప్రభుత్వం నిజాయితీ ప్రదర్శించిందని పేర్కొన్నారు. పోలవరంకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో నవయుగ కంపెనీ 4.8 శాతం ఎక్కువగా టెండర్లు వేసినట్లు నిపుణులు నిర్ధారించారు. ఈ ప్రాజెక్టు టెండర్లను మేఘా ఇంజనీరింగ్ సంస్థ రూ. 4359 కోట్లకు దక్కించుకోవడం ద్వారా ప్రభుత్వానికి డబ్బు ఆదా అవుతోంది. దీంతో 2020 కల్లా పోలవరం పనులు పూర్తి కానున్నట్లు తెలిపారు. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టును రూపొందించిన అనుభవం మెగా సంస్థకు ఉండడం కలిసొచ్చిన అంశమని వెల్లడించారు. పోలవరం పూర్తయితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
ప్రధాన నగరాలకు కనెక్టివిటి ఉండాలి
-
వారికి కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తర సయమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ.. పాతపట్నం పరిధిలోని గిరిజనులను ఆదుకోవాలని కోరారు. ఏనుగుల దాడి నుంచి గిరిజనులను రక్షించాలని విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్ల కాలంలో గిరిజనలు ఆదుకునే నాధుడే లేరని ఆరోపించారు. ఏనుగుల దాడిలో ఎంతో మంది గిరిజనులు చనిపోయారని, వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఏనుగులు గ్రామాలలోకి రాకుండా అడ్డుకట్ట వేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏనుగుల దాడిలో నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు కోరారు. సభ్యుల విజ్ఞప్తిపై మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి స్పందించారు. ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గతంలో జరిగిన పొరపాట్లను జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 11 మంది బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చామని వెల్లడించారు. ఏనుగుల దాడిలో నష్టపోయిన పంటకు పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. కాపులను చంద్రబాబు మోసం చేశారు కాపుల విషయంలో చంద్రబాబు నాయుడు కపట నాటకం ఆడారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు. రిజర్వేషన్లపై మంజునాథన్ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. కాపు ఉద్యమాన్ని పోలీసులతో ఏ విధంగా అణచివేశారో అందరికీ తెలుసన్నారు. కాపులను ఏ విధంగా బీసీలలో చేరుస్తారని కేంద్రం అడిగిన ప్రశ్నకు చంద్రబాబు జవాబు ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. వెన్నుపోటులో దిట్ట అయిన బాబు కాపులను కూడా అలాగే మోసం చేశారని ఆరోపించారు. కాపు సామాజిక వర్గ సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. -
చంద్రబాబును ప్రజలు క్షమించరు!
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిని ప్రజలు క్షమించబోరని వైఎస్సార్సీపీ సభ్యుడు చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు. శాశ్వత బీసీ కమిషన్ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల అభివృద్ధి బీసీ కమిషన్ బిల్లు తీసుకురావడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఈ బిల్లును అడ్డుకోవడం టీడీపీకి తగదని హితవు పలికారు. బీసీలకు జరిగే మేలును టీడీపీ వినలేకపోతున్నారని తప్పుబట్టారు. బలహీన వర్గాల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాటుపడ్డారని గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్తో అనేక మంది పేద విద్యార్థులు బాగుపడిన విషయాన్ని గుర్తు చేశారు. బీసీల పట్ల టీడీపీకి చిత్తశుద్ధి లేదన్నారు. మంజునాథ కమిషన్ చైర్మన్ను సైతం గౌరవించని మనస్తత్వం చంద్రబాబుదని వేణుగోపాల్ దుయ్యబట్టారు. ఐదేళ్లలో బీసీల కోసం టీడీపీ ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. బీసీల రక్షణ కోసమే బీసీ కమిషన్ బిల్లును తీసుకొచ్చినట్టు వేణుగోపాల్ స్పష్టం చేశారు. బీసీల రక్షణ కోసమే బీసీ కమిషన్ బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేని అంశాలను బీసీ కమిషన్ దృష్టికి తీసుకురావొచ్చునని పేర్కొన్నారు. టీడీపీకి ఆ ఆలోచన ఎందుకు రాలేదు? బీసీల అభ్యున్నతి కోసం సీఎం వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారని వైఎస్సార్సీపీ సభ్యుడు కరణం ధర్మశ్రీ స్పష్టం చేశారు. శాశ్వత బీసీ కమిషన్ను ఏర్పాటు చేయాలనే ఆలోచన టీడీపీకి ఎప్పుడైనా వచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. శాశ్వత బీసీ కమిషన్ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి టీడీపీ తూట్లు పొడిందని ధర్మశ్రీ ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం బీసీ కమిషన్ను ఏర్పాటు చేయడంతో అన్ని కులాలకూ ధైర్యం వచ్చిందని పేర్కొన్నారు. చంద్రబాబు బీసీలను నిర్లక్ష్యం చేశారని, దేశంలో మొదటిసారిగా శాశ్వత బీసీ కమిషన్ రాష్ట్రంలో ఏర్పాటయిందని అన్నారు. ఎన్నికల వస్తేనే చంద్రబాబుకు బీసీలు గుర్తుకువస్తారని పేర్కొన్నారు. బీసీల కోసం ఒక్క పథకమైనా చంద్రబాబు అమలు చేశారా? అని ప్రశ్నించారు. బీసీలంటే చంద్రబాబుకు ఎందుకంత కడుపుమంట అని నిలదీశారు. బలహీన వర్గాలు బలపడాలనేదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని, బీసీ కమిషన్ బిల్లును అందరూ కచ్చితంగా సమర్థించాలని పేర్కొన్నారు. -
సారూ.. మా నోట్లో మట్టి కొట్టొద్దు!
సాక్షి, రావికమతం(చోడవరం) : అప్పులు చేసి పెట్టుబడులు పెడితే ప్రకృతి సహకరించక పంటంతా నాశనం అయిపోయింది. ఆదుకుంటుందని ఆశలు పెట్టుకున్న గత ప్రభుత్వం హయాంలో నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు అనుమతులిచ్చి మా నోట మట్టి కొట్టిందని కళ్యాణపులోవ రిజర్వాయర్ ఆయకట్టు రైతులు కన్నీరు కారుస్తున్నారు. ఈ అనుమతులు తక్షణమే వెనక్కు తీసుకోవాలంటూ కళ్యాణపులోవ రిజర్వాయర్ల పరిరక్షణ కమిటీ ఆందోళనలు, పత్రికల్లో వస్తున్న కథనాలతో పాటు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో అన్ని శాఖల అధికారులతో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ క్రమంలో జెడ్.కొత్తపట్నంలో గురువారం జరిగిన సభకు ఇరిగేషన్ ఎస్ఈ సూర్యకుమార్, మైన్స్ ఏడీలు ప్రసాద్, వెంకట్రావు, నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు, అటవీశాఖ అధికారి శివప్రసాద్, పంచాయతీ అధికారి రమణయ్యల సమక్షంలో రైతుల అభిప్రాయాలు సేకరించారు. రైతులకు మేలు చేయడమే ప్రభుత్వ ధ్యేయమని నిర్భయంగా మీ అభిప్రాయాలు చెప్పొచ్చని భరోసా ఇవ్వడంతో గుండెల్లో ఆవేదనను ఇలా ఒక్కొక్కరిగా సభ ముందుంచారు. 5 వేల ఎకరాల్లో పంటలు నాశనం కళ్యాణపులోవ ప్రాంతంలో మైనింగ్ క్వారీ లారీలు భారీలోడ్లుతో నడవటం వల్ల ఇప్పటికే రోడ్లన్నీ పూర్తిగా గుంతలు పడ్డాయి. రోడ్డు బాగాలేక 108 రాలేని పరిస్థితి. 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 50 ఏళ్లలో రిజర్వాయర్ ఎండిపోయి 5 వేల ఎకరాల్లో పంటలు పండడం లేదు. కల్యాణపులోవ రిజర్వాయర్లో ఏటా రూ.25 లక్షల చేప పిల్లలు వేసి ఆ మత్స్య సంపద ద్వారా జీవనోపాధి పొందుతున్నాం. ఈ ఏడాది నారుపోతలు వద్దంటూ అధకారులు చాటింపులు వేస్తున్నారు. పంట లేకుంటే మేమెలా బతకాలి. టీడీపీ ప్రభుత్వం పుణ్యమా అని మా బతుకులు రోడ్డునపడ్డాయంటూ రైతులు, మత్స్యకారులు కన్నీరు కార్చారు. కల్యాణపులోవ రిజర్వాయర్ పరీవాహక ప్రాంతం సామాలమ్మ కొండపై పలు గ్రానైట్ కంపెనీలు విచ్చలవిడి మైనింగ్, పేలుళ్ల కారణంగా ఊట గెడ్డలు కనుమరుగైపోయాయి. రిజర్వాయర్ మనుగడకే ముప్పు మహారాష్ట్రలో ఇటీవలే ఒక రిజర్వాయర్ కట్ట తెగి పోయి మూడు ఊళ్లు కొట్టుకుపోయాయి. అధికారులు తేరుకోకపోతే ఇక్కడా అలాంటి ముప్పు రావచ్చు. -
‘కాపులను అన్ని విధాల ఆదుకుంటాం’
సాక్షి, అమరావతి : కాపు సామాజిక వర్గాన్ని తమ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతిమాటను నిలబెట్టుకుంటామని చెప్పారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. కాపులపై చంద్రబాబు నాయుడు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. 2014 ఎన్నికల ముందు కాపులకు ఏడాదికి రూ. వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పి.. ఐదేళ్లలో రూ.2వేల కోట్లు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. కాపులను బీసీలలో కలుపుతామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో అన్ని విధాల నష్టపోయిన కాపులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుదన్నారు. కాపులను సీఎం వైఎస్ జగన్ అన్ని విధాల ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. కాపు సామాజిక వర్గాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకై ఏడాదికి రూ. 2వేల కోట్లను బడ్జెట్లో కేటాయించామని గుర్తు చేశారు. ఇచ్చిన మాటాను నిలబెట్టుకునే వ్యక్తి సీఎం జగన్మోహన్రెడ్డి అని ప్రశంసించారు. కాపులకు బడ్జెట్లో పెద్దపీట వేశారు కాపు సామాజిక వర్గాన్ని ఆదుకునేందుకై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బడ్జెట్లో పెద్ద పీట వేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. కాపులను ఆర్థికంగా ఆదుకునేందుకు బడ్జెట్లో రూ. రెండు వేల కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల అవసరాలకోసం కాపులను వాడుకున్నారని ఆరోపించారు. కాపులకు చంద్రబాబు చేసిన మోసాన్ని ఆ సామాజికవర్గం ఎన్నడూ మర్చిపోలేదన్నారు. కాపులంతా జగన్ వెంటే ఉన్నారు మేనిఫెస్టో ప్రకారం వచ్చే ఐదేళ్లలో కాపులకు రూ. పదివేల కోట్లను సీఎం జగన్మోహన్రెడ్డి కేటాయిస్తారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన కాపులపై తప్పుడు కేసులు పెట్టించిన చంద్రబాబు.. ఇప్పుడు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. కాపులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు. కాపులమని చెప్పుకొని పార్టీ పెట్టిన నాయకులను కూడా ఆ సామాజిక వర్గం నమ్మలేదన్నారు. రాష్ట్రంలోని కాపులంతా సీఎం జగన్ వేంటే ఉన్నారని, వారందరికి ఆయన న్యాయం చేస్తారని ఎమ్మెల్యే కరణం అన్నారు. -
ఉత్సాహంగా ఎమ్మెల్యేల ప్రమాణం
సాక్షి,విశాఖపట్నం : నవ్యాంధ్ర రెండో శాసనసభ కొలువు తీరింది. బుధవారం నుంచి ప్రారంభమైన తొలి అసెంబ్లీ సమావేశాల్లో జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు స్పీకర్ ఫోడియం ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో నాలుగు స్థానాల్లో టీడీపీ సభ్యులు గెలుపొందగా.. మిగిలిన 11 స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. విజయకేతనం ఎగురవేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థుల్లో ఆరుగురు తొలిసారి సభలో అడుగుపెట్టగా..ఒకరు మూడోసారి అడుగుపెట్టారు. మిగిలిన నలుగురు రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేల్లో ఇరువురు నాలుగోసారి సభలో అడుగుపెట్టగా, మిగిలిన ఇరువురు మూడోసారి అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రతిపక్షనేత ఎన్.చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశాక, మంత్రులు, ఆ తర్వాత మహిళా ఎమ్మెల్యేలు, ఆపై అక్షర క్రమంలో మిగిలిన ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. తొలిసారి సభలో అడుగుపెట్టిన వైఎస్సార్సీపీకి చెందిన ఆరుగురు శాసనసభ్యులు తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. సభలో అడుగు పెట్టగానే తొలుత ముఖ్యమంత్రిని, ఆ తర్వాత మంత్రులను,సహచర ఎమ్మెల్యేలను పలుకరిస్తూ అసెంబ్లీ హాల్లోకి ప్రవేశించారు. వీరంతా తొలుత నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దగ్గరకు వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకుని, ఆ తర్వాత స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ఎలాంటి తడబాటు లేకుండా ప్రమాణం చేశారు. ప్రమాణం చేసే సమయంలో ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. సభలో తొలిసారి అడుగుపెట్టిన వారిలో నాగిరెడ్డి మినహా మిగిలిన వారంతా పిన్న వయస్కులే. ఇప్పటి వరకు బయట నుంచి చూసిన శాసనసభలో నేడు తాము సభ్యులు కావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వీరంతా తమ కుటుంబ సభ్యులతో సభకు చేరుకున్నారు. వారు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తుండగా విజిటర్స్గ్యాలరీ నుంచి చూస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఒకింత ఉద్విగ్నానికి గురయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం సభ ముగియగానే కుటుంబ సభ్యులతో ఆనందపరవశులయ్యారు. -
అవినీతిరహిత పాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తాం
-
గోవాడ రైతులను మోసం చేసిన ఎమ్మెల్యే
విశాఖపట్నం, చోడవరం : చెరకు రైతులను మోసపూరిత ప్రకటనలతో చోడవరం టీడీపీ ఎమ్మెల్యే మోసం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. ఫ్యాక్టరీ పర్సన్ఇన్చార్జి అయిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్ను కలిసి గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రైతులకు చెల్లించాల్సిన బకాయిలు, మొలాసిస్, ఫ్యాక్టరీలో ఇతర అవకతవకలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరినట్టు ధర్మశ్రీ చెప్పారు. చోడవరంలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. చెరకు రైతులకు గతేడాదికి సంబంధించి చెల్లించాల్సిన బకాయిలు రూ.200తో పాటు గ్రాంట్గా టన్నుకు రూ.300 తెచ్చి ఇస్తానని ఎమ్మెల్యే చెప్పి నేటికీ ఇవ్వలేదన్నారు. ఈనెల 5వతేదీనే పాతబకాయి టన్నుకు రూ.200 చెల్లిస్తామని ప్రకటన చేసిన ఎమ్మెల్యే ఇచ్చిన గడువు దాటిపోయినా రైతుల ఖాతాల్లోకి ఆ డబ్బులు జమకాలేదని ధర్మశ్రీ అన్నారు. ఈ ఏడాది క్రషింగ్కు ముందే బకాయిలు ఇస్తామని చెప్పారని, అది రైతులు నమ్మి ఇప్పుడు చెరకు సరఫరా చేస్తున్నారని, అయినా ఇచ్చిన గడువు దాటిపోయినా డబ్బులు మాత్రం ఇవ్వకపోవడంతో పెట్టుబడులకు మరింత అప్పులు తెచ్చి రైతులంతా అప్పులపాలవుతున్నారని అన్నారు. ప్రభుత్వం నుంచి పైసా కూడా గ్రాంటు తేలేని ఎమ్మెల్యే రైతులను మోసం చేసే ప్రకటనలు చేయడం మానుకుంటే మంచిదన్నారు. మొలాసిస్ అక్రమ నిల్వలను లెక్కల్లో చూపించకుండా అక్రమంగా అమ్మేయాలని చూశారని, దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు విన్నవించడం జరిగిందన్నారు. ఫ్యాక్టరీ నుంచి ఇవ్వాల్సిన టన్నుకు రూ.200 చొప్పున త్వరలోనే చెల్లిస్తామని కలెక్టర్ తెలిపారని ధర్మశ్రీ చెప్పారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు పల్లా నర్సింగరావు, పట్టణ అధ్యక్షుడు పుల్లేటి వెంకట్రావు, పీఎసీఎస్ అధ్యక్షుడు శానాపతి సత్యారావు, పార్టీ నాయకులు దండుపాటి సన్యాసిరావు, చవితిన బాబూరావు పాల్గొన్నారు. -
చోడవరంలో ఎడతెరిపి లేకుండా వర్షం
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. చోడవరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో అనకాపల్లిలో శారదా నదికి ఉధృతి పెరిగింది. అలాగే దానయ్య కోనేరు. బాలాజీ నగర్, ద్వారకానగర్ , కోఆపరేటివ్ కాలనీలో వర్షం పడుతుంది. దాదాపు 2 వేల ఎకరాల పంట నీటమునిగింది. సింహాద్రిపురం, రేబెల్లు, చిట్టాడ, సీఎస్ పేట... అంకుపాలెం, లక్ష్మీపురంలో చెరుకు, వరి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. చోడవరంలో వరద బాధితులను వైఎస్ఆర్ సీపీ నేత కరణం ధర్మశ్రీ పరామర్శించారు. -
'ముద్రగడను ఏకాకిని చేస్తే చూస్తూ ఊరుకోం'
విశాఖ: కాపు ఉద్యమనేత మాజీమంత్రి ముద్రగడ పద్మనాభంను ఏకాకిని చేస్తే ఊరుకోమని.. కాపు నేతలు తోట రాజీవ్, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. దమ్ముంటే టీడీపీ కాపు నేతలు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలన్నారు. సోమవారం విశాఖలో వీజేఎఫ్లో జిల్లా, నగర కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకూ చర్చలకు రాకపోవడం శోచనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయాలు పరాకాష్టకు చేరుతున్నాయని ధ్వజమెత్తారు. కాపులు పోరాటం చేస్తుంటే మీడియాపై ఆంక్షలు విధించారని విమర్శించారు. కాపులు ఉద్యమిస్తారనే భయంతో ప్రతిపక్షంపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. కాపు ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే టీడీపీ ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. -
రుణ మాఫీ కోసం ఉద్యమించాలి
చోడవరం : రైతు, డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో మోసంచేసిన టీడీపీ ప్రభుత్వ విధానంపై పోరాటానికి సిద్ధం కావాలని వైఎస్సార్సీపీ చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పిలుపునిచ్చారు. ఇక్కడి జవహార్ క్లబ్లో నియోకవర్గం స్థాయి పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. నాలుగు మండలాల నుంచి పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. తొలుత వైఎస్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం గణపతిరాజు రాంబాబురాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు నాయకులు తమ సమస్యలను, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ధర్మశ్రీ మాట్లాడుతూ రుణమాఫీ అంటూ అధికారంలోకి వచ్చిన టీడీపీ దానిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులు, మహిళలకు న్యాయం కోసం ప్రతిపక్షపార్టీగా వైఎస్సార్సీపీ పోరాటానికి సిద్ధంగా ఉందన్నారు. ఈనెల 7న పీఏసీఎస్ అధ్యక్షులతో చోడవరంలో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించి ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. టీడీపీ దౌర్జన్యాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలకు ఎటువంటి ఆపదవచ్చినా అండగా ఉంటానని ప్రకటించారు. ప్రజాసమస్యలపై అసెంబ్లీలో గళమెత్తుతున్న వైఎస్ జగన్మోహనరెడ్డి గొంతునొక్కేందుకు టీడీపీ యత్నించడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు వెంపలి ఆనందీశ్వరరావు, నాగులాపల్లి రాంబాబు, పినబోయిన అప్పారావుయాదవ్, శెట్టి సత్యనారాయణ, కంచిపాటి జగన్నాథరావు, అప్పికొండ లింగబాబు, ఏడువాక సత్యారావు, అల్లం రామఅప్పారావు, తమరాన రమణ, పందల దేవ పాల్గొన్నారు. రైతులపై లాఠీఛార్జీ సీఎంకు తగదు అనకాపల్లి టౌన్ : బకాయిలు అడిగిన చెరకు రైతులపై లాఠీఛార్జి చేయించడం సీఎం చంద్రబాబుకు తగదని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ. బాలకృష్ణ, ఉపాధ్యక్షుడు పెంటకోట జగన్నాథంలు మండిపడ్డారు. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విజయనగరం జిల్లా సీతానగరంలోని ఎన్సీఎస్ చక్కెరమిల్లుకు గతేడాది చెరకు సరఫరా చేసిన రైతులకు యాజమాన్యం సుమారు రూ.25 కోట్లు బకాయి పడిందన్నారు. ఆరు నెలలుగా అన్నదాతలు ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. విసుగుచెందిన రైతులు మంగళవారం శాంతియుతంగా ఆందోళన చేస్తే సమస్య పరిష్కరించాల్సిందిపోయి పారిశ్రామిక వేత్తలకు తొత్తుగా వ్యవహరిస్తున్న సీఎం అమాయక రైతులపై లాఠీఛార్జి చేయించడం అమానుషమన్నారు. ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం కళ్లు తెరిచి రైతాంగ వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలన్నారు. ఇందుకు కారకులైన పోలీసు అధికారులపైనా, ఫ్యాక్టరీ యాజమాన్యంపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవో 181లోనూ లోపాలు తుమ్మపాల : రుణమాఫీ రైతులందరికీ వర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ. బాలకృష్ణ, జిల్లా కార్యదర్శి పి. జగన్నాథం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. సీఐటీయూ కార్యాలయంలో విలేకర్లతో మంగళవారం మాట్లాడారు. రుణమాఫీ కోసం జారీ చేసిన జీవో 181లో షరతుల వల్ల పలువురు రైతులు అనర్హులుగా మిగిలిపోతున్నారన్నారు. ఇందులోనూ సవరణలు చేపట్టాలన్నారు. పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ లేదా రుణ అర్హత కార్డు ఉంటేనే మాఫీ వర్తిస్తుందనే నిబంధనను తొలగించాలని, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్తో రుణమాఫీ ముడిపెట్టవద్దని, రైతు మిత్ర, జాయింట్ లయబిలిటీ గ్రూపులు, ఎల్ఈసీ ద్వారా తీసుకొనే రుణాలను కూడా పంట రుణాలుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. ఉద్యానవన పంటలకు, వ్యవసాయ అనుబంధమైన సన్న, చిన్నకారు రైతులకు ఇచ్చిన డెయిరీ, గొర్రెలు, మేకలు, కోళ్లు, చేపలు తదితరులపై ఇచ్చిన రుణాలను కూడా మాఫీ చేయాలని కోరారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన మళ్ల, ధర్మశ్రీ
హైదరాబాద్: ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయి. యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు నాయకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు. తాజాగా విశాఖపట్టణం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మళ్ల విజయ్ ప్రసాద్, మాడుగుల మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ... వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వీరిని జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇంకా పలువురు సీనియర్ నేతలు వైఎస్సార్ సీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. -
గంటా... ఓ ఊసరవెల్లి
ఆయన నిష్ర్కమణతో పార్టీకి పట్టిన చీడ వడిలింది ఆయన పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి డీసీసీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ అనకాపల్లి, న్యూస్లైన్: ‘గంటా శ్రీనివాసరావు ఓ ఊసరవెల్లి. స్వప్రయోజనాల కోసం పార్టీలు మారడం ఆయనకు రివాజు. అధికారమే పరమావధిగా రంగులు మార్చడం ఆయన నైజం. రాష్ట్రంలోని ఏ జిల్లా వాడో కూడా స్పష్టంగా తెలియని గంటాను ప్రజలు అక్కున చేర్చుకుని ఆదరిస్తే వారినే మోసం చేసిన ఘనుడాయన. ఇప్పటికైనా ప్రజలు అటువంటి నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి’ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ అన్నారు. శుక్రవారం అనకాపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన గంటా తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గంటా కాంగ్రెస్ పార్టీని వీడడంతో పీడ విరగడైపోయిందన్నారు. సమైక్యాంధ్ర పేరుతో పదవి కోసం ప్రజల్ని గంటా మోసం చేశారని విమర్శించారు. ‘ఆయన ఏ రోజైనా ఉద్యమంలో పాల్గొన్నారా...నిరాహార దీక్ష చే శాడా... జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడైనా చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యా సం పుచ్చుకుంటా’ అని ధర్మశ్రీ సవాలు విసిరారు. ఇప్పటికైనా గంటా నైజాన్ని గుర్తించి జిల్లా ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలని, ఆయనను జిల్లా నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడిమిశెట్టి రాంజీ మాట్లాడుతూ పార్టీ నాయకులంతా సమైక్యంగా పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని కోరారు. సమావేశంలో నిమ్మదల సన్యాసిరావు, బి.ఎస్.ఎం.కె.జోగినాయుడు, గెంజి సత్యారావు, పంపాన సత్తిబాబు పాల్గొన్నారు. -
'గంటా శ్రీనివాసరావు రాజకీయ వ్యభిచారి'
విశాఖపట్టణం: గంటా శ్రీనివాసరావుపై డీసీసీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గంటా శ్రీనివాసరావు రాజకీయ వ్యభిచారి అంటూ మండిపడ్డారు. కులం పేరు చెప్పుకుని కులానికే ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. గంటా శ్రీనివాసరావు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారనే వార్తల నేపథ్యంలో ధర్మశ్రీ ఈ వ్యాఖ్యలు చేశారు. గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు. మార్చి 8న విశాఖలో జరిగే మహిళా ప్రజాగర్జన సందర్భంగా గంటా బృందం టీడీపీలో చేరతారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాస్, పంచకర్ల రమేశ్ బాబు, చింతలపూడి వెంకట్రామయ్య టీడీపీలోకి వెళ్లనున్నారు.