పీక్‌ స్టేజీకి చేరిన ప్రభుత్వ ప్రచార పిచ్చి | Netizens Fire On The Governments Campaign Madness Over Titli Cyclone | Sakshi
Sakshi News home page

పీక్‌ స్టేజీకి చేరిన ప్రభుత్వ ప్రచార పిచ్చి

Oct 17 2018 4:52 PM | Updated on Oct 17 2018 5:25 PM

Netizens Fire On The Governments Campaign Madness Over Titli Cyclone - Sakshi

రాజధానిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక హోర్డింగు

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో తిత్లీ బాధితులకు ప్రభుత్వం కొండంత అండ అంటూ పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేసి

అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రచార పిచ్చి పీక్‌ స్టేజీకి చేరింది. ఒకవైపు శ్రీకాకుళంలో ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని, ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తుపాను బాధితులు ఆందోళన చేస్తుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం తిత్లీ తుపాను బాధితుల సమస్యలు తీర్చేశామని ప్రచారం చేసుకుంటుంది. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో తిత్లీ బాధితులకు ప్రభుత్వం కొండంత అండ అంటూ పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆదాయాన్ని దుబారాగా ఖర్చు చేస్తోంది.

నాలుగు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా కవిటిలో చంద్రబాబును అడ్డుకుని నిరసన తెలిపిన తుపాను బాధితులు ఆందోళన చేస్తున్న ఫోటోను వెనక నుంచి తీసి చంద్రబాబుకు ప్రజలు అభివందనం చేస్తున్నట్లు ప్రభుత్వం హోర్డింగుల్లో చిత్రీకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement