
నాల్గో వికెట్ కోల్పోయిన ఆసీస్(139/4)
సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్టులో ఆసీస్ వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆసీస్ 139 పరుగుల వద్ద నాల్గో వికెట్ ను కోల్పోయింది. షాన్ మార్ష్ (1) పరుగు మాత్రమే చేసి నాల్గో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్ 240 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
అంతకుముందు క్రిస్ రోజర్స్(56) పరుగులు చేసి మూడో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, బర్న్స్ లు జట్టు మరమ్మత్తులు చేపట్టారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ కు మూడు వికెట్లు దక్కగా, భువనేశ్వర్ కు ఒక వికెట్ దక్కింది.