
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ డేర్డెవిల్స్ 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రిషబ్ పంత్(64;44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), విజయ్ శంకర్(43 నాటౌట్; 30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు)ల మెరుపులకు తోడు మ్యాక్స్వెల్(22) ఫర్వాలేదనిపించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ 38 పరుగులకే ఓపెనర్లు పృథ్వీషా(12), మ్యాక్స్వెల్ వికెట్లను కోల్పోయింది. మరో 27 పరుగుల వ్యవధిలో శ్రేయస్ అయ్యర్(6) కూడా నిష్క్రమించడంతో ఢిల్లీ 75 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో రిషబ్ పంత్- విజయ్ శంకర్ల జోడి ఇన్నింగ్స్ను చక్కదిద్దింది. ఈ జోడి 64 పరుగులు జత చేసిన తర్వాత రిషబ్ నాల్గో వికెట్గా ఔటయ్యాడు. అటు తర్వాత శంకర్-అభిషేక్ శర్మ(15 నాటౌట్;10 బంతుల్లో 1 సిక్స్)లు సమయోచితంగా ఆడటంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ముంబై బౌలర్లలో కృనాల్ పాండ్యా, బూమ్రా, మయాంక్ మార్కండేలు తలో వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment