
బులవాయో: లెగ్ స్పిన్నర్ దేవేంద్ర బిషూ (5/79) ధాటికి జింబాబ్వే జట్టు విలవిల్లాడింది. వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే కుప్పకూలింది. మసకద్జా (42; 4 ఫోర్లు, 1 సిక్స్), ఎర్విన్ (39; 5 ఫోర్లు) మాత్రమే రాణించారు. రెండో రోజు ఆటముగిసే సమయానికి వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. బ్రాత్వైట్ (38 బ్యాటింగ్), హోప్ (32 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం విండీస్ 148 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment