జింఖానా, న్యూస్లైన్: ఏస్ కనెక్ట్ వాలీబాల్ టోర్నీ ఫైనల్స్లో ఇన్ఫోసిస్ జట్టు విజేతగా నిలిచింది. ఐఎంటీ హైదరాబాద్ నిర్వహించిన ఈ టోర్నీలో ఇన్ఫోసిస్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, క్వాల్కమ్, అమెజాన్ డాట్ కామ్ కంపెనీలు పాల్గొన్నాయి.
శనివారం జరిగిన ఫైనల్స్లో ఇన్ఫోసిస్ 25-22, 25-21తో ఆతిథ్య ఐఎంటీ జట్టుపై గెలుపు దక్కించుకుంది. తుది పోరులో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే చివరి నిమిషంలో ఇన్ఫోసిస్ జట్టు ఆటగాళ్లు చాకచక్యంగా వ్యవహరించి జట్టుకు విజయాన్ని అందించారు.
వాలీబాల్ టోర్నీ విజేత ఇన్ఫోసిస్
Published Sun, Dec 22 2013 11:32 PM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM
Advertisement
Advertisement