అండర్‌-19 స్టార్‌ శుబ్‌మన్‌ దూరం | Kolkata Knight Riders Won The Toss And Elected To Field | Sakshi
Sakshi News home page

Published Wed, May 9 2018 7:48 PM | Last Updated on Wed, May 9 2018 7:48 PM

Kolkata Knight Riders Won The Toss And Elected To Field - Sakshi

కోల్‌కతా : ఐపీఎల్‌-11 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ప్లే ఆఫ్‌లో నిలవాలంటే ఇరుజట్లకు ఈ మ్యాచ్‌ కీలకం. ఇప్పటికే 10 మ్యాచ్‌లు ఆడిన ఇరుజట్లలో కోల్‌కతా ఐదు గెలవగా.. ముంబై నాలుగు గెలిచింది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో ముంబై పై చేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి ప్లే ఆఫ్‌ మార్గాన్నిసుగుమం చేసుకోవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.

గత మ్యాచ్‌ గెలిచిన ఉత్సాహంతో ఉన్న ముంబై ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతుంది. ఇక కోల్‌కతాలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. గాయంతో అండర్‌-19 స్టార్‌ శుబ్‌మన్‌ గిల్‌ దూరమయ్యాడు. అతని స్థానంలో రింకూ సింగ్‌ రాగా.. మిచెల్‌ జాన్సన్‌ స్థానంలో టామ్‌ కుర్రాన్‌ వచ్చాడు.

తుదిజట్లు
కోల్‌కతా :
దినేశ్‌ కార్తీక్‌(కెప్టెన్‌), క్రిస్‌ లిన్‌, సునీల్‌ నరైన్‌, రాబిన్‌ ఉతప్ప, నితీష్‌ రాణా, రింకూ సింగ్‌, అండ్రీ రస్సెల్‌, పియూష్‌ చావ్లా, టామ్‌ కుర్రాన్‌, ప్రసీద్‌ కృష్ణ, కుల్దీప్‌ యాదవ్‌

ముంబై : రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), ఎవిన్‌ లూయిస్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, జేపీ డుమినీ, ఇషాన్‌ కిషాన్‌, బెన్‌ కట్టింగ్‌, మిచెల్‌ మెక్‌గ్లాన్‌, జస్ప్రిత్‌ బుమ్రా, మయాంక్‌ మార్కండే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement