breaking news
Shubman Gill
-
తప్పుడు వ్యక్తులతో స్నేహం.. అప్పుడు అతడు తప్ప ఎవరూ మాట్లాడలేదు: పృథ్వీ షా
భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) గత రెండేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు.. ఆటలో సచిన్ టెండుల్కర్ వారసుడిగా పేరొందిన ఈ ముంబైకర్ ఇప్పుడు అవకాశాల కోసం పాకులాడాల్సిన పరిస్థితి. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్ లేమి కారణంగా కెరీర్ పరంగా ఎంతో వెనుకబడిపోయాడు పృథ్వీ.గిల్ ఏకంగా టీమిండియా సారథి అయితే..అండర్-19 జట్టు కెప్టెన్గా భారత్కు ప్రపంచకప్ అందించిన పృథ్వీ షా సారథ్యంలో ఆడిన శుబ్మన్ గిల్ (Shubman Gill) ఏకంగా టీమిండియా కెప్టెన్ అయితే.. ఇతడు మాత్రం దేశవాళీ జట్టులోనూ చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఇక ఐపీఎల్-2025 మెగా వేలంలో ఒక్క ఫ్రాంఛైజీ కూడా కనీస ధర రూ. 75 లక్షల ధరకు పృథ్వీని కొనుగోలు చేయకపోవడం అతడి పరిస్థితికి అద్దం పడుతోంది.ఈ నేపథ్యంలో పృథ్వీ షా ఇటీవలే ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశీ క్రికెట్లో ముంబై జట్టును వీడాలని నిర్ణయించుకోగా.. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఇందుకు అంగీకరించింది. ఇక వచ్చే సీజన్లో కొత్త ప్రయాణం మొదలుపెట్టనున్న పృథ్వీ షా తాజాగా న్యూస్24కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలు పంచుకున్నాడు.పంత్ తప్ప ఎవరూ మాట్లాడలేదు.. సచిన్ సర్కు తెలుసుతాను కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్నపుడు ఒక్క ‘బిగ్ క్రికెటర్’ కూడా తనకు అండగా నిలవలేదని పృథ్వీ చెప్పాడు. టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) తప్ప ఎవరూ తనతో కనీసం మాట్లాడలేదని తెలిపాడు. ‘‘సచిన్ టెండుల్కర్కు నాకు సమస్యలు తెలుసు.అర్జున్ టెండుల్కర్తో పాటు నేను క్రికెటర్గా ఎదగడం ఆయన చూశారు. ఓసారి వారి ఇంటికి కూడా వెళ్లాను. అయితే, నేను కెరీర్ పరంగా చిక్కుల్లో ఉన్నపుడు రిషభ్ పంత్ తప్ప ఒక్కరూ పలకరించలేదు’’ అని పృథ్వీ షా వెల్లడించాడు.అదే విధంగా ఆటపై దృష్టి పెట్టలేకపోవడానికి గల కారణాల్ని వివరిస్తూ.. ‘‘నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు. బయటి నుంచి చూసే వాళ్లకు ఇది అర్థం కాకపోవచ్చు. జీవితంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా.తప్పుడు వ్యక్తులతో స్నేహంఅందుకే ఆటకు ఎక్కువ సమయం కేటాయించలేకపోయా. నిజానికి నేను గంటల కొద్దీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని. కనీసం మూడు నాలుగు గంటలు నెట్స్లో గడిపేవాడిని. రోజులో సగం సమయం అక్కడే గడిపేవాడిని. కానీ ఆ తర్వాత ఆట నుంచి నా దృష్టి మరలింది.తర్వాత నాలో పశ్చాత్తాపం మొదలైంది. దేనికి ఎంత సమయం కేటాయించాలో ఓ అవగాహన వచ్చింది. తప్పుడు వ్యక్తులతో స్నేహం చేశాను. క్రికెటర్గా నేను ఉన్నత స్థితిలో ఉన్నపుడు వాళ్లు నా చెంత చేరారు. నన్ను చాలా చోట్లకు తిప్పారు.అప్పుడే నేను దారి తప్పాను. ఒకప్పుడు నెట్స్లో 8 గంటలకు పైగా ప్రాక్టీస్ చేసేవాడిని. ఇప్పుడు ఆ సమయం నాలుగు గంటలకు తగ్గింది’’ అని పృథ్వీ షా తన తప్పులను అంగీకరించాడు. ఇకపై ఆటపైనే దృష్టి కేంద్రీకరిస్తానని వెల్లడించాడు. కాగా వచ్చే డొమెస్టిక్ సీజన్లో పృథ్వీ మహారాష్ట్ర జట్టుకు ఆడే అవకాశం ఉంది.చదవండి: క్రికెట్ టీమ్ను కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్ -
ఆ రెండే కాదు.. మరో మూడు ఉన్నాయి.. గంభీర్పై పంత్ ఫ్యాన్స్ ఫైర్
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ తీరు (Gautam Gambhir)పై స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇంగ్లండ్తో తొలి టెస్టులో అద్భుత శతకాలు బాదిన ఆటగాడిని తక్కువ చేసినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలుకుతున్నారు. వేరే వాళ్లను ప్రశంసించడంలో తప్పులేదని.. కానీ అందుకోసం పంత్ గురించి అడిగిన ప్రశ్నకు ఇంతలా అసహనం వ్యక్తం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.విషయం ఏమిటంటే.. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar-Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఈ టూర్తో భారత టెస్టు జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన ప్రయాణం ఆరంభించాడు. ఇక ఈ సిరీస్లో భాగంగా ఇరుజట్ల మధ్య లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు జరిగింది.ఐదు శతకాలుఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా మూడు సెంచరీలు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101)తో పాటు కెప్టెన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) కూడా శతకాలతో అలరించారు.ఇక రెండో ఇన్నింగ్స్లో జైస్వాల్ (4), గిల్ (8) విఫలం కాగా.. మరో ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (137), పంత్ (118) సెంచరీలు బాది.. జట్టును ఆదుకున్నారు. వీరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ఇంగ్లండ్కు 371 పరుగుల లక్ష్యం విధించగలిగింది.అయితే, ఆఖరి రోజు వరకు ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు శతకాలు బాదినా టీమిండియాకు పరాభవమే మిగిలింది. ఫీల్డింగ్, బౌలర్ల వైఫల్యం కారణంగా ఓటమిని చవిచూసింది.ఆ రెండే కాదు.. మరో మూడు ఉన్నాయిఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం భారత జట్టు హెడ్కోచ్ గౌతం గంభీర్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. పంత్ ప్రదర్శన గురించి చెప్పాల్సిందిగా ఓ విలేకరి ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన గౌతీ.. ‘‘ఈ మ్యాచ్లో మనకు మరో మూడో సెంచరీలు కూడా ఉన్నాయి.అవి కూడా అతిపెద్ద సానుకూల అంశాలే. మీరు ఈ ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు. అయితే, యశస్వి బాదిన 100, కెప్టెన్గా అరంగేట్రంలోనే గిల్ చేసిన శతకం.. కేఎల్ రాహుల్ 100 గురించి కూడా మీరు ప్రస్తావించి ఉంటే ఇంకా సంతోషించేవాడిని.వీరు ఒక్కో సెంచరీ చేస్తే రిషభ్ పంత్ రెండు శతకాలు బాదాడు. ఒక్క టెస్టు మ్యాచ్లో ఐదు సెంచరీలు. నిజం చెప్పాలంటే.. ఇదొక గొప్ప ప్రదర్శన. ఏదేమైనా మీ ప్రశ్న ఇంకాస్త బెటర్గా ఉండాల్సింది’’ అని కౌంటర్ ఇచ్చాడు.అంత అసహనం ఎందుకు?ఈ మేరకు గంభీర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కాగా... పంత్ ఫ్యాన్స్ అతడిపై ఫైర్ అవుతున్నారు. ఈ మ్యాచ్ సందర్భంగా పంత్ సాధించిన రికార్డులను ప్రస్తావిస్తూ గౌతీని విమర్శిస్తున్నారు. కాగా ఒకే టెస్టు మ్యాచ్లో రెండు శతకాలు బాదిన రెండో వికెట్ కీపర్ బ్యాటర్గా పంత్ చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు ఆండీ ఫ్లవర్ ఈ ఘనత సాధించాడు.మరోవైపు.. ఇంగ్లండ్లో రెండు ఇన్నింగ్స్లోనూ శతక్కొట్టిన ఏడో భారత బ్యాటర్గా పంత్ నిలిచాడు. అయితే, టీమిండియా ఇంగ్లండ్ చేతిలో ఓడటంతో అతడి వీరోచిత ప్రదర్శన వృథాగా పోయింది. ఇరుజట్ల మధ్య జూలై 2- 6 వరకు బర్మింగ్హామ్ వేదికగా రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్𝘈 𝘚𝘰𝘯𝘨 𝘰𝘧 𝘐𝘤𝘦 & 𝘍𝘪𝘳𝘦 𝘢𝘵 𝘏𝘦𝘢𝘥𝘪𝘯𝘨𝘭𝘦𝘺.🔥❄️@klrahul set the foundation with a composed and elegant century while @RishabhPant17’s quickfire hundred electrified the crowd with an explosive display of fearless strokeplay! 🤩WATCH FULL HIGHLIGHTS OF DAY 4… pic.twitter.com/MQ13EvHIae— Star Sports (@StarSportsIndia) June 23, 2025 -
ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్
ఇంగ్లండ్తో టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీని టీమిండియా పరాజయంతో ప్రారంభించింది. లీడ్స్లో జరిగిన తొలి టెస్టు (Ind vs Eng 1st Test)లో ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు ఐదు సెంచరీలు సాధించినప్పటికీ భారత్కు చేదు అనుభవమే మిగిలింది.బ్యాటింగ్లో లోయర్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడం.. ఫీల్డర్ల బౌలర్ల వైఫల్యం తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో గిల్ సేన ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)మాత్రం జట్టుకు అండగా నిలిచాడు. ఏ ఒక్కరిని నిందించేందుకు తాను సిద్ధంగా లేనని.. గెలిచినా, ఓడినా ఆటగాళ్లంతా ఒక్కటిగా ఉంటారని పేర్కొన్నాడు.అంతా కలిసి కేవలం తొమ్మిది పరుగులేకాగా ఇంగ్లండ్తో తొలి టెస్టులో భారత లోయర్ ఆర్డర్ (8-11 స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చినవాళ్లు) అంతా కలిసి కేవలం తొమ్మిది పరుగులే చేసింది. ఈ విషయం గురించి ప్రస్తావన రాగా.. ‘‘కొన్నిసార్లు కొందరు విఫలమవుతారు. నిరాశ కలిగించే విషయమే అయినా మరేం పర్లేదు.అయితే, అందరి కంటే ఎక్కువ సదరు ఆటగాళ్లే ఎక్కువ నిరాశకు లోనవుతారు. ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని వారికి తెలుసు. ఒకవేళ మొదటి ఇన్నింగ్స్లో మేము 570- 580 పరుగులు చేసినట్లయితే మా ఆధిపత్యమే కొనసాగేది.ప్రతి ఒక్కరు నెట్స్లో తీవ్రంగా శ్రమించారు. అయితే, అన్నిసార్లూ అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోవచ్చు. స్పెషలిస్టు బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. అంతమాత్రాన ఏ ఒక్కరినో వేరు చేసి నిందించాల్సిన పనిలేదు.ఈ మ్యాచ్లో మేము గెలిచే సందర్భాలు కూడా ఎన్నో వచ్చాయి. కానీ దురదృష్టవశాత్తూ పని పూర్తి చేయలేకపోయాం. ఏదేమైనా గెలిచినా, ఓడినా ఒక్కటే. కలిస్తే గెలుస్తాం.. కలిసే ఓడిపోతాం’’ అని గంభీర్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాంఇక శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) గురించి ప్రశ్నించగా.. ‘‘అతడిని మేము స్పెషలిస్టు బౌలర్గా జట్టులోకి తీసుకోలేదు. బౌలింగ్ ఆల్రౌండర్గానే తీసుకున్నాం. కొన్నిసార్లు కెప్టెన్ నిర్ణయంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో శార్దూల్ రెండు వికెట్లు మాత్రమే తీశాడు. అదే విధంగా.. 1, 4 పరుగులు స్కోర్ చేశాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్ను టీమిండియా ఇంగ్లండ్తో సిరీస్తో మొదలుపెట్టింది. ఐదు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లిన భారత జట్టు.. హెడింగ్లీ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్లోనే ఓడిపోయింది. టీమిండియా టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఈ సిరీస్తో తన ప్రయాణం మొదలుపెట్టగా.. ఓటమి కారణంగా నిరాశే ఎదురైంది.ఇక ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్మన్ గిల్ (147), వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (134) సెంచరీలు బాదారు. ఇక రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (137)తో పాటు రిషభ్ పంత్ (118) శతక్కొట్టాడు.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు స్కోర్లుటీమిండియా: 471 & 364ఇంగ్లండ్: 465 & 373/5.చదవండి: వారి వల్లే ఓడిపోయాము.. అందుకు ఇంకా సమయం ఉంది: గిల్ -
వారి వల్లే ఓడిపోయాము.. అందుకు ఇంకా సమయం ఉంది: గిల్
టీమిండియా టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన ప్రయాణాన్ని ఓటమితో ఆరంభించాడు. టెండూల్కర్- అండర్సన్ ట్రోఫీ 2025లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. బ్యాటింగ్లో భారత జట్టు అద్భుతంగా రాణించినప్పటికి బౌలింగ్, ఫీల్డింగ్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచింది. మొదటి నాలుగు రోజుల ఆటలో ఇంగ్లండ్పై ఆధిపత్యం చెలాయించిన టీమిండియా.. ఆఖరి రోజు ఆటలో మాత్రం తేలిపోయింది. 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి ఊదిపడేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(149) భారీ సెంచరీతో కదం తొక్కగా.. జాక్ క్రాలీ(65), జో రూట్(53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, శార్ధూల్ ఠాకూర్ తలా రెండు వికెట్లు సాధించగా.. రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టాడు.ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ గిల్ స్పందించాడు. చెత్త ఫీల్డింగ్ కారణంగానే తాము ఓడిపోయామని గిల్ చెప్పుకొచ్చాడు."టెస్టు మ్యాచ్ అద్భుతంగా సాగింది. మాకూ మంచి అవకాశాలు వచ్చాయి. అయితే క్యాచ్లు వదిలేయడం, లోయర్ ఆర్డర్లో ఎక్కువ పరుగులు చేయలేకపోవడం ఓటమికి కారణాలు. నాలుగో రోజు కూడా కనీసం 430 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాలని అనుకున్నాం.అయితే 25 పరుగులకే చివర్లో వరుసగా వికెట్లు పడటంతో అది సాధ్యం కాలేదు. ఈ రోజు కూడా తొలి వికెట్ తీసిన తర్వాత మాకు మంచి అవకాశం ఉందనిపించింది. కానీ అది జరగలేదు. తొలి సెషన్లో మేం బాగానే బౌలింగ్ చేసి వారిని నియంత్రించగలిగినా ఒక్కసారి బంతి పాతబడిన తర్వాత ఏమీ చేయలేకపోయాం. అలాంటి స్థితిలోనూ వికెట్లు తీయడం అవసరం.జడేజా చాలా బాగా బౌలింగ్ చేసి మంచి అవకాశాలు సృష్టించాడు. మొదటి ఇన్నింగ్స్లో అనూహ్యంగా కుప్పకూలడంపై ఇప్పటికే చర్చించాం. ఈ తప్పును మేం మున్ముందు సరిదిద్దుకోవాలి. ఇలాంటి పిచ్పై అవకాశాలు అంత సులువుగా రావు.వాటిని వృథా చేసుకోవద్దు. అయితే మాది యువ జట్టు. నేర్చుకునే దశలో ఉంది. మరింత మెరుగువుతాం. బుమ్రా మిగిలిన టెస్టుల్లో ఏవి ఆడతాడో ఇప్పుడే చెప్పలేం. దానికి తగినంత సమయం ఉంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో గిల్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: టీమిండియా అత్యంత చెత్త రికార్డు.. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలోనే -
IND Vs ENG: టీమిండియా అత్యంత చెత్త రికార్డు.. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలోనే
ఇంగ్లండ్ పర్యటనను టీమిండియాతో ఓటమితో ఆరంభించింది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 5 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది. 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(149) భారీ శతకంతో చెలరేగగా.. జాక్ క్రాలీ(65), జో రూట్(53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.రెండో ఇన్నింగ్స్లోనూ భారత బౌలర్లు తేలిపోయారు. ప్రసిద్ద్ కృష్ణ, శార్ధూల్ ఠాకూర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా, జడేజా ఓ వికెట్ సాధించాడు. అయితే తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో సత్తాచాటిన జస్ప్రీత్ బుమ్రా.. రెండో ఇన్నింగ్స్లో ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు.అంతకుతోడు చెత్త ఫీల్డింగ్ కూడా టీమిండియా కొంపముంచింది. రెండో ఇన్నింగ్స్లు కలపి ఏడు క్యాచ్లను భారత ఫీల్డర్లు విడిచిపెట్టారు. అందులో నాలుగు క్యాచ్లు జైశ్వాల్ జారవిడిచినవే కావడం గమనార్హం. ఈ విజయంతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.టెస్టు క్రికెట్ హిస్టరీలోనే..ఇక ఈ ఓటమితో భారత్ అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఒక టెస్టులో ఐదు సెంచరీలు నమోదు చేసిన తర్వాత కూడా ఓటమి పాలైన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. 141 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఈ చెత్త ఫీట్ను నమోదు చేయలేదు.తాజా ఓటమితో టీమిండియా ఈ ఘోర ఆప్రతిష్టతను మూట కట్టుకుంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జూలై 2 నుంచి ఎడ్జ్ బాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్- తొలి టెస్టు సంక్షిప్త సమాచారం🏏షెడ్యూల్: జూన్ 20- 24🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్🏏టీమిండియా తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్🏏ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్🏏తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు ఆరు పరుగుల ఆధిక్యం🏏టీమిండియా రెండో ఇన్నింగ్స్: 364 ఆలౌట్🏏ఇంగ్లండ్ లక్ష్యం: 371🏏ఆఖరిదైన ఐదో రోజు ఆటలో భాగంగా 373 పరుగులు సాధించి లక్ష్యాన్ని ఛేదించిన స్టోక్స్ బృందం🏏ఫలితం: ఐదు వికెట్ల తేడాతో టీమిండియాపై ఇంగ్లండ్ విజయం -
Ind vs Eng: ఇంగ్లండ్తో తొలి టెస్టులో టీమిండియాకు తప్పని ఓటమి
Ind vs Eng 1st Test: ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. లీడ్స్ వేదికగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టు చేతిలో గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్కు వెళ్లింది. ఈ క్రమంలో హెడింగ్లీ మైదానంలో శుక్రవారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.తొలి ఇన్నింగ్స్లో మూడు శతకాలుబ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు కేఎల్ రాహుల్ (42), యశస్వి జైస్వాల్ (101) శుభారంభం అందించారు. జైసూతో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీతో చెలరేగారు. ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులకు ఆలౌట్ అయింది.ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ చెరో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ తలా ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆతిథ్య జట్టు.. 465 పరుగులు చేసింది.ఆరు పరుగుల ఆధిక్యంఓపెనర్ బెన్ డకెట్ (62) హాఫ్ సెంచరీతో మెరవగా.. వన్డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ సెంచరీ (106)తో ఆకట్టుకున్నాడు. ఇక మరో కీలక బ్యాటర్ హ్యారీ బ్రూక్ 99 పరుగులతో అదరగొట్టగా... మిగతా వాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ 40, టెయిలెండర్ క్రిస్ వోక్స్ 38 పరుగులతో రాణించారు.భారత బౌలర్లలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు కూల్చగా.. మిగిలిన పేసర్లలో ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో465 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకు ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.ఆదుకున్న రాహుల్, పంత్.. కానీఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన గిల్ సేన శుభారంభం అందుకోలేకపోయింది. ఈసారి ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) పూర్తిగా విఫలమయ్యాడు. నాలుగో నంబర్ బ్యాటర్, కెప్టెన్ గిల్ (8) కూడా నిరాశపరిచాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 30 పరుగులు చేశాడు.ఈ దశలో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (137), రిషభ్ పంత్ (118) శతకాలు సాధించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. అయితే, ఆ తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ (20) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. శార్దూల్ ఠాకూర్ (4), సిరాజ్ (0), బుమ్రా (0), ప్రసిద్ కృష్ణ (0) చేతులెత్తేశారు. రవీంద్ర జడేజా (25 నాటౌట్) కాసేపు ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో 96 ఓవర్లలో 364 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది.శతక్కొట్టిన డకెట్ఈ స్కోరుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆరు పరుగులు కలుపుకొని.. ఇంగ్లండ్ లక్ష్యాన్ని 371 పరుగులుగా నిర్దేశించింది గిల్ సేన. సోమవారం నాటి నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఈ క్రమంలో మంగళవారం ఓవర్ నైట్ స్కోరు 21/0తో ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్ ఆది నుంచే ఆధిపత్యం కనబరిచింది. తొలి సెషన్లో వికెట్ నష్టపోకుండా ఆడిన స్టోక్స్ బృందం.. ఆ తర్వాత వికెట్లు కోల్పోయినా టార్గెట్ను పూర్తి చేసింది.ఓపెనర్లలో జాక్ క్రాలే అర్ద శతకం (65) చేయగా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బెన్ డకెట్ అద్భుత శతకం (149)తో మెరిశాడు. ఓలీ పోప్ (8), హ్యారీ బ్రూక్ (0) విఫలమైనా.. జో రూట్ (53 నాటౌట్), జేమీ స్మిత్ (44 నాటౌట్) పని పూర్తి చేశారు. ఇక కెప్టెన్ స్టోక్స్ 33 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో జడేజా ఒక వికెట్ తీయగా.. ప్రసిద్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీశారు. కాగా, ఈ ఓటమితో కెప్టెన్గా గిల్కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్- తొలి టెస్టు🏏షెడ్యూల్: జూన్ 20- 24🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్🏏టీమిండియా తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్🏏ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్🏏తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు ఆరు పరుగుల ఆధిక్యం🏏టీమిండియా రెండో ఇన్నింగ్స్: 364 ఆలౌట్🏏ఇంగ్లండ్ లక్ష్యం: 371🏏ఆఖరిదైన ఐదో రోజు ఆటలో భాగంగా 373 పరుగులు సాధించి లక్ష్యాన్ని ఛేదించిన స్టోక్స్ బృందం🏏ఫలితం: ఐదు వికెట్ల తేడాతో టీమిండియాపై ఇంగ్లండ్ విజయం -
గిల్ అసంతృప్తి.. జడ్డూ చర్య వైరల్!.. ఆఖరికి మేమే గెలిచాం!
ఇంగ్లండ్తో తొలి టెస్టు (Ind vs Eng 1st Test)లో ఐదో రోజు తొలి సెషన్లో టీమిండియాకు కలిసిరాలేదు. లీడ్స్ (Leeds)లో భారత్ విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆతిథ్య జట్టు నిలకడగా ముందుకు సాగుతోంది. ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ క్రీజులో పాతుకుపోగా.. ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా అనుకున్న ఫలితం రాబట్టలేకపోయారు.లంచ్ బ్రేక్కు వెళ్లేసరికి ఇలా..దీంతో.. ఓవర్ నైట్ స్కోరు 21/0తో మంగళవారం నాటి ఐదో రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్.. భోజన విరామ సమయానికి ముప్పై ఓవర్ల ఆట పూర్తి చేసుకుని వికెట్ నష్టపోకుండా 117 పరుగులు సాధించింది. లంచ్ బ్రేక్కు వెళ్లేసరికి జాక్ క్రాలే 42, బెన్ డకెట్ 64 పరుగులతో క్రీజులో ఉన్నారు.శుబ్మన్ గిల్ అసంతృప్తిఇక ఎంతగా ప్రయత్నించినప్పటికీ క్రాలే, డకెట్ను అవుట్ చేయడం సాధ్యం కాకపోవడంతో భారత శిబిరంలో అసంతృప్తి నెలకొంది. బౌలర్లతో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్ కూడా అసంతృప్తికి లోనయ్యాడు. బంతి ఆకారం మారిందని, దానిని మార్చి కొత్త బంతి ఇవ్వాలని ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గఫానీ, పాల్ రీఫిల్లకు భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్, సిరాజ్ తదితరులు విజ్ఞప్తి చేశారు.కెప్టెన్ గిల్ కూడా వారి వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా, నవ్వులు చిందిస్తూ బంతిని మార్చమని అడిగాడు. కానీ అంపైర్లు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. అయితే, టీమిండియా పట్టుబట్టడంతో గేజ్ టెస్టులో బంతి ఆకారం మారినట్లు తేలింది. దీంతో అంపైర్లు కొత్త బంతి ఇవ్వక తప్పని పరిస్థితి.జడ్డూ చర్య వైరల్ఈ నేపథ్యంలో భారత స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంపైర్ వద్దకు వెళ్లి.. ‘‘చూశారా.. మేము చెప్పింది నిజం.. ఆఖరికి మాదే విజయం’’ అన్నట్లుగా పిడికిలి మడిచి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు బదులుగా అంపైర్ కూడా నవ్వులు చిందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఏదేమైనా ఎట్టకేలకు కొత్త బంతిని తెచ్చుకోవడంలో టీమిండియా సఫలమైంది. ఇక భారమంతా బౌలర్లదే. ఇంగ్లండ్ను కట్టడి చేసి జట్టుకు విజయం అందించాల్సిన బాధ్యత వారిదే.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ సైతం బంతిని మార్చమని అంపైర్లను కోరగా.. నిరాశే ఎదురైంది. దీంతో అతడు తన చేతిలో ఉన్న బంతిని నేలకేసి కొట్టగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి మందలించింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జతచేసింది.ఇంగ్లండ్ వర్సెస్ భారత్ తొలి టెస్టు🏏షెడ్యూల్: జూన్ 20- 24🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్🏏టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్🏏భారత్ తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్🏏ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్🏏భారత్కు ఆరు పరుగుల ఆధిక్యం🏏భారత్ రెండో ఇన్నింగ్స్: 364 ఆలౌట్🏏ఇంగ్లండ్ లక్ష్యం: 371🏏నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 21/0 (6) 🏏ఐదో రోజు భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 117/0.చదవండి: వసీం అక్రం, షేన్ వార్న్ కాదు!.. నన్ను భయపెట్టింది ఆ బౌలరే: గంగూలీ.@imjadeja is all fired up as the umpire allows #TeamIndia a ball change! 🔄💥Is a breakthrough around the corner? Will the next two sessions bring the wickets India needs? 👀#ENGvIND 1st Test Day 5 LIVE NOW Streaming on JioHotstar 👉 https://t.co/0K41uhrKJ5 pic.twitter.com/qKMYKc6gDl— Star Sports (@StarSportsIndia) June 24, 2025 -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తర ముగింపునకు చేరుకుంది. ఇంగ్లండ్ తమ విజయానికి 350 పరుగులు దూరంలో ఉండగా.. టీమిండియా 10 వికెట్ల దూరంలో నిలిచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది.క్రీజులో జాక్ క్రాలీ (12 బ్యాటింగ్), బెన్ డకెట్ (9 బ్యాటింగ్) ఉన్నారు. అంతకముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 364 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (247 బంతుల్లో 137; 18 ఫోర్లు), రిషభ్ పంత్ (140 బంతుల్లో 118; 15 ఫోర్లు, 3 సిక్స్లు) శతక్కొట్టారు.ఈ టెస్టులో పంత్కు ఇది రెండో సెంచరీ. ఇక తొలి ఇన్నింగ్స్లో లభించిన 6 పరుగుల ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 371 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉంచింది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండడంతో మరోసారి బౌలర్లకు మరోసారి కఠిన సవాలు తప్పదు. బుమ్రాకు తోడుగా సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ రాణించాల్సిన అవసరముంది.93 ఏళ్ల చరిత్రలోనే..ఇక ఈ లీడ్స్ టెస్టులో భారత జట్టు చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. ఒక టెస్టు మ్యాచ్లో టీమిండియా తరపున ఐదు సెంచరీలు నమోదు కావడం ఇదే తొలిసారి. 1932 నుంచి టెస్టు క్రికెట్ ఆడుతున్న భారత జట్టు.. 93 ఏళ్ల తర్వాత ఈ అరుదైన ఫీట్ను అందుకుంది.గతంలో భారత్ తరపున ఒక టెస్టు మ్యాచ్లో నాలుగు సెంచరీలు నమోదైన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఐదు సెంచరీలు రావడం మొదటి సారి. తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, రిషభ్ పంత్ సెంచరీలు చేయగా...రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్, పంత్ శతకాలు బాదారు.అదేవిధంగా 1955 తర్వాత విదేశీ గడ్డపై ఒకే టెస్టు మ్యాచ్లో ఐదు సెంచరీలు చేసిన పర్యాటక జట్టుగా భారత్ నిలిచింది. 70 ఏళ్ల కిందట వెస్టిండీస్ టూర్లో ఒకే టెస్టులో ఐదుగురు ఆస్ట్రేలియన్ ఆటగాళ్ళు మూడు అంకెల స్కోర్ను అందుకున్నారు.చదవండి: గుండెపోటుతో భారత మాజీ క్రికెటర్ కన్నుమూత -
IND VS ENG 1st Test Day 4: టీమిండియాకు షాక్
భారత్-ఇంగ్లండ్ మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్ల్లో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు బ్యాటింగ్ చేశాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్మన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్ బెన్ డకెట్ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. హ్యారీ బ్రూక్ 99 పరుగులతో తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా ఆటగాళ్లలో జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 పరుగులతో పర్వాలేదనిపించారు. ఫలితంగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 465 పరుగులు చేసింది. దీంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4), వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (30) ఔట్ కాగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (47), కెప్టెన్ శుభ్మన్ గిల్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. 6 పరుగుల ఆధిక్యం కలుపుకొని భారత్ 96 పరుగుల ఆధిక్యంలో ఉంది.నాలుగో రోజు ఆట ప్రారంభం కాగానే టీమిండియాకు షాక్ఓవర్నైట్ స్కోర్ 90/2 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్ చివరి బంతికే (24.6వ ఓవర్) బ్రైడన్ కార్స్ బౌలింగ్లో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో శుభ్మన్ గిల్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓవర్నైట్ స్కోర్కు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి భారత్ మూడో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్కు జతగా రిషబ్ పంత్ క్రీజ్లోకి వచ్చాడు. గిల్ వికెట్ కోల్పోవడంతో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్పై ఒత్తిడి పడే అవకాశం ఉంది. ఇంగ్లండ్ ముందు టీమిండియా గౌరవప్రదమైన టార్గెట్ ఉంచాలంటే రాహుల్, పంత్ చాలా కీలకం కానున్నారు. వీరిద్దరు ఈ రోజంతా క్రీజ్లో ఉంటేనే భారత్ ఓ మోస్తరు స్కోర్ చేయగలుగుతుంది. -
Ind vs Eng: వర్షం వల్ల ముందే ముగిసిన ఆట.. పూర్తి వివరాలు
India vs England 1st Test Day 3 Report: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు మూడో రోజు ఆటకు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో నిర్ణీత సమయం కంటే కాస్త ముందుగానే అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఆదివారం నాటి మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి భారత్ 23.5 ఓవర్లు ఆడి రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. అంతకు ముందు ఇంగ్లండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ కంటే 96 పరుగుల ఆధిక్యంలో ఉంది.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా శుక్రవారం మొదటి టెస్టు ఆరంభమైన విషయం తెలిసిందే. లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. గిల్ సేన తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులకు ఆలౌట్ అయింది.భారత తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్మన్ గిల్ (147)లతో పాటు.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీతో చెలరేగాడు. మిగతా వారిలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (42) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ నాలుగేసి వికెట్లు కూల్చగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ ఒక్కో వికెట్ తీశారు.ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు దీటుగా బదులిచ్చింది. ఓపెనర్ బెన్ డకెట్ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. మరోవైపు.. హ్యారీ బ్రూక్ 99 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 పరుగులతో ఆకట్టుకున్నారు. ఫలితంగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 465 పరుగులు చేసింది.భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సరికి మొత్తంగా 96 పరుగుల లీడ్లో ఉంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) ఈసారి నిరాశపరచగా.. వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 30 పరుగులు చేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 47, కెప్టెన్ గిల్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. -
గిల్, జైశ్వాల్, పంత్ సెంచరీలు.. తొలి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు జూలు విదిల్చారు. మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 471 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 359/3 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన గిల్ సేన. అదనంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్ను ముగించింది.రెండో రోజు ఆటలో టీమిండియా బ్యాటర్లు మెరుగ్గా రాణించలేకపోయారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్), రిషబ్ పంత్ (134, 178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (101 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు.సుదర్శన్, కరుణ్ నాయర్ అట్టర్ ప్లాప్.. ఇక ఈ మ్యాచ్లో భారత తరపున అరంగేట్రం చేసిన సాయిసుదర్శన్ తీవ్ర నిరాశపరిచాడు. మొదటి ఇన్నింగ్స్లో డకౌట్గా వెనుదిరిగాడు. అతడితో పాటు తొమ్మిదేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ సైతం ఖాతా తెరవకుండా పెవిలియన్కు చేరాడు. ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్స్టోక్స్, జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. బ్రైడాన్ కార్స్, షోయక్ బషీర్ చెరో వికెట్ సాధించారు.చదవండి: నాకు అది అలవాటు..! నువ్వే గుర్తు చేస్తూ ఉండాలి!.. నో చెప్పడం వల్లే ఇలా.. -
'శుబ్మన్ గిల్ ఒక అద్బుతం'.. యూటర్న్ తీసుకున్న భారత మాజీ క్రికెటర్
టీమిండియా టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన తొలి మ్యాచ్లోనే సత్తాచాటాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మొదటి టెస్టులో గిల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి రోజు ఆటముగిసే సమయానికి 127 పరుగులతో గిల్ అజేయంగా నిలిచాడు.ఇంగ్లండ్ గడ్డపై గిల్కు ఇదే మొదటి టెస్టు సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలో కెప్టెన్గా అతడిని ఎంపిక చేయడాన్ని విమర్శించిన నోళ్లే ఇప్పుడు శెభాష్ అంటున్నాయి. తొలుత కెప్టెన్గా గిల్ను వ్యతిరేకించిన భారత క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్లో గిల్ అద్బుతమైన టెక్నిక్తో బ్యాటింగ్ చేశాడని మంజ్రేకర్ కొనియాడాడు."కొన్ని రోజుల కిందట భారత టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ను ఎంపికచేయడాన్ని నేను వ్యతిరేకించాను. గిల్ కంటే జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్గా బెటర్ అని అభిప్రాయపడ్డాను. ఆ సమయంలో సెలక్టర్లు సరైన నిర్ణయం తీసుకోలేదని నేను చెప్పుకొచ్చాను. కానీ నేను ఎక్కడా కూడా గిల్ కెప్టెన్గా విఫలమవుతాడని మాత్రం చెప్పలేదు.కెప్టెన్సీ భారం తన బ్యాటింగ్కు పడకుండా గిల్ చూసుకుంటాడని నేను ముందే ఊహించాను. కానీ విదేశాల్లో మాత్రం అతడి ప్రదర్శన ఇంకా మెరుగు పడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో మాత్రం గిల్ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు.శుబ్మన్ తన బ్యాటింగ్లో టెక్నికల్ లోపాలను సరిదిద్దుకున్నాడు. అందుకే విదేశీ గడ్డపై భారీ సెంచరీసాధించగలిగాడని" జియో హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ -
ICC: శుబ్మన్ గిల్కు జరిమానా?!.. కారణం?
టీమిండియా టెస్టు కెప్టెన్గా తన ప్రయాణంలో తొలి ప్రయత్నంలోనే శుబ్మన్ గిల్ (Shubman Gill) అద్బుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్తో తొలి టెస్టు సందర్భంగా శతకంతో సత్తా చాటి తన విలువను చాటుకున్నాడు. తద్వారా టెస్టు సారథిగా అరంగేట్ర ఇన్నింగ్స్లోనే సెంచరీ చేసిన నాలుగో భారత క్రికెటర్గా నిలిచాడు.అజేయ శతకంలీడ్స్ వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్లో.. విరాట్ కోహ్లి (Virat Kohli) రిటైర్మెంట్తో ఖాళీ అయిన నాలుగో స్థానంలో గిల్ బ్యాటింగ్కు దిగాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి 175 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 127 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటికి పదహారు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.ఇక మరో సెంచరీ వీరుడు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101)తో కలిసి 129 పరుగులు జోడించిన గిల్.. వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్తో కలిసి 138 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేశాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆటలో టీమిండియా 85 ఓవర్లు ఆడి మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు సాధించింది. గిల్ 127, పంత్ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు. చిక్కుల్లో పడే అవకాశంకాగా ఇంగ్లండ్తో మొదటి టెస్టు మొదటి రోజు ఆటలో భారత జట్టు ప్రదర్శన పట్ల సచిన్ టెండుల్కర్ వంటి దిగ్గజాలు హర్షం వ్యక్తం చేశారు. గిల్ కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ను కొనియాడుతున్నారు. అంతాబాగానే ఉన్నా గిల్ చేసిన ఓ పని వల్ల అతడు చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది.ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా అతడు నలుపు రంగు సాక్సులు వేసుకున్నాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్లేయర్ క్లాతింగ్- ఎక్విప్మెంట్ నిబంధన (క్లాజ్ 19.45)ల ప్రకారం.. టెస్టు మ్యాచ్లో ఆటగాడు ధరించే సాక్సులు తెలుపు, గోధుమ లేదా లేత బూడిద రంగులో మాత్రమే ఉండాలి.జరిమానా?ఈ నేపథ్యంలో డ్రెస్ కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా గిల్కు జరిమానా పడే అవకాశం ఉంది. అయితే, మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ నిర్ణయంపైనే ఇది ఆధారపడి ఉంది. కాగా ఐసీసీలోని ఈ నిబంధనల ప్రకారం.. లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డట్లు తేలితే ఫైన్ తప్పదు. అయితే, గిల్ ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయలేదని రిఫరీ భావిస్తే అతడు జరిమానా నుంచి తప్పించుకోవచ్చు.కాగా టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభమైంది. లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తోంది. కేఎల్ రాహుల్ (42) ఓ మోస్తరుగా రాణించగా.. అరంగేట్ర బ్యాటర్ సాయి సుదర్శన్ మాత్రం పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఇక జైసూ, గిల్ శతకాలతో చెలరేగగా.. పంత్ హాఫ్ సెంచరీతో మెరిశాడు.చదవండి: బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్పై మాజీ కెప్టెన్ ఫైర్ -
IND vs ENG: టీమిండియాకు బ్యాడ్ న్యూస్?!
ఇంగ్లండ్తో తొలి టెస్టు ఘనంగా ఆరంభించిన టీమిండియా జోరుకు రెండో రోజు కాస్త బ్రేక్ పడే అవకాశం ఉంది. వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆక్యూవెదర్ వివరాల ప్రకారం.. లీడ్స్లో శనివారం ఉదయం ఎండ కాస్తుంది. 28-29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.అయితే, 25 శాతం మేర వర్షం కురిసేందుకు కూడా ఆస్కారం ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత వాన పడే అవకాశాలు 86 శాతం ఉన్నాయి. 31 శాతం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసేందుకు ఛాన్స్ ఉంది. టీమిండియా- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆటలో రెండో, మూడో సెషన్లో వర్షం పడే ఛాన్సులు 77 శాతం ఉన్నాయి.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27లో భాగంగా భారత్- ఇంగ్లండ్ తమ తొలి సిరీస్లో పరస్పరం తలపడుతున్నాయి. టెండుల్కర్-ఆండర్సన్ (Tendulkar-Anderson Trophy) ట్రోఫీలో భాగంగా ఇరుజట్లు ఐదు టెస్టులు ఆడతాయి. ఈ క్రమంలో శుక్రవారం లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు మొదలైంది.ఇరగదీసిన భారత బ్యాటర్లుటాస్ గెలిచిన ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్.. గిల్ సేనను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించాడు. పిచ్ పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమై ఈ మేరకు అతడు తీసుకున్న నిర్ణయం భారత్కు కలిసి వచ్చింది. తొలి రోజు పొడిగా ఉన్న పిచ్పై టీమిండియా స్టార్లు బ్యాట్తో ఇరగదీశారు.ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (42) ఫర్వాలేదనిపించగా.. యశస్వి జైస్వాల్ (101) సెంచరీతో చెలరేగాడు. ఇక కెప్టెన్ శుబ్మన్ గిల్ 175 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 127 పరుగులతో అజేయంగా ఉండగా.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ అర్ధ శతకం (65*) పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సరికి టీమిండియా 85 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేయగా.. గిల్, పంత్ క్రీజులో ఉన్నారు.వరుణుడు అడ్డుపడతాడా?అయితే, రెండో రోజు ఆటలో వీరు మరింత చెలరేగితే చూడాలని ఆశపడుతున్న అభిమానులకు వరుణుడు షాకిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తొలిరోజు కూడా ఇదే తరహా హెచ్చరికలు కాగా.. ఆట సజావుగానే సాగింది. ఇక మొదటి రోజు టీమిండియా అభిమానులను నిరాశపరిచిన అంశం ఏదైనా ఉందంటే.. అది సాయి సుదర్శన్ డకౌట్ మాత్రమే.అదొక్కటే నిరాశఇంగ్లండ్ గడ్డ మీద ఈ తమిళనాడు బ్యాటర్ టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టాడు. 24 ఏళ్ల సాయి భారత్ తరఫున టెస్టు ఆడిన 317వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. భారత సీనియర్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా అతనికి టెస్టు క్యాప్ను అందించాడు. అయితే, దురదృష్టవశాత్తూ కెరీర్ తొలి ఇన్నింగ్స్ అతనికి కలిసి రాలేదు. నాలుగు బంతులే ఎదుర్కొన్న అతను ‘సున్నా’కే వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే.. టెస్టు అరంగేట్రానికి ముందు సాయి భారత్ తరఫున 3 వన్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడాడు. చదవండి: బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్పై మాజీ కెప్టెన్ ఫైర్ -
అలా అయితే అవుట్ అయిపోతావు! గిల్కు పంత్ వార్నింగ్.. వైరల్
ఇంగ్లండ్తో తొలి టెస్టులో మొదటి రోజు టీమిండియా అదరగొట్టింది. సీనియర్లు లేకపోయినా మేమున్నాము కదా అంటూ యువ ఆటగాళ్లు బ్యాట్తో చెలరేగారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)తో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) శతకంతో చెలరేగితే.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) కూడా హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.భారీ భాగస్వామ్యాలుజైసూ 101 పరుగులు సాధించి.. బెన్ స్టోక్స్ బౌలింగ్లో బౌల్డ్ కాగా.. శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి గిల్ 127, పంత్ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా జైస్వాల్ మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (42)తో కలిసి తొలి వికెట్కు 91 పరుగులు జోడించడంతో పాటు.. గిల్తో కలిసి మూడో వికెట్కు 129 పరుగులు జతచేశాడు.అనంతరం గిల్కు తోడైన పంత్ అభేద్యంగా 138 పరుగుల భాగస్వామ్యం జోడించి.. అతడితో కలిసి నాటౌట్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఆట ముగిసే సరికి భారత్ 85 ఓవర్లు ఆడి మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు సాధించింది.ఇక మొదటి రోజు ముగింపునకు చేరే క్రమంలో షాట్ ఎంపిక విషయంలో గిల్కు పంత్ స్నేహపూర్వక హెచ్చరిక జారీ చేశాడు.ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ సంధించిన ఫుల్లర్ బాల్ను ఆడేందుకు క్రీజు వెలుపలికి వచ్చిన గిల్.. షార్ట్ కవర్ దిశగా బాదాడు.అలా అయితే అవుట్ అయిపోతావు!ఆ సమయంలో నాన్- స్ట్రైకర్ ఎండ్లో ఉన్న పంత్.. ‘‘క్రీజు బయటకు వచ్చేటపుడు కాస్త చూసుకో.. ఏమాత్రం తేడా జరిగినా క్యాచ్ అవుట్ అయ్యే ప్రమాదం ఉంది’’ అని హెచ్చరించాడు. మైక్ స్టంప్లో ఈ మాటలు రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.కాగా ఇంగ్లండ్తో టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లింది. ఈ సిరీస్తో ఇరుజట్లు తమ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్ను మొదలుపెట్టాయి. ఇక ఇదే సిరీస్తో టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్.. అతడికి డిప్యూటీగా రిషభ్ పంత్ తమ ప్రస్థానం మొదలుపెట్టారు.ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా లీడ్స్లోని హెడింగ్లీలో తొలి మ్యాచ్ జరుగుతుండగా.. ఎడ్జ్బాస్టన్ (బర్మింగ్హామ్), లార్డ్స్ (లండన్), ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ (మాంచెస్టర్), కెన్నింగ్టన్ ఓవల్ (లండన్) మిగిలిన టెస్టులకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు👉షెడ్యూల్: జూన్ 20- 24👉వేదిక: హెడింగ్లీ, లీడ్స్👉టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్👉తొలిరోజు ఆట ముగిసేసరికి టీమిండియా స్కోరు: 359/3 (85).చదవండి: బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్పై మాజీ కెప్టెన్ ఫైర్Warning: When @RishabhPant17's on strike, expect some advice and plenty of chatter between the wickets! 😜🎙️Watch now 👉 https://t.co/PXeXAKeYoj #ENGvIND | 1st Test | LIVE NOW on JioHotstar pic.twitter.com/v53iqPg8cm— Star Sports (@StarSportsIndia) June 20, 2025 -
ఆరోజు ముగ్గురం సెంచరీలు చేశామన్న సచిన్.. గంగూలీ రిప్లై ఇదే
ఇంగ్లండ్ (Ind vs Eng Tests)తో టెస్టు సిరీస్ ప్రయాణంలో టీమిండియా శుభారంభం అందుకుంది. లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో.. శుక్రవారం మొదలైన తొలి టెస్టు మొదటి రోజు ఆటలోనే పటిష్ట స్థితిలో నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన గిల్ సేన.. 85 ఓవర్ల ఆటలో మూడు వికెట్ల నష్టానికి మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 359 పరుగులు సాధించి పట్టు బిగించింది.ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (42) రాణించగా.. యశస్వి జైస్వాల్ (101) శతకంతో చెలరేగాడు. ఇక టీమిండియా టెస్టు సారథిగా తొలి మ్యాచ్లో శుబ్మన్ గిల్ కూడా అద్భుత సెంచరీతో మెరిశాడు. శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి గిల్ 127 పరుగులతో క్రీజులో ఉండగా.. వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) 65 పరుగులతో అతడికి తోడుగా ఉన్నాడు.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్లో మొదటి టెస్టులో తొలి రోజు టీమిండియా ప్రదర్శనపై బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) సంతృప్తి వ్యక్తం చేశాడు. కేఎల్ రాహుల్, జైస్వాల్, గిల్, పంత్లను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు.‘‘కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ భారత ఇన్నింగ్స్కు బలమైన పునాది వేశారు. ఇక అద్భుతమైన శతకాలు బాదిన జైస్వాల్, శుబ్మన్ గిల్లకు శుభాకాంక్షలు. రిషభ్ పంత్ కూడా వీరితో సమానంగా తన వంతు పని పూర్తి చేశాడు.ఈరోజు టీమిండియా బ్యాటింగ్ను చూస్తుంటే.. నాకు 2002లో హెడింగ్లీలో.. రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, నేను తొలి ఇన్నింగ్స్లో శతకాలు బాదడం గుర్తుకువచ్చింది. ఆ టెస్టులో మేము గెలిచాము.ఈరోజు.. యశస్వి, శుబ్మన్ తమ పని పూర్తి చేశారు. ఇక మూడో సెంచూరియన్ ఎవరు అవుతారో చూడాలి’’ అని సచిన్ టెండుల్కర్ పేర్కొన్నాడు. ఇందుకు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. ‘‘హాయ్ చాంప్.. ఈసారి నలుగురు సెంచరీలు చేస్తారేమో.. పిచ్ బాగుంది.. పంత్.. కరుణ్ కూడా శతకాలు బాదుతారేమో!అయితే, 2002 నాడు తొలి రోజు పిచ్ స్వభావానికి ఇప్పటి వికెట్కు కాస్త తేడా ఉంది’’ అని బదులిచ్చాడు. కాగా 2002లో ఇదే వేదికపై సచిన్ టెండుల్కర్ గంగూలీతో కలిసి 249 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక టెండుల్కర్ 303 బంతుల్లో 193 పరుగులు సాధించగా.. గంగూలీ 128 రన్స్ స్కోరు చేశాడు. అదే విధంగా.. ‘వాల్’ రాహుల్ ద్రవిడ్ 148 పరుగులు చేయగా.. అప్పటి ఓపెనర్ సంజయ్ బంగర్ 68 రన్స్ రాబట్టాడు.కాగా ఇప్పటి వరకు ఇంగ్లండ్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్ను పటౌడీ ట్రోఫీగా పిలిచేవారు. తాజాగా దీనికి టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేశారు. ఇక దఫా పర్యటనలో భారత్ ఇంగ్లండ్తో ఐదు టెస్టుల్లో తలపడనుంది. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ టెస్టులకు గుడ్బై చెప్పిన తర్వాత.. టీమిండియా ఆడుతున్న తొలి సిరీస్ ఇదే. రోహిత్ స్థానంలో టెస్టు జట్టు కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన యువ ఆటగాడు శుబ్మన్ గిల్కు ఈ సిరీస్ ప్రతిష్టాత్మకంగా మారింది.Tendulkar at Leeds, 2002pic.twitter.com/o7MlA5Zn3L— Cricketopia (@CricketopiaCom) June 20, 2025 చదవండి: నాకు అది అలవాటు..! నువ్వే గుర్తు చేస్తూ ఉండాలి!.. నో చెప్పడం వల్లే ఇలా.. -
బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్పై మాజీ కెప్టెన్ ఫైర్
టీమిండియాతో తొలి టెస్టులో తొలి రోజు ఇంగ్లండ్కు భంగపాటే ఎదురైంది. లీడ్స్ వేదికగా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ బౌలింగ్ను భారత బ్యాటర్లు చితక్కొట్టారు. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (Kl Rahul- 42) రాణించగా.. యశస్వి జైస్వాల్ శతకం (101)తో చెలరేగాడు. ఇక ఈ సిరీస్తో భారత టెస్టు జట్టు కెప్టెన్గా ప్రయాణం మొదలుపెట్టిన శుబ్మన్ గిల్ (Shubman Gill) కూడా సెంచరీతో కదం తొక్కాడు.అదే విధంగా.. వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) కూడా అర్ధ శతకంతో మెరిశాడు. వెరసి శుక్రవారం నాటి తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి 85 ఓవర్లు ఆడిన టీమిండియా మూడు వికెట్లు నష్టపోయి 359 పరుగులు సాధించింది. తద్వారా ఆతిథ్య జట్టుపై పర్యాటక టీమ్ మొదటి రోజు పూర్తి ఆధిపత్యం కనబరిచింది.కామన్ సెన్స్ ఉన్నవాళ్లు ఇలా చేయరుఈ నేపథ్యంలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ ఆథర్టన్ కూడా ఈ విషయంలో స్టోక్స్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు.‘‘టాస్ గెలిచిన కెప్టెన్ తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా అనిపించింది. గత ఆరు మ్యాచ్లలో తొలుత బౌలింగ్ చేసిన జట్టే విజయం సాధించిందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కాస్త కామన్ సెన్స్ ఉన్నవాళ్లు.. క్రికెట్ బుర్ర వాడేవారు ఎవరైనా ఇక్కడ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటారు.ఎందుకంటే.. ఇక్కడ ఇప్పుడు తీవ్రమైన ఎండ ఉంది. రానున్న రెండు రోజుల్లో 30 డిగ్రీలకు పైగానే ఉంటుంది. స్టోక్స్ కేవలం గత రికార్డు ఆధారంగానే తొలుత బౌలింగ్ ఎంచుకుని ఉంటాడు’’ అని ఆథర్టన్ స్టోక్స్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. అయితే, భారీ లక్ష్యాన్ని కూడా ఛేదించగల సత్తా ఇంగ్లండ్కు ఉందని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశాడు.ఇంగ్లండ్ పశ్చాత్తాపం!కాగా ఇంగ్లండ్ మరో మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ కూడా టాస్ విషయంలో ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక తీవ్రమైన ఎండ, పొడిగా ఉన్న పిచ్, స్వింగ్కు ఏమాత్రం అవకాశం లేని వాతావరణం, పెద్దగా అనుభవం లేని బౌలర్లు... ఇలాంటి స్థితిలో టాస్ గెలిచి స్టోక్స్ బౌలింగ్ ఎంచుకునే సాహసం చేయడంతో ఇంగ్లండ్ పశ్చాత్తాపపడాల్సిన పరిస్థితి తలెత్తింది.నిజమే... హెడింగ్లీ మైదానంలో గత ఆరు టెస్టుల్లో ముందుగా బౌలింగ్ చేసిన జట్టే గెలిచింది. కానీ శుక్రవారం పరిస్థితి వాటికి భిన్నం. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై భారత బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడటం చూస్తే తాము చేసిన తప్పేమిటో ఇంగ్లండ్కు అర్థమై ఉంటుంది. కాగా టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్కు వెళ్లింది.ఇంగ్లండ్ చేజారిన అవకాశాలు.. పెనాల్టీ పరుగులు👉45 పరుగుల వద్ద జైస్వాల్కు అదృష్టం కలిసొచ్చింది. కార్స్ వేసిన యార్కర్ను అతను చివరి నిమిషంలో నిలువరించగలిగాడు. ఇంగ్లండ్ అప్పీల్కు సిద్ధమైన తరుణంలో అంపైర్ దానిని ‘నోబాల్’గా ప్రకటించాడు. ఆ తర్వాత రీప్లే చూస్తే బంతి ముందుగా అతని ప్యాడ్కు తాకినట్లు తేలింది. ‘నోబాల్’ కాకపోతే అది కచ్చితంగా అవుట్గా తేలేది. 👉గిల్ 1 పరుగు వద్ద ఉన్నప్పుడు కార్స్ బౌలింగ్లో కష్టసాధ్యమైన సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే గిల్ చాలా దూరంలోనే ఉన్నా... పోప్ వేసిన త్రో నేరుగా వికెట్లకు తాకకపోవడంతో రనౌట్ కాకుండా తప్పించుకున్నాడు. ఓవర్త్రో బౌండరీని చేరడంతో మరో నాలుగు పరుగులు జట్టు ఖాతాలో చేరాయి. 👉టీ విరామానికి ముందు స్టోక్స్ వేసిన చివరి ఓవర్లో స్లిప్ ఫీల్డర్ రూట్ బంతిని ఆపే క్రమంలో దానిని పక్కకు తోశాడు. అది అక్కడే పెట్టిన వికెట్ కీపర్ హెల్మెట్ను తాకడంతో భారత్కు ఐదు పెనాల్టీ పరుగులు అదనంగా లభించాయి. ఈ గందరగోళంలో అంపైర్ లెక్క తప్పడంతో ఈ ఓవర్లో స్టోక్స్ 7 బంతులు వేశాడు. చదవండి: నాకు అది అలవాటు..! నువ్వే గుర్తు చేస్తూ ఉండాలి!.. నో చెప్పడం వల్లే ఇలా.. -
నాకు అది అలవాటు.. నువ్వే గుర్తు చేయాలి!.. నో చెప్పడం వల్లే ఇలా..
వయసు జస్ట్ 23 ఏళ్లు.. అయితేనేం.. టీమిండియా ఓపెనర్గా అతడు కనబరిచే పరిణితి మాత్రం అమోఘం.. టెస్టుల్లో ఇప్పటికే నాలుగు సెంచరీలు.. రెండు ద్విశతకాలు.. తాజాగా ఇంగ్లండ్ గడ్డ మీద ఆడిన తొలి టెస్టులోనే శతకం బాదాడు అతడు.. అంతేకాదు ఈ ఘనత సాధించిన ఏకైక భారత ఓపెనర్గా నిలిచాడు.. అవును.. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswak) గురించే ఈ ఉపోద్ఘాతం.ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ (India vs England)తో శుక్రవారం మొదలైన తొలి టెస్టులో జైసూ శతక్కొట్టాడు. ఆది నుంచే పలుమార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుని ఎట్టకేలకు వంద పరుగుల మార్కు అందుకున్నాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul)తో కలిసి తొలి వికెట్కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మూడో వికెట్కు కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి 129 పరుగుల పార్ట్నర్షిప్ అందించాడు.తొందరపడితే నన్ను వారించు..అయితే, గిల్తో కలిసి బ్యాటింగ్ చేస్తున్న సందర్భంగా జైసూ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. తొందరపడితే తనను వారించాలంటూ జైసూ కెప్టెన్కు చెప్పడం గమనార్హం. అసలేం జరిగిందంటే.. భారత్ ఇన్నింగ్స్లో 38 వ ఓవర్లో క్రిస్ వోక్స్ బంతితో రంగంలోకి దిగాడు.అతడి బౌలింగ్లో తొలి బంతికి బౌండరీ బాదిన జైస్వాల్.. తదుపరి బాల్కు సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. షాట్ బాదగానే వెంటనే పరుగు కోసం వెళ్లాడు. అయితే, మరో ఎండ్లో ఉన్న గిల్ మాత్రం రన్కు నిరాకరించాడు. దీంతో కాస్త అసహనానికి గురైనప్పటికి... ఆ వెంటనే తన తప్పు తెలుసుకున్న జైస్వాల్ వెంటనే క్రీజులోకి పరిగెత్తాడు. తద్వారా ఇంగ్లండ్కు రనౌట్ చేసే అవకాశం చేజారింది.నాకు అది అలవాటు..! నువ్వే గుర్తు చేస్తూ ఉండాలి!ఈ ఘటన తర్వాత జైస్వాల్ గిల్తో.. ‘‘రిస్కీ సింగిల్స్ వద్దని నాకు చెబుతూనే ఉండండి ప్లీజ్.. బంతిని బాదగానే వెంటనే పరిగెత్తడం నాకు అలవాటై పోయింది’’ అని పేర్కొన్నాడు. కాగా జైసూ బాదిన బంతి ఎక్కువ దూరం వెళ్లలేదు. ఈ విషయాన్ని గమనించని జైసూ పరుగుకు రాగా.. ‘‘లేదు లేదు బంతి ఇక్కడే ఉంది’’ అంటూ గిల్ చెప్పాడు. గిల్ నో చెప్పిన కారణంగా ఇద్దరూ రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.కాగా అప్పటికి జైస్వాల్ 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నాడు. ఆ తర్వాత గిల్తో కలిసి చక్కటి సమన్వయంతో శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 159 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 101 పరుగులు సాధించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు.ఇదిలా ఉంటే.. శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసేసరికి టీమిండియా 85 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 359 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. శుబ్మన్ గిల్ 175 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 127 పరుగులతో.. రిషభ్ పంత్ 102 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్స్ల సాయంతో 65 పరుగులతో క్రీజులో ఉన్నారు.చదవండి: దక్షిణాఫ్రికాకు కొత్త కెప్టెన్.. ఎవరంటే?When #YashasviJaiswal says “Run!” and #ShubmanGill is still deciding if it’s a good idea! 😂Watch now 👉 https://t.co/PXeXAKeYoj #ENGvIND | 1st Test | LIVE NOW on JioHotstar pic.twitter.com/UJDlpPlpkH— Star Sports (@StarSportsIndia) June 20, 2025 -
యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు.. బ్రాడ్మన్నే అధిగమించాడు!
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiwal) అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్ జట్టుపై టెస్టు ఫార్మాట్లో అత్యధిక సగటు నమోదు చేసిన క్రికెటర్గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్మన్ (Don Bradman)ని జైసూ అధిగమించాడు.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా ఇరుజట్ల మధ్య శుక్రవారం (జూన్ 20) తొలి టెస్టు మొదలైంది. లీడ్స్ వేదికగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకుని.. టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు.భారత్ బ్యాటింగ్ అదుర్స్.. జైసూ, గిల్ సెంచరీలుఇక ఆది నుంచే జోరు కనబరిచిన భారత్ మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి 85 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు సాధించింది. ఆద్యంతం ఆకట్టుకుని తొలి రోజు పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (42) స్వల్ప స్కోరుకు వెనుదిరిగినా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ శతకంతో కదం తొక్కాడు.మరో సెంచరీ వీరుడు, కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. మొత్తంగా 159 బంతులు ఎదుర్కొన్న జైసూ.. 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 101 పరుగులు చేసి.. స్టోక్స్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు.బ్రాడ్మన్ రికార్డు బద్దలుఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ గడ్డ మీద జైసూకు ఇదే తొలి సెంచరీ కాగా.. ఓవరాల్గా పది ఇన్నింగ్స్లో కలిపి 813 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఏకంగా 90.33 సగటుతో ఈ మేర రన్స్ రాబట్టాడు. ఈ క్రమంలోనే బ్రాడ్మన్ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్ మీద టెస్టుల్లో అత్యధిక సగటుతో పరుగులు రాబట్టిన ఆటగాడిగా నిలిచాడు.ఇక శుక్రవారం నాటి తొలి రోజు ఆట పూర్తయ్యే సరికి గిల్ 127 పరుగులతో.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు. మరోవైపు.. అరంగేట్ర బ్యాటర్ సాయి సుదర్శన్ మాత్రం నిరాశపరిచాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చి డకౌట్గా వెనుదిరిగాడు.ఇంగ్లండ్ జట్టుపై అత్యధిక టెస్టు యావరేజ్ కలిగిన బ్యాటర్లు🏏యశస్వి జైస్వాల్- 90.33🏏డాన్ బ్రాడ్మన్- 89.78🏏స్టీవీ డెంప్స్టర్- 88.42🏏లారెన్స్ రోవ్- 74.20🏏జార్స్ హెడ్లీ- 71.23 చదవండి: వాళ్లని మెచ్చుకోవడంలో తప్పులేదు.. అతడిని ఇప్పటికైనా వదిలేయ్!𝐓𝐎𝐍 🆙𝐓𝐀𝐈𝐋𝐒 🆙Yashasvi Jaiswal leads Team India from the front. #SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #DhaakadIndia #TeamIndia | @ybj_19 pic.twitter.com/QX4kdlTBu4— Sony Sports Network (@SonySportsNetwk) June 20, 2025 -
IND Vs ENG: ఇంగ్లండ్ గడ్డపై అదరగొట్టిన భారత బ్యాటర్లు.. పట్టుబిగించిన ‘గిల్’ సేన (ఫొటోలు)
-
Ind vs Eng 1st Day 1: బ్యాటింగ్తో అదరగొట్టారు
భారత టెస్టు క్రికెట్లో కొత్త అధ్యాయం ఘనంగా మొదలైంది. అంచనాలకు మించిన ఆటతో ఇంగ్లండ్ గడ్డపై సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. సీనియర్లు తప్పుకున్నా... జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు తాము సరైనోళ్లమని యువ ఆటగాళ్లు నిరూపించారు. అసాధారణ బ్యాటింగ్తో ముందుగా యశస్వి జైస్వాల్, ఆపై కెప్టెన్గా తొలి పరీక్షలో శుబ్మన్ గిల్ సెంచరీలు బాది సత్తా చాటగా, రిషభ్ పంత్ తన విలువను ప్రదర్శించాడు. హెడింగ్లీ పిచ్పై ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయిన ఇంగ్లండ్ బౌలర్లందరినీ ఒక ఆటాడుకున్న మన బ్యాటర్లు భారీ స్కోరుతో మొదటి రోజును గొప్పగా ముగించారు. లీడ్స్: ఇంగ్లండ్తో మొదలైన తొలి టెస్టులో మొదటి రోజు భారత్ భారీ స్కోరుతో చెలరేగింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. కెపె్టన్ శుబ్మన్ గిల్ (175 బంతుల్లో 127 బ్యాటింగ్; 16 ఫోర్లు, 1 సిక్స్), ఓపెనర్ యశస్వి జైస్వాల్ (159 బంతుల్లో 101; 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగగా, వైస్ కెపె్టన్ రిషభ్ పంత్ (102 బంతుల్లో 65 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. టెస్టుల్లో జైస్వాల్కు ఇది ఐదో సెంచరీ కాగా, గిల్కు ఆరో శతకం. జైస్వాల్, గిల్ మూడో వికెట్కు 129 పరుగులు జోడించారు. ఆ తర్వాత గిల్, పంత్ నాలుగో వికెట్కు అభేద్యంగా 138 పరుగులు జత చేశారు. సిరీస్లో శుభారంభం... ఓపెనర్లు జైస్వాల్, కేఎల్ రాహుల్ (78 బంతుల్లో 42; 8 ఫోర్లు) జట్టుకు సరైన ఆరంభాన్ని అందించారు. ఇంగ్లండ్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో వీరిద్దరు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ చకచకా బౌండరీలు బాదారు. ఒకదశలో అసహనంతో జైస్వాల్ 23 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇంగ్లండ్ ఏమాత్రం అవకాశం లేకపోయినా... ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూ కోరి విఫలమైంది. తొలి గంటలో భారత్ 9 ఫోర్లతో 44 పరుగులు చేసింది. ఎట్టకేలకు లంచ్ విరామానికి ముందు ఇంగ్లండ్కు ఊరట దక్కింది. ఆరు బంతుల వ్యవధిలో రాహుల్, తొలి టెస్టు ఆడుతున్న సుదర్శన్ (0) అవుట్ కాగా...లంచ్ సమయానికి జట్టు స్కోరు 92/2కు చేరింది. భారీ భాగస్వామ్యం... విరామానంతరం 96 బంతుల్లో జైస్వాల్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఈ సెషన్లో జైస్వాల్, గిల్ ప్రత్యర్థి బౌలర్లను పూర్తిగా ఆడుకున్నారు. ఓవర్కు దాదాపు ఐదు పరుగుల రన్రేట్తో పరుగులు రాబట్టి ప్రత్యరి్థపై ఆధిక్యం ప్రదర్శించారు. వోక్స్ వేసిన రెండు ఓవర్లలో గిల్, జైస్వాల్ చెరో 3 ఫోర్లు బాది ధాటిని ప్రదర్శించారు. 56 బంతుల్లో గిల్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. మరోవైపు జోరు పెంచిన జైస్వాల్ కార్స్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టి 99కు చేరుకున్నాడు. తర్వాతి బంతిని సింగిల్ తీసిన అతను 144 బంతుల్లో సెంచరీ మార్క్ను చేరుకొని సంబరాలు చేసుకున్నాడు. 50 నుంచి 100కు చేరడానికి జైస్వాల్ 48 బంతులే (8 ఫోర్లు, 1 సిక్స్తో) తీసుకోవడం విశేషం. పంత్ జోరు... టీ తర్వాత రెండో ఓవర్లోనే భారత్ వికెట్ కోల్పోయింది. జైస్వాల్ను స్టోక్స్ బౌల్డ్ చేయడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత గిల్, పంత్ కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు. పంత్ తనదైన శైలిలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించగా...గిల్ చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. బషీర్ ఓవర్లో పంత్ వరుసగా 4, 6 బాదడంతో స్కోరు 300కు చేరుకోగా... టంగ్ ఓవర్లో కవర్స్ దిశగా ఆడి గిల్ 140 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. ఇంగ్లండ్ కొత్త బంతిని తీసుకున్న తర్వాత తొలి ఓవర్లోనే పంత్ హాఫ్ సెంచరీ (91 బంతుల్లో) పూర్తయింది. ఎంత ప్రయత్నించినా ...పేలవ బౌలింగ్తో ఇంగ్లండ్ ఈ జోడీని విడదీయలేకపోయింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) స్టోక్స్ 101; రాహుల్ (సి) రూట్ (బి) కార్స్ 42; సాయి సుదర్శన్ (సి) స్మిత్ (బి) స్టోక్స్ 0; గిల్ (బ్యాటింగ్) 127; పంత్ (బ్యాటింగ్) 65; ఎక్స్ట్రాలు 24; మొత్తం (85 ఓవర్లలో 3 వికెట్లకు) 359. వికెట్ల పతనం: 1–91, 2–92, 3–221. బౌలింగ్: వోక్స్ 19–2–89–0, కార్స్ 16–5–70–1, టంగ్ 16–0–75–0, స్టోక్స్ 13–1–43–2, బషీర్ 21–4–66–0. -
గిల్, జైశ్వాల్ సెంచరీలు.. తొలి రోజు భారత్దే
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు సత్తాచాటారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(101), కెప్టెన్ శుబ్మన్ గిల్(127 నాటౌట్) సెంచరీలతో మెరిశారు. ప్రస్తుతం క్రీజులో గిల్తో పాటు రిషబ్ పంత్(65) ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. కార్స్ ఓ వికెట్ సాధించాడు. -
వారెవ్వా గిల్.. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే అద్బుత సెంచరీ
టీమిండియా టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన కెరీర్ను ఘనంగా ఆరంభించాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో ప్రారంభమైన తొలి టెస్టులో గిల్ సెంచరీతో మెరిశాడు. మొదటి ఇన్నింగ్స్లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన గిల్.. విరాట్ కోహ్లిని తలపించాడు. తొలుత దూకుడుగా ఆడిన శుబ్మన్, జైశ్వాల్ ఔటయ్యాక ఆచిచూచి తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో 140 బంతుల్లో గిల్ తన ఆరో టెస్టు సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 14 ఫోర్లు ఒక సిక్సర్ ఉన్నాయి. అతడి కంటే ముందు యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్బుత సెంచరీతో చెలరేగాడు. 159 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 16 ఫోర్లు, 1 సిక్సర్తో 101 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్సీ డెబ్యూలో సెంచరీతో చెలరేగిన గిల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లఖించుకున్నాడు.భారత టెస్టు కెప్టెన్గా అరంగేట్ర ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన నాలుగో ప్లేయర్గా గిల్ నిలిచాడు. ఈ ఫీట్ సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం విజయ్ హజారే అగ్రస్ధానంలో ఉన్నారు. 1951లో కెప్టెన్గా తన అరంగేట్ర ఇన్నింగ్స్లో ఇంగ్లండ్పైనే సెంచరీ చేశారు.భారత టెస్ట్ కెప్టెన్గా తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన ప్లేయర్లు వీరే..164* విజయ్ హజారే వర్సెస్ ఇంగ్లండ్, ఢిల్లీ 1951116 సునీల్ గవాస్కర్ vs న్యూజిలాండ్ ఆక్లాండ్ 1976115 విరాట్ కోహ్లీ vs ఆస్ట్రేలియన్ అడిలైడ్ 2014102*శుబ్మన్ గిల్ vs ఇంగ్లాండ్ హెడింగ్లీ 2025భారీ స్కోర్ దిశగా భారత్..తొలి ఇన్నింగ్స్లో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 78 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 మూడు వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(46), గిల్(112) ఉన్నారు. -
యువీతో గిల్ గురించి మాట్లాడాను.. కపిల్ దేవ్ మాదిరే అతడు కూడా..
టీమిండియా టెస్టు కెప్టెన్గా యువ ఆటగాడు శుబ్మన్ గిల్ ప్రయాణం మొదలైంది. ఇంగ్లండ్ (Ind vs Eng)తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం నాటి తొలి టెస్టుతో గిల్ పగ్గాలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) తండ్రి, కోచ్ యోగ్రాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.శుబ్మన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఇంగ్లండ్ గడ్డ మీద గెలిచి.. ట్రోఫీతో తిరిగి వస్తుందని యోగ్రాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. అయితే, బ్యాటర్గానూ కెప్టెన్ గిల్ ముందుండి జట్టును నడిపిస్తేనే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నాడు.యువీతో మాట్లాడినపుడు ఇదే అన్నాడు‘‘కొన్ని రోజుల క్రితం.. అభిషేక్ శర్మ (Abhishek Sharma), శుబ్మన్ గిల్ల గురించి నేను యువరాజ్ సింగ్తో మాట్లాడాను. ఆ సమయంలో.. ‘గిల్ నాయకుడిగా జట్టును ముందుండి నడిపిస్తాడు’ అని యువరాజ్ అన్నాడు. అవును.. శుబ్మన్ గిల్ బ్యాటింగ్కు వెళ్లినపుడు వీలైనంత ఎక్కువసేపు క్రీజులో ఉండాలి.కపిల్ దేవ్ మాదిరికెప్టెన్ మెరుగైన ప్రదర్శన చేస్తే జట్టులోనూ జోష్ నిండుతుంది. శుబ్మన్ సహచరులకు 100, 200 లేదంటే 300 స్కోరును టార్గెట్గా పెట్టాలి. తనే బాధ్యత తీసుకోవాలి. 1983 వన్డే వరల్డ్కప్లో కపిల్ దేవ్ మాదిరి ఆటగాడిగానూ జట్టును ముందుండి నడిపించాలి’’ అని యోగ్రాజ్ సింగ్ ANIతో పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్లో టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశాడు.జైసూ అర్ధ శతకం పూర్తికాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా టీమిండియా తొలుత ఇంగ్లండ్తో తలపడుతోంది. స్టోక్స్ బృందంతో ఐదు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలో లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు శుక్రవారం ఆరంభమైంది. టాస్ గెలిచిన స్టోక్స్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది.ఓపెనర్లు కేఎల్ రాహుల్ (42)- యశస్వి జైస్వాల్ కలిసి తొలి వికెట్కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, భారీ అంచనాలతో బరిలోకి దిగిన అరంగేట్ర ప్లేయర్ సాయి సుదర్శన్ మాత్రం నిరాశపరిచాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన అతడు డకౌట్ అయ్యాడు.ఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్- కెప్టెన్ శుబ్మన్ గిల్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించే బాధ్యత తీసుకున్నారు. 42 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి జైసూ 78 పరుగులతో ఉండగా.. గిల్ 42 పరుగులు సాధించాడు. టీమిండియా స్కోరు: 172-2 (42). చదవండి: వాళ్లని మెచ్చుకోవడంలో తప్పులేదు.. అతడిని ఇప్పటికైనా వదిలేయ్! -
Ind vs Eng 1st Test: చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్
టీమిండియా స్టార్ శుబ్మన్ గిల్ (Shubman Gill) సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత టెస్టు జట్టు కెప్టెన్గా ప్రయాణం మొదలుపెట్టిన ప్రిన్స్.. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న అరుదైన రికార్డులు బద్దలు కొట్టాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా పేరు తెర మీదకు రాగా.. తానే స్వయంగా రేసు నుంచి తప్పుకొన్నాడు. పనిభారం కారణంగా సెలక్టర్లు కూడా ఇందుకు అంగీకరించి.. రోహిత్ స్థానంలో శుబ్మన్ గిల్కు టెస్టు జట్టు పగ్గాలు అప్పగించారు. ఈ క్రమంలో ఇంగ్లండ్తో శుక్రవారం (జూన్ 20) మొదలైన తొలి టెస్టు సందర్భంగా సారథిగా గిల్ తన ప్రయాణం ఆరంభించాడు.ఈ నేపథ్యంలో పలు అరుదైన రికార్డులను గిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. చిన్న వయసులోనే భారత టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన కెప్టెన్ల జాబితాలో చేరిన ప్రిన్స్.. 21వ శతాబ్దంలో అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన సారథిగా చరిత్రకెక్కాడు. ఇన్నాళ్లుగా కోహ్లి పేరిట ఉన్న ఈ రికార్డును బద్దలు కొట్టాడు.అంతేకాదు.. ఇంగ్లండ్ గడ్డ మీద టెస్టుల్లో టీమిండియాకు నాయకత్వం వహించిన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ పేరు మీదున్న రికార్డును కూడా గిల్ ఈ సందర్భంగా సవరించాడు. కాగా టెస్టుల్లో భారత్కు గిల్ 37వ కెప్టెన్.యంగెస్ట్ ఇండియన్ టెస్టు కెప్టెన్లు🏏మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ- 21 ఏళ్ల 77 రోజుల వయసులో- 1962లో బ్రిడ్జ్టౌన్ వేదికగా వెస్టిండీస్తో పోరుతో..🏏సచిన్ టెండుల్కర్- 23 ఏళ్ల 169 రోజుల వయసులో- 1996లో ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో పోరుతో..🏏కపిల్ దేవ్- 24 ఏళ్ల 48 రోజులు వయసులో- 1983లో కింగ్స్టన్ వేదికగా వెస్టిండీస్తో పోరుతో..🏏రవి శాస్త్రి- 25 ఏళ్ల 229 రోజుల వయసులో- 1988లో చెన్నై వేదికగా- వెస్టిండీస్తో పోరుతో..🏏శుబ్మన్ గిల్- 25 ఏళ్ల 285 రోజుల వయసులో- 2025లో లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో పోరుతో..21వ శతాబ్దంలో పిన్న వయసులో టీమిండియా టెస్టు కెప్టెన్లుగా తొలి మ్యాచ్ ఆడింది వీరే.. ఒకే ఒక్కడు గిల్!🏏శుబ్మన్ గిల్- 25 ఏళ్ల 285 రోజుల వయసులో- 2025లో లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో పోరుతో..🏏విరాట్ కోహ్లి- 26 ఏళ్ల 34 రోజుల వయసులో- 2014లో అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో పోరుతో..🏏సచిన్ టెండుల్కర్- 26 ఏళ్ల 253 రోజుల వయసులో- 2000లొ సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో పోరుతో..🏏మహేంద్ర సింగ్ ధోని- 26 ఏళ్ల 379 రోజుల వయసులో- 2008లొ కాన్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో పోరుతో..🏏వీరేందర్ సెహ్వాగ్- 27 ఏళ్ల 59 రోజుల వయసులో- 2006లో అహ్మదాబాద్ వేదికగా శ్రీలంకతో పోరుతో..ఇంగ్లండ్లో టీమిండియా యంగెస్ట్ కెప్టెన్లు వీరే..🏏శుబ్మన్ గిల్- 25 ఏళ్ల 285 రోజుల వయసులో- 2025లో లీడ్స్ వేదికగా..🏏మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ- 26 ఏళ్ల 154 రోజుల వయసులో- 1967లో లీడ్స్ వేదికగా..🏏కపిల్ దేవ్- 27 ఏళ్ల 150 రోజుల వయసులో- 1986లో లార్డ్స్ వేదికగా..🏏మహ్మద్ అజారుద్దీన్- 27 ఏళ్ల 168 రోజుల వయసులో- 1990లో లార్డ్స్ వేదికగా..🏏జస్ప్రీత్ బుమ్రా- 27 ఏళ్ల 178 రోజుల వయసులో- 2022లో ఇంగ్లండ్ వేదికగా..👉 ఇంగ్లండ్తో తొలి టెస్టులో లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 92/2. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ 42 పరుగులకు అవుట్ కాగా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 42 పరుగుల వద్ద ఉన్నాడు. అరంగేట్ర ఆటగాడు, వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ డకౌట్గా వెనుదిరిగాడు.చదవండి: IND vs ENG: పాపం నితీశ్ కుమార్.. అతడి కోసం పక్కన పెట్టేశారు? -
టాస్ గెలిచిన ఇంగ్లండ్.. సాయి సుదర్శన్ అరంగేట్రం.. కరుణ్ ఉన్నాడా?
క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెస్టు సమరానికి సమయం ఆసన్నమైంది. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్- టీమిండియా (Eng vs Ind) మధ్య టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar-Anderson Trophy)లో భాగంగా శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) తొలుత బౌలింగ్ ఎంచుకుని.. గిల్ సేనను బ్యాటింగ్కు ఆహ్వానించాడు.ఇక ఈ సిరీస్తో భారత టెస్టు జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ ప్రస్థానం మొదలు కాగా.. చెన్నై చిన్నోడు సాయి సుదుర్శన్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. టీమిండియా నయా వాల్, వెటరన్ క్రికెటర్, ప్రస్తుత కామెంటేటర్ ఛతేశ్వర్ పుజారా చేతుల మీదుగా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ క్యాప్ అందుకున్నాడు.ఈ సందర్భంగా భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే తాను కూడా బౌలింగే ఎంచుకునే వాడినని తెలిపాడు. బెకింగ్హామ్లో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం అద్బుతంగా అనిపించిందని.. సిరీస్లో శుభారంభం అందుకుంటామనే ఆశాభావం వ్యక్తం చేశాడు.అదే విధంగా సాయి సుదర్శన్ మూడో స్థానంలో బ్యాటింగ్కు వస్తాడని.. కరుణ్ నాయర్కు కూడా తుది జట్టులో చోటు ఇచ్చినట్లు తెలిపాడు. కాగా దశాబ్ద కాలం తర్వాత విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లేకుండా భారత్ టెస్టు సిరీస్ ఆడటం ఇదే తొలిసారి. ఇంగ్లండ్తో సిరీస్కు ముందే ఈ ఇద్దరూ సంప్రదాయ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.విమాన ప్రమాద మృతులకు నివాళిగాకాగా తొలి టెస్టు సందర్భంగా అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితులకు ఇరుజట్ల ఆటగాళుల సంతాపం ప్రకటించారు. నిమిషం పాటు మౌనం పాటించడంతో పాటు.. బ్లాక్ ఆర్మ్బ్యాండ్లతో బరిలోకి దిగారు. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 181 మంది భారత ప్రయాణికులతో పాటు 53 మంది బ్రిటిష్ పౌరులు మృతి చెందారు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టువేదిక: హెడింగ్లీ మైదానం, లీడ్స్టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్తుదిజట్లుభారత్🏏యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.ఇంగ్లండ్🏏జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్. -
అక్కడ నేనిలాగే ఆడతా అంటే కుదరదు!.. సొంతంగా నిర్ణయాలు తీసుకో: సచిన్
ఇంగ్లండ్ (Ind vs Eng)తో టెస్టు సిరీస్ రూపంలో టీమిండియాకు కఠిన పరీక్ష ఎదురుకానుంది. ఇరుజట్ల మధ్య శుక్రవారం (జూన్ 20) నుంచి ఐదు మ్యాచ్ల సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ ద్వారానే భారత యువ ఆటగాడు శుబ్మన్ గిల్ కెప్టెన్గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు.దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), స్పిన్ లెజెండ్ రవించంద్రన్ అశ్విన్, కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియా ఆడబోయే సిరీస్ ఇదే కావడం.. అది కూడా ఇంగ్లండ్ గడ్డపై మ్యాచ్లు జరుగనుండటంతో సారథిగా గిల్ ఈ ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.వాటిని పట్టించుకోకు.. సొంతంగా నిర్ణయాలు తీసుకోఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం, శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ గిల్కు కీలక సూచనలు చేశాడు. ఒత్తిడిని జయిస్తేనే అతడు అనుకున్న ఫలితం రాబట్టగలడని పేర్కొన్నాడు. ‘‘‘అతడు అలా చేయాలి.. ఇలా చేస్తే బాగుండు’ అని బయటి నుంచి ఎన్నో అభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి.అయితే, అతడి దృష్టి మొత్తం టీమ్ ప్లాన్పై మాత్రమే కేంద్రీకృతమై ఉండాలి. డ్రెసింగ్ రూమ్లో జరిగే చర్చలపైనే ఫోకస్ చేయాలి. ప్రణాళికలకు అనుగుణంగానే జట్టు ముందుకు సాగుతుందా? లేదా? అన్న విషయాలను గమనిస్తూ ఉండాలి.ముఖ్యంగా మ్యాచ్కు ముందు రచించే ప్రణాళికలు జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో సరిగ్గా అంచనా వేయగలగాలి. బయటి ప్రపంచం ఏమనుకుంటుందో అన్న విషయంతో సంబంధం లేకుండా.. దృష్టి మరల్చకుండా ఆటపైనే మనసు లగ్నం చేయాలి.కొన్నిసార్లు బయటి వ్యక్తుల నుంచి తీవ్రమైన విమర్శలు రావచ్చు. అలాంటపుడు ఒత్తిడిని దరిచేరనీయకూడదు. డిఫెన్స్లో పడిపోకూడదు. ఎవరికి తోచినట్లుగా వారు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.ముందుగా చెప్పినట్లు డ్రెసింగ్ రూమ్లో చర్చలు, జట్టు ప్రయోజనాల గురించే ఆలోచించాలి. అంతకు మించి పెద్దగా చేయాల్సిందేమీ కూడా ఉండదు’’ అని సచిన్ టెండుల్కర్ చెప్పుకొచ్చాడు.ఇలాగే బ్యాటింగ్ చేస్తా అంటే కుదరదుఇక ఇంగ్లండ్ గడ్డ మీద బ్యాటర్లు మరింత జాగ్రత్తగా ఉండాలన్న సచిన్ టెండుల్కర్.. ‘‘పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయాలి. అలా అయితేనే ప్రణాళికలకు తగ్గట్లుగా ముందుకు వెళ్లే వీలు ఉంటుంది. ఇదేమీ వన్వే ట్రాఫిక్ కాదు.. ‘నేనిలాగే ఉంటా.. ఇలాగే బ్యాటింగ్ చేస్తా అంటే కుదరదు’.పిచ్ పరిస్థితులకు ఆకళింపు చేసుకున్న తర్వాతే అసలైన ఆట మొదలుపెట్టాలి’’ అని భారత ఆటగాళ్లకు సూచించాడు. ఏదేమైనా ఈసారి టీమిండియా ఇంగ్లండ్లో టెస్టు సిరీస్ గెలుస్తుందనే నమ్మకం ఉందని సచిన్ టెండుల్కర్ ధీమా వ్యక్తం చేశాడు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను 3-1తో సొంతం చేసుకుంటుందని అంచనా వేశాడు. కాగా ఇంగ్లండ్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్కు టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేసిన విషయం తెలిసిందే. కాగా ఇంగ్లండ్ గడ్డ మీద 1990- 2011 మధ్య సచిన్ ఐదు టెస్టు సిరీస్లు ఆడాడు.చదవండి: WI Vs AUS 1st Test: వరుస వైఫల్యాలు.. స్టార్ ఆటగాడిపై వేటు వేసిన ఆస్ట్రేలియా -
IND Vs ENG: నేటి నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం (ఫొటోలు)
-
నాపై ఒత్తిడి లేదు.. బెస్ట్ బ్యాటర్గా ఉండాలనుకుంటున్నా: గిల్
లీడ్స్లోని హెడింగ్లీ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు శుక్రవారం(జూన్ 20) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్లో శుభరంభం చేయాలని భారత జట్టు భావిస్తోంది. ఈ క్రమంలో గురువారం(జూన్ 18) టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ విలేకరుల సమావేశంలో పాల్గోనున్నాడు.ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు గిల్ సమాధనమిచ్చాడు. భారత కెప్టెన్గా తను ఎదుర్కొనున్న ఛాలెంజ్స్ కోసం గిల్ మాట్లాడాడు. అయితే కెప్టెన్సీ భారం తన బ్యాటింగ్పై పడకుండా చూసుకుంటాని అతడు చెప్పుకొచ్చాడు. "ఇప్పటివరకు ఏ విధంగా అయితే పూర్తి స్వేఛ్చతో బ్యాటింగ్ చేశానో, ఇకపై కూడా అదే కొనసాగిస్తున్నాను. కెప్టెన్సీ గురుంచి ఎక్కువగా ఆలోచించకుండా నా బ్యాటింగ్పైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఈ సిరీస్లో బెస్ట్ బ్యాటర్గా ఉండాలని భావిస్తున్నా. విరాట్ కోహ్లి బ్యాటింగ్ స్ధానం కోసం ఇప్పటికే గంభీర్ భాయ్, నేను చర్చించుకున్నాము. మా దగ్గర రెండు వేర్వేరు కాంబినేషన్లు సిద్దంగా ఉన్నాయి. పిచ్ను పరిశీలించాక ఓ నిర్ణయం తీసుకుంటాము" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో గిల్ పేర్కొన్నాడు.భయపెడుతున్న గిల్ రికార్డు..శుబ్మన్ గిల్ తన కెరీర్లో 32 టెస్టులు ఆడి 1893 పరుగులు చేశాడు. అందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. కానీ సేనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అతడి రికార్డు మాత్రం టీమ్మెనెజ్మెంట్ను కలవరపెడుతోంది. సెనాదేశాల్లో గిల్ ఇప్పటివరకు 11 టెస్టులు ఆడి 514 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్లో అయితే అతడి ప్రదర్శన మరి దారుణంగా ఉంది. ఇంగ్లండ్ గడ్డపై మూడు టెస్టులు ఆడిన శుబ్మన్.. 14.66 సగటుతో కేవలం 88 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: ‘కోహ్లి చెప్పింది నిజమే.. కానీ మాకూ కుటుంబం ఉంటుంది.. డబ్బు సంపాదించాలి’ -
గిల్ కచ్చితంగా ట్రోఫీతోనే తిరిగి వస్తాడు: టీమిండియా దిగ్గజం
భారత టెస్టు క్రికెట్లో కొత్త శకం ఆరంభం కానుంది. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, కెప్టెన్ రోహిత్ శర్మ వంటి దిగ్గజాల నిష్క్రమణ తర్వాత.. యువ ఆటగాడు శుబ్మన్ గిల్ సారథ్యంలో భారత జట్టు ఇంగ్లండ్ గడ్డ మీద తొలి టెస్టు సిరీస్ ఆడబోతోంది. లీడ్స్లో శుక్రవారం నుంచి ఇరుజట్ల మధ్య పోటీ ఆరంభం కానుంది.ఆ ముగ్గురికే సాధ్యమైందిఅయితే, ఇంగ్లండ్లో టెస్టు సిరీస్ గెలవడం అంత సులువేమీ కాదు. ఇప్పటి వరకు టీమిండియా కేవలం మూడుసార్లు మాత్రమే అక్కడ విజయపతాక ఎగురవేసింది. 1971లో అజిత్ వాడేకర్ సారథ్యంలో.. 1986లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో.. చివరగా 2007లో రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో ఇంగ్లండ్ను తమ స్వదేశంలో భారత్ ఓడించగలిగింది.ఈ నేపథ్యంలో.. కఠిన సవాలుకు సిద్ధమైన గిల్ సేన.. సొంతగడ్డపై మరింత పటిష్టంగా కనిపించే స్టోక్స్ బృందాన్ని ఏ మేరకు కట్టడి చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ భారత జట్టు కొత్త సారథి శుబ్మన్ గిల్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గిల్ తప్పక ట్రోఫీతో తిరిగి వస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.ఈ మేరకు.. ‘‘అతడు ప్రతిభావంతుడైన ఆటగాడు. ఇప్పుడు భారత జట్టుకు కెప్టెన్ అయ్యాడు. కచ్చితంగా ట్రోఫీతోనే అతడు ఇంగ్లండ్ నుంచి తిరిగి వస్తాడు. మనల్ని గర్వపడేలా చేస్తాడు. టీమిండియాకు గుడ్లక్. మనోళ్లు విజేతలుగా తిరిగి వస్తారు. వారికి ఆ సత్తా ఉంది’’ అని కపిల్ దేవ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో వ్యాఖ్యానించాడు.విచిత్రంగా అనిపించింది..టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ను పటౌడీ ట్రోఫీగా పిలిచేవారు. అయితే, తాజాగా దీనికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేసింది. ఈ విషయంపై స్పందించిన కపిల్ దేవ్.. ‘‘నాకైతే ఇది విచిత్రంగా అనిపించింది.ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యం వేసింది. మరేం పర్లేదు. క్రికెట్లో అన్నీ జరుగుతాయి. క్రికెట్ అంటే క్రికెటే. మైదానంలో ఆటగాళ్ల స్ఫూర్తి అలాగే ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. కాగా పటౌడీ పేరును తొలగించడంపై ఈసీబీపై విమర్శలు వచ్చాయి.ఈ నేపథ్యంలో బీసీసీఐ, టీమిండియా లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ విజ్ఞప్తి నేపథ్యంలో.. భారత్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ గెలిచిన కెప్టెన్కు పటౌడీ పేరిట పతకం అందించాలని ఈసీబీ నిర్ణయించింది.చదవండి: ‘సచిన్, గంభీర్, యువీ.. ఒక్కడి కోసం అందరి కెరీర్లు నాశనం చేశారు’ -
ఇంగ్లండ్తో తొలి టెస్టుకు భారత తుదిజట్టు ఇదే!
ఇంగ్లండ్తో తొలి టెస్టు నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన తుదిజట్టు (భారత్)ను ప్రకటించాడు. కేఎల్ రాహుల్ (KL Rahul)- యశస్వి జైస్వాల్లను ఓపెనింగ్ జోడీగా ఎంపిక చేసుకున్న అశూ.. జట్టులో ఒకే ఒక్క స్పిన్నర్కు స్థానం ఇచ్చాడు. అదే విధంగా.. చెన్నై బ్యాటర్ సాయి సుదర్శన్ ఈ మ్యాచ్తో అరంగేట్రం చేస్తాడని పేర్కొన్నాడు.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27లో భాగంగా భారత్- ఇంగ్లండ్ తమ తొలి సిరీస్లో పరస్పరం తలపడనున్నాయి. ఇరుజట్ల మధ్య శుక్రవారం నుంచి మొదలయ్యే ఈ సిరీస్లోని తొలి టెస్టుకు లీడ్స్ వేదిక. ఈ మ్యాచ్తో శుబ్మన్ గిల్ (Shubman Gill) టీమిండియా టెస్టు కెప్టెన్గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు.అశూ ప్లేయింగ్ ఎలెవన్ ఇదేఇక వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ లీడ్స్ టెస్టుకు భారత తుదిజట్టుపై తన అంచనా తెలియజేశాడు. సాయి సుదర్శన్తో పాటు కరుణ్ నాయర్కు కూడా తన జట్టులో చోటిచ్చాడు.‘‘కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ’’ అంటూ ఇంగ్లండ్తో తొలి టెస్టుకు తాను ఎంపిక చేసిన ప్లేయింగ్ ఎలెవన్ను అశూ వెల్లడించాడు.అందుకే కరుణ్కే ఓటుఅయితే, ఆరో స్థానం కోసం కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్ మధ్య పోటీ ఉందని.. తాను మాత్రం ఫామ్ దృష్ట్యా కరుణ్కే ఓటు వేస్తానని అశూ తెలిపాడు. ఇక బుమ్రా అందుబాటులో లేనిపక్షంలో బౌలింగ్ ఆప్షన్ కోసం శార్దూల్ను ఎనిమిదో స్థానంలో ఆడించాలని సూచించాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా అశూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.అత్యధిక వికెట్లు తీసేది అతడే!అదే విధంగా.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇంగ్లిష్ పేసర్ క్రిస్ వోక్స్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలుస్తాడని అశూ జోస్యం చెప్పాడు. లేదా షోయబ్ బషీర్ హయ్యస్ట్ వికెట్ టేకర్ అవుతాడని పేర్కొన్నాడు.టీమిండియా నుంచి బుమ్రా అన్ని మ్యాచ్లు ఆడటం లేదు కాబట్టి అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదని చెప్పాడు. అయితే, సిరాజ్కు మాత్రం ఆ అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. పరుగుల వీరుడిగా పంత్!ఇక అత్యధిక పరుగులు వీరుడిగా రిషభ్ పంత్ నిలుస్తాడని అంచనా వేసిన అశూ.. ఇంగ్లండ్ నుంచి జో రూట్, బెన్ డకెట్ల పేర్లు కూడా కొట్టిపారేయలేమన్నాడు. కాగా భారత్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేసిన విషయం తెలిసిందే. గెలిచిన కెప్టెన్కు పటౌడీ మెడల్ అందిస్తారు.ఇంగ్లండ్తో తొలి టెస్టుకు అశ్విన్ ఎంపిక చేసిన భారత తుదిజట్టుకేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), కరుణ్ నాయర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.భారత్తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ ప్రకటించిన తుదిజట్టుజాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.చదవండి: ’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’ -
Ind vs Eng: కోహ్లి స్థానంలో అతడే: క్లారిటీ ఇచ్చిన పంత్
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ఆరంభం నేపథ్యంలో టీమిండియా వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ కీలక అప్డేట్ అందించాడు. విరాట్ కోహ్లి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి పేరు వెల్లడించాడు. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో కెప్టెన్ శుబ్మన్ గిల్ బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా టీమిండియా తమ తొలి సిరీస్లో ఇంగ్లండ్తో తలపడనుంది. లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. కాగా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు ముందే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో రోహిత్ స్థానాన్ని శుబ్మన్ గిల్తో భర్తీ చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI).. అతడికి డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ను నియమించింది. కాగా కోహ్లి నిష్క్రమణ నేపథ్యంలో టెస్టుల్లో భారత బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానంలో ఎవరు దిగుతారన్న అంశంపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.కోహ్లి వారసుడిగా కరుణ్ నాయర్, సాయి సుదర్శన్ పేర్లు వినిపించాయి. తాజాగా ఈ విషయంపై వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ క్లారిటీ ఇచ్చేశాడు. ప్రి- మ్యాచ్ కాన్ఫరెన్స్లో భాగంగా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘శుబ్మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు.అయితే, అతడు ఆడుతున్న మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నేను యథావిధిగా ఐదో స్థానంలో బ్యాటింగ్కు వస్తాను’’ అని రిషభ్ పంత్ వెల్లడించాడు. దీంతో తుదిజట్టుపై మరోసారి సందిగ్దం నెలకొంది. సాయి సుదర్శన్ టెస్టుల్లో అరంగేట్రం చేస్తాడా? లేదంటే ‘ట్రిపుల్ సెంచూరియన్’ కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది.ఇంగ్లండ్తో టెస్టులకు టీమిండియా:శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్/వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.చదవండి: టీమిండియాకు గేమ్ ఛేంజర్లు వీరిద్దరే: ఊహించని పేర్లు చెప్పిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ -
కోహ్లి లేకుండా టీమిండియాతో సిరీస్.. స్టోక్స్ రియాక్షన్ వైరల్!
ఇంగ్లండ్తో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్కు టీమిండియా సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య శుక్రవారం (జూన్ 20) నుంచి ఐదు మ్యాచ్ల సిరీస్ ఆరంభం కానుంది. కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) సారథ్యంలో భారత జట్టు స్టోక్స్ బృందంతో తలపడనుంది. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), మాజీ సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్ తర్వాత టీమిండియా ఆడే తొలి టెస్టు సిరీస్ కావడంతో గిల్ సేన ఎలా ఆడబోతుందన్న అంశంపైనే క్రికెట్ ప్రేమికుల దృష్టి కేంద్రీకృతమైంది.అతడికి ఎవరూ సాటిరారుఈ నేపథ్యంలో సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ విరాట్ కోహ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కోహ్లి సేవలను కచ్చితంగా మిస్ అవుతుందని.. అతడి పోరాటపటిమ, పట్టుదలకు ఎవరూ సాటిరారని పేర్కొన్నాడు. క్లాస్ ప్లేయర్ లేకుండా బరిలోకి దిగడం భారత జట్టుకు కాస్త కష్టంగానే ఉంటుందని తెలిపాడు.ఈ మేరకు.. ‘‘పోరాటతత్వం గల.. అదే విధంగా క్రీడాస్పూర్తిని రగిల్చే కోహ్లిని టీమిండియా మిస్ అవుతుందనడంలో సందేహం లేదు. గెలుపు కోసం అతడు పడే తాపత్రయం, అందుకోసం అతడు చేసే పోరాడే విధానానికి ఎవరూ సాటిరారు.18వ నంబర్ను అతడు తన గుర్తింపుగా మార్చుకున్నాడు. వేరొక భారత ఆటగాడి జెర్సీపై నంబర్ 18ను చూడటం కాస్త చిత్రంగానే అనిపించవచ్చు. సుదీర్ఘకాలంగా అతడు టీమిండియా క్లాస్ ప్లేయర్గా కొనసాగిన తీరు అమోఘం’’ అని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు.కోహ్లి ఉంటేనే మజాఅదే విధంగా కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. తాను అతడి మెసేజ్ చేశానన్న స్టోక్స్... అతడు లేని టెస్టు క్రికెట్ ఆడటం అంత గొప్పగా ఉండదని చెప్పానన్నాడు. ‘‘ విరాట్ కోహ్లికి ప్రత్యర్థిగా ఆడటంలో ఎంతో మజా ఉంటుంది. కానీ ఇకపై అది జరుగబోదని తెలిసి నాకు కాస్త విచారంగా అనిపించింది.మైదానంలో ఉన్నప్పుడు యుద్ధరంగంలో ఉన్నట్లే నేను, కోహ్లి భావిస్తాం. ఆట విషయంలో మా ఇద్దరి ఆలోచనా విధానం ఒకే విధంగా ఉంటుంది. ఇంగ్లండ్ జట్టు మీద అతడు ఎంతో గొప్పగా ఆడాడు. అతడొక క్లాస్ ప్లేయర్’’ అని స్టోక్స్ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.దిగ్గజ కెప్టెన్ కూడా!కాగా టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి తన పద్నాలుగేళ్ల టెస్టు కెరీర్లో.. 123 మ్యాచ్లు ఆడి 9230 పరుగులు సాధించాడు. ఇందులో ముప్పై శతకాలు ఉన్నాయి. అంతేకాదు.. టీమిండియా టెస్టు కెప్టెన్గా కోహ్లి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకున్నాడు. అంతేకాదు.. గ్రేమ్ స్మిత్ (53 విజయాలు), రిక్కీ పాంటింగ్ (48 విజయాలు), స్టీవ్ వా(41 విజయాలు) తర్వాత అత్యధిక టెస్టు విజయాలు (40) అందుకున్న సారథిగా నిలిచాడు. ఇంగ్లండ్ గడ్డ మీద కెప్టెన్గా పది టెస్టులు ఆడిన కోహ్లి.. మూడింట జట్టును గెలిపించాడు.చదవండి: ఇంగ్లండ్తో తొలి టెస్ట్కు భారత బ్యాటింగ్ లైనప్ ఇదే.. రోహిత్, కోహ్లికి ప్రత్యామ్నాం వీళ్లే..! -
కొత్త ఆరంభానికి సిద్ధం
భారత జట్టు ఇంగ్లండ్ గడ్డపై 19 సిరీస్లు ఆడితే 14 సిరీస్లలో పరాజయమే పలకరించింది. రెండు సిరీస్లు సమంగా ముగియగా మూడుసార్లు భారత జట్టు విజేతగా నిలిచింది. అయితే పాత రికార్డుల్లోకి వెళ్లకుండా గత మూడు సిరీస్లనే చూసుకుంటే టీమిండియా ప్రదర్శనలో అక్కడక్కడ చెప్పుకోదగ్గ మెరుపులు ఉన్నాయి. చివరిసారిగా 2021–22లో పర్యటించిన సమయంలో ఐదు టెస్టుల సిరీస్ను 2–2తో ‘డ్రా’ చేసుకోవడం మన జట్టు మెరుగైన ప్రదర్శనకు సూచిక.అంతకుముందు రెండు పర్యటనల్లో రెండు మ్యాచ్లు మాత్రమే గెలిచిన రికార్డు అంకెల్లో కనిపిస్తున్నా... భారత్ చాలా సందర్భాల్లో పైచేయి సాధించింది. దురదృష్టవశాత్తూ కీలక క్షణాల్లో పట్టు తప్పడంతో మ్యాచ్లు చేజార్చుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా సిరీస్లో శుబ్మన్ గిల్ బృందం పట్టుదలను, పోరాటపటిమను ప్రదర్శిస్తే ఇంగ్లండ్తో గట్టి పోటీనివ్వడం ఖాయం. అంచనాలకు అనుగుణంగా రాణిస్తే సిరీస్ ఏకపక్షంగా సాగకుండా ఇంగ్లండ్ను టీమిండియా నిలువరించవచ్చు. –సాక్షి క్రీడా విభాగం ప్రస్తుతం సిరీస్కు సిద్ధమైన జట్టులో ఇంగ్లండ్ గడ్డపై అనుభవంరీత్యా చూస్తే రవీంద్ర జడేజాఅందరి కంటే సీనియర్. గత మూడు సిరీస్లలో అతను జట్టులో భాగంగా ఉన్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, అశ్విన్లాంటి ఆటగాళ్లు జట్టుకు దూరమైన స్థితిలో జడేజా అనుభవం జట్టుకు కీలకం కానుంది. కేఎల్ రాహుల్, బుమ్రా, రిషభ్ పంత్ ఇంగ్లండ్లో గత రెండు సిరీస్లు ఆడగా... కుల్దీప్ యాదవ్, సిరాజ్, శార్దుల్ ఠాకూర్లకు కూడా ఆడిన అనుభవం ఉంది. కౌంటీ క్రికెట్లో ఆడటాన్ని పక్కన పెడితే మిగతా ప్లేయర్లంతా అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి ఇంగ్లండ్లో బరిలోకి దిగబోతున్నారు. ఇప్పుడున్న జట్టును చూస్తే స్టార్ అంటూ ఎవరూ లేరు. మున్ముందు సిరీస్లో ఇదే భారత్కు సానుకూలాంశం కూడా కావచ్చు. ఒక్కొక్కరి వ్యక్తిగత ఆటపై కాకుండా టీమిండియా సమష్టి ప్రదర్శన చేయాలని పట్టుదలగా ఉంది. కోచ్ గౌతమ్ గంభీర్కు కూడా ఈ సిరీస్ సవాల్గా నిలవనుంది. బ్యాటర్గా ఇంగ్లండ్ గడ్డపై పేలవమైన రికార్డు (5 టెస్టుల్లో కలిపి 127 పరుగులు) ఉన్న గంభీర్ కోచ్గా తన వ్యూహాలకు పదును పెట్టి జట్టుకు ఎలా మార్గనిర్దేశం చేస్తాడనేది ఆసక్తికరం. బ్యాటర్లకు సవాల్... మబ్బు పట్టిన వాతావరణంలో బంతి అనూహ్యంగా స్వింగ్ కావడం... డ్రైవ్ కోసం ప్రయతి్నస్తే చాలు బంతి బ్యాట్ అంచులను తాకి స్లిప్స్లోకి దూసుకుపోవడం... ఇంగ్లండ్లో జరిగే టెస్టు సిరీస్లలో సర్వసాధారణంగా కనిపించే దృశ్యాలు. ఇలాంటి స్థితిని దాటి బ్యాటర్లు రాణించాలంటే ఎంతో పట్టుదల, ఓపిక కనబర్చాల్సి ఉంటుంది. తమ బ్యాటింగ్ స్టాన్స్లో కూడా పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఓపెనర్లది ప్రధాన పాత్ర కానుంది. ప్రస్తుతం జట్టు కూర్పును బట్టి చూస్తే యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ ఓపెనింగ్ చేయడం ఖాయమే. జైస్వాల్ 19 మ్యాచ్ల స్వల్ప కెరీర్ను చూస్తే ఆస్ట్రేలియాలో బౌన్సీ పిచ్లపై ఆకట్టుకున్న అతను దక్షిణాఫ్రికాలో రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. ఇప్పుడు ఇంగ్లండ్లో అతను సత్తా చాటాల్సిన సమయం వచి్చంది. తొలి సిరీస్లోనే సుదర్శన్ నుంచి అతిగా ఆశించలేం. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ రెండు ఫైనల్లను వదిలేస్తే గిల్ ఇంగ్లండ్లో ఒకే ఒక టెస్టు ఆడాడు. కెప్టెన్గా అదనపు బాధ్యతతో అతను ఎంత బాగా ఆడతాడనేది కీలకం. గణాంకాల పరంగా చూస్తే మరో ప్రధాన బ్యాటర్ రాహుల్కు ఇంగ్లండ్లో మంచి రికార్డు ఉంది. ఇప్పుడు తన స్థానంపై సందేహాలు లేవు కాబట్టి స్వేచ్ఛగా ఆడగలడు. ఇక మిడిలార్డర్లో కరుణ్ నాయర్పై అందరి దృష్టీ ఉంది. నాయర్కు చోటు దక్కడంలో దేశవాళీ ప్రదర్శనతో పాటు నార్తాంప్టన్షైర్ అనుభవం కీలకపాత్ర పోషించింది. కాబట్టి అతను తనపై ఉంచిన నమ్మ కాన్ని నిలబెట్టుకునేందుకు ఏమాత్రం శ్రమిస్తాడనేది ఆసక్తికరం. ఇక పిచ్, పరిస్థితులతో సంబంధం లేకుండా ఆట దిశను మార్చగల పంత్పై కూడా జట్టు భారీగా ఆశలు పెట్టుకుంది. మెల్బోర్న్ టెస్టు తర్వాత నిలకడ చూపించలేకపోయిన నితీశ్ రెడ్డి మరోసారి తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంది.బుమ్రా, సిరాజ్ చెలరేగితే...ఈ సిరీస్ ఫలితాన్ని ప్రభావితం చేయగల ఏకైక ప్లేయర్లా జస్ప్రీత్ బుమ్రా కనిపిస్తున్నాడు. పని భారంతో అతను గరిష్టంగా మూడు టెస్టులే ఆడవచ్చని మేనేజ్మెంట్ ఇప్పటికే చెప్పింది. ఆ మూడు టెస్టుల్లో ఇంగ్లండ్ బ్యాటర్లకు ‘నరకం’ కనిపించడం ఖాయం. ఇటీవల ఆ్రస్టేలియాకు ఈ అనుభవం ఏమిటో బాగా తెలిసింది. కాబట్టి బుమ్రా పూర్తి ఫిట్నెస్తో తన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే టీమిండియాలో ఆత్మవిశ్వాసం పెరగడం ఖాయం. ఎరుపు బంతితో మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ కూడా చాలా పదునెక్కింది. అక్కడి పరిస్థితుల్లో సిరాజ్ బౌలింగ్ ప్రత్యర్థి పాలిట ప్రమాదకరంగా మారడం ఖాయం. గత సిరీస్లో సిరాజ్ 5 టెస్టులూ ఆడి 18 వికెట్లు వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ అనుభవం చెప్పుకోదగ్గ సానుకూలాంశం. సిడ్నీ టెస్టులో ఆకట్టు కున్న ప్రసిధ్ కృష్ణ మూడో పేసర్గా బరిలోకి దిగనున్నాడు. సుదీర్ఘ సిరీస్ కాబట్టి అర్ష్ దీప్కు ఏదో ఒకదశలో అవకాశం దక్కవచ్చు కానీ ఏమాత్రం ప్రభావం చూపగలడో సందేహమే. అశ్విన్ రిటైర్మెంట్తో ఇప్పుడు కుల్దీప్కు తొలిసారి ప్రధాన స్పిన్నర్గా చోటు ఖాయం. 2018లో ఇక్కడ ఆడిన ఏకైక మ్యాచ్లో విఫలమైన అతను పెద్ద బాధ్యతను సమర్థంగా నిర్వర్తించడం ముఖ్యం. కెరీర్ చివరి దశలో ఉన్న జడేజా ఆల్రౌండర్గా రాణించడం ముఖ్యం. సీమ్ బౌలర్ శార్దుల్ శైలితో ఇక్కడ మంచి ఫలితం రాబట్టవచ్చు కాబట్టి మేనేజ్మెంట్ మొగ్గు శార్దుల్ వైపు ఉంది. -
కోహ్లి, రోహిత్ లేకపోయినా పర్వాలేదు.. గిల్ అంతా చూసుకుంటాడు: గూచ్
టీమిండియా టెస్టు కెప్టెన్గా యువ బ్యాటర్ శుబ్మన్ గిల్ తొలి సవాల్ను ఎదుర్కొనేందుకు సిద్దమయ్యాడు. అతడి సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్ వేదికగా జరగనుంది.ఈ మ్యాచ్ కోసం గిల్ సేన తమ ఆస్త్రశాస్రాలను సిద్దం చేసుకుంది. అయితే ఈ సిరీస్లో స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లేని యువ భారత జట్టు ఎలా రాణిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కమంలో ఇంగ్లండ్ మాజీ టెస్టు కెప్టెన్ కెప్టెన్ గ్రాహం గూచ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.కోహ్లి, రోహిత్ స్ధానాలను భర్తీ చేసే అద్బుత ఆటగాళ్లు ప్రస్తుత భారత జట్టులో ఉన్నారని గూచ్ అభిప్రాయపడ్డాడు. ఈ ఇద్దరి దిగ్గజాల స్ధానాలను భర్తీ చేసేందుకు సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్ సిద్ధంగా ఉన్నారు. కానీ టీమ్ మెన్జ్మెంట్ ఎవరికి అవకాశమిస్తుందో వేచి చూడాలి."భారత క్రికెట్లో కొత్త యుగం మొదలైంది. నా వరకు అయితే.. ఒక దారి మూసుకుపోతే, మరో దారి తెరుచుకుంటుంది. ఈ పర్యటనలో భారత ఆటగాళ్లు మెరుగ్గా రాణిస్తారని నేను నమ్ముతున్నాను. భారత క్రికెట్ జట్టులో ప్రతిభకు కొదవలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వారసత్వాన్ని కొనసాగించేందుకు యువ ఆటగాళ్లు సిద్దంగా ఉన్నారు.అయితే బుమ్రా అన్ని మ్యాచ్లలో ఆడకపోవడం భారత్కు గట్టి ఎదురు దెబ్బే. బుమ్రా ఒక వరల్డ్ క్లాస్ బౌలర్. ఎటువంటి పరిస్థితులలోనైనా అతడిని ఎదుర్కొవడం అంత సులభం కాదు. ఈ పర్యటనలో భారత జట్టుపై కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది.కానీ కొంతమంది యువ ఆటగాళ్లు తమ ప్రదర్శలనతో ముందుకు రావాలి. ఇక భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడం అరుదైన గౌరవంగా భావించాలి. శుబ్మన్ గిల్ జట్టును విజయ పథంలో నడిపిస్తాడన్న నమ్మకం నాకు ఉందని" టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గూచ్ పేర్కొన్నాడు.చదవండి: ICC Odi Rankings: వరల్డ్ నెం1 బ్యాటర్గా టీమిండియా స్టార్ ఓపెనర్ -
ఇంగ్లండ్తో తొలి టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్
లీడ్స్ వేదికగా జూన్ 20న ఇంగ్లండ్తో ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా స్వదేశానికి వచ్చేసిన హెడ్ కోచ్ గౌతం గంభీర్.. తిరిగి మంగళవారం భారత జట్టుతో కలవనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏఎన్ఐ వర్గాల సమాచారం ప్రకారం.. గంభీర్ సోమవారం(జూన్ 16) లండన్కు బయలుదేరినట్లు తెలుస్తోంది. కాగా ఈ సిరీస్ కోసం గంభీర్ జూన్ 5న భారత జట్టుతో పాటు ఇంగ్లండ్కు పయనమయ్యాడు. అతడి నేతృత్వంలో భారత జట్టు నాలుగు రోజుల ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గోంది.అయితే తన తల్లి గుండెపోటుతో అస్పత్రిలో చేరడంతో గౌతీ ఉన్నపళంగా జూన్ 11న స్వదేశానికి వచ్చేశాడు. ఇప్పుడు అతడి తల్లి ఆరోగ్యం మెరుగుపడడంతో గంభీర్ తిరిగి ఇంగ్లండ్కు పయనమైనట్లు తెలుస్తోంది. ఇక గంభీర్ లేకపోవడంతో భారత జట్టు తమ ప్రాక్టీస్ను బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీయస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో కొనసాగించింది.క్రిక్ బజ్రిపోర్ట్స్ ప్రకారం.. టీమిండియా సన్నాహాలను లక్ష్మణ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. లక్ష్మణ్ భారత జట్టుతో కాకుండా తన వ్యక్తిగత పనుల మీద ఇంగ్లండ్కు వెళ్లాడు. కానీ గంభీర్ ఉన్నపళంగా స్వదేశానికి వెళ్లిపోవడంతో లక్ష్మణ్ లౌసాన్ నుండి లండన్కు వచ్చినట్లు క్రిక్బజ్ తమ రిపోర్ట్లో పేర్కొంది.ఇక తొలి టెస్టుకు గిల్ సారథ్యంలోని భారత జట్టు అన్నివిధాల సిద్దమైంది. ఈ టెస్టుకు ముందు ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్లో భారత సీనియర్, భారత-ఎ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో రాహుల్, గిల్, శార్ధూల్ ఠాకూర్ వంటి మెరుగ్గా రాణించారు. కాగా ఈ సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా జరగనుంది.ఇంగ్లండ్తో సిరీస్కు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్,వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, శార్దూల్ సింగ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో తొలి టెస్టుకు భారత జట్టు ఇదే! యువ సంచలనానికి నో ఛాన్స్? -
కలలో కూడా ఊహించలేదు
లండన్: టీమిండియా సారథ్య బాధ్యతలు నిర్వర్తించే అవకాశం లభిస్తుందని కలలో కూడా ఊహించలేదని భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్ అన్నాడు. పేస్ తురుపుముక్క బుమ్రా అందుబాటుపై ముందుగానే చెప్పడం కుదరదన్నాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేందుకు... యథేచ్చగా ఆడేందుకు తగిన లక్ష్యాలను నిర్దేశించుకుంటామన్నాడు. స్టార్, వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు సంప్రదాయ ఫార్మాట్కు వీడ్కోలు పలకడంతో గిల్కు జట్టు పగ్గాలు అప్పగించారు. ఇన్నాళ్లు ఓపెనింగ్ సవాల్ను ఎదుర్కొన్న శుబ్మన్ ఇప్పుడు మొదటిసారి ఓపెనింగ్తోపాటు సారథ్య పరీక్షకూ ఇంగ్లండ్కు వచ్చాడు. 2007లో టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గింది. తర్వాత చాలాసార్లు పర్యటించినా విజయం మాత్రం దక్కలేదు. ఇప్పుడు గిల్ నేతృత్వంలోని భారత్ ఈ నిరీక్షణకు తెరదించేందుకు ఐదు టెస్టుల సిరీస్లో రాణించడంపై దృష్టి సారించింది. ఇంగ్లండ్లోని స్కై స్పోర్ట్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై గిల్ వెలిబుచ్చిన అభిప్రాయాలు అతని మాటల్లోనే... ఆటగాళ్లపై ఒత్తిడి లేకుండా... ఆటగాళ్లపై ఒత్తిడి లేకుండా జట్టు సంస్కృతిని మార్చాలనుకుంటున్నాను. సురక్షితమైన వాతావరణం కల్పించడం ద్వారా ఆ ఆటగాడు యథేచ్చగా ఆడే అవకాశం కల్పిస్తే... అతని పూర్తిస్థాయి సామర్థ్యం బయటపడుతుంది. ఓ నాయకుడు జట్టుకు చేయాల్సింది అదేనని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ఇది అంతసులువు కాదని నాకూ తెలుసు. అయితే ఆ దిశగా నా ప్రణాళికలుంటాయి. కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్లో దూకుడుగా ఉన్నట్లే జట్టును నడిపించే విషయంలోనే అంతే పట్టుదలను ప్రదర్శిస్తాడు. సిరీస్ లేదంటే పర్యటనలో ఆటగాళ్ల నుంచి తనకు ఏం కావాలనేది స్పష్టం చేస్తాడు. ముగిసిన తర్వాత సమీక్షలోనూ ఇదే పంథా అనుసరిస్తాడు. ఇది సరైన మార్గనిర్దేశనమని నేను భావిస్తున్నా. దూకుడైన సారథిగా కోహ్లి మార్కు కూడా జట్టుపై ఉంది. ఇద్దరి నుంచి నేనెంతో నేర్చుకున్నాను. అంచనాలనేవి సహజం చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతం గంభీర్లు నాపై అసాధారణ ఒత్తిడిని పెట్టలేదు. అమితమైన అంచనాలను పెంచలేదు. అయితే ఓ ఆటగాడిగా, కెప్టెన్గా నాపై సహజంగానే కొన్ని అంచనాలయితే తప్పకుండా ఉంటాయి. ఇది కాదనలేని సత్యం. వాటిని అందుకునేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా. నా ఆటతీరుపై మా నాన్న ప్రభావం తప్పకుండా ఉంటుంది. నాలాగే తను కూడా భారత టెస్టు జట్టుకు కెప్టెన్ను అవుతానని ఏనాడూ ఊహించలేదు. ఆయన కూడా నాలాగే టీమిండియాకు ఆడటం, జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించాలనే ఆశలే పెట్టుకున్నాడు. కెప్టెన్సీపై నాతో సంప్రదింపులు జరుగుతున్నప్పుడే నాన్న నాకు ఫోన్ చేసి ఆడిగారు. కానీ నేను మాత్రం అధికారికంగా నియమించాకే నాన్నతో ఆ విషయాన్ని పంచుకున్నాను. గంభీర్ శైలిని అందిపుచ్చుకోవడం... ఐపీఎల్లోనే కోచ్ గంభీర్ శైలికి అలవాటు పడ్డాను. కోల్కతా నైట్రైడర్స్కు నేను ఆడినపుడు గంభీర్ మెంటార్గా ఉన్నాడు. కాబట్టి అతని శిక్షణ శైలిపై అవగాహన ఉంది. ఇప్పుడు ఓ జాతీయ జట్టుకు అతను హెడ్ కోచ్ కాబట్టి ఎంతబాగా అతని శైలి తెలిసున్నప్పటికీ ఇంకాస్త జాగ్రత్తగా అనుసరించాల్సి ఉంటుంది. జట్టు కోసం అంకితభావం, నిబద్ధతతో పనిచేసే గంభీర్ ఆటగాళ్లకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. జట్టు ముందున్న లక్ష్యాలు, ఆటగాళ్లు అందుకోవాల్సిన అంచనాలు ముందే స్పషీ్టకరిస్తాడు. జట్టుకు ఏ సమయంలో ఏం కావాలనేది ఓ సానుకూల దృక్పథంతో ఆటగాళ్ల మానసిక స్థయిర్యాన్ని పెంచుతాడు. బుమ్రా అందుబాటుపై... పేసర్ బుమ్రాపై పని భారాన్ని తగ్గించేందుకు అన్ని టెస్టులకు అందుబాటులో ఉండటం లేదు. అయితే ఏ, ఏ మ్యాచ్లు ఆడతాడనేది ఇప్పుడే వెల్లడించడం సాధ్యం కాదు. ఐదు టెస్టుల పూర్తిస్థాయి సిరీస్లో పరిస్థితులు, పలు అంశాలను బట్టి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ అతను ఈ మ్యాచ్ ఆడడు. వచ్చే మ్యాచ్ ఆడతాడు అని చెప్పలేం. ఇంగ్లండ్ ‘బజ్బాల్ క్రికెట్’ను ఎదుర్కొనేందుకు ప్రణాళికలేం లేవు. పరిస్థితులను బట్టే జట్టు ఎత్తుగడలు అమలవుతాయి. దూకుడు ప్రతీసారి ఫలించదు. ఆ విషయం నాకు తెలుసు. -
శుభ్మన్ గిల్ ఓవరాక్షన్.. సచిన్, కోహ్లి కూడా ఎప్పుడూ అలా చేయలేదు..!
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియా నయా కెప్టెన్ శుభ్మన్ గిల్పై విమర్శలు వస్తున్నాయి. గిల్ ఓ ఫోటో షూట్లో తనను స్పాన్సర్ చేస్తున్న ఎంఆర్ఎఫ్ కంపెనీ బ్యాట్తో దర్శనమిచ్చాడు. ఇందులో తప్పేముంది అని అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి.ఎంఆర్ఎఫ్ కంపెనీ క్రికెట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చే ఆటగాళ్లకు స్పాన్సర్ చేస్తూ వస్తుంది. సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, ప్రస్తుతం శుభ్మన్ గిల్ లాంటి స్టార్ ఆటగాళ్లకు ఈ కంపెనీ స్పాన్సర్గా వ్యవహరిస్తూ వచ్చింది. వీరంతా ఎంఆర్ఎఫ్ స్టిక్కర్లు ముద్రించిన బ్యాట్లను వినియోగిస్తారు.తమతో ఒప్పందంలో ఉన్న ఆటగాళ్లకు ఎంఆర్ఎఫ్ ఛాంపియన్, జీనియస్, మాస్టర్ లాంటి బిరుదులు ఇచ్చింది. వీటిని ఆటగాళ్ల బ్యాట్లపై కంపెనీ స్టిక్కర్తో పాటు ముద్రిస్తుంది. జీనియస్ అన్న పదాన్ని ఎంఆర్ఎఫ్ చాలాకాలం పాటు వాడింది. సచిన్, లారా, డివిలియర్స్, విరాట్ ఎంఆర్ఎఫ్ జీనియస్ అనే స్టిక్కర్లు ఉన్న బ్యాట్లు అధికంగా వాడారు.ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్కు ముందు గిల్తో ఒప్పందం చేసుకున్న ఎంఆర్ఎఫ్.. అతనికి కూడా జీనియస్ అన్న బిరుదును కొనసాగించింది. ఇక్కడి వరకు అంతా బాగుంది.గిల్ ఇటీవల టీమిండియా కొత్త కిట్ ఆవిష్కరణ సందర్భంగా ఎంఆర్ఎఫ్ లోగో ఉన్న బ్యాట్తో ఫోటో షూట్కు అటెండ్ అయ్యాడు. బీసీసీఐ అధికారికంగా విడుదల చేసిన ఈ ఫోటోల్లో కొందరు నెటిజన్లు గిల్ బ్యాట్పై ఎంఆర్ఎఫ్ జీనియస్ స్టిక్కర్తో పాటు ప్రిన్స్ అని ముద్రించడాన్ని గమనించారు.ఇదే గిల్పై విమర్శలకు దారి తీసింది. క్రికెట్లో ఎంతో సాధించిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి కూడా తమ బ్యాట్లపై తమ బిరుదులైన గాడ్, కింగ్ అన్న పదాలను ఎప్పుడూ ముద్రించుకోలేదు. గిల్ ఏవరో కొందరు ప్రిన్స్ అనగానే, ఆ పదాన్ని తన బ్యాట్పై ముద్రించుకున్నాడని విమర్శిస్తున్నారు. 🚨The Overhyped "Prince" of Indian Cricket🚨Shubman Gill is so self-obsessed. Who even called you the Prince? A so-called 'Prince of ICT with a poor SENA record, a below 35 Test average, and zero overseas centuries across all formats after 5 years in his international career. pic.twitter.com/SKxiUKT0pa— Niik (@Niiki099) June 11, 2025వాస్తవానికి ప్రిన్స్ అన్న బిరుదు మొదట లారా ఉండిందన్న విషయాన్ని 90 దశకంలోని అభిమానలు గుర్తు చేస్తున్నారు. గిల్ ప్రిన్స్ అన్న బిరుదుకు అర్హుడు కాదని అతని వ్యతిరేకులు కామెంట్లు చేస్తున్నారు. గిల్ ఏం సాధించాడని అతనికి ప్రిన్స్ అన్న బిరుదు అని ప్రశ్నిస్తున్నారు. గిల్కు టెస్ట్ల్లో 35 కంటే తక్కువ సగటు ఉందని గుర్తుకు చేస్తున్నారు. SENA దేశాల్లో అతనికి చెత్త రికార్డు ఉందని ప్రస్తావిస్తున్నారు. ఐదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో విదేశాల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదని అని గుర్తు చేస్తున్నారు. ఆటగాళ్లకు బిరుదులను విశ్లేషకులు, దిగ్గజాలు ఇస్తారు. సోషల్మీడియాలో సొంత డబ్బాను బట్టి బిరుదులు రావంటూ మండిపడుతున్నారు. Sachin Tendulkar never played with a bat that had "God" written over it and Virat Kohli never played with a bat that had "King" written over it. You get tags with your performances and the tags are given by the greats of the game and not from the social media.— Cricket🏏 Lover // ICT Fan Account (@CricCrazyV) June 11, 2025గిల్ తన సొంతంగా బ్యాట్పై ప్రిన్స్ అన్న పదం ముద్రించుకున్నాడో లేక ఎంఆర్ఎఫ్ కంపెనీనే ఆ పదాన్ని ముద్రించిందో తెలియలేదు. కాగా, గిల్ ఇంగ్లండ్ పర్యటనకు ముందే టీమిండియా టెస్ట్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. రోహిత్ శర్మ ఆకస్మిక రిటైర్మెంట్తో గిల్కు ఈ అదృష్టం వరించింది. -
భారత కెప్టెన్ ఒక సూపర్ స్టార్.. కానీ అతడిని మిస్ అవుతారు: ఓలీ పోప్
టీమిండియాతో టెస్టు సిరీస్కు ముందు ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఓలీ పోప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్లో మైదానంలో ఎంతో యాక్టివ్గా ఉండే విరాట్ కోహ్లి సేవలను భారత్ మిస్ అవుతుందని పోప్ అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా ప్రస్తుత భారత జట్టులో యంగ్ టాలెంటెడ్ ఆటగాళ్లు ఉన్నారని అతడు కొనియాడాడు.ఇంగ్లండ్ టూర్కు ముందు కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్కు వరకైనా కొనసాగాలని విరాట్ను సెలక్టర్లు కోరినప్పటికి అతడు మాత్రం తన మనసును మర్చుకోలేదు. అతడితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రెడ్ బాల్ క్రికెట్కు వీడ్కోలు పలికి షాకిచ్చాడు. దీంతో టీమిండియా టెస్టు జట్టు కొత్త కెప్టెన్గా శుబ్మన్ గిల్ నియమితుడయ్యాడు. అదేవిధంగా సాయిసుదర్శన్, అర్ష్దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లు తొలిసారి భారత టెస్టు జట్టులోకి చోటు దక్కగా.. కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం చేశాడు. ఇప్పటికే ఇంగ్లండ్పై గడ్డపై అడుగు పెట్టిన భారత జట్టు.. ప్రాక్టీస్లో మునిగితేలుతోంది. ఇంగ్లండ్ వంటి కఠిన పరిస్థితుల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలోని యంగ్ టీమిండియా ఎలా రాణిస్తుందో అందరూ ఆతృతగా ఎదురు చూస్తోంది.ఈ నేపథ్యంలో ఓలీ పోప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ఇది యువ భారత జట్టు. కానీ ఈ జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. చాలా మందికి కౌంటీల్లో ఆడిన అనుభవం కూడా ఉంది. అదేవిధంగా కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్ టాలెంట్ కోసం మనందరికీ తెలుసు.అతడొక సూపర్ స్టార్. అయితే స్లిప్లో నిలబడి ప్రత్యర్ధి బ్యాటర్లను ఏకగ్రాతను కోల్పోయేలా చేసే విరాట్ కోహ్లి సేవలను మాత్రం భారత్ కోల్పోతుంది. అయినప్పటికీ భారత జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది. వారిని ఎదుర్కొనేందుకు మా ఆటగాళ్లు కూడా సిద్దంగా ఉన్నారు అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ సిరీస్లో తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్ వేదికగా జరగనుంది.చదవండి: IND vs ENG: టీమిండియాతో తొలి టెస్టు.. ఇంగ్లండ్ జట్టులోకి 19 ఏళ్ల యువ సంచలనం -
రచిన్, బ్రూక్.. కొత్త ఫాబ్ ఫోర్ వీళ్లే..!
అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్, జో రూట్, స్టీవ్ స్మిత్ ఫాబ్ ఫోర్గా (అత్యుత్తమమైన నలుగురు) కీర్తించబడుతున్నారు. అయితే వీరిలో విరాట్ కోహ్లి టెస్ట్లకు, టీ20లకు.. స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఫాబ్ ఫోర్కు బీటలు వారినట్లైంది. అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో అత్యుత్తమంగా రాణిస్తుంటేనే ఫాబ్ ఫోర్ బిరుదుకు సార్దకత ఉంటుంది. అలాంటిది విరాట్, స్టీవ్ స్మిత్ ఆయా ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇకపై వీరిని ఫాబ్ ఫోర్లో సభ్యులుగా పరిగణించలేము. మిగిలిన ఇద్దరిలో రూట్, విలియమ్సన్ కూడా కెరీర్ చరమాంకంలో ఉన్నారు. పైగా వీరికి పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదు. వీరిద్దరితో పాటు స్టీవ్ స్మిత్ ప్రస్తుతం టెస్ట్ల్లో మాత్రమే యాక్టివ్గా ఉన్నారు.ఫాబ్ ఫోర్కు బీటలు వారిన నేపథ్యంలో కొత్త ఫాబ్ ఫోర్ ఎవరనే అంశం తెరపైకి వచ్చింది. విశ్లేషకులు, మాజీలు కొత్త ఫాబ్ ఫోర్గా కీర్తించబడేందుకు పలానా ఆటగాళ్లు అర్హులంటూ ఎవరి అభిప్రాయాలను వారు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడ కేన్ విలియమ్సన్ కూడా కొత్త ఫాబ్ ఫోర్ను ప్రకటించాడు. సొంత దేశ ఆటగాడు రచిన్ రవీంద్ర, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్, టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్, టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు కొత్త ఫాబ్ ఫోర్గా కీర్తించబడే అర్హతలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఆసీస్ ఆల్రౌండర్ కెమరూన్ గ్రీన్కు కూడా ఫాబ్ ఫోర్లో భాగమయ్యే అర్హతలున్నాయని అన్నాడు. ఈ సందర్భంగా కేన్ టెస్ట్ క్రికెట్ ప్రాముఖ్యత గురించి ప్రస్తావించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లతో పాటు టెస్ట్ల్లో రాణిస్తేనే ఫాబ్ ఫోర్ అనిపించుకుంటారని తెలిపాడు. తాను వ్యక్తిగతంగా టెస్ట్ క్రికెట్కు అమితమైన ఆదరణ ఉన్న జమానాలో ఎదిగినందుకు గర్వపడుతున్నానని అన్నాడు. యువ ఆటగాళ్లు టీ20ల మాయలో పడి టెస్ట్ క్రికెట్ను విస్మరించకూడదని సూచించాడు. కేన్ అంచనా వేస్తున్న నయా ఫాబ్ ఫోర్ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో విశేషంగా రాణిస్తున్నారు. అయితే వీరంతా ఇదే ప్రదర్శనను సుదీర్ఘకాలం కొనసాగించగలిగితే ఫాబ్ ఫోర్ అనిపించుకుంటారు. గిల్, బ్రూక్, రచిన్, జైస్వాల్, గ్రీన్ ఆటగాళ్లుగా ఇప్పుడిప్పుడే పరిణితి చెందుతున్నారు. వీరి వయసు కూడా చాలా తక్కువ. మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ క్రికెటర్గా స్థిరపడేందుకు వీరికి తగినంత సమయం ఉంది. ఇప్పటివకే వీరు కెరీర్లో అత్యుత్తమ దశలను చూశారు. -
IND vs ENG: టీమిండియా ప్రాక్టీస్ షురూ..
భారత టెస్టు క్రికెట్లో కొత్త శకం మొదలైంది. విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మలు వంటి దిగ్గజాలు లేకుండా తొలి టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్దమైంది. శుబ్మన్ గిల్ సారథ్యంలోని యువ భారత జట్టుకు ఇంగ్లండ్ రూపంలో కఠిన సవాలు ఎదురుకానుంది.రోహిత్ వారసుడిగా బాధ్యతలు చేపట్టిన శుబ్మన్ గిల్.. జట్టును ఎలా నడిపిస్తాడా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో టెస్టు సిరీస్లను భారత్ కోల్పోవడంతో హెడ్కోచ్ గౌతం గంభీర్పైన కూడా తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఈ క్రమంలో గిల్-గౌతీ కాంబనేషన్లో భారత జట్టు ఎలా రాణిస్తుందో మరి కొన్ని రోజుల్లో తేలిపోనుంది.టీమిండియా ప్రాక్టీస్ షూరూ..ఇక ఐదు మ్యాచ్ల సిరీస్ కోసం టీమిండియా ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఆదివారం(జూన్ 8)తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్లో షేర్ చేసింది. ఈ వీడియోలో కెప్టెన్ గిల్ రవీంద్ర జడేజా, అర్ష్దీప్, సిరాజ్ కసరత్తలు చేస్తున్నట్లు కన్పించింది.కొత్త స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లె రౌక్స్ కూడా భారత జట్టులో చేరారు. రాజీనామా చేసిన సోహమ్ దేశాయ్ స్ధానంలో అడ్రియన్ బాధ్యతలు చేపట్టాడు. ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్ వేదికగా జరగనుంది.ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs ENG: వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల వర్షం..! వీడియో వైరల్𝗣𝗿𝗲𝗽 𝗕𝗲𝗴𝗶𝗻𝘀 ✅First sight of #TeamIndia getting into the groove in England 😎#ENGvIND pic.twitter.com/TZdhAil9wV— BCCI (@BCCI) June 8, 2025 -
ఐపీఎల్ 2025 జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
ఐపీఎల్ 2025 సీజన్ జూన్ 3న జరిగిన ఫైనల్తో ముగిసింది. ఫైనల్లో ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ను ఓడించి ఛాంపియన్గా అవతరించింది. ఐపీఎల్లో ఆర్సీబీకి ఇది తొలి టైటిల్. 18 ఏళ్ల ప్రస్తానంలో ఆ జట్టు మూడు సార్లు ఫైనల్కు చేరినా రన్నరప్తో సరిపెట్టుకుంది. నాలుగో ప్రయత్నంలో ఆ జట్టు టైటిల్ను ఎగరేసుకుపోయింది. పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు 11 ఏళ్ల తర్వాత ఫైనల్కు చేరింది. రెండో ప్రయత్నంలోనూ ఆ జట్టుకు నిరాశే మిగిలింది. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించినా పంజాబ్ తుది మెట్టుపై బోల్తా పడింది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఫైనల్లో ఓడినా పంజాబ్ మంచి మార్కులే కొట్టేసింది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. శ్రేయస్ ఐపీఎల్లో మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ఫైనల్కు చేర్చిన తొలి కెప్టెన్గా చరిత్రకెక్కాడు.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ను తాజాగా ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎంపికయ్యాడు. ఈ జట్టులో ఈ సీజన్ స్టార్లందరికీ చోటు దక్కింది. గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మాత్రం ఈ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ జట్టులో అత్యధికంగా నలుగురు ఆర్సీబీ ఆటగాళ్లకు చోటు దక్కింది. స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లి సహా జితేశ్ శర్మ, కృనాల్ పాండ్యా, జోష్ హాజిల్వుడ్ చోటు దక్కించుకున్నారు. వికెట్కీపర్గా జితేశ్ శర్మ ఎంపికయ్యాడు. ఇంపాక్ట్ సబ్గా సీఎస్కే స్పిన్నర్ నూర్ అహ్మద్ను ఎంపిక చేశారు.ఈ జట్టుకు ఓపెనర్లుగా విరాట్ కోహ్లి, గుజరాత్ ఆటగాడు సాయి సుదర్శన్ ఎంపిక కాగా.. వన్డౌన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు నికోలస్ పూరన్, నాలుగో స్థానంలో ముంబై విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్, ఐదో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఆరో స్థానంలో జితేశ్ శర్మ, ఏడో ప్లేస్లో శశాంక్ సింగ్, ఆల్రౌండర్ల కోటాలో కృనాల్ పాండ్యా, స్పెషలిస్ట్ పేసర్లుగా బుమ్రా, హాజిల్వుడ్, ప్రసిద్ద్ కృష్ణ ఎంపికయ్యారు. ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శనలు కనబర్చిన ఆటగాళ్లతో ఈ జట్టు ఎంపిక జరిగింది. పంజాబ్ లోయర్ మిడిలార్డర్ బ్యాటర్ శశాంక్ సింగ్కు ఈ జట్టులో అనూహ్యంగా చోటు దక్కింది. ఐపీఎల్ 2025 టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్: విరాట్ కోహ్లి, సాయి సుదర్శన్, నికోలస్ పూరన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), జితేశ్ శర్మ (వికెట్కీపర్), శశాంక్ సింగ్, కృనాల్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, జోష్ హాజిల్వుడ్, ప్రసిద్ద్ కృష్ణ, నూర్ అహ్మద్ (ఇంపాక్ట్ ప్లేయర్) -
కోహ్లి, రోహిత్ ఉన్నా లేకున్నా ఒకేలా ఉంటుంది: శుబ్మన్ గిల్
టీమిండియా టెస్టు కెప్టెన్గా తొలి సవాల్ను ఎదుర్కొనేందుకు శుబ్మన్ గిల్ సిద్దమయ్యాడు. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం గిల్ సారథ్యంలోని భారత జట్టు శుక్రవారం ఇంగ్లండ్కు పయనమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు లేని భారత జట్టును గిల్ ఎలా నడిపిస్తాడో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇక ఇంగ్లండ్కు బయలుదేరే ముందు బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో శుబ్మన్ గిల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఇంగ్లండ్ పర్యటనకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అదేవిధంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్లపై కూడా గిల్ మాట్లాడాడు."సాధారణంగా ప్రతీ టూర్లోనూ ఒత్తిడి ఉంటుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకడం మాకు నిజంగా గట్టి ఎదురుదెబ్చ అని చెప్పాలి. వారిద్దరూ చాలా అనుభవజ్ఞులైన ఆటగాళ్ళు. భారత జట్టుకు ఎన్నో అద్బుతమైన విజయాలు అందించారు. వారి స్ధానాలను భర్తీ చేయడం చాలా కష్టం. అయితే రోహిత్, కోహ్లి ఉన్నప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉంటుందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. అందులో ఎటువంటి మార్పు ఉండదు. మా బ్యాటింగ్ ఆర్డర్ను ఇంకా మేము ఖారారు చేయలేదు. అందుకు మాకు ఇంకా రెండు వారాల సమయం ఉంది. లండన్లో 10 రోజుల ప్రాక్టీస్ క్యాంపును నిర్వహిస్తాము. ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్లు ఆడతాము. ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ను నిర్ణయిస్తాము అని గిల్ ప్రెస్కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్తోనే డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్కు తెరలేవనుంది. ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs ENG: ఇంగ్లండ్-భారత్ టెస్టు సిరీస్కు కొత్త పేరు ఖరారు -
ఆల్ది బెస్ట్ టీమిండియా.. ఇంగ్లండ్కు పయనమైన గిల్ సేన (ఫోటోలు)
-
IND Vs ENG: ఇంగ్లండ్కు బయలు దేరిన టీమిండియా.. 14 రోజుల ముందే
ఇంగ్లండ్-భారత మధ్య జరిగే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సమయం అసన్నమవుతోంది. జూన్ 20 నుంచి హెడ్డింగ్లీ వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ రెడ్ బాల్ సిరీస్ కోసం శుబ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు శుక్రవారం ఇంగ్లండ్కు పయనమైంది.ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. జట్టు తో పాటు హెడ్కోచ్ గౌతం గంభీర్ కూడా ఉన్నాడు. ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు 14 రోజుల ముందే అక్కడకు గిల్ సేన చేరుకోనుంది. జూన్ 13 నుంచి 16 వరకు బెకెన్హామ్ వేదికగా ఇండియా-ఎతో సీనియర్ భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ప్రధాన సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఇంగ్లండ్కు పయనమవ్వకముందు కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్, గౌతం గంభీర్ విలేకరుల సమావేశంలో పాల్గోనున్నారు.ఈ సందర్బంగా పలు ప్రశ్నలకు వీరిద్దరూ సమాధనమిచ్చారు. ఈ సిరీస్లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కేవలం మూడు మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు గంభీర్ స్పష్టం చేశాడు. అదేవిధంగా భారత బ్యాటింగ్ ఆర్డర్ను ఇంకా ఖారారు చేయలేదని, తమకు ఇంకా రెండు వారాల సమయం ఉందని గిల్ పేర్కొన్నాడు.కాగా ఈ సిరీస్కు ముందు స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ క్రమంలో వీరిద్దరి స్ధానాలను ఎవరు భర్తీ చేస్తారో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విరాట్ కోహ్లి స్ధానంలో కరుణ్ నాయర్ బ్యాటింగ్కు వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్.. ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న అనాధికారిక టెస్టు సిరీస్లో దుమ్ములేపుతున్నాడు.తొలి అనాధికారిక టెస్టులో నాయర్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. మరోవైపు సాయిసుదర్శన్, అర్ష్దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది.ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియాకు సంబంధించి కీలక అప్డేట్
భారత టెస్ట్ జట్టు పూర్తి స్థాయి కెప్టెన్ హోదాలో శుభ్మన్ గిల్ తొలిసారి మీడియా ముందుకు రానున్నాడు. ఇవాళ (జూన్ 5) సాయంత్రం 7:30 గంటలకు ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్లో జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్ను హాజరు కానున్నాడు. ఈ సమావేశానికి గిల్తో పాటు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హాజరవుతాడు.భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగనుంది. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా త్వరలోనే లండన్కు బయల్దేరుతుంది. ఈ సమావేశంలో గిల్, గంభీర్ ఇంగ్లండ్లో అనుసరించబోయే వ్యూహాలు, తదుపరి డబ్ల్యూటీసీ సైకిల్లో ప్రణాళికల గురించి మీడియాకు వివరిస్తారు. దిగ్గజ ఆటగాళ్లు రోహిత్, విరాట్, అశ్విన్ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించాక జరుగనున్న సిరీస్ కావడంతో ఇంగ్లండ్ టూర్కు ప్రాధాన్యత సంతరించుకుంది. గిల్ ఇటీవలే రోహిత్ శర్మ నుంచి భారత టెస్ట్ జట్టు పగ్గాలు చేపట్టాడు. బుమ్రా, పంత్ లాంటి సీనియర్లు ఉన్నా బీసీసీఐ గిల్కే టెస్ట్ కెప్టెన్సీ అప్పగించింది. గిల్ నేతృత్వంలో భారత టెస్ట్ క్రికెట్లో కొత్త శకం మొదలుకానుంది. ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో యువకులు, అనుభవజ్ఞులు ఉన్నారు. వీరిని సమన్వయపరుచుకుంటూ గిల్ ఏ మేరకు నెట్టుకు రాగలడో చూడాలి. ఇంగ్లండ్ పర్యటనలో గిల్కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) రిషబ్ పంత్ను నియమించారు.ఇంగ్లండ్ పర్యటనలో భారత్ జూన్ 20న తొలి టెస్ట్ ఆడనుంది. లీడ్స్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. అనంతరం జులై 2, 10, 23, 31 తేదీల్లో రెండు, మూడు, నాలుగు, ఐదు టెస్ట్ మ్యాచ్లు బర్మింగ్హమ్, లార్డ్స్, మాంచెస్టర్, కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికలుగా జరుగనున్నాయి. ఈ సిరీస్కు ముందు భారత్ జూన్ 13-16 మధ్యలో ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడనుంది.ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపికైన మెజార్టీ సభ్యులు ఇప్పటికే ఇంగ్లండ్లో పర్యటిస్తున్నారు. భారత-ఏ జట్టులో భాగమైన వారు ఇంగ్లండ్ లయన్స్తో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నారు. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ ఇదివరకే ముగిసింది. రెండో మ్యాచ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.ఇంగ్లండ్ పర్యటన కోసం భారత టెస్ట్ జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ , వాషింగ్టన్ సుందర్, శార్దూల ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
ముంబై చేతిలో ఓటమి.. కన్నీరు పెట్టుకున్న గిల్ సోదరి! వీడియో వైరల్
ఐపీఎల్-2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్ కథ ముగిసింది. శుక్రవారం ముంబై ఇండియన్స్తో జరిగిన ఎలిమినేటర్లో 20 పరుగుల తేడాతో గుజరాత్ ఓటమి పాలైంది. దీంతో ఈ మెగా ఈవెంట్ నుంచి గుజరాత్ నిష్కమ్రించింది. 229 పరుగుల భారీ లక్ష్య చేధనలో సాయిసుదర్శన్(49 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్తో 80), వాషింగ్టన్ సుందర్(48) అద్బుత ఇన్నింగ్స్లు ఆడినప్పటికి.. మిగితా బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోవడంతో గుజరాత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.ముఖ్యంగా ఈ మ్యాచ్లో గుజరాత్ ఓటమికి ప్రధాన కారణం చెత్త ఫీల్డింగ్. మ్యాచ్ ఆరంభంలోనే ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు రెండు లైఫ్లు వచ్చాయి. వరుస ఓవర్లలో అతడి ఇచ్చిన ఈజీ క్యాచ్లను గుజరాత్ ఫీల్డర్లు జారవిడిచారు. అందుకు గుజరాత్ భారీ మూల్యం చెల్లుంచుకోవాల్సి వచ్చింది.3 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్.. ఏకంగా 81 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. బౌలర్లు కూడా భారీ పరుగులు సమర్పించుకున్నారు. పేలవ ఫీల్డింగ్, బౌలింగ్ కారణంగానే ఈ టోర్నీ నుంచి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.కన్నీరు పెట్టుకున్న నెహ్రా ఫ్యామిలీ..ఇక ఓటమి అనంతరం గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. స్టాండ్స్లో కూర్చున్న నెహ్రా కుమారుడు, కూమర్తె ఎక్కి ఎక్కి ఏడ్చారు. ఈ సమయంలో పక్కనే ఉన్న గుజరాత్ కెప్టెన్ గిల్ సోదరి షహ్నీల్ గిల్ కూడా వారిని ఓదర్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె కూడా భోవోద్వేగానికి లోనైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.𝙈𝙄-𝙜𝙝𝙩𝙮 effort on a 𝙈𝙄-𝙜𝙝𝙩𝙮 occasion 💙@mipaltan seal the #Eliminator with a collective team performance ✌Scorecard ▶ https://t.co/R4RTzjQNeP#TATAIPL | #GTvMI | #TheLastMile pic.twitter.com/cJzBLVs8uM— IndianPremierLeague (@IPL) May 30, 2025 Nehra ka Beta bada hoke humse badla lega 🤣🤣#MIvsGT pic.twitter.com/2j8Z17Hxx1— WTF Cricket (@CricketWtf) May 30, 2025 -
అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం నిజంగా అద్బుతం: గిల్
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ ప్రయాణం ముగిసింది. శుక్రవారం ముల్లాన్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన ఎలిమినేటర్లో 20 పరుగుల తేడాతో ఓటమి పాలైన గుజరాత్.. ఈ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో గుజరాత్ విఫలమైంది. సాయిసుదర్శన్(81), వాషింగ్టన్ సుందర్(48) అద్బుత ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ మిగితా బ్యాటర్లు తేలిపోవడంతో గుజరాత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. లక్ష్య చేధనలో టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పయి 208 పరుగులు చేయగల్గింది. ఇక ఈ హార్ట్బ్రేకింగ్ ఓటమిపై మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందించాడు. తమ పేలవ ఫీల్డింగ్ కారణంగానే ఓడిపోయాము అని గిల్ తెలిపాడు."క్రికెట్ అనేది నిజంగా ఒక అద్బుతమైన గేమ్. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఈ మ్యాచ్లో మేము ఆఖరి వరకు పోరాడి ఓడిపోయాము. చివరి మూడు, నాలుగు ఓవర్లలో మాకు కలిసి రాలేదు. అయినప్పటికి మేము బాగానే ఆడాము. కచ్చితంగా క్యాచ్లు మ్యాచ్ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.ఈ మ్యాచ్లో మేము మూడు సునాయస క్యాచ్లు జారవిడిచాము. ఈజీగా క్యాచ్లను వదిలిస్తే బౌలర్లకు పరుగులను నియంత్రించడం అంత సులభం కాదు. సాయిసుదర్శన్, వాషింగ్టన్ సుందర్కు మేము ఒకటే మెసేజ్ పంపాము. ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్తిగా స్వేచ్ఛగా ఆడాలని వారికి చెప్పాం. జట్టును గెలిపించడమే వారద్దరి లక్ష్యం.మంచు కారణంగా వికెట్ కూడా బ్యాటింగ్కు అనుకూలంగా మారింది. ఈ సీజన్లో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. గత మూడు మ్యాచ్లలో మేము స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాము. కానీ జట్టులోని ప్రతీ ఒక్కరూ కూడా మెరుగ్గా రాణించారు. ముఖ్యంగా సాయిసుదర్శన్ ఒక అద్బుం. ఈ సీజన్లో అతడు ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో గిల్ పేర్కొన్నాడు.చదవండి: సంతోషంగా ఉంది.. అతడి వల్లే ఓడిపోయే మ్యాచ్లో గెలిచాము: హార్దిక్ -
GT Vs MI: కీలక మ్యాచ్లో రఫ్ఫాడించిన ముంబై.. గుజరాత్కు ఝలక్ (ఫొటోలు)
-
భారత-ఎ జట్టు నుంచి తప్పుకున్న శుబ్మన్ గిల్..!
ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సమయం అసన్నమవుతోంది. జూన్ 20 నుంచి ఈ హైవోల్టేజ్ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ప్రధాన సిరీస్కు ముందు భారత-ఎ జట్టు ఇంగ్లండ్ లయన్స్తో రెండు అనాధికారిక టెస్టు మ్యాచ్లు ఆడనుంది.తొలి టెస్టు మే 30 నుంచి జూన్ 2 వరకు కాంటర్బరీ వేదికగా, రెండో టెస్టు నార్తాంప్టన్లో జూన్ 6 నుంచి 9 వరకు జరగనున్నాయి. అయితే ఈ అనాధికారిక టెస్టు సిరీస్కు ముందు టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియా- ఎ జట్టు నుంచి తప్పుకోవాలని గిల్ నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ సిరీస్కు ఎంపిక చేసిన భారత-ఎ జట్టులో గిల్ సభ్యునిగా ఉన్నాడు. ఇంగ్లండ్ కండీషన్స్కు అలవాటు పడేందుకు గిల్కు ఈ ప్రాక్టీస్ మ్యాచ్లు ఉపయోగపడతాయని సెలక్టర్లు భావించారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కారణంగా తొలి వార్మాప్ మ్యాచ్కు గిల్ దూరంగా ఉంటాడని, రెండవ ప్రాక్టీస్ మ్యాచ్ కోసం ఇండియా-ఎ జట్టులో చేరతారని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలిపాడు. కానీ ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న గిల్కు విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు కూడా యోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే భారత-ఎ జట్టు ఇంగ్లండ్కు పయనమైంది. ఈ జట్టు కెప్టెన్గా దేశవాళీ దిగ్గజం అభిమాన్యు ఈశ్వరన్ వ్యవహరించనున్నాడు. జూన్ 13 నుంచి బెకెన్హామ్ వేదికగా మూడు రోజుల పాటు జరిగే ఇంట్రా స్వ్కాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లో గిల్ పాల్గోనే అవకాశముంది.ఇంగ్లండ్ పర్యటనకు భారత- ఎ జట్టు:అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్పాండే, హర్ష్ దూబేచదవండి: ఏయ్ నీవు ఏమి చేస్తున్నావు.. కోపంతో ఊగిపోయిన కోహ్లి! వీడియో వైరల్ -
గిల్ను కాదు అతడిని కెప్టెన్గా సెలక్ట్ చేయాల్సింది: వీరేంద్ర సెహ్వాగ్
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఎంపికైన సంగతి తెలిసిందే. అదేవిధంగా గిల్కు డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ నియమితుడయ్యాడు. రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. పలు మీడియా రిపోర్ట్లు ప్రకారం.. కెప్టెన్సీ రేసులో నుంచి ఫిట్నెస్, వర్క్లోడ్ కారణంగా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తప్పుకోవడంతో గిల్కు జట్టు పగ్గాలను సెలక్టర్లు అప్పగించారు. కాగా భారత సెలక్టర్ల ముందు గిల్తో పాటు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ అప్షన్స్ కూడా ఉండేవి. కానీ జట్టు దీర్ఘకాలక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గిల్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు బీసీసీఐ ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ టీమ్ సెలక్షన్ ప్రెస్మీట్లో తెలిపాడు. అయితే 25 ఏళ్ల గిల్ను కెప్టెన్గా ఎంపిక చేయడంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్లు మనోజ్ తివారీ,వీరేంద్ర సెహ్వాగ్లు తమ మనసులోని మాటను బయటపెట్టారు. ఫిట్నెస్ సమస్యల కారణంగానే బుమ్రా కాదని గిల్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించరాని తివారీ అన్నాడు."భారత టెస్టు కెప్టెన్సీకి శుబ్మన్ గిల్ సెకెండ్ బెస్ట్ ఆప్షన్. సెలక్టర్లకు తొలి ఎంపికగా బుమ్రా ఉండేవాడు. కానీ ఫిట్నెస్ సమస్యల వల్ల తుదిజట్టులో ఆడలేని వారికి సారథ్య బాధ్యతలు ఎలా అప్పగిస్తారు. అందుకే తమ సెకెండ్ అప్షన్ అయిన గిల్కు జట్టు పగ్గాలను కట్టబెట్టారు" అని క్రిక్బజ్ లైవ్ షోలో తివారీ పేర్కొన్నాడు. అయితే తివారీ వ్యాఖ్యలతో సెహ్వాగ్ విభేదించాడు. గిల్ను కాకుండా పంత్ కెప్టెన్గా ఎంపిక చేసి ఉంటే బాగుండేదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు."కేవలం ఒక్క సిరీస్ కోసం అయితే బుమ్రాను కెప్టెన్గా సెలక్ట్ చేయవచ్చు. అందులో ఎటువంటి సమస్య లేదు. కానీ దీర్ఘకాలనికి అయితే ఈ నిర్ణయం సరైంది కాదు. భారత్ ఒక ఏడాది 10 టెస్టులు ఆడితే, ఆ మ్యాచ్లన్నీ బుమ్రా ఆడగలడా అని ఆడగాలి? లేదా అతడు ఎన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండగలడు అని ప్రశ్నించాలి. కెప్టెన్ను ఎంపిక చేయడంలో అది ఒక ప్రధాన అంశం.కానీ సెలక్టర్లు ఆ ఒత్తిడిని, వర్క్లోడ్ను బుమ్రాపై పెట్టాలనుకోలేదు. అందుకే అతడిని కెప్టెన్గా ఎంపిక చేయలేదు. సెలక్టర్లు తీసుకుంది సరైన నిర్ణయం అని నేను కూడా భావిస్తున్నాను. అయితే కెప్టెన్సీకి గిల్ రెండవ బెస్ట్ ఆప్షన్ అని తివారీ అన్నారు. నా దృష్టిలో టీమిండియాకు సారథిగా రిషభ్ పంత్ సెకండ్ బెస్ట్ ఆప్షన్. టెస్ట్ క్రికెట్కు పంత్ చేసినంతగా, ఇతర మరే ఇతర ఆటగాడు చేయలేదు. విరాట్ కోహ్లి తర్వాత టెస్టు క్రికెట్ చూసేలా చేసిన ప్లేయర్ పంత్. కారు ప్రమాదం నుంచి కోలుకుని వచ్చిన తర్వాత పంత్ అంతగా ప్రభావం చూపలేకపోయాడు. దీన్ని నేను కూడా అంగీకరిస్తున్నాను. అతడు తిరిగి తన ఫామ్ను అందుకంటే, భవిష్యత్తులో అతన్ని కెప్టెన్గా చేసే నిర్ణయాన్ని సెలక్టర్లు తీసుకొవచ్చు.అందుకే వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. అయితే భారత టెస్టు సారథిగా చాలా కొద్ది మంది బౌలర్లరే వ్యవహరించారు.నేను క్రికెట్ ఆడిన కాలంలో కేవలం అనిల్కుంబ్లేనే ఈ ఫీట్ సాధించాడు. అదేవిధంగా అన్ని మ్యాచ్లకు కూడా అతడు అందుబాటులో ఉన్నాడని" సెహ్వాగ్ విశ్లేషించాడు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. -
టీమిండియా కొత్త కెప్టెన్కు గవాస్కర్ వార్నింగ్!?
భారత క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్గా యువ ఆటగాడు శుబ్మన్ గిల్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఇటీవలే టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ స్దానాన్ని గిల్ భర్తీ చేయనున్నాడు. వచ్చే నెలలో ఇంగ్లండ్తో జరగబోయే టెస్టు సిరీస్ నుంచి భారత టెస్టు కెప్టెన్గా గిల్ ప్రయాణం ప్రారంభం కానుంది.గిల్కు తన మొదటి పరీక్షలోనే కఠిన సవాలు ఎదురుకానుంది. ఎందుకంటే వారి సొంతగడ్డపై ఇంగ్లీష్ జట్టును ఓడించడం అంతసులువు కాదు. అంతకుతోడు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు ఇప్పుడు జట్టులో లేరు. ప్రస్తుతం భారత జట్టులో ముగ్గురు నలుగురికి మినహా ఇంగ్లండ్లో ఆడిన అనుభవం పెద్దగా లేదు. గిల్కు కూడా ఇంగ్లీష్ కండీషన్స్లో ఆడిన అనుభవం లేదు. దీంతో గిల్ కెప్టెన్గా తన మొదటి ఎసైన్మెంట్లో ఎలా రాణిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గిల్ను ఉద్దేశించి భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్పై ఇప్పుడు అదనపు ఒత్తిడి ఉంటుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు."భారత కెప్టెన్గా ఎంపికైన ఆటగాడిపై ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే జట్టు సభ్యుడిగా ఉండటానికి, కెప్టెన్గా వ్యవహరించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే టీమ్ మెంబర్గా ఉన్నప్పుడు సాధారణంగా మీకు క్లోజ్గా ఉన్న ఆటగాళ్లతో ఎక్కువగా సంభాషిస్తారు. కానీ కెప్టెన్ అయినప్పుడు, జట్టులోని ఇతర ఆటగాళ్ళు మిమ్మల్ని గౌరవించే విధంగా మీరు ప్రవర్తించాలి. కెప్టెన్ ప్రవర్తన అతని ప్రదర్శన కంటే ముఖ్యమైనది" అంటూ స్పోర్ట్స్ టాక్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది.ఇంగ్లండ్తో టెస్టులకు భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సిరాజ్చదవండి: IPL 2025: 'పంత్ను చూసి నేర్చుకోండి'.. రహానేపై సెహ్వాగ్ ఫైర్ -
అందుకే సర్ఫరాజ్పై వేటు!.. రీఎంట్రీకి అతడు అర్హుడు: పుజారా
ఐపీఎల్-2025 తర్వాత టీమిండియా ఇంగ్లండ్ పర్యటన (India vs England)తో బిజీకానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా ఇరుజట్ల మధ్య తొలి సిరీస్ జరుగునుంది. ఇందుకు సంబంధించి శనివారమే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జట్టును ప్రకటించింది.వారికి గ్రీన్ సిగ్నల్పద్దెనిమిది మంది సభ్యులతో కూడిన బృందానికి యువ ఆటగాడు శుబ్మన్ గిల్ను కెప్టెన్గా నియమించింది. ఇంగ్లండ్తో టెస్టులతో సారథిగా అతడి ప్రయాణం మొదలుకానుంది. ఇక ఈ జట్టులో సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్ చోటు దక్కించుకోగా.. అర్ష్దీప్ సింగ్ కూడా తొలిసారి టెస్టు టీమ్లోకి వచ్చాడు. కరుణ్ రీ ఎంట్రీచాలా ఏళ్ల తర్వాత ‘ట్రిపుల్ సెంచూరియన్’ కరుణ్ నాయర్కు కూడా అవకాశం దక్కింది. మరోవైపు.. శార్దూల్ ఠాకూర్ కూడా పునరాగమనం చేశాడు. అయితే, సర్ఫరాజ్ ఖాన్కు మాత్రం సెలక్టర్లు ఇంగ్లండ్తో టెస్టులు ఆడే జట్టులో చోటివ్వలేదు. ఈ పరిణామాలపై టీమిండియా వెటరన్ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా స్పందించాడు. అందుకే సర్ఫరాజ్పై వేటు!‘‘ఆసియా, ఉపఖండ పిచ్లపై సర్ఫరాజ్ ఖాన్ విజయవంతమైన ఆటగాడిగా ఉన్నాడు. కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లలో అతడు రాణించలేడని సెలక్టర్లు భావించి ఉండవచ్చు. అందుకే.. అతడికి ఈ జట్టులో చోటు ఇవ్వలేదనుకుంటా. అంతేకాదు.. అతడికి ఫిట్నెస్ సమస్యలు ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం సర్ఫరాజ్ ఫిట్నెస్ గురించి నాకైతే సమాచారం లేదు. ఫిట్గా ఉండేందుకు అతడు అన్ని రకాలుగా తీవ్రంగా శ్రమిస్తున్నాడని మాత్రం తెలుసు.రీఎంట్రీకి అతడు అర్హుడుఏదేమైనా దురదృష్టవశాత్తూ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, కరుణ్ నాయర్ ఎంపిక పట్ల సంతోషంగా ఉంది. దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా ఆడుతున్న అతడు జట్టులో చోటుకు అర్హుడు’’ అని పుజారా హిందుస్తాన్ టైమ్స్తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా టీమిండియా చివరగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడింది. ఈ టెస్టు సిరీస్కు సర్ఫరాజ్ ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా అడే అవకాశం రాలేదు.ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. కాగా దేశవాళీ క్రికెట్తో పాటు కౌంటీల్లోనూ రాణిస్తున్న పుజారా సైతం టెస్టు జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే, అతడి కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు.ఇంగ్లండ్తో టెస్టులకు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.చదవండి: కోపంతో ఊగిపోయిన సిరాజ్.. ఇదేంటి మియా?.. అతడి పట్ల ఇలాగేనా ప్రవర్తించేది? -
కోపంతో ఊగిపోయిన సిరాజ్.. ఇదేంటి మియా?.. ఇలాగేనా ప్రవర్తించేది?
గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)కు కోపమొచ్చింది. సహచర ఆటగాడిపై మైదానంలోనే అతడు కోపంతో ఊగిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో ఆదివారం నాటి మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. విషయమేమిటంటే..చేదు అనుభవంఐపీఎల్-2025 (IPL 2025) లీగ్ దశ ఆఖరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో శుబ్మన్ సేన 83 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగాలంటే మిగిలిన మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి.అహ్మదాబాద్లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ ఆది నుంచే గుజరాత్కు కలిసిరాలేదు. టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బ్యాటింగ్కు దిగి.. 230 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు ఆయుశ్ మాత్రే (17 బంతుల్లో 34), డెవాన్ కాన్వే (35 బంతుల్లో 52) శుభారంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ (19 బంతుల్లో 37) దానిని కొనసాగించాడు.The word 'fear' isn't in their dictionary 🔥#CSK's young guns Ayush Mhatre and Urvil Patel added to the Ahmedabad heat with their knocks 👏Updates ▶ https://t.co/P6Px72jm7j#TATAIPL | #GTvCSK | @ChennaiIPL pic.twitter.com/KcM4XW9peg— IndianPremierLeague (@IPL) May 25, 2025 ఇక శివం దూబే (8 బంతుల్లో 17) కాసేపు మెరుపులు మెరిపించగా.. డెవాల్డ్ బ్రెవిస్ (23 బంతుల్లో 57) ధనాధన్ దంచికొట్టాడు. రవీంద్ర జడేజా (18 బంతుల్లో 21 నాటౌట్) కూడా ఈసారి ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై ఐదు వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది.అదనపు పరుగులుకాగా సీఎస్కే ఇన్నింగ్స్లో ఐదో ఓవర్ను సిరాజ్ వేశాడు. ఈ క్రమంలో ఐదో బంతిని ఎదుర్కొన్న ఉర్విల్ పటేల్.. మిడాఫ్ దిశగా బాల్ను తరలించాడు. కాన్వేతో కలిసి సింగిల్ పూర్తి చేసుకున్నాడు. అయితే, కెప్టెన్ శుబ్మన్ గిల్ డైరెక్ట్ త్రో ద్వారా వికెట్లను గిరాటేయాలని చూడగా.. మిస్ ఫీల్డ్ అయింది. ఓవర్ త్రో కారణంగా చెన్నై మరో పరుగు తీయగలిగింది.ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. గిల్ వేసిన ఓవర్ త్రోను అందుకునేందుకు స్క్వేర్ లెగ్ వద్ద నుంచి పరిగెత్తుకు వచ్చిన ఆర్. సాయి కిషోర్ బంతిని అందుకుని మిడ్ వికెట్ వద్ద కలెక్ట్ చేసుకున్నాడు. అనుకోకుండా బంతి అతడి నుంచి చేజారగా.. ఇంతలో సీఎస్కే బ్యాటర్లు మూడో పరుగు కూడా పూర్తి చేసుకున్నారు.ఇదేంటి మియా? ఇలాగేనా ప్రవర్తించేది?దీంతో కోపోద్రిక్తుడైన సిరాజ్ కిషోర్ను ఉద్దేశించి గట్టిగానే తిట్టినట్లు కనిపించింది. అంతేకాదు.. బంతిని కూడా గ్రౌండ్కేసి కొడుతూ తన ఆగ్రహం వెళ్లగక్కాడు. ఇంతలో గిల్ వచ్చి సిరాజ్ భుజం తడుతూ నచ్చజెప్పాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఈ నేపథ్యంలో కామెంటేటర్ రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘‘ఇదేంటి మియాన్’’ అంటూ ఇలాగేనా ప్రవర్తించేది? అన్నట్లుగా కాస్త అసహనం వ్యక్తం చేశాడు. కాగా లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడిన గుజరాత్... 18.3 ఓవర్లలో కేవలం 147 పరుగులు చేసి ఆలౌట్ అయింది. చదవండి: చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గాpic.twitter.com/8UKU1ibO6o— The Game Changer (@TheGame_26) May 25, 2025 -
Shubman Gill: ‘గొప్ప గౌరవం... పెద్ద బాధ్యత’
ముంబై: భారత టెస్టు క్రికెట్ చరిత్రలో విదేశీ గడ్డపై అప్పుడప్పుడు కొన్ని మెరుపులు మినహా మన జట్టు రికార్డు పేలవంగానే ఉంది. సహజంగానే సిరీస్లో ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలతో పాటు కెప్టెన్సీపై కూడా అందరి దృష్టీ ఉంటుంది. ఇప్పుడు టీమిండియా టెస్టు కెప్టెన్ హోదాలో శుబ్మన్ గిల్ ఇంగ్లండ్తో సిరీస్లో తొలిసారి బరిలోకి దిగబోతున్నాడు. ఈ నేపథ్యంలో సారథిగా తనపై అనవసరపు ఒత్తిడిని పెంచుకోనని గిల్ స్పష్టం చేశాడు. కెపె్టన్గా ఎంపికైన తర్వాత అతను బీసీసీఐ మీడియాతో తన స్పందనను పంచుకున్నాడు. బ్యాటర్గా కూడా తన బాధ్యత నెరవేర్చడం ముఖ్యమని అతను అన్నాడు. ‘ఒక విషయంలో నేను చాలా స్పష్టంగా ఉండదల్చుకున్నాను. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నేను బ్యాటర్గానే ఆలోచిస్తాను. అదే కోణంలో నిర్ణయాలు తీసుకుంటాను తప్ప కెప్టెన్ హోదా గురించి పట్టించుకోను. బ్యాటింగ్ చేస్తూ కూడా ఇతర అంశాలపై దృష్టి పెడితే సహజంగానే ఒత్తిడి పెరుగుతుంది. అది అవసరం లేదు. నేను కెప్టెన్ను అనే భావనే రాకుండా నా బ్యాటింగ్తో ఏం చేయగలననేది ముఖ్యం’ అని గిల్ వ్యాఖ్యానించాడు. భారత కెప్టెన్గా ఎంపిక కావడం పట్ల చాలా సంతోషంగా ఉందన్న గిల్... అదో పెద్ద బాధ్యత అని అభిప్రాయపడ్డాడు. ‘చిన్నప్పుడు క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు భారత్కు ఆడితే చాలనుకుంటాం. ఆ తర్వాత ఎక్కువ కాలం టెస్టులు ఆడితే బాగుంటుందని భావిస్తాం. అలాంటిది ఇప్పుడు కెప్టెన్ కావడం గొప్ప గౌరవం. ఇంత పెద్ద బాధ్యత నాకు దక్కిన గొప్ప అవకాశం. ఇంగ్లండ్తో సిరీస్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’ అని గిల్ భావోద్వేగం ప్రదర్శించాడు.ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడంతో పాటు ఏ సమయంలో కెప్టెన్ అవసరం జట్టుకు ఉంటుందని గుర్తించడం కూడా కీలకమని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇటీవలే టెస్టుల నుంచి రిటైర్ అయిన కోహ్లి, రోహిత్, అశ్విన్ల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని... విదేశాల్లో ఎలా గెలవాలో వారు చూపించారని కొత్త కెప్టెన్ అన్నాడు. ‘రోహిత్, విరాట్, అశ్విన్ విదేశాల్లో టెస్టులు, సిరీస్లు ఎలా గెలవాలనే విషయంలో ఒక ‘బ్రూప్రింట్’ను అందించారు. దీనిని అమలు చేయగలగాలి. విరాట్, రోహిత్ల నాయకత్వంలో ఆడటం నా అదృష్టం. బయటకు కనిపించడంలో ఇద్దరి శైలి భిన్నమే అయినా...మైదానంలో అటాకింగ్ చేసే విషయంలో ఇద్దరూ దూకుడుగానే ఉంటారు. ఎప్పటికిప్పుడు మాట్లాడుతూ ఆటగాళ్లనుంచి తనకు ఏం కావాలో స్పష్టంగా చెప్పే రోహిత్ కెప్టెన్సీ పద్ధతిని నేను నేర్చుకున్నాను’ అని గిల్ వివరించాడు. -
శుభ్ మన్ గిల్ ను కెప్టెన్ గా ప్రకటించిన బీసీసీఐ
-
సీకే నాయుడు నుంచి శుబ్మన్ గిల్ వరకు...
అంచనాలకు అనుగుణంగానే యువ ఆటగాడు శుబ్మన్గిల్ భారత టెస్టు జట్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. వచ్చే నెలలో జరగనున్న ఇంగ్లండ్ పర్యటన కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ శనివారం... గిల్ సారథ్యంలో 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలకడంతో... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 25 ఏళ్ల గిల్ను ఎంపిక చేసింది. సీకే నాయుడు భారత తొలి టెస్టు కెప్టెన్గా వ్యవహరించగా... ఇప్పుడు గిల్ 37వ కెప్టెన్ కానున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు భారత టెస్టు జట్టుకు కెప్టెన్గా వ్యవహించిన ప్లేయర్ల జాబితా... -
‘శుబ్’ సమయం మొదలు
భారత టెస్టు క్రికెట్కు కొత్త నాయకుడు వచ్చాడు...నాలుగున్నరేళ్ల కెరీర్ అనుభవం ఉన్న శుబ్మన్ గిల్ టీమిండియా టెస్టు సారథిగా ఎంపికయ్యాడు... 93 ఏళ్ల భారత టెస్టు చరిత్రలో 37వ సారథిగా గిల్ బాధ్యతలు చేపడుతున్నాడు...గత కొంత కాలంగా చర్చ సాగినట్లుగా ఎలాంటి అనూహ్య నిర్ణయాలు లేకుండా సెలక్టర్లు 25 ఏళ్ల గిల్కే మద్దతు పలికారు... ఇంగ్లండ్ పర్యటనలో అతను తొలిసారి టెస్టు జట్టును నడిపించనున్నాడు. టెస్టు జట్టులో సాయిసుదర్శన్, అర్ష్ దీప్ లకు తొలి అవకాశం లభించగా...ఎనిమిదేళ్ల తర్వాత కరుణ్ నాయర్ మళ్లీ టీమ్లోకి రావడం విశేషం. ముంబై: ఇంగ్లండ్తో గడ్డపై జరిగే ఐదు టెస్టుల సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. 18 మంది సభ్యుల ఈ బృందానికి శుబ్మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్కు వైస్ కెప్టెన్సీ దక్కింది. ఆసీస్తో సిరీస్లో బుమ్రా కెప్టెన్గా వ్యవహరించినా...అతని ఫిట్నెస్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని కెప్టెన్సీ కోసం బుమ్రా పేరును పరిశీలించలేదు. కోహ్లి, రోహిత్, అశ్విన్ల శకం ముగిసిన తర్వాత భవిష్యత్తు కోసం టీమ్ను సిద్ధం చేసే కోణంలో జట్టు ఎంపిక జరిగింది. 2025–27 వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా భారత్ పాల్గొనే తొలి సిరీస్ ఇదే కానుంది. భారత జట్టు చివరిసారిగా ఆ్రస్టేలియాలో ఆడిన టెస్టు సిరీస్తో పోలిస్తే జట్టులో ఐదు మార్పులు జరిగాయి. కోహ్లి, రోహిత్, అశ్విన్ రిటైర్ కాగా...రెండు టెస్టులు ఆడిన పేసర్ హర్షిత్ రాణా, ఒక్క మ్యాచ్ కూడా ఆడని బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ స్థానం కోల్పోయారు. వీరి స్థానాల్లో కరుణ్ నాయర్, సాయిసుదర్శన్, అర్ష్ దీప్ సింగ్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు. ఎనిమిదేళ్ల తర్వాత... 33 ఏళ్ల కరుణ్ నాయర్ తన కెరీర్లో 6 టెస్టులు ఆడాడు. తన మూడో టెస్టులో ఇంగ్లండ్పై 303 పరుగులు చేసి అజేయంగా నిలిచిన అతను...సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అయితే ఆ తర్వాత మరో 3 టెస్టులు మాత్రమే ఆడి జట్టులో 2017లో జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ సీజన్ రంజీ ట్రోఫీలో 9 మ్యాచ్లలో 863 పరుగులు సాధించి రేసులోకి వచ్చాడు. కోహ్లి రిటైర్మెంట్తో మిడిలార్డర్లో ఖాళీ ఏర్పడి మరో అవకాశం లభించింది. దేశవాళీ క్రికెట్లో, భారత్ ‘ఎ’ తరఫున టన్నుల కొద్దీ పరుగులు చేసి అభిమన్యు ఈశ్వరన్కు మరోసారి పిలుపు లభించింది. ఇక ఇప్పటికీ వన్డేలు, టి20లు ఆడిన పేసర్ అర్ష్ దీప్ సింగ్, సాయి సుదర్శన్కు టెస్టుల్లో ఇదే తొలి అవకాశం. షమీ అవుట్... సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీకి ఊహించినట్లుగానే చోటు దక్కలేదు. గాయం నుంచి కోలుకున్న తర్వాత వన్డేలు, టి20లు ఆడినా...టెస్టు మ్యాచ్లకు తగిన స్థాయిలో అతని ఫిట్నెస్ లేదని సెలక్టర్లు తేల్చారు. కివీస్తో సిరీస్లో చివరి రెండు టెస్టుల్లో విఫలమై మళ్లీ మ్యాచ్ అవకాశం దక్కని సర్ఫరాజ్ ఖాన్ను కూడా పక్కన పెట్టారు. ఆసీస్ గడ్డపై రెండు టెస్టులు ఆడిన హర్షిత్ రాణాను కూడా ఎంపిక చేయలేదు. ‘కోహ్లి, రోహిత్, అశ్విన్లాంటి ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేయడం కష్టం. అయితే కొత్తగా జట్టులోకి వచ్చే వారికి తమ సత్తా చాటేందుకు ఇది మంచి అవకాశం. ఫిట్నెస్ సమస్యల కారణంగా బుమ్రా అన్నీ టెస్టులూ ఆడతాడనే నమ్మకం లేదు. అందుకే కెప్టెన్సీ భారం లేకుండా అతను బౌలర్గా మాకు అందుబాటులో ఉంటే చాలు. ఈ విషయాన్ని బుమ్రా కూడా అర్థం చేసుకున్నాడు. గిల్లో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న విషయాన్ని గమనించాం. చాలా మంది అభిప్రాయాలు కూడా విన్నాం. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే కెప్టెన్, జట్టును ఎంపిక చేశాం. ప్రస్తుత స్థితిలో సర్ఫరాజ్తో పోలిస్తే అనుభవజ్ఞుడైన కరుణ్ సరైనవాడు అనిపించింది’ అని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించారు. భారత జట్టు వివరాలు గిల్ (కెప్టెన్ ), పంత్ (వైస్ కెప్టెన్ ), జైస్వాల్, రాహుల్, జురేల్, జడేజా, కుల్దీప్, బుమ్రా, సిరాజ్, ఆకాశ్దీప్, ప్రసిధ్, సుదర్శన్, ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, సుందర్, శార్దుల్, అర్ష్ దీప్ భారత జట్టు విజేతగా నిలిచిన 2020–21 బోర్డర్ గావస్కర్ ట్రోఫీతో శుబ్మన్ గిల్ టెస్టుల్లోకి అడుగు పెట్టాడు. 91 పరుగులతో చారిత్రాత్మక గాబా టెస్టు విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత టెస్టు టీమ్లో గిల్ రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. భారత జట్టు ఆడిన రెండు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్లలో గిల్ ఆడాడు. 32 టెస్టుల కెరీర్లో గిల్ 35.05 సగటుతో 1893 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి.స్వదేశంలో ప్రదర్శనతో పోలిస్తే విదేశీ గడ్డపై అతని రికార్డు పేలవంగా ఉన్నా...మంచి ప్రతిభావంతుడైన బ్యాటర్గా మున్ముందు సత్తా చాటగలడని సెలక్టర్లు నమ్ముతున్నారు. భారత అండర్–19 జట్టు తరఫున ఆడినా అతను కెపె్టన్గా ఎప్పుడు వ్యవహరించలేదు. రంజీ ట్రోఫీలో కూడా పంజాబ్కు ఒకే ఒక మ్యాచ్లో సారథ్యం వహించాడు. అయితే భారత్కు 5 టి20 మ్యాచ్లలో కెప్టెన్ గా పని చేసిన అనుభవం గిల్కు ఉంది. రెండు సీజన్లుగా ఐపీఎల్లో గుజరాత్ జట్టును నడిపిస్తున్నాడు. -
ఇది కదా సక్సెస్ అంటే.. 25 ఏళ్లకే టీమిండియా కెప్టెన్గా
భారత టెస్టు క్రికెట్ జట్టుకు కొత్త నాయకుడొచ్చాడు. రోహిత్ శర్మ వారసుడు ఎవరో తేలిపోయింది. టీమిండియా టెస్టు కెప్టెన్గా యువ ఆటగాడు శుబ్మన్ గిల్ ఎంపికయ్యాడు. అందరూ ఊహించినట్టే గిల్కే భారత జట్టు పగ్గాలను బీసీసీఐ అప్పగించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం అధికారికంగా ప్రకటించింది.దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ పంజాబీ క్రికెటర్ను కెప్టెన్గా ఎంపిక చేశామని ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్పేర్కొన్నాడు.ఇక అరంగేట్రం చేసిన ఐదేళ్లలోనే భారత జట్టు కెప్టెన్గా ఎదిగిన గిల్పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇది కదా సక్సెస్ అంటూ గిల్ను నెటిజన్లు కొనియాడుతున్నారు. గిల్ 2020లో ఆస్ట్రేలియాపై తన టెస్టు అరంగేట్రం చేశాడు.25 ఏళ్ల వయస్సులోనే?భారత టెస్టు జట్టుకు 17 ఏళ్ల తర్వాత యువ కెప్టెన్ వచ్చాడు. 2008లో దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే నుంచి భారత టెస్టు జట్టు పగ్గాలను ఎంఎస్ ధోని చేపట్టాడు. అప్పటికి ధోని వయస్సు 27 ఏళ్లు. ఆ తర్వాత 8 ఏళ్ల పాటు భారత జట్టును మిస్టర్ కూల్ నడిపించాడు. అనంతరం 2014 డిసెంబరులో ధోనీ నుంచి కోహ్లికి టెస్టు కెప్టెన్సీ దక్కింది. అప్పటికి విరాట్కు 27 ఏళ్లు. కోహ్లి సరిగ్గా ఏడేళ్ల పాటు రెడ్బాల్ ఫార్మాట్లో భారత జట్టుకు సారథ్యం వహించాడు. కోహ్లి నాయకత్వంలోనే తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ను భారత్ సొంతం చేసుకుంది. 2021 ఆఖరిలో కోహ్లి టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేయడంతో అతడి వారుసుడిగా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టాడు. రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్గా ఎంపికయ్యేటప్పటికి అతడి వయస్సు 34 ఏళ్లు. ఇప్పుడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో శుబ్మన్ గిల్ 25 ఏళ్ల వయస్సులోనే కొత్త టెస్టు కెప్టెన్గా నియిమితుడయ్యాడు. దీంతో దిగ్గజ కెప్టెన్లు ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల కంటే అతి తక్కువ వయస్సులోనే టీమిండియా నాయకుడిగా ఎంపికై గిల్ చరిత్ర సష్టించాడు.ఓవరాల్గా భారత టెస్టు జట్టు కెప్టెన్గా ఎంపికైన ఐదవ అతి పిన్న వయస్కుడిగా గిల్ నిలిచాడు. గిల్ ప్రస్తుత వయస్సు 25 సంవత్సరాల 285 రోజులు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి (21 సంవత్సరాల 77 రోజులు) అగ్రస్దానంలో ఉన్నాడు.👉గిల్ ఇప్పటివరకు 32 టెస్టులు ఆడి 35.06 సగటుతో 1893 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 7 హాఫ్ సెంచరీలు, ఐదు శతకాలు ఉన్నాయి.టెస్టుల్లో అతి పిన్న వయస్కులైన భారత కెప్టెన్లు వీరే..మన్సూర్ అలీ ఖాన్ పటౌడి (21 సంవత్సరాల, 77 రోజులు)సచిన్ టెండూల్కర్ -(23 సంవత్సరాల, 169 రోజులు)కపిల్ దేవ్ (24 సంవత్సరాల, 48 రోజులు)రవి శాస్త్రి (25 సంవత్సరాల, 229 రోజులు)శుబ్మాన్ గిల్ (25 సంవత్సరాల, 285 రోజులు)చదవండి: ఇంగ్లండ్ టూర్.. అందుకే షమీని ఎంపిక చేయలేదు: అగార్కర్ క్లారిటీ -
టీమిండియా టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్.. అధికారిక ప్రకటన
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. భారత టెస్టు జట్టు కెప్టెన్గా స్టార్ ప్లేయర్ శుబ్మన్ గిల్ ఎంపికయ్యాడు. రోహిత్ శర్మ స్దానాన్ని గిల్ భర్తీ చేయనున్నాడు. అదేవిధంగా శుబ్మన్ గిల్ డిప్యూటీగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను నియమించారు. ఇక ఐపీఎల్లో దుమ్ములేపుతున్న యువ సంచలనం సాయిసుదర్శన్, అర్ష్దీప్ సింగ్లకు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. మరోవైపు దేశవాళీ క్రికెట్లో పరుగులు వరద పారిస్తున్న మిడిలార్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి నాయర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. కరుణ్ నాయర్తో పాటు శార్ధూల్ ఠాకూర్ కూడా తిరిగి టీమిండియాలోకి పునరాగమనం చేశాడు. ఈ జట్టులో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కకపోవడం అందరి ఆశ్చర్యపరిచింది.అదేవిధంగా ఆసీస్ టూర్లో భాగమైన హర్షిత్ రాణా, సర్ఫరాజ్ ఖాన్కు సెలక్టర్లు ఈసారి మొండి చేయి చూపించారు. కాగా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్Shubman Gill-led #TeamIndia are READY for an action-packed Test series 💪A look at the squad for India Men’s Tour of England 🙌#ENGvIND | @ShubmanGill pic.twitter.com/y2cnQoWIpq— BCCI (@BCCI) May 24, 2025 -
టీమిండియా సారథిగా శుబ్మన్ గిల్ ఫిక్స్!.. వైస్ కెప్టెన్ ఎవరంటే?
టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ ఎవరన్న ఉత్కంఠకు మరో 24 గంటల్లో తెరపడనుంది. బీసీసీఐ శనివారం ఇంగ్లండ్ టూర్కు భారత జట్టుతో పాటు కొత్త టెస్టు కెప్టెన్ పేరును కూడా వెల్లడించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. టీమిండియా టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ పేరును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.అదేవిధంగా గిల్కు డిప్యూటీగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను నియమించాలని అజిత్ అగార్కర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదేవిధంగా ఇంగ్లండ్ పర్యటనకు స్టార్ పేసర్ మహ్మద్ షమీని పక్కన పెట్టాలని సెలక్టర్లు డిసైడనట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. షమీ తన మడమ గాయం కారణంగా లాంగ్ స్పెల్స్ వేసేందుకు ఇంకా సిద్దంగా లేనట్లు బీసీసీఐ వైద్య బృందం ధ్రువీకరించనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సాయిసుదర్శన్, కరుణ్ నాయర్లకు భారత టెస్టు జట్టులో చోటు ఖాయమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇక ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో భారత్ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది. జూన్ 20 నుంచి 24 లీడ్స్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. కాగా ఈ కీలక సిరీస్కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి టెస్టులకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టు(అంచనా): శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, సాయి సుదర్శన్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్, దృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హర్షి దేష్, ప్రశీద్, షర్షి దేష్, ప్రశిద్ కుల్దీప్ యాదవ్.చదవండి: రూ.25 లక్షలు మోసపోయిన దీప్తీ శర్మ..? సహచర క్రికెటర్పై కేసు నమోదు -
వారి ఆట అద్భుతం.. మేం కూడా నిరూపించుకున్నాం: పంత్
ఐపీఎల్-2025లో లక్నోసూపర్ జెయింట్స్ ఎట్టకేలకు మరో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన లక్నో.. టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్కు చెక్ పెట్టింది. గుజరాత్ జట్టును 33 పరుగుల తేడాతో మట్టికరిపించింది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 202 పరుగులకు పరిమితమైంది. లక్నో విజయంపై కెప్టెన్ రిషబ్ పంత్ ఆనందం వ్యక్తం చేశాడు.మ్యాచ్ ముగిసిన అనంతరం, లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. విజయం పట్ల కచ్చితంగా సంతోషంగా ఉంది. ఓ జట్టుగా మేము మంచి క్రికెట్ ఆడగలమని నిరూపించాం. టోర్నమెంట్లో మాకు ప్లేఆఫ్స్కు అర్హత సాధించే అవకాశాలు ఒకప్పుడు ఉన్నాయి. ఇప్పుడు గెలిచినా రేసులో లేము. కానీ అది ఆటలో భాగం. ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. టాప్ త్రీలో చోటు సంపాదించడం ఎప్పుడూ సులభం కాదు. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఫీల్డింగ్లో కొన్ని తప్పిదాలు చేశాం. మరికొంత మెరుగు కావాల్సి అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ ఓటమి ద్వారా జట్టులో కొన్ని లోపాలు, సానుకూల అంశాలను తెలుసుకున్నాం. పవర్ప్లేలో మేము బాగా బౌలింగ్ చేశాం. కానీ, అనుకున్న ప్రకారం వికెట్టు సాధించలేకపోయాం. మా బౌలర్లు భారీగా పరుగులిచ్చారు. 15-20 పరుగులు అదనంగా ఇచ్చాం. వారిని 210 దగ్గర ఆపాలనుకున్నాము. 210కి 230 మధ్య భారీ తేడా ఉంటుంది. 240 పరుగులను ఛేదించడం ఎప్పుడూ సులభం కాదు. రూథర్ఫోర్డ్, షారుఖ్ బ్యాటింగ్ మాకు పెద్ద పాజిటివ్ అంశం. ప్లేఆఫ్లోకి వెళ్లే క్రమంలో మళ్లీ పుంజుకుని విజయం సాధిస్తామని తెలిపాడు.ఈ మ్యాచ్లో లక్నో జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (117; 64 బంతుల్లో 10×4, 8×6) మెరుపు శతకం సాధించడంతో ఎల్ఎస్జీ 2 వికెట్లకు 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. నికోలస్ పూరన్ (56 నాటౌట్; 27 బంతుల్లో 4×4, 5×6), మార్క్రమ్ (36; 24 బంతుల్లో 3×4, 2×6) కూడా రాణించారు. అనంతరం ఛేదనలో గుజరాత్ 9 వికెట్లకు 202 పరుగులే చేయగలిగింది. షారుఖ్ ఖాన్ (57; 29 బంతుల్లో 5×4, 3×6) టాప్స్కోరర్. ఎల్ఎస్జీ బౌలర్లలో ఒరూర్క్ (3/27), ఆయుష్ బదోని (2/4) రాణించారు. 13 మ్యాచ్ల్లో గుజరాత్కిది 4వ ఓటమి కాగా.. లక్నో ఆరో విజయం నమోదు చేసింది. ఈ సీజన్లో నిలకడకు మారుపేరుగా నిలిచిన సాయి సుదర్శన్ (21) ఇన్నింగ్స్ను మెరుగ్గానే ఆరంభించినా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. -
గుజరాత్కు షాకిచ్చిన లక్నో..
IPL 2025 GT vs LSG Live Updates: ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి.గుజరాత్కు షాకిచ్చిన లక్నో..గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 33 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 202 పరుగులకు పరిమితమైంది.టైటాన్స్ బ్యాటర్లలో షారుఖ్ ఖాన్(57) టాప్ స్కోరర్గా నిలవగా.. షెర్ఫన్ రూథర్ఫర్డ్(38),బట్లర్(33), శుబ్మన్ గిల్(35) తమవంతు ప్రయత్నం చేశారు. లక్నో బౌలర్లలో విలియం ఓ రూర్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. బదోని రెండు, ఆకాష్ మహారాజ్ సింగ్,అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు.గుజరాత్ నాలుగో వికెట్ డౌన్..రూథర్ఫర్డ్ రూపంలో గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన రూథర్ఫర్డ్.. ఓ రూర్క్ బౌలింగ్లో ఔటయ్యాడు. గుజరాత్ విజయానికి 23 బంతుల్లో 54 పరుగులు కావాలి. క్రీజులో షారుఖ్ ఖాన్(49) ఉన్నాడు.దూకుడు పెంచిన షారుఖ్, రూథర్ఫర్డ్14 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. క్రీజులో షారుఖ్ ఖాన్(27),రూథర్ ఫర్డ్(25) ఉన్నారు.గుజరాత్ మూడో వికెట్ డౌన్..జోస్ బట్లర్ రూపంలో గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన బట్లర్.. ఆకాష్ మహారాజ్ సింగ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.గుజరాత్ రెండో వికెట్ డౌన్శుబ్మన్ గిల్ రూపంలో గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన గిల్.. అవేష్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది.గుజరాత్ తొలి వికెట్ డౌన్..సాయిసుదర్శన్ రూపంలో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన సాయిసుదర్శన్.. విలియం ఓ రూర్క్ బౌలింగ్లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు గుజరాత్ వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజులో శుబ్మన్ గిల్(24), జోప్ బట్లర్(20) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న గుజరాత్..33 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. క్రీజులో శుబ్మన్ గిల్(15), సాయిసుదర్శన్(16) ఉన్నారు.గుజరాత్ ముందు భారీ టార్గెట్..అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాటన్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 64 బంతులు ఎదుర్కొన్న మార్ష్.. 10 ఫోర్లు, 8 సిక్స్లతో 117 పరుగులు చేశాడు. అతడితో పాటు నికోలస్ పూరన్(56), మార్క్రమ్(36) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో ఆర్షద్ ఖాన్, సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు.మిచెల్ మార్ష్ సూపర్ సెంచరీ..లక్నో బ్యాటర్ మిచెల్ మార్ష్ తొలి ఐపీఎల్ సెంచరీ సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాఛ్లో ఈ ఫీట్ నమోదు చేశాడు. కేవలం 56 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్లతో మార్ష్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 16 ఓవర్లకు లక్నో స్కోర్: 180/115 ఓవర్లకు లక్నో స్కోర్: 160/115 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 160 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్ మార్ష్(89), పూరన్(29) ఉన్నారు.లక్నో తొలి వికెట్ డౌన్..ఐడైన్ మార్క్రమ్ రూపంలో లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన మార్క్రమ్.. సాయికిషోర్ బౌలింగ్లో ఔటయ్యాడు. 10 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్(51), పూరన్(6) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న లక్నో ఓపెనర్లు..6 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్క్రమ్(28), మార్ష్(22) ఉన్నారు.నిలకడగా ఆడుతున్న లక్నో ఓపెనర్లు..3 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్(8), మార్క్రమ్(15) ఉన్నారు.ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ నామాత్రపు మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమానికి మద్దతుగా లావెండర్ జెర్సీతో బరిలోకి దిగింది.తుది జట్లులక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్), ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, విలియం ఒరూర్కేగుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), షెర్ఫానే రూథర్ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ -
కెప్టెన్గా బుమ్రా.. సుదర్శన్కు దక్కని చోటు!.. శార్దూల్కు ఛాన్స్!
భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ ఎవరు?.. ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టు మ్యాచ్లు ఆడే జట్టు ప్రకటన ఎప్పుడు?.. భారత క్రికెట్ వర్గాల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం. మాజీ క్రికెటర్లలో దిగ్గజం సునిల్ గావస్కర్ సహా వసీం జాఫర్, క్రిష్ణమాచారి శ్రీకాంత్ తదితరులు జస్ప్రీత్ బుమ్రాకే పగ్గాలు అప్పగించాలని సూచిస్తున్నారు.మరోవైపు.. రవిశాస్త్రి వంటి మరికొంత మంది మాజీలు యువకుడైన శుబ్మన్ గిల్ను కెప్టెన్గా నియమించాలని, పేస్ దళాన్ని ముందుకు నడిపిస్తున్న బుమ్రాపై అదనపు భారం వద్దని అభిప్రాయపడుతున్నారు.కాగా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. ఈ సిరీస్తో టీమిండియా టెస్టు చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. ఇద్దరు స్టార్ల నిష్క్రమణ తర్వాత తొలిసారి విదేశీ గడ్డపై రెడ్బాల్ క్రికెట్లో భారత జట్టు ఎలా రాణిస్తుందనే అంశంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.వసీం జాఫర్ ఎంచుకున్న జట్టు ఇదేఇక మే 24న బీసీసీఐ ఇంగ్లండ్ టూర్కు జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈలోపే భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ పదహారు మంది సభ్యులతో కూడిన తన జట్టును ప్రకటించాడు. ఈ జట్టుకు బుమ్రాను కెప్టెన్గా ఎంపిక చేసిన వసీం.. శుబ్మన్ను అతడికి డిప్యూటీగా నియమించాడు.సాయి సుదర్శన్, నితీశ్లకు మొండిచేయిఅయితే, మొదటి నుంచి రేసులో ఉన్న సాయి సుదర్శన్ పేరును మాత్రం వసీం జాఫర్ పరిగణనలోకి తీసుకోలేదు. ఐపీఎల్-2025లో అదరగొడుతున్న ఈ గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ను కాదని.. టెస్టు స్పెషలిస్టు, ఇంగ్లండ్ లయన్స్తో తలపడే భారత్-ఎ జట్టు కెప్టెన్ అయిన అభిమన్యు ఈశ్వరన్కు పెద్దపీట వేశాడు.అంతేకాదు.. ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీతో ఆకట్టుకున్న ఆంధ్ర పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి కూడా వసీం జాఫర్ మొండిచేయి చూపాడు. అతడికి బదులు సీనియర్ శార్దూల్ ఠాకూర్వైపే మొగ్గుచూపాడు.శ్రేయస్ అయ్యర్ లేదంటే కరుణ్ నాయర్ఇక వికెట్ కీపర్ల కోటాలో రిషభ్ పంత్తో పాటు ధ్రువ్ జురెల్కు స్థానమిచ్చిన వసీం జాఫర్.. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ లేదంటే కరుణ్ నాయర్లకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపాడు. ఇక స్పిన్ దళంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్తో పాటు.. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్కు చోటిచ్చాడు ఈ మాజీ క్రికెటర్.అదే విధంగా.. ఫాస్ట్ బౌలర్ల బృందంలో బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలకు చోటిచ్చిన వసీం జాఫర్.. నాలుగో ఆప్షన్గా అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్లలో ఒకరిని ఎంచుకుంటానని తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఇంగ్లండ్తో టెస్టులకు తన జట్టును ప్రకటించిన వసీం జాఫర్.. మరి మీ ఎంపిక ఏమిటంటూ క్రికెట్ ప్రేమికులను అడగ్గా.. మెజారిటీ మంది అతడి జట్టుతోనే ఏకీభవిస్తున్నారు. కాగా జూన్ 20 నుంచి ఇంగ్లండ్- టీమిండియా మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.ఇంగ్లండ్తో టెస్టులకు వసీం జాఫర్ ఎంచుకున్న భారత జట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్/కరుణ్ నాయర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), మహ్మద్ సిరాజ్, అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్/ప్రసిద్ కృష్ణ/ అకాశ్దీప్, వాషింగ్టన్ సుందర్.చదవండి: ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా ఆయుశ్, వైభవ్ సూర్యవంశీకి చోటు -
అతడొక అద్బుతం.. గిల్ను మించిపోయాడు: జడేజా
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ యువ సంచలనం సాయి సుదర్శన్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సుదర్శన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 61 బంతుల్లో 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అజేయంగా 108 పరుగులు చేశాడు.అతడి విధ్వంసర ఇన్నింగ్స్ ఫలితంగా 200 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ వికెట్ నష్టపోకుండా ఛేదించింది. అతడితో పాటు గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్ కూడా 93 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ క్రమంలో సాయి సుదర్శన్పై భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ప్రశంసల వర్షం కురిపించాడు.సుదర్శన్ తన ప్రదర్శనలతో టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ను మించిపోయాడని జడేజా కొనియాడాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో సుదర్శన్ 12 మ్యాచ్లు ఆడి 56.10 సగటుతో 617 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ సాయిసుదర్శన్ వద్దే ఉంది."సాయి సుదర్శన్ అద్బుతమైన బ్యాటర్. అతడి బ్యాటింగ్ టెక్నిక్ చాలా బాగుంది. ఈ ఏడాది సీజన్లో సుదర్శన్ తన ప్రదర్శనలతో శుబ్మన్ గిల్ను మించిపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఒక్క మ్యాచ్లోనే కాదు, అంతకుముందు మ్యాచ్లలో కూడా గిల్ కంటే మెరుగ్గా రాణించాడు.శుబ్మన్తో పోలిస్తే సుదర్శన్ ఎటువంటి రిస్క్ తీసుకోకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు. నిన్నటి మ్యాచ్లో తొలుత గిల్ బంతిని టైమ్ చేయడానికి కాస్త కష్టపడ్డాడు. గిల్ బంతిని స్టాండ్స్కు తరలించేందుకు తన బలాన్ని మొత్తాన్ని ఉపయోగించాడు. కానీ సాయి విషయంలో మాత్రం అలా జరగలేదు. అతడు చాలా సులువుగా షాట్లు ఆడాడు" అని స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జడేజా పేర్కొన్నాడు.చదవండి: ఐపీఎల్-2025లో దారుణ ప్రదర్శన.. కేకేఆర్ హెడ్ కోచ్పై వేటు? -
IPL 2025: గుజరాత్ దర్జాగా...
200 పరుగుల లక్ష్యం. ఛేదించే జట్టుకు ఏమాత్రం సులువు కానేకాదు. కానీ ఇద్దరే ఇద్దరు... గుజరాత్ ఓపెనర్లు దంచేశారు. అంతపెద్ద లక్ష్యాన్ని సులువుగా కరిగించేశారు. సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ పోటీపడ్డారు. పరుగు పెట్టేందుకు... ఫోర్లు బాదేందుకు... సిక్సర్లు కొట్టేందుకు ఇలా ప్రతిదానికి ఆఖరుదాకా పోటీపడి మరీ సాధించడంతో కఠిన లక్ష్యం కూడా ఓ ఓవర్కు ముందే కరిగిపోయింది. అంత చేసి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమితో కుంగిపోయింది. అంతేకాదు గుజరాత్ దర్జాగా సాధించిన విజయంతో తమతోపాటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లను కూడా ‘ప్లే ఆఫ్స్’కు తీసుకెళ్లింది. ఇక మిగిలింది ఒకే ఒక్క బెర్త్. దీని కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కాచుకున్నాయి. మరి ఆఖరి బెర్త్ ఎవరిని వరిస్తుందో చూడాలి. న్యూఢిల్లీ: ఓపెనర్ల గర్జనతో గుజరాత్ టైటిల్స్ దర్జాగా ఐపీఎల్ 18వ సీజన్లో ప్లే ఆఫ్స్ దశకు అర్హత సంపాదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాయి సుదర్శన్ (61 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్లు), శుబ్మన్ గిల్ (53 బంతుల్లో 93 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్స్లు) ఢిల్లీ బౌలింగ్ను దంచికొట్టారు. దీంతో టైటాన్స్ 10 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (65 బంతుల్లో 112 నాటౌట్; 14 ఫోర్లు, 4 సిక్స్లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. అర్షద్, ప్రసిధ్కృష్ణ, సాయికిషోర్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం గుజరాత్ టైటాన్స్ 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 205 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ అజేయంగా, ఆకాశమే హద్దుగా చెలరేగారు. నెల నిషేధం ముగియడంతో గుజరాత్ తరఫున రబడ ఈ మ్యాచ్ బరిలోకి దిగాడు. రాహుల్ 112 నాటౌట్ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ను ఆరంభం నుంచి ఆఖరుదాకా నడిపించింది... పరుగులు రాబట్టింది ఒకే ఒక్కడు రాహుల్. డుప్లెసిస్ (5)తో ఓపెనింగ్ వికెట్ ఎంతోసేపు నిలబడలేదు. ఆరంభంలో స్కోరులో ఏమాత్రం జోరు లేదు. 5 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 28/1. పవర్ప్లేలో కనీసం బంతికో పరుగైనా చేయలేదు. అయితే ఆరో ఓవర్లో రాహుల్ రెండు సిక్స్లు, ఓ బౌండరీ బాదడంతో క్యాపిటల్స్ 45/1 స్కోరుతో కోలుకుంది. అభిషేక్ పొరెల్ (19 బంతుల్లో 30; 1 ఫోర్, 3 సిక్స్లు) అడపాదడపా భారీషాట్లు బాదాడు. రాహుల్ 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. రబడ 11వ ఓవర్లో పొరెల్, రాహుల్ చెరో సిక్సర్ బాదడంతో 17 పరుగులు వచ్చాయి. దీంతో మరుసటి ఓవర్లోనే క్యాపిటల్స్ 100 మార్క్ను దాటింది. కానీ ఆఖరి బంతికి పొరెల్ వికెట్ను కోల్పోయింది. దీంతో రెండో వికెట్కు 90 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి కెపె్టన్ అక్షర్ పటేల్ (16 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) రాగా... రాహుల్ ధాటిని పెంచాడు. 14వ ఓవర్లో వరుసగా 3 బౌండరీలు కొట్టాడు. అక్షర్ కూడా 4, 6తో దంచేపనిలో పడ్డాడు కానీ మరుసటి ఓవర్లోనే ప్రసి«ద్కృష్ణకు వికెట్ సమరి్పంచుకున్నాడు. 19వ ఓవర్లో 6, 4 బాదిన రాహుల్ 60 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. స్టబ్స్ (10 బంతుల్లో 21 నాటౌట్; 2 సిక్స్లు) వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. ఆరంభం నుంచే ధనాధన్ తొలి ఓవర్లో సాయి సుదర్శన్ బౌండరీతో శుబ్మన్ సిక్స్తో తమ ఖాతా తెరవడం ద్వారా లక్ష్యానికి దీటైన ఆరంభమిచ్చారు. నటరాజన్ వేసిన రెండో ఓవర్ను సుదర్శన్ 6, 4, 4, 0, 2, 4లతో చితగ్గొట్టాడు. దీంతో 20 పరుగులు వచ్చాయి. అక్షర్ మూడో ఓవర్లో మరో రెండు బౌండరీలు బాదాడు. టైటాన్స్ 6 ఓవర్లలో 59/0 స్కోరు చేసింది. ఆ తర్వాత కూడా ఇద్దరు చక్కని సమన్వయంతో ఆడటంతో పరుగులకు పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. ఈ క్రమంలో మొదట సుదర్శన్ 30 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... 10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 93/0 స్కోరు చేసింది. ఇక మిగిలిన 10 ఓవర్లలో 107 పరుగులు చేయాల్సిన దశలోనూ ఓపెనింగ్ జోడీ పరుగుల పయనం సాఫీగా సాగిపోయింది. దీంతో ఓవర్లు గడిచేకొద్దీ ఢిల్లీ బౌలర్లు కాస్తా డీలా బౌలర్లుగా మారిపోయారు. 33 బంతుల్లో గిల్ అర్ధసెంచరీ పూర్తవగా జట్టు స్కోరు 15వ ఓవర్లో 150 దాటింది. ఇక 30 బంతుల్లో 46 పరుగుల సమీకరణంతోనే... చేతిలో పది వికెట్లున్న టైటాన్స్ చేతుల్లోకే మ్యాచ్ వచ్చేసింది. ఈ లాంఛనాన్ని మరో బ్యాటర్కు ఇవ్వకుండా ఓపెనర్లే పూర్తి చేశారు. భారీ సిక్సర్తో సాయి సుదర్శన్ 56 బంతుల్లో సెంచరీ సాధించగా, చూడచక్కని బౌండరీలతో గిల్ కూడా శతకానికి చేరువయ్యాడు. కానీ ఈ లోపే 200 పరుగుల పెద్ద లక్ష్యం 19వ ఓవర్లోనే దిగిరావడంతో అతని సెంచరీకి అవకాశం లేకుండాపోయింది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (నాటౌట్) 112; డుప్లెసిస్ (సి) సిరాజ్ (బి) అర్షద్ 5; పోరెల్ (సి) బట్లర్ (బి) సాయికిషోర్ 30; అక్షర్ (సి) సాయికిషోర్ (బి) ప్రసిధ్ కృష్ణ 25; స్టబ్స్ (నాటౌట్) 21; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–16, 2–106, 3–151. బౌలింగ్: సిరాజ్ 4–0–37–0, అర్షద్ ఖాన్ 2–0–7–1, రబడా 2–0–34–0, ప్రసిద్కృష్ణ 4–0–40–1, రషీద్ ఖాన్ 4–0–32–0, సాయికిషోర్ 4–0–47–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (నాటౌట్) 108; శుబ్మన్ గిల్ (నాటౌట్) 93; ఎక్స్ట్రాలు 4; మొత్తం (19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 205. బౌలింగ్: అక్షర్ పటేల్ 3–0–35–0, నటరాజన్ 3–0–49–0, ముస్తాఫిజుర్ 3–0–24–0, చమీర 2–0–22–0, విప్రాజ్ 4–0–37–0, కుల్దీప్ 4–0–37–0. -
టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ అతడే: సునీల్ గవాస్కర్
ఇంగ్లండ్ టూర్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం బీసీసీఐ సెలక్షన్ కమిటీకి పెద్ద తలనొప్పిగా మారింది. భారత జట్టుకు కొత్త టెస్టు కెప్టెన్ను ఎంపిక చేసేందుకు సెలక్టర్లు మల్లుగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.టెస్టు కెప్టెన్సీ రేసులో యువ ఆటగాడు శుబ్మన్ గిల్ ముందుంజలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికి.. బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కెప్టెన్సీ రేసులో గిల్తో పాటు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ పేర్లు కూడా వినిపిస్తున్నాడు.తాజాగా ఇదే విషయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తన అభిప్రయాన్ని వెల్లడించాడు. వీరి ముగ్గురిలో శుబ్మన్ గిల్కే గవాస్కర్ ఓటేశాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టును బీసీసీఐ మే 23న ప్రకటించే అవకాశముంది. అదే రోజున కొత్త టెస్టు కెప్టెన్ పేరును బీసీసీఐ వెల్లడించనుంది."ప్రస్తుతం కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పగించినా మన సూపర్ లీడర్స్ ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి స్ధాయికి చేరుకోవడానికి కచ్చితంగా రెండేళ్లు పడుతోంది. ఈ ముగ్గురు టెస్టు కెప్టెన్సీకి సరికొత్త అర్ధాన్ని తీసుకొచ్చారు. భారత కెప్టెన్సీకి ప్రధాన పోటీదారులైన గిల్, అయ్యర్, పంత్లను చూస్తుంటే, నాకు ధోని, రోహిత్, విరాట్ గుర్తుస్తున్నారు. బహుశా అయ్యర్, పంత్ కంటే గిల్కే కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా న్నాయి. గిల్కు అద్బుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. అంతేకాకుండా మైదానంలో చాలా చురుగ్గా ఉంటూ వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు" అని గవాస్కర్ పేర్కొన్నాడు.చదవండి: ఇది ‘ఇండియన్’ ప్రీమియర్ లీగ్: ఫారన్ ప్లేయర్లకు శ్రేయస్ కౌంటర్? -
రోహిత్ను నిండా ముంచిన గిల్
-
ఇంగ్లండ్ టూర్: వారినే ఎంపిక చేయమని బీసీసీఐ ఆదేశం!?
ఐపీఎల్-2025 (IPL 2025) ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు అంతర్జాతీయ షెడ్యూల్తో బిజీకానున్నారు. ఇందులో భాగంగా భారత జట్టు తొలుత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్తో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTV) 2025-27 సీజన్ ఆరంభం కానుంది.తొలుత అనధికారిక టెస్టులుఅయితే, అంతకంటే ముందే భారత్-‘ఎ’- ఇంగ్లండ్ లయన్స్ (India A vs England Lions)తో తలపడనుంది. ఇరు జట్ల మధ్య రెండు అనధికారిక టెస్టులు జరుగుతాయి. మే 30 నుంచి తొలి మ్యాచ్, జూన్ 6 నుంచి రెండో మ్యాచ్ జరుగుతాయి. ఆ తర్వాత భారత సీనియర్ జట్టు, భారత ‘ఎ’ టీమ్ మధ్య కూడా జూన్ 13 నుంచి ఒక నాలుగు రోజుల మ్యాచ్ జరుగుతుంది.జైసూ, నితీశ్, గిల్, జురెల్ కూడాఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత్-‘ఎ’ జట్టును ప్రకటించింది. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్ గత సీజన్లో అద్భుతంగా చెలరేగిన బ్యాటర్ కరుణ్ నాయర్కు భారత టెస్టు టీమ్లో పునరాగమనం చేసేందుకు మరో అవకాశం లభించింది. ఇంగ్లండ్ ‘ఎ’ జట్టుతో రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో తలపడేందుకు సెలక్టర్లు ఎంపిక చేసిన భారత ‘ఎ’ జట్టులో కరుణ్ నాయర్కు చోటు లభించింది. అదే విధంగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లో సభ్యులైన యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, సర్ఫరాజ్ ఖాన్, ఆకాశ్దీప్లను కూడా భారత ‘ఎ’ జట్టుకి సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇంగ్లండ్లో పరిస్థితులను అర్థం చేసుకునేందుకు యువ ఆటగాళ్లకు ఈ ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు సరైన అవకాశంగా సెలక్టర్లు భావించారు.వారినే ఎంపిక చేయమని బీసీసీఐ ఆదేశం!?అయితే, ఈ జట్టు ఎంపిక సమయంలో బీసీసీఐ ఆచితూచి అడిగేసిందంటూ బోర్డు సన్నిహిత వర్గాలు వార్తా సంస్థ IANSకు ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ‘‘భారత్-‘ఎ’ జట్టు ఎంపిక విషయంలో ఒక విధమైన గందరగోళం నెలకొందనే చెప్పాలి. ఏ ఆటగాడిని తీసుకోవాలో అర్థం కాలేదు.అప్పుడు బీసీసీఐ సెలక్టర్లకు ఓ సలహా ఇచ్చింది. ఐపీఎల్-2025 ప్లే ఆఫ్స్నకు చేరని జట్ల నుంచి ఆటగాళ్లను ఎంపిక చేయమని చెప్పింది. వారికి ప్రాధాన్యం ఉండేలా చూసుకోమంది. ఎందుకంటే.. భారత్-‘ఎ’ జట్టు మే 25న ఇంగ్లండ్కు బయలుదేరాల్సి ఉంది’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు వార్తా సంస్థతో చెప్పుకొచ్చాయి.కాగా ఇంగ్లండ్కు వెళ్లే భారత్-‘ఎ’ జట్టులో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్, ఓపెనర్ సాయి సుదర్శన్లు ఉన్నారు. వీరి టీమ్ ప్లే ఆఫ్స్ రేసులో ముందుంది. మిగతా ఆటగాళ్ల జట్లు రాజస్తాన్ రాయల్స్ (యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్), సన్రైజర్స్ హైదరాబాద్ (ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి), చెన్నై సూపర్ కింగ్స్ (రుతురాజ్ గైక్వాడ్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తదితరులు) ఇప్పటికే ప్లే ఆఫ్స్ పోటీ నుంచి నిష్క్రమించాయి.ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసిన భారత్- ‘ఎ’ జట్టు అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), ధ్రువ్ జురేల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, శార్దుల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, మానవ్ సుతార్, తనుశ్ కొటియాన్, ముకేశ్ కుమార్, ఆకాశ్దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్పాండే, హర్ష్ దూబే, శుబ్మన్ గిల్, సాయిసుదర్శన్.చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక! -
‘బుమ్రా వద్దే వద్దు!.. కెప్టెన్గా ఆ ఇద్దరిలో ఒకరు బెటర్’
భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ అంశంపై టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయం పంచుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సారథిగా నియమించకూడదని యాజమాన్యానికి సూచించాడు. పేస్ దళ నాయకుడికి బదులు యువ ఆటగాడికి పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందంటూ ఇద్దరు స్టార్ల పేర్లు చెప్పాడు.దిగ్గజాల వీడ్కోలుకాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సీజన్ భారత్- ఇంగ్లండ్ సిరీస్తో మొదలుకానున్న విషయం తెలిసిందే. స్టోక్స్ బృందంతో ఐదు టెస్టుల్లో తలపడేందుకు టీమిండియా అక్కడకు వెళ్లనుంది. అయితే, ఈ కీలక పర్యటనకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇక దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా రోహిత్ బాటలోనే సంప్రదాయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో భారత జట్టు కొత్త కెప్టెన్, నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసే ఆటగాడు ఎవరన్న అంశాలు చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూ షోలో భాగంగా ప్రజెంటర్, బుమ్రా సతీమణి సంజనా గణేషన్తో రవిశాస్త్రి తన అభిప్రాయాలు పంచుకున్నాడు.బుమ్రానే ఫస్ట్ చాయిస్.. కానీ వద్దే వద్దు‘‘నా వరకైతే.. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత కచ్చితంగా జస్ప్రీత్ బుమ్రానే కెప్టెన్గా ప్రథమ ప్రాధాన్యం ఇవ్వగలిగే ఆటగాడు. అయితే, నేను జస్ప్రీత్ సారథి కావాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే.. కెప్టెన్గా ఉంటే అతడిపై అదనపు భారం పడుతుంది.బౌలర్గానూ బుమ్రా సేవలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. అతడు తన శరీరాన్ని మరీ ఎక్కువగా కష్టపెట్టకూడదు. తీవ్రమైన వెన్నునొప్పి తర్వాత ఇటీవలే బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఐపీఎల్ ఆడుతున్నాడు.ఒత్తిడికి లోనయ్యే అవకాశంఅయితే, అక్కడ కేవలం నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా మాత్రమే ఉంటుంది. కానీ టెస్టుల్లో 10- 15 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ఇలా బౌలర్గా, కెప్టెన్గా అదనపు భారం పడితే అతడు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.ఆ ఇద్దరిలో ఒకరు బెటర్ఇక యువ ఆటగాళ్లకు కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందంటూ.. ‘‘కెప్టెన్గా శుబ్మన్ సరైన వాడు అనిపిస్తోంది. అతడికి అవకాశం ఇస్తే బాగుంటుంది. అతడి వయసు 25- 26 ఏళ్ల మధ్య ఉంటుంది. సారథిగా తనను తాను నిరూపించుకుంటే.. దీర్ఘకాలం కొనసాగల సత్తా అతడికి ఉంది.రిషభ్ పంత్ను పక్కన పెట్టే వీలు లేదు. నా దృష్టిలో టీమిండియా టెస్టు కొత్త కెప్టెన్లుగా వీరిద్దరిలో ఒకరే అత్యుత్తమ ఎంపిక. మరో దశాబ్దకాలం పాటు టీమిండియాకు ఆడగలరు.ఇప్పటికే ఇద్దరూ ఐపీఎల్లో జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. వారికి ఆ అనుభవం కూడా పనికివస్తుంది. అందుకే గిల్, పంత్లలో ఒకరికి టీమిండియా కెప్టెన్గా అవకాశం ఇస్తే బాగుంటుంది’’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. గా జూన్ 20 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ మొదలుకానుంది.కాగా గతంలో ఇంగ్లండ్ పర్యటనలో ఓసారి భారత టెస్టు జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు. ఇటీవల ఆస్ట్రేలియా టూర్లో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో పెర్త్, సిడ్నీ టెస్టుల్లో టీమిండియాకు సారథ్యం వహించాడు. ఈ ఐదు టెస్టుల సిరీస్లో పెర్త్లో మాత్రమే గెలిచిన భారత జట్టు.. 1-3తో ట్రోఫీని చేజార్చుకుంది.చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక! -
'గిల్ వద్దు.. టీమిండియా కెప్టెన్గా అతడే బెటర్'
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియాకు కొత్త టెస్టు కెప్టెన్ ఎంపిక చేసే పనిలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ పడింది. రోహిత్ శర్మ అనూహ్యంగా టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. పలు నివేదికల ప్రకారం టెస్టు కెప్టెన్సీ రేసులో స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడితో పాటు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరు కూడా విన్పిస్తోంది. కానీ గిల్ తో పోలిస్తే బుమ్రాకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. గాయాల బెడద, వర్క్లోడ్ మేనేజ్మెంట్ను దృష్టిలో పెట్టుకుని బుమ్రాకు జట్టు పగ్గాలు అప్పగించకూడదని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనుభవం లేని గిల్ వైపు బీసీసీఐ సెలక్షన్ కమిటీ మొగ్గు చూపుతుండడం క్రికెట్ వర్గాల్లో అసంతృప్తికి దారితీసినట్లు తెలుస్తోంది.చాలా మంది మాజీలు భారత టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు గిల్కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్గా బుమ్రా ఉండాలని, శుబ్మన్ గిల్ను అతడి డిప్యూటీగా ఎంపిక చేయాలని జాఫర్ అభిప్రాయపడ్డాడు."భారత టెస్టు కెప్టెన్సీ రేసులో జస్ప్రీత్ బుమ్రా ముందంజలో ఉంటాడాని భావిస్తున్నాను. ఒకవేళ తనంతట తానుగా కెప్టెన్సీ ఆఫర్ తిరష్కరిస్తే తప్ప సెలక్టర్లు మరో ఆప్షన్ను పరిశీలించరు. అతడిని కెప్టెన్గా చేసి గిల్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేయాలి. బుమ్రాకు విశ్రాంతి అవసరమైనప్పుడల్లా గిల్ జట్టును నడిపిస్తున్నాడు. దీంతో గిల్కు పూర్తి స్ధాయి కెప్టెన్గా ఎదిగేందుకు తగినంత సమయం లభిస్తోంది" అని జాఫర్ ఎక్స్లో రాసుకొచ్చాడు. కాగా గిల్కు కెప్టెన్గా అంతర్జాతీయ స్ధాయిలో పెద్దగా అనుభవం లేదు. జింబాబ్వే సిరీస్లో భారత జట్టు సారధిగా గిల్ వ్యవహరించాడు. ఆ తర్వాత ఎప్పుడూ భారత జట్టును నడిపించలేదు. ఐపీఎల్ మాత్రం కెప్టెన్గా అతడికి అనుభవం ఉంది. గుజరాత్ టైటాన్స్ సారథిగా గిల్ కొనసాగుతున్నాడు. ఇక ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టును మే 23న బీసీసీఐ ప్రకటించే అవకాశముంది.చదవండి: BCCI - IND vs ENG: టీమిండియాలో అతడికి చోటు కష్టమే! -
శుబ్మన్ గిల్, పంత్ కాదు.. అతడి టెస్టు కెప్టెన్ చేయండి: అశ్విన్
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో భారత తదుపరి టెస్టు కెప్టెన్ ఎవరన్న చర్చ మొదలైంది. టెస్టు కెప్టెన్సీ రేసులో యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ ముందుంజలో ఉన్నాడు. కెప్టెన్గా గిల్ ఎంపిక దాదాపు ఖాయమైందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టీమిండియా తదుపరి కెప్టెన్ గిల్ అన్న ఊహాగానాలపై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.కొంతమంది మాజీలు సంతృప్తి వ్యక్తం చేస్తూంటే.. మరి కొంత మంది సీనియర్ ఆటగాడిని కెప్టెన్గా చేయాలని బీసీసీఐని సూచిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను భారత కెప్టెన్గా ఎంపిక చేయాలని అశ్విన్ సూచించాడు.."ప్రస్తుత భారత జట్టులో రవీంద్ర జడేజా అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు. అతడిని కూడా కెప్టెన్సీ ఎంపికగా పరిగణించాలి. మీరు కొత్త ఆటగాడికి శిక్షణ ఇచ్చి తర్వాత కెప్టెన్గా చేయాలని భావిస్తుంటే.. సారథిగా మీకు జడేజా బెస్ట్ ఛాయిస్. జడేజా రెండేళ్ల పాటు జట్టుకు నాయకత్వం వహించవచ్చు. జడ్డూకు డిప్యూటీగా మీరు ఎవరినైతే కెప్టెన్గా చేయాలనకుంటున్నారో వారిని నియమించండి. అప్పుడు అతడు మరింత రాటుదేలుతాడు. భారత జట్టుకు కెప్టెన్ కావడం ప్రతి ఆటగాడి కల. జడేజాకు అవకాశమిస్తే అతడు కచ్చితంగా స్వీకరిస్తాడని" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.అదేవిధంగా శుబ్మన్ గిల్పై కూడా అశూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుందని నేను ఆశిస్తున్నాను. గిల్ అక్కడ జట్టును గెలిపిస్తే.. కెప్టెన్గా పరిపక్వత సాధించినట్లు అవుతోంది. అయితే టెస్టుల్లో కెప్టెన్సీ అంత సలువు కాదు. ఒక కెప్టెన్గా ఫస్ట్-క్లాస్ క్రికెట్లో కూడా ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని అశ్విన్ అన్నాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు ప్రకటన.. విధ్వంసకర ఓపెనర్ రీ ఎంట్రీ -
ఓపెనర్గా కేఎల్ రాహుల్.. నాలుగో స్థానంలో ‘కొత్త’ ఆటగాడు!
భారత టెస్టు జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు రాబోతున్నాయి. ఇన్నాళ్లుగా ఓపెనర్గా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో సంప్రదాయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. మరోవైపు.. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగే దిగ్గజం విరాట్ కోహ్లి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.ఈ నేపథ్యంలో వీరిద్దరి స్థానాలు భర్తీ చేసే ఆటగాళ్లు ఎవరన్న అంశంపై చర్చ జరగుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓపెనింగ్ జోడీగా కేఎల్ రాహుల్ (KL Rahul)- యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)ను కొనసాగించాలని సూచించాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లోఅయితే, నాలుగో స్థానానికి మాత్రం వసీం జాఫర్ కొత్త ఆటగాడిని ఎంపిక చేశాడు. కాగా గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ జైసూతో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు. రోహిత్ తిరిగి వచ్చిన తర్వాత కూడా వీరే ఓపెనర్లుగా కొనసాగారు.ఈ నేపథ్యంలో వసీం జాఫర్ న్యూస్18తో మాట్లాడుతూ.. ‘‘బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో కేఎల్ రాహుల్- యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా రాణించారు. కాబట్టి కేఎల్ అదే స్థానంలో కొనసాగితే బాగుంటుంది. నిలదొక్కుకున్న జోడీని విడదీయడం వల్ల నష్టమే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.నాలుగో స్థానంలో గిల్!ఇక శుభ్మన్ గిల్ విషయానికొస్తే.. అతడు వైట్ బాల్ క్రికెట్లో ఓపెనర్గా వస్తున్నాడు. కానీ టెస్టు క్రికెట్లో మాత్రం అతడిని మూడు నుంచి నాలుగో స్థానానికి పంపితే బాగుంటుంది.మూడో స్థానంలో సాయి సుదర్శన్ను ఆడించాలి. సుదీర్ఘకాలం వన్డౌన్లో ఆడిస్తే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. కాగా కేఎల్ రాహుల్ టీమిండియా తరఫున ఓపెనర్గా 83 ఇన్నింగ్స్లో 2803 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు శతకాలు ఉన్నాయి.ఓపెనర్లుగా ఇలాఇక నాలుగో స్థానంలో రెండు ఇన్నింగ్స్ ఆడిన కేఎల్.. 108 పరుగులు చేయగలిగాడు. మరోవైపు.. శుబ్మన్ గిల్ 30 ఇన్నింగ్స్లో మూడో స్థానంలో వచ్చి 1019 పరుగులు చేశాడు. ఓపెనర్గా 29 ఇన్నింగ్స్లో 874 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇంత వరకు ఒక్కసారి కూడా నాలుగో స్థానంలో ఆడలేదు.కాగా రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిల నిష్క్రమణ తర్వాత టీమిండియా తొలిసారి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్లో తొలి సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో ఐదు టెస్టుల్లో తలపడనుంది. ఈ టూర్ నుంచి భారత టెస్టు జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది.చదవండి: ‘మాక్స్వెల్ను పెళ్లి చేసుకోలేదు కాబట్టే ఇలా’!.. మండిపడ్డ ప్రీతి జింటా.. -
తుదిజట్టులో చోటే కష్టం.. అలాంటి ఆటగాడు కెప్టెనా?
టీమిండియా టెస్టు జట్టు కొత్త కెప్టెన్ ఎవరు?.. జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించగలిగే సత్తా ఉన్న నాయకుడు ఎవరు?.. భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)కు పగ్గాలు అప్పగించాలని సునిల్ గావస్కర్, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు.. ఇప్పటికే యువ ఆటగాడు శుబ్మన్ గిల్ (Shubman Gill)ను సారథిగా నియమించడం లాంఛనమే అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ గిల్ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. టెస్టు తుదిజట్టులో చోటే కరువైన ఆటగాడు కెప్టెన్సీకి ఎలా అర్హుడు అవుతాడని ప్రశ్నించాడు.విదేశీ గడ్డపై గిల్ విఫలంకాగా 2020లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన గిల్.. ఇప్పటికి 32 మ్యాచ్లు ఆడాడు. 35.06 సగటుతో 1893 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు అర్ధ శతకాలు, ఐదు సెంచరీలు ఉన్నాయి. అయితే, సొంతగడ్డపై వైట్ జెర్సీలో రాణిస్తున్న గిల్కు విదేశాల్లో రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు.ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లో గిల్ దారుణంగా విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో మొత్తంగా 93 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతడి చెత్త ప్రదర్శ కారణంగా మెల్బోర్న్ టెస్టులో ఆడించకుండా యాజమాన్యం వేటు వేసింది కూడా!తుదిజట్టులో చోటే కష్టం.. అలాంటి ఆటగాడు కెప్టెనా?అంతకు ముందు వెస్టిండీస్, సౌతాఫ్రికా పర్యటనల్లోనూ ఈ కుడిచేతి వాటం బ్యాటర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ గిల్ వైఫల్యాలను ఎత్తి చూపాడు. ‘‘టెస్టు క్రికెట్లో అతడు ఇంకా పూర్తిగా నిలదొక్కుకోనేలేదు.మరి ఇప్పుడే కెప్టెన్గా ఎందుకు? జస్ప్రీత్ బుమ్రానే సారథిని చేయాలి. ఒకవేళ అతడు ఫిట్గా లేకుంటే కేఎల్ రాహుల్ లేదంటే రిషభ్ పంత్లలో ఒకరు భారత జట్టుకు నాయకుడిగా వ్యవహరించాలి’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ హిందుస్తాన్ టైమ్స్తో పేర్కొన్నాడు.కేఎల్ రాహుల్ సరైనోడుఇక విరాట్ కోహ్లి రిటైర్మెంట్ నేపథ్యంలో కీలకమైన నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్ను ఆడించాలని చిక్కా ఈ సందర్భంగా సూచించాడు. కోహ్లి వదిలి వెళ్లిన స్థానానికి రాహుల్ మాత్రమే న్యాయం చేయగలగడని అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెట్లో భారత్కు అతడు విలువైన ఆటగాడని.. అతడికి జట్టులో స్థిరమైన స్థానం ఇవ్వాలని మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు.కాగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కూడా టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యువ రక్తంతో నిండిన జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా తొలుత ఇంగ్లండ్ను ఢీకొట్టనుంది. అన్నట్లు.. ఇంగ్లండ్ గడ్డ మీద శుబ్మన్ గిల్ మూడు టెస్టులు ఆడి 88 పరుగులు మాత్రమే చేశాడు!!చదవండి: Ind vs Eng: కుర్రాళ్లతో ఈ సిరీస్ ఆడటం కష్టం.. రహానే, పుజారా రీ ఎంట్రీ! -
గిల్ వద్దు.. టీమిండియా కెప్టెన్గా అతడే సరైనోడు!
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం దృష్టి మొత్తం టీమిండియా మీద కేంద్రీకృతమై ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత.. వారి స్థానాల్ని భర్తీ చేసేదెవరన్న చర్చ నడుస్తోంది. కాగా గత కొంతకాలంగా సంప్రదాయ ఫార్మాట్లో ఘోర పరాభవాలు చవిచూసిన భారత జట్టు.. తదుపరి ఇంగ్లండ్ను ఢీకొట్టనుంది.ఇరు జట్ల మధ్య ఈ మేర ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్తో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 ఆరంభం కానుంది. ఇంగ్లండ్ వేదికగా జరిగే ఈ కీలక సిరీస్కు టీమిండియా ఈసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేకుండానే వెళ్లనుండటం ఆసక్తిగా మారింది.పనిభారం పడకుండా ఉండేందుకే?ఇక ఈ సిరీస్ నుంచి యువ బ్యాటర్ శుబ్మన్ గిల్ టీమిండియా టెస్టు కెప్టెన్గా పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైపోయిందనే వార్తలు వస్తున్నాయి. ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై పనిభారం పడకుండా ఉండేందుకే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.బుమ్రా కూడా ఫిట్నెస్పై దృష్టి సారించే క్రమంలో తనకు తానుగా కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకొన్నాడని మరికొన్ని వార్తలు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.టెస్టు కెప్టెన్గా బుమ్రానే సరైనోడుటీమిండియా టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ను కాదని.. బుమ్రాకే పగ్గాలు అప్పగించాలని సన్నీ అభిప్రాయపడ్డాడు. ‘‘ప్రతి ఒక్కరు పనిభారం అంటూ బుమ్రా గురించి ఏదేదో మాట్లాడేస్తున్నారు. నిజానికి అతడికి మాత్రమే ఈ వర్క్లోడ్ గురించి పూర్తిగా తెలుస్తుంది. తన శరీరం ఒత్తిడిని తట్టుకోగలదా? లేదా ? అనేది బుమ్రాకు మాత్రమే తెలుస్తుంది.ఆ కారణంతో కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టడం సరికాదు. ఎందుకంటే కెప్టెన్గా ఇతరులు ఎవరు ఉన్నా.. బుమ్రాతో అదనపు ఓవర్లు వేయించాలనే చూస్తారు. మరి అలాంటపుడు పనిభారం పెరగదా?జట్టులో బుమ్రా నంబర్ వన్ బౌలర్. తనే కెప్టెన్గా ఉంటే ఎప్పుడు విరామం తీసుకోవాలి.. ఎప్పుడు బరిలోకి దిగాలనే విషయాల్లో వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోగలడు. అందుకే నా వరకైతే జస్ప్రీత్ బుమ్రానే తదుపరి టెస్టు కెప్టెన్గా నియమించాలి.పనిభారం అంటూ వచ్చే ఊహాగానాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం చేయాలో బుమ్రాకు బాగా తెలుసు. కెప్టెన్గా అతడే ఉండటం అత్యుత్తమ నిర్ణయం అని నా అభిప్రాయం’’ అని గావస్కర్ స్పోర్ట్స్ టుడేతో వ్యాఖ్యానించాడు.గతంలోనూ నాయకుడిగాకాగా బుమ్రా గతంలో ఓసారి ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు జట్టు నాయకుడిగా వ్యవహరించాడు. ఆ తర్వాత ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలుత పెర్త్లో.. ఆఖరిగా సిడ్నీలో ఐదో టెస్టులో కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే, సిడ్నీ టెస్టు సందర్భంగా వెన్నునొప్పి తిరగబడటంతో దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్-2025తో ఇటీవలే పునరాగమనం చేశాడు. ఇదిలా ఉంటే.. జూన్ 20 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ మొదలుకానుంది. చదవండి: CA: ఇష్టం లేకపోతే వెళ్లొద్దులే! -
కోహ్లి స్థానాన్ని భర్తీ చేసేదెవరు?.. ఛతేశ్వర్ పుజారా కీలక వ్యాఖ్యలు
దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) రిటైర్మెంట్తో భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ శకం ముగిసింది. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో ఆడుతూ ఇన్నాళ్లూ ఈ రన్మెషీన్ కీలక బాధ్యతను తన భుజాల మీద మోశాడు. అయితే, ఇప్పుడు అతడు టెస్టులకు వీడ్కోలు పలకడంతో ఆ స్థానం ఖాళీ అయింది. మరి కోహ్లి ప్లేస్ను భర్తీ చేసేదెవరు?!ఈ విషయం గురించి టీమిండియా వెటరన్ బ్యాటర్, నయా వాల్ ఛతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి వారసుడి గురించి ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని.. కనీసం రెండు సిరీస్ల తర్వాతే ఈ విషయంపై స్పష్టత వస్తుందన్నాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ..ఛతేశ్వర్ పుజారా కీలక వ్యాఖ్యలు‘‘నాలుగో స్థానంలో అత్యుత్తమ బ్యాటర్ ఉండాలి. అప్పుడే జట్టు నిలబడుతుంది. ప్రస్తుతం చాలా మంది టెస్టు తుదిజట్టులో చోటు దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు. అయితే, వీరిలో నాలుగో స్థానంలో ఎవరు పూర్తిస్థాయిలో ఆడతారనేది ఇంగ్లండ్ పర్యటన తర్వాత తేలనుంది.ఎందుకంటే ఇంగ్లండ్ గడ్డ మీద నంబర్ ఫోర్లో రాణిస్తే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు’’ అని పుజారా పేర్కొన్నాడు. కాగా సచిన్ టెండుల్కర్ నిష్క్రమణ తర్వాత కోహ్లి 99 సార్లు నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు.ఇక అజింక్య రహానే తొమ్మిది సార్లు, పుజారా ఏడు టెస్టుల్లో నాలుగో నంబర్ బ్యాటర్లుగా బరిలోకి దిగారు. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, సాయి సుదర్శన్లకు కోహ్లి స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ క్రమంలో శుబ్మన్ గిల్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘కొత్త బంతుల్ని ఎదుర్కోవడంలో శుబ్మన్ దిట్ట. గతంలో అతడు ఓపెనర్గా వచ్చేవాడు. ఆ తర్వాత మూడో స్థానానికి మారిపోవాల్సి వచ్చింది. అయితే, అతడు ఓల్డ్ బాల్ను ఎంత వరకు ఎదుర్కోగలడన్న విషయం కాలక్రమేణా తేలుతుంది. అప్పటిదాకా కోహ్లి స్థానాన్ని భర్తీ చేస్తూ.. దీర్ఘకాలంలో ఆ ప్లేస్లో కొనసాగే ఆటగాడు ఎవరో చెప్పడం కష్టతరమే అవుతుంది’’ అని పుజారా పేర్కొన్నాడు.రోహిత్ బాటలోనే కోహ్లికాగా మే తొలివారంలో కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్బై చెప్పగా.. సోమవారం విరాట్ కోహ్లి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. వీరిద్దరు ఇప్పటికే అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్ నుంచి వైదొలిగారు. ఇక ఇప్పుడు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నారు.ఇదిలా ఉంటే కోహ్లి సారథ్యంలో 2021లో, రోహిత్ కెప్టెన్సీలో 2023లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ చేరిన టీమిండియా.. ఈసారి మాత్రం నిరాశపరిచింది. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 3-1తో చేజార్చుకున్న రోహిత్ సేన డబ్ల్యూటీసీ 2025 ఫైనల్కు దూరమైంది.ఇక తదుపరి డబ్ల్యూటీసీ 2025-27 సీజన్లో మొదటగా టీమిండియా ఇంగ్లండ్తో తలపడనుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కోహ్లి, రోహిత్ లేకుండా తొలిసారి భారత జట్టు ఇంగ్లండ్ గడ్డ మీద అడుగుపెట్టబోతోంది. ఈ జట్టుకు శుబ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.చదవండి: కోహ్లి, రోహిత్ వన్డే వరల్డ్కప్-2027 ఆడరు: టీమిండియా దిగ్గజం -
గిల్ టీమిండియా కెప్టెన్ అయితే ధోనితో పాటు ఓ చెత్త రికార్డును షేర్ చేసుకుంటాడు..!
రోహిత్ శర్మ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియా కెప్టెన్సీ రేసులో శుభ్మన్ గిల్ ముందున్నాడు. భారత సెలెక్టర్లు, బీసీసీఐ గిల్కు భారత టెస్ట్ జట్టు పగ్గాలు అప్పజెప్పేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. టెస్ట్ల్లో గిల్కు అంత మంచి ట్రాక్ రికార్డు లేనప్పటికీ.. బీసీసీఐ పెద్దలు అతనివైపే మొగ్గుచూపుతున్నారు. బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి ఆప్షన్స్ ఉన్నా ఆల్ ఫార్మాట్ ఆటగాడని గిల్ను వెనకేసుకొస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. గిల్ సారథ్యంలోనే భారత్ కఠినమైన ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుందన్న విషయం స్పష్టమవుతుంది. మరో రెండు రోజుల్లో గిల్ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో భేటి కానున్నాడని తెలుస్తుంది.ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసే భారత టెస్ట్ జట్టుకు గిల్ సారధిగా నియమితుడైతే టీమిండియా దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనితో కలిసి ఓ చెత్త రికార్డును షేర్ చేసుకుంటాడు. గడిచిన 30 సంవత్సరాల్లో 30 కంటే తక్కువ బ్యాటింగ్ సగటుతో సేనా దేశాల్లో (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) టీమిండియాకు నాయకత్వం వహించిన కెప్టెన్గా అపప్రదను మూటగట్టుకుంటాడు. ఈ జాబితాలో ధోనితో పాటు కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు.సేనా దేశాల్లో ధోని బ్యాటింగ్ సగటు 28.37 కాగా.. రాహుల్ బ్యాటంగ్ సగటు 29.60గా ఉంది. గిల్ విషయానికొస్తే.. సేనా దేశాల్లో అతని బ్యాటింగ్ సగటు ధోని, రాహుల్ కంటే అధ్వానంగా 25.70గా ఉంది. గిల్ టీమిండియా నయా టెస్ట్ కెప్టెన్గా నియమితుడైతే ధోని, రాహుల్తో పాటు పైన పేర్కొన్న చెత్త రికార్డును షేర్ చేసుకుంటాడు. టెస్ట్లకు గుడ్బై చెప్పిన విరాట్టెస్ట్ క్రికెట్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన వారంలోపే విరాట్ కోహ్లి కూడా టెస్ట్లకు గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఇవాళ (మే 12) ఉదయం కోహ్లి టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటనను చేశాడు. బీసీసీఐలోని కొందరు పెద్దలు కోహ్లిని రిటైర్మెంట్ విషయంలో వెనక్కు తగ్గాలని కోరినా వినలేదని తెలుస్తుంది. గతేడాది టీ20 వరల్డ్కప్ తర్వాత పొట్టి క్రికెట్కు గుడ్బై చెప్పిన కోహ్లి.. తాజాగా టెస్ట్లకు కూడా వీడ్కోలు పలికాడు. -
IND vs ENG: టీమిండియా కెప్టెన్గా గిల్.. వైస్ కెప్టెన్గా అతడే!
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు టీమిండియా కొత్త కెప్టెన్ నియామకం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ (Rohit Sharma) నిష్క్రమణ నేపథ్యంలో యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ (Shubman Gill)కు పగ్గాలు అప్పగించేందుకు బోర్డు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా.. అతడికి డిప్యూటీగా మరో యువ ఆటగాడినే ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.ఈసారి కనీసం ఫైనల్ చేరకుండానేగతేడాది టెస్టుల్లో పరాభవాల పాలైన టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC)-2025 ఫైనల్కు దూరమైన విషయం తెలిసిందే. వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరినప్పటికీ టైటిల్కు అడుగుదూరంలో నిలిచిపోయిన భారత్.. ఈసారి ఆలోటు తీర్చుకుంటుందనుకుంటే ఇలా మొత్తానికే మోసం వచ్చింది.స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు టెస్టుల్లో 3-0తో వైట్వాష్ కావడం.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (BGT)-2025లో 3-1తో ఓడటం ఇందుకు ప్రధాన కారణాలు. ఈ రెండు సందర్భాల్లోనూ కెప్టెన్గా, బ్యాటర్గా విఫలమైన రోహిత్ శర్మ బుధవారమే సంప్రదాయ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు.విరాట్ కోహ్లి కూడా రోహిత్ బాటలోనే!ఈ క్రమంలో మరో సీనియర్ బ్యాటర్, దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా రోహిత్ బాటలోనే నడుస్తాడనే వార్తలు వినిపించాయి. కోహ్లి ఇంగ్లండ్తో సిరీస్లో కెప్టెన్గా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నా.. బోర్డు అందుకు సమ్మతించలేదని.. అందుకే అతడు ఈ మేర తీవ్ర నిర్ణయానికి వచ్చినట్లు వదంతులు వ్యాపించాయి.వైస్ కెప్టెన్గా పంత్డబ్ల్యూటీసీ 2025-27 కొత్త సీజన్లో యువ రక్తంతో నిండిన జట్టును ఇప్పటి నుంచే సిద్ధం చేయాలనే యోచనలో ఉన్న బోర్డు.. కోహ్లికి నో చెప్పిందన్నది వాటి సారాంశం. తాజా సమాచారం ప్రకారం.. శుబ్మన్ గిల్ను కెప్టెన్గా నియమించాలని బీసీసీఐ నిర్ణయించింది. మే ఆఖరి వారంలో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.అదే విధంగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ను వైస్ కెప్టెన్గా నియమించాలని సెలక్టర్లు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి గిల్ కంటే పంత్ సీనియర్. అంతేకాదు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి విదేశీ గడ్డలపై సమర్థవంతంగా ఆడిన అనుభవం అతడికి ఉంది.అయితే, ఇటీవల ఆసీస్ పర్యటనలో పంత్ పూర్తిగా విఫలమయ్యాడు. షాట్ల ఎంపిక విషయంలో పదే పదే తప్పులు చేస్తూ విమర్శల పాలయ్యాడు. ఇలాంటి తరుణంలో గిల్ వైపు మొగ్గు చూపిన యాజమాన్యం.. అతడి చుట్టూ భవిష్యత్ జట్టును నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించే పంత్పై అదనపు భారం మోపకుండా.. బ్యాటింగ్పైనే ప్రధానంగా దృష్టి పెట్టేలా బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టులతో డబ్ల్యూటీసీ 2025-27 సీజన్ ఆరంభం కానుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఇంగ్లండ్ వేదికగా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగుతుంది. చదవండి: SRH: బ్యాటర్ల వైఫల్యం... బౌలర్ల నిస్సహాయత -
టీమిండియాకు కొత్త టెస్టు కెప్టెన్ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?
ఐపీఎల్-2025 సీజన్ నిరావధికంగా వాయిదా పడడంతో భారత జట్టు ఇక ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు సన్నద్దం కానుంది. ఈ ఏడాది జూన్లో ఇంగ్లండ్ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టు భారత్ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది.ఈ క్రమంలో ఇంగ్లండ్ టెస్టు సిరీస్ కోసం భారత జట్టు ప్రకటనకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముహార్తం ఖారారు చేసింది. క్రిక్బజ్ రిపోర్ట్ ప్రకారం.. మే 23న బీసీసీఐ విలేకరుల సమావేశం నిర్వహించి, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే జట్టుతో పాటు భారత టెస్ట్ కెప్టెన్ను కూడా ప్రకటించననున్నట్లు సమాచారం. రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త కెప్టెన్ ఎంపిక ఇప్పుడు అనివార్యమైంది. తొలుత ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును మే 20న ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పేర్కొన్నారు. కానీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావలనుకుంటున్నట్లు బీసీసీఐకి చెప్పడంతో జట్టు ప్రకటనను రెండు రోజుల పాటు వాయిదా వేసినట్లు వినికిడి. కోహ్లిని తన నిర్ణయాన్ని మార్చుకోవాలని బీసీసీఐ సూచించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. మరి కోహ్లి యూ-టర్న్ తీసుకుంటాడా? లేదా అన్నది మరో కొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఇక భారత టెస్టు కెప్టెన్సీ రేసులో శుభ్మన్ గిల్ ముందుంజలో ఉన్నాడు.ప్రస్తుతం టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా కొనసాగుతున్నాడు. కానీ గాయాల బెడద, వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అతడికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించకూడదని బీసీసీఐ భావిస్తుందంట. దాదాపు శుబ్మన్ గిల్ పేరును బీసీసీఐ ఖారారు చేసినట్లు వినికిడి. -
Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’!
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) టెస్టులకు వీడ్కోలు పలకబోతున్నాడన్న వార్తల నడుమ.. తాజాగా మరో ప్రచారం తెరమీదకు వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన అభ్యర్థనను తిరస్కరించిన కారణంగానే కోహ్లి ఈ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధపడ్డాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈసారి ఫైనల్ చేరకుండానేకాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2023-25 సీజన్ ఆరంభంలో అదరగొట్టిన రోహిత్ సేన.. అసలు సమయానికి చేతులెత్తేసిన విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్కు గురైన టీమిండియా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ వైఫల్యాలను కొనసాగించింది.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2025లో భాగంగా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లోనూ 3-1తో ఓటమిపాలైంది. తద్వారా ఈసారి ఫైనల్ చేరకుండానే ఇంటి బాట పట్టింది. రెండు సిరీస్లలో ఇంతటి ఘోర పరాభవానికి కారణం కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల బ్యాటింగ్ వైఫల్యమే.అయితే, కోహ్లి ఆసీస్ గడ్డపై ఓ శతకంతో మెరిసి టచ్లోకి వచ్చినట్లు కనిపించినా.. రోహిత్ మాత్రం పూర్తిగా తేలిపోయాడు. అనంతరం ఈ ఇద్దరూ రంజీ ట్రోఫీ బరిలో దిగి అక్కడా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టుకు వీడ్కోలు పలకాలనే డిమాండ్లు రాగా.. బుధవారం ఇందుకు సంబంధించి అతడు అధికారిక ప్రకటన విడుదల చేశాడు.సోషల్ మీడియా వేదికగాతాను టెస్టు ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇంగ్లండ్తో జూన్ 20 నుంచి మొదలుకానున్న డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్ ఆరంభానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక కోహ్లి కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమయ్యాడని తాజాగా వార్తలు వస్తున్నాయి.జట్టుకు బలం అతడుఅయితే, బీసీసీఐ మాత్రం కోహ్లిని ఇంగ్లండ్తో సిరీస్ వరకైనా ఆడాలని కోరినట్లు తెలుస్తోంది. ఎన్డీటీవీతో బీసీసీఐ వర్గాలు ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘కోహ్లి ఇంకా పరుగుల దాహంతోనే ఉన్నాడు. అతడు డ్రెసింగ్రూమ్లో ఉంటే జట్టుకు బలం.ఇప్పట్లో టెస్టులకు గుడ్బై చెప్పాలనే నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరాం’’ అని పేర్కొన్నాయి.కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది?అయితే, టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. రోహిత్ శర్మ వీడ్కోలు నేపథ్యంలో విరాట్ కోహ్లి తనకు కెప్టెన్సీ కావాలని అడిగినట్లు తెలుస్తోంది. అయితే, బీసీసీఐ మాత్రం ఇందుకు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. శుబ్మన్ గిల్ వంటి యువ ఆటగాడికి పగ్గాలు అప్పగించాలని బోర్డు సహా ప్రధాన కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘డబ్ల్యూటీసీ కొత్త సైకిల్ మొదలుకానుంది. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు కెప్టెన్ నియమించాలని బోర్డు భావిస్తోంది.హెడ్కోచ్ గంభీర్ కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు. కొత్తతరం ఆటగాళ్లతో పటిష్ట జట్టు తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇంగ్లండ్ వంటి మేటి జట్టుతో సిరీస్ నుంచే ఈ పని మొదలుపెట్టాలని భావిస్తున్నారు. అందుకే కొత్త నాయకుడి వైపే యాజమాన్యం మొగ్గు చూపుతోంది’’ అని పేర్కొన్నాయి.కెప్టెన్గానూ హిట్కాగా గతంలో కెప్టెన్గా ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గెలవడంతో పాటు టెస్టుల్లో భారత్ను అగ్రస్థానంలో నిలిపిన ఘనత కోహ్లికి ఉంది. టెస్టుల్లో అతడి రికార్డులు అమోఘం. అయితే, వన్డే కెప్టెన్సీ నుంచి తనను తొలగించిన తర్వాత... సౌతాఫ్రికా పర్యటనలో ఓటమి అనంతరం టెస్టు పగ్గాలు కూడా వదిలేశాడు.కోహ్లి సారథ్యంలో డబ్ల్యూటీసీ 2019-21లో టీమిండియా ఫైనల్కు చేరింది. అయితే, ఆ తర్వాత రోహిత్ గైర్హాజరీలో కూడా కోహ్లి ఎప్పుడూ కెప్టెన్గా వ్యవహరించలేదు. బ్యాటర్గా కొనసాగేందుకే ఇష్టపడ్డాడు. అలాంటిది ఇప్పుడు కోహ్లి కెప్టెన్సీ అడిగాడని.. అందుకు బోర్డు నిరాకరించిందనే వార్తలు కల్పితాలే అని విశ్లేషకులు భావిస్తున్నారు.చదవండి: IPL 2025: మిగిలిన మ్యాచ్లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్! -
గిల్, బుమ్రా, పంత్ కాదు.. టీమిండియా కెప్టెన్గా అతడే?
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడించి అందరికి షాకిచ్చాడు. ఇకపై కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగనున్నట్లు హిట్మ్యాన్ తెలిపాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ టూర్కు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో కొత్త టెస్టు కెప్టెన్ను ఎంపిక చేసే పనిలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ పడింది.కెప్టెన్సీ రేసులో స్టార్ ప్లేయర్లు శుబ్మన్ గిల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. ప్రస్తుతం బుమ్రా.. టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. కానీ గాయాల బెడద, వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అతన్ని ఈ కెప్టెన్స్ రేసు నుంచి గ్రూప్ నుంచి తప్పించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు వినికిడి. తాజాగా ఈ జాబితాలోకి కేఎల్ రాహుల్ చేరినట్లు సమాచారం. కెప్టెన్గా తక్కువ అనుభవం ఉన్న గిల్, పంత్ కంటే సీనియర్ ప్లేయర్ అయిన రాహుల్కు పగ్గాలు అప్పగిస్తే బెటర్ అని సెలక్టర్లు భావిస్తున్నట్లు అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇంగ్లండ్ సిరీస్ తర్వాత పూర్తి స్ధాయి కెప్టెన్ను నియమించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కెప్టెన్గా రాహుల్..టెస్టు కెప్టెన్సీ పరంగా కేఎల్ రాహుల్కు అనుభవం ఉంది. గతంలో మూడు సార్లు టీమిండియాకు రాయల్ నాయకత్వం వహించాడు. 2022లో అతడి సారథ్యంలోనే బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను భారత్ సొంతం చేసుకుంది. అదేవిధంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టెస్టు మ్యాచ్లో కూడా రాహుల్ కెప్టెన్గా వ్యవహరించాడు.అయితే ఆ మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లండ్లో వ్యక్తిగత గణాంకాల పరంగా కూడా రాహుల్కు మంచి రికార్డు ఉంది. ఇంగ్లండ్ గడ్డపై ఈ వికెట్ కీపర్ ఈ కీపర్-బ్యాటర్ 9 మ్యాచ్ల్లో 614 పరుగులు చేశాడు. ఈ టెస్టు పర్యటనకు బీసీసీఐ భారత జట్టును మే రెండో వారంలో ప్రకటించే అవకాశముంది.చదవండి: పీసీబీకి చావు దెబ్బ!.. రావల్పిండి స్టేడియంపై డ్రోన్ దాడి?.. PSLపై నీలినీడలు! -
వర్షమా?.. ఎక్కడ?: ఆశిష్ నెహ్రా, రాహుల్ తెవాటియా ఆగ్రహం
ఐపీఎల్-2025 (IPL 2025)లో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ రేసులో మరో ముందడుగు వేసింది. ముంబై ఇండియన్స్ (MI vs GT)తో మంగళవారం నాటి మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో గెలిచి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకువచ్చింది. అయితే, ఈ గెలుపు గుజరాత్కు అంత సులువుగా ఏమీ దక్కలేదు.వర్షం కారణంగా పదే పదే వాయిదా పడిన మ్యాచ్ ఎట్టకేలకు పూర్తి కావడంతో గిల్ సేనకు ఊరట దక్కింది. ఒకవేళ వాన వల్ల మ్యాచ్ రద్దయిపోతే ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చేది. అప్పుడు గుజరాత్ ప్లే ఆఫ్స్ అవకాశాలు కాస్త క్లిష్టంగా మారేవి. మరోవైపు.. బ్యాటింగ్ పరంగా విఫలమైన ముంబై పాలిట వర్షం వరంగా మారేది. టైమింగ్ను మార్చడంతోఅందుకే, మధ్యలో వాన తెరిపినిచ్చినా మ్యాచ్ టైమింగ్ను పదే పదే మార్చడంపై గుజరాత్ టైటాన్స్ హెడ్కోచ్ ఆశిష్ నెహ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనేక అవాంతరాల అనంతరం.. అర్ధరాత్రి దాటిన తర్వాత 12:09 AM నుంచి మ్యాచ్ను 12:25 AMకు మార్చిన అంపైర్లు.. ఆ తర్వాత మ్యాచ్ పునఃప్రారంభాన్ని 12:30 AMకు వాయిదా వేశారు.వర్షమా?.. ఎక్కడ?ఈ నేపథ్యంలో మైదానంలోకి వచ్చిన ఆశిష్ నెహ్రా అంపైర్లతో వాదనకు దిగినట్లు కనిపించింది. మరోవైపు.. టైటాన్స్ బ్యాటర్ రాహుల్ తెవాటియా కూడా.. ‘‘వర్షం ఎక్కడ పడుతోంది’’ అన్నట్లుగా అంపైర్లతో వాదించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. కీలకమైన మ్యాచ్లో గెలుపునకు దగ్గరైన వేళ వరుణుడితో పాటు అంపైర్లు కూడా తమతో దోబూచులాడటం నచ్చకే వీళ్లిద్దరూ ఇలా ఫైర్ అయ్యారంటూ అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.Rahul Tewatia saying where is rain.- Ashish Nehra is furious.Rain go 🤣#MIvGT #MIvsGT pic.twitter.com/oEiO7q1Qpf— its cinema (@iitscinema) May 6, 2025రాణించిన గుజరాత్ బౌలర్లుకాగా ముంబైలోని వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ముంబైని 155 పరుగులకు కట్టడి చేయగలిగింది. సాయి కిషోర్ రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జి ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఇక ముంబై బ్యాటర్లలో ఓపెనర్లు రియాన్ రికెల్టన్ (2), రోహిత్ శర్మ (7) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి దశలో వన్డౌన్ బ్యాటర్ విల్జాక్స్ (53), సూర్యకుమార్ యాదవ్ (35) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఆఖర్లో కార్బిన్ బాష్ (27) కూడా రాణించడంతో ముంబై ఎనిమిది వికెట్లు నష్టపోయి 155 పరుగులు చేసింది.డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారంఇక లక్ష్య ఛేదనలో టైటాన్స్కు పదే పదే వర్షం ఆటంకం కలిగించింది. అయితే, కెప్టెన్ శుబ్మన్ గిల్ (43), వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ (30), షెర్ఫానే రూథర్ఫర్డ్ (28) రాణించారు. అయితే, ఆఖర్లో వర్షం వల్ల డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 19 ఓవర్లలో గుజరాత్ లక్ష్యాన్ని 147గా నిర్ణయించారు.ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో అనేక నాటకీయ పరిణామాల నడుమ గుజరాత్ 19 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి సరిగ్గా 147 పరుగులు చేసి జయభేరి మోగించింది. చివరి ఓవర్లో ముంబై పేసర్ దీపక్ చహర్ బౌలింగ్లో (4,1, 6, N1, 1, W, 1) తెవాటియా కొట్టిన ఫోర్, కోయెట్జి బాదిన సిక్సర్ గుజరాత్ను విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాయి.ఇక ఈ సీజన్లో ఇప్పటికి పదకొండు మ్యాచ్లు పూర్తి చేసుకున్న గుజరాత్కు ఇది ఎనిమిదో విజయం. ఫలితంగా గిల్ సేన ఖాతాలో ఇప్పుడు 16 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్రేటు (0.793) పరంగానూ మెరుగ్గా ఉండటంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి దూసుకువచ్చింది.చదవండి: టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకే: ఓటమిపై హార్దిక్Rain delays, wickets falling, and nerves running high 📈...@gujarat_titans edge past everything to seal a thrilling win over #MI that had fans on the edge of their seats! 🥳Scorecard ▶ https://t.co/DdKG6Zn78k #TATAIPL | #MIvGT pic.twitter.com/NLYj3ZlI3w— IndianPremierLeague (@IPL) May 6, 2025 -
టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకే: హార్దిక్
గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) స్పందించాడు. ఆఖరి వరకు తమ జట్టు పోరాడిన తీరు అద్భుతమని కొనియాడాడు. అయితే, నో బాల్స్ వేయడం ప్రభావం చూపిందన్న హార్దిక్.. టీ20లలో ఇలా చేయడం నేరంతో సమానమని పేర్కొన్నాడు.ఐపీఎల్-2025 (IPL 2025) ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరచుకునే క్రమంలో ముంబై మంగళవారం గుజరాత్ టైటాన్స్తో తలపడింది. సొంత మైదానం వాంఖడేలో టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్కు దిగింది. గుజరాత్ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది.వాన వల్ల పదే పదే ఆగిన ఆటఇక లక్ష్య ఛేదనలో గుజరాత్ ఆరంభంలోనే ఓపెనర్ సాయి సుదర్శన్(5) వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ (43) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. జోస్ బట్లర్ (30), షెర్ఫానే రూథర్ఫర్డ్ (28) అతడికి సహకరించారు.ఈ క్రమంలో 14 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసి విజయం దిశగా గుజరాత్ పయనిస్తున్న వేళ వర్షం వల్ల చాలా సేపు మ్యాచ్ నిలిచిపోయింది. అయితే, వాన తెరిపినిచ్చిన తర్వాత ముంబై బౌలర్లు ఒక్కసారిగా విజృంభించారు. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ధాటికి పదహారు బంతుల వ్యవధిలో నాలుగు వికెట్లు నష్టపోయింది.ఈ క్రమంలో మిగిలిన రెండు ఓవర్లలో గుజరాత్ విజయానికి 24 పరుగులు అవసరమైన వేళ... భారీ వర్షం వల్ల ఆట మళ్లీ ఆగిపోయింది. ఫలితంగా డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం గుజరాత్ లక్ష్యం 19 ఓవర్లలో 147గా మారగా.. ఆరు బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన పరిస్థితి.ఆఖరి ఓవర్లో దీపక్ చహర్ నో బాల్ఈ నేపథ్యంలో తమ పేసర్ దీపక్ చహర్ను ముంబై బరిలోకి దించింది. అయితే, తొలి బంతికే రాహుల్ తెవాటియా ఫోర్ బాదగా.. మరుసటి బంతికి ఒక రన్ వచ్చింది. ఆ తర్వాత గెరాల్డ్ కోయెట్జి సిక్సర్ బాదాడు. దీంతో మూడు బంతుల్లో విజయ సమీకరణం నాలుగు పరుగులుగా మారింది.ఇలాంటి కీలక సమయంలో చహర్ నోబాల్ వేశాడు. అయితే, ఆ తర్వాత అతడు వేసిన లో ఫుల్ టాస్కు తెవాటియా ఒక్క పరుగే రాబట్టాడు. దీంతో రెండు బంతుల్లో ఒక్క పరుగు అవసరం కాగా.. చహర్ కోయెట్జిని పెవిలియన్కు పంపాడు. అయితే, ఆఖరి బంతికి అర్షద్ ఖాన్ పరుగు తీయడంతో గుజరాత్ విజయం ఖరారైంది.అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకేఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ముంబై సారథి హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘మా వాళ్లు ఆఖరి వరకు పట్టుదలగా పోరాడారు. జట్టుగా మేము సమిష్టిగా ముందుకు సాగాము. అయితే, ఇంకో 25 పరుగులు చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.ఏదేమైనా మా బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇక క్యాచ్ డ్రాప్ల వల్ల మూల్యం చెల్లించాల్సి వచ్చిందని నేను అస్సలు అనుకోను. మా వాళ్లు ఈరోజు వందకు 120 శాతం కష్టపడ్డారు.ఏదేమైనా నో బాల్స్ వేయడం సరికాదు. నేను కూడా అదే పని చేశాను. నిజానికి నా దృష్టిలో టీ20 మ్యాచ్లో నో బాల్స్ వేయడం నేరం లాంటిది. ఇవే మన కొంప ముంచుతాయి. అయితే, మా వాళ్ల ప్రదర్శన పట్ల నేనైతే సంతోషంగానే ఉన్నాను’’ అని చెప్పుకొచ్చాడు.కాగా గుజరాత్ ఇన్నింగ్స్ పదకొండో ఓవర్లో హార్దిక్ కూడా నో బాల్ వేశాడు. ఇక 12వ ఓవర్లో ముంబై శుబ్మన్ గిల్ ఇచ్చిన క్యాచ్ను కూడా జారవిడిచింది. కాగా ముంబైపై మూడు వికెట్ల తేడాతో గెలిచిన గుజరాత్ 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్య భాయ్ Rain delays, wickets falling, and nerves running high 📈...@gujarat_titans edge past everything to seal a thrilling win over #MI that had fans on the edge of their seats! 🥳Scorecard ▶ https://t.co/DdKG6Zn78k #TATAIPL | #MIvGT pic.twitter.com/NLYj3ZlI3w— IndianPremierLeague (@IPL) May 6, 2025 -
IND vs ENG: బుమ్రాకు షాక్.. వైస్ కెప్టెన్గానూ అవుట్!
గత కొంతకాలంగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. ఇంగ్లండ్లో సత్తా చాటి పూర్వ వైభవం పొందాలని పట్టుదలగా ఉంది. ఇంగ్లండ్తో సిరీస్లో నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలక్టర్లు సీనియర్ టీమ్, భారత ‘ఎ’ జట్టు కోసం కలిపి ఇప్పటికే ప్రాథమికంగా 35 మంది ప్రాబబుల్స్ను ఎంపిక చేశారు. ఇందులో కెప్టెన్గా రోహిత్ శర్మ (Rohit Sharma)పేరు దాదాపుగా ఖరారు కాగా.. వైస్ కెప్టెన్ ఎవరన్న అంశంపై సందిగ్దం నెలకొంది.నిజానికి స్వదేశంలో న్యూజిలాండ్తో 3-0తో క్లీన్స్వీప్, ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ (BGT)ని చేజార్చుకున్న తర్వాత రోహిత్ టెస్టు భవితవ్యంపై సందేహాలు నెలకొన్నాయి. కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గానూ అతడు విఫలం కావడంతో ఇక సంప్రదాయ ఫార్మాట్కు వీడ్కోలు పలుకుతాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కెప్టెన్గానే కాదు.. వైస్ కెప్టెన్గానూ బుమ్రా అవుట్!ఈ నేపథ్యంలో రోహిత్ స్థానాన్ని పేస్ దళ నాయకుడు, టెస్టు జట్టు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)తో భర్తీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం రోహిత్నే కెప్టెన్గా కొనసాగించేందుకు మొగ్గు చూపిన బోర్డు.. బుమ్రా పేరును కనీసం వైస్ కెప్టెన్సీ రేసులోనూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘ఐదు టెస్టులకూ అందుబాటులో ఉండే ఆటగాడికే వైస్ కెప్టెన్ ఇవ్వాలని భావిస్తున్నాం.నిజానికి బుమ్రా ఈ పర్యటనలో అన్ని మ్యాచ్లు ఆడడు. కాబట్టి కెప్టెన్కు డిప్యూటీగా వేర్వేరు మ్యాచ్లలో వేర్వేరు ఆటగాళ్లను నియమించలేము. అందుకే ఐదు టెస్టులు ఆడే ఆటగాడినే వైస్ కెప్టెన్గా ఎంపిక చేస్తాం’’ అని పేర్కొన్నాయి.గాయం తిరగబెట్టే అవకాశం!కాగా ఆస్ట్రేలియా పర్యటనలో ఐదింట రెండు టెస్టులకు కెప్టెన్గా వ్యవహరించడంతో పాటు.. పేస్ దళం భారం మొత్తాన్ని బుమ్రానే మోశాడు. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2023-25 సీజన్లో ముప్పై రెండు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. కానీ ఈ సిరీస్లో భారత్ ఓడిపోయింది. మరోవైపు.. ఆఖరిదైన సిడ్నీ టెస్టులో బుమ్రా గాయపడ్డాడు.వెన్నునొప్పి తిరగబెట్టడంతో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొత్తానికి బుమ్రా అందుబాటులో లేకుండా పోయాడు. ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్లకూ అతడు దూరమయ్యాడు. దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరంగానే న్నాడు.ఈ క్రమంలో బుమ్రా ఫిట్నెస్ దృష్ట్యా ఇంగ్లండ్లోనూ అతడిని వరుస మ్యాచ్లలో ఆడిస్తే మళ్లీ గాయం తిరగబెట్టే అవకాశం ఉందని పలువురు మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.బుమ్రా వంటి విలువైన ఫాస్ట్ బౌలర్ను కాపాడుకోవాలంటే.. ఒక టెస్టు ముగిసిన తర్వాత రెండో టెస్టు కోసం అతడికి విశ్రాంతినివ్వాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుమ్రాపై పనిభారం తగ్గించే విషయంలో సెలక్టర్లు కూడా ఓ నిర్ణయానికి వచ్చారని.. అందుకే వైస్ కెప్టెన్సీ రూపంలో అదనపు బాధ్యతల నుంచి కూడా తప్పించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.రేసులో ఆ మూడు పేర్లుఒకవేళ బుమ్రాను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తే.. అతడి స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్ల ఎవరన్న చర్చ ఇప్పటికే మొదలైంది. రిషభ్ పంత్ లేదంటే.. శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ల పేర్లు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, అసలే ఇంగ్లండ్తో టెస్టులు కాబట్టి యువ ఆటగాళ్ల వైపు మొగ్గుచూపకుండా.. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్లకు బోర్డు బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదు. కాగా టీమిండియా ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్నారు. మే 25న క్యాష్ రిచ్ లీగ్ ఫైనల్ జరుగనుండగా.. ఆ తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ మొదలుకానుంది.చదవండి: PBKS VS LSG: అప్పుడే అంతా అయిపోలేదు: లక్నో కెప్టెన్ పంత్ -
Shubman Gill: అంపైర్లతో గొడవ.. తప్పేముంది?.. తగ్గేదేలే..
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ సందర్భంగా తాను ప్రవర్తించిన తీరును గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ సమర్థించుకున్నాడు. వందకు నూటా పది శాతం కష్టపడుతున్నపుడు ఇలాంటివి జరుగుతాయని.. ఒక్కోసారి భావోద్వేగాలను అదుపు చేసుకోలేమని పేర్కొన్నాడు.ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా టైటాన్స్ శుక్రవారం సన్రైజర్స్తో తలపడింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ 38 బంతుల్లో పది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 76 పరుగులు సాధించాడు.అంపైర్లతో వాదనతనకు అచ్చొచ్చిన మైదానంలో గిల్ శతకం దిశగా పయనిస్తున్న వేళ అనూహ్య రీతిలో రనౌట్ అయ్యాడు. జీషన్ అన్సారీ బౌలింగ్లో జోస్ బట్లర్ పరుగుకు యత్నించగా.. గిల్ రన్ పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఇంతలో ఫీల్డర్ హర్షల్ పటేల్ విసిరిన బంతిని వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ అందుకుని వికెట్లకు గిరాటేశాడు.అయితే, బంతి క్లాసెన్ గ్లోవ్స్ను తాకి స్టంప్స్ పక్కగా వెళ్లింది. అప్పుడు క్లాసెన్ గ్లవ్ తాకి స్టంప్స్ పైకి ఎగిరినట్లు కనిపించింది. అయితే, కీపర్ చేతిలో ఉండగానే బంతి స్టంప్ను తాకిందా లేదా అన్నది స్పష్టంగా తెలియరాలేదు. అయినప్పటికీ టీవీ అంపైర్ మాత్రం గిల్ను అవుట్గానే ప్రకటించాడు.మరోసారి వాగ్వాదంఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి లోనైన శుబ్మన్ గిల్ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అదే విధంగా.. లక్ష్య ఛేదనలో సన్రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మ విషయంలో ఎల్బీడబ్ల్యూ అప్పీలు అంశంలో ప్రతికూల నిర్ణయం రావడంతో కోపోద్రిక్తుడయ్యాడు.మళ్లీ అప్పుడు కూడా గిల్ అంపైర్తో వాదనకు దిగాడు. ఈ పరిణామాల గురించి విజయానంతరం గిల్ స్పందించాడు. ‘‘నాకు, అంపైర్కు మధ్య చర్చ జరిగింది. ఒక్కోసారి భావోద్వేగాలను అదుపుచేసుకోలేము.తప్పేముంది?.. తగ్గేదేలేగెలిచేందుకు వందకు 110 శాతం కృషి చేస్తున్నపుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. జరిగిన విషయం గురించే మాట్లాడాను. ఈ వైఖరి తప్పని నేను అనుకోను’’ అని గిల్ స్పష్టం చేశాడు. స్కోరు బోర్డును ఎలా పరుగులు తీయించాలో తమకు తెలుసునని.. ఏదేమైనా ప్లే ఆఫ్స్కు చేరువ కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.కాగా ఈ సీజన్లో ఇప్పటికి పది మ్యాచ్లు ఆడిన గుజరాత్కు ఇది ఏడో గెలుపు. తద్వారా పద్నాలుగు పాయిం ట్లతో పట్టికలో రెండోస్థానంలోకి దూసుకు వచ్చింది. మరోవైపు.. ఏడో పరాజయం నమోదు చేసిన సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపు కోల్పోయింది. ఐపీఎల్-2025: టైటాన్స్ వర్సెస్ సన్రైజర్స్👉టాస్: సన్రైజర్స్.. తొలుత బౌలింగ్👉టైటాన్స్ స్కోరు: 224/6 (20)👉సన్రైజర్స్ స్కోరు: 186/6 (20)👉ఫలితం: 38 పరుగుల తేడాతో సన్రైజర్స్పై టైటాన్స్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ప్రసిద్ కృష్ణ (టైటాన్స్ పేసర్- నాలుగు ఓవర్ల బౌలింగ్లో కేవలం 19 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు).చదవండి: Shubman Gill: అంపైర్తో గొడవపడి.. అభిషేక్ను కాలితో తన్ని! What's your take? 👇✍🏻#ShubmanGill seen having a word with the umpire after being given out by the third umpire on a tight call! 👀Watch the LIVE action ➡ https://t.co/RucOdyBVUf#IPLonJioStar 👉 #GTvSRH | LIVE NOW on SS-1, SS- 1 Hindi & JioHotstar! pic.twitter.com/TPiALXJu8O— Star Sports (@StarSportsIndia) May 2, 2025 -
అంపైర్తో గొడవపడి.. అభిషేక్ను కాలితో తన్ని!.. ఎందుకిలా చేశాడు?
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) ప్రవర్తన విమర్శలకు దారితీసింది. సారథిగా సంయమనంతో వ్యవహరించాల్సిన ఆటగాడే ఇలా సహనం కోల్పోవడం సరికాదంటూ క్రికెట్ ప్రేమికులు అతడిని విమర్శిస్తున్నారు. గిల్ నుంచి ఇలాంటివి అస్సలు ఊహించలేదని.. స్నేహపూర్వకంగా చేసే పనులకు కూడా ఓ హద్దు ఉంటుందని సోషల్ మీడియా వేదికగా హితవు పలుకుతున్నారు.అసలు విషయమేమిటంటే.. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా గుజరాత్ టైటాన్స్ అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు (GT vs SRH)తో తలపడింది. సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ ఓడిన టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది.సాయి, గిల్ మెరుపు ఇన్నింగ్స్ఓపెనర్లు సాయి సుదర్శన్ (23 బంతుల్లో 48), శుబ్మన్ గిల్ (38 బంతుల్లో 76) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. వన్డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ (37 బంతుల్లో 64) కూడా అదరగొట్టాడు. వీరికి తోడు వాషింగ్టన్ సుందర్ (16 బంతుల్లో 21) కూడా రాణించాడు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో టైటాన్స్ ఆరు వికెట్లు నష్టపోయి ఏకంగా 224 పరుగులు చేసింది. అయితే, గిల్ రనౌట్ అయిన తీరు విమర్శలకు దారితీయగా.. అతడు మైదానాన్ని వీడే ముందు అంపైర్తో వాదించాడు.38 పరుగుల తేడాతో ఇదిలా ఉంటే.. లక్ష్య ఛేదనలో తడబడ్డ సన్రైజర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 186 పరుగులే చేసింది. తద్వారా 38 పరుగుల తేడాతో ఓటమి పాలై ప్లే ఆఫ్స్ ఆశలను దాదాపు వదిలేసుకుంది.ఇక రైజర్స్ ఇన్నింగ్స్లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక్కడే మెరుగ్గా ఆడాడు. మొత్తంగా 41 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 74 పరుగులు సాధించాడు. అయితే, పద్నాలుగో ఓవర్లో టైటాన్స్ పేసర్ ప్రసిద్ కృష్ణ వేసిన యార్కర్ను ఆడే క్రమంలో అభిషేక్ విఫలమయ్యాడు.అంపైర్తో గొడవపడి.. అభిషేక్ను కాలితో తన్ని!అయితే, బంతి దిశను మార్చుకుని అతడి ప్యాడ్ను తాకినట్లు కనిపించింది. కానీ ఫీల్డ్ అంపైర్ మాత్రం స్పందించకపోవడంతో.. టైటాన్స్ రివ్యూకు వెళ్లింది. అందులో బంతి వికెట్లను హిట్ చేసినట్లుగా కనిపించినప్పటికీ.. అంపైర్స్ కాల్ ద్వారా అభిషేక్ నాటౌట్గా నిలిచాడు.దీంతో సహనం కోల్పోయిన శుబ్మన్ గిల్ ఫీల్డ్ అంపైర్తో వాదనకు దిగాడు. కోపంతో అతడి పైపైకి వస్తూ వాగ్వాదం పెట్టుకున్నాడు. ఇంతలో అభిషేక్ శర్మ జోక్యం చేసుకుని గిల్ను కూల్ చేసేందుకు ప్రయత్నించాడు.అయితే, అప్పటికి అభిషేక్ క్రీజులో ఉండి చాలా సేపు కావడంతో బహుశా కండరాలు పట్టేయడంతో.. ఫిజియోను పిలిపించుకుని ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో అభిషేక్ కింద కూర్చుని ఉండగా.. గిల్ వెనక్కి వచ్చి అతడి కాలిని తన్నాడు. సమయం వృథా చేస్తున్నాడన్న కారణంతో ఇలా చేసి ఉంటాడు.PC: BCCI/JioHotstarయాంగ్రీ యంగ్ మ్యాన్.. సరదాగా చేసినా..కాగా గిల్- అభిషేక్.. ఇద్దరూ దేశవాళీ క్రికెట్లో పంజాబ్ జట్టుకు ఆడతారన్న విషయం తెలిసిందే. ఈ ఓపెనింగ్ జోడీ మధ్య గాఢమైన స్నేహం ఉంది. అయితే, ఈ మ్యాచ్లో మాత్రం అభిషేక్ గిల్ను సముదాయించేందుకు ప్రయత్నిస్తే.. అతడు మాత్రం ఇలా కాలితో తన్నడం గమనార్హం.అభిషేక్తో తనకున్న చనువుతో సరదాగానే గిల్ ఈ పని చేసినా.. లైవ్లో ఇలాంటి చర్యలు ఎంతమాత్రం సరికాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా రైజర్స్పై గెలుపుతో ఈ సీజన్లో టైటాన్స్ ఏడో విజయం నమోదు చేయగా.. కమిన్స్ సేనకు ఇది ఏడో ఓటమి.చదవండి: IPL 2025: శుబ్మన్ గిల్ది ఔటా? నాటౌటా? Chaos at the centre! 😳#ShubmanGill and #AbhishekSharma in discussion with the umpires!A review going #SRH’s way has sparked some serious drama! 🧐Watch the LIVE action ➡ https://t.co/RucOdyBo4H#IPLonJioStar 👉 #GTvSRH | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, &… pic.twitter.com/KX68eec2ZB— Star Sports (@StarSportsIndia) May 2, 2025 -
IPL 2025: శుబ్మన్ గిల్ది ఔటా? నాటౌటా?
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్లో భాగంగా శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి ఓవర్ నుంచే ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఊతికారేశాడు.మహ్మద్ షమీ, కమ్మిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం గిల్ వదలేదు. ఈ క్రమంలో కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఆ తర్వాత కూడా గిల్ ఎక్కడ తగ్గలేదు. దీంతో అతడు దూకుడు చూసి మూడెంకల స్కోర్ను అందుకుంటాడని అంతా భావించారు. సరిగ్గా ఇదే సమయంలో గిల్ను దురదృష్టం వెంటాడింది. అనుహ్యంగా గిల్ రనౌట్ రూపంలో పెవిలియన్కు చేరాడు. దీంతో కేవలం 38 బంతుల్లోనే 10 ఫోర్లు, 2 సిక్స్లతో 76 పరుగులు చేసిన గిల్.. తీవ్ర నిరాశతో డగౌట్కు చేరాల్సి వచ్చింది. అయితే గిల్ ఔటైన తీరు వివాదస్పదమైంది.ఏమి జరిగిందంటే?గుజరాత్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన జీషన్ అన్సారీ బౌలింగ్లో ఆఖరి బంతికి జోష్ బట్లర్.. షార్ట్ ఫైన్ లెగ్ దిశగా ఆడాడు. ఆ బంతికి బట్లర్, గిల్ క్విక్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించారు. నాన్స్ట్రైక్ నుంచి గిల్ వికెట్ కీపర్ వైపు వచ్చేటప్పటికి బంతిని హర్షల్ పటేల్ త్రో చేశాడు. అయితే గిల్ క్రీజులోకి వచ్చేటప్పుడు వికెట్ కీపర్ క్లాసెన్ స్టంప్ట్స్ ను పడగొట్టాడు. అయితే క్లాసెన్ బంతితో కాకుండా తన గ్లౌవ్స్తో స్టంప్స్ను పడగొట్లు అన్పించింది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు అంత ఉత్సాహంగా అప్పీల్ చేయలేదు. ఏదేమైనప్పటికి ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు. రీప్లేలు గిల్ క్రీజుకు షార్ట్గా ఉన్నప్పటికీ, క్లాసెన్ తన గ్లోవ్స్తో బెయిల్స్ను పడగొట్టినట్లు కన్పించింది. కానీ పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఔట్గా ప్రకటించి అందరికి షాకిచ్చాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై గిల్ కూడా అసహనం వ్యక్తం చేస్తూ మైదానాన్ని వీడాడు. Shubman Gill robbed of a century here due to a terrible decision by the Umpire 💔The bails are clearly dislodged by the gloves !#ShubmanGill #IPL2025 #GTvSRH pic.twitter.com/aTXAA7Gr4Q— Prateek (@prateek_295) May 2, 2025 -
నేడు (మే 2) సన్రైజర్స్తో తలపడనున్న గుజరాత్.. గిల్ గాయంపై అప్డేట్
ఐపీఎల్ 2025లో ఇవాళ (మే 2) గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. గుజరాత్ హోం గ్రౌండ్ అహ్మదాబాద్లో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ సన్రైజర్స్కు అత్యంత కీలకంగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్లో ఓడితే ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతైరనట్లే. ఈ సీజన్లో ఇప్పటికే సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.సన్రైజర్స్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో మూడు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. గుజరాత్ విషయానికొస్తే.. 9 మ్యాచ్ల్లో ఆరు విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతూ, ప్లే ఆఫ్స్ బెర్త్కు ప్రధాన పోటీదారుగా ఉంది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో ముంబై, ఆర్సీబీ, పంజాబ్ టాప్-3లో ఉన్నాయి. ఢిల్లీ, లక్నో, కేకేఆర్ ఐదు నుంచి ఏడు స్థానాల్లో ఉన్నాయి.గిల్ గాయంపై అప్డేట్గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. గిల్ ఆ మ్యాచ్లో వెన్ను సమస్య కారణంగా ఫీల్డింగ్కు (బ్యాటింగ్ చేశాడు) దిగలేదు. అతడి గైర్హాజరీలో రషీద్ ఖాన్ గుజరాత్కు కెప్టెన్గా వ్యవహరించాడు. గిల్ గాయంపై గుజరాత్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి తాజాగా అప్డేట్ ఇచ్చాడు. గిల్ ఇవాళ సన్రైజర్స్తో జరుగబోయే మ్యాచ్లో బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు.గిల్ గాయంపై సానుకూల అప్డేట్ రావడంతో గుజరాత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. లీగ్ కీలక దశలో గిల్ అందుబాటులో ఉండకపోతే అది గుజరాత్ ప్లే ఆఫ్స్ అవకాశాలను భారీగా ప్రభావితం చేస్తుంది. ఈ సీజన్లో గిల్ వ్యక్తిగతంగా అద్భుతమై ఫామ్లో కొనసాగుతూ (9 మ్యాచ్ల్లో 4 హాఫ్ సెంచరీల సాయంతో 389 పరుగులు చేసి ఈ సీజన్ లీడింగ్ రన్ స్కోరర్ల జాబితలో ఏడో స్థానంలో ఉన్నాడు), తన జట్టును కూడా విజయవంతంగా నడిపిస్తున్నాడు. రాజస్థాన్ మ్యాచ్లో గిల్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఆ మ్యాచ్లో రషీద్ అనుభవారాహిత్యం కారణంగా గుజరాత్ ఓటమిపాలైంది. రషీద్ కీలక సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం కావడంతో పాటు బౌలర్లను సరిగ్గా మేనేజ్ చేయలేకపోయాడు.నేటి మ్యాచ్కు గిల్ అందుబాటులోకి రావడం గుజరాత్లో జోష్ నింపనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకడంతో పాటు ప్లే ఆఫ్స్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంటుంది. ఈ సీజన్లో గుజరాత్ నేటి మ్యాచ్తో కలుపుకుని మరో ఐదు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. మే 6న ముంబై ఇండియన్స్తో, మే 11న ఢిల్లీ క్యాపిటల్స్తో, మే 14న లక్నోతో, మే 18న సీఎస్కేతో తలపడనుంది.నేటి మ్యాచ్కు తుది జట్లు (అంచనా)గుజరాత్: శుభ్మన్ గిల్ (C), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (WK), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, షారుక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మసన్రైజర్స్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (WK), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్ (C), హర్షల్ పటేల్, సిమర్జీత్ సింగ్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ -
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
ఐపీఎల్లో రికార్డు సెంచరీతో చెలరేగిన 'సిక్సర పిడుగు' వైభవ్ సూర్యవంశీపై శుబ్మన్ గిల్ చేసిన వ్యాఖ్యల పట్ల మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతడు అలా మాట్లాడి ఉండాల్సి కాదని పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో సోమవారం రాత్రి గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో టీనేజీ సంచలనం సూర్యవంశీ (14) సూపర్ సెంచరీతో రాజస్తాన్ రాయల్స్కు ఘన విజయం అందించాడు. దీంతో క్రికెట్ ప్రపంచంలో అతడి పేరు మార్మోగిపోతోంది. ఈ రోజు ఆ 14 ఏళ్ల ఈ కుర్రాడి గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.మ్యాచ్ ముగిసిన తర్వాత శుబ్మన్ గిల్ (Shubman Gill) మాట్లాడుతూ.. సూర్యవంశీకి అదృష్టం కలిసి వచ్చిందన్నట్టుగా వ్యాఖ్యానించాడు. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడని కామెంట్ చేశాడు. "ఇది అతడి (అదృష్ట) రోజు. అద్భుతంగా హిట్టింగ్ చేశాడు. అతడు తన రోజును పూర్తిగా ఉపయోగించుకున్నాడ"ని గిల్ అన్నాడు. ఈ వ్యాఖ్యలపై అజయ్ జడేజా తనదైన శైలిలో స్పందించాడు. "14 ఏళ్ల పిల్లవాడు తనపై తాను పూర్తి విశ్వాసం ఉంచాడు. ఎంతగా అంటే తాను నమ్మినదాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలనుకున్నాడు. చేసి చూపించాడు. ఎవరో ఆటగాడు చెప్పినట్లుగా ఇది అతడి అదృష్ట దినం" అని కౌంటర్ ఇచ్చాడు.చిన్న వయసులోనే రికార్డు సెంచరీతో చెలరేగిన సూర్యవంశీపై అజయ్ జడేజా (Ajay Jadeja) ప్రశంసలు కురిపించాడు. "క్రికెట్ ఆడే మనమందరం.. డ్రాయింగ్ రూమ్లలో లేదా స్నేహితులతో ఆడుతున్నప్పుడో ఒక నిర్దిష్ట మార్గంలో మన ఆట గురించి కలలు కన్నాం. మనం ఇష్టపడేది సాధించాలని 14 మరియు 15 సంవత్సరాల వయస్సులో మనమంతా స్వప్నించాం. కానీ సూర్యవంశీ తన కలను నిజం చేసుకోవాలని జీవించాడు. అదే అతడి శక్తి. ఇక అతడి ఆటను వంద సార్లు విశ్లేషిస్తార"ని జడేజా పేర్కొన్నాడు.వైభవ్ సూర్యవంశీ సక్సెస్లో రాజస్తాన్ రాయల్స్ హెచ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ (Vikram Rathour) కీలంగా వ్యహరించారని జడేజా వెల్లడించాడు. సూర్యవంశీని స్వేచ్ఛగా ఆడేలా ప్రోత్సహించారని ప్రశంసించాడు. కాగా, రాజస్తాన్ తన తర్వాతి మ్యాచ్ మే 1న జైపూర్లో ముంబై ఇండియన్స్తో ఆడుతుంది. మే 12న చెన్నై సూపర్ కింగ్స్తో ఆర్ఆర్ తలపడనుంది. చదవండి: తండ్రి త్యాగం, పట్టుదలతో ఎదిగిన వైభవ్ సూర్యవంశీ -
మూడేళ్లుగా సింగిల్గానే..: రిలేషన్షిప్పై నోరు విప్పిన శుబ్మన్ గిల్
టీమిండియా స్టార్ ప్లేయర్ శుబ్మన్ గిల్ వ్యక్తిగత జీవితం గురుంచి గత కొంతకాలంగా పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్తో గిల్ ప్రేమాయణం సాగించినట్లు ప్రచారం జరిగింది. మళ్లీ కొంతకాలం తర్వాత వీళ్లిద్దరికి బ్రేకప్ అయిందని వార్తలు వినిపించాయి.అయితే ఈ వార్తలపై గిల్ కానీ సారా కానీ ఎప్పుడు స్పందించలేదు. ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్తో గిల్ డేటింగ్లో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. కానీ గిల్తో తాను డేటింగ్ చేయడం లేదని సారా అలీ ఖాన్ స్పష్టం చేసింది. వీరిద్దరి తర్వాత మరో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేతో గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను అనన్య మాత్రం ఖండించింది. అవన్నీ వట్టి రూమర్సే అని కొట్టిపారేసింది. తాజాగా తన రిలేషన్షిప్పై వస్తున్న వార్తలపై గిల్ స్పందించాడు. గత మూడేళ్ల నుంచి తాను ఒంటరిగా ఉన్నానని గిల్ చెప్పుకొచ్చాడు."నేను ప్రస్తుతం ఎవరితోనూ ప్రేమలో లేను. గత మూడేళ్ల నుంచి నేను ఒంటరిగా ఉన్నాను. ఇటీవల కాలంలో చాలా మందితో నన్ను ముడిపెట్టారు. నా వ్యక్తిగత జీవితంపై చాలా ఊహాగానాలు, పుకార్లు ప్రచారం చేశారు. నేను ఎప్పుడూ చూడని, కలవని వ్యక్తితో కూడా లింకులు పెడుతున్నారు. నిజంగా ఇది చాలా హాస్యాస్పదం. ప్రస్తుతం నేను నా ప్రొఫెషనల్ కెరీర్పై దృష్టి పెట్టాను. ప్రస్తుతం ఒకరితో ప్రేమాయణం నడిపే అంత సమయం నా దగ్గర లేదు. మేము ఎక్కడక్కడికో ప్రయాణిస్తుంటాము. ప్రొఫెషనల్ కెరీర్తో బీజీగా ఉన్నాను" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా శుబ్మన్ గిల్ వ్యవహరిస్తున్నాడు.చదవండి: బీసీసీఐ పొమ్మంది.. కట్ చేస్తే! అభిషేక్ నాయర్కు మరో ఆఫర్? -
KKR VS GT: చరిత్ర సృష్టించిన గిల్, సాయి సుదర్శన్ జోడీ
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనింగ్ జోడీ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ రికార్డు నెలకొల్పింది. నిన్న (ఏప్రిల్ 21) కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ భాగస్వామ్యం (114 పరుగులు) నమోదు చేసిన ఈ జోడీ.. క్యాష్ రిచ్ లీగ్లో అత్యధిక ఓపెనింగ్ శతక భాగస్వామ్యాలు (6) నెలకొల్పిన భారత జోడీగా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్కు ముందు ఈ రికార్డు గిల్-సాయి సుదర్శన్.. కేఎల్ రాహుల్-మయాంక్ అగర్వాల్.. గౌతమ్ గంభీర్-రాబిన్ ఉతప్ప జోడీల పేరిట సంయుక్తంగా ఉండేది. ఓవరాల్గా ఐపీఎల్లో అత్యధిక ఓపెనింగ్ శతక భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీగా విరాట్ కోహ్లి-ఏబీ డివిలియర్స్ ద్వయం ఉంది. ఈ జోడీ ఐపీఎల్లో 10 సెంచరీ పార్ట్నర్షిప్స్ నమోదు చేసింది. విరాట్-ఏబీడీ జోడీ తర్వాత అత్యధిక ఓపెనింగ్ శతక భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీగా క్రిస్ గేల్-విరాట్ ద్వయం ఉంది. ఈ జోడీ 9 సెంచరీ పార్ట్నర్షిప్స్ నమోదు చేసింది. వీరి తర్వాత గిల్-సాయి సుదర్శన్, శిఖర్ ధవన్-డేవిడ్ వార్నర్, డుప్లెసిస్-విరాట్ ద్వయాలు తలో 6 ఓపెనింగ్ శతక భాగస్వామ్యాలు నమోదు చేసి ఈ జాబితాలో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనే గిల్-సాయి సుదర్శన్ జోడీ రెండు శతక భాగస్వామ్యాలు నమోదు చేయడం విశేషం.ఐపీఎల్లో తొలి వికెట్కు అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన భారత జోడీలుసాయి సుదర్శన్-శుభ్మన్ గిల్ (గుజరాత్)- 6కేఎల్ రాహుల్-మయాంక్ అగర్వాల్ (పంజాబ్)-5గౌతమ్ గంభీర్-రాబిన్ ఉతప్ప (కేకేఆర్)-5ఓవరాల్గా ఐపీఎల్లో తొలి వికెట్కు అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీలువిరాట్ కోహ్లి-ఏబీ డివిలియర్స్ (ఆర్సీబీ)- 10విరాట్ కోహ్లి-క్రిస్ గేల్ (ఆర్సీబీ)- 9విరాట్ కోహ్లి- ఫాఫ్ డుప్లెసిస్ (ఆర్సీబీ)-6శుభ్మన్ గిల్- సాయి సుదర్శన్ (గుజరాత్)- 6శిఖర్ ధవన్- డేవిడ్ వార్నర్ (సన్రైజర్స్)- 6మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో గుజరాత్ కేకేఆర్ను 39 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. గిల్ (90), సాయి సుదర్శన్ (52), బట్లర్ (41 నాటౌట్) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో గుజరాత్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి కేకేఆర్ను 158 పరుగులకే పరిమితం చేశారు. ప్రసిద్ద్, రషీద్ ఖాన్ చెరో 2, సిరాజ్, ఇషాంత్, సుందర్, సాయికిషోర్ తలో వికెట్ తీశారు. కేకేఆర్ ఇన్నింగ్స్లో రహానే ఒక్కడే హాఫ్ సెంచరీతో (50) రాణించాడు. గుజరాత్ ఏప్రిల్ 28న జరిగే తమ తదుపరి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. -
IPL 2025: అంచనాలను తలకిందులు చేస్తూ టైటిల్ దిశగా దూసుకుపోతున్న గుజరాత్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ అంచనాలకు తలకిందులు చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 6 విజయాలతో టేబుల్ టాపర్గా కొనసాగుతుంది. మరో ఆరు మ్యాచ్లు ఆడాల్సి ఉన్నా ప్లే ఆఫ్స్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది.ప్రస్తుతం ఆరెంజ్, పర్పుల్ క్యాప్లు కూడా గుజరాత్ ఆటగాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. సాయి సుదర్శన్ 8 మ్యాచ్ల్లో 417 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 8 మ్యాచ్ల్లో 16 వికెట్లు తీసిన ప్రసిద్ద్ కృష్ణ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చలామణి అవుతున్నాడు. బ్యాటింగ్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల టాప్-10 జాబితాలో సాయి సుదర్శన్తో పాటు జోస్ బట్లర్, కెప్టెన్ శుభ్మన్ గిల్ ఉన్నారు. ఈ ముగ్గురు గుజరాత్ టాపార్డర్లో అంచనాలకు మించి రాణిస్తున్నారు. ప్రతి మ్యాచ్లో ఈ ముగ్గురిలో ఒకరిద్దరు సత్తా చాటుతున్నారు. బౌలింగ్లోనూ అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్ల జాబితాలో ప్రసిద్ద్ సహా ముగ్గురు గుజరాత్ బౌలర్లు ఉన్నారు. ఈ సీజన్లో రవిశ్రీనివాస్ సాయికిషోర్ ఊహలకందని విధంగా సత్తా చాటుతూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాదే కొత్తగా గుజరాత్లో చేరిన సిరాజ్ సైతం ఈ సీజన్లో అదరగొడుతున్నాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. గుజరాత్ విజయాల్లో మిడిలార్డర్ బ్యాటర్లు షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, రాహుల్ తెవాతియా, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వెటరన్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా ఈ సీజన్లో అదరగొడుతున్నాడు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఫామ్ ఒక్కటే ఈ సీజన్లో గుజరాత్ను కలవరపెడుతుంది. అతను కూడా నిన్న (ఏప్రిల్ 21) కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు. నిన్నటి మ్యాచ్లో రషీద్ 4 ఓవర్లలో కేవలం 25 పరుగులకే ఇచ్చి 2 కీలక వికెట్లు (నరైన్, రసెల్) తీశాడు. ఈ సీజన్లో గుజరాత్కు ప్రతి ఒక్కరు మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు. ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకరు సత్తా చాటుతూ విజయాన్నందిస్తున్నారు. బ్యాటింగ్లో సాయి సుదర్శన్ నిలకడకు మారు పేరు అన్నట్లుగా మారిపోయాడు. గిల్ సామర్థ్యం మేరకు రాణిస్తుండగా.. బట్లర్ అంచనాలకు మించి సత్తా చాటుతున్నాడు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు పేస్ త్రయం ప్రసిద్ద్, సిరాజ్, ఇషాంత్పై ఎవరికీ అంచనాలు లేవు. సాయికిషోర్ నుంచి అయితే ఈ స్థాయి అత్యుత్తమ ప్రదర్శన అస్సలు ఊహించలేదు. సాయికిషోర్ ఎప్పుడు బంతిని పట్టుకున్నా వికెట్లు తీయడమే కాకుండా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇతను ప్రత్యర్థి బ్యాటర్ల పాలిట కొరకరాని కొయ్యగా మారాడు. ఈ సీజన్లో గుజరాత్ ఇదే జోరును కొనసాగిస్తే రెండో టైటిల్ ఖాతాలో వేసుకోవడం గ్యారెంటీ. అందరూ ఈ సీజన్లో ఆర్సీబీ, ఢిల్లీ, పంజాబ్, లక్నో జట్లలో ఏదో ఒకటి టైటిల్ గెలుస్తుందని అనుకుంటున్నారు. అయితే గుజరాత్ అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ టైటిల్ దిశగా దూసుకుపోతుంది.కాగా, కేకేఆర్తో నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో గుజరాత్ ఎప్పటిలాగే టీమ్ ఎఫర్ట్ను చూపించి మరో విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. గిల్ (90), సాయి సుదర్శన్ (52), బట్లర్ (41 నాటౌట్) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో గుజరాత్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి కేకేఆర్ను 158 పరుగులకే పరిమితం చేశారు. ప్రసిద్ద్, రషీద్ ఖాన్ చెరో 2, సిరాజ్, ఇషాంత్, సుందర్, సాయికిషోర్ తలో వికెట్ తీశారు. కేకేఆర్ ఇన్నింగ్స్లో రహానే ఒక్కడే హాఫ్ సెంచరీతో (50) రాణించాడు. గుజరాత్ ఏప్రిల్ 28న జరిగే తమ తదుపరి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. -
GT Vs KKR: గుజరాత్ గర్జన
కోల్కతా: గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండ్ ప్రదర్శనకు డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ చేతులెత్తేసింది. దీంతో సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో టైటాన్స్ 39 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్కు దిగిన గుజరాత్ నిరీ్ణత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (55 బంతుల్లో 90; 10 ఫోర్లు, 3 సిక్స్లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించారు. బట్లర్ (23 బంతుల్లో 41 నాటౌట్; 8 ఫోర్లు) ధాటిగా ఆడాడు. కోల్కతా బౌలర్లలో రసెల్, వైభవ్, హర్షిత్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్ అజింక్య రహానే (36 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే రాణించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్ చెరో 2 వికెట్లు తీశారు. ఆ ఇద్దరు బాదేశారిలా... గుజరాత్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ముందుగా సాయి సుదర్శన్ బౌండరీతో బాదుడు మొదలు పెట్టాడు. మూడో ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టాడు. కాస్త ఆలస్యమైనా... గిల్ ఐదో ఓవర్లో రెండు వరుస బౌండరీలతో దూకుడు షురూ చేశాడు. టైటాన్స్ పవర్ప్లే స్కోరు 45/0. అలీ వేసిన ఏడో ఓవర్లో గిల్ 6, 4, 4లతో ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. క్రమం తప్పకుండా ఫోర్లు బాదేయడంతో సగం ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 89/0 స్కోరు చేసింది. తర్వాతి ఓవర్లోనే గిల్ 34 బంతుల్లో, సుదర్శన్ 33 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు 100 దాటింది. ఎట్టకేలకు సుదర్శన్ను అవుట్ చేసిన రసెల్ కోల్కతాకు ఊరటనిచ్చాడు. అయితే బట్లర్ రాకతో దంచుడులో ఏ మార్పులేకపోయింది. ఆఖర్లో గిల్, రాహుల్ తెవాటియా (0) వికెట్లు పడినా కూడా భారీస్కోరు సాధ్యమైంది. కెప్టెన్ ఒంటరి పోరాటం పెద్ద లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన నైట్రైడర్స్ పవర్ప్లేలోనే ఓపెనర్లను కోల్పోయింది. సిరాజ్ తొలి ఓవర్లోనే రహా్మనుల్లా గుర్బాజ్ (1) పెవిలియన్ చేరగా, కెప్టెన్ రహానేతో అడపాదడపా షాట్లతో స్కోరును నడిపిస్తున్న సునీల్ నరైన్ (17)ను రషీద్ ఖాన్ బోల్తా కొట్టించాడు. వెంకటేశ్ అయ్యర్ (14) మెప్పించలేకపోయాడు. బాధ్యతగా ఆడిన రహానే 36 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా, అదేస్కోరు వద్ద వాషింగ్టన్ సుందర్ అతన్ని అవుట్ చేశాడు. ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన రసెల్ (15 బంతుత్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్) స్టంపౌట్ కావడంతో కోల్కతా లక్ష్యానికి దూరమైంది. రఘువంశీ (13 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు అలరించాడు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) గుర్బాజ్ (బి) రసెల్ 52; శుబ్మన్ గిల్ (సి) రింకూ సింగ్ (బి) వైభవ్ 90; బట్లర్ (నాటౌట్) 41; తెవాటియా (సి) రమణ్దీప్ (బి) హర్షిత్ రాణా 0; షారుఖ్ ఖాన్ (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–114, 2–172, 3–177. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–44–1, మొయిన్ అలీ 3–0–27–0, హర్షిత్ రాణా 4–0–45–1, వరుణ్ చక్రవర్తి 4–0–33–0, నరైన్ 4–0–36–0, రసెల్ 1–0–13–1. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 1; నరైన్ (సి) తెవాటియా (బి) రషీద్ 17; రహానే (స్టంప్డ్) బట్లర్ (బి) సుందర్ 50; వెంకటేశ్ (సి) సుందర్ (బి) సాయి కిషోర్ 14; రింకూ సింగ్ (సి) గిల్ (బి) ఇషాంత్ 17; రసెల్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 21; రమణ్దీప్ (సి అండ్ బి) ప్రసిధ్ కృష్ణ 1; మొయిన్ అలీ (సి) షారుఖ్ (బి) ప్రసిధ్ కృష్ణ 0; రఘువంశీ (నాటౌట్) 27; హర్షిత్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–2, 2–43, 3–84, 4–91, 5–118, 6–119, 7–119, 8–151. బౌలింగ్: సిరాజ్ 4–0–32–1, ఇషాంత్ 2–0–18–1, ప్రసిధ్ కృష్ణ 4–0–25–2, రషీద్ ఖాన్ 4–0–25–2, సుందర్ 3–0–36–1, సాయి కిషోర్ 3–0–19–1. -
చితక్కొట్టిన శుబ్మన్.. కేకేఆర్పై గుజరాత్ గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 39 పరుగుల తేడాతో ఘన విజయాన్ని గుజరాత్ అందుకుంది. 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగల్గింది.కేకేఆర్ బ్యాటర్లలో కెప్టెన్ అజింక్య రహానే(50)టాప్ స్కోరర్గా నిలవగా.. ఆఖరిలో రఘువన్షి(27) పర్వాలేదన్పించాడు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ట తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, సుందర్, ఇషాంత్ శర్మ సాయికిషోర్ చెరో వికెట్ పడగొట్టారు.చితక్కొట్టిన శుబ్మన్..ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ విధ్వంసం సృష్టించాడు. తన సూపర్ బ్యాటింగ్తో ఈడెన్లో బౌండరీలు వర్షం కురిపించాడు. 55 బంతులు ఎదుర్కొన్న గిల్.. 10 ఫోర్లు, మూడు సిక్స్లతో 90 పరుగులు చేశాడు. గిల్తో పాటు సాయిసుదర్శన్(52), బట్లర్(41) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, హర్షిత్ రాణా, రస్సెల్ తలా వికెట్ సాధించారు. ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన గుజరాత్ 6 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. -
ఏంటి గిల్.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు?
ఐపీఎల్-2025లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతున్నాయి. అయితే ఈ మ్యాచ్ టాస్ సందర్బంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టాస్ సమయంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత డానీ మోరిసన్ నవ్వులు పూయించాడు.ఏ సాధారణంగా వ్యాఖ్యాత అయినా టాస్ సందర్భంగా కెప్టెన్లను జట్టు మార్పులు, మ్యాచ్ ప్లాన్స్ గురుంచి అడుగుతారు. కానీ మోరిసన్ మాత్రం గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్ను తన వివాహ ప్రణాళికల గురించి అడిగాడు. ఈ కివీస్ మాజీ క్రికెటర్ గిల్ను త్వరలో పెళ్లి చేసుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నతో ఆశ్చర్యపోయిన గిల్.. అటువంటి ప్లాన్స్ ఏమీ లేవంటూ నవ్వుతూ సమధానమిచ్చాడు. వీరిద్దరి సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.కోల్కతా రెండు మార్పులతో బరిలోకి దిగింది. వరుస మ్యాచ్ల్లో విఫలమవతున్న స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ను కేకేఆర్ మెనెజ్మెంట్ పక్కన పెట్టింది. అతడి స్ధానంలో అఫ్గాన్ స్టార్ ప్లేయర్ గుర్బాజ్ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లుగుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్కోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి -
అశుతోష్పై మండిపడ్డ ఇషాంత్ శర్మ.. వేలు చూపిస్తూ వార్నింగ్
గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఇషాంత్ శర్మ (Ishant Sharma) సహనం కోల్పోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ అశుతోష్ శర్మ (Ashuthosh Sharma)కు వేలు చూపిస్తూ మైదానంలోనే వార్నింగ్ ఇచ్చాడు. ఫీల్డ్ అంపైర్తో పాటు.. టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అసలేం జరిగిందంటే..ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా గుజరాత్ టైటాన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ (GT vs DC) మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన టైటాన్స్.. ఢిల్లీని తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.అశుతోష్ శర్మ ధనాధన్ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ ఎనిమిది వికెట్ల నష్టానికి 203 పరుగులు సాధించింది. ఓపెనర్లు అభిషేక్ పోరెల్ (9 బంతుల్లో 18), కరుణ్ నాయర్ (18 బంతుల్లో 31) వేగంగా ఆడగా.. కేఎల్ రాహుల్ (14 బంతుల్లో 28) కాసేపు మెరుపులు మెరిపించాడు.ఇక అక్షర్ పటేల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (21 బంతుల్లో 31)తో మెరవగా.. ఢిల్లీ నయా ఫినిషర్ అశుతోష్ శర్మ (19 బంతుల్లో 37) ధనాధన్ బ్యాటింగ్తో దంచికొట్టాడు. అయితే, ఢిల్లీ ఇన్నింగ్స్లో పందొమ్మిదో ఓవర్లో గుజరాత్ పేసర్ ఇషాంత్ శర్మ బంతితో బరిలోకి దిగాడు.అప్పటికి డొనొవన్ ఫెరీరా, అశుతోష్ క్రీజులో ఉన్నారు. ఇషాంత్ బౌలింగ్లో తొలి బంతిని ఎదుర్కొన్న అశుతోష్ సింగిల్ తీయగా.. మరుసటి బంతికి ఫెరీరా రన్ పూర్తి చేశాడు. మూడో బంతికి మళ్లీ అశుతోష్ సింగిల్ తీయగా.. నాలుగో బంతికి ఫెరీరా సాయి కిషోర్కు క్యాచ్ ఇచ్చి ఏడో వికెట్గా పెవిలియన్కు చేరాడు.వేలు చూపిస్తూ వార్నింగ్ఫెరీరా స్థానంలో వచ్చిన మిచెల్ స్టార్క్ సింగిల్ తీయగా.. అశుతోష్ మళ్లీ స్ట్రైక్లోకి వచ్చాడు. అయితే, ఆఖరి బంతిని ఇషాంత్ వైడ్గా వేయగా.. అశుతోష్కు మరో బంతి ఆడే అవకాశం వచ్చింది. ఈ క్రమంలో ఇషాంత్ సంధించిన బౌన్సర్ను అశుతోష్ ఎదుర్కోలేకపోయాడు.ఇక బంతి వెళ్లి వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతుల్లో పడింది. ఈ క్రమంలో బంతి అశుతోష్ గ్లోవ్స్ను తాకిందని భావించిన గుజరాత్ ఆటగాళ్లు బిగ్గరగా అవుట్కి అప్పీలు చేశారు. అయితే, అంపైర్ నుంచి మాత్రం ఎటువంటి స్పందనా రాలేదు. ఇంతలో అశుతోష్ బంతి భుజాన్ని రాసుకుని వెళ్లిందన్నట్లుగా సైగ చేశాడు. అశుతోష్ శర్మ చర్యను సహించలేకపోయిన ఇషాంత్ శర్మ అతడి దగ్గరికి వెళ్లి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చినట్లు కనిపించింది. తర్వాత అశుతోష్ తన షర్టును పైకెత్తి బంతి భుజానికి తాకిందని అంపైర్కు చెప్పే ప్రయత్నం చేశాడు.Battle b/w ishant sharma vs ashutosh Sharma 🤣 pic.twitter.com/EMd12Z2o7V— Daigo18 (@daigo2637391027) April 19, 2025ఇరగదీసిన బట్లర్ఇంతలో అంపైర్తో పాటు గిల్ జోక్యం చేసుకుని ఇషాంత్ను పక్కకు తీసుకువెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఢిల్లీ విధించిన 204 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 19.2 ఓవర్లలో ఛేదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జోస్ బట్లర్ (54 బంతుల్లో 97 నాటౌట్), షెర్ఫానే రూథర్ఫర్డ్ (34 బంతుల్లో 43), రాహుల్ తెవాటియా (3 బంతుల్లో 11 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్తో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.చదవండి: IPL 2025: శుబ్మన్ గిల్కు భారీ షాక్! Right off the middle! 💥#AshutoshSharma hits the accelerator and launches a stunning SIX over the square boundary!Watch the LIVE action ➡ https://t.co/6YcPaJPTHV#IPLonJioStar 👉 #GTvDC | LIVE NOW on Star Sports 2, Star Sports 2 Hindi & JioHotstar! pic.twitter.com/TpSfdehCwX— Star Sports (@StarSportsIndia) April 19, 2025 -
శుబ్మన్ గిల్కు భారీ షాక్!
గెలుపు సంబరంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill)కు ఎదురుదెబ్బ తగిలింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతడికి రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా.. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున ఈ మేరకు శిక్ష విధించింది.ఇందుకు సంబంధించి ఐపీఎల్ పాలక మండలి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ నిబంధనల్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకు గానూ గిల్కు జరిమానా విధించినట్లు తెలిపింది. ఐపీఎల్-2025 (IPL 2025) సీజన్లో అతడు మొదటిసారి ఈ తప్పిదానికి పాల్పడినందుకు రూ. 12 లక్షలతో సరిపెట్టినట్లు పేర్కొంది.ఢిల్లీ భారీ స్కోరుకాగా ఐపీఎల్-2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్ అహ్మదాబాద్ వేదికగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్ అక్షర్ పటేల్ (32 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్స్లు), అశుతోష్ శర్మ (19 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్లు), కరుణ్ నాయర్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. జోస్ ది బాస్.. దంచేశాడులక్ష్య ఛేదనలో జోస్ బట్లర్ దంచికొట్టాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. కేవలం 54 బంతుల్లోనే 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో ఏకంగా 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం. అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.మరోవైపు.. బట్లర్కు తోడుగా షెర్ఫానే రూథర్ఫర్డ్ (34 బంతుల్లో 43; 1 ఫోర్, 3 సిక్స్లు) కూడా రాణించాడు. ఆఖర్లో తెవాటియా మూడు బంతుల్లో 11 పరుగులతో అజేయంగా నిలిచి బట్లర్తో కలిసి గుజరాత్ను గెలుపుతీరాలకు చేర్చాడు. THE CELEBRATION FROM JOS BUTTLER. - Buttler was on 97*, but the happiness after Tewatia finished the match. 👏❤️ pic.twitter.com/31z4tWPJmL— Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2025 ఢిల్లీ విధించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా ఈ సీజన్లో ఐదో గెలుపు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకువచ్చింది.ఐపీఎల్-2025: గుజరాత్ వర్సెస్ ఢిల్లీ👉వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్👉టాస్: గుజరాత్.. మొదట బౌలింగ్👉ఢిల్లీ స్కోరు: 203/8 (20)👉గుజరాత్ స్కోరు: 204/3 (19.2)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీపై గుజరాత్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జోస్ బట్లర్ (గుజరాత్- 54 బంతుల్లో 97 నాటౌట్).చదవండి: IPL 2025: గెలుపు వాకిట బోర్లా పడిన రాయల్స్.. ఉత్కంఠ పోరులో లక్నోను గెలిపించిన ఆవేశ్ ఖాన్ -
IPL 2025: ఢిల్లీపై గుజరాత్ విజయం
ఢిల్లీపై గుజరాత్ విజయంఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 19) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో అక్షర్ 39, అశుతోష్ శర్మ 37, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్ తలో 31, కేఎల్ రాహుల్ 28, అభిషేక్ పోరెల్ 18, విప్రాజ్ నిగమ్ 0, డొనోవన్ ఫెరియెరా 1, స్టార్క్ 2 (నాటౌట్), కుల్దీప్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 4 వికెట్లు తీయగా.. సిరాజ్, అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ, సాయికిషోర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ ఆదిలోనే శుభ్మన్ గిల్ (7) వికెట్ కోల్పోయినప్పటికీ.. జోస్ బట్లర్ వీరోచిత ఇన్నింగ్స్ (97 నాటౌట్) కారణంగా 19.2 ఓవర్లలో (3 వికెట్ల నష్టానికి) లక్ష్యాన్ని చేరుకుంది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ 36, రూథర్ఫోర్డ్ 43, తెవాతియా 11 పరుగులు (నాటౌట్) చేశారు. ఆఖర్లో బట్లర్కు సెంచరీ చేసే అవకాశం ఉన్నా తెవాతియా చివరి ఓవర్లో వరుసగా సిక్సర్, బౌండరీ కొట్టి గుజరాత్ను విజయతీరాలకు చేర్చాడు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్ ఢిల్లీని వెనక్కు నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ, పంజాబ్ తలో 10 పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.హాఫ్ సెంచరీ పూర్తి చేసిన బట్లర్12.5వ ఓవర్- మోహిత్ శర్మ బౌలింగ్లో బౌండరీ బాది బట్లర్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. బట్లర్ ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. బట్లర్కు జతగా రూథర్ఫోర్డ్ క్రీజ్లో ఉన్నాడు. ఇదే ఓవర్లో రూథర్ఫోర్డ్ తొలి రెండు బంతులకు రెండు సిక్సర్లు బాదాడు. 13 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 129/2గా ఉంది. బట్లర్ 52, రూథర్ఫోర్డ్ 31 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్7.3వ ఓవర్- 74 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో స్టబ్స్కు క్యాచ్ ఇచ్చి సాయి సుదర్శన్ (36) ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 85/2గా ఉంది. బట్లర్ (38), రూథర్ఫోర్డ్ (3) క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్1.4వ ఓవర్- 204 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ 14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కరుణ్ నాయర్ అద్బుతమైన త్రోతో శుభ్మన్ గిల్ను (7) రనౌట్ చేశాడు. 3 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 29/1గా ఉంది. సాయి సుదర్శన్ (16), బట్లర్ (6) క్రీజ్లో ఉన్నారు. భారీ స్కోర్ చేసిన ఢిల్లీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో అక్షర్ 39, అశుతోష్ శర్మ 37, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్ తలో 31, కేఎల్ రాహుల్ 28, అభిషేక్ పోరెల్ 18, విప్రాజ్ నిగమ్ 0, డొనోవన్ ఫెరియెరా 1, స్టార్క్ 2 (నాటౌట్), కుల్దీప్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 4 వికెట్లు తీయగా.. సిరాజ్, అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ, సాయికిషోర్ తలో వికెట్ పడగొట్టారు. 18 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 188/6 (18) అశుతోష్ 12 బంతుల్లో 32 పరుగులతో క్రీజులో ఉండగా.. ఫెరీరా ఇంకా ఖాతా తెరవలేదు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు17.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన అక్షఱ్ పటేల్ (38). ఆ వెంటనే విప్రాజ్ నిగమ్ను అవుట్ చేసిన ప్రసిద్. 18వ ఓవర్లో వరుస బంతుల్లో గుజరాత్కు రెండు వికెట్లు. ఢిల్లీ స్కోరు: 173/6 (17.2)అక్షర్ పటేల్కు గాయం?15.3: అర్షద్ ఖాన్ బౌలింగ్లో డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా బంతిని తరలించిన అక్షర్.. సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడు చీలమండ నొప్పితో విలవిల్లాడగా.. ఫిజియో వచ్చి పరీక్షించాడు.15 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 150/4అక్షర్ 33, అశుతోష్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ14.2: సిరాజ్ బౌలింగ్లో స్టబ్స్ (31) అవుట్. అక్షర్ 32 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 146/4 (14.2). అశుతోష్ శర్మ క్రీజులోకి వచ్చాడు.ఢిల్లీ ధనాధన్14 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ స్కోరు: 146/3స్టబ్స్ 19 బంతుల్లో 31, అక్షర్ పటేల్ 24 బంతుల్లో 32 పరుగులతో జోరుమీదున్నారు.పది ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 105-3స్టబ్స్ 8, అక్షర్ పటేల్ 15 పరుగులతో ఉన్నారు.మూడో వికెట్ డౌన్8.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్ మూడో వికెట్గా వెనుదిరిగిన కరుణ్ నాయర్ (31). స్కోరు: 93/3 (8.2). అక్షర్ పటేల్ 12 పరుగులతో ఆడుతుండగా.. ట్రిస్టన్ స్టబ్స్క్రీజులోకి వచ్చాడు. పవర్ ప్లేలో ఢిల్లీ స్కోరు: 73/2 (6)కరుణ్ నాయర్ 19, అక్షర్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. కేఎల్ రాహుల్ అవుట్4.4: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగిన కేఎల్ రాహుల్ (28). దీంతో ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 58/2 (4.4)నాలుగు ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 52/1రాహుల్ 22, కరుణ్ నాయర్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ1.4: అర్షద్ ఖాన్ బౌలింగ్లో అభిషేక్ పోరెల్ సిరాజ్కు క్యాచ్ ఇచ్చి 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 23/1 (1.4)తొలి ఓవర్లోనే 16 పరుగులుగుజరాత్ బౌలింగ్ ఎటాక్ను సిరాజ్ పేలవంగా ఆరంభించాడు. తొలి రెండు బంతులను వైడ్గా వేసిన ఈ రైటార్మ్ పేసర్ బౌలింగ్లో.. తర్వాతి రెండు బంతుల్లో అభిషేక్ పోరెల్ వరుసగా 4, 6 బాదాడు. ఐదో బంతిని కూడా బౌండరీకి తరలించాడు. అభిషేక్ పోరెల్ 14, కరుణ్ నాయర్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు.ఐపీఎల్-2025లో మరో ఆసక్తికర పోరు... వరుస విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ శనివారం మధ్యాహ్నం నాటి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతోంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఢిల్లీ బ్యాటింగ్ చేస్తోంది.తుదిజట్లుగుజరాత్ టైటాన్స్సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ.ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: షెర్ఫానే రూథర్ఫర్డ్, మహిపాల్ లామ్రోర్, అనూజ్ రావత్, వాషింగ్టన్ సుందర్, కరీం జనత్.ఢిల్లీ క్యాపిటల్స్అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముకేష్ కుమార్.ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: జేక్ ఫ్రేజర్-మెగర్క్, దర్శన్ నల్కాండే, సమీర్ రిజ్వీ, డొనొవన్ ఫెరీరా, దుష్మంత చమీర.కాగా ఢిల్లీ ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. గుజరాత్ ఆరింట నాలుగు గెలిచి మూడో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్ ద్రవిడ్ -
బంగ్లాతో వన్డే సిరీస్.. భారత కెప్టెన్గా గిల్! యువ సంచలనం రీ ఎంట్రీ?
భారత పురుషుల క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటన ఖారరైంది. ఈ ఏడాది ఆగస్టులో మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్లలో తలపడేందుకు బంగ్లాదేశ్కు టీమిండియా వెళ్లనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) మంగళవారం విడుదల చేసింది.ఆగస్టు 17న మిర్పూర్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో టీమిండియా పర్యటన ప్రారంభం కానుంది. ఇంగ్లండ్తో సుదీర్ఘ టెస్ట్ సిరీస్ ముగిసిన రెండు వారాలకే భారత జట్టు బంగ్లాకు పయనం కానుంది. ఈ క్రమంలో బంగ్లాతో వన్డే సిరీస్కు కెప్టెన్ రోహిత్ శర్మతో సహా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలు గైర్హాజరు అయ్యే అవకాశం ఉంది.ఒకవేళ రోహిత్ శర్మ దూరమైతే బంగ్లాతో వన్డే సిరీస్కు భారత జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్లో గిల్తో పాటు జైశ్వాల్, కేఎల్ రాహుల్ వంటి స్టార్ ప్లేయర్ ఆడే ఛాన్స్ ఉంది. కాగా వీరు ముగ్గురు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో ఆడనునున్నారు.కానీ సెలక్టర్లు మాత్రం బంగ్లా సిరీస్కు ఈ త్రయానికి విశ్రాంతి ఇవ్వకపోవచ్చు. అదేవిధంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను బంగ్లాతో టీ20 సిరీస్లో మాత్రం ఆడేంచే అవకాశమున్నట్లు క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో టీ20 ఆసియా కప్-2025 జరగనుండడంతో బంగ్లా సిరీస్లో బుమ్రా ఆడడం దాదాపుగా ఖాయం. బుమ్రా ఇటీవలే గాయం నుంచి కోలుకుని ఐపీఎల్లో ఆడుతున్నాడు.మరోవైపు ఐపీఎల్లో దుమ్ములేపుతున్న గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయిసుదర్శన్ తిరిగి వన్డే, టీ20 జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. -
LSG VS GT: రికార్డులు సృష్టించిన గిల్-సాయి సుదర్శన్ జోడీ
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకుపోతూ పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. ఆ జట్టు విజయాల్లో ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ పాత్ర చాలా కీలకం. ఈ ఇద్దరు దాదాపుగా ప్రతి మ్యాచ్లో నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తూ జట్టు విజయానికి పటిష్టమైన పునాది వేస్తున్నారు.ఈ సీజన్లో సాయి ఆడిన ఆరు మ్యాచ్ల్లో నాలుగు హాఫ్ సెంచరీలు చేసి లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతుండగా.. గిల్ చివరి మూడు మ్యాచ్ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.ఈ సీజన్లో అత్యుత్తమ ఓపెనింగ్ జోడీగా పేరు తెచ్చుకున్న సాయి-గిల్ ద్వయం.. ఇవాళ (ఏప్రిల్ 12) లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో రెండు రికార్డులు నెలకొల్పింది. ఈ మ్యాచ్లో 120 పరుగులు జోడించిన సాయి-గిల్ జోడీ.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో తొలి వికెట్కు 100కు పైగా పరుగులు జోడించిన తొలి జోడీగా రికార్డు నెలకొల్పింది. అలాగే ఈ సీజన్లో ఏ వికెట్కైనా అత్యధిక పరుగులు జోడించిన జోడీగానూ రికార్డుల్లోకెక్కింది.ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యధిక భాగస్వామ్యాలుగిల్-సాయి సుదర్శన్- 120 (తొలి వికెట్కు)పూరన్-మార్ష్- 116 (రెండో వికెట్కు)స్టబ్స్-కేఎల్ రాహుల్- 111* (ఐదో వికెట్కు)శాంసన్-జురెల్- 111 (నాలుగో వికెట్కు)రహానే-నరైన్- 103 (రెండో వికెట్కు)ఈ మ్యాచ్లో గిల్ 60, సాయి సుదర్శన్ 56 పరుగులు చేసి ఔటయ్యారు. వీరిద్దరు క్రీజ్లో ఉన్నంతవరకు గుజరాత్ జట్టు భారీ స్కోర్ దిశగా సాగింది. అయితే 2 పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరు ఔట్ కావడంతో గుజరాత్ స్కోర్ ఒక్కసారిగా నెమ్మదించింది.13వ ఓవర్ తొలి బంతికి సాయి ఔటయ్యే సమయానికి గుజరాత్ స్కోర్ 120 పరుగులుగా ఉండగా.. 17వ ఓవర్ ముగిసే సమయానికి ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. రూథర్ఫోర్డ్ (6), షారుక్ ఖాన్ (1) గుజరాత్కు గౌరవప్రదమైన స్కోర్ అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. గుజరాత్ ఇన్నింగ్స్లో బట్లర్ 16, సుందర్ 2 పరుగులకు ఔటయ్యారు. లక్నో బౌలర్లలో బిష్ణోయ్ 2, దిగ్వేశ్ రాఠీ, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో గుజరాత్ టాస్ ఓడి లక్నో ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తుంది.తుది జట్లు..లక్నో: ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్/వికెట్కీపర్), హిమ్మత్ సింగ్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్కీపర్), వాషింగ్టన్ సుందర్, షెర్ఫానే రూథర్ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్ -
LSG Vs GT: చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. తొలి బ్యాటర్గా రికార్డు
ఐపీఎల్-2025లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ అద్బుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. తొలుత కాస్త ఆచితూచి ఆడిన గిల్.. క్రీజులో కుదురుకున్నాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మరో ఓపెనర్ సాయిసుదర్శన్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. తనదైన శైలిలో బౌండరీలు బాదుతూ అభిమానులను ప్రిన్స్ అలరించాడు. ఈ క్రమంలో గిల్ కేవలం 31 బంతుల్లోనే ఆర్ధ శతకాన్ని అందుకున్నాడు. ఓవరాల్గా 38 బంతులు ఎదుర్కొన్న గిల్.. 6 ఫోర్లు, ఒక సిక్సర్తో 60 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో చెలరేగిన గిల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో గుజరాత్ తరపున 2000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్గా గిల్ రికార్డులకెక్కాడు. శుబ్మన్ 53 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్ను అందుకున్నాడు. ఓవరాల్గా ఐపీఎల్లో ఇప్పటివరకు 109 మ్యాచ్లు ఆడిన గిల్ 3424 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 22 హాఫ్ సెంచరీలు, నాలుగు శతకాలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో గిల్తో పాటు సాయిసుదర్శన్(56), షర్ఫెన్ రూథర్ ఫర్డ్(22) పరుగులతో రాణించారు. లక్నో బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్, బిష్ణోయ్ తలా రెండు వికెట్లు సాధించగా.. దిగ్వేష్ సింగ్, అవేష్ ఖాన్ చెరో వికెట్ సాధించారు.చదవండి: LSG VS GT: మిచెల్ మార్ష్ ఎందుకు ఆడటం లేదు.. ఈ హిమ్మత్ సింగ్ ఎవరు..? -
IPL 2025: గుజరాత్పై లక్నో విజయం
గుజరాత్పై లక్నో విజయంఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గిల్ (38 బంతుల్లో 60; 6 ఫోర్లు, సిక్స్), సాయి సుదర్శన్ (37 బంతుల్లో 56; 7 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీతో రాణించారు.అనంతరం ఛేదనకు దిగిన లక్నో..మార్క్రమ్ (31 బంతుల్లో 58; 9 ఫోర్లు, సిక్స్), పూరన్ (34 బంతుల్లో 61; ఫోర్, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్లతో రెచ్చిపోవడంతో 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. బదోని సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 2, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సందర్ తలో వికెట్ తీశారు.పూరన్ ఔట్15.2వ ఓవర్- 155 పరుగుల వద్ద లక్నో మూడో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్లో షారుక్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి పూరన్ (61) ఔటయ్యాడు.23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన పూరన్23 బంతుల్లో 6 సిక్సర్లు, బౌండరీ సాయంతో పూరన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్లో లక్నో గెలవాలంటే 42 బంతుల్లో మరో 41 పరుగులు మాత్రమే చేయాలి. పూరన్ 51, బదోని 4 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన లక్నో11.1వ ఓవర్- 123 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్దిద్ కృష్ణ బౌలింగ్లో శుభ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ (58) ఔటయ్యాడు. 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన మార్క్రమ్181 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో ఓపెనర్ మార్క్రమ్ ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. మార్క్రమ్ కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (8 ఫోర్లు, సిక్స్) పూర్తి చేశాడు. పంత్ ఔటయ్యాక క్రీజ్లోకి వచ్చిన పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. పూరన్ కేవలం 16 బంతుల్లో 5 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. 10 ఓవర్లలో లక్నో స్కోర్ 114/1గా ఉంది. తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. పంత్ ఔట్6.2వ ఓవర్- 65 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో సుందర్కు క్యాచ్ ఇచ్చి రిషబ్ పంత్ (21) ఔటయ్యాడు.టార్గెట్ 181.. 6 ఓవర్లలో 61 పరుగులు చేసిన లక్నో181 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో ధాటిగా ఆడుతుంది. ఓపెనర్లు పంత్ (17), మార్క్రమ్ (38) వేగంగా పరుగులు సాధిస్తున్నారు. 6 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 61/0గా ఉంది. టార్గెట్ 181.. ఓపెనర్గా పంత్.. రెచ్చిపోయి ఆడుతున్న మార్క్రమ్181 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో ఓపెనర్గా రిషబ్ పంత్ బరిలోకి దిగాడు. మార్క్రమ్కు జతగా పంత్ క్రీజ్లో ఉన్నాడు. పంత్ 11 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 10 పరుగులు చేసి క్రీజ్లో ఉన్నాడు. అతనికి జతగా ఉన్న మార్క్రమ్ 18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 33 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్లో మిచెల్ మార్ష్ గైర్హాజరీలో పంత్ ఓపెనర్గా బరిలోకి దిగాడు. 5 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 49/0గా ఉంది.లక్నో బౌలర్ల అద్బుత ప్రదర్శన.. ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైన గుజరాత్టాస్ ఓడి లక్నో ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గిల్ 60, సాయి సుదర్శన్ 56 పరుగులతో రాణించారు. వాస్తవానికి ఈ మ్యాచ్లో గుజరాత్ భారీ స్కోర్ సాధించాల్సి ఉండింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ క్రీజ్లో ఉండగా గుజరాత్ స్కోర్ 12 ఓవర్లలో 120గా ఉండింది. అయితే వీరిద్దరు రెండు పరుగుల వ్యవధిలో ఔట్ కావడంతో గుజరాత్ స్కోర్ ఒక్కసారిగా నమ్మదించింది. ఈ దశలో లక్నో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి గుజరాత్ను ఓ మోస్తరు స్కోర్కే పరిమితం చేశారు. రూథర్ఫోర్డ్ 22, బట్లర్ 16, షారుక్ ఖాన్ 11 (నాటౌట్), సుందర్ 2, తెవాటియా డకౌటయ్యారు. లక్నో బౌలర్లలో బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్ తలో 2 వికెట్లు తీయగా.. దిగ్వేశ్ రాఠీ, ఆవేశ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్16.4వ ఓవర్- 145 పరుగుల వద్ద గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. దిగ్వేశ్ రాఠీ బౌలింగ్లో శార్దూల్ ఠాకూర్కు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (16) ఔటయ్యాడు. రూథర్ఫోర్డ్కు (6) జతగా షారుక్ ఖాన్ క్రీజ్లోకి వచ్చాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన గుజరాత్ఇన్నింగ్స్ 14వ ఓవర్లో గుజరాత్ రెండు వికెట్లు కోల్పోయింది. తొలి బంతికి సాయి సుదర్శన్ (56), ఆఖరి బంతికి వాషింగ్టన్ సుందర్ను (2) రవి బిష్ణోయ్ ఔట్ చేశారు. 14 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 127/3గా ఉంది. బట్లర్ (3), రూథర్ఫోర్డ్ క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్12.1వ ఓవర్- 120 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో మార్క్రమ్ బౌండరీ లైన్ వద్ద అద్బుతమైన క్యాచ్ పట్టడంతో శుభ్మన్ గిల్ (38 బంతుల్లో 60; 6 ఫోర్లు, సిక్స్) ఔటయ్యాడు. సాయి సుదర్శన్కు (55) జతగా జోస్ బట్లర్ క్రీజ్లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన గిల్, సుదర్శన్.. 11 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ ఎంతంటే..?11 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 109/0గా ఉంది. గిల్ (53), సాయి సుదర్శన్ (51) హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. నిలకడగా ఆడుతున్న గిల్, సాయి సుదర్శన్.. 7 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..?7 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 66/0గా ఉంది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (30), శుభ్మన్ గిల్ (34) నిలకడగా ఆడుతున్నారు. ఆచితూచి ఆడుతున్న గుజరాత్ ఓపెనర్లుటాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ (15), సాయి సుదర్శన్ (11) ఆచితూచి ఆడుతున్నారు. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. లక్నోలోని అటల్ బిహారి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో లక్నో కెప్టెన్ పంత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో లక్నో ఓ కీలక మార్పుతో బరిలోకి దిగుతుంది. స్టార్ ఆటగాడు, ఇన్ ఫామ్ ప్లేయర్ మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్లో ఆడటం లేదు. వ్యక్తిగత కారణాల చేత మార్ష్ ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. అతని స్థానాన్ని హిమ్మత్ సింగ్ భర్తీ చేయనున్నాడు. గుజరాత్ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగుతుంది. కుల్వంత్ కేజ్రోలియా స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు.ప్రస్తుత సీజన్లో గుజరాత్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో నాలుగింట గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. లక్నో ఐదింట మూడు గెలిచి ఆరో స్థానంలో ఉంది.తుది జట్లు..లక్నో: ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్/వికెట్కీపర్), హిమ్మత్ సింగ్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్కీపర్), వాషింగ్టన్ సుందర్, షెర్ఫానే రూథర్ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్ -
IPL 2025: గుజరాత్ టైటాన్స్కు షాక్.. అతడు సీజన్ మొత్తానికి దూరం
వరుస విజయాలతో జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు డైనమిక్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) ఐపీఎల్-2025లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. గాయం కారణంగా ఈ న్యూజిలాండ్ క్రికెటర్ స్వదేశానికి తిరుగుపయనమయ్యాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో సత్తా చాటిన గ్లెన్ ఫిలిఫ్స్ మెగా వేలంలోకి రాగా.. గుజరాత్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఇంత వరకు ఈ సీజన్లో అతడికి ఒక్క మ్యాచ్లోనూ ఆడే అవకాశం రాలేదు.గాయపడిన ఫిలిప్స్ఈ క్రమంలో గత ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్ (GT vs SRH)తో మ్యాచ్ సందర్భంగా మాత్రం సబ్స్టిట్యూట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు ఫిలిప్స్. కానీ దురదృష్టవశాత్తూ అతడు గాయపడ్డాడు. ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ బంతిని పాయింట్ వైపు తరలించగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్ బాల్ను ఆపబోయి గాయపడ్డాడు.ఈ క్రమంలో ఫిజియో వచ్చి అతడిని బయటకు తీసుకువెళ్లాడు. అయితే, గజ్జల్లో నొప్పి తీవ్రం కావడంతో సీజన్ మొత్తానికి ఫిలిప్స్ దూరమయ్యాడు. ఇందుకు సంబంధించి టైటాన్స్ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.సీజన్ మొత్తానికి దూరం‘‘ఏప్రిల్ 6న సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ సందర్భంగా గ్లెన్ ఫిలిప్స్ గాయపడ్డాడు. గజ్జల్లో గాయం కారణంగా అతడు తిరిగి న్యూజిలాండ్కు వెళ్లిపోయాడు. గ్లెన్ త్వరగా కోలుకోలుకోవాలని గుజరాత్ టైటాన్స్ ఆకాంక్షిస్తోంది’’ అని టైటాన్స్ యాజమాన్యం పేర్కొంది. కాగా 28 ఏళ్ల గ్లెన్ ఫిలిఫ్స్ ప్రపంచంలోని ఉత్తమ ఫీ ల్డ ర్లలో ఒకడు. తనదైన రోజున లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్తోనూ చెలరేగగలడు. అతడు దూరం కావడం టైటాన్స్కు ఓ రకంగా ఎదురుదెబ్బ లాంటిదే.కాగా రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ అయిన గ్లెన్ ఫిలిప్స్.. కుడిచేతి వాటం బ్యాటర్. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడి 65 పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు తీశాడు. క్యాష్రిచ్ లీగ్లో చివరగా 2023లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అతడు బరిలోకి దిగాడు.జోరు మీదున్న గిల్ సేనఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. సీజన్లో తమ ఆరంభ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిన శుబ్మన్ గిల్ సేన.. ఆ తర్వాత ఊహించని విధంగా పుంజుకుంది. వరుసగా నాలుగు మ్యాచ్లలో గెలిచి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు పూర్తి చేసుకున్న టైటాన్స్.. ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్పై గెలుపొందింది. ఇక శనివారం (ఏప్రిల్ 12) నాటి మ్యాచ్లో టైటాన్స్ లక్నో సూపర్ జెయింట్స్తో తలపడుతుంది. ఇందుకు లక్నోలోని ఏకనా స్టేడియం వేదిక.చదవండి: KKR Vs CSK: అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా? ఇంతకీ మెదడు పనిచేస్తోందా?! -
అనుకున్నది ఒకటి.. మా వాళ్లు చేసింది మరొకటి: సంజూ ఆగ్రహం!
గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిపై రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) స్పందించాడు. డెత్ ఓవర్లలో సరిగ్గా బౌలింగ్ చేయకపోవడమే తన పరాజయానికి ప్రధాన కారణం అని పేర్కొన్నాడు. తమకు శుభారంభం లభించినప్పటికీ దానిని కొనసాగించలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా బుధవారం గుజరాత్- రాజస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది.సాయి సుదర్శన్ ధనాధన్అహ్మదాబాద్లో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్.. ఆతిథ్య గుజరాత్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఆరంభంలోనే టైటాన్స్ కెప్టెన్, ఓపెనర్ శుబ్మన్ గిల్ (2) వికెట్ తీసి జోష్ నింపాడు. అయితే, మరో ఓపెనర్ సాయి సుదర్శన్ ఆ ఆనందాన్ని ఎంతో సేపు నిలవనీయలేదు.సాయి మొత్తంగా 53 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించి.. భారీ స్కోరకు పునాది వేశాడు. అతడికి తోడుగా జోస్ బట్లర్ (25 బంతుల్లో 36), షారుఖ్ ఖాన్ (20 బంతుల్లో 36), రాహుల్ తెవాటియా (12 బంతుల్లో 24 నాటౌట్) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి గుజరాత్ 217 పరుగులు చేసింది.రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే, మహీశ్ తీక్షణ రెండేసి వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ ఆరంభంలోనే యశస్వి జైస్వాల్ (6) వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే వన్డౌన్ బ్యాటర్ నితీశ్ రాణా (1) కూడా పెవిలియన్ చేరాడు.సంజూ, హెట్మెయిర్ పోరాటం సరిపోలేదుఈ క్రమంలో కెప్టెన్, ఓపెనర్ సంజూ శాంసన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 28 బంతుల్లో 41 పరుగులతో ధాటిగా ఆడుతున్న సమయంలో ప్రసిద్ కృష్ణ సంజూను అవుట్ చేసి రాజస్తాన్ను దెబ్బకొట్టాడు. మిగతా వాళ్లలో రియాన్ పరాగ్ (14 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. ధ్రువ్ జురెల్ (5) పూర్తిగా నిరాశపరిచాడు. అయితే, షిమ్రన్ హెట్మెయిర్ (32 బంతుల్లో 52) మాత్రం కాస్త వేగంగా ఆడి స్కోరును 150 దాటించగలిగాడు.అయితే, అప్పటికే సమయం దాటిపోయింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లంతా కలిసి కనీసం ఇరవై పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో 19.2 ఓవర్లలో రాజస్తాన్ 159 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా 58 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ మూడు, రషీద్ ఖాన్, సాయి కిషోర్ రెండేసి వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, అర్షద్ ఖాన్, కుల్వంత్ ఖెజ్రోలియా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.అనుకున్నది ఒకటి.. మా వాళ్లు చేసింది మరొకటిఈ నేపథ్యంలో ఓటమి అనంతం రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ‘‘వికెట్ బాగానే ఉంది. జోఫ్రా ఆర్చర్ ఆరంభంలోనే శుబ్మన్ గిల్ వికెట్ తీసి శుభారంభం అందించాడు. పవర్ ప్లేలోనే వీలైనన్ని ఎక్కువ వికెట్లు తీయాలన్నది మా ప్లాన్. అయితే, డెత్ ఓవర్లలో మాత్రం అనుకున్న విధంగా రాణించలేకపోయాం.నిజానికి మేము ప్రిపేర్ అయింది ఒకటి.. అక్కడ అయిందొకటి.. మా ఆలోచనలు ఓ రకంగా ఉంటే... మా బౌలర్లు అమలు చేసింది మరొకటి’’ అని ఈఎస్పీఎన్క్రిక్ ఇన్ఫోతో పేర్కొన్నాడు. ఇక లక్ష్య ఛేదనలో తాను, హెట్మెయిర్ అవుటైన తర్వాత పరిస్థితి చేయిదాటి పోయిందని.. పొరపాట్లపై సమీక్ష నిర్వహించి.. సరికొత్త ఉత్సాహంతో ముందుకు వస్తామని సంజూ అన్నాడు.చదవండి: సంజూ శాంసన్కు భారీ షాక్!🔝 of their Game. 🔝 of the Table. 💙#GT roar to the top of the points table with another strong display of cricket 💪Scorecard ▶ https://t.co/raxxjzYH5F#TATAIPL | #GTvRR | @gujarat_titans pic.twitter.com/ZDRsDqoMAT— IndianPremierLeague (@IPL) April 9, 2025 -
నంబర్ వన్గా కొనసాగుతున్న శుభ్మన్ గిల్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో పెద్దగా మార్పులేమీ చోటు చేసుకోలేదు. ప్రపంచవాప్తంగా ఉన్న ఆటగాళ్లంతా ఐపీఎల్తో బిజీగా ఉండగా.. పాకిస్తాన్, న్యూజిలాండ్ మాత్రమే వన్డే సిరీస్ ఆడాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు జట్లకు చెందిన కొందరు ఆటగాళ్ల ర్యాంక్లు మాత్రమే మారాయి. బ్యాటింగ్లో టీమిండియా ప్రిన్స్ శుభ్మన్ గిల్ టాప్ ర్యాంక్లో కొనసాగుతుండగా.. పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజమ్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత్ నుంచి విరాట్ (5), శ్రేయస్ అయ్యర్ (8) టాప్-10లో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్లో 72 పరుగులు చేసిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 21వ స్థానానికి చేరగా.. న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్వెల్ ఏకంగా 12 స్థానాలు మెరుగుపర్చుకుని 89 స్థానానికి చేరాడు.బౌలర్ల ర్యాంకింగ్స్లో శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ టాప్లో కొనసాగుతుండగా.. భారత్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత్ నుంచి కుల్దీప్తో పాటు రవీంద్ర జడేజా (9) ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. పాక్తో సిరీస్లో 3 మ్యాచ్ల్లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన సహా 10 వికెట్లు తీసిన న్యూజిలాండ్ పేసర్ బెన్ సియర్స్ ఏకంగా 64 స్థానాలు మెరుగపర్చుకుని 100వ స్థానానికి చేరాడు. పాక్ పేసర్ నసీం షా ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని 43వ స్థానానికి ఎగబాకాడు.ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. మరో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మహ్మద్ నబీ రెండో స్థానంలో నిలిచాడు. జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ నుంచి టాప్-10లో రవీంద్ర జడేజా (9) ఒక్కడే ఉన్నాడు. జడ్డూ ఓ స్థానం మెరుగుపర్చుకుని 10 నుంచి 9కి చేరాడు. పాక్తో జరిగిన సిరీస్లో 85 పరుగులు చేసి 2 వికెట్లు తీసిన మైఖేల్ బ్రేస్వెల్ (5) రెండు స్థానాలు మెరుగుపర్చుకుని టాప్-5లోకి వచ్చాడు. -
IPL 2025: రాజస్థాన్ రాయల్స్పై గుజరాత్ ఘన విజయం
రాజస్థాన్ రాయల్స్పై గుజరాత్ ఘన విజయంఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 9) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై గుజరాత్ టైటాన్స్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన రాయల్స్ 19.2 ఓవర్లలో 159 ఆలౌటైంది. ఆరో వికెట్ కోల్పోయిన రాయల్స్13.2వ ఓవర్- 119 పరుగుల వద్ద రాయల్స్ ఆరో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్లో శుభమ్ దూబే (1) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.ఐదో వికెట్ కోల్పోయిన రాయల్స్12.2వ ఓవర్- 116 పరుగుల వద్ద రాయల్స్ ఐదో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో సాయి కిషోర్కు క్యాచ్ ఇచ్చి సంజూ శాంసన్ (41) ఔటయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో రాయల్స్7.4వ ఓవర్- 218 పరుగుల భారీ ఛేదనలో రాయల్స్ 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్లో సాయి సుదర్శన్కు క్యాచ్ ఇచ్చి దృవ్ జురెల్ (5) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన రాయల్స్.. రియాన్ ఔట్6.4వ ఓవర్- 60 పరుగుల వద్ద రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. ఇంపాక్ట్ ప్లేయర్ కేజ్రోలియా బౌలింగ్లో వికెట్ కీపర్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి రియాన్ పరాగ్ (26) ఔటయ్యాడు. 6 ఓవర్లలో 57 పరుగులు.. ధాటిగా ఆడుతున్న శాంసన్, రియాన్11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా రాయల్స్ ఏమాత్రం తగ్గడం లేదు. 6 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 57/2గా ఉంది. శాంసన్ (21), రియాన్ (25) ధాటిగా ఆడుతున్నారు. 12 పరుగులకే రెండు వికెట్లు కోలోయిన రాయల్స్2.2వ ఓవర్- భారీ లక్ష్య ఛేదనలో రాయల్స్ 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అర్షద్ ఖాన్ బౌలింగ్లో తొలుత జైస్వాల్ ఔట్ కాగా.. తాజాగా సిరాజ్ బౌలింగ్లో నితీశ్ రాణా (1) ఔటయ్యాడు. టార్గెట్ 218.. 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్218 పరుగుల భారీ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 11 పరుగుల వద్దనే తొలి వికెట్ కోల్పోయింది. అర్షద్ ఖాన్ బౌలింగ్లో రషీద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి యశస్వి జైస్వాల్ (6) ఔటయ్యాడు. సంజూ శాంసన్కు జతగా నితీశ్ రాణా క్రీజ్లోకి వచ్చాడు.చెలరేగిన సాయి సుదర్శన్.. గుజరాత్ భారీ స్కోర్రాజస్థాన్ రాయల్స్తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు సాయి సుదర్శన్ (53 బంతుల్లో 82; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్లో జోస్ బట్లర్, షారుక్ ఖాన్ తలో 36 పరుగులు చేయగా.. రాహుత్ తెవాతియా 24 (నాటౌట్), రషీద్ ఖాన్ 12, రూథర్ఫోర్డ్ 7, గిల్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే, తీక్షణ తలో రెండు వికెట్లు తీయగా.. ఆర్చర్, సందీప్ శర్మ చెరో వికెట్ తీశారు.82 పరుగుల వద్ద సాయి సుదర్శన్ ఔట్82 పరుగుల వద్ద సాయి సుదర్శన్ ఔటయ్యాడు. తుషార్ దేశ్పాండే బౌలింగ్లో సంజూ శాంసన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. 18.2 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 187/5గా ఉంది. తెవాతియా (10), రషీద్ ఖాన్ క్రీజ్లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్16.1వ ఓవర్- 163 పరుగుల వద్ద సందీప్ శర్మ బౌలింగ్లో వికెట్కీపర్ శాంసన్కు క్యాచ్ ఇచ్చి రూథర్ఫోర్డ్ (7) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్15.4వ ఓవర్- 156 పరుగుల వద్ద గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. తీక్షణ బౌలింగ్లో షారుక్ ఖాన్ (36) స్టంపౌట్ అయ్యాడు. సాయి సుదర్శన్కు (69) జతగా రూథర్ఫోర్డ్ క్రీజ్లోకి వచ్చాడు. రూథర్ఫోర్డ్ వచ్చీ రాగానే సిక్సర్తో విరుచుకుపడ్డాడు. 16 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 163/3గా ఉంది.భారీ స్కోర్ దిశగా గుజరాత్ఈ మ్యాచ్లో గుజరాత్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. 13 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 124/2గా ఉంది. సాయి సుదర్శన్ 59, షారుక్ ఖాన్ 18 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్.. బట్లర్ ఔట్9.6వ బంతి- 94 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. తీక్షణ బౌలింగ్లో జోస్ బట్లర్ (36) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. సాయి సుదర్శన్ (50) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా షారుక్ ఖాన్ క్రీజ్లోకి వచ్చాడు. లైన్లోకి వచ్చిన బట్లర్.. 8 బంతుల్లో 4 బౌండరీలుఆరంభంలో నిదానంగా ఆడిన బట్లర్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో లైన్లోకి వచ్చాడు. ఆ ఓవర్ ఆఖరి రెండు బంతులను బౌండరీలకు తరలించిన బట్లర్, ఆతర్వాతి ఓవర్లో కూడా మరో రెండు బౌండరీలు బాదాడు. సాయి సుదర్శన్తో (26 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పాటు బట్లర్ (19 బంతుల్లో 31; 5 ఫోర్లు) కూడా టచ్లోకి రావడంతో గుజరాత్ స్కోర్ 8 ఓవర్లలోనే 81 పరుగులకే చేరింది. ధాటిగా ఆడుతున్న సాయి సుదర్శన్శుభ్మన్ గిల్ త్వరగానే ఔటైనా మరో ఓపెనర్ సాయి సుదర్శన్ ధాటిగా ఆడుతున్నాడు. సాయి 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి క్రీజ్లో ఉన్నాడు. సాయికి జతగా బట్లర్ (11) ఉన్నాడు. 6 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 56/1గా ఉంది. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. కెప్టెన్ ఔట్2.1వ ఓవర్- 14 పరుగులకే గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ (2) జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సాయి సుదర్శన్కు (11) జతగా జోస్ బట్లర్ క్రీజ్లోకి వచ్చాడు. ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 9) గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో రాయల్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు రాయల్స్ స్టార్ బౌలర్ వనిందు హసరంగ దూరమయ్యాడు (వ్యక్తిగత కారణాల చేత). అతని స్థానంలో ఫజల్హక్ ఫారూకీ తుది జట్టులోకి వచ్చాడు. గుజరాత్ గత మ్యాచ్లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించుతుంది.ఈ సీజన్లో గుజరాత్ తొలి మ్యాచ్లో ఓడి (పంజాబ్), ఆతర్వాత హ్యాట్రిక్ విజయాలు (ముంబై, ఆర్సీబీ, సన్రైజర్స్) సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకొచ్చింది. రాయల్స్ విషయానికొస్తే.. ఈ జట్టు తొలి రెండు మ్యాచ్ల్లో (సన్రైజర్స్, కేకేఆర్) ఓడి, ఆతర్వాత వరుసగా సీఎస్కే, పంజాబ్లపై గెలుపొంది పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది.తుది జట్లు..గుజరాత్: సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్కీపర్), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మరాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్కీపర్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, ఫజల్ హక్ ఫారూకీ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే -
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
టీమిండియా మొట్టమొదటి ప్రపంచకప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev). ఈ దిగ్గజ ఆల్రౌండర్ సారథ్యంలో 1983 నాటి వన్డే వరల్డ్కప్ ఫైనల్లో వెస్టిండీస్ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని (MS Doni) నాయకత్వంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంది.ఈ క్రమంలో సుదీర్ఘ విరామం తర్వాత గత రెండేళ్ల కాలంలో మరో రెండు ప్రపంచకప్ టైటిళ్లను టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో టీ20 ప్రపంచకప్-2024.. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ట్రోఫీలను కైవసం చేసుకుంది.సూర్యకుమార్ యాదవ్కు పగ్గాలుఇక పొట్టి ప్రపంచకప్లో భారత్ను విజేతగా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ వారసుడిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) హార్దిక్ పాండ్యా పేరును ప్రకటిస్తుందనుకుంటే.. సూర్యకుమార్ యాదవ్కు పగ్గాలు అప్పగించింది.మరోవైపు.. వన్డేలకు, టెస్టులకు రోహిత్ శర్మ కెప్టెన్గా కొనసాగుతుండగా.. ఆయా ఫార్మాట్లలో శుబ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా అతడికి డిప్యూటీలుగా వ్యవహరిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరుగనుండగా.. వన్డే వరల్డ్కప్ 2027లో జరుగనుంది.నా ఎంపిక మాత్రం హార్దిక్ పాండ్యానేఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్ టీమిండియాకు సరైన కెప్టెన్ ఎవరన్న అంశంపై దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. ‘‘నా వరకు హార్దిక్ పాండ్యానే టీమిండియా వైట్బాల్ కెప్టెన్గా ఉండాలి. ఈ పదవికి చాలా మంది పోటీలో ఉన్నారని తెలుసు.అయితే, నా ఎంపిక మాత్రం హార్దిక్ పాండ్యానే. అతడు యువకుడు. వచ్చే రెండు ఐసీసీ ఈవెంట్ల కోసం అతడి చుట్టూ జట్టు నిర్మిస్తే బాగుంటుంది. నిజానికి పాండ్యా టెస్టు క్రికెట్ కూడా ఆడితే బాగుంటుంది. కానీ అతడు చాలా కాలంగా రెడ్ బాల్ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. అందుకే టీమిండియాకు మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్ల అవసరం ఏర్పడింది’’ అని కపిల్ దేవ్ అన్నాడు. ‘మైఖేల్’తో మాట్లాడుతూ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.గాయాల బెడద ఎక్కువని పక్కన పెట్టారుఅయితే, హార్దిక్ను కాదని సూర్యను టీ20 కెప్టెన్గా నియమించిన సమయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇందుకు గల కారణాన్ని వెల్లడించాడు. పేస్బౌలింగ్ ఆల్రౌండర్ అయిన హార్దిక్కు గాయాల బెడద ఎక్కువని.. అతడి లాంటి అరుదైన ఆటగాడిని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే కెప్టెన్సీ భారం మోపలేదని స్పష్టం చేశాడు.కపిల్ దేవ్ మాత్రం ఇలాకానీ.. కపిల్ దేవ్ మాత్రం పరిమిత ఓవర్ల క్రికెట్లో సూర్య, శుబ్మన్లను కాదని హార్దిక్ పాండ్యా పేరును మరోసారి కెప్టెన్సీ ఆప్షన్గా తెరమీదకు తీసుకురావడం విశేషం. కాగా టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్నారు. తదుపరి జూన్లో ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో జాతీయ జట్టు తరఫున విధుల్లో చేరనున్నారు.ఇక క్యాష్ రిచ్ లీగ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా గతేడాది నియమితుడైన హార్దిక్ పాండ్యా.. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. ఐపీఎల్-2024లో పద్నాలుగు మ్యాచ్లకు హార్దిక్ సేన కేవలం నాలుగే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో మూడు ఓడిపోయింది. చదవండి: ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్ ఆటగాడు -
‘మీకసలు మానవత్వం ఉందా?’.. గిల్- ఇషాన్పై నెటిజన్లు ఫైర్.. కానీ ఓ ట్విస్ట్!
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు తమ ఫీల్డర్ నొప్పితో విలవిల్లాడుతుంటే... అతడు మాత్రం ప్రత్యర్థి జట్టు బ్యాటర్తో కలిసి నవ్వులు చిందించడం ఇందుకు కారణం. అసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా గుజరాత్ ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడింది.ఆరంభంలోనే షాకులుఉప్పల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. బౌలర్లు అతడి నమ్మకాన్ని వమ్ముకానీయలేదు. రెండో ఓవర్ మొదటి బంతికే ఓపెనర్ ట్రవిస్ హెడ్ (8)ను పెవిలియన్కు పంపిన టైటాన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్.. తదుపరి ఐదో ఓవర్ నాలుగో బంతికి మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (18)ను కూడా అవుట్ చేశాడు.ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) నిలదొక్కుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఎనిమిదో ఓవర్ రెండో బంతికి టైటాన్స్ మరో పేసర్ ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అయితే, అంతకంటే ముందు.. అంటే ఆరో ఓవర్లో ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో నాలుగో బంతిని ఇషాన్ ఎదుర్కొన్నాడు.గ్లెన్ ఫిలిప్స్నకు గాయంఅవుట్ సైడ్ ఆఫ్ దిశగా ప్రసిద్ వేసిన షార్ట్ బాల్ను పాయింట్ వైపు తరలించగా.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న టైటాన్స్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ బంతిని ఆపే క్రమంలో గాయపడ్డాడు. మైదానంలో కుప్పకూలి నొప్పితో విలవిల్లాడగా.. వాషింగ్టన్ సుందర్ అతడికి దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడు. ఇంతలో ఫిజియో కూడా వచ్చి ఫిలిప్స్ను పరీక్షించి.. మైదానం బయటకు తీసుకువెళ్లాడు.ఇషాన్- గిల్ నవ్వులుఅయితే, ఆ సమయంలో నితీశ్ రెడ్డితో కలిసి సింగిల్ పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్ దగ్గరికి వెళ్లిన గిల్.. అతడితో నవ్వుతూ ముచ్చటించాడు. ఇషాన్ తన భుజంపై చేయి వేయగా.. గిల్ కూడా నవ్వులు చిందిస్తూ సరదాగా సంభాషిస్తున్నట్లుగా ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో గిల్ తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.glenn phillips is lying in pain and these two buddies are gossiping like they're in some college park 😭😭😭#SRHvGT pic.twitter.com/172aqoAtM4— 🍂 (@jaaniyeeex) April 6, 2025మీకసలు మానవత్వం ఉందా?‘‘సొంత జట్టు ఆటగాడు గాయపడి.. నొప్పితో బాధపడుతుంటే.. కెప్టెన్ మాత్రం ఇలా ప్రత్యర్థి జట్టు ఆటగాడితో ముచ్చట్లు పెడుతున్నాడు. ఆటగాళ్ల మధ్య స్నేహం తప్పు కాదు. కానీ పరిస్థితికి తగ్గట్లుగా హుందాగా , కాస్త మానవత్వంతో వ్యవహరించాలి. మ్యాచ్ అయిపోయిన తర్వాత కావాల్సినంత సేపు జోకులు వేసుకోవచ్చు’’ అంటూ గిల్కు చురకలు అంటిస్తున్నారు.కాగా ఇషాన్- శుబ్మన్ గిల్ అండర్-19 స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలోనూ ఓపెనింగ్ జోడీగా రాణించారు. వీరిద్దరి మధ్య గాఢమైన స్నేహబంధం ఉంది. అయితే, టైటాన్స్- రైజర్స్ మ్యాచ్ సందర్భంగా ఓ ఆటగాడు గాయపడిన వేళ.. ఇలా నవ్వులు చిందిస్తూ మాట్లాడుకోవడం వీరిపై విమర్శలకు దారితీసింది.Left national team to chase IPL money. Got injured without playing a ball.- Glenn Phillips proving once again, greed has its own price. 🥲 #GTvSRH pic.twitter.com/S0urYUhW7q— MUHAMMAD SAMI (@mrsalaar96) April 6, 2025 కానీ ఓ ట్విస్ట్!అయితే, అప్పటికి ఫిలిప్స్ పరిస్థితిని గిల్ చూడకపోవడం గమనార్హం. విషయం తెలిసిన వెంటనే అతడు తమ ఫీల్డర్ దగ్గరికి వెళ్లినట్లు కనిపించింది. దీంతో.. ‘‘తెలిసీ తెలియక మాట్లాడవద్దు’’ అంటూ ట్రోలర్స్కు గిల్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు.ఇదిలా ఉంటే.. సన్రైజర్స్ టాపార్డర్ అభిషేక్ శర్మ(18), ట్రవిస్ హెడ్ (8), ఇషాన్ కిషన్ (17) మరోసారి విఫలం కాగా.. నితీశ్ రెడ్డి 34 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఇతరులలో హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 27), కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (9 బంతుల్లో 22 నాటౌట్) కాస్త వేగంగా ఆడారు. ఫలితంగా సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.గిల్ సూపర్ బ్యాటింగ్టైటాన్స్ పేసర్లు మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. ప్రసిద్ కృష్ణ, సాయి కిషోర్ రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక రైజర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని టైటాన్స్ 16.4 ఓవర్లలోనే ఛేదించింది.ఓపెనర్ శుబ్మన్ గిల్ (43 బంతుల్లో 61 నాటౌట్) అద్భుత అర్థ శతకం సాధించగా.. వాషింగ్టన్ సుందర్ (29 బంతుల్లో 49), షెర్ఫానే రూథర్ఫర్డ్ (16 బంతుల్లో 35 నాటౌట్) అదరగొట్టారు. ఫలితంగా ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ గెలుపొందింది. రైజర్స్ బౌలర్లలో మహ్మద్ షమీకి రెండు, కమిన్స్కు ఒక వికెట్ దక్కాయి.3️⃣ wins on the trot 💙A commanding 7️⃣-wicket win over #SRH takes #GT to the second spot in the #TATAIPL 2025 points table 🆙Scorecard ▶ https://t.co/Y5Jzfr6Vv4#SRHvGT | @gujarat_titans pic.twitter.com/tYB1Dt5mdd— IndianPremierLeague (@IPL) April 6, 2025 చదవండి: ఇలా వచ్చి.. అలా వెళ్లారు.. అసలేం చేస్తున్నారు? కావ్యా మారన్ రియాక్షన్ వైరల్ -
SRH VS GT: బౌలర్లే మ్యాచ్లు గెలిపిస్తారు.. సిరాజ్లోని ఎనర్జీ వేరే లెవెల్: గిల్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ను గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో గుజరాత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టి సీజన్లో వరుసగా మూడో విజయం నమోదు చేసింది. తద్వారా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. బ్యాటింగ్లో దారుణంగా విఫలమైన సన్రైజర్స్ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుని పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానానికి పడిపోయింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. లోకల్ బాయ్ సిరాజ్ (4-0-17-4) చెలరేగడంతో అతి కష్టం మీద 152 పరుగులు చేయగలిగింది. సిరాజ్తో పాటు ప్రసిద్ద్ కృష్ణ (4-0-25-2), సాయి కిషోర్ (4-0-24-2) కూడా సత్తా చాటడంతో సన్రైజర్స్ ఒక్కో పరుగు చేసేందుకు కూడా చాలా ఇబ్బంది పడింది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో అభిషేక్ శర్మ 18, ట్రవిస్ హెడ్ 8, ఇషాన్ కిషన్ 17, నితీశ్ రెడ్డి 31, క్లాసెన్ 27, అనికేత్ వర్మ 18, కమిందు 1, సిమర్జీత్ డకౌటయ్యారు. ఆఖర్లో కమిన్స్ (9 బంతుల్లో 22 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో సన్రైజర్స్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ కూడా ఆదిలో తడబడింది. పవర్ ప్లేలోనే ఆ జట్టు ఇన్ ఫామ్ బ్యాటర్లు సాయి సుదర్శన్ (5), జోస్ బట్లర్ (0) వికెట్లు కోల్పోయింది. అయితే శుభ్మన్ గిల్ (43 బంతుల్లో 61 నాటౌట్; 9 ఫోర్లు).. వాషింగ్టన్ సుందర్ (29 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (16 బంతుల్లో 35 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) సహకారంతో గుజరాత్ను మరో 20 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేర్చాడు. సన్రైజర్స్ బౌలర్లలో షమీ 2, కమిన్స్ ఓ వికెట్ తీశారు.మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. టీ20 ఫార్మాట్లో బౌలర్లే గేమ్ ఛేంజర్లు. చాలా మంది భారీ హిట్టర్ల గురించి మాట్లాడుకుంటారు కానీ, బౌలర్లే మ్యాచ్లు గెలిపిస్తారు. నేటి మ్యాచ్లో మేము మైదానం అంతటా షాట్లు ఆడాలనుకున్నాము. అదే నేను, సుందర్ డిస్కస్ చేసుకున్నాము.సుందర్ ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లోనే బరిలోకి దిగి ఉండాల్సింది. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ నియమం వల్ల ప్రణాళికలు మార్చుకోవాల్సి వచ్చింది. ఈ రోజు అతను బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. మేము మంచి క్రికెటింగ్ షాట్లు ఆడాలనుకున్నాము. ఓసారి 30-40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పితే, అదే మనల్ని ఆటలోకి తీసుకెళ్తుంది. బౌలింగ్, ఫీల్డింగ్ సమయంలో సిరాజ్ ఇచ్చే ఊపు అంటువ్యాధి లాంటిది. అది జట్టు మొత్తానికి పాకుతుంది. ఫీల్డ్లో అతనిలోని ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ రోజు అతను బౌలింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. -
తీరు మారని ఎస్ఆర్హెచ్.. వరుసగా నాలుగో ఓటమి
ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ సన్రైజర్స్ విఫలమైంది.తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్ల దాటికి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. మహ్మద్ సిరాజ్ ఆదిలోనే హెడ్, అభిషేక్ను ఔట్ చేసి సన్రైజర్స్ను దెబ్బతీశాడు. సిరాజ్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు ప్రసిద్ద్ కృష్ణ, సాయికిషోర్ తలా రెండు వికెట్లు సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి(31) టాప్ స్కోరర్గా నిలవగా.. క్లాసెన్(27),కమ్మిన్స్(22) రాణించారు.గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. అనంతరం 153 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలో ఊదిపడేసింది. గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి వరకు ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. గిల్ (43 బంతుల్లో 9 ఫోర్లతో 61 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. వాషింగ్టన్ సుందర్(49), రూథర్ ఫర్డ్(35 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో షమీ రెండ వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్ ఓ వికెట్ సాధించారు. ఈ ఓటమితో ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానానికి పడిపోయింది. -
#SRHvsGT : సిరాజ్, గిల్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే (ఫొటోలు)
-
IPL 2025: చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్
ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్తో నిన్న (ఏప్రిల్ 2) జరిగిన మ్యాచ్లో శుభ్మన్ గిల్ను ఔట్ చేయడం ద్వారా ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్గా డ్వేన్ బ్రావో రికార్డును సమం చేశాడు. బ్రావో 158 ఇన్నింగ్స్ల్లో 183 వికెట్లు తీయగా.. ఈ మార్కు తాకడానికి భువీకి 178 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి. ఓవరాల్గా ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్ పేరిట ఉంది. చహల్ 161 ఇన్నింగ్స్ల్లో 206 వికెట్లు తీశాడు. చహల్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన ఘనత పియూశ్ చావ్లాకు దక్కుతుంది. చావ్లా 191 ఇన్నింగ్స్ల్లో 912 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చహల్ , చావ్లా తర్వాత భువీ, బ్రావో ఉన్నారు. వీరిద్దరితో సమానంగా అశ్విన్ కూడా 183 వికెట్లు తన ఖాతాలో కలిగి ఉన్నాడు. యాష్కు 183 వికెట్ల మార్కును తాకడానికి 211 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి.కాగా, నిన్న సొంత మైదానంలో (చిన్నస్వామి స్టేడియం) గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ సీజన్లో ఆ జట్టుకు ఇదే తొలి ఓటమి. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఆదిలోనే వికెట్లు కోల్పోయి నామమాత్రపు స్కోర్కు (169/8) పరిమితమైంది. లివింగ్స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్) పోరాడటంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీసి ఆర్సీబీకి దెబ్బకొట్టాడు. సిరాజ్ తన మాజీ జట్టుపై మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. సిరాజ్తో పాటు సాయికిషోర్ (2), అర్షద్ ఖాన్ (1), ప్రసిద్ద్ కృష్ణ (1), ఇషాంత్ శర్మ (1) కూడా వికెట్లు తీశారు. సిరాజ్ తన కోటా 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు.అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) నిలకడగా ఆడి గుజరాత్ను గెలిపించారు. ఆఖర్లో బట్లర్, రూథర్ఫోర్డ్ బ్యాట్ను ఝులిపించారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్కు ముందు టాప్ ప్లేస్లో ఉండిన ఆర్సీబీ మూడో స్థానానికి పడిపోయింది. -
IPL 2025: ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం
ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం170 పరుగుల నామ మాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) గుజరాత్ను గెలిపించారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. లివింగ్స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీయగా.. సాయికిషోర్ 2, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, ఇషాంత్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్12.3వ ఓవర్: 107 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. సాయి సుదర్శన్ 49 పరుగులు చేసి హాజిల్వుడ్ బౌలింగ్లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. లక్ష్యం దిశగా సాగుతున్న గుజరాత్ఛేదనను నిదానంగా ప్రారంభించిన గుజరాత్ ఆతర్వాత గేర్ మార్చి లక్ష్యం దిశగా అడుగులు వేస్తుంది. 11.5 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (47), జోస్ బట్లర్ (39) ఇన్నింగ్స్లు కొనసాగిస్తున్నారు. గేర్ మార్చిన బట్లర్అప్పటివరకు నిదానంగా ఆడిన బట్లర్ రసిక్ సలామ్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో గేర్ మార్చాడు. ఆ ఓవర్లో బట్లర్ 2 సిక్సర్లు, ఓ ఫోర్ బాదాడు. 9 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 75/1గా ఉంది. బట్లర్ 26, సాయి సుదర్శన్ 32 పరుగులతో ఇన్నింగ్స్లను కొనసాగిస్తున్నారు. ఈ మ్యాచ్లో గుజరాత్ గెలవాలంటే 66 బంతుల్లో 95 పరుగులు చేయాలి. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్4.4వ ఓవర్: 170 పరుగుల ఛేదనలో గుజరాత్ 32 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో లివింగ్స్టోన్కు క్యాచ్ ఇచ్చి శుభ్మన్ గిల్ (14) ఔటయ్యాడు. సాయి సుదర్శన్ (15), జోస్ బట్లర్ క్రీజ్లో ఉన్నారు. టార్గెట్ 170.. నిదానంగా ఆడుతున్న గుజరాత్170 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ నిదానంగా ఆడుతుంది. మూడు ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 15 పరుగులు మాత్రమే చేసింది. శుభ్మన్ గిల్ 7, సాయి సుదర్శన్ 5 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. లివింగ్స్టోన్ హాఫ్ సెంచరీ.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..?టాస్ ఓడి గుజరాత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. లివింగ్స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మధ్యలో జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్) కూడా ఓ మోస్తరుగా బ్యాట్ ఝులిపించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో వీరు మినహా ఎవరూ రాణించలేదు. సాల్ట్ 14, విరాట్ కోహ్లి 7, పడిక్కల్ 4, పాటిదార్ 12, కృనాల్ పాండ్యా 5 పరుగులు చేసి ఔటయ్యారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీయగా.. సాయికిషోర్ 2, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, ఇషాంత్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. చివరి ఓవర్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్ బాది చివరి బంతికి ఔటైన టిమ్ డేవిడ్ఏడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీసిరాజ్ బౌలింగ్లో బట్లర్ క్యాచ్ పట్టడంతో లివింగ్స్టోన్ (54) ఔటయ్యాడు.లివింగ్స్టోన్ హాఫ్ సెంచరీరషీద్ ఖాన్ బౌలింగ్లో రెండు వరుస సిక్సర్లు బాది లివింగ్స్టోన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆరో వికెట్ డౌన్14.2వ ఓవర్: 104 పరుగుల వద్ద ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. సాయి కిషోర్ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి కృనాల్ పాండ్యా (5) ఔటయ్యాడు. లివింగ్స్టోన్ (24), టిమ్ డేవిడ్ (1) క్రీజ్లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ12.4వ ఓవర్: 94 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. సాయి కిషోర్ బౌలింగ్లో తెవాటియాకు క్యాచ్ ఇచ్చి జితేశ్ శర్మ (33) ఔటయ్యాడు. లివింగ్స్టోన్కు (19) జతగా కృనాల్ పాండ్యా క్రీజ్లోకి వచ్చాడు. 10 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 73/410 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 73/4గా ఉంది. లివింగ్స్టోన్ (8), జితేశ్ శర్మ (23) క్రీజ్లో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 6.2వ ఓవర్: ఆర్సీబీ కష్టాలు మరింత తీవ్రతరమయ్యాయి. ఆ జట్టు 42 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ బౌలింగ్లో కెప్టెన్ రజత్ పాటిదార్ (12) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. లివింగ్స్టోన్, జితేశ్ శర్మ క్రీజ్లో ఉన్నారు. పీకల్లోతు కష్టాల్లో ఆర్సీబీ.. 35 పరుగులకే 3 వికెట్లు డౌన్4.4వ ఓవర్: టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ జట్టు 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్లో భారీ సిక్సర్ కొట్టిన అనంతరం ఫిల్ సాల్ట్ (14) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రజత్ పాటిదార్కు (6) జతగా లివింగ్స్టోన్ క్రీజ్లోకి వచ్చాడు. 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీఆర్సీబీ 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండో ఓవర్లో విరాట్ను ఆర్షద్ ఖాన్ ఔట్ చేయగా.. మూడో ఓవర్లో సిరాజ్ అద్భుతమైన బంతితో పడిక్కల్ను (4) క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆర్సీబీకి షాక్.. రెండో ఓవర్లోనే విరాట్ ఔట్ఆర్సీబీకి రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (7) అర్షద్ ఖాన్ బౌలింగ్లో ప్రసిద్ద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 2 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 12/1గా ఉంది. పడిక్కల్ (4), సాల్ట్ (1) క్రీజ్లో ఉన్నారు. తొలి ఓవర్లోనే సాల్ట్ బతికిపోయాడు..!సాల్ట్కు తొలి ఓవర్లోనే లైఫ్ లభించింది. సిరాజ్ బౌలింగ్లో వికెట్కీపర్ జోస్ బట్లర్ చేతిలోకి వచ్చిన క్యాచ్ను వదిలేశాడు. అంతకుముందు తొలి బంతికే సాల్ట్ ఔట్ కావాల్సింది. అయితే బంతి ఫీల్డర్లు లేని చోట ల్యాండైంది.ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 2) గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ తలపడనున్నాయి. ఆర్సీబీ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం గుజరాత్ ఓ మార్పు చేయగా.. ఆర్సీబీ గత మ్యాచ్లో ఆడిన జట్టునే కొనసాగిస్తుంది. గుజరాత్ తరఫున రబాడ స్థానంలో అర్షద్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. రబాడ వ్యక్తిగత కారణాల చేత ఈ మ్యాచ్కు దూరమయ్యాడు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ(వికెట్కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్, యశ్ దయాల్గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్కీపర్), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మగుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ సబ్స్: షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, వాషింగ్టన్ సుందర్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ సబ్స్: సుయాష్ శర్మ, రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్.కాగా, ఈ సీజన్లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో రెండింట గెలిచి టేబుల్ టాపర్గా కొనసాగుతుంది. గుజరాత్ రెండింట ఓ మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆర్సీబీ.. కేకేఆర్, సీఎస్కేపై విజయాలు సాధించగా.. గుజరాత్.. పంజాబ్ చేతిలో ఓడి, ముంబై ఇండియన్స్పై గెలుపొందింది. -
GT VS MI: మొదటి మ్యాచ్కు ముందే 'ఆ' నిర్ణయం తీసుకున్నాం.. ప్రసిద్ద్ బౌలింగ్ అద్భుతం: గిల్
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్తో నిన్న (మార్చి 29) జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్లో గుజరాత్ అన్ని విభాగాల్లో సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్కు దిగి భారీ స్కోర్ (196/8) చేసిన ఆ జట్టు.. ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఈ మ్యాచ్లో గుజరాత్ టాప్-3 బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తన క్లాస్ను ప్రదర్శించాడు. శుభ్మన్ గిల్ (27 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), జోస్ బట్లర్ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్) భారీ స్కోర్లు చేయకపోయిన బాగా ఆడారు. స్లోగా ఉన్న పిచ్పై ఈ ముగ్గురు సూపర్గా బ్యాటింగ్ చేశారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా (4-0-29-2) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బౌల్ట్ (4-0-34-1), దీపక్ చాహర్ (4-0-39-1), సాంట్నర్ (3-0-25-0) పర్వాలేదనిపించగా.. ముజీబ్ రెహ్మాన్ (2-0-28-1), యువ పేసర్ సత్యనారాయణ రాజు (3-0-40-1) భారీగా పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఆదిలోనే తడబడింది. సిరాజ్ తొలి ఓవర్లోనే ముంబైని దెబ్బకొట్టాడు. రెండు బౌండరీలు బాది జోరుమీదున్న రోహిత్ శర్మను (8) క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం ఐదో ఓవర్లో సిరాజ్ మరోసారి చెలరేగాడు. ఈసారి మరో ఓపెనర్ రికెల్టన్ను (6) రోహిత్ తరహాలోనే క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆతర్వాత క్రీజ్లోకి వచ్చిన తిలక్ వర్మ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 48; ఫోర్, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ దశలో గుజరాత్ ప్రస్దిద్ద్ కృష్ణను బరిలోకి దించింది. ప్రసిద్ద్ అద్భుతంగా బౌలింగ్ చేసి క్రీజ్లో కుదురుకున్న తిలక్, స్కైలను ఔట్ చేశాడు. ఇక్కడే ప్రసిద్ద్ ముంబై చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు.ప్రసిద్ద్ అద్భుతమైన స్లో బాల్స్తో ముంబై బ్యాటర్లను ఇరుకునపెట్టాడు. తిలక్, స్కై ఔటయ్యాక హార్దిక్ బ్యాటింగ్కు దిగకుండా రాబిన్ మింజ్ను పంపి తప్పు చేశాడు. మింజ్ (6 బంతుల్లో 3), హార్దిక్ (17 బంతుల్లో 11) బంతులు వృధా చేసి ముంబై ఓటమిని ఖరారు చేశారు. ఆఖర్లో నమన్ ధీర్ (11 బంతుల్లో 18 నాటౌట్), సాంట్నర్ (9 బంతుల్లో 18 నాటౌట్) భారీ షాట్లు ఆడినా అప్పటికే ముంబై ఓటమి ఖరారైపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. పొదుపుగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసిన ప్రసిద్ద్ కృష్ణకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గుజరాత్ బౌలరల్లో ప్రసిద్ద్, సిరాజ్ చెరో 2, రబాడ, సాయికిషోర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్ ఈ సీజన్లో బోణీ కొట్టింది. ముంబై వరుసగా తమ రెండో మ్యాచ్లో కూడా పరాజయంపాలైంది.మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ మ్యాచ్ను బ్లాక్ సాయిల్ పిచ్పై ఆడాము. ఇది మాకు కలిసొచ్చింది. మొదటి మ్యాచ్కు ముందే ఈ పిచ్పై ఆడాలని నిర్ణయించుకున్నాము. ఈ వికెట్ మాకు సూటైంది. బంతి పాతబడిన తర్వాత ఈ పిచ్పై బ్యాటింగ్ చేయడం కష్టం. అందుకే పవర్ ప్లేలోపే వీలైనన్ని పరుగులు సాధించేందుకు ప్రయత్నించాము. మనందరం ప్రణాళికలు వేసుకుంటాము. కొన్ని వర్కౌట్ అవుతాయి. మరికొన్ని కావు. రషీద్ ఖాన్ను తన కోటా నాలుగు ఓవర్లు వేయించకపోవడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. వాస్తవానికి రషీద్ను ఆఖర్లో బౌలింగ్ చేయిద్దామనే అనుకున్నాను. కానీ పేసర్లు బాగా బౌలింగ్ చేస్తుండటంతో అతన్ని బరిలోకి దించలేదు. ప్రసిద్ద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. -
శుబ్మన్ గిల్ అరుదైన ఫీట్.. డేవిడ్ వార్నర్ రికార్డు బద్దలు
ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో ఒకే వేదికలో అతి తక్కువ ఇన్నింగ్స్లలో 1000 పరుగులు మైలు రాయిని అందుకున్న రెండో ప్లేయర్గా గిల్ నిలిచాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గిల్ వెయ్యి ఐపీఎల్ పరుగులను పూర్తి చేసుకున్నాడు.తద్వారా ఈ ఫీట్ను గిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, సన్రైజర్స్ మాజీ సారథి డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. వార్నర్ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ మైదానంలో 22 ఇన్నింగ్స్లలో 1000 పరుగులు మైలు రాయిని అందుకున్నాడు.తాజా మ్యాచ్తో వార్నర్ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. ఇక అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ అగ్రస్ధానంలో ఉన్నాడు. గేల్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 19 ఇన్నింగ్స్లలోనే ఈ ఫీట్ను అందుకున్నాడు. ఇక శుబ్మన్ గిల్ ఓవరాల్గా తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 105 మ్యాచ్లు ఆడి 3287 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 4 సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్లో గిల్ 38 పరుగులు చేసి ఔటయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది.తుది జట్లుముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, సత్యనారాయణ రాజు, ముజీబ్ ఉర్ రెహమాన్, ట్రెంట్ బౌల్ట్గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI: శుభమన్ గిల్ (కెప్టెన్), B సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫానే రూథర్ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణచదవండి: IND vs ENG: టీమిండియా కెప్టెన్గా శుబ్మన్ గిల్..!? -
టీమిండియా కెప్టెన్గా శుబ్మన్ గిల్..!?
ఐపీఎల్-2025 సీజన్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ టూర్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. పేలవ ఫామ్ కారణంగా ఇంగ్లండ్తో సిరీస్కు దూరంగా ఉండాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.రోహిత్ ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐ తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. అతడు ఇంకా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ఉన్నాడు. ఐపీఎల్-2025లో బుమ్రా ఆడేది అనుమానమే మారింది.బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరింత సమయం పట్టే అవకాశముంది. ఒకవేళ రోహిత్, బుమ్రా దూరమైతే.. ఇంగ్లండ్ పర్యటనలో భారత కెప్టెన్గా ఎవరు బాధ్యతలు చేపడాతరన్న ప్రశ్న అందరి మెదడలను తొలుస్తున్న ప్రశ్న. ఈ క్రమంలో రోహిత్, బుమ్రా బ్యాకప్గా శుబ్మన్ గిల్ పేరును సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.కాగా గిల్ ప్రస్తుతం వన్డేల్లో భారత జట్టు వైస్ కెప్టెన్గా ఉన్నాడు. అదేవిధంగా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇక భారత క్రికెట్ జట్టు ఏడాది జూన్ 20న ఇంగ్లాండ్ పర్యటనను ప్రారంభిస్తుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ హెడింగ్లీలోని లీడ్స్ వేదికగా జరుగనుంది.తదుపరి నాలుగు టెస్ట్లు ఎడ్జ్బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్, కెన్నింగ్టన్ ఓవల్ వేదికలపై జరగనున్నాయి. అంతకంటే ముందు భారత-ఎ జట్టు రెండు అనాధికారిక టెస్టు మ్యాచ్లు ఆడనుంది. ఐపీఎల్-2025 చివరి వారంలో ఇంగ్లండ్ టూర్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశముంది.చదవండి: సీఎస్కే బౌలర్ ‘ఓవరాక్షన్’.. ఇచ్చిపడేసిన కోహ్లి! నవ్వేసిన జడ్డూ -
ఐపీఎల్లో నేటి (మార్చి 29) మ్యాచ్.. ముంబైతో గుజరాత్ 'ఢీ'
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మార్చి 29) ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గుజరాత్ హోం గ్రౌండ్ నరేంద్ర మోదీ స్టేడియంలో (అహ్మదాబాద్) జరుగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నాయి.ఈ సీజన్లో ఇరు జట్లు తమ తొలి మ్యాచ్ల్లో ఓటమిపాలై నిరాశగా ఉన్నాయి. ముంబై సీఎస్కే చేతిలో.. గుజరాత్ పంజాబ్ చేతిలో పరాజయం పాలయ్యాయి. సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ముంబై బ్యాటింగ్లో దారుణంగా విఫలమైంది. జట్టు నిండా స్టార్లు ఉన్నా ఒక్కరు కూడా సామర్థ్యం మేరకు రాణించలేకపోయారు. రోహిత్ శర్మ డకౌట్ కాగా.. విదేశీ విధ్వంసకర ఆటగాళ్లు రికెల్టన్ (13), విల్ జాక్స్ (11) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. స్కై (29), తిలక్ వర్మ (31) పర్వాలేదనిపించినా అవి వారి స్థాయికి తగ్గ ఇన్నింగ్స్లు కావు. ఈ మ్యాచ్కు హార్దిక్ పాండ్యా దూరంగా ఉన్నాడు. గత సీజన్లో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ ఈ సీజన్ తొలి మ్యాచ్లో నిషేధం ఎదుర్కొన్నాడు. గుజరాత్తో నేటి మ్యాచ్కు హార్దిక్ అందుబాటులో ఉంటాడు. హార్దిక్ ఎంట్రీతో రాబిన్ మింజ్ తప్పుకోవాల్సి ఉంటుంది. సీఎస్కేతో మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్కు ఓ అణిముత్యం దొరికాడు. 24 ఏళ్ల స్పిన్నర్ విజ్ఞేశ్ పుతుర్ సీఎస్కేతో మ్యాచ్లో మ్యాజిక్ చేశాడు. కేరళకు చెందిన పుతుర్ జాతీయ స్థాయిలో ఎలాంటి మ్యాచ్లు ఆడకుండా నేరుగా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చి తన తొలి మ్యాచ్లో 3 వికెట్లు తీశాడు. సీఎస్కేతో మ్యాచ్లో ముంబైకు పుతుర్ అద్భుతమైన బౌలింగ్ మినహా ఎలాంటి ఊరట లభించలేదు. పుతుర్ రాణించినా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ముంబై బౌలర్లు చేతులెత్తేశారు. ట్రెంట్ బౌల్ట్, మిచెల్ సాంట్నర్ సామర్థ్యం మేరకు రాణించలేదు. ఈ మ్యాచ్లో దీపక్ చాహర్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలుత బ్యాటింగ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన చాహర్.. ఆతర్వాత బౌలింగ్లో ఓ వికెట్ తీశాడు. నేటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది.ర్యాన్ రికెల్టన్ (వికెట్కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు, విఘ్నేశ్ పుతుర్గుజరాత్ టైటాన్స్ విషయానికొస్తే.. ఈ జట్టు సీజన్ తొలి మ్యాచ్లో పంజాబ్ చేతిలో పరాజయంపాలైనప్పటికీ.. బ్యాటింగ్లో అదరగొట్టింది. భారీ లక్ష్య ఛేదనలో ఆ జట్టు టాపార్డర్ బ్యాటర్లు సాయి సుదర్శన్ (74), శుభ్మన్ గిల్ (33), బట్లర్ (54), రూథర్ఫోర్డ్ (46) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. మధ్య ఓవర్లలో గుజరాత్ బ్యాటర్లు కాస్త వేగంగా ఆడి ఉంటే ఈ మ్యాచ్లో ఆ జట్టు గెలిచేదే. ఈ మ్యాచ్లో ఆ జట్టు ప్రధాన బౌలర్లందరూ నిరాశపరిచారు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన సిరాజ్, రబాడ.. గుజరాత్ తురుపుముక్క రషీద్ ఖాన్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ప్రసిద్ద్ కృష్ణ అదే స్థాయిలో పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్లో సాయి కిషోర్ ఒక్కడే రాణించాడు. అతను 4 ఓవర్లలో కేవలం 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ముంబైతో జరుగబోయే నేటి మ్యాచ్లో గుజరాత్ జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది.శుభ్మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, కగిసో రబడ, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్హెడ్ టు హెడ్ రికార్డులు..ఐపీఎల్లో గుజరాత్, ముంబై ఇప్పటివరకు ఐదు సార్లు తలపడ్డాయి. ఇందులో గుజరాత్ 3, ముంబై రెండు మ్యాచ్ల్లో గెలుపొందాయి. గుజరాత్కు ముంబైపై సొంత మైదానంలో ఘనమైన రికార్డు ఉంది. ఆ జట్టు ముంబైపై సాధించిన మూడు విజయాలు అహ్మదాబాద్లో వచ్చినవే. ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే గెలుపొందాయి. అహ్మదాబాద్ పిచ్పై మరోసారి పరుగుల వరద పారడం ఖాయం. ఈ పిచ్పై గత మ్యాచ్లో పంజాబ్ 243 పరుగులు చేయగా.. ఛేదనలో గుజరాత్ 232 పరుగులు చేసింది. -
ఇదేం కెప్టెన్సీ గిల్? ఏమీ పట్టనట్టే ఉన్నావు ఎందుకు?: సెహ్వాగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) -2025 సీజన్ను గుజరాత్ టైటాన్స్ పరాజయంతో ప్రారంభించింది. తమ తొలి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో తలపడి పదకొండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా పంజాబ్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తొలి విజయం అందుకోగా.. గుజరాత్ సారథిగా శుబ్మన్ గిల్ (Shubman Gill)కు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది.శ్రేయస్ అటు బ్యాటర్గా.. ఇటు కెప్టెన్గా తనదైన ముద్ర వేయగా.. గిల్ మాత్రం రెండు పాత్రల్లోనూ తేలిపోయాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ గిల్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో గిల్ కెప్టెన్సీ తప్పిదాలే ఓటమికి పరోక్ష కారణాలంటూ విమర్శించాడు.పవర్ ప్లేలో బౌలర్ల మార్పులుముఖ్యంగా బౌలర్ల సేవలను వినియోగించుకోవడంలో గుజరాత్ సారథి విఫలమయ్యాడని వీరూ భాయ్ అభిప్రాయపడ్డాడు. ‘‘ఈ మ్యాచ్లో శుబ్మన్ గిల్ కెప్టెన్సీ అతడి స్థాయికి తగినట్లుగా లేదు. అసలు తను మైదానంలో చురుగ్గా ఉన్నట్లే కనిపించలేదు. సిరాజ్ బాగానే బౌలింగ్ చేస్తున్నాడులే అనుకునే సరికి.. అర్షద్ ఖాన్ను తీసుకువచ్చాడు.ఏమీ పట్టనట్టే ఉన్నావు ఎందుకు?అతడేమో పవర్ ప్లేలోనే ఏకంగా 21 పరుగులు ఇచ్చాడనుకుంటా! అదే పంజాబ్కు మొమెంటమ్ను ఇచ్చింది. ఒకవేళ సిరాజ్ గనుక కొత్త బంతితో రాణిస్తే.. అతడిని డెత్ ఓవర్ల వరకు వేచి ఉంచాల్సిన పనిలేదు. నిజం చెప్పాలంటే ఆఖర్లోనూ సిరాజ్ బౌలింగ్లో పంజాబ్ బ్యాటర్లు భారీగానే పరుగులు పిండుకున్నారు’’ అని వీరేంద్ర సెహ్వాగ్ క్రిక్బజ్ షోలో పేర్కొన్నాడు.కెప్టెన్గా పరిస్థితులకు తగ్గట్లు మార్పులు చేయాలని.. కానీ శుబ్మన్ గిల్ మాత్రం తనకేమీ పట్టదన్నట్లుగా ఉండిపోయాడని సెహ్వాగ్ ఈ సందర్భంగా విమర్శించాడు. ఓ బౌలర్ మెరుగ్గా రాణిస్తున్న వేళ.. అతడిని తప్పించి మరొకరిని తీసుకురావడం సరికాదని పేర్కొన్నాడు. గిల్ ఇకనైనా తన ప్రణాళికలు, వ్యూహాల అమలులలో పరిస్థితికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవాలని.. లేదంటే మున్ముందు గుజరాత్కు కష్టాలు తప్పవని పేర్కొన్నాడు.సిరాజ్ ధారాళంగాకాగా గుజరాత్ టైటాన్స్ తమ సొంతమైదానం అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్తో మంగళవారం మ్యాచ్ ఆడింది. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన టైటాన్స్.. పంజాబ్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో టైటాన్స్ బౌలింగ్ ఎటాక్ ఆరంభించిన టీమిండియా పేసర్ సిరాజ్.. తొలి ఓవర్లో కేవలం ఎనిమిది పరుగులే ఇచ్చాడు.మరుసటి ఓవర్లో సౌతాఫ్రికా స్పీడ్స్టర్ కగిసో రబడను గిల్ బరిలోకి దించగా.. అతడు 8 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ సిరాజ్ రంగంలోకి దిగి.. 12 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత రబడ ఓవర్లో తొలి వికెట్ దక్కించుకుంది టైటాన్స్.అయితే, వీరిద్దరిని పక్కనపెట్టిన గిల్.. ఐదో ఓవర్లో అర్షద్ ఖాన్ను తీసుకురాగా.. అతడు ఏకంగా 21 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక మళ్లీ పదిహేనో ఓవర్ దాకా గిల్ సిరాజ్ చేతికి బంతినివ్వలేదు. మళ్లీ ఆఖరి ఓవర్లో సిరాజ్ను రంగంలోకి దించగా.. ఈసారి ఏకంగా 23 పరుగులు ఇచ్చేశాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటాలో 54 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.శ్రేయస్ ధనాధన్ఈ నేపథ్యంలో సెహ్వాగ్ గిల్ కెప్టెన్సీ తీరుపై పైవిధంగా స్పందించాడు. ఇదిలా ఉంటే.. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. అరంగేట్ర ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(23 బంతుల్లో 47) మెరుపులు మెరిపించగా.. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ 42 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక మార్కస్ స్టొయినిస్ (15 బంతుల్లో 20) ఫర్వాలేదనిపించగా.. ఆఖర్లో శశాంక్ సింగ్ మెరుపులు(16 బంతుల్లోనే 44 నాటౌట్) మెరిపించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 243 పరుగులు నమోదు చేసింది. లక్ష్య ఛేదనను ఘనంగా ఆరంభించిన గుజరాత్.. ఆఖరి వరకు పోరాడి ఓడిపోయింది.టైటాన్స్ బ్యాటర్లలో ఓపెనర్ సాయి సుదర్శన్ (41 బంతుల్లో 74), జోస్ బట్లర్ (33 బంతుల్లో 54) అర్ధ శతకాలతో రాణించగా.. శుబ్మన్ గిల్(14 బంతుల్లో 33), షెర్ఫానే రూథర్ఫర్డ్(28 బంతుల్లో 46) వేగంగా ఆడే క్రమంలో వికెట్లు కోల్పోయారు. ఈ నేపథ్యంలో 232 పరుగులకే పరిమితమైన టైటాన్స్కు ఓటమి తప్పలేదు.చదవండి: అస్సలు జీర్ణించుకోలేకపోయా.. అయినా భాయ్కు అంతా తెలుసు: సిరాజ్Punjab Kings hold their nerves in the end to clinch a splendid win against Gujarat Titans ❤️Scorecard ▶ https://t.co/PYWUriwSzY#TATAIPL | #GTvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/0wy29ODStQ— IndianPremierLeague (@IPL) March 25, 2025 -
IPL 2025: అతడి యార్కర్లు అద్భుతం.. మా విజయావకాశాలను మేమే వదులుకున్నాం: గిల్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మార్చి 25) జరిగిన మ్యాచ్లో గుజరాత్పై పంజాబ్ 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ (97 నాటౌట్) సెంచరీ చేసే అవకాశం ఉన్నా, వదలుకుని తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆరంభంలో ప్రియాంశ్ ఆర్య, ఆఖర్లో శశాంక్ సింగ్ మెరుపు ఇన్నింగ్స్లు ఆడి పంజాబ్ భారీ స్కోర్ చేసేందుకు దోహద పడ్డారు.భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ కూడా అద్భుతంగా పోరాడింది. అయితే మధ్య ఓవర్లలో పంజాబ్ బౌలర్లు వారిని దెబ్బకొట్టారు. ఇన్నింగ్స్ 15, 16, 17 ఓవర్లలో గుజరాత్ కేవలం 18 పరుగులే చేయగలిగింది. ఇక్కడే ఆ జట్టు మ్యాచ్ను కోల్పోయింది. పంజాబ్ బౌలర్లలో విజయ్కుమార్ వైశాక్, అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. కీలక సమయంలో వరుస యార్కర్లతో విరుచుకుపడి గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశారు. గుజరాత్ తరఫున సాయి సుదర్శన్, రూథర్ఫోర్డ్ మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డారు. అయినా వారి మెరుపులు సరిపోలేదు. ఇన్నింగ్స్ మధ్యలో పరుగులు రాబట్టలేకపోవడమే గుజరాత్ కొంపముంచింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. శ్రేయస్ 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 97 పరుగులు (నాటౌట్), శశాంక్ 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 44 పరుగులు (నాటౌట్), ప్రియాంశ్ ఆర్య 23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశారు. మ్యాక్స్వెల్ డకౌట్ కాగా.. ఒమర్జాయ్ 16, స్టోయినిస్ 20 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 30 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీయగా.. రబాడ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ ఆటగాళ్లలో సాయి సుదర్శన్ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్ బట్లర్ (33 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రూథర్ఫోర్డ్ (28 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ 2, జన్సెన్, మ్యాక్స్వెల్ తలో వికెట్ పడగొట్టారు.మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ శుభ్న్ గిల్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మంచి అవకాశాలు లభించాయి. అయితే మేము వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం. చాలా పరుగులు ఇచ్చామని అనుకుంటున్నాను. మా విజయావకాశాలను చేజేతులా వదులుకున్నాం. 15, 16, 17 ఓవర్లలో కేవలం 18 పరుగులే చేసాము. మొదటి మూడు ఓవర్లు కూడా ఎక్కువ పరుగులు చేయలేకపోయాము. ఇక్కడే మేము ఆటను కోల్పోయాము. చాలా సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. సీజన్కు మంచి ప్రారంభం లభించిందని అనుకుంటున్నాను.విజయ్ కుమార్ వైశాక్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 15 ఓవర్లు బెంచ్పై కూర్చొని, ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి యార్కర్లు వేయడం అంత సులభం కాదు. వరుసగా యార్కర్లు వేయగలిగినందుకు వారికి (పంజాబ్ బౌలర్లు) క్రెడిట్ ఇవ్వాలి. ఈ వికెట్ బ్యాటింగ్ చేసేందుకు చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఈజీగా 240-250 పరుగులు స్కోర్ చేయవచ్చు. అయితే ఆ స్కోర్ను కాపాడుకోవాల్సి ఉంటుంది. -
హైస్కోరింగ్ థ్రిల్లర్లో గుజరాత్పై పంజాబ్ గెలుపు
GT vs PBKS Live Updates And highlights: గుజరాత్పై పంజాబ్ విజయంఐపీఎల్-2025ను గుజరాత్ విజయంతో ఆరంభించింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్లో 11 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(74), జోస్ బట్లర్(54) రూథర్ ఫర్డ్(46) పోరాడినప్పటకి తమ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. కెప్టెన్ శుబ్మన్ గిల్(33) తన వంతు ప్రయత్నం చేశాడు. కానీ కొండంత లక్ష్యాన్ని కరిగించలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ రెండు, జానెసన్, మాక్స్వెల్ తలా వికెట్ సాధించారు.17 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 187/217 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ రెండు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(47), రూథర్ ఫర్డ్(23) పరుగులతో ఉన్నారు.15 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 174/215 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ రెండు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(40), రూథర్ ఫర్డ్(20) పరుగులతో ఉన్నారు.సుదర్శన్ ఆన్ ఫైర్..12 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 134 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(74), జోస్ బట్లర్(25) ఉన్నారు. గుజరాత్ విజయానికి 46 బంతుల్లో 106 పరుగులు కావాలి.తొలి వికెట్ డౌన్..శుబ్మన్ గిల్ రూపంలో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన గిల్.. మాక్స్వెల్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి జోస్ బట్లర్ వచ్చాడు. 7 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 75/1దూకుడుగా ఆడుతున్న గుజరాత్ ఓపెనర్లు..245 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ దూకుడుగా ఆడుతోంది. 5 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ శుబ్మన్ గిల్(27), సాయిసుదర్శన్(23) ఉన్నారు.శ్రేయస్, శశాంక్ విధ్వంసం.. గుజరాత్ ముందు భారీ టార్గెట్అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్( 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్లతో 97) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ ఐదో వికెట్ డౌన్.. స్టోయినిష్ ఔట్మార్కస్ స్టోయినిష్ రూపంలో పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన స్టోయినిష్.. సాయికిషోర్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 16 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 165/5. క్రీజులో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(66) పరుగులతో ఉన్నాడు.కిషోర్ ఆన్ ఫైర్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లుపంజాబ్ కింగ్స్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. 11 ఓవర్ వేసిన సాయికిషోర్ బౌలింగ్లో మూడో బంతికి ఒమర్జాయ్(16), నాలుగో బంతికి గ్లెన్ మాక్స్వెల్(0) ఔటయ్యాడు. 12 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 108/4పంజాబ్ రెండో వికెట్ డౌన్..ప్రియాంష్ ఆర్య రూపంలో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 20 బంతుల్లో 42 పరుగులు చేసిన ప్రియాంష్.. రషీద్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(14), ఒమర్జాయ్(6) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన ప్రభుసిమ్రాన్.. రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాంష్ ఆర్య(17), శ్రేయస్ అయ్యర్(14) పరుగులతో ఉన్నారు.ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గుజరాత్ తరపున అరంగేట్రం చేశాడు.తుది జట్లుపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, సూర్యాంశ్ షెడ్జ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ -
అస్సలు జీర్ణించుకోలేకపోయా.. అయినా భాయ్కు అంతా తెలుసు: సిరాజ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో కొత్త ఫ్రాంఛైజీ తరఫున ఆడబోతున్నాడు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్. దాదాపు ఏడేళ్ల పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కి ఆడిన ఈ హైదరాబాదీని.. మెగా వేలానికి ముందు ఆ ఫ్రాంఛైజీ వదిలేసింది. ఈ క్రమంలో రూ. 12.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సిరాజ్ను కొనుగోలు చేసింది.బౌలర్ల కెప్టెన్ఇక ఐపీఎల్-2025లో తమ తొలి మ్యాచ్లో భాగంగా గుజరాత్ మంగళవారం పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ‘బోరియా సీజన్ సిక్స్’తో ముచ్చటించిన సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘శుబ్మన్ గిల్ (Shubman Gill) బౌలర్ల కెప్టెన్. గొప్ప సారథి.బౌలర్లు ఏది అడిగినా.. కాదనడు. వాళ్లకు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తాడు. స్వేచ్ఛనిస్తాడు. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. నేను, రిషభ్ పంత్, శుబ్మన్, అక్షర్ పటేల్.. కలిసి తరచుగా డిన్నర్లకు వెళ్తూ ఉంటాం. గిల్, నేను ఒకేసారి టెస్టుల్లో అడుగుపెట్టాము. అందుకే మా బంధం ఇంతగా బలపడి ఉంటుంది’’ అని గిల్తో తనకున్న స్నేహం గురించి చెప్పుకొచ్చాడు.ఆయనొక లెజెండ్ఇక గుజరాత్ కోచ్ ఆశిష్ నెహ్రా గురించి మాట్లాడుతూ.. ‘‘ఆయనొక లెజెండ్. నెహ్రా భాయ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకుండా ఎలా ఉండాలో ఆయనను చూసే తెలుసుకున్నా. గతంలో షమీ భాయ్ ఈ ఫ్రాంఛైజీకి ఆడాడు.నేను కూడా తనలా అద్భుతంగా ఆడి వికెట్లు తీయడం మీద మాత్రమే దృష్టి పెట్టాను. జట్టు విజయాల కోసం నా శాయశక్తులా కృషి చేస్తా’’ అని సిరాజ్ పేర్కొన్నాడు. ఇక ఈ సందర్భంగా చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులో చోటు దక్కకపోవడం గురించి ప్రస్తావన రాగా.. ఈ హైదరాబాదీ పేసర్ హుందాగా స్పందించాడు.అస్సలు జీర్ణించుకోలేకపోయా.. ‘‘జట్టు గురించి ప్రకటన రాగానే తొలుత ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను. ఐసీసీ ఈవెంట్ ఆడే జట్టులో నాకు చోటు లేదే అని బాధపడ్డాను. అయితే, జట్టు ప్రయోజనాల గురించే రోహిత్ భాయ్ ఆలోచిస్తాడని నాకు తెలుసు.దుబాయ్లో పేసర్లకు పెద్దగా పని ఉండదని భాయ్కు తెలుసు. ఆయన ఎంతో అనుభవజ్ఞుడైన కెప్టెన్. అక్కడి పిచ్లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయని ఆయనకు తెలుసు. అందుకే నన్ను పక్కనపెట్టాలని వాళ్లు నిర్ణయించుకున్నారు’’ అని సిరాజ్ పేర్కొన్నాడు.విశ్రాంతి దొరికిందిఏదేమైనా దేశం కోసం ఆడేటప్పుడు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుందని.. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ కోరుకుంటాడని సిరాజ్ అన్నాడు. ఇక చాంపియన్స్ట్రోఫీ జట్టులో లేనందు వల్ల తనకు చాలాకాలం పాటు విశ్రాంతి లభించిందని.. ఆ సమయాన్ని ఫిట్నెస్ మెరుగుపరచుకునేందుకు ఉపయోగించుకున్నానని తెలిపాడు.కాగా పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడింది. ఇక ఈ మెగా వన్డే టోర్నమెంట్లో గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్లను ఓడించిన రోహిత్ సేన.. సెమీస్లో ఆస్ట్రేలియాపై గెలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది.ఇక సిరాజ్ చివరగా ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ ఆడాడు. తదుపరి జూన్లో ఇంగ్లండ్ టూర్కు వెళ్లే జట్టుకు అతడు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇక మళ్లీ పరిమిత ఓవర్ల జట్టులో తిరిగి స్థానం సంపాదించాలంటే సిరాజ్ మియా.. ఐపీఎల్-2025లో సత్తా చాటాల్సి ఉంటుంది.చదవండి: ‘గిల్ ఒక్కడే ఏమీ చేయలేడు.. మేమంతా ఉంటేనే ఏదైనా సాధ్యం’ -
‘గిల్ ఒక్కడే ఏమీ చేయలేడు.. మేమంతా ఉంటేనే ఏదైనా సాధ్యం’
న్యూజిలాండ్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill)ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతేడాది టైటాన్స్ వైఫల్యాలకు అతడు ఏమాత్రం కారణం కాదని పేర్కొన్నాడు. కెప్టెన్ ఒక్కడి ప్రదర్శన మీద జట్టు జయాపజయాలు ఆధారపడి ఉండవని.. ఆటగాళ్లంతా సమిష్టిగా రాణిస్తేనే గెలుపు వరిస్తుందని ఫిలిప్స్ అన్నాడు.అరంగేట్ర సీజన్లోనే చాంపియన్గాకాగా 2022లో గుజరాత్ టైటాన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా సారథ్యంలో.. తమ అరంగేట్ర సీజన్లోనే చాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాతి ఏడాది ఫైనల్ చేరింది. అయితే, 2024లో పాండ్యా టైటాన్స్ను వీడి తన సొంతజట్టు ముంబై ఇండియన్స్లో చేరాడు. ఫలితంగా టైటాన్స్ పగ్గాలను యాజమాన్యం భారత యువ తార గిల్కు అప్పగించింది.పేలవ ప్రదర్శన అయితే, గతేడాది తొలిసారిగా గిల్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ పేలవ ప్రదర్శన కనబరిచింది. పద్నాలుగు మ్యాచ్లకు గానూ కేవలం ఐదే గెలిచి.. పది పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. పాండ్యా జట్టును వీడటంతో పాటు మహ్మద్ షమీ (అప్పుడు టైటాన్స్ జట్టులో) గాయం వల్ల సీజన్ మొత్తానికి దూరం కావడం టైటాన్స్ ప్రదర్శనపై ప్రభావం చూపింది.అయితే, ఈసారి తాము ఆ ప్రతికూలతలు అధిగమించి అనుకున్న ఫలితాలు రాబడతామని గిల్ స్పష్టం చేశాడు. తమ జట్టు ప్రస్తుతం అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో గ్లెన్ ఫిలిప్స్ హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ.. ‘‘క్రికెట్ జట్టుగా ఆడాల్సిన ఆట.గిల్ ఒక్కడే ఏమీ చేయలేడు.. మేమంతా ఉంటేనే ఏదైనా సాధ్యంఒక్క ఆటగాడు లేదా కెప్టెన్ జట్టు మొత్తాన్ని గెలిపించలేదు. కాబట్టి శుబ్మన్ గిల్ కెప్టెన్సీ వల్లే గతేడాది గుజరాత్ ప్రదర్శన బాలేదని చెప్పడం సరికాదు. టీ20 క్రికెట్ స్వరూపమే వేరు. మ్యాచ్ రోజు ఎవరు ఫామ్లో ఉంటారో వారిదే పైచేయి అవుతుంది. గతేడాది సన్రైజర్స్, కేకేఆర్ సీజన్ ఆసాంతం ఒకే లయను కొనసాగించి ఫైనల్ వరకు చేరాయి.ఏదేమైనా తమ తొలి రెండు సీజన్లలో గుజరాత్ అద్భుతంగా ఆడింది. మంచి ఫామ్ కనబరిచింది. ఈ ఏడాది అదే ఫలితాన్ని పునరావృతం చేయగలమని నమ్ముతున్నా. శుబ్మన్ గిల్ కెప్టెన్సీ విషయంలో ఒత్తిడికి గురవుతాడని నేను అస్సలు అనుకోను. అతడు టీమిండియా ప్రధాన ప్లేయర్. జాతీయ జట్టుకు ఆడటం కంటే లీగ్ క్రికెట్లో ఆడటం తేలికే’’ అని గిల్కు ఫిలిప్స్ మద్దతు ప్రకటించాడు.రూ. 2 కోట్లకు కొనుగోలుకాగా 2021లో గ్లెన్ ఫిలిప్స్ను రాజస్తాన్ రాయల్స్ కొనుక్కోగా.. ఆ మరుసటి ఏడాది సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 1.5 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది. కానీ తుదిజట్టులో మాత్రం ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదు. ఈ క్రమంలో మెగా వేలం-2025కి ముందు రైజర్స్ అతడిని విడిచిపెట్టింది. దీంతో గుజరాత్ టైటాన్స్ రూ. 2 కోట్లకు అతడిని వేలంపాటలో కొనుక్కుంది.ఇక ఇప్పటి వరకు ఐపీఎల్లో కేవలం ఎనిమిది మ్యాచ్లు ఆడిన ఫిలిప్స్ 65 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్ మంగళవారం తమ తొలి మ్యాచ్లో భాగంగా పంజాబ్ కింగ్స్ను ఢీకొట్టనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: అలా అయితే.. నేను జట్టులో ఉండటం వేస్ట్: ధోని -
సాహసోపేత నిర్ణయాలు.. టైటాన్స్ ఈసారి విజృంభిస్తుందా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లోకి అడుగుపెట్టిన తొలి సీజన్లోనే (2022)లో టైటిల్ సాధించి తనదైన ముద్రవేసింది గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans). ఆ తర్వాత సీజన్లో మళ్ళీ ఫైనల్లోకి ప్రవేశించింది. కానీ టైటిల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమితో రన్నర్ అప్ తో సరిపెట్టుకుంది. అయితే, గతేడాది గుజరాత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టుకి స్ఫూర్తిదాయకంగా నిలిచి ముందుండి నడిపించిన భారత్ అల్ రౌండర్, జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్కు బదిలీ అయ్యాడు.ఈ మార్పుతో భారత్ యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ (Shubman Gill)కు కెప్టెన్గా పగ్గాలు అప్పగించారు. కానీ గత సీజన్ గుజరాత్ కి పెద్దగా కలిసిరాలేదు. కేవలం 5 విజయాలు, 7 ఓటములతో గుజరాత్ 8వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనితో కొత్త సీజన్ కోసం గుజరాత్ కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది.భారత్ సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, దక్షిణాఫ్రికాకి చెందిన డేవిడ్ మిల్లర్ వంటి సీనియర్ ఆటగాళ్ళని పక్కకుపెట్టాలని నిర్ణయించారు. ఇందుకు బదులుగా కొత్త తరహా జట్టుని నిర్మించాలని నిర్ణయించారు. ప్రపంచ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్ల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలని నిర్ణయించుకుంది.మాజీ ఆరెంజ్ క్యాప్ విజేత జోస్ బట్లర్, దక్షిణాఫ్రికా పేస్ స్పియర్హెడ్ కగిసో రబాడను దక్కించుకోవడానికి గుజరాత్ పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ లో తన వీరోచిత ప్రదర్శనలతో అందరినీ ఆశ్చర్యపరిచిన గ్లెన్ ఫిలిప్స్ను కూడా తీసుకున్నారు.వేలంలో గుజరాత్ ఎలా రాణించింది?ఐపీఎల్ 2025 మెగా వేలంలో గుజరాత్ చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించింది. గిల్, రాహుల్ తెవాటియా, సాయి సుదర్శన్ మరియు షారుఖ్ ఖాన్లతో పాటు రషీద్ ఖాన్ను వేలానికి ముందు రెటైన్ చేసింది. వేలంలో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ని రూ 15.75 కోట్లు కు కనుగోలు చేసారు.ఇంకా భారత్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ( (రూ12.25 కోట్లు), రబాడ (రూ 10.75 కోట్లు) మరియు ప్రసిధ్ కృష్ణ (రూ 9.5 కోట్లు) ముగ్గురితో పేస్ బౌలింగ్ ని బలోపేతం చేశారు. గత సీజన్లో వారికి సమస్యగా ఉన్న రంగాల కోసం భారీగా ఖర్చు చేశారు. ఇక మిల్లర్ స్థానంలో జిటి ఫిలిప్స్ మరియు షెర్ఫేన్ రూథర్ఫోర్డ్లను జట్టులోకి తీసుకువచ్చారుగుజరాత్ టైటాన్స్ జట్టులో ప్రధాన ఆటగాళ్లుశుబ్మన్ గిల్ఒకప్పుడు భారత టీ20ఐ జట్టులో ప్రధాన ఆటగాళ్లలో ఒకడైన గిల్ ఇప్పుడు మునుపటి రీతిలో రాణించలేక పోతున్నాడన్నది వాస్తవం. 2023 ఐపీఎల్ లో చెలరేగిపోయిన గిల్ దాదాపు 900 పరుగులు సాధించాడు.గత సీజన్ను ఆశాజనకంగా ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత అతని ఫామ్ తగ్గింది . 2024లో తన మొదటి ఆరు మ్యాచ్ల్లో 151.78 స్ట్రైక్ రేట్తో 255 పరుగులు చేశాడు, కానీ ఆ తర్వాత 147.40 సగటుతో 426 పరుగులు చేశాడు. ఈ సీజన్లో గిల్ మళ్ళీ మునుపటి ఫామ్ ని ప్రదర్శించాలని, జట్టుని విజయ బాటలో నడిపించాలని కృత నిశ్చయంతో ఉన్నాడు.జోస్ బట్లర్జట్టులో అత్యంత ఖరీదైన ఆటగాడు కావడంతో, బట్లర్ పై అందరి దృష్టి ఉంటుందనడంలో సందేహం లేదు. 2022 ఐపిఎల్ లో ఏకంగా 863 పరుగులు చేసిన తర్వాత, బట్లర్ 2023 మరియు 2024 సీజన్లలో 400 కి మించి పరుగులు చేయలేకపోయాడు. అయితే గత సంవత్సరం ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా పై జరిగిన ఫైనల్లో 224 పరుగుల లక్ష్యం సాధించడంలో బట్లర్ చేసిన సెంచరీ లీగ్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్నింగ్స్లలో ఒకటిగా నిలిచింది. బట్లర్ ఈ సీజన్ లో గిల్ తో కలిసి గుజరాత్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశముంది. లేదా గత సీజన్లో లేని ఫైర్పవర్ను అందించడానికి 3వ స్థానంలోకి వస్తాడని భావిస్తున్నారు. అదనంగా అతన్ని స్టంప్స్ వెనుక కూడా చూడవచ్చు.రషీద్ ఖాన్గాయం నుంచి ఇప్పుడు పూర్తిగా కోలుకున్న ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మరోసారి గుజరాత్కు ట్రంప్ కార్డ్ గా భావించవచ్చు. గత సీజన్లో, రషీద్ శస్త్రచికిత్స నుండి కోలుకుంటున్నందున తన పూర్తి స్థాయిలో ఆడలేక పోయాడు. ఈసారి మాత్రం గుజరాత్ టైటిల్ సాధించాలన్న ఆశయాన్ని సాధించడంలో రషీద్ పెద్ద పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు.కగిసో రబాడపంజాబ్ కింగ్స్ తరుపున ఆది కాస్త నిరాశబరిచిన కగిసో రబాడ ఇప్పుడు గుజరాత్ జట్టులో చేరడంతో కోచ్ ఆశిష్ నెహ్రా ఆధ్వర్యంలో మళ్ళీ పుంజుకోగలడని భావిస్తున్నారు.మహ్మద్ సిరాజ్ఇటీవలి కాలంలో పెద్దగా రాణించలేక పోతున్న హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ కి మళ్ళీ మునుపటి వైభవం సాధించడానికి ఐపీఎల్ మంచి అవకాశం కల్పిస్తోంది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు లో స్థానం పొందలేకపోయిన సిరాజ్ తన విమర్శకులను సమాధానము చెప్పాలని, తన కెరీర్ను తిరిగి ట్రాక్లోకి తీసుకురావాలని పట్టుదలతో ఉన్నాడు.గుజరాత్ టైటాన్స్ జట్టురషీద్ ఖాన్, శుబ్మాన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, కగిసో రబాడ, జోస్ బట్లర్. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నిషాంత్ సింధు, మహిపాల్ లోమ్రోర్, కుమార్ కుషాగ్ర, అనుజ్ రావత్, మానవ్ సుతార్, వాషింగ్టన్ సుందర్, జెరాల్డ్ కోట్జీ, అర్షద్ ఖాన్, గుర్నూర్ బ్రార్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, సాయి కిషోర్, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్, కరీం జనత్, కుల్వంత్ ఖేజ్రోలియా. చదవండి: విధ్వంసకర వీరులు.. పంత్కు పగ్గాలు.. లక్నో ఫైనల్ చేరుతుందా? -
ఐపీఎల్-2025 ప్రారంభానికి ముందు గుజరాత్ కెప్టెన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఐపీఎల్-2025 ప్రారంభానికి ముందు గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సారథ్యాన్ని, బ్యాటింగ్ను విడివిడిగా చూడగలిగితేనే విజయవంతమవుతామని అభిప్రాయపడ్డాడు. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 18వ సీజన్లో గిల్ గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ... ‘కెప్టెన్సీని, బ్యాటింగ్ను వేర్వేరుగా ఉంచాలి. అప్పుడే విజయవంతం కాగలం. క్రీజులో అడుగుపెట్టినప్పుడు కేవలం బ్యాటింగ్పైనే దృష్టి పెడతా. నా అనుభవంలో ఇదే నేర్చుకున్నా. ఫీల్డ్లో ఉన్నప్పుడు మాత్రం కెప్టెన్గా మరింత బాధ్యతగా వ్యవహరిస్తా’ అని అన్నాడు.2023 సీజన్లో టైటాన్స్ తరఫున హార్దిక్ పాండ్యా సారథ్యంలో బరిలోకి దిగిన గిల్ 890 పరుగులతో సత్తా చాటాడు. ఇక గత ఏడాది సారథిగా బాధ్యతలు తీసుకున్న గిల్ 426 పరుగులు చేశాడు. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే అతడి స్ట్రయిక్రేట్ 10 శాతం తగ్గింది. ‘సారథిగా ప్రతి రోజు నేర్చుకుంటూనే ఉంటా. అదే ఒక ఆటగాడిగా, కెప్టెన్గా నన్ను మరింత మెరుగు పరుస్తుందని నమ్ముతున్నా. కోచ్ ఆశిష్ నెహ్రా, విక్రమ్ సోలంకి సూచనలతో ముందుకు సాగుతున్నా. ఇంటా బయట అనే తేడా ఏమీ లేదు. మంచి లయలో ఉంటే వేదికతో సంబంధం ఉండదు. గత మూడేళ్ల ఫలితాలు పరిశీలిస్తే లీగ్లో అత్యధిక విజయాల శాతం మా జట్టుదే. దాన్నే కొనసాగిస్తే ఈ సీజన్ను కూడా చిరస్మరణీయం చేసుకోగలం’ అని వివరించాడు. మ్యాచ్లు గెలవాలంటే భారీ స్కోర్లు చేయడం మాత్రమే కాదని... పిచ్, పరిస్థితులకు తగ్గట్లు ఆడటం ముఖ్యమని పేర్కొన్నాడు. కాగా, ఈ సీజన్లో గుజరాత్ తమ తొలి మ్యాచ్లో (మార్చి 25) పంజాబ్ కింగ్స్ను ఢీకొట్టనుంది. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్.. ఈ సీజన్లో కొత్తగా కనిపిస్తుంది. జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి విధ్వంసకర బ్యాటర్ల చేరికతో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం ప్రమాదకరంగా కనిపిస్తుంది. శుభ్మన్ గిల్ నేతృత్వంలో ఆ జట్టు టైటిల్ గెలిచేందుకు ఉరకలేస్తుంది. గుజరాత్ బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తుంది. రబాడ, సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ద్ కృష్ణ, గెరాల్డ్ కొయెట్జీ లాంటి అంతర్జాతీయ స్థాయి పేసర్లతో కళకళలాడుతుంది. ప్రపంచ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్ జట్టులో ఉండనే ఉన్నాడు. అతనితో పాటు కొత్తగా వాషింగ్టన్ సుందర్ చేరాడు. దేశీయ ఆటగాళ్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాతియా, షారుఖ్ ఖాన్, మహిపాల్ లోమ్రార్ గుజరాత్కు అదనపు బలాన్ని ఇస్తున్నారు.గుజరాత్ టైటాన్స్శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాతియా, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, రషీద్ ఖాన్, మహిపాల్ లోమ్రార్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, షారుఖ్ ఖాన్, నిషాంత్ సింధు, అర్షద్ ఖాన్, కరీమ్ జనత్, వాషింగ్టన్ సుందర్, జయంత్ యాదవ్, జోస్ బట్లర్, కుమార్ కుషాగ్రా, అనూజ్ రావత్, గెరాల్డ్ కొయెట్జీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, ఇషాంత్ శర్మ, కగిసో రబాడ, కుల్వంత్ కేజ్రోలియా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ -
నేను క్రికెటర్ అవడానికి కారణం సచిన్ సర్: శుబ్మన్ గిల్
టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సన్నాహకాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన ఈ పంజాబీ బ్యాటర్.. ఈసారి కూడా జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2025 ఆరంభానికి ముందు గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.మరింత వినోదాత్మకంగాఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల జట్లకు అదనపు ప్రయోజనం కలుగుతుందని శుబ్మన్ గిల్ అభిప్రాయపడ్డాడు. ఈ రూల్ కారణంగా అదనపు బ్యాటర్ లేదంటే బౌలర్ సేవలను ఉపయోగించుకునేందుకు వీలుగా ఉంటుందని.. ఈసారి స్కోర్లు 300 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని పేర్కొన్నాడు. ఈ నిబంధన ఐపీఎల్ను మరింత వినోదాత్మకంగా మార్చిందని గిల్ జియోహాట్స్టార్ షోలో వ్యాఖ్యానించాడు. అదే విధంగా.. ఐపీఎల్తో ముడిపడిన తన చిన్ననాటి జ్ఞాపకాలను ఈ సందర్భంగా గిల్ గుర్తు చేసుకున్నాడు. ‘‘పంచకులలోని తౌ దేవి లాల్ స్టేడియానికి మా నాన్నతో కలిసి మూడు, నాలుగు మ్యాచ్లకు వెళ్లాను. నాకు తెలిసి అప్పటికి ఐపీఎల్ మొదలై మూడేళ్లు గడిచి ఉంటాయి.నేను క్రికెటర్ అవడానికి కారణం సచిన్ సర్అప్పట్లో ముంబై ఇండియన్స్ జట్టు అక్కడ ప్రాక్టీస్ చేసేందుకు వచ్చింది. నాకప్పుడు తొమ్మిదేళ్లు ఉంటాయనుకుంటా.. సచిన్ సర్తో గ్లెన్ మాక్స్వెల్తో నేను ఫొటో తీసుకున్నా.వాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నపుడు బాల్స్ త్రో చేసేవాడిని. ఐపీఎల్తో నాకున్న తొలి జ్ఞాపకం అదే. సచిన్ సర్ గురించి నాకు ముందు నుంచే తెలుసు. ఆయనను చూసే నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను.మా నాన్న ఆయనకు వీరాభిమానిఇక మా నాన్న అయితే.. సచిన్ సర్కి వీరాభిమాని. మా గ్రామంలో ఎక్కడ చూసినా ఆయన పోస్టర్లే కనిపించేవి’’ అని శుబ్మన్ గిల్ తెలిపాడు. ఇక కెప్టెన్సీ అనేది ఓ నిరంతర ప్రయాణమన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. నాయకుడిగా భిన్న అనుభవాలు ఎదుర్కోక తప్పదని పేర్కొన్నాడు.జట్టులోని ప్రతి ఒక్క సభ్యుడి నైపుణ్యాలపై అవగాహన పెంచుకుని.. వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకున్న వారే నాయకులుగా రాణిస్తారని గిల్ అన్నాడు. ప్రతి మ్యాచ్ సరికొత్తగా ఉంటుందని.. ఆటగాళ్ల బలాలు, బలహీనతలు అర్థం చేసుకుంటే.. వారి సేవలు ఎలా వినియోగించుకోవాలో తెలుస్తుందని పేర్కొన్నాడు. కెప్టెన్గా అనుభవం గడించినపుడే..ఇక సారథిగా చేసే ప్రయాణంలో అనుభవం గడిస్తున్న కొద్దీ మరింత రాటుదేలతామని.. అయితే, ఒక్కోసారి కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. అలాంటపుడు సంయమనంతో ముందుకు సాగితే ప్రతికూల ప్రభావం పడదని గిల్ చెప్పుకొచ్చాడు. టైటాన్స్ పగ్గాలు చేపట్టిన కొత్తల్లో తాను సహచర ఆటగాళ్లతో ఎక్కువగా మమేకం కాలేకపోయానన్న.. అయితే, నాయకుడిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చే క్రమంలో తనకు తెలియకుండానే ఎంతో మారిపోయానని పేర్కొన్నాడు. ప్రతి ఒక్క ఆటగాడితో వ్యక్తిగతంగా మాట్లాడటం.. వారి మైండ్సెట్ను అర్థం చేసుకోవడం అలవాటు చేసుకున్నానని గిల్ తెలిపాడు.చదవండి: BCCI: విరాట్ కోహ్లి ఘాటు విమర్శలు.. స్పందించిన బీసీసీఐ -
సచిన్ కూతురుకి హ్యాండ్ ఇచ్చిన గిల్..!
-
శుబ్మన్ గిల్కు ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు.. బుమ్రా రికార్డు బ్రేక్!
టీమిండియా స్టార్ క్రికెటర్ శుబ్మన్ గిల్ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’(ICC Player of the Month) అవార్డు గెలుచుకున్నాడు. ఫిబ్రవరి నెలకు గానూ ఈ పురస్కారానికి అతడు ఎంపికయ్యాడు. తద్వారా ఇప్పటి వరకు అత్యధికసార్లు ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలిచిన తొలి భారత క్రికెటర్గా గిల్ నిలిచాడు.ట్రోఫీ గెలిచిన టీమిండియా..కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ అదరగొట్టిన విషయం తెలిసిందే. గత నెల 19న పాకిస్తాన్లో మొదలైన ఈ మెగా వన్డే టోర్నమెంట్.. దుబాయ్లో మార్చి 9న టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఫైనల్తో ముగిసింది. ఇక ఈ ఈవెంట్లో రోహిత్ సేన తమ మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడింది.గిల్ అదరగొట్టాడుగ్రూప్ దశలో వరుసగా మూడు గెలిచి సెమీస్ చేరిన భారత్.. అనంతరం సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో కివీస్ జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్గా నిలిచింది. ఐదు మ్యాచ్లలోనూ అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది.భారత్ ఈ ఘనత సాధించడంలో గిల్ది కూడా కీలక పాత్ర. ఈ టోర్నీలో బంగ్లాదేశ్పై 101 పరుగులు సాధించిన గిల్.. పాకిస్తాన్తో మ్యాచ్లో 46 పరుగులు చేశాడు. అంతకు ముందు ఇంగ్లండ్తో వన్డే సిరీస్(India vs England)లోనూ గిల్ అదరగొట్టాడు. మూడు మ్యాచ్లలో వరుసగా 87, 60, 112 పరుగులు సాధించాడు.వారిని ఓడించిఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఫిబ్రవరి నెలకు నామినేట్ అయ్యాడు గిల్. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ కూడా ఈ అవార్డు కోసం పోటీపడ్డారు. వారిద్దరిని ఓడించి అత్యధిక ఓట్లతో గిల్ విజేతగా నిలిచాడు.బుమ్రా రికార్డు బ్రేక్ఇక గిల్ ఈ అవార్డు గెలవడం ఇది మూడోసారి. 2023 జనవరి, సెప్టెంబర్ నెలలకు గానూ గిల్ గతంలో ప్లేయర్ ఆఫ్ ది మంత్గా నిలిచాడు. అంతకు ముందు భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండుసార్లు ఈ పురస్కారం పొందాడు. అయితే, గిల్ ఇప్పుడు బుమ్రాను అధిగమించి ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు అందుకున్న భారత క్రికెటర్లు వీరే👉శుబ్మన్ గిల్- మూడుసార్లు👉జస్ప్రీత్ బుమ్రా- రెండుసార్లు👉రిషభ్ పంత్- ఒకసారి👉రవిచంద్రన్ అశ్విన్- ఒకసారి👉భువనేశ్వర్ కుమార్- ఒకసారి👉శ్రేయస్ అయ్యర్- ఒకసారి👉విరాట్ కోహ్లి- ఒకసారి👉యశస్వి జైస్వాల్- ఒకసారి.టాప్లోనే గిల్మరోవైపు.. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో గిల్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ మూడో ర్యాంకు సాధించాడు. మరోవైపు.. విరాట్ కోహ్లి ఐదో స్థానంలో నిలిచాడు.చదవండి: IND vs ENG: గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఇంత వరకు ఏ కోచ్ చేయని విధంగా.. -
హీరోయిన్తో శుభ్మన్ గిల్ డేటింగ్.. ఆ ఒక్క ఫోటో వల్లే !
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని మరోసారి సగర్వంగా ముద్దాడింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్గా నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన తుదిపోరులో న్యూజిలాండ్పై ఘనవిజయం సాధించిన. కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ ఫైనల్ మ్యాచ్లో నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో విజయం భారత్ను వరించింది. దీంతో టీమిండియా ఖాతాలో మరో ఐసీసీ ట్రోఫీ వచ్చి చేరింది. దుబాయ్లో జరిగిన పలువురు బాలీవుడ్ సినీ తారలు సైతం ఈ మ్యాచ్ను వీక్షించారు.అయితే ఈ మ్యాచ్ తర్వాత భారత ఓపెనర్ బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అవనీత్ కౌర్తో శుభ్మన్ గిల్ డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ చూసిన ఫోటోలను అవనీత్ కౌర్ ఇన్స్టాలో పంచుకుంది. అయితే ఆ ఫోటోలు భారత్- ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్ సందర్బంగా అవనీత్ కౌర్ తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది.తాజాగా టీమిండియా కప్ గెలవడంతో మరోసారి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అంతేకాకుండా గతేడాది శుభ్మన్ బర్త్ డే సందర్భంగా అవనీత్ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపింది. గిల్తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. దీంతో వీరిద్దరిపై మరోసారి డేటింగ్పై చర్చ మొదలైంది. ఈ రూమర్స్ నేపథ్యంలో ఆమె రాఘవ్ శర్మ అనే నిర్మాతతో డేటింగ్ చేస్తున్నట్లు కొందరు అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కాగా.. క్రికెటర్ గిల్పై గతంలో కూడా సారా అలీ ఖాన్తో పాటు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్తో రిలేషన్లో ఉన్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.కాగా.. 26 ఏళ్ల అవనీత్ కౌర్ బాలీవుడ్లో పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ల్లోనూ కనిపించింది. ఎనిమిదేళ్ల వయసులో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అవనీత్ కౌర్ మొదటిసారిగా 2010లో 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ షోలో కనిపించింది. ఆ తర్వాత ఆమె 'డ్యాన్స్ కే సూపర్స్టార్స్'లో పాల్గొంది. ఆ తర్వాత 2012లో 'మేరీ మా' టీవీ షోతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఝలక్ దిఖ్లా జా (2012), మసావిత్రిక్, ఏక్ ముత్తి ఆస్మాన్ లాంటి సీరియల్స్లో నటించింది. ఆ తర్వాత 'మర్దానీ' మూవీతో బిగ్ స్క్రీన్లోకి అడుగుపెట్టింది. 2023లో కంగనా రనౌత్ నిర్మించిన టికు వెడ్స్ షేరు చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన రొమాంటిక్ పాత్రలో కనిపించింది. కౌర్ చివరిసారిగా 2024లో వచ్చిన 'పార్టీ టిల్ ఐ డై'అనే మర్డర్ మిస్టరీలో నటించింది. View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) -
CT 2025 Final: గ్లెన్ ఫిలిప్స్ కళ్లు చెదిరే క్యాచ్.. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమం
క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమమైన క్యాచ్ నమోదైంది. న్యూజిలాండ్తో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో గ్లెన్ ఫిలిప్స్ ఈ క్యాచ్ను అందుకున్నాడు. మిచెల్ సాంట్నర్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ ఆడిన షాట్ను (కవర్స్ దిశగా) ఫిలిప్స్ అమాంతం గాల్లోకి ఎగిరి పట్టేసుకున్నాడు. ఈ క్యాచ్ను ఫిలిప్స్ సైతం నమ్మలేకపోయాడు. క్యాచ్ పట్టిన తర్వాత కింద కూర్చుని క్యాచ్ పట్టానా అన్నట్లు ఎక్స్ప్రెషన్ పెట్టాడు. What a magnificent catch by GLENN PHILLIPS 🤯👏👏👏#INDvsNZ #ChampionsTrophyFinal pic.twitter.com/1CxjG3QYiw— INNOCENT EVIL ⁶𓅓 (@raju_innocentev) March 9, 2025ఈ క్యాచ్ను చూసి గిల్ నోరెళ్లపెట్టాడు. ఈ క్యాచ్ తర్వాత దుబాయ్ స్టేడియంలో నిశ్శబ్దం ఆవహించింది. అప్పటిదాకా భారత్కు సపోర్ట్ చేసిన ప్రేక్షకులు ఫిలిప్స్ క్యాచ్ చూసి షాక్లో ఉండిపోయారు. అస్సలు సాధ్యంకాని క్యాచ్ను పట్టడంతో అభిమానులు ఫిలిప్స్కు జేజేలు పలుకుతున్నారు. ఈ క్యాచ్ను సంబంధించిన వీడియో సోషల్మీడియాను షేక్ చేస్తుంది. ఫిలిప్స్ మనిషా లేక పక్షా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఫిలిప్స్ ఇదే టోర్నీలో విరాట్ కోహ్లి క్యాచ్ను (గ్రూప్ దశ మ్యాచ్లో) కూడా ఇలాగే నమ్మశక్యంకాని రీతిలో పట్టుకున్నాడు. ఆ క్యాచ్ను ఇది తలదన్నేలా ఉంది. క్యాచెస్ విన్ మ్యాచెస్ అన్న నానుడుని ఫిలిప్స్ నిజం చేస్తాడేమో చూడాలి.ఫిలిప్స్ పట్టుకున్న క్యాచ్ ఆషామాషీ వ్యక్తిది కాదు. గిల్ మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసే సత్తా ఉన్న ఆటగాడు. అదీ కాక భారత్ అప్పటిదాకా బాగా స్కోర్ చేసి విజయం దిశగా దూసుకుపోతుండుంది. ఫిలిప్స్ క్యాచ్తో భారత్ డిఫెన్స్లో పడింది. పుండుపై కారం చల్లినట్లు గిల్ (31) ఔటైన పరుగు వ్యవధిలోనే భారత్ అత్యంత కీలకమైన విరాట్ కోహ్లి (1) వికెట్ కూడా కోల్పోయింది. మరో 17 పరుగుల తర్వాత క్రీజ్లో కుదురుకుపోయిన రోహిత్ శర్మ (76) కూడా ఔటయ్యాడు. దీంతో భారత్ ఒక్కసారిగా కష్టాల్లో కూరుకుపోయినట్లైంది. శ్రేయస్ అయ్యర్ (35), అక్షర్ పటేల్ (13) భారత ఇన్నింగ్స్ను చక్కద్దిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 35 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 161/3గా ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే 90 బంతుల్లో 91 పరుగులు చేయాలి. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. స్పిన్కు అనుకూలిస్తున్న పిచ్పై డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్వెల్ (53 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలు చేసి న్యూజిలాండ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో విల్ యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, కేన్ విలియమ్సన్ 11, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 34, మిచెల్ సాంట్నర్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినా న్యూజిలాండ్ మంచి స్కోర్ చేసింది. -
శుబ్మన్ గిల్కు ప్రమోషన్.. ఏకంగా రూ. 7 కోట్ల జీతం!?
భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) 2025-26 ఏడాదికి గాను ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించేందుకు సిద్దమైంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముగిసిన తర్వాత ఈ లిస్ట్ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. గతేడాది సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు ప్రమోషన్ దక్కనున్నట్లు సమాచారం.అతని సెంట్రల్ కాంట్రాక్ట్ను పునరుద్దరించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దేశీవాళీ క్రికెట్లో ఆడాలన్న తమ ఆదేశాలను ధిక్కరించడంతో బీసీసీఐ అయ్యర్పై వేటు వేసింది. ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని రంజీల్లో ఆడిన శ్రేయస్ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు.జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన అయ్యర్.. తన అద్బుతప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనూ శ్రేయస్ దుమ్ములేపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి తిరిగి మళ్లీ కాంట్రాక్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించుకుంది.గిల్కు ప్రమోషన్.. కోహ్లి, రోహిత్కు డిమోషన్మరోవైపు అద్బుతమైన ఫామ్లో ఉన్న టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill)కు సైతం ప్రమోషన్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గిల్ ప్రస్తుతం బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ల్లో ఏ కేటగిరిలో ఉన్నాడు. ఇప్పుడు అతడిని టాప్ గ్రేడ్(ఏ ప్లస్)కు ప్రమోట్ చేయాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించుకున్నారంట. కాగా ప్రస్తుతం ఏ ప్లస్ కేటగిరిలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలు మాత్రమే ఉన్నారు. అయితే అంతర్జాతీయ టీ20లకు విడ్కోలు పలికిన కోహ్లి, రోహిత్ శర్మ, జడేజా కాంట్రాక్లు మారనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సీనియర్ త్రయాన్ని ఏ ప్లస్ నుంచి ఏ గ్రేడ్కు డిమోట్ చేసే అవకాశముంది. వీరిస్ధానాల్లో గిల్తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఏ ప్లస్ కేటగిరిలో చోటు దక్కే సూచనలు కన్పిస్తున్నాయి.కేటగిరి వారీగా ఆటగాళ్లకు దక్కే మొత్తం ఎంతంటే?ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది.కివీస్తో ఫైనల్ పోరు..ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు కివీస్ కూడా భారత్ను ఓడించి రెండోసారి ఈ మెగా టోర్నీ టైటిల్ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది.చదవండి: CT 2025: భారత్-న్యూజిలాండ్ ఫైనల్ పోరు.. బ్యాటర్లకు చుక్కలే! ఎందుకంటే? -
ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీగా శుభ్మన్ గిల్.. రేసులో మరో ఇద్దరు స్టార్లు
ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీల వివరాలను ఐసీసీ ఇవాళ (మార్చి 7) ప్రకటించింది. పురుషుల విభాగంలో టీమిండియా యువ ఆటగాడు శుభ్మన్ గిల్, న్యూజిలాండ్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్, ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ నామినేట్ అయ్యారు. మహిళల విభాగంలో అలానా కింగ్ (ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్), అన్నాబెల్ సదర్ల్యాండ్ (ఆసీస్ బ్యాటర్), తిసాట్చా పుత్తవోంగ్ (థాయ్ల్యాండ్ బౌలర్) నామినీస్గా నిలిచారు. ఫిబ్రవరిలో ఆయా ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శనలు కనబర్చిన వారిని ఐసీసీ నామినీస్గా ఎంపిక చేసింది. ఓటింగ్ ఆధారంగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ విజేతలను ప్రకటిస్తారు.శుభ్మన్ గిల్: ఫిబ్రవరి నెలలో గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ నెలలో అతను 100కుపైగా సగటుతో 406 పరుగులు చేశాడు. ఇంగ్లండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో గిల్ వరుసగా 87, 60, 112 పరుగులు చేశాడు. అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్పై మరో సెంచరీ బాదాడు. ఇదే నెలలో గిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు.గ్లెన్ ఫిలిప్స్: ఫిబ్రవరి నెలలో ఫిలిప్స్ అద్భుత ప్రదర్శనలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్లో జరిగిన వన్డే సిరీస్లో కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. ఈ సిరీస్లో ఫిలిప్స్ వరుసగా 28 నాటౌట్, 20 నాటౌట్, 106 (74 బంతుల్లో 7 సిక్సర్లు) స్కోర్లు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లోనూ ఫిలిప్స్ విజృంభించాడు. ఈ మ్యాచ్లో ఫిలిప్స్ మెరుపు అర్ద సెంచరీ (39 బంతుల్లో 61) సాధించాడు. ఇదే మ్యాచ్లో ఫిలిప్స్ పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ క్యాచ్ను నమ్మశక్యంకాని రీతిలో అందుకున్నాడు.స్టీవ్ స్మిత్: ఫిబ్రవరి నెలలో స్మిత్ టెస్ట్ల్లో అద్భుతంగా రాణించాడు. ఈ నెలలో శ్రీలంకతో జరిగిన రెండు టెస్ట్ల్లో స్మిత్ రెండు సెంచరీలు బాదాడు. ఫలితంగా ఈ సిరీస్లో స్మిత్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ ప్రదర్శనలతో స్మిత్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో టాప్-5లోకి చేరుకున్నాడు. -
‘ఆ ఇద్దరు రాణిస్తే ట్రోఫీ మనదే.. కివీస్ ప్రధాన టార్గెట్ అతడే’
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)ఫైనల్లో టీమిండియా- న్యూజిలాండ్(India vs New Zealand) అమీతుమీ తేల్చుకోనున్నాయి. పాతికేళ్ల తర్వాత మరోసారి ఈ రెండు జట్లు ఈ మెగా వన్డే టోర్నీ టైటిల్ పోరులో తలపడనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాడు కివీస్ టీమిండియాపై పైచేయి సాధించి ఐసీసీ నాకౌట్ ట్రోఫీ గెలవగా.. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అన్ని విభాగాల్లోనూ భారత్ పటిష్టంగా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఈసారి ఫైనల్ మామూలుగా ఉండబోదని ఇరుజట్ల అభిమానులు ఈ రసవత్తర పోరు కోసం ఎదురుచూస్తున్నారు. దుబాయ్ వేదికగా ఆదివారం భారత్- కివీస్ తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అతడేటైటిల్ సమరంలో టీమిండియా తరఫున మిడిలార్డర్ శ్రేయస్ అయ్యర్ ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అవుతాడని అంచనా వేసిన ఈ మాజీ ఓపెనర్.. శుబ్మన్ గిల్ కూడా కీలకం కాబోతున్నాడని పేర్కొన్నాడు. ఏదేమైనా ఈసారి కివీస్ బౌలర్లు ప్రధానంగా శ్రేయస్ అయ్యర్నే టార్గెట్ చేస్తారని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్పై వన్డేల్లో శ్రేయస్ అయ్యర్ ఒక్కసారి మాత్రమే 30 కంటే తక్కువ పరుగులు చేశాడనుకుంటా. అదొక్కటి మినహా ప్రతిసారీ అతడు కివీస్పై బాగానే రన్స్ రాబట్టాడు. కాబట్టి ఈసారి అతడినే ఎక్కువగా టార్గెట్ చేస్తారనిపిస్తోంది.మిడిల్ ఓవర్లలో వాళ్లు బాగా బౌలింగ్ చేస్తున్నారు. మిచెల్ సాంట్నర్, బ్రాస్వెల్ లేదంటే రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్.. ఈ నలుగురే ఎక్కువగా బరిలోకి దిగవచ్చు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ స్పిన్ బాగా ఆడతాడు కదా! అందుకే అతడిని త్వరగా పెవిలియన్కు పంపేందుకు ఈ స్పిన్ బౌలర్లు ప్రయత్నిస్తారు. అతడిపైనే దృష్టి పెడతారు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.కివీస్తో ఆటంటే శ్రేయస్కు మజాకాగా న్యూజిలాండ్తో వన్డేల్లో ఇప్పటి వరకు ఎనిమిది ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్.. సగటున 70.38తో 563 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఇక కివీస్పై శ్రేయస్ అత్యల్ప స్కోరు 33. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా పైవిధంగా స్పందించాడు.ఇక ఓపెనింగ్ బ్యాటర్ శుబ్మన్ గిల్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘బంగ్లాదేశ్పై సెంచరీ చేయడం ద్వారా ఈ ఐసీసీ టోర్నీలో గిల్ బిగ్బ్యాంగ్తో ముందుకు వచ్చాడు. పాకిస్తాన్పై కూడా మెరుగ్గా ఆడాడు. అయితే, ఆ తర్వాత అతడు కాస్త వెనుకబడ్డాడు. ఫైనల్లో బ్యాట్ ఝులిపిస్తేనే జట్టుకు, అతడికి ప్రయోజనకరంగా ఉంటుంది. మరో విరాట్ కావాలంటే గిల్ ఫైనల్లో తన ముద్రను వేయాలి. శ్రేయస్ అయ్యర్, శుబ్మన్ గిల్ గనుక రాణిస్తే చాంపియన్స్ ట్రోఫీ మనదే అని రాసిపెట్టుకోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. డబుల్ సెంచరీ వీరుడుకాగా కివీస్పై గిల్కు కూడా గొప్ప రికార్డు ఉంది. ఇప్పటి వరకు కివీస్పై పదకొండు ఇన్నింగ్స్లో అతడు 592 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండగా.. హైదరాబాద్లో 2023లో డబుల్ సెంచరీ(208) కూడా కివీస్పైనే సాధించాడు. చదవండి: కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్బై? ఆటగాడిగా కొనసాగింపు? బీసీసీఐ నిర్ణయం? -
గిల్ చేసిన ‘తప్పు’..! టీమిండియాకు శాపమయ్యేది! ఎందుకంటే..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత జట్టు అజేయంగా ఫైనల్కు చేరుకుంది. ఆస్ట్రేలియా(India vs Australia)తో మంగళవారం నాటి సెమీస్లో సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టి.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అయితే, ఈ మ్యాచ్కు ముందు భారత మాజీ క్రికెటర్లలో అత్యధిక మంది టీమిండియాకు చేసిన ప్రధాన సూచన.. ఆసీస్ విధ్వంసకర వీరుడు ట్రవిస్ హెడ్ను వీలైనంత త్వరగా అవుట్ చేయాలనే!!...ఎందుకంటే.. రోహిత్ సేన సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023(ODI World Cup) గెలవకుండా అడ్డుపడి.. ఆస్ట్రేలియాను ఒంటిచేత్తో గెలిపించిన ఘనత అతడి సొంతం. అందుకే ‘తలనొప్పి’ తెచ్చిపెట్టే ఈ బ్యాటర్పైనే ముందుగా దృష్టి సారించాలని సంజయ్ మంజ్రేకర్, హర్భజన్ సింగ్, దినేశ్ కార్తిక్ తదితరులు భారత బౌలర్లకు సూచించారు. అందుకు తగ్గట్లుగానే మంగళవారం హెడ్ను టీమిండియా తక్కువ స్కోరుకే పెవిలియన్కు పంపించింది.టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో శుబ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి హెడ్ అవుటయ్యాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి నిష్క్రమించాడు. ‘అతి’ ఆనందంఅయితే, హెడ్ ఇచ్చిన క్యాచ్ పట్టిన తర్వాత గిల్ చేసిన తప్పిదం టీమిండియా కొంపముంచేది. హెడ్ క్యాచ్ పట్టినప్పుడు శుబ్మన్ గిల్ ప్రదర్శించిన ‘అతి’ ఆనందం అంపైర్ నుంచి హెచ్చరికకు గురయ్యేలా చేసింది. క్యాచ్ అందుకోగానే కొద్ది సేపయినా తన చేతిలో ఉంచకుండా గిల్ బంతిని గాల్లోకి విసిరేశాడు.నిజానికి క్యాచ్ పట్టడంలో అతడు ఎక్కడా తడబడలేదు. అయితే బాల్ను ఎంతసేపు చేతిలో ఉంచుకోవాలనే విషయంలో నిబంధనలు సరిగ్గా లేకపోయినా... కనీసం 2–3 సెకన్ల పాటు ఫీల్డర్ బంతిని తన నియంత్రణలో ఉంచుకోవాలి.క్లీన్’గా ఉన్నా.. వార్నింగ్ ఎందుకు?ఇదే విషయాన్ని అంపైర్ ఇల్లింగ్వర్త్ ప్రత్యేకంగా గిల్కు వివరించాడు. ఇలాంటి సందర్భాల్లో అవుట్/నాటౌట్ ఇచ్చే విషయంలో అంపైర్కు విచక్షణాధికారం ఉంటుంది. ఒకవేళ ఇల్లింగ్వర్త్ గనుక గిల్ వెనువెంటనే బంతిని విసిరేయడాన్ని సీరియస్గా తీసుకుని నాటౌట్ ఇచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఒక్కసారి లైఫ్ లభిస్తే హెడ్ను ఆపటం అంత తేలికేమీ కాదు. అందుకే గిల్ చర్య విమర్శలకు దారి తీసింది.ఇదిలా ఉంటే.. ఓపెనర్ హెడ్ అవుటైన తర్వాత కెప్టెన్ , వన్డౌన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. మార్నస్ లబుషేన్(29) మరో ఎండ్ నుంచి సహకారం అందించగా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.నిజానికి అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో అనూహ్యం చోటు చేసుకుంది. స్మిత్ డ్రైవ్ చేయగా బంతి అతడి ప్యాడ్ల మీదుగా స్టంప్స్ను తాకింది. అయితే బెయిల్స్ పడకపోవడంతో స్మిత్ బతికిపోయాడు. ఆపే ప్రయత్నం చేస్తే తన కాలితోనే స్టంప్స్ పడిపోతాయని భావనతో కావచ్చు స్మిత్ అలా కూడా చేయలేదు. ఆ సమయంలో అతని స్కోరు 23 పరుగులు. అతని స్కోరు 36 వద్ద ఉన్నప్పుడు షమీ బౌలింగ్లో బలంగా షాట్ కొట్టగా... తన ఎడమ చేత్తో క్యాచ్ పట్టే ప్రయత్నం చేసిన షమీ విఫలమయ్యాడు. అయితే ఇది చాలా కఠినమైన క్యాచ్. ఏదేమైనా స్మిత్ 73 పరుగుల చేసి షమీ బౌలింగ్లో బౌల్డ్ కాగా.. అలెక్స్ క్యారీ అర్ధ శతకం(61) కారణంగా ఆసీస్ 264 పరుగులు చేయగలిగింది.వరల్డ్ చాంపియన్స్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించిఅయితే, లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆరంభించిన టీమిండియా ఆ తర్వాత తడబడ్డప్పటికీ విరాట్ కోహ్లి(98 బంతుల్లో 84) అద్భుతం చేశాడు. అతడికి తోడుగా శ్రేయస్ అయ్యర్(45), వికెట్ కీపర్ కేఎల్ రాహుల్(34 బంతుల్లో 42) రాణించారు. గ్లెన్ మాక్స్వెల్ బౌలింగ్లో రాహుల్ కొట్టిన సిక్సర్తో టీమిండియా విజయం ఖరారైంది. ఫలితంగా వరల్డ్ చాంపియన్స్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి రోహిత్ సేన ఫైనల్కూ దూసుకెళ్లింది.చదవండి: #Steve Smith: భారత్ చేతిలో ఓటమి.. స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం -
IND vs NZ: కివీస్తో మ్యాచ్కు రోహిత్ దూరం.. కెప్టెన్గా అతడు!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా ఆఖరి లీగ్ మ్యాచ్కు సన్నద్ధమవుతోంది. ఈ ఐసీసీ వన్డే టోర్నమెంట్లో ఇప్పటికే సెమీ ఫైనల్ చేరుకున్న రోహిత్ సేన.. న్యూజిలాండ్తో ఆదివారం నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. అయితే, ఈ మ్యాచ్కు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.రోహిత్కు రెస్ట్ ఇవ్వడమే మంచిదిపాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా హిట్మ్యాన్ పిక్కల నొప్పితో బాధపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మైదానం వీడి కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ ఫీల్డింగ్కు వచ్చాడు. అయితే, నొప్పి ఇంకా పూర్తిగా తగ్గలేదని తెలుస్తోంది. దుబాయ్లో జరిగిన ప్రాక్టీస్ సెషన్లోనూ అతడు బ్యాటింగ్ చేయలేకపోయాడు. దీంతో కివీస్తో మ్యాచ్కు దూరంగా ఉండాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.సెమీస్ మ్యాచ్ మార్చి 4, 5 తేదీల్లోనే జరుగనున్న తరుణంలో రోహిత్కు విశ్రాంతిన్విడమే మంచిదని యాజమాన్యం కూడా భావిస్తున్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill) తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. గిల్తో పాటు ఓపెనర్గా రాహుల్అయితే, గిల్ జ్వరంతో బాధపడుతున్నాడని వార్తలు రాగా.. ఆప్షనల్ నెట్ సెషన్లో అతడు గంటలపాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడంతో వాటికి చెక్ పడింది.ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ గనుక దూరమైతే గిల్కు ఓపెనింగ్ జోడీగా కేఎల్ రాహుల్ వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే మరో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్కు తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక గ్రూప్-‘ఎ’ నుంచి కివీస్ కూడా భారత్తో పాటు సెమీస్ చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 2 నాటి మ్యాచ్లో గెలిచి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో సెమీ ఫైనల్ బరిలో దిగాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. అంతేకాదు.. ఈ మ్యాచ్లో గెలుపు ఆధారంగానే గ్రూప్-‘ఎ’ విజేతతో పాటు సెమీస్ ప్రత్యర్థి ఎవరన్నది తేలనుంది.కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలైంది. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ బరిలో నిలిచాయి. అయితే, గ్రూప్-‘ఎ’లో వరుసగా రెండు మ్యాచ్లో ఓడటంతో పాటు.. తమ మధ్య ఆఖరి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో పాక్- బంగ్లా కనీసం ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించాయి. ఇక గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ ఇంటిబాటపట్టింది. ఇక ఈ టోర్నీలో టీమిండియా తమ మ్యాచ్లు అన్నీ దుబాయ్లో ఆడుతోంది.చదవండి: అఫ్గన్ చేతిలో ఓటమి.. బట్లర్ సంచలన నిర్ణయం?! -
Shubman Gill: పరుగుల వేటగాడు.. మిస్టర్ నంబర్ వన్
అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు అధిరోహిస్తున్న 25 ఏళ్ల శుభ్మన్ గిల్(Shubman Gill) ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో వరల్డ్ నంబర్వన్ ర్యాంకర్గా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)లో భారత జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికైన అతడు బ్యాటర్గానూ ఇరగదీస్తున్నాడు. అంతా కలిసొస్తే భవిష్యత్లో భారత భావి కెప్టెన్గా గిల్ను చూడవచ్చు.... పంజాబ్ యువ ఓపెనర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన గిల్ ప్రస్థానం వర్దమాన ఆటగాళ్లకు ఆదర్శం.బ్యాట్ పట్టగానే ఆ కుర్రాడు తన పరుగుల వేట ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపెట్టాడు. అంతర్ జిల్లా అండర్–16 క్రికెట్ టోర్నీ మ్యాచ్లో 351 పరుగులు చేసి ప్రకంపనలు రేపాడు. అదే ఊపులో విజయ్ మర్చంట్ ట్రోఫీ అరంగేట్రంలోనే అజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. అండర్–19 జాతీయ జట్టుకు సులువుగానే ఎంపికయ్యాడు. అప్పటికే ఓపెనర్గా రాటుదేలిన ఆ కుర్రాడు 2018లో జరిగిన అండర్–19 ప్రపంచకప్ టోర్నీలో విశ్వరూపం ప్రదర్శించాడు.న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఆ టోర్నీలో 372 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవడంతో పాటు ’ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కించుకొని యువభారత జట్టు ట్రోఫీ చేజిక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తదనంతరం అండర్–19 ప్రదర్శనతో అనతి కాలంలోనే జాతీయ సీనియర్ జట్టుకు ఎంపికయ్యాడు. మనం చెప్పుకున్న ఈ విశేషాలన్నీ పంజాబ్ యువ క్రికెటర్ శుభ్మన్ గిల్ గురించే. సీనియర్ ప్లేయర్లు ఉన్న జట్టుకు వైస్ కెప్టెన్విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, షమీ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్న జట్టుకు గిల్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడంటే అతడి ప్రతిభ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. మూడు ఫార్మాట్లలోనూ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన గిల్ ముఖ్యంగా వన్డేల్లో తన అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు.2019లో న్యూజిలాండ్పై అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన గిల్ ఇప్పటి వరకు 52 మ్యాచ్లు ఆడి 62.13 సగటుతో 2734 పరుగులు సాధించాడు. క్రీజులో నిలదొక్కుకుంటే చాలు భారీ ఇన్నింగ్స్లు ఆడతాడనే గుర్తింపు తెచ్చుకున్న గిల్ ఇప్పటికే ఒక డబుల్ సెంచరీ, 8 సెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు.మూడు ఫార్మాటల్లో సెంచరీలు చేసిన అతికొద్దిమంది ఆటగాళ్లలో ఒకడైన గిల్ ఇటీవల ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో వీరవిహారం చేశాడు. మూడు మ్యాచ్లలో ఒక సెంచరీ రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేసుకొని ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో తిరిగి అగ్రస్థానం దక్కించుకున్నాడు.అండర్–19 స్థాయిలోనే గిల్ కంటే మెరుగైన నైపుణ్యం ఉన్న ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ప్రపంచకప్ అందించిన పృథ్వీ షా ఇప్పుడు టీమిండియా సెలక్షన్ దరిదాపుల్లో కూడా లేకుండా పోగా ప్రతిభకు క్రమశిక్షణ జోడించిన శుభ్మన్ గిల్ ‘ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి’ అనే ప్రాథమిక సూత్రాన్ని పాటిస్తున్నాడు. 2023 ఐపీఎల్ సీజన్ గుజరాత్ టైటాన్స్ తరఫున 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్న గిల్ ప్రస్తుతం ఆ ఫ్రాంచైజీ సారథిగా కొనసాగుతున్నాడు. – ఇంతియాజ్ మొహమ్మద్చదవండి: CT 2025 Aus Vs Afg: వరుణుడు కరుణిస్తే... -
Ind vs NZ: కివీస్తో మ్యాచ్లో ఓపెనర్గా అతడు.. పంత్కి ఛాన్స్!
న్యూజిలాండ్(India vs New Zealand)తో వన్డే నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓపెనింగ్ జోడీ మారవచ్చని.. అదే విధంగా.. కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు జట్టులో దక్కవచ్చని అంచనా వేశాడు. అయితే, తాను మాత్రం ఇలాంటి మార్పులు వద్దనే సూచిస్తానని పేర్కొన్నాడు.సెమీస్లో భారత్, కివీస్ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా భారత్.. పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్లతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది. ఈ క్రమంలో లీగ్ దశలో భాగంగా తొలుత బంగ్లాదేశ్ను ఓడించిన రోహిత్ సేన.. అనంతరం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై కూడా జయభేరి మోగించింది. మరోవైపు.. న్యూజిలాండ్ కూడా ఈ రెండు జట్లపై గెలిచి భారత్తో పాటు సెమీస్ చేరింది.రోహిత్ శర్మ దూరం?ఈ క్రమంలో లీగ్ దశలో చివరగా నామమాత్రపు మ్యాచ్లో భారత్- కివీస్ ఆదివారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇరుజట్లకు సెమీస్కు సన్నాహకంగా మారనుంది. ఇందులో గెలిచి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని భారత్- న్యూజిలాండ్ పట్టుదలగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. పాక్తో మ్యాచ్ సందర్భంగా పిక్కల్లో నొప్పితో బాధపడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. పూర్తిస్థాయిలో కోలుకోలేదని సమాచారం.అదే విధంగా.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ కూడా జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్తో మ్యాచ్లో టీమిండియా మార్పులు చేయబోతోందా? రోహిత్ శర్మ ఇందులో ఆడకపోవచ్చు. మహ్మద్ షమీ కూడా విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది.రిషభ్ పంత్, అర్ష్దీప్ సింగ్లకు అవకాశంకేఎల్ రాహుల్ ఓపెనర్గా రాబోతున్నాడు. రిషభ్ పంత్, అర్ష్దీప్ సింగ్లకు ఈసారి తుదిజట్టులో చోటు దక్కుతుందనే వార్తలు వస్తున్నాయి. ఇలా జరగొచ్చు. లేదంటే జరగకపోవచ్చు. కానీ నా అభిప్రాయం ప్రకారం భారత్ గత రెండు మ్యాచ్లలో ఆడిన జట్టుతోనే ముందుకు వెళ్లాలి.గెలుపు మనకు ఓ అలవాటుగా మారినప్పుడు.. అదే జట్టును కొనసాగిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయి. చాంపియన్స్ ట్రోఫీలో జడ్డూ గత మ్యాచ్లలో పెద్దగా వికెట్లు తీయలేదు. అయినా సరే అతడిని కొనసాగించాల్సిందే. జడ్డూను కాదని వరుణ్ చక్రవర్తిని తీసుకువచ్చే ఆలోచన కూడా యాజమాన్యానికి ఉండి ఉండవచ్చు.జడ్డూనే ఆడించాలిలేదా.. కివీస్ జట్టులో ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఎక్కువ కాబట్టి వాషింగ్టన్ సుందర్ను ఆడించే యోచనలో ఉండొచ్చు. కానీ జడ్డూనే ఆడించాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే.. అతడు తదుపరి సెమీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇలాంటి సమయంలో విశ్రాంతి పేరిట పక్కనపెట్టకూడదు’’ అని అభిప్రాయపడ్డాడు.ఒకవేళ తుదిజట్టులో మార్పు చేయాలని భావిస్తే షమీని తప్పించి అర్ష్దీప్ను ఆడిస్తే ప్రయోజనకరంగానే ఉంటుందని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో తొమ్మిది ఓవర్ల కోటా వేసిన స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 37 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. ఇక పాకిస్తాన్తో మ్యాచ్లో మాత్రం ఏడు ఓవర్లలోనే 40 రన్స్ ఇచ్చిన జడ్డూ ఒక వికెట్ తీయగలిగాడు. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో కేఎల్ రాహుల్తో కలిసి వికెట్ కీపర్ కోటాలో అవకాశం దక్కించుకున్న రిషభ్ పంత్కు మాత్రం తుదిజట్టులో ఆడే ఛాన్స్ రావడం లేదు. అయితే, కివీస్తో మ్యాచ్కు రోహిత్ దూరంగా ఉంటే మాత్రం.. రాహుల్ ఓపెనర్గా వస్తే.. పంత్కు చోటు దక్కవచ్చు.బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో మ్యాచ్లలో ఆడిన భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.బెంచ్: రిషభ్ పంత్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్.చదవండి: అతడొక అద్భుతం.. క్రెడిట్ తనకే.. బాధగా ఉంది: బట్లర్ -
టీమిండియాకు భారీ షాక్.. రోహిత్కు గాయం! గిల్కు జ్వరం?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా తమ ఆఖరి లీగ్ మ్యాచ్కు సన్నద్దమవుతోంది. ఈ టోర్నీలో భాగంగా మార్చి 2న న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. ఇప్పటికే సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకున్న భారత జట్టు.. కివీస్పై కూడా గెలిచి గ్రూపు స్టేజిని విజయంతో ముగించాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ కోసం దుబాయ్లోని ఐసీసీ ఆకాడమీ గ్రౌండ్లో మెన్ ఇన్ బ్లూ తీవ్రంగా శ్రమిస్తోంది.అయితే ఈ మ్యాచ్కు ముందు భారత్కు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో భాదపడుతున్నట్లు తెలుస్తోంది. హిట్మ్యాన్తో పాటు స్టార్ ప్లేయర్ శుబ్మన్ గిల్కు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో వీరిద్దరూ బుధవారం జరిగిన టీమ్ నెట్ ప్రాక్టీస్కు దూరమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అస్వస్థత కారణంగా గిల్ హోటల్ రూమ్కే పరిమితం కాగా.. రోహిత్ శర్మ మైదానంకు వచ్చినప్పటికి ప్రాక్టీస్లో మాత్రం పాల్గోలేదని క్రిక్బజ్ తమ కథనంలో పేర్కొంది. గాయం తీవ్రతరం కాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ప్రాక్టీస్ను రోహిత్ స్కిప్ చేశాడని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.కాగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు. కొన్ని ఓవర్ల పాటు ఆటకు కూడా దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత తిరిగి మైదానంలో వచ్చాడు. అయినప్పటికి రోహిత్ అంత ఫిట్నెస్గా కన్పించలేదు. అయితే రోహిత్, గిల్ ప్రాక్టీస్కు దూరంగా ఉండడంపై బీసీసీఐ నుంచి ఎటుంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.సూపర్ ఫామ్లో గిల్..కాగా శుబ్మన్ గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో 101 పరుగులు చేసిన గిల్.. పాకిస్తాన్పై 46 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ కూడా తొలి రెండు మ్యాచ్ల్లో తన బ్యాట్ను ఝలిపించాడు. ఒకవేళ వీరిద్దరూ న్యూజిలాండ్తో మ్యాచ్కు దూరమైతే భారత్కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. మరోవైపు గాయం నుంచి కోలుకున్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన ప్రాక్టీస్ను మొదలు పెట్టాడు. రోహిత్, గిల్ కివీస్తో మ్యాచ్కు దూరమైతే వారి స్ధానాల్లో వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.చదవండి: అతడొక అద్భుతం.. క్రెడిట్ తనకే.. బాధగా ఉంది: బట్లర్ -
శుబ్మన్ గిల్ ‘టాప్’ ర్యాంక్ పటిష్టం
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత ఆటగాడు శుబ్మన్ గిల్ తన నంబర్వన్ ర్యాంక్ను మరింత పటిష్టం చేసుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో గిల్ 817 రేటింగ్ పాయింట్లతో ‘టాప్’ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గిల్ ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్పై అజేయ సెంచరీ (101 నాటౌట్) చేసిన ఈ పంజాబ్ బ్యాటర్ పాకిస్తాన్తో జరిగిన పోరులో 46 పరుగులు సాధించాడు. దాంతో గిల్ ఖాతాలో 21 రేటింగ్ పాయింట్లు చేరాయి. పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ 770 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. గిల్, బాబర్ ఆజమ్ మధ్య 47 పాయింట్ల వ్యత్యాసం ఉంది. భారత కెపె్టన్ రోహిత్ శర్మ (757 పాయింట్లు) మూడో ర్యాంక్లో ఎలాంటి మార్పు లేదు. చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్పై అజేయ సెంచరీ చేసిన భారత స్టార్ విరాట్ కోహ్లి ఒక స్థానం మెరుగుపర్చుకొని ఐదో ర్యాంక్లో నిలిచాడు. భారత్కే చెందిన శ్రేయస్ అయ్యర్ తొమ్మిదో ర్యాంక్లో, కేఎల్ రాహుల్ 15వ ర్యాంక్లో ఉన్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడో ర్యాంక్లో నిలిచాడు. -
ఐదో స్థానానికి ఎగబాకిన విరాట్.. టాప్-10లో నలుగురు టీమిండియా బ్యాటర్లు
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో (ICC ODI Rankings) భారత బ్యాటర్ల హవా కొనసాగింది. టాప్-10లో ఏకంగా నలుగురు భారత బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు. శుభ్మన్ గిల్ (Shubman Gill) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రోహిత్ (Rohit Sharma) మూడు, విరాట్ (virat Kohli) ఐదు, శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తొమ్మిది స్థానాల్లో ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్పై సెంచరీ చేయడంతో విరాట్ ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి చేరాడు. తాజా ర్యాంకింగ్స్లో ఛాంపియన్స్ ట్రోఫీ సెంచరీ హీరోలు గణనీయంగా లబ్ది పొందారు. విల్ యంగ్ 8 స్థానాలు మెరుగుపర్చుకుని 14వ స్థానానికి.. బెన్ డకెట్ 27 స్థానాలు మెరుగుపర్చుకుని 17వ స్థానానికి.. రచిన్ రవీంద్ర 18 స్థానాలు మెరుగుపర్చుకుని 24వ స్థానానికి.. టామ్ లాథమ్ 11 స్థానాలు మెరుగుపర్చుకుని 31వ స్థానానికి.. జోస్ ఇంగ్లిస్ 18 స్థానాలు మెరుగుపర్చుకుని 88వ స్థానానికి చేరారు. టాప్-10లో భారత బ్యాటర్లతో పాటు బాబర్ ఆజమ్ (2), హెన్రిచ్ క్లాసెన్ (4), డారిల్ మిచెల్ (6), హ్యారీ టెక్టార్ (7), చరిత్ అసలంక (8), షాయ్ హోప్ (10) ఉన్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టాప్-10లో కుల్దీప్ (3వ స్థానం) మినహా భారత్కు ప్రాతినిథ్యం లేదు. లంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ టాప్లో కొనసాగుతుండగా.. రషీద్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు. కేశవ్ మహారాజ్, బెర్నాల్డ్ స్కోల్జ్, మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్, గుడకేశ్ మోటీ, షాహీన్ అఫ్రిది, ఆడమ్ జంపా టాప్-10లో ఉన్నారు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టాప్-10లో ఎలాంటి మార్పులు లేవు. మొహమ్మద్ నబీ, సికందర్ రజా, అజ్మతుల్లా ఒమర్జాయ్, మెహిది హసన్ మిరాజ్, రషీద్ ఖాన్, మిచెల్ సాంట్నర్, మ్యాక్స్వెల్, బ్రాండన్ మెక్ముల్లెన్, రవీంద్ర జడేజా, గెర్హార్డ్ ఎరాస్మస్ టాప్-10లో కొనసాగుతున్నారు. ఈ వారం ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో ఒకే ఒక చెప్పుకోదగ్గ మార్పు జరిగింది. న్యూజిలాండ్ ఆటగాడు మైఖేల్ బ్రేస్వెల్ ఏకంగా 26 స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి చేరాడు.జట్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా ఎవరికీ అందనంత ఎత్తులో టాప్ ప్లేస్లో కొనసాగుతుంది. ఆసీస్, పాకిస్తాన్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఆతర్వాతి స్థానాల్లో నిలిచాయి. -
కోహ్లి, రోహిత్ మర్రిచెట్టు లాంటి వాళ్లు.. అయినా అతడు ఎదుగుతున్నాడు!
టీమిండియా స్టార్ ప్లేయర్ శుబ్మన్ గిల్(Shubman Gill) తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి మ్యాచ్లో సెంచరీతో మెరిసిన గిల్.. ఆదివారం పాకిస్తాన్తో జరిగిన కీలక మ్యాచ్లోనూ సత్తాచాటాడు. 52 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు.గిల్ క్రీజులో ఉన్నంతసేపు తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. ఈ క్రమంలో గిల్పై భారత మాజీ క్రికెటర్లు సంజయ్ బంగర్, నవజ్యోత్ సింగ్ సిద్దూ ప్రశంసల వర్షం కురిపించారు. రాబోయే రోజుల్లో భారత జట్టు బ్యాటింగ్ ఎటాక్ను గిల్ లీడ్ చేస్తాడని వారిద్దరూ కొనియాడారు."శుబ్మన్ గిల్ ఒక అద్బుతం. తన కెరీర్ ఆరంభం నుంచే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తన రెండున్నర ఏళ్ల వన్డే క్రికెట్ కెరీర్లో ఎన్నో మైలు రాయిలను సాధించాడు. ప్రపంచ నంబర్-1 బ్యాటర్గా కొనసాగుతున్నాడు. అతడి బ్యాటింగ్ టెక్నిక్ కూడా చాలా బాగుంది.స్ట్రెయిట్ డ్రైవ్, ఆన్-డ్రైవ్ షాట్లను అద్బుతంగా ఆడుతున్నాడు. మిడ్-ఆఫ్, మిడ్ ఆన్ ఫీల్డర్లు 30 యార్డ్ సర్కిల్ ఉన్నప్పటికి వారి మధ్య నుంచి బంతిని బౌండరీకు తరలిస్తున్నాడు. అతడు కచ్చితంగా రాబోయే రోజుల్లో భారత బ్యాటింగ్ యూనిట్కు వెన్నముకగా నిలుస్తాడని" బంగర్ జియో హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. గిల్ షాట్ ఆడే టైమింగ్ అద్బుతంగా ఉంది. భారత జట్టులో విరాట్ కోహ్లి, రోహిత్ మర్రిచెట్టు లాంటి వాళ్లు. సాధరణంగా మర్రి చెట్టు కింద ఎటువంటి మెక్కలు పెరగవు. కానీ గిల్ మాత్రం.. రోహిత్, విరాట్ వంటి మర్రిచెట్టు నీడల్లోంచి గొప్ప క్రికెటర్గా ఎదుగుతున్నాడు. ఈ మ్యాచ్లో గిల్ కొట్టిన రెండు స్ట్రెయిట్ డ్రైవ్లు, కవర్ డ్రైవ్ షాట్లను చూడటానికి రెండు కళ్లు సరిపోలేదు. ఆ షాట్లు చూసి ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లు సైతం షాక్ అయిపోయారు" అని సిద్దూ చెప్పుకొచ్చాడు.చదవండి: చాలా అలసిపోయాను.. అది నా బలహీనత.. కానీ అదే బలం: కోహ్లి -
అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం
పాకిస్తాన్ యువ బౌలర్ అబ్రార్ అహ్మద్ వ్యవహారశైలిపై ఆ దేశ దిగ్గజ పేసర్ వసీం అక్రం ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని.. అంతేతప్ప అతి చేయకూడదంటూ చీవాట్లు పెట్టాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా పాకిస్తాన్ ఆదివారం టీమిండియాతో తలపడింది.దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, భారత బౌలర్ల ధాటికి పాకిస్తాన్ 241 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ తీయగా.. పేసర్లలో హార్దిక్ పాండ్యా రెండు, హర్షిత్ రాణా ఒక వికెట్ దక్కించుకున్నారు.పాకిస్తాన్ ఇన్నింగ్స్లో వన్డౌన్ బ్యాటర్ సౌద్ షకీల్(62) టాప్ స్కోరర్గా నిలవగా.. రిజ్వాన్(46) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా ఆరంభం నుంచే ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ 15 బంతుల్లోనే 20 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ ఆదిలో దూకుడుగా ఆడినా వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు.చక్కటి షాట్లతో అలరిస్తూ అర్ధ శతకానికి చేరువైన సమయంలో అనూహ్య రీతిలో గిల్ పెవిలియన్ చేరాడు. మొత్తంగా 52 బంతులు ఎదుర్కొన్న ఈ 25 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్.. పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ వేసిన అద్భుత బంతికి బౌల్డ్ అయ్యాడు. దీంతో 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.అయితే, ఆ సమయంలో అబ్రార్ అహ్మద్ కాస్త అతిగా స్పందించాడు. రెండు చేతులు కట్టుకుని నిలబడి.. ‘‘ఇక వెళ్లు’’.. అన్నట్లుగా కళ్లతోనే సైగలు చేయగా సహచర ఆటగాళ్లు కూడా వచ్చి అతడితో ఆనందం పంచుకున్నారు. అప్పుడు మరో ఎండ్లో ఉన్న విరాట్ కోహ్లి కాస్త సంయమనం పాటించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ కాగా.. అబ్రార్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.‘‘ప్రిన్స్తో పెట్టుకున్నందుకు.. కింగ్ మీకు చుక్కలు చూపించాడు. మిమ్మల్ని ఓడించాడు. అందుకే అతి చేయొద్దు’’ అంటూ టీమిండియా అభిమానులు కోహ్లి శతకంతోనే పాక్ జట్టుకు బదులిచ్చాడంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ గిల్ వికెట్ తీసిన తర్వాత అబ్రార్ అహ్మద్ వ్యవహరించిన తీరుపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్బౌలర్ వసీం అక్రం కూడా స్పందించాడు.‘‘అబ్రార్ బంతి వేసిన తీరు నన్ను ఆకట్టుకుంది. కానీ అతడి చర్య ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. సెలబ్రేట్ చేసుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. వికెట్ తీసిన ఆనందాన్ని వ్యక్తపరచడంలో తప్పులేదు. కానీ.. మ్యాచ్లో మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటివి పనికిరావు. ఎంత హుందాగా ఉంటే అంత మంచిది. అయితే, ఈరోజు అబ్రార్ అతి చేశాడు. అతడిని వారించేందుకు అక్కడ ఒక్కరూ ముందుకు రాలేదు. ఇలాంటి ప్రవర్తన టీవీల్లో చూడటానికి కూడా అస్సలు బాగాలేదు’’ అని వసీం అక్రం అబ్రార్కు చురకలు అంటించాడు. కాగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్.. గ్రూప్-ఎ నుంచి సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. ఇక మెగా వన్డే టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్లతో పాటు గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. -
గిల్ను ఔట్ చేశాక పాక్ బౌలర్ ఓవరాక్షన్.. ఏకి పారేస్తున్న టీమిండియా అభిమానులు
భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ల్లో ఆటగాళ్లు ఒకరినొకరు కవ్వించుకోవడం, మాటల యుద్దానికి దిగడం సర్వ సాధారణం. అయితే ఇటీవలికాలంలో ఇలాంటి వాతావరణంలో బాగా మార్పు వచ్చింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు. స్నేహపూర్వకంగా మెలుగుతున్నారు. మైదానంలో హుందాగా ప్రవర్తిస్తున్నారు. కోహ్లి, రోహిత్ జమానా మొదలయ్యాక భారత్, పాకిస్తాన్ మ్యాచ్ల్లో స్లెడ్జింగ్ అనేదే కనిపించడం లేదు. జూనియర్లు సీనియర్లను గౌరవిస్తున్నారు. వీలైతే సలహాలు తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో చాలామంది పాక్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి దగ్గర చిట్కాలు తీసుకోవడం చూశాం.Virat Kohli to Abrar Ahmed pic.twitter.com/4BrIhnw6vb— Sagar (@sagarcasm) February 23, 2025అయితే తాజాగా జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్లో పాక్ యువ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఈ మంచి సంప్రదాయానికి తూట్లు పొడిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో అబ్రార్ చాలా ఓవరాక్షన్ చేశాడు. ఫలితంగా భారత క్రికెట్ అభిమానుల నుంచి తిట్ల దండకాన్ని అందుకుంటున్నాడు. Look at audacity of Abrar 🤬Beta Karachi airport ke liye flight pakdo, hold this elimination ✌🏽 pic.twitter.com/J6c3ax7LDS— 🥹 shim8u (@veerjatt007) February 23, 2025అసలేం జరిగిందంటే.. భారత్, పాకిస్తాన్ జట్లు నిన్న (ఫిబ్రవరి 23) దుబాయ్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అబ్రార్ అహ్మద్ అతి చేశాడు. పాక్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ సాఫీగా ఛేదిస్తుండగా.. శుభ్మన్ గిల్ రెండో వికెట్గా వెనుదిరిగాడు. గిల్ను అబ్రార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. గిల్ను ఔట్ చేశాక అబ్రార్ ఓవరాక్షన్ అంతాఇంతా కాదు. Batao, ye Abrar Ahmed ne utne matches nahi khele jitney ki Centuries Gill ki hai, lekin send-off dekho lukkhe ka https://t.co/3C8Sd4TLNz pic.twitter.com/dhtHqbPUPG— Mihir Jha (@MihirkJha) February 23, 2025చేతులు కట్టుకుని నిలబడి 'వెళ్లు.. ఇక వెళ్లు.. వెళ్లి బ్యాగ్ సర్దుకో' అన్నట్టు సైగలు చేశాడు. దీంతో భారత అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. అబ్రార్ను సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. బ్యాగ్ సర్దుకోవాల్సింది గిల్ కాదు, మీరే అంటూ కామెంట్లు చేస్తున్నారు. Watch it before it get remove Abrar reaction to Gill One word for abrar 👇🏼👇🏼 #indvspak #viratkohli pic.twitter.com/coEQydD2qy— Vodka triceps (@vodkatriceps) February 24, 2025కొందరు గిల్ హార్డ్ కోర్ అభిమానులు వాడకూడని భాషలో అబ్రార్ను దూషిస్తున్నారు. ఇంకొందరేమో నీకు సరిగ్గా బుద్ది చెప్పే విరాట్ కోహ్లి ఇంకా క్రీజ్లోనే ఉన్నాడంటూ కామెంట్స్ చేశారు. మొత్తానికి అబ్రార్ చేసిన ఓవరాక్షన్తో పాక్ జట్టు మొత్తం ట్రోలింగ్కు గురైంది.మ్యాచ్ విషయానికొస్తే.. విరాట్ సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో పాక్పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ అజేయ సెంచరీతో భారత్ను విజయతీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రిజ్వాన్ (46), ఖుష్దిల్ షా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరు మినహా పాక్ ఇన్నింగ్స్లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఇమామ్ ఉల్ హక్ 10, బాబర్ ఆజమ్ 23, సల్మాన్ అఘా 19, తయ్యబ్ తాహిర్ 4, షాహీన్ అఫ్రిది 0, నసీం షా 14, హరీస్ రౌఫ్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, హార్దిక్ 2, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.అనంతరం బరిలోకి దిగిన భారత్.. కోహ్లి శతక్కొట్టడంతో (111 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు) 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ (56).. విరాట్తో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత విజయాన్ని ఖరారు చేయగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ (20), శుభ్మన్ గిల్ (46) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. పాక్ బౌలర్లలో అఫ్రిది 2, అబ్రార్ అహ్మద్, ఖుష్దిల్ షా తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. వరుస పరాజయాలతో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. -
ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) అసహనం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్(India vs Pakistan)తో మ్యాచ్లో అనవసర చర్య ద్వారా వికెట్ కోల్పోయే ప్రమాదం తెచ్చుకున్నాడని.. అయితే, అదృష్టవశాత్తూ బయటపడటంతో తాము ఊపిరి పీల్చుకున్నామన్నాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్ ఆదివారం పాకిస్తాన్తో తలపడింది.దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడిన రోహిత్ సేన తొలుత ఫీల్డింగ్ చేసింది. బౌలర్ల విజృంభణ కారణంగా దాయాదిని 241 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనను దూకుడుగా ఆరంభించిన టీమిండియా.. మిడిల్ ఓవర్లలో మాత్రం ఆచితూచి నిలకడగా ఆడింది. సెంచరీ మార్కు.. విన్నింగ్ షాట్ముఖ్యంగా ఓపెనర్ శుబ్మన్ గిల్(46), నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(56)లతో కలిసి విరాట్ కోహ్లి అద్భుత భాగస్వామ్యాలు నెలకొల్పాడు.ఏ దశలో నిర్లక్ష్యపు షాట్లకు యత్నించకుండా.. సహచర బ్యాటర్లతో చక్కగా సమన్వయం చేసుకుంటూ ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ క్రమంలో అర్ధ శతకం పూర్తి చేసుకున్న కోహ్లి.. దానిని శతకంగా మలిచాడు. అంతేకాదు బౌండరీ బాది సెంచరీ మార్కు అందుకున్న ఈ రన్మెషీన్.. టీమిండియాను గెలుపుతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లిపై భారత్తో పాటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.అయితే, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లి చేసిన ఓ పని మాత్రం సునిల్ గావస్కర్కు ఆగ్రహం తెప్పించింది. భారత ఇన్నింగ్స్లో 21 ఓవర్ను పాక్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ వేయగా.. ఐదో బంతికి కోహ్లి సింగిల్ తీశాడు. ఈ క్రమంలో సురక్షితంగానే క్రీజులోకి చేరుకున్న కోహ్లి.. ఆ తర్వాత ఓవర్ త్రో కాబోతున్న బంతిని తన చేతితో ఆపేశాడు.నిజానికి అక్కడ దగ్గర్లో పాకిస్తాన్ ఫీల్డర్లు ఎవరూ లేరు. ఒకవేళ ఓవర్ త్రో అయినా ఓ అదనపు పరుగు వచ్చేది. అయినా, ఎంసీసీ నిబంధనల ప్రకారం ఓ బ్యాటర్ బంతి లైవ్లో ఉన్నపుడు దానిని తన మాటలు, చేతల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా అతడు అలా చేసినట్లు భావించి ఫీల్డింగ్ చేస్తున్న జట్టు అప్పీలు చేస్తే.. సదరు బ్యాటర్ను అవుట్గా ప్రకటించవచ్చు.అబ్స్ట్రక్ట్ ఫీల్డ్ నిబంధన కింద..కోహ్లి విషయంలో ఒకవేళ పాక్ జట్టు ఈ విషయంలో అప్పీలుకు వెళ్లి ఉంటే పరిస్థితి చేజారిపోయేదని గావస్కర్ అన్నాడు. కామెంట్రీ సమయంలో.. ‘‘అతడు తన చేతితో బంతిని ఆపాడు. ఒకవేళ పాకిస్తాన్ గనుక అప్పీలు చేస్తే ఏమయ్యేది?.. అబ్స్ట్రక్ట్ ఫీల్డ్ నిబంధన కింద అతడు అవుటయ్యేవాడేమో?!.. కానీ వాళ్లు అలా చేయలేదు. ఎందుకంటే.. అక్కడ దగ్గర్లో ఫీల్డర్ లేడు.అంతేకాదు ఓవర్ త్రో ద్వారా అదనపు పరుగు రాకుండా ఉండిపోయిందని భావించి ఉండవచ్చు. నిజానికి మిడ్వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాడు డైవ్ చేస్తే బాగుండేది. కానీ ముందుకు వెళ్లిపోతున్న బంతిని కోహ్లి జోక్యం చేసుకుని మరీ ఆపడం సరికాదు. అదృష్టవశాత్తూ ఎవరూ అప్పీలు చేయలేదు కాబట్టి సరిపోయింది’’ అని గావస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. కాగా 21వ ఓవర్ ముగిసే సరికి కోహ్లి కేవలం 41 పరుగుల వద్ద ఉండటం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లో 111 బంతులు ఎదుర్కొన్న కోహ్లి సరిగ్గా 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వన్డేల్లో అతడికి ఇది 51వ సెంచరీ కాగా.. అంతర్జాతీయ కెరీర్లో 82వది కావడం విశేషం. సచిన్ టెండ్కులర్ వంద సెంచరీల రికార్డుకు కోహ్లి ఇంకా 18 శతకాల దూరంలో ఉన్నాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025: భారత్ వర్సెస్ పాకిస్తాన్ స్కోర్లు👉పాకిస్తాన్- 241(49.4) ఆలౌట్👉భారత్- 244/4 (42.3)👉ఫలితం: పాక్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన భారత్.చదవండి: ‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా! -
గిల్ సెంచరీ కోసం హాఫ్ సెంచరీని త్యాగం చేసిన రాహుల్.. అదే హార్దిక్ అయ్యుంటే..!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్తో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదయ్ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్కు జాకిర్ అలీ (68) సహకరించాడు. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండిన బంగ్లాదేశ్కు ఈ ఇద్దరు గౌరవప్రదమైన స్కోర్ను అందించారు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు.అనంతరం శుభ్మన్ గిల్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్ను ఝులింపించగా.. కేఎల్ రాహుల్ (41 నాటౌట్) సిక్సర్ కొట్టి భారత్ను గెలిపించాడు.కాగా, నిన్నటి మ్యాచ్లో గిల్ సెంచరీ అనంతరం సోషల్మీడియాలో ఓ టాపిక్ హైలైట్గా మారింది. ఈ మ్యాచ్లో గిల్ సెంచరీ పూర్తి చేసుకునేందుకు కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీని త్యాగం చేశాడు. గిల్ సెంచరీ కోసం రాహుల్ చేసిన త్యాగాన్ని నెటిజన్లు ప్రశంశిస్తున్నారు. రాహుల్ స్వలాభం కోసం ఆడే ఆటగాడు కాదని కితాబునిస్తున్నారు. రాహుల్ గతంలో కూడా ఓ సందర్భంలో విరాట్ కోహ్లి సెంచరీ కోసం తన హాఫ్ సెంచరీని త్యాగం చేశాడని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు హార్దిక్ పాండ్యాను విమర్శిస్తున్నారు. రాహుల్ స్థానంలో హార్దిక్ ఉంటే గిల్ సెంచరీ పూర్తయ్యేది కాదని అంటున్నారు. హార్దిక్ చాలా సెల్ఫిష్ ఆటగాడని.. మ్యాచ్ పూర్తి చేసేందుకు అతను తోటి వారి మైలురాళ్ల గురించి పట్టించుకోడని కామెంట్స్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వెస్టిండీస్లో తిలక్ వర్మ (49) హాఫ్ సెంచరీని పట్టించుకోకుండా హార్దిక్ సిక్సర్స్తో మ్యాచ్ను మిగించిన వైనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్లో గిల్ సెంచరీకి ముందు రాహుల్ ఎక్కడ ఔటవుతాడో, హార్దిక్ ఎక్కడ క్రీజ్లో వస్తాడో అని అని టెన్షన్ పడినట్లు చెబుతున్నారు. మొత్తానికి గిల్ అభిమానులు హార్దిక్ను ఏకి పారేసి, రాహుల్ను ప్రశంసలతో ముంచెత్తారు.కాగా, నిన్నటి మ్యాచ్లో గిల్ సెంచరీకి సహకరించే క్రమంలో రాహుల్ చాలా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్.. గిల్తో కలిసి ఐదో వికెట్కు అజేయమైన 87 పరుగులు జోడించి భారత్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో రాహుల్ ఏమాత్రం తేడాగా ఆడిన ఫలితం వేరేలా ఉండేది. అప్పటికే భారత్.. రోహిత్, కోహ్లి, శ్రేయస్, అక్షర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండింది. పిచ్ నుంచి కూడా బ్యాటర్లకు ఎలాంటి సహకారం లేదు. ఇలాంటి తరుణంలో రాహుల్ చాలా జాగ్రత్తగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వ్యక్తిగత ప్రయోజనాన్ని పక్కన పెట్టి గిల్ సెంచరీకి కూడా సహకరించాడు. రాహుల్ సహకారంతో గిల్ వన్డేల్లో తన ఎనిమిదో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో గిల్ కూడా చాలా బాధ్యతాయుతంగా ఆడాడు. గిల్ చివరి వరకు క్రీజ్లో నిలదొక్కుకోకపోయినా ఫలితం వేరేలా ఉండేది. బంగ్లాదేశ్ బౌలర్లు పిచ్ స్వభావానికి తగట్టుగా బౌలింగ్ చేసి భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ఏదిఏమైనా గిల్, రాహుల్ భాగస్వామ్యం భారత్ను గెలిపించింది. అంతకుముందు రాహుల్ కీపింగ్లోనూ అదరగొట్టాడు. మూడు అద్భుతమైన క్యాచ్లు పట్టుకుని బెస్ట్ ఫీల్డర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్లో పాకిస్తాన్ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. -
IND Vs BAN: చాంపియన్స్ ట్రోఫీ తొలి పోరులో బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
షమీ... శుబ్... ఆరంభం
229 పరుగుల స్వల్ప విజయలక్ష్యం...భారత్లాంటి బలమైన జట్టు ఆడుతూపాడుతూ దీనిని ఛేదిస్తుందని ఎవరైనా భావిస్తారు... కానీ పిచ్ ఒక్కసారిగా నెమ్మదించింది... పరుగులు రావడం కష్టంగా మారిపోయింది. ఈ స్థితిలో శుబ్మన్ గిల్ పట్టుదలగా నిలబడ్డాడు... కీలక భాగస్వామ్యాలతో జట్టును గెలుపుతీరం చేర్చడంతో పాటు వరుసగా రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు భారత్ పదునైన బౌలింగ్కు ఒకదశలో 35/5 వద్ద కుప్పకూలే స్థితిలో నిలిచిన బంగ్లాదేశ్... తౌహీద్, జాకీర్ ఆటతో 200 పరుగులు దాటగలిగింది. మరో ఐసీసీ మ్యాచ్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో షమీ తన పునరాగమాన్ని ఘనంగా ప్రదర్శించాడు. శుభారంభం తర్వాత ఆదివారం అసలు పోరులో పాకిస్తాన్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలుపు బోణీ చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. తౌహీద్ హృదయ్ (118 బంతుల్లో 100; 6 ఫోర్లు, 2 సిక్స్లు) కెరీర్లో తొలి సెంచరీ సాధించగా... జాకీర్ అలీ (114 బంతుల్లో 68; 4 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు ఆరో వికెట్కు 34.2 ఓవర్లలో 154 పరుగులు జోడించారు. మొహమ్మద్ షమీ (5/53) ఐదు వికెట్లతో చెలరేగగా... హర్షిత్ రాణా 3, అక్షర్ 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లకు 231 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్మన్ గిల్ (129 బంతుల్లో 101 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ శతకం నమోదు చేయగా... కెప్టెన్ రోహిత్ శర్మ (36 బంతుల్లో 41; 7 ఫోర్లు), కేఎల్ రాహుల్ (47 బంతుల్లో 41 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) రాణించారు. భారీ భాగస్వామ్యం... తొలి 5 వికెట్లకు 35 పరుగులు... చివరి 5 వికెట్లకు 39 పరుగులు... మధ్యలో తౌహీద్, జాకీర్ భారీ భాగస్వామ్యం! బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సాగిన తీరిది. షమీ, రాణా దెబ్బకు టపటపా 3 వికెట్లు కోల్పోయిన బంగ్లాను అక్షర్ తన తొలి ఓవర్లోనే దెబ్బ కొట్టాడు. వరుస బంతుల్లో తన్జీద్ (25 బంతుల్లో 25; 4 ఫోర్లు), ముష్ఫికర్ (0)ను అవుట్ చేసిన అతను త్రుటిలో హ్యాట్రిక్ కోల్పోయాడు. 35/5 నుంచి తౌహీద్, జాకీర్ జట్టును ఆదుకున్నారు. భారత ఆటగాళ్ల పేలవ ఫీల్డింగ్ కూడా వారికి కలిసొచ్చింది. సుదీర్ఘ ప్రయత్నం తర్వాత ఎట్టకేలకు 206 బంతుల ఈ భాగస్వామ్యాన్ని షమీ విడగొట్టాడు. ఆ తర్వాత 49వ ఓవర్ తొలి బంతికి సింగిల్తో తౌహీద్ 114 బంతుల్లో కెరీర్లో తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రాణించిన రాహుల్... స్వల్ప లక్ష్యమే అయినా భారత్ ఛేదన సులువుగా సాగలేదు. ముస్తఫిజుర్ ఓవర్లో 3 ఫోర్లు సహా కొన్ని చక్కటి షాట్లు ఆడిన రోహిత్ పదో ఓవర్లో వెనుదిరగ్గా, గిల్ తన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పిచ్ ఒక్కసారిగా మందగించడంతో పరుగుల రాక గగనమైంది. గిల్, విరాట్ కోహ్లి (38 బంతుల్లో 22; 1 ఫోర్) కలిసి 12.5 ఓవర్లలో 43 పరుగులే జోడించగలిగారు. అనంతరం 11 పరుగుల వ్యవధిలో శ్రేయస్ అయ్యర్ (15), అక్షర్ పటేల్ (8) అవుటయ్యారు. అయితే గిల్కు రాహుల్ అండగా నిలిచాడు. బంగ్లా బౌలర్లు మధ్యలో కొద్ది సేపు ఆధిపత్యం ప్రదర్శించినట్లు కనిపించినా... నిలదొక్కుకున్న తర్వాత వీరిద్దరు స్వేచ్ఛగా ఆడారు. గిల్, రాహుల్ 16.2 ఓవర్లలో అభేద్యంగా 87 పరుగులు జోడించి మ్యాచ్ను ముగించారు. ఈ క్రమంలో 46వ ఓవర్లో సింగిల్తో 125 బంతుల్లో గిల్ వన్డేల్లో ఎనిమిదో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తన్జీద్ (సి) రాహుల్ (బి) అక్షర్ 25; సౌమ్య సర్కార్ (సి) రాహుల్ (బి) షమీ 0; నజు్మల్ (సి) కోహ్లి (బి) రాణా 0; మిరాజ్ (సి) గిల్ (బి) షమీ 5; తౌహీద్ (సి) షమీ (బి) రాణా 100; ముష్ఫికర్ (సి) రాహుల్ (బి) అక్షర్ 0; జాకీర్ (సి) కోహ్లి (బి) షమీ 68; రిషాద్ (సి) పాండ్యా (బి) రాణా 18; తన్జీమ్ (బి) షమీ 0; తస్కీన్ (సి) అయ్యర్ (బి) షమీ 3; ముస్తఫిజుర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 228. వికెట్ల పతనం: 1–1, 2–2, 3–26, 4–35, 5–35, 6–189, 7–214, 8–215, 9–228, 10–228. బౌలింగ్: షమీ 10–0–53–5, హర్షిత్ రాణా 7.4–0–31–3, అక్షర్ 9–1–43–2, పాండ్యా 4–0–20–0, జడేజా 9–0–37–0, కుల్దీప్ 10–0–43–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రిషాద్ (బి) తస్కీన్ 41; గిల్ (నాటౌట్) 101; కోహ్లి (సి) సర్కార్ (బి) రిషాద్ 22; అయ్యర్ (సి) నజ్ముల్ (బి) ముస్తఫిజుర్ 15; అక్షర్ (సి అండ్ బి) రిషాద్ 8; రాహుల్ (నాటౌట్) 41; ఎక్స్ట్రాలు 3; మొత్తం (46.3 ఓవర్లలో 4 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–69, 2–112, 3–133, 4–144. బౌలింగ్: తస్కీన్ 9–0–36–1, ముస్తఫిజుర్ 9–0–62–1, తన్జీమ్ 8.3–0–58–0, మిరాజ్ 10–0–37–0, రిషాద్ 10–0–38–2. అక్షర్ ‘హ్యాట్రిక్’ మిస్ మ్యాచ్లో బంగ్లాను తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగినా భారత్ ఫీల్డింగ్ స్థాయికి తగినట్లుగా లేకపోయింది. అక్షర్ తొలి ఓవర్లో వరుసగా రెండు వికెట్ల తర్వాత జాకీర్ (0 వద్ద) ఇచ్చిన అతి సునాయాస క్యాచ్ను స్లిప్లో రోహిత్ వదిలేశాడు. దాంతో అక్షర్ ‘హ్యాట్రిక్’ అవకాశం చేజారింది. రోహిత్ ఆ క్యాచ్ పట్టి ఉంటే స్కోరు 35/6తో ఇక కోలుకునే అవకాశం లేకపోయేది. ఆ తర్వాత జాకీర్ 24 వద్ద ఉన్నప్పుడు జడేజా బౌలింగ్లో స్టంప్ చేసే అవకాశాన్ని రాహుల్ చేజార్చాడు. చివరకు బ్యాటర్ 68 పరుగులు సాధించగలిగాడు. తౌహీద్ స్కోరు 23 వద్ద కుల్దీప్ బౌలింగ్లో మిడాఫ్లో పాండ్యా సునాయాస క్యాచ్ వదిలేయగా చివరకు అతను సెంచరీ పూర్తి చేసుకోగలిగాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో 12 వద్ద తన్జీద్ను రనౌట్ చేసే అవకాశం వచ్చినా...అయ్యర్ త్రో స్టంప్స్కు చాలా దూరంగా వెళ్లింది. భారత్ ఇన్నింగ్స్లో రాహుల్ 9 వద్ద ఉన్నప్పుడు జాకీర్ సులువైన క్యాచ్ వదిలేసి మేలు చేశాడు.200 వన్డేల్లో షమీ 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. బంతుల పరంగా చూస్తే అందరికంటే వేగంగా (5126 బంతుల్లో) ఈ ఘనత సాధించిన బౌలర్గా అతను రికార్డు సాధించాడు. ఇందు కోసం మిచెల్ స్టార్క్కు (ఆ్రస్టేలియా) 5240 బంతులు పట్టాయి. తక్కువ ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించిన భారత బౌలర్గానూ షమీ గుర్తింపు పొందాడు. గతంలో అజిత్ అగార్కర్ 133 ఇన్నింగ్స్లో ఈ మైలురాయి అందుకోగా... షమీ 103 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు.60 ఐసీసీ టోర్నీల్లో అత్యధిక (60) వికెట్లు తీసిన భారత బౌలర్గా షమీ నిలిచాడు. జహీర్ ఖాన్ (32 ఇన్నింగ్స్లలో 59) రికార్డును షమీ (19 ఇన్నింగ్స్లలో 60) సవరించాడు.11000 వన్డేల్లో రోహిత్ 11 వేల పరుగులు పూర్తి చేసుకొని ఈ ఘనత సాధించిన 10వ ఆటగాడిగా నిలిచాడు.156 వన్డేల్లో కోహ్లి క్యాచ్ల సంఖ్య. భారత్ తరఫున అత్యధిక క్యాచ్లు పట్టిన ఫీల్డర్గా అజహరుద్దీన్ (156) రికార్డును సమం చేయగా... జయవర్ధనే (218), పాంటింగ్ (160) వీరికంటే ముందున్నారు. చాంపియన్స్ ట్రోఫీలో నేడు దక్షిణాఫ్రికా X అఫ్గానిస్తాన్ వేదిక: కరాచీ మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18, జియోహాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
IND Vs BAN: శుబ్మన్ గిల్ సూపర్ సెంచరీ.. బంగ్లాపై భారత్ ఘన విజయం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ శుభారంభం చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 229 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 46.3 ఓవర్లలో చేధించింది. భారత యువ ఓపెనర్, వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్ను గిల్ ఫినిష్ చేశాడు.తొలుత దూకుడుగా ఆడిన గిల్.. వరుసగా వికెట్ల పడడంతో కాస్త ఆచితూచి ఆడాడు. ఎప్పుడైతే లక్ష్యానికి జట్టు చేరువైందో గిల్ తన బ్యాటింగ్లో జోరును పెంచాడు. ఈ క్రమంలో 125 బంతుల్లో గిల్ తన ఎనిమిదవ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 129 బంతులు ఎదుర్కొన్న గిల్..9 ఫోర్లు, 2 సిక్స్లతో 101 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ(41), కేఎల్ రాహుల్(41) రాణించారు. బంగ్లా బౌలర్లలో రిషాద్ హొస్సేన్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్ రెహ్మన్, టాస్కిన్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు.హృదయ్ సూపర్ సెంచరీ..ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హ్రిదయ్(118 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 100) సూపర్ సెంచరీతో కదం తొక్కగా.. జాకర్ అలీ(68) ఆర్ధ శతకంతో రాణించాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఫైవ్ వికెట్ హాల్తో మెరిశాడు. తన 10 ఓవర్ల కోటాలో షమీ 53 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. అతడితో పాటు హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా భారత్ తమ తదుపరి మ్యాచ్లో ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్తో దుబాయ్ వేదికగా తలపడనుంది. -
అగ్రపీఠాన్ని అధిరోహించిన శుభ్మన్ గిల్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. గత వారం ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉండిన గిల్.. ఓ స్థానం మెరుగుపర్చుకుని టాప్ ర్యాంక్కు చేరాడు. నంబర్ వన్ స్థానానికి చేరే క్రమంలో గిల్ పాక్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ను వెనక్కు నెట్టాడు. ప్రస్తుత ర్యాంకింగ్స్లో బాబర్ 773 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్, విరాట్, ధోని తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానానికి చేరిన నాలుగో భారత బ్యాటర్గా గిల్ రికార్డుల్లోకెక్కాడు. వన్డే ర్యాంకింగ్స్లో గిల్ నంబర్ స్థానానికి చేరడం ఇది తొలిసారి కాదు. 2023 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ గిల్ టాప్ ర్యాంక్లో ఉన్నాడు. ప్రస్తుతం గిల్ ఖాతాలో 796 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. గిల్కు రెండో స్థానంలో ఉన్న బాబర్కు మధ్య 23 పాయింట్ల వ్యత్యాసం ఉంది.ఈ వారం ర్యాంకింగ్స్లో గిల్తో కలుపుకుని భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లు టాప్-10లో ఉన్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో.. విరాట్ కోహ్లి ఆరులో.. శ్రేయస్ అయ్యర్ 9వ స్థానంలో నిలిచారు. గత వారంతో పోలిస్తే శ్రేయస్ ఓ ర్యాంక్ మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి చేరాడు. తాజా ర్యాంకింగ్స్లో సౌతాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ నాలుగులో, న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్ ఐదులో.. ఐర్లాండ్ ఆటగాడు హ్యారీ టెక్టార్ ఏడులో.. లంక కెప్టెన్ అసలంక ఎనిమిదిలో.. షాయ్ హోప్ పదో స్థానంలో ఉన్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ను కిందకు దించి లంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ టాప్ ర్యాంక్కు చేరుకున్నాడు. భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ ఓ స్థానం మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి చేరాడు. భారత్ నుంచి టాప్-10లో కుల్దీప్తో పాటు సిరాజ్ (10వ ర్యాంక్) మాత్రమే ఉన్నాడు. నమీబియా బౌలర్ బెర్నాల్డ్ స్కోల్జ్ మూడులో.. షాహీన్ అఫ్రిది ఐదులో.. కేశవ్ మహారాజ్ ఆరులో.. మిచెల్ సాంట్నర్ ఏడులో .. మ్యాట్ హెన్రీ ఎనిమిదిలో.. గుడకేశ్ మోటీ తొమ్మిది స్థానాల్లో ఉన్నారు.ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ మొహమ్మద్ నబీ టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా రెండో స్థానంలో నిలిచాడు. భారత్ నుంచి రవీంద్ర జడేజా ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. జడ్డూ 217 రేటింగ్ పాయింట్లతో పదో స్థానంలో నిలిచాడు. జట్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా టాప్ ర్యాంక్లో కొనసాగుతుంది. భారత్.. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకు అందనంత ఎత్తులో ఉంది. ఇరు జట్లకు మధ్య దాదాపు 800 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది. -
బాబర్ను దించి అగ్రపీఠాన్ని అధిరోహించనున్న గిల్
టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో (ICC ODI Rankings) అగ్రపీఠాన్ని అధిరోహించనున్నాడు. ఈ వారం ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉన్న గిల్ (781 రేటింగ్ పాయింట్లు).. వచ్చే బుధవారం వెలువడే ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంక్కు చేరుకోనున్నాడు. ఇప్పటిదాకా టాప్ ర్యాంక్లో ఉన్న పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ (Babar Azam) (786).. ఇవాళ (ఫిబ్రవరి 14) న్యూజిలాండ్తో జరుగుతున్న ట్రై సిరీస్ ఫైనల్లో విఫలమయ్యాడు. బాబర్కు గిల్కు మధ్య కేవలం ఐదు పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ఈ బుధవారం ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో గిల్ సెంచరీ చేశాడు. ఈ వారం ర్యాంకింగ్స్లో ఇది పరిగణలోకి రాలేదు. కాబట్టి వచ్చే వారం ర్యాంకింగ్స్లో ఈ సెంచరీ తాలుకా పాయింట్లు గిల్కు యాడ్ అవుతాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్కు (బంగ్లాదేశ్తో) ముందే గిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో బాబర్ను కిందకు దించి టాప్ ర్యాంక్కు చేరుకుంటాడు.రేసులో రోహిత్ కూడా..!వన్డే ర్యాంకింగ్స్ టాప్ ర్యాంక్ రేసులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా ఉన్నాడు. ఈ వారం ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉన్న రోహిత్.. ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ ఆడితే గిల్ను సైతం వెనక్కునెట్టి టాప్ ర్యాంక్కు చేరుకుంటాడు. ప్రస్తుతం టాప్ ర్యాంక్లో ఉన్న బాబర్కు రోహిత్కు మధ్య కేవలం 13 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. బాబర్ ఖాతాలో 786 పాయింట్లు ఉండగా.. రోహిత్ ఖాతాలో 773 పాయింట్లు ఉన్నాయి.చరిత్ర సృష్టించిన బాబర్న్యూజిలాండ్తో జరుగుతున్న ట్రై సిరీస్ ఫైనల్లో విఫలమైనా పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హాషిమ్ ఆమ్లాతో కలిసి రికార్డు షేర్ చేసుకున్నాడు. ఆమ్లా, బాబర్కు తలో 123 ఇన్నింగ్స్ల్లో 6000 పరుగులు పూర్తి చేశారు. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన టాప్-5 ఆటగాళ్ల జాబితాలో బాబర్, ఆమ్లా తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. విరాట్ 136 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని తాకితే.. కేన్ మామ, వార్నర్ భాయ్ తలో 139 ఇన్నింగ్స్ల్లో 6000 పరుగుల క్లబ్లో చేరారు.ట్రై సిరీస్ ఫైనల్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 41.5 ఓవర్ల అనంతరం ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్లో ఇప్పటివరకు ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కాలేదు. రిజ్వాన్ 46, సల్మాన్ అఘా 45, తయ్యబ్ తాహిర్ 38, బాబర్ ఆజమ్ 29 పరుగులు చేశారు. ఖుష్దిల్ షా (6), ఫమీమ్ అష్రఫ్ (1) క్రీజ్లో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ, మైఖేల్ బ్రేస్వెల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. నాథన్ స్మిత్, జేకబ్ డఫీ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
బాబర్ ఆజమ్ టాప్ ర్యాంక్కు అతి చేరువగా శుభ్మన్ గిల్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో (ICC ODI Rankings) టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) రెండో స్థానానికి ఎగబాకాడు. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam) టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. బాబర్కు గిల్కు మధ్య రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. గిల్ మరో 6 పాయింట్లు సాధిస్తే బాబర్ ఆజమ్కు కిందకు దించి టాప్ ర్యాంక్కు చేరుకుంటాడు. గిల్ రెండో స్థానానికి చేరడంతో అప్పటివరకు ఆ స్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మూడో స్థానానికి పడిపోయాడు. వచ్చే వారం ప్రకటించే ర్యాంకింగ్స్లో రోహిత్కు కూడా అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. మూడో స్థానంలో ఉన్న రోహిత్కు టాప్ ప్లేస్లో ఉన్న బాబర్కు మధ్య కేవలం 13 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ప్రస్తుతం బాబర్ ఖాతాలో 786 పాయింట్లు, గిల్ ఖాతాలో 781, రోహిత్ ఖాతాలో 773 పాయింట్లు ఉన్నాయి.ఈ వారం ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి రెండు స్థానాలు కోల్పోయాడు. గత వారం నాలుగో ప్లేస్లో ఉన్న కోహ్లి.. ఇంగ్లండ్తో రెండో వన్డేలో విఫలం కావడంతో ఆరో స్థానానికి పడిపోయాడు. ఇంగ్లండ్తో తొలి రెండు వన్డేల్లో రాణించిన భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ ఓ స్థానం మెరుగుపర్చుకుని 10వ స్థానానికి చేరుకున్నాడు. ఈ వారం టాప్-10 బ్యాటర్ల ర్యాంకింగ్స్లో నలుగురు భారత బ్యాటర్లు ఉన్నారు. ఐర్లాండ్ ఆటగాడు హ్యారీ టెక్టార్ నాలుగో స్థానంలో, హెన్రిచ్ క్లాసెన్ ఐదులో, డారిల్ మిచెల్ ఏడులో, షాయ్ హోప్, రహ్మానుల్లా గుర్భాజ్ ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లండ్తో నిన్న జరిగిన మూడో వన్డే తాజా ర్యాంకింగ్స్ పరిగణలోకి రాలేదు.వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. రషీద్ ఖాన్ అగ్రస్థానానికి నిలబెట్టుకున్నాడు. మహీశ్ తీక్షణ ఓ స్థానం మెరుగుపర్చుకుని రెండో స్థానానికి ఎగబాకాడు. నమీబియా బౌలర్ బెర్నార్డ్ స్కోల్జ్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో ప్లేస్కు చేరాడు. పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది నాలుగో స్థానాన్ని కాపాడుకోగా.. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు స్థానాలు కోల్పోయి ఐదో ప్లేస్కు పడిపోయాడు. ఇంగ్లండ్తో తాజాగా జరిగిన సిరీస్కు దూరంగా ఉన్న మొహమ్మద్ సిరాజ్ నాలుగు స్థానాలు కోల్పోయి 10వ ప్లేస్కు పడిపోయాడు. తాజా ర్యాంకింగ్స్లో భారత్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే టాప్-10లో ఉన్నారు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో మొహమ్మద్ నబీ టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. రవీంద్ర జడేజా 10వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.