breaking news
Shubman Gill
-
రోహిత్ శర్మ రిటైర్మెంట్ ? రోహిత్ లేకపొతే కష్టం.. SHUBMAN GILL షాకింగ్ కామెంట్స్
-
మెరుగుపడాల్సిందే: బుమ్రాతో పాటు వాళ్లకు గిల్ వార్నింగ్!
ఇంగ్లండ్తో నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. లార్డ్స్లో ఆదివారం నాటి మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్ దారుణంగా విఫలమైంది. టీమిండియా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడంతో ఇంగ్లండ్ రికార్డు స్థాయిలో 387 పరుగులు చేసింది.గాయాల వల్ల ఇద్దరూ దూరంలక్ష్య ఛేదనలో భారత్ 360 పరుగులకే పరిమితమై.. 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా సిరీస్ 2-1తో ఇంగ్లండ్ సొంతమైంది. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్కు దూరం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక గాయం కారణంగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా మ్యాచ్ ఆడలేకపోయాడు.గిల్ కీలక వ్యాఖ్యలుబుమ్రా, వాషీ స్థానాల్లో అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ మూడో వన్డే ఆడారు. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తరచూ గాయపడే ఆటగాళ్ల వల్ల తుదిజట్టు కూర్పు దెబ్బతింటోందన్నాడు. ఈ మేరకు.. ‘‘ఒక ఆటగాడు గాయపడితే కూర్పు ఒకలా ఉంటుంది.ఒకరి కంటే ఎక్కువ మంది గాయపడితే జట్టు కాంబినేషన్లో మరిన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రతీ మ్యాచ్ తర్వాత ఒక ఆటగాడు గాయపడతున్నాడంటే మేము ఎక్కడో ట్రిక్ మిస్ అవుతున్నామని అనిపిస్తోంది.ఎక్కడో చోట తేడా కొడుతుందిప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని మేము 11 మ్యాచ్లు వరుసగా ఆడాల్సి ఉంది. అయితే, తరచూ గాయాల బారిన పడే ఆటగాళ్లు ఈ సిరీస్లో రెండు లేదంటే మూడు మ్యాచ్లు మిస్ కావొచ్చు. ఇలా ఎక్కడో చోట తేడా కొడుతుంది. తరచూ గాయపడే ప్లేయర్ ఒకటి లేదా రెండు మ్యాచ్లు ఆడతాడు.ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యల వల్ల దూరమవుతాడు. అలాంటి సమయంలో కొత్త ప్లేయర్ను ఆడించాల్సి ఉంటుంది. నిజానికి తుదిజట్టును తరచూ మార్చాలనే ఆలోచన మాకు లేదు. కానీ గాయాల వల్ల తప్పక ఇలా చేయాల్సి వస్తోంది.ఎప్పుడు ఎవరు గాయపడతారో తెలియదు. కొంతమంది 80 శాతం ఫిట్గా ఉన్నా సరే ఆడటానికి ముందుకు వస్తారు. అయితే, మేము ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగితే.. అందులో ఒకరు కేవలం ఐదు ఓవర్లు మాత్రమే బౌల్ చేస్తామంటే కుదరదు కదా!మెరుగుపడాల్సిందేపూర్తి ఫిట్గా ఉంటేనే వారు పది ఓవర్లు బౌల్ చేయగలరు. కాబట్టి మేము రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. ఏదేమైనా జట్టుగా మేము ఫిట్నెస్ ప్రమాణాలను మరింతగా మెరుగపరచుకోవాల్సి ఉంది’’ అని శుబ్మన్ గిల్ పేర్కొన్నాడు. తరచూ గాయాలుకాగా పేస్ దళ నాయకుడు బుమ్రా తరచూ గాయపడుతున్న సంగతి తెలిసిందే. చాలా నెలల తర్వాత ఇంగ్లండ్తో తొలి వన్డే సందర్భంగా ఇటీవలే అతడు యాభై ఓవర్ల ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చాడు. రెండు మ్యాచ్లు ఆడగానే.. మోకాలి గాయంతో కీలకమైన మూడో వన్డేకు దూరమయ్యాడు.అంతేకాదు బుమ్రాపై పనిభారం తగ్గించే క్రమంలో మేనేజ్మెంట్ అతడికి తరచూ విశ్రాంతినిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో గిల్ ఒక రకంగా బుమ్రా ఫిట్నెస్ ప్రమాణాల పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ ప్రస్తావన తేవడం ద్వారా ఈ పేస్ గుర్రానికి గిల్ పరోక్షంగా హెచ్చరిక జారీ చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా యూకే పర్యటనలో భాగంగా తొలుత ఐర్లాండ్తో టీ20 సిరీస్లో 2-0తో వైట్వాష్ అయిన టీమిండియా.. ఇంగ్లండ్ చేతిలో 4-0తో క్లీన్స్వీప్ అయింది. తాజాగా వన్డే సిరీస్నూ కోల్పోయి ఓటమితో నిష్క్రమించింది.చదవండి: వారి వల్లే ఓడిపోయాం.. అతడు అద్భుతం: గిల్ -
IND vs ENG: అందుకే అతడు బెంచ్కే పరిమితం: గిల్
ఇంగ్లండ్తో మూడో వన్డేలో భారత్ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది. ఈ నిర్ణయాత్మక మ్యాచ్కు పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది. రెండో వన్డే సందర్భంగా ఎడమ మోకాలు ఉబ్బిపోవడం వల్ల అతడు లార్డ్స్ మ్యాచ్కు దూరమయ్యాడని ప్రకటన విడుదల చేసింది.కుల్దీప్ను ఆడిస్తారనుకుంటే..ఇక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా రెండో వన్డే సందర్భంగానే గాయపడ్డాడు. దీంతో అతడి స్థానాన్ని బీసీసీఐ హర్ష్ దూబేతో భర్తీ చేసింది. అయితే, తుదిజట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. ఇదిలా ఉంటే.. వాషీ దూరం కావడంతో.. అతడి స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడో వన్డే ఆడతాడని అంతా భావించారు.కానీ యాజమాన్యం మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషీకి బదులు.. పేస్ బౌలర్ ప్రిన్స్ యాదవ్కు తుదిజట్టులో చోటు ఇచ్చింది. దీంతో కుల్దీప్ యాదవ్కు మరోసారి అన్యాయం చేశారంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే, టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ ఈ విషయం గురించి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాడు. ‘‘బుమ్రా మోకాలి గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. వాషింగ్టన్ సుందర్ కూడా గాయపడ్డాడు. శివం దూబే కూడా ఈ మ్యాచ్ ఆడటం లేదు.అందుకే అతడు బెంచ్కు పరిమితంఈ ముగ్గురి స్థానాల్లో కేఎల్ రాహుల్, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్ తుదిజట్టులోకి వచ్చారు. మేము లార్డ్స్ మైదానంలో నలుగురు సీమర్లను ఆడించాలని నిర్ణయించుకున్నాము. ఫాస్ట్ బౌలర్లతో పోలిస్తే స్పిన్నర్లు ఇక్కడ మధ్య ఓవర్లలో పెద్దగా ప్రభావం చూపరు అనిపించింది’’ అని గిల్ పేర్కొన్నాడు. తద్వారా కుల్దీప్ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని పరోక్షంగా వెల్లడించాడు.వైట్వాష్ల తర్వాత..కాగా యూకే పర్యటనలో భాగంగా టీమిండియా తొలుత ఐర్లాండ్తో టీ20 సిరీస్లో తలపడి.. ఆతిథ్య జట్టు చేతిలో కనీవినీ ఎరుగని రీతిలో 2-0తో క్లీన్స్వీప్ అయింది. అనంతరం ఇంగ్లండ్ చేతిలో టీ20 సిరీస్లో 4-0తో వైట్వాష్ అయింది. ఈ క్రమంలో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటికి భారత్- ఇంగ్లండ్ చెరో వన్డే గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి నిర్ణయాత్మక మూడో వన్డేకు లార్డ్స్ మైదానం ఆతిథ్యమిస్తుండగా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్కు దిగింది. ఈ మ్యాచ్లో భారత్ నలుగురు పేసర్లు గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణను ఆడిస్తోంది.ఇంగ్లండ్తో మూడో వన్డేకు భారత తుదిజట్టురోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ.చదవండి: టీమిండియాకు భారీ షాక్! -
మూడో వన్డేలో భారత్ ఓటమి.. సిరీస్ ఇంగ్లండ్దే
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో 27 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కోల్పోయింది. 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 360 రన్స్ చేసింది. రోహిత్ శర్మ(138), శుబ్మన్ గిల్(77), విరాట్ కోహ్లి వంటి టాపార్డర్ బ్యాటర్లు రాణించినప్పటికి, మిడిలార్డర్ విఫలం కావడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కుర్రాన్ 4 వికెట్లు పడగొట్టగా.. రషీద్, జాకబ్ బెతల్, ఆర్చర్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఏకంగా 387 పరుగులు సాధించింది. ఓపెనర్లు బెన్ డకెట్ (141), జేకబ్ బెతెల్ (91) దుమ్ములేపగా.. జో రూట్ (48 బంతుల్లో 74), జోస్ బట్లర్ (13 బంతుల్లో 41) మెరుపు ఇన్నింగ్స్తో అజేయంగా నిలిచారు. ఓటమి దిశగా భారత్భారత్ వరుస ఓవర్లలో కేఎల్ రాహుల్(12), అక్షర్ పటేల్(2) వికెట్లను కోల్పోయింది. టీమిండియా విజయానికి 10 బంతుల్లో 47 పరుగులు కావాలి.విరాట్ కోహ్లి అవుట్టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 74 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. సామ్ కుర్రాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. భారత విజయానికి 28 బంతుల్లో 73 పరుగులు కావాలి. క్రీజులో రాహుల్, అక్షర్ పటేల్ ఉన్నారు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్ఇషాన్ కిషన్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన కిషన్.. సామ్ కుర్రాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. అదే ఓవర్లో శ్రేయస్ అయ్యర్(0) డకౌటయ్యాడు. క్రీజులో కోహ్లి(65) ఉన్నారు. భారత విజయానికి 82 పరుగులు కావాలి.టీమిండియా ట్రిపుల్ సెంచరీటీమిండియా స్కోర్ 300 పరుగులు దాటింది. భారత విజయానికి 39 బంతుల్లో ఇంకా 84 పరుగులు కావాలి.రోహిత్ అవుట్రోహిత్ శర్మ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. భారీ సెంచరీతో సత్తాచాటిన రోహిత్.. బెతల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్లతో 138 పరుగులు చేశాడు. 39 ఓవర్లకు భారత్ స్కోర్: 262/2రోహిత్ సెంచరీలార్డ్స్ వన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. కేవలం 84 బంతుల్లో తన 34వ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 33 ఓవర్లకు భారత్ స్కోర్: 218/1సెంచరీకి చేరువలో రోహిత్రోహిత్ శర్మ 92 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్నాడు. 29 ఓవర్లకు భారత్ స్కోర్: 187/1భారత్ తొలి వికెట్ డౌన్147 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 77 పరుగులు చేసిన కెప్టెన్ శబ్మన్ గిల్.. అదిల్ రషీద్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.రోహిత్ హాఫ్ సెంచరీరోహిత్ శర్మ కూడా తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 21 ఓవర్లకు భారత్ స్కోర్: 117/0ఇరవై ఓవర్లలో భారత్ స్కోరు: 109-0రోహిత్ 42, గిల్ 65 పరుగులతో ఉన్నారు. భారత్ విజయానికి 279 పరుగులు కావాలి. సెంచరీ కొట్టిన టీమిండియా18.3: ఆదిల్ రషీద్ బౌలింగ్లో రోహిత్ సింగిల్ తీయడంతో.. టీమిండియా వంద పరుగుల మార్కును చేరుకుంది. భారత్ స్కోరు: 103-0 (19). గిల్ 60, రోహిత్ 41 పరుగులతో ఉన్నారు. విజయానికి 285 పరుగులు కావాలి.గిల్ అర్ధ శతకం14.3వ ఓవర్: ఆదిల్ రషీద్ బౌలింగ్లో రెండు పరుగులు తీసి యాభై పరుగుల మార్కు అందుకున్న గిల్. 54 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి. భారత్ స్కోరు: 89-0 (15). గిల్ 52, రోహిత్ 36 పరుగులతో ఉన్నారు.14 ఓవర్లలో టీమిండియా స్కోరు: 81-0గిల్ 49, రోహిత్ 36 పరుగులతో ఉన్నారు.టీమిండియా హాఫ్ సెంచరీ10.2: సామ్ కరన్ బౌలింగ్లో గిల్ సింగిల్ తీయగా.. టీమిండియా యాభై పరుగుల మార్కు పూర్తి చేసుకుంది. స్కోరు: 60-0(11). రోహిత్ 34, గిల్ 26 పరుగులతో ఉన్నారు.పవర్ ప్లేలో భారత్ స్కోరు: 49-0 (10)కట్టుదిట్టమైన బంతులతో పదో ఓవర్ను మెయిడెన్ చేసిన టంగ్.రోహిత్ శర్మ 24, గిల్ 25 పరుగులతో ఉన్నారు. విజయానికి ఇంకా 40 ఓవర్లలో 339 పరుగులు కావాలి.గేరు మార్చిన రోహిత్ఎనిమిదో ఓవర్లో జోష్ టంగ్ బౌలింగ్లో తొలి రెండు బంతుల్లో ఫోర్లు బాదిన రోహిత్ శర్మ. పుల్ షాట్తో ఐదో బంతిని సిక్సర్గా మలిచిన హిట్మ్యాన్. భారత్ స్కోరు: 43-0 (8). రోహిత్ 23, గిల్ 20 పరుగులతో ఉన్నారు.ఐదు ఓవర్లలో భారత్ స్కోరు: 17-0రోహిత్ మూడు, గిల్ 14 పరుగులతో ఉన్నారు.టార్గెట్ 388.. లక్ష్య ఛేదనకు దిగిన భారత్మూడు ఓవర్లలో భారత్ స్కోరు: 9-0ఓపెనర్లు రోహిత్ ఒకటి , గిల్ ఎనిమిది పరుగులతో ఉన్నారు.ఇంగ్లండ్ భారీ స్కోరుఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 387 పరుగులు చేసింది. టీమిండియాకు 388 పరుగుల లక్ష్యాన్ని విధించింది. కాగా వన్డే ఫార్మాట్లో భారత్పై ఇంగ్లండ్కు ఇదే అత్యధిక స్కోరు. బట్లర్ మెరుపులు49 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు 371-3బట్లర్ 10 బంతుల్లోనే 34 పరుగులు చేయగా.. రూట్ 65 పరుగులతో ఉన్నాడు.బ్రూక్ అవుట్46.5వ ఓవర్: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి హ్యారీ బ్రూక్ (14) మూడో వికెట్గా వెనుదిరిగాడు. స్కోరు: 324-3. రూట్ 55 పరుగులతో ఉన్నాడు. జోస్ బట్లర్ క్రీజులోకి వచ్చాడు.రూట్ హాఫ్ సెంచరీ45.3వ ఓవర్: గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న రూట్. 39 బంతుల్లోనే యాభై పరుగులు సాధించిన రూట్. వన్డేల్లో అతడికి ఇది వరుసగా ఆరో హాఫ్ సెంచరీ. ఇంగ్లండ్ స్కోరు 315-2 (46). రూట్ 50, బ్రూక్ పది పరుగులతో ఉన్నారు.45 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 305-2హ్యారీ బ్రూక్ 5, రూట్ 45 పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్43.3వ ఓవర్: ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ శతక వీరుడు బెన్ డకెట్ రెండో వికెట్గా వెనుదిరిగాడు. మొత్తంగా 135 బంతులు ఎదుర్కొన్న డకెట్ 18 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 141 పరుగులు చేశాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ క్రీజులోకి వచ్చాడు. నలభై ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 261-1డకెట్ 125 బంతుల్లో 127, రూట్ 22 బంతుల్లో 23 పరుగులతో ఉన్నారు.డకెట్ సెంచరీ35.2వ ఓవర్: గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో ఫోర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్న ఇంగ్లండ్ ఓపెనర్ డకెట్. 108 బంతుల్లో శతక మార్కు అందుకున్న డకెట్. 36 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ స్కోరు: 226-1(36). డకెట్ 102, రూట్ 13 పరుగులతో ఉన్నారు.200 పరుగులు పూర్తి చేసుకున్న ఇంగ్లండ్33 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 206-1.డకెట్ 90, రూట్ ఐదు పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ డౌన్.. సెంచరీ మిస్30.1వ ఓవర్: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో రోహిత్కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా వెనుదిరిగిన బెతెల్ (93 బంతుల్లో 91). ఆద్యంతం నిలకడగా ఆడి సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. జో రూట్ క్రీజులోకి వచ్చాడు.ఇంగ్లండ్ ఓపెనర్ల రికార్డు భాగస్వామ్యంముప్పై ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 192-0. టీమిండియాపై ఇంగ్లండ్కు ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. బెతెల్ 91, డకెట్ 81 పరుగులతో ఉన్నారు. ఇద్దరూ కలిసి 180 బంతుల్లో 192 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.25 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 163-0బెతెల్ 79, డకెట్ 65 పరుగులతో ఉన్నారు. లార్డ్స్ మైదానంలో వన్డేల్లో తొలి వికెట్కు ఇదే అత్యధిక భాగస్వామ్యం (163).డకెట్ ఫిఫ్టీ21.3: గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో రెండు పరుగులు తీసి.. యాభై పరుగుల మార్కు అందుకున్న డకెట్. 64 బంతుల్లో ఫిఫ్టీ కొట్టిన డకెట్. ఇంగ్లండ్ స్కోరు: 136- 0 (21.5)20 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 125-0బెతెల్ 61, డకెట్ 46 పరుగులతో ఉన్నారు.బెతెల్ అర్ధ శతకం15.4వ ఓవర్: అర్ష్దీప్ బౌలింగ్లో ఫోర్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఇంగ్లండ్ ఓపెనర్ బెతెల్. ఇంగ్లండ్ స్కోరు: 101-0(16). బెతెల్ 53, డకెట్ 34 పరుగులతో ఉన్నారు.పదిహేను ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 96-0(15)బెతెల్ 48, డకెట్ 34 పరుగులతో ఆడుతున్నారు.పవర్ ప్లేలో ఇంగ్లండ్ స్కోరు: 58-0(10)బెతెల్ 25, డకెట్ 22 పరుగులతో ఉన్నారు.హాఫ్ సెంచరీ కొట్టిన ఇంగ్లండ్బెతెల్ 23, డకెట్ 18 పరుగులతో ఉన్నారు. ఇంగ్లండ్ స్కోరు: 51-0 (8.1).నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్ ఓపెనర్లుఅర్ష్దీప్ సింగ్ టీమిండియా బౌలింగ్ అటాక్ ఆరంభించగా.. ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జేకబ్ బెతెల్ నిలకడగా ఆడుతున్నారు. నాలుగు ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 31-0. డకెట్ 15, బెతెల్ 14 పరుగులతో ఉన్నారు.భారత్కు ఎదురుదెబ్బభారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. టాస్ సమయంలో కెప్టెన్ శుబ్మన్ గిల్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇక ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా గాయం వల్ల దూరం కాగా.. భారత్ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది.కేఎల్ రాహుల్ తిరిగి రాగా శివం దూబే బెంచ్కే పరిమితం కాగా.. బుమ్రా స్థానంలో అర్ష్దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. వాషీకి బదులు ప్రిన్స్ యాదవ్ చోటు దక్కించుకున్నాడు.దిగ్గజానికి నివాళిగ్యారీ సోబర్స్కు నివాళిగా ఇరుజట్ల ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్ బ్యాండ్లతో బరిలోకి దిగారు.గంట మోగించిన యువీలార్డ్స్ మ్యాచ్కు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన టీమిండియా దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ గంట మోగించి మ్యాచ్ను ఆరంభించాడు.Yuvraj Singh rings the iconic Lord's Bell to signal the start of the series decider. 🔔 Watch #ENGvIND, LIVE NOW on Sony Sports Network TV channels.#SonySportsNetwork #MamlaPersonalHai #ExtraaaInnings pic.twitter.com/OcQ6C2e7du— Sony Sports Network (@SonySportsNetwk) July 19, 2026తుదిజట్లుభారత్రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణఇంగ్లండ్బెన్ డకెట్, జేకబ్ బెతెల్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కర్రాన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్. -
రోహిత్ వివాదం.. టీమిండియాకు బీసీసీఐ కీలక ఆదేశాలు!
రోహిత్ శర్మ రిటైర్మెంట్పై సోషల్ మీడియాలో ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మ్యాచ్లు ఉన్న సమయంలో వీలైనంత మేర సోషల్ మీడియాకు దూరంగా ఉండడం మంచిదని ఆటగాళ్లకు బీసీసీఐ సూచించింది. శనివారం లండన్లోని భారత హైకమిషన్ నిర్వహించిన ప్రవాస భారతీయుల సన్మాన కార్యక్రమంలో భాగంగా టీమిండియాతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్, హెడ్ కోచ్ గంభీర్ సహా ఆటగాళ్లంతా హాజరయ్యారు.99 శాతం అదే ధోరణిలో: రాజీవ్ శుక్లారాజీవ్ శుక్లా మాట్లాడుతూ..'భారతదేశంలో 99 శాతం మంది ప్రజలు తమను తాము క్రికెట్ నిపుణులుగా భావిస్తుంటారని, అందుకే మ్యాచ్లకు ముందు ఆటగాళ్లు సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండడం మంచిదని నా అభిప్రాయం. మన జట్టులో ప్రతిభకు కొదవలేదని, కేవలం ఆటపై దృష్టి పెట్టడమే ఆటగాళ్లు ముందున్న కర్తవ్యం. అనవసర విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం ఆటగాళ్లకు లేదు.' అని చెప్పుకొచ్చారు.బయటి విషయాలు పట్టించుకోను: గిల్టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ మాట్లాడుతూ.. తన చేతిలో లేని బయటి అంశాల గురించి ఆలోచించకుండా, కేవలం తన ఆటపైనే దృష్టి పెట్టడం వల్ల ఎలాంటి ఒత్తిడినైనా సులభంగా అధిగమించగలనని ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికే టీమిండియాలో క్యాంప్లో రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి పుకార్లు షికార్లు చేస్తున్న వేళ గిల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఇక గాయాల నుంచి కోలుకొని టీ20 కెప్టెన్గా ప్రమోషన్ పొందిన శ్రేయస్ అయ్యర్ తన పునరాగమన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు. తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు సహచర ఆటగాళ్లు చేసిన ఫోన్ కాల్స్, వారు ఇచ్చిన మద్దతు తనలో ఎంతో స్ఫూర్తిని నింపాయని, అందుకే మరింత బలంగా జట్టులోకి తిరిగి రాగలిగానని అయ్యర్ భావోద్వేగంతో పేర్కొన్నాడు. చారిత్రక బంధం: గంభీర్ఇక టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ భారత్-బ్రిటన్ మధ్య ఉన్న చారిత్రక సంబంధాల వల్ల యూకే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ప్రదేశమేనని అన్నారు. భారత క్రికెట్ అనేది కేవలం డ్రెస్సింగ్ రూమ్కే పరిమితం కాదని, జట్టును బేషరతుగా ప్రేమించే ప్రతి ఒక్క నిజాయితీ గల అభిమానికి చెందుతుందని గంభీర్ స్పష్టం చేశాడు. ఇక ఈ వేడుకకు ఆతిథ్యమిచ్చిన యూకేలోని భారత హైకమిషనర్ పి. కుమారన్, డిప్యూటీ హైకమిషనర్ కార్తీక్ పాండేలు టీమిండియాకు ఘన స్వాగతం పలికారు. ఇదే వారంలో అమల్లోకి వచ్చిన భారత్-యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం (CETA) వ్యాపారంతో పాటు క్రీడారంగానికి కూడా ఎన్నో కొత్త అవకాశాలను తెరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ టీమిండియా సాధించిన విజయాలు దేశానికి ఎంతో గర్వకారణమని వారు కొనియాడారు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇవాళ చివరి వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరీస్లో 1-1తో సమంగా ఉన్న ఇరుజట్లు ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. -
సిరీస్ విజయంపై గురి.. లార్డ్స్లో టీమిండియాకు ఘన చరిత్ర!
ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో భాగంగా టీమిండియా తమ చివరి వన్డేను ఆదివారం ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా ఆడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను 2-1తో కైవసం చేసుకోవాలని గిల్ సేన భావిస్తోంది. మరి లార్డ్స్ గడ్డపై టీమిండియా రికార్డు ఎలా ఉంది, ఎన్ని మ్యాచ్లు ఆడింది? గెలిచినవెన్నీ, ఓడినవెన్ని అనేది ఇప్పుడు పరిశీలిద్దాం. లార్డ్స్లో భారత జట్టు అంతర్జాతీయంగా 31 మ్యాచ్లు (అన్ని ఫార్మాట్లు) ఆడితే ఏడు గెలిచి 19 ఓడింది. ఒక మ్యాచ్ టై కాగా, 14 డ్రాగా ముగిశాయి. లార్డ్స్ వేదికలో భారత్ ఓవరాల్ విన్నింగ్ శాతం 22.58 పర్సంటైల్గా ఉంది. వన్డేల్లో మాత్రం టీమిండియాకు లార్డ్స్ వేదికలో మంచి రికార్డే ఉంది. ఓవరాల్గా లార్డ్స్లో ఏడు గెలిస్తే అందులో మూడు వన్డేల నుంచే రావడం విశేషం. మొత్తంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య 8 వన్డేలు జరిగితే టీమిండియా మూడు, ఇంగ్లండ్ నాలుగు చొప్పున గెలిచాయి. ఒక మ్యాచ్ టై అయింది. వన్డేల్లో లార్డ్స్ వేదికలో భారత విజయాల శాతం 37.5 పర్సంటైల్గా ఉంది. ఈ వేదికలో 2022, జూలై 14న భారత్, ఇంగ్లండ్ చివరిసారిగా వన్డే ఆడాయి.ఈ వన్డేలో టీమిండియా 100 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. మోయిన్ అలీ 47 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, డేవిడ్ విల్లే 41 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 4 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో పూర్తిగా తడబడిన టీమిండియా 38.5 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. పాండ్యా, జడేజా చెరో 29 పరుగులు చేశారు. మ్యాచ్లో రీస్ టోప్లే ఆరు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాసించాడు.లార్డ్స్ వేదికపై జరిగిన వన్డేలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో సౌరవ్ గంగూలీ (208 పరుగులు) తొలి స్థానంలో ఉండగా, యువరాజ్ సింగ్ (170) రెండు, ఎంఎస్ ధోని (165) మూడు, రాహుల్ ద్రవిడ్ (149), సురేశ్ రైనా (130)లు వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే చాహల్, ఆర్పీ సింగ్ ఐదేసి వికెట్లతో తొలి స్థానంలో ఉండగా, మొహిందర్ అమర్నాథ్, జహీర్ ఖాన్, మదన్లాల్లు తలా 4 వికెట్లు పడగొట్టారు.చదవండి: ఫిఫా ఫైనల్ ఆఖరిదా?.. రిటైర్మెంట్పై మెస్సీ స్పందన! -
విశ్రాంతి వద్దన్న రోహిత్.. అతడి కోసం గిల్ అనూహ్య నిర్ణయం!
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగే మూడో వన్డే హిట్మ్యాన్ కెరీర్లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ వార్తల్ని కొట్టిపారేశాడు. లార్డ్స్ వన్డే రోహిత్కు చివరి మ్యాచ్ కాదని స్పష్టం చేశాడు.సెలక్టర్లపై బీసీసీఐ ఆగ్రహం!అదే విధంగా ఈ విషయంలో లీకులు ఇచ్చారని సెలక్టర్లపై బీసీసీఐ ఆగ్రహం చేసినట్లు సమాచారం. ఇలాంటి తరుణంలో మరో ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. నిజానికి అఫ్గానిస్తాన్తో ఇటీవల స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ నుంచే రోహిత్ శర్మను పక్కనపెట్టాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం.అప్పుడే డిసైడ్ అయ్యారువిశ్రాంతి పేరిట రోహిత్ను పక్కనపెట్టి.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను అఫ్గాన్తో సిరీస్లో ఆడించాలనే యోచనలో ఉన్నారట. అయితే, ఇందుకు రోహిత్ ససేమిరా అనడంతో.. కెప్టెన్ శుబ్మన్ గిల్ స్వయంగా తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘గత నెలలో స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్ నుంచి రోహిత్ శర్మను తప్పించాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నారు. కానీ అతడు ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఆఖరిదైన మూడో వన్డేలోనైనా విశ్రాంతి తీసుకోవాలని కోరారు.విశ్రాంతి వద్దన్న రోహిత్.. గిల్ అనూహ్య నిర్ణయం!అతడి స్థానంలో జైస్వాల్ను ఆడించాలనుకున్నారు. కానీ రోహిత్ రెస్ట్ తీసుకునేందుకు నిరాకరించాడు. దీంతో జైస్వాల్ను ఎలాగైనా ఆడించాలనే ఉద్దేశంతోనే కెప్టెన్ శుబ్మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగాడు’’ అని పేర్కొన్నాయి. అదే విధంగా.. ‘‘అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిన తర్వాత రోహిత్కు అసలైన సవాలు ఎదురైంది.అతడు దేశవాళీ క్రికెట్లోనూ కేవలం రెండు మ్యాచ్లే ఆడాడు. కానీ ఆశించిన స్థాయిలో లయను అందుకోలేకపోయాడు. ఇటీవల కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఫామ్ కోల్పోయిన రోహిత్ విషయంలో సెలక్టర్లు అయితే ఇప్పటికే తమ నిర్ణయం గురించి చెప్పేశారు. రోహిత్ శర్మ, బోర్డు తీసుకునే నిర్ణయం ఆధారంగానే అతడు వన్డే వరల్డ్కప్ టోర్నీ-2027 ఆడతాడా? లేదా? అన్నది తేలుతుంది’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.తొలుత విఫలమైనా..కాగా అఫ్గాన్తో వన్డే సిరీస్లో రోహిత్ శర్మ 16, 48, 79 పరుగులు సాధించాడు. ఇక రెండో వన్డేతో తుదిజట్టులోకి వచ్చిన జైస్వాల్ నిరాశపరిచినా (4).. మూడో వన్డేలో అజేయ శతకం (110*)తో ఆకట్టుకున్నాడు. మరోవైపు.. తొలి వన్డేలో ఓపెనర్గా దిగి 84 పరుగులతో అజేయంగా నిలిచిన గిల్.. తర్వాత రెండు వన్డేలో మూడో నంబర్ బ్యాటర్గా వచ్చి భారీ శతకం (154)తో దుమ్ములేపాడు.ఇదిలా ఉంటే.. రెగ్యులర్ వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల వల్ల ఈ సిరీస్కు దూరం కావడంతో.. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్కు జట్టులో చోటు దక్కింది. ఈ వన్డే సిరీస్లో భారత్ అఫ్గాన్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఇక తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో రోహిత్ శర్మ ఇప్పటికి రెండు వన్డేలలో వరుసగా 11, 26 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ వార్తలు తెరమీదకు రావడం గమనార్హం.చదవండి: అదే మా కొంప ముంచింది: శుబ్మన్ గిల్ -
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. శుభ్మన్ గిల్ సహచరుడు అరెస్ట్
లంక ప్రీమియర్ లీగ్ (LPL) 2026 ప్రారంభానికి కొద్ది గంటల ముందు సంచలన పరిణామం చోటు చేసుకుంది. డిఫెండింగ్ చాంపియన్ జాఫ్నా కింగ్స్ ఫ్రాంచైజీ సహ యజమాని మంజోత్ కల్రాను శ్రీలంక పోలీసుల ప్రత్యేక దర్యాప్తు విభాగం మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్ట్ చేసింది. ఈ విషయాన్ని స్థానిక అధికారులు ధృవీకరించారు.టోర్నీ ప్రారంభానికి ముందే ఓ ఆటగాడిని మ్యాచ్ ఫిక్సింగ్కు ప్రేరేపించే ప్రయత్నం చేశారనే ఆరోపణల నేపథ్యంలో మంజోత్ కల్రాపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని శ్రీలంక పోలీసులు వెల్లడించారు. క్రీడల్లో అవినీతి నిరోధానికి శ్రీలంకలో కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయి.టీమిండియా కెప్టెన్ సహచరుడుమంజోత్ కల్రా భారత అండర్-19 జట్టు మాజీ క్రికెటర్ 2018 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై అజేయ శతకం బాది భారత్కు టైటిల్ అందించడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఆ జట్టులో పృథ్వీ షా, శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ వంటి ఆటగాళ్లు కూడా ఉన్నారు.డిఫెండింగ్ చాంపియన్గా జాఫ్నామైదానం వెలుపల వివాదం నెలకొన్నప్పటికీ, జాఫ్నా కింగ్స్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఎల్పీఎల్ 2026 బరిలోకి దిగుతోంది. భానుక రాజపక్స కెప్టెన్సీలో బరిలోకి దిగనున్న ఈ జట్టులో షకీబ్ అల్ హసన్, తస్కిన్ అహ్మద్, సందీప్ లామిచానే, అవిష్క ఫెర్నాండో, దిల్షాన్ మధుశంక, ఇబ్రహీం జద్రాన్, డేవిడ్ వీజ్ వంటి ప్రముఖ ఆటగాళ్లు ఉన్నారు. టోర్నీ తొలి మ్యాచ్లో జాఫ్నా కింగ్స్ గాలే జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఇవాళ (జులై 17) రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. -
అదే మా కొంపముంచింది.. చాలా బాధగా ఉంది: శుబ్మన్ గిల్
యూకే పర్యటనలో భారత్కు మరో ఓటమి ఎదురైంది. కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో భారత బౌలింగ్ పరంగా రాణించినప్పటికి బ్యాటింగ్లో మాత్రం విఫలమైంది. ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 44 ఓవర్లలో కేవలం 233 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 234 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి 44.1 ఓవర్లలో చేధించింది. లక్ష్య చేధనలో ఇంగ్లండ్ కూడా కాస్త తడబడినప్పటికి, సీనియర్ బ్యాటర్ జోరూట్(99) అజేయంగా నిలిచి మ్యాచ్ను ముగించాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ 1-1 సమమైంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందించాడు. బ్యాటింగ్లో మిడిలార్డర్ వైఫల్యమే తమ కొంపముంచిందని గిల్ అంగీకరించాడు.ఈ ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. 25 ఓవర్లు ముగిసేసరికి మేము మంచి పొజిషన్లో ఉన్నాం. కనీసం 300 నుంచి 310 పరుగులు చేస్తామని ఆశించాం. కానీ ఒక్కసారిగా పరిస్థితి తారుమారు అయిపోయింది. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయాం. మా టెయిలెండర్లు గొప్ప బ్యాటర్లు కారని మాకు తెలుసు. కానీ లోయర్ మిడిలార్డర్ నుంచి మేము మరింత మెరుగైన ప్రదర్శనను ఆశించాం. ఈ మ్యాచ్లో మాకు లభించిన ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం. వచ్చే మ్యాచ్లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే చిన్న చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పి, ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తున్నాను అని గిల్ పేర్కొన్నాడు.తన వికెట్ కోల్పోవడంపై గిల్ స్పందిస్తూ.. మంచి షాట్ ఆడినప్పుడు బంతి నేరుగా కవర్ ఫీల్డర్ చేతికి వెళ్తే ఎవరికైనా బాధగా అనిపిస్తుంది. నాకు కూడా అలానే అనిపించింది. వాషింగ్టన్ సుందర్ గాయం జట్టు వ్యూహాలను దెబ్బతీసింది. వాషీ మా జట్టులో కీలక ఆటగాడు. అతడు బ్యాటింగ్ చేస్తూ మిడ్-ఆఫ్ వైపు సింగిల్ తీసే క్రమంలో గాయపడ్డాడు.దీంతో మేము ఇన్నింగ్స్ మొత్తం మా ప్రధాన బౌలర్లతోనే బౌలింగ్ చేయించాల్సి వచ్చింది. జో రూట్ అద్బుతంగా ఆడాడు. ఒకవేళ స్కోరు 300 ఉండి ఉంటే, అప్పుడు రూట్పై ఒత్తిడి ఉండేది. కానీ ఇలాంటి చిన్న స్కోర్లు చేధించడంలో అతడు దిట్ట అని చెప్పుకొచ్చాడు. -
సిరీస్ సమం
కార్డిఫ్: ఇంగ్లండ్తో తొలి వన్డేలో చక్కటి విజయం సాధించిన భారత జట్టు... రెండో మ్యాచ్లో పరాజయం పాలైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన రెండో పోరులో ఆతిథ్య ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. ఫలితంగా సిరీస్ 1–1తో సమమైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (66 బంతుల్లో 65; 8 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (71 బంతుల్లో 66; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. గిల్ (31; 6 ఫోర్లు), రోహిత్ శర్మ (26; 1 ఫోర్, 1 సిక్స్) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. గత మ్యాచ్ అర్ధశతక వీరులు వాషింగ్టన్ సుందర్ (2), అక్షర్ పటేల్ (1)తో పాటు ఇషాన్ కిషన్ (1), శివమ్ దూబే (0) సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఆఖర్లో బుమ్రా (13 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక పరుగులు జోడించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్, ఆట్కిన్సన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ జో రూట్ (133 బంతుల్లో 99 నాటౌట్; 9 ఫోర్లు) సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అజేయంగా నిలిచాడు. డకెట్ (0), బెథెల్ (4), కెప్టెన్ బ్రూక్ (16), సామ్కరన్ (26), బట్లర్ (17) విఫలమ య్యారు. ఒక దశలో 125 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ జట్టును రూట్ ఆదుకున్నాడు. విల్ జాక్స్ (30; 2 ఫోర్లు)తో కలిసి 86 బంతుల్లో 72 పరుగులు జోడించాడు. దీంతో విజయ సమీకరణం ఇంగ్లండ్కు అనుకూలంగా మారింది.ఆరంభంలో ప్రభావవంతంగా కనిపించిన భారత బౌలర్లు ఆ తర్వాత అదే జోరు కనబర్చడంలో విఫలమయ్యారు. గుర్నూర్ బ్రార్ రెండు వికెట్లు పడగొట్టగా... బుమ్రా, ప్రసిధ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఆదివారం లార్డ్స్లో నిర్ణయాత్మక మూడో వన్డే జరగనుంది. -
రెండో వన్డేలో భారత్ ఓటమి
కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. టీమిండియా నిర్ధేశించిన 254 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో ఇంగ్లండ్ ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయినప్పటికి, సీనియర్ బ్యాటర్ జోరూట్(133 బంతుల్లో 99 నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు.ఇంగ్లండ్ ఆరో వికెట్ డౌన్ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన విల్ జాక్స్.. గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో ఔటయ్యాడు.విజయం దిశగా ఇంగ్లండ్కార్డిఫ్ వన్డేలో ఇంగ్లండ్ విజయం దిశగా దూసుకుపోతుంది. 39 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 191-5. జోట్ రూట్ 87 పరుగులతో బ్యాటింగ్ కొనసాగుతున్నాడు.ఇంగ్లండ్ ఐదో వికెట్ డౌన్జోస్ బట్లర్(17) రూపంలో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో బట్లర్ క్లీన్ బౌల్డయ్యాడు. 30 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 148/5. క్రీజులో జో రూట్(69), విల్ జాక్స్(4) ఉన్నారు.ఇంగ్లండ్ నాలుగో వికెట్ డౌన్సామ్ కుర్రాన్(26) రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. శివమ్ దూబే బౌలింగ్లో కుర్రాన్ ఔటయ్యాడు. ఇంగ్లండ్ విజయానికి 140 పరుగులు కావాలి. క్రీజులో జో రూట్(40), జోస్ బట్లర్(0) ఉన్నారు.ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్53 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన కెప్టెన్ హ్యారీ బ్రూక్.. గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో ఔటయ్యాడు.కష్టాల్లో ఇంగ్లండ్234 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. 8 పరుగులకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. డకెట్ డకౌట్ కాగా.. బేతెల్ 4 పరుగులకు ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరారు.తొలి బంతికే వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్234 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చి డకెట్ ఔటయ్యాడు. 233 పరుగులకు ఆలౌటైన భారత్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లి (65), శ్రేయస్ అయ్యర్ (66) రాణించడంతో భారత్ ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖర్లో బుమ్రా (20 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో భారత్ 230 పరుగుల మార్కును తాకగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, అట్కిన్సన్ తలో 3 వికెట్లతో సత్తా చాటగా.. సాకిబ్ మహమూద్ 2, సామ్ కర్రన్, విల్ జాక్స్ చెరో వికెట్ తీశారు.వరుస బంతుల్లో అక్షర్, దూబే ఔట్36వ ఓవర్లో భారత్ వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయింది. ఆర్చర్ వేసిన ఈ ఓవర్ నాలుగో బంతికి అక్షర్ పటేల్ (1), దూబే (0) ఔటయ్యారు. దీంతో భారత్ 193 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.5 వికెట్లు కోల్పోయిన టీమిండియా32.4వ ఓవర్- 181 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. సాకిబ్ మహమూద్ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి సుందర్ (2) ఔటయ్యాడు. కోహ్లి (65) ఔట్31.4వ ఓవర్- 178 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఆదిల్ రషీద్కు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (65) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన భారత్20.3వ ఓవర్- 111 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. సామ్ కర్రన్ బౌలింగ్లో అతడికే క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ (1) ఔటయ్యాడు. రోహిత్ ఔట్17.5వ ఓవర్- 104 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. విల్ జాక్స్ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ (26) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన భారత్7.4వ ఓవర్- 44 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అట్కిన్సన్ బౌలింగ్లో డకెట్కు క్యాచ్ ఇచ్చి శుభ్మన్ గిల్ (31) ఔటయ్యాడు. ఆచితూచి ఆడుతున్న రోహిత్, గిల్భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ (9), శుభ్మన్ గిల్ (19) ఆచితూచి ఆడుతున్నారు. 5 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 30-0గా ఉంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్కార్డిఫ్ వేదికగా భారత్తో జరుగనున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. కేఎల్ రాహుల్ స్వల్ప అస్వస్థతకు లోను కావడంతో, అతడి స్థానంలో ఇషాన్ కిషన్ను బరిలోకి దించారు. ఇంగ్లండ్ విషయానికొస్తే.. ఆ జట్టు రెండు మార్పులు చేసింది. టంగ్, డాసన్ స్థానాల్లో సాకిబ్ మహమూద్, అట్కిన్సన్ జట్టులోకి వచ్చారు. కాగా, 3 మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి మ్యాచ్లో గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.తుది జట్టు..భారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణఇంగ్లండ్: బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్ -
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. రెండో వన్డే నుంచి గిల్ ఔట్?
-
మిచెల్కు గిల్ గట్టి సవాల్
భారత్-ఇంగ్లండ్ తొలి వన్డే అనంతరం ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ రేటింగ్ పాయింట్లు పెంచుకుని ప్రపంచ నంబర్-1 బ్యాటర్ స్థానానికి మరింత చేరువయ్యాడు.ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 80 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించిన గిల్కు 12 రేటింగ్ పాయింట్లు లభించాయి. ప్రస్తుతం అతను ప్రపంచ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అగ్రస్థానంలో ఉన్న డారిల్ మిచెల్ను (814) అధిగమించేందుకు గిల్కు (803) ఇంకా 12 రేటింగ్ పాయింట్లు మాత్రమే అవసరం. మరో మంచి ఇన్నింగ్స్ గిల్ను అగ్రపీఠంపై కూర్చోబెట్టడం ఖాయం.తొలి వన్డేలో విఫలమైనప్పటికీ భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి (3వ స్థానం), రోహిత్ శర్మ (4వ స్థానం) తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.భారత ఆటగాళ్లకు భారీ లబ్దిదీర్ఘ విరామం తర్వాత వన్డే ఆడిన జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్పై కట్టుదిట్టమైన బౌలింగ్తో ర్యాంకింగ్స్లో 24వ స్థానానికి చేరుకున్నాడు.అలాగే తొలి వన్డేలో అద్భుత ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన అక్షర్ పటేల్ ఆల్రౌండర్ల జాబితాలో టాప్-10లోకి ప్రవేశించాడు. బ్యాట్తో అజేయ అర్ధశతకం సాధించిన వాషింగ్టన్ సుందర్ బ్యాటర్ల ర్యాంకింగ్స్లో ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 73వ స్థానానికి చేరుకున్నాడు.ఇంగ్లండ్ ఆటగాళ్లకు కూడా మెరుగైన ర్యాంకులుఇంగ్లండ్ తరఫున తొలి వన్డేలో 76 పరుగులు చేసిన జో రూట్ 12వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే అర్ధశతకంతో ఆకట్టుకున్న లియామ్ డాసన్ బ్యాటర్ల జాబితాలో 81 స్థానాలు ఎగబాకి 262వ స్థానంలో నిలిచాడు.ఇతర దేశాల ఆటగాళ్లలో న్యూజిలాండ్ స్పిన్నర్ జేడెన్ లెనాక్స్, వెస్టిండీస్ బ్యాటర్ కీసీ కార్టీ, జింబాబ్వే ఆటగాళ్లు బెన్ కర్రన్, బ్రాడ్ ఇవాన్స్ కూడా తాజా ఐసీసీ ర్యాంకింగ్స్లో గణనీయమైన పురోగతి సాధించారు. -
రెండో వన్డేలో రోహిత్, కోహ్లికి విశ్రాంతి..?
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్లో రెండో వన్డే కార్డిప్ వేదికగా 16వ తేదీ జరుగనుంది.ఈ మ్యాచ్కు ముందు భారత జట్టు రోటేషన్ విధానంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని జట్టులో పలు కాంబినేషన్లను పరీక్షిస్తున్నట్లు కెప్టెన్ శుభ్మన్ గిల్ వెల్లడించాడు.తొలి వన్డే అనంతరం మాట్లాడిన అతడు.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సరైన సమతుల్యత కలిగిన జట్టును ఎంపిక చేసేందుకు విభిన్న కాంబినేషన్లను పరిశీలిస్తున్నామని తెలిపాడు.ప్రపంచకప్ దక్షిణాఫ్రికాలో జరుగనుండగా, అక్కడి పరిస్థితులకు ఇంగ్లండ్ పిచ్లు కొంతవరకు సమానంగా ఉంటాయని.. అందుకే ఈ సిరీస్ను ప్రయోగాలకు ఉపయోగించుకుంటున్నామని వివరించాడు.ఈ వ్యాఖ్యలతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు విశ్రాంతి ఇవ్వొచ్చనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన అయితే లేదు.ఒకవేళ వీరిలో ఎవరికైనా విశ్రాంతినిస్తే, వికెట్కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్కు తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది. అవసరానికి అనుగుణంగా బ్యాటింగ్ క్రమంలో మార్పులు చేసి జట్టు సమతుల్యతను కొనసాగించే అవకాశం ఉంది. కాగా, తొలి వన్డేలో రోహిత్ శర్మ 11, విరాట్ కోహ్లి 5 పరుగులకు ఔటై నిరాశపరిచారు. -
అతడిని ఆరో స్థానంలో ఆడిస్తారా?: మాజీ కెప్టెన్ ఫైర్
ఇంగ్లండ్ తాజా పర్యటనలో టీమిండియా ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. టీ20 సిరీస్లో ఆతిథ్య జట్టు చేతిలో 4-0తో క్లీన్స్వీప్ అయిన భారత్.. వన్డే సిరీస్లో మాత్రం శుభారంభం అందుకుంది. బర్మింగ్హామ్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో శుబ్మన్ గిల్ సేన.. ఇంగ్లండ్పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.ముగ్గురూ అదరగొట్టారుఇంగ్లండ్ విధించిన 259 పరుగుల లక్ష్యాన్ని 45.2 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనింగ్ బ్యాటర్, కెప్టెన్ గిల్ 80 పరుగులతో అదరగొట్టగా.. ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్ (52), అక్షర్ పటేల్ (57) అజేయ అర్ధ శతకాలతో రాణించి జట్టును గెలిపించారు.A Sundar finish to a near-perfect chase. 💙Washington Sundar seals the win with a towering hit as India take a 1-0 lead in the ODI series. Watch the #ENGvIND 2nd ODI on 16th July, 4:30 PM onwards, LIVE on Sony Sports Network TV channels #SonySportsNetwork #MamlaPersonalHai pic.twitter.com/CXC40cayCn— Sony Sports Network (@SonySportsNetwk) July 14, 2026రాహుల్ విఫలంఇక ఈ మ్యాచ్లో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ రెగ్యులర్గా వచ్చే ఐదో స్థానంలో కాకుండా.. ఆరో నంబర్ బ్యాటర్గా బరిలోకి దిగాడు. అతడి స్థానంలో వాషీ ఐదో స్థానానికి ప్రమోట్ అయి సక్సెస్ కాగా.. రాహుల్ మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి జోష్ టంగ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు.ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే బ్యాటర్ ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా యాజమాన్యంపై మండిపడ్డాడు. రాహుల్కు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి రాహుల్కు కూడా ఇలా డిమోట్ అవ్వడం నచ్చి ఉండదు.ఇలాగే బలి చేస్తారా?ఏదేమైనా ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే బ్యాటర్ సేవలను మీరు సరిగ్గా ఉపయోగించుకోకుండా.. అతడి ప్రతిభను వృథా చేస్తున్నారు. ఇకముందు కూడా వరల్డ్ బెస్ట్ బ్యాటర్ను ఇలాగే బలి చేస్తారా?లెఫ్ట్- రైట్ కాంబినేషన్ గురించి మీరు ఆలోచించి ఉండవచ్చు. కానీ దీని వల్ల కేఎల్ రాహుల్ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అతడు మ్యాచ్ విన్నర్. ఒంటిచేత్తో జట్టును గెలిపించగలడు. అలాంటి ఆటగాడి పట్ల ఇలాంటి వైఖరి ఎంతమాత్రం సరికాదు.ఇలా చేస్తే మున్ముందు కష్టమేరాహుల్ను ఆరు లేదంటే ఏడో స్థానంలో ఎలా పంపగలరు?.. భారత క్రికెట్కు ఇది మంచిదికాదు. ముఖ్యంగా వన్డే వరల్డ్కప్-2027కు ముందు రాహుల్ విషయంలో ఇలాంటి ఆటలు వద్దు. సౌతాఫ్రికాలో పిచ్లు ఇంతకంటే బౌన్సీగా ఉంటాయి. కాబట్టి రాహుల్ కంటే ముందు వాషీని బ్యాటింగ్కు పంపడం సరికాదు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్ తన వన్డే కెరీర్లో ఇప్పటికి బ్యాటింగ్ ఆర్డర్లో తొలి ఏడు స్థానాల్లోనూ ఆడాడు. సగటు 50తో పరుగులు రాబట్టాడు. ఎనిమిది సెంచరీలు కూడా చేశాడు. ఇక ఐదో నంబర్ బ్యాటర్గా 35 ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ అత్యుత్తమంగా 63.20 సగటుతో పరుగులు చేశాడు. ఇక ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 14 ఇన్నింగ్స్లో ఆరో స్థానంలో బరిలోకి దిగినపుడు అతడి సగటు కేవలం 37 మాత్రమే కావడం గమనార్హం.చదవండి: గిల్ గాయంపై అప్డేట్ -
తొలి వన్డేలో రిటైర్డ్ హర్ట్.. గిల్ గాయంపై కీలక అప్డేట్
ఇంగ్లండ్ ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ శుబ్మన్ గిల్ 80 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. సెంచరీ దిశగా సాగుతున్న గిల్కు కుడి కండరాలు పట్టేయడంతో అసౌకర్యంగా ఫీలయ్యాడు. వెంటనే భారత జట్టు ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స అందించినప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో గిల్ రిటైర్డ్ హర్ట్ అయ్యి పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో అతడు నడుస్తున్నంత సేపు నొప్పితో ఇబ్బంది పడినట్లుగా కనిపించింది. నొప్పితో బాధపడుతున్న గిల్ రెండో వన్డే ఆడుతాడా లేదా అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. తాజాగా గిల్ గాయానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. గాయం తీవ్రతపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ కేవలం కండరాలు పట్టేయడంతోనే నొప్పి వచ్చినట్లు భారత మెడికల్ బృందం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికైతే గిల్ బాగానే ఉన్నాడని, రెండో వన్డేలో ఆడుతాడని టీమిండియా మేనేజ్మెంట్ తెలిపింది. రెండో వన్డేకు ఒకరోజు గ్యాప్ ఉండడంతో పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని పేర్కొంది. గిల్ కూడా తన గాయంపై స్పందించాడు. ‘నేను బాగానే ఉన్నాను. కండరాల నొప్పితో కాస్త బాధపడ్డాను. ఒకరోజు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. రెండో వన్డేకు నేను ఫిట్గానే ఉంటాను’ అని చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్లో కోహ్లి, రోహిత్లు వెనువెంటనే ఔటైన తర్వాత గిల్, అయ్యర్తో కలిసి బాధ్యతగా ఆడాడు. ఇద్దరు కలిసి మూడో వికెట్కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే గిల్ రిటైర్డ్ హర్ట్ వెళ్లిన కొద్దిసేపటికే శ్రేయస్ అయ్యర్ 35 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ కూడా కేవలం ఒక్క పరుగుకే ఔటవడంతో భారత్పై మరోసారి ఒత్తిడి పెరిగింది. ఆ సమయంలో క్రీజ్ లోకి వచ్చిన ఆల్ రౌండర్స్ వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ లు బాధ్యతాయుతంగా ఆడుతూ ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేసి ఇంగ్లాండ్ ను మట్టికరిపించారు.అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఒక దశలో 107/6తో కష్టాల్లో పడింది. అయితే జో రూట్, లియామ్ డాసన్ అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకుని 258 పరుగుల గౌరవప్రదమైన స్కోరు అందించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లతో రాణించి ఇంగ్లండ్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. తొలి వన్డేలో గెలిచి మూడు వన్డేల సిరీస్లో 1-0తో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే గురువారం కార్డిఫ్ వేదికగా జరగనుంది.చదవండి: ఇంగ్లండ్ కంచుకోట బద్దలు.. గిల్ అరుదైన ఫీట్ -
ఇంగ్లండ్ కంచుకోట బద్దలు.. గిల్ అరుదైన ఫీట్
ఇంగ్లండ్తో తొలి వన్డేలో విజయం ద్వారా టీమిండియా అనేక రికార్డులు బద్దలు కొట్టింది. ఇంగ్లండ్ గడ్డపై తొలి విజయంతో కెప్టెన్ శుబ్మన్ గిల్ చరిత్ర సృష్టించగా, ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లండ్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుబ్మన్ గిల్ ఒక అరుదైన రికార్డు సాధించాడు. గత 12 ఏళ్లలో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన వన్డేలో ఇంగ్లండ్ను ఓడించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. ఎడ్జ్బాస్టన్లో 2015 నుంచి తాము ఆడిన ఏడు వన్డేల్లో ఇంగ్లండ్ ఒక్కటి కూడా ఓడిపోలేదు. 2014లో ఇదే ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లండ్ను చిత్తు చేసింది కూడా టీమిండియానే. మళ్లీ 12 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ కంచుకోటను మరోమారు గిల్ కెప్టెన్సీలోని టీమిండియానే బద్దలు కొట్టడం విశేషం.👉మరో రికార్డు ఏంటంటే.. ఇంగ్లండ్పై వన్డేల్లో టీమిండియాకు ఇది వరుసగా ఆరో విజయం. తన లాంగ్ స్ట్రీక్ను భారత జట్టు విజయవంతంగా కొనసాగిస్తోంది. గతంలో మూడు వివిధ సందర్భాల్లో ఇంగ్లండ్పై వన్డేల్లో వరుసగా ఐదేసి విజయాలు నమోదు చేసింది.👉 కోహ్లి, రోహిత్ విఫలమైన వేళ టీమిండియా వన్డేల్లో 250 ప్లస్ స్కోరును ఛేదించడం 2016 నుంచి ఇది రెండోసారి మాత్రమే. 2022లో ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన వన్డేలో 260 పరుగుల టార్గెట్ను టీమిండియా ఛేదించింది. ఈ మ్యాచ్లో కోహ్లి, రోహిత్లు 17 పరుగులు చేసి ఔటయ్యారు.చదవండి: తొలి వన్డేలో రిటైర్డ్ హర్ట్.. గిల్ గాయంపై కీలక అప్డేట్ -
‘ఇది మంచి ఆరంభం.. అతడొక అద్భుతం’
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా తొలి విజయాన్ని అందుకుంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బౌలింగ్తో, ఆపై బ్యాటింగ్ ఇలా సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్ శుబ్మన్ గిల్ మాట్లాడాడు. ఇది తమకు మంచి ఆరంభమని, దీనిని తర్వాతి మ్యాచ్ల్లోనూ కొనసాగిస్తామని గిల్ తెలిపాడు. ‘నిజానికి నేను టాస్ గెలిచినా బౌలింగ్ ఎంచుకునేవాడినేమో. ఎందుకంటే బౌలింగ్తో పోలిస్తే బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్లో బుమ్రా మినహా మిగతావారికి ఇంగ్లండ్ గడ్డపై పెద్దగా అనుభవం లేదు. మా ముందు ఎంత పెద్ద లక్ష్యం ఉన్నా దానిని ఛేదించేందుకు మా దగ్గర బ్యాటింగ్ అస్త్రాలు నిండుగా ఉన్నాయి. కానీ మా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. తొలి 10 ఓవర్లలో ఇంగ్లండ్ 50కి పైగా పరుగులు చేసినప్పటికీ ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టం చేయడంతో వారికి పరుగులు రావడం కష్టమైపోయింది. చివరి పవర్ ప్లేలో ఇంగ్లండ్ కాస్త దూకుడుగా ఆడడంతో 250 ప్లస్ స్కోరును దాటగలిగారు లేదంటే 220 నుంచి 230కి పరిమితమయ్యేవాళ్లేమో. 2027 వన్డే ప్రపంచకప్కు ఇంకా సమయం ఉండడంతో ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. బ్యాటింగ్, బౌలింగ్ సమపాళ్లలో ఉండేలా వర్కౌట్ చేస్తున్నాం. ఇంగ్లండ్ గడ్డపై ఉండే వికెట్ పరిస్థితులు దక్షిణాఫ్రికాలోని పరిస్థితులకు కొంత సారూప్యత ఉంటుందని భావిస్తున్నా. అక్షర్ పటేల్ తన ఆల్రౌండ్ పాత్రకు న్యాయం చేశాడు. రాబోయే రోజుల్లో ఈ విజయాలను కంటిన్యూ చేస్తాం’ అని చెప్పుకొచ్చాడు.ఇంగ్లండ్తో మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌటైంది. జో రూట్ (76 బంతుల్లో 76 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), లియామ్ డాసన్ (83 బంతుల్లో 68; 6 ఫోర్లు 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. ఇంగ్లండ్ 107/6తో ఇబ్బందుల్లో ఉన్న దశలో రూట్, డాసన్ కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్కు 22.2 ఓవర్లలో 121 పరుగులు జోడించారు. అనంతరం భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లకు 262 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (75 బంతుల్లో 80 రిటైర్ట్హర్ట్; 11 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (52 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (63 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. అక్షర్, సుందర్ ఐదో వికెట్కు 105 బంతుల్లో అభేద్యంగా 102 పరుగులు జత చేశారు. సిరీస్లో భారత్ 1–0తో పైచేయి సాధించగా... కార్డిఫ్లో రేపు రెండో వన్డే జరుగుతుంది. -
ఎట్టకేలకు ఒక విజయం
బర్మింగ్హామ్: ఫార్మాట్ మారింది... ఫలితం మారింది... ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనలో ఒక్క గెలుపు కోసం ఎదురు చూస్తున్న భారత అభిమానులకు ఎట్టకేలకు ఊరట దక్కింది. టి20ల్లో ఆరు పరాజయాల తర్వాత వన్డేల్లో సరైన ఆరంభం లభించింది. ఇంగ్లండ్తో మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌటైంది. జో రూట్ (76 బంతుల్లో 76 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), లియామ్ డాసన్ (83 బంతుల్లో 68; 6 ఫోర్లు 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. ఇంగ్లండ్ 107/6తో ఇబ్బందుల్లో ఉన్న దశలో రూట్, డాసన్ కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్కు 22.2 ఓవర్లలో 121 పరుగులు జోడించారు. అనంతరం భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లకు 262 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (75 బంతుల్లో 80 రిటైర్ట్హర్ట్; 11 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (52 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (63 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. అక్షర్, సుందర్ ఐదో వికెట్కు 105 బంతుల్లో అభేద్యంగా 102 పరుగులు జత చేశారు. సిరీస్లో భారత్ 1–0తో పైచేయి సాధించగా... కార్డిఫ్లో రేపు రెండో వన్డే జరుగుతుంది. కీలక భాగస్వామ్యం... భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంలో ఆరంభంలో స్కోరు చేయడానికి ఇంగ్లండ్ బాగా ఇబ్బంది పడింది. 13వ బంతికి గానీ బెతెల్ (14) తొలి పరుగు తీయలేకపోగా, 7 ఓవర్లలో జట్టు 20 పరుగులే చేసింది. బుమ్రా తన తొలి స్పెల్ను 4–0–8–0తో ముగించాడు. ఈ దశలో గుర్నూర్ తొలి ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్ బాది దూకుడు ప్రదర్శించిన బెన్ డకెట్ (45 బంతుల్లో 43; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అతని రెండో ఓవర్లో మరో 2 ఫోర్లు కొట్టాడు. అయితే గుర్నూర్ తన తర్వాతి ఓవర్లో ప్రతీకారం తీర్చుకున్నాడు. ఒకే ఓవర్లో అతను బెతెల్, డకెట్లను వెనక్కి పంపించాడు. బుమ్రా చక్కటి బంతితో బ్రూక్ (1) పని పట్టగా... ఒకే ఓవర్లో బట్లర్ (5), స్యామ్ కరన్ (0)లను ప్రసిధ్ అవుట్ చేశాడు. 27 బంతుల వ్యవధిలో 19 పరుగులు మాత్రమే చేసి ఇంగ్లండ్ 5 వికెట్లు చేజార్చుకుంది. ఆపై విల్ జాక్స్ (20) కొద్దిసేపు వికెట్ల పతనాన్ని నిలువరించాడు. అతనూ పెవిలియన్ చేరిన తర్వాత రూట్, డాసన్ భాగస్వామ్యంతో జట్టు కోలుకుంది.7 పరుగుల వద్ద రూట్ ఇచ్చిన సులువైన రిటర్న్ క్యాచ్ను దూబే వదిలేయడం ఇంగ్లండ్కు కాస్త కలిసొచ్చింది! ఈ క్రమంలో డాసన్ 65 బంతుల్లో వన్డేల్లో తన తొలి అర్ధసెంచరీ సాధించగా, రూట్ 57 బంతుల్లో కెరీర్లో 46వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. శతక భాగస్వామ్యం తర్వాత డాసన్ను అవుట్ చేసి అక్షర్ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత మరో 30 పరుగులకు ఇంగ్లండ్ చివరి 3 వికెట్లు కోల్పోగా, రూట్ అజేయంగా నిలిచాడు. రోహిత్, కోహ్లి విఫలం... ఛేదనలో భారత్కు సరైన ఆరంభం లభించలేదు. తడబడుతూనే ఆడిన రోహిత్ శర్మ (21 బంతుల్లో 11; 1 ఫోర్) భారీ షాట్కు ప్రయత్నించి వెనుదిరగ్గా, ఆర్చర్ చక్కటి బంతితో కోహ్లి (5)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కెపె్టన్ గిల్కు మరో ఎండ్ నుంచి శ్రేయస్ అయ్యర్ (35; 2 ఫోర్లు) సహకరించాడు. వీరిద్దరు 101 పరుగులు జత చేశారు. ఈ దశలో తొడ కండరాలు పట్టేయడంతో గిల్ మైదానం వీడగా... మూడు పరుగుల వ్యవధిలో అయ్యర్, రాహుల్ (1) వెనుదిరిగాడు. ఈ దశలో భారత్పై కొంత ఒత్తిడి కనిపించింది. అయితే సుందర్, అక్షర్ చక్కటి ప్రదర్శనతో జట్టును గెలుపు దిశగా నడిపించారు. 39 బంతుల్లోనే అక్షర్ నాలుగో అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత కూడా ఈ ఇద్దరు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గెలుపు ఖాయం చేశారు. రషీద్ బౌలింగ్లో భారీ సిక్స్తో సుందర్ 63 బంతుల్లో తన రెండో హాఫ్ సెంచరీని చేరుకోవడంతో పాటు మ్యాచ్ను ముగించాడు.స్కోరు వివరాలుఇంగ్లండ్ ఇన్నింగ్స్: డకెట్ (సి) బుమ్రా (బి) బ్రార్ 43; బెతెల్ (సి) సుందర్ (బి) బ్రార్ 14; రూట్ (నాటౌట్) 76; బ్రూక్ (సి) రోహిత్ (బి) బుమ్రా 1; బట్లర్ (సి) బ్రార్ (బి) ప్రసిధ్ 5; కరన్ (సి) రాహుల్ (బి) ప్రసిధ్ 0; జాక్స్ (సి) రాహుల్ (బి) దూబే 20; డాసన్ (సి) రోహిత్ (బి) అక్షర్ 68; ఆర్చర్ (సి) సుందర్ (బి) అక్షర్ 12; రషీద్ (స్టంప్డ్) రాహుల్ (బి) అక్షర్ 1; టంగ్ (బి) అక్షర్ 0; ఎక్స్ట్రాలు 18; మొత్తం (47.5 ఓవర్లలో ఆలౌట్) 258. వికెట్ల పతనం: 1–61, 2–63, 3–64, 4–80, 5–80, 6–107, 7–228, 8–250, 9–258, 10–258. బౌలింగ్: బుమ్రా 9–0–31–1, ప్రసిధ్ 10–2–50–2, గుర్నూర్ బ్రార్ 9–0–61–2, శివమ్ దూబే 6–0–27–1, సుందర్ 4–0–13–0, అక్షర్ పటేల్ 9.5–0–62–4.భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) బ్రూక్ (బి) కరన్ 11; గిల్ (రిటైర్డ్హర్ట్) 80; కోహ్లి (ఎల్బీ) (బి) ఆర్చర్ 5; అయ్యర్ (రనౌట్) 35; సుందర్ (నాటౌట్) 52; రాహుల్ (బి) టంగ్ 1; అక్షర్ (నాటౌట్) 57; ఎక్స్ట్రాలు 21; మొత్తం (45.2 ఓవర్లలో 4 వికెట్లకు) 262. వికెట్ల పతనం: 1–43, 2–48, 3–157, 4–160.బౌలింగ్: ఆర్చర్ 10–0–60–1, టంగ్ 10–0–50–1, స్యామ్ కరన్ 10–0–55–1, రషీద్ 5.2–0–34–0, బెతెల్ 1–0–10–0, డాసన్ 2–0–10–0, జాక్స్ 7–0–43–0. -
గుర్నూర్ దెబ్బకు కిందపడ్డ గిల్.. కోహ్లి రియాక్షన్ వైరల్
ఇంగ్లండ్తో తొలి వన్డేలో భారత పేసర్ గుర్నూర్ బ్రార్ అదరగొట్టాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మంగళవారం నాటి తొలి వన్డేకు బర్మింగ్హామ్ వేదిక. ఎడ్జ్బాస్టన్ మైదానంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఒకే ఓవర్లో రెండు వికెట్లుఈ క్రమంలో 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఇంగ్లండ్ 61 పరుగులు చేసింది. అయితే, ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో 13వ ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన బ్రార్ రెండో బాల్కు జేకబ్ బెతెల్ (14), నాలుగో బంతికి బెన్ డకెట్ (43)ను అవుట్ చేశాడు. తద్వారా ఒకే ఓవర్లో ఓపెనర్లు ఇద్దరినీ అవుట్ చేసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు.ఘోరంగా ఢీకొట్టుకున్నారుఇదిలా ఉంటే.. పదహారో ఓవర్లో ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో జోస్ బట్లర్ బంతిని గాల్లోకి లేపాడు. ఈ క్యాచ్ను అందుకునేందుకు బ్రార్, కెప్టెన్ శుబ్మన్ గిల్ ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరూ ఘోరంగా ఢీకొట్టుకున్నారు. అయితే, బ్రార్ సురక్షితంగా క్యాచ్ పట్టడంతో బట్లర్ (5) వెనుదిరిగాడు.ఇక కిందపడ్డ గిల్ను చేయిచ్చి పైకి లేపిన బ్రార్.. అతడిని ఆలింగనం చేసుకున్నాడు. ఇంతలో ప్రసిద్ కృష్ణతో కలిసి వికెట్ను సెలబ్రేట్ చేసుకున్న టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి.. బ్రార్ వైపుగా వచ్చి డాన్స్ చేస్తూ అతడిని టీజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Gurnoor Brar completes the catch to send Jos Buttler back 🚶➡️ Watch the 1st ODI of #ENGvIND, LIVE NOW on Sony Sports Network TV channels.#SonySportsNetwork #MamlaPersonalHai #ExtraaaInnings pic.twitter.com/W2lmSrbZE4— Sony Sports Network (@SonySportsNetwk) July 14, 2026258 పరుగులకు ఆలౌట్కాగా ఇంగ్లండ్తో తొలి వన్డేలో భారత బౌలర్లు మెరుగ్గా రాణించారు. ప్రత్యర్థిని 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ చేశారు. అక్షర్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ తలా రెండు.. జస్ప్రీత్ బుమ్రా, శివం దూబే తలా ఒక వికెట్ తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ టాప్ రన్ స్కోరర్ (76 నాటౌట్)గా నిలవగా.. లియామ్ డాసన్ (68) కూడా అర్ధ శతకం చేశాడు. మిగిలిన వారిలో బెన్ డకెట్ (43), విల్ జాక్స్ (20) రాణించారు. చదవండి: వాళ్లిద్దరికి అస్సలు పడటం లేదు.. డీకే సంచలన వ్యాఖ్యలు -
IND vs ENG: ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
భారత్ ఘన విజయంఎడ్జ్బాస్టన్ వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్ధేశించిన 259 పరుగుల లక్ష్యాన్ని భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్(85) టాప్ స్కోరర్గా నిలిచాడు. నిలకడగా ఆడిన గిల్ గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. గిల్తో పాటు అక్షర్ పటేల్(55 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(52 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(35) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.విజయం దిశగా భారత్ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. 66 బంతుల్లో 43 పరుగులు కావాలి. క్రీజులో అక్షర్ పటేల్(35), వాషింగ్టన్ సుందర్(29) ఉన్నారు.గిల్ రిటైర్డ్ హర్ట్80 పరుగుల వద్ద గిల్ రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్కు చేరాడు. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ క్రీజ్లోకి వచ్చాడు. 34 పరుగులతో శ్రేయస్ అప్పటిక క్రీజ్లో ఉన్నాడు. 26.1 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 151-2గా ఉంది. ఈ మ్యాచ్లో గెలవాలంటే భారత్ మరో 108 పరుగులు చేయాలి. నిలకడగా ఆడుతున్న గిల్, శ్రేయస్గిల్ (74), శ్రేయస్ అయ్యర్ (32) నిలకడగా ఆడుతున్నారు. 24 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 141-2గా ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 118 పరుగులు చేయాలి. రోహిత్, కోహ్లి ఔట్ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లి (5) ఘోరంగా విఫలమయ్యారు. సామ్ కర్రన్ బౌలింగ్లో రోహిత్ ఔట్ కాగా.. ఆర్చర్ బౌలింగ్లో విరాట్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 8.3 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 48-2గా ఉంది. రోహిత్ ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన భారత్7.3వ ఓవర్- 259 పరుగుల ఛేదనలో టీమిండియా 43 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 21 బంతుల్లో ఫోర్ సాయంతో 11 పరుగులు చేసిన రోహిత్ సామ్ కర్రన్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. గిల్కు (26) జతగా విరాట్ కోహ్లి క్రీజ్లోకి వచ్చాడు. బర్మింగ్హామ్ వేదికగా టీమిండియాతో తొలి వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఎడ్జ్బాస్టన్లో 47.5 ఓవర్లలో 258 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ బెన్ డకెట్ (43) రాణించగా.. జో రూట్ (76 నాటౌట్), లియామ్ డాసన్ (68) అర్ధ శతకాలతో అదరగొట్టారు. మిగిలిన వారిలో విల్ జాక్స్ (20) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.భారత బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ తలా రెండు.. బుమ్రా, శివం దూబే చెరో వికెట్ దక్కించుకున్నారు. 259 పరుగుల లక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్కు దిగింది. అప్డేట్స్..ఇంగ్లండ్ ఆలౌట్47.5: అక్షర్ బౌలింగ్లో జోష్ టంగ్ బౌల్డ్ (0)తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్47.3:అక్షర్ బౌలింగ్లో ఆదిల్ రషీద్ స్టంపౌట్ (1)ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్45.6: అక్షర్ పటేల్ బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్కు క్యాచ్ ఇచ్చి ఎనిమిదో వికెట్గా వెనుదిరిగిన జోఫ్రా ఆర్చర్ (12). స్కోరు 250-8 (46). క్రీజులోకి ఆదిల్ రషీద్ రాగా.. రూట్ 69 పరుగులతో ఉన్నాడు.ఏడో వికెట్ డౌన్43.6: అక్షర్ పటేల్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చిన డాసన్. 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్. క్రీజులోకి జోఫ్రా ఆర్చర్. రూట్ 59 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 228-7 (44).డాసన్, రూట్ హాఫ్ సెంచరీలు42 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 214-6రూట్ 51, డాసన్ 63 పరుగులతో ఉన్నారు.కుదురుగా ఆడుతున్న రూట్, డాసన్జో రూట్ (30), లియామ్ డాసన్ (34) కుదురుగా ఆడుతున్నారు. 32 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 160-6గా ఉంది. 27 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 128-627 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 128-6గా ఉంది. రూట్ 21, లియామ్ డాసన్ 11 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్21.4వ ఓవర్- 107 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. శివమ్ దూబే బౌలింగ్లో రాహుల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో విల్ జాక్స్ (20) ఔటయ్యాడు. 100 దాటిన ఇంగ్లండ్ స్కోర్21 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోర్ 104-5గా ఉంది. జో రూట్ (9), విల్ జాక్స్ (19) క్రీజ్లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్16.4: ప్రసిద్ బౌలింగ్లో సామ్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి డకౌట్గా వెనుదిరిగాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్16.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో బ్రార్కు క్యాచ్ ఇచ్చి బట్లర్ అవుట్ (5). కేవలం 19 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్. సామ్ కర్రాన్ క్రీజులోకి రాగా.. రూట్ 6 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 80-4.మూడో వికెట్ డౌన్13.1: బుమ్రా బౌలింగ్లో మూడో వికెట్గా వెనుదిరిగిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (1). క్రీజులోకి జోస్ బట్లర్. రూట్ సున్నా పరుగులతో ఉన్నాడు. స్కోరు: 64-3.రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్12.4: గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చిన డకెట్. హాఫ్ సెంచరీకి ఏడు పరుగులదూరంలో నిలిచిన డకెట్ (43).తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్12.2: గుర్నూర్ బ్రార్ బౌలింగ్ వాషింగ్టన్ సుందర్కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా వెనుదిరిగిన జేకబ్ బెతెల్ (14).పవర్ ప్లేలో ఇంగ్లండ్ స్కోరు: 51-0 (10)ఓపెనర్లు బెన్ డకెట్ 41, జేకబ్ బెతెల్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు.రో-కో రాకఇక ఈ సిరీస్ సందర్భంగా భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ చాలాకాలం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెడుతున్నారు. ఏడు మ్యాచ్లలో ఇంగ్లండ్దే గెలుపు! 👉ఈ ఇద్దరు చివరగా సొంతగడ్డపై న్యూజిలాండ్తో జనవరిలో జరిగిన వన్డే సిరీస్లో పాల్గొన్నారు. ఇక ఎడ్జ్బాస్టన్లో జరిగిన గత ఏడు వన్డేల్లోనూ ఇంగ్లండ్ గెలుపొందడం విశేషం. అయితే, చివరగా 2014లో టీమిండియా చేతిలో ఇంగ్లండ్ ఓడింది. బట్లర్ @ 200👉మరోవైపు.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ కెరీర్లో ఇది 200వ వన్డే. తద్వారా ఇంగ్లండ్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఇయాన్ మోర్గాన్ (225 వన్డేలు) తర్వాతి స్థానాన్ని బట్లర్ ఆక్రమించాడు. ఇదిలా ఉంటే.. ముందుగా టీ20 సిరీస్ జరగగా ఆతిథ్య ఇంగ్లండ్ టీమిండియాను 4-0తో వైట్వాష్ చేసింది. తుదిజట్లుఇంగ్లండ్జాకబ్ బెథెల్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్ఇండియారోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ. -
వరల్డ్కప్ ప్రణాళికలు వేరు.. కోహ్లితో ఏం మాట్లాడానంటే?: గిల్
ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో క్లీన్స్వీప్నకు గురైన టీమిండియా వన్డే సిరీస్కు సన్నద్ధమైంది. ఇరుజట్ల మధ్య బర్మింగ్హామ్ వేదికగా తొలి వన్డేకు రంగం సిద్ధమైంది. ఈ సిరీస్తో భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తిరిగి మైదానంలో అడుగుపెడుతున్నారు.ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదుఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. శిక్షణ సందర్భంగా కోహ్లితో జరిగిన సంభాషణ గురించి వివరించాడు. ‘‘అత్యుత్తమ కాంబినేషన్తో ముందుకు వెళ్లడమే మా ప్రధాన ప్రణాళిక. దీని గురించే మేము మాట్లాడుకున్నాము.కొంతమంది ప్రస్తుతం జట్టులో లేకపోవచ్చు. వీరిలో పేస్ బౌలర్లు, ఆల్రౌండర్లు, స్పిన్నర్లు.. ఇలా ఎవరైనా సరే ఆయా విభాగం నుంచి భవిష్యత్తులో సేవలు అందించేందుకు జట్టులోకి రావొచ్చు. ఇక విరాట్ భాయ్, రోహిత్ భాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు.గత దశాబ్ద కాలంగా వారిద్దరు టీమిండియా బ్యాటింగ్ లైనప్ వెన్నెముకగా ఉన్నారు. వారు జట్టులో అంతర్భాగం. వారి అనుభవం, నైపుణ్యం మా జట్టు విలువను పెంచుతాయి. అయితే, వన్డే ప్రపంచకప్ ప్రణాళికలు కాస్త భిన్నంగా ఉంటాయి.ఇక్కడి వికెట్ల మాదిరే వీలైనన్ని వైవిధ్యమైన కాంబినేషన్లు ప్రయత్నించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వరల్డ్కప్ వేదికైన సౌతాఫ్రికాలోని పిచ్లు.. ఇక్కడి (ఇంగ్లండ్) వికెట్ల మాదిరే ఉంటాయి. కాబట్టి మా బలాన్ని పరీక్షించుకునే క్రమంలో ఇది అత్యంత కీలకమైన సిరీస్గా మారింది. కొత్త వాళ్లకు అవకాశం నిజానికి మా తుదిజట్టులో ఎప్పుడూ పెద్దగా మార్పులు జరగలేదు. అయితే, కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చే క్రమంలో స్వల్ప మార్పులు చోటుచేసుకోవచ్చు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం ద్వారా.. ఒత్తిడిలో వారు ఏమేరకు రాణించగలరో తెలుసుకోవచ్చు. తద్వారా ప్రపంచకప్ టోర్నీకి ముందే జట్టు కూర్పు గురించి మాకు ఒక అవగాహన వస్తుంది’’ అని శుబ్మన్ గిల్ తెలిపాడు.ఇక టీ20 సిరీస్లో ఇంగ్లండ్ చేతిలో 4-0తో వైట్వాష్ కావడం తమపై ఎలాంటి ప్రభావం చూపబోదని గిల్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ‘‘ఈ రెండూ వేర్వేరు ఫార్మాట్లు. వేర్వేరు జట్లు. వేర్వేరు లక్ష్యాలు. కాబట్టి ఈ సిరీస్పై గత టీ20 సిరీస్ ప్రభావం ఉంటుందని నేను అనుకోవడం లేదు’’ అని గిల్ అన్నాడు.చదవండి: టీమిండియాలోకి సూర్యకుమార్ యాదవ్! -
జై షాకు శుభ్మన్ గిల్ ప్రత్యేక విజ్ఞప్తి
భారత టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ శుభ్మన్ గిల్, ఐసీసీ ఛైర్మన్ జై షాకు ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. వన్డే క్రికెట్కు మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలంటే ముక్కోణపు సిరీస్లు, నాలుగు దేశాల టోర్నీలను పునరుద్ధరించాలని కోరాడు.ఇంగ్లండ్తో తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడిన గిల్, ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్ల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో 50 ఓవర్ల క్రికెట్ను మరింత ఆకర్షణీయంగా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు."ముక్కోణపు సిరీస్లు, నాలుగు దేశాల టోర్నీలను మళ్లీ ప్రారంభించాలి. జట్లు కొత్త పరిస్థితుల్లో ఆడే అవకాశం లభిస్తుంది. నేను చిన్నప్పటి నుంచి 50 ఓవర్ల క్రికెట్ చూస్తూ పెరిగాను. వన్డేలను 40 ఓవర్లకు కుదించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం" అని అన్నాడు.ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ట్రై-సిరీస్లు, నాలుగు దేశాల టోర్నీలు ఎంతో ఆదరణ పొందేవి. ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్రతి ఏడాది నిర్వహించే ట్రై-సిరీస్ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అయితే టీ20 క్రికెట్ విస్తరణతో అలాంటి టోర్నీలు క్రమంగా అంతరించిపోయాయి.కాగా, ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది.తాజాగా భారత్ ఇంగ్లండ్, ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్లు కోల్పోవడంతో ఈ సిరీస్ను ప్రాధాన్యత మరింత పెరిగింది. శుభ్మన్ గిల్ అయినా టీమిండియాను తిరిగి విజయాల బాట పట్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించగా.. భారత జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. -
తిరిగొచ్చిన రో-కో ద్వయం.. తొలి వన్డేకు భారత జట్టు ఇదే!
ఇంగ్లండ్ గడ్డపై టీ20 సిరీస్లో దారుణ పరాజయం తర్వాత శుబ్మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా వన్డే సిరీస్ ఆడేందుకు సమాయత్తమవుతోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా మంగళవారం (జూలై 14న) ఇరుజట్లు తొలి వన్డే మ్యాచ్ ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే టెస్టులు, టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వన్డే జట్టుతో కలిశారు. ఇక తొలి వన్డేకు తుది జట్టు అంచనా ఒకసారి పరిశీలించి చూద్దాం.వీరితో పాటు సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా జాయిన్ కావడంతో టీమిండియా బలం పెరిగింది. 20 ఓవర్ల ఫార్మాట్ నుంచి 50 ఓవర్ల ఫార్మాట్కు ఆట మారడానికి తోడు, సీనియర్లు అంతా జట్టులోకి రావడంతో టీమిండియా ఇప్పుడు పేపర్పై దుర్భేద్యంగా కనిపిస్తోంది. 39 ఏళ్ల రోహిత్, 38 ఏళ్ల కోహ్లికి 2027 వన్డే ప్రపంచకప్ ఆఖరిది కానుండడంతో వీరిద్దరు రాణించాలని ఉవ్విళ్లూరుతున్నారు. టీ20 సిరీస్లో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్లు తమ బౌలింగ్తో టీమిండియా బ్యాటర్లను బెంబెలెత్తించారు. కానీ వన్డే ఫార్మాట్లో కోహ్లి, రోహిత్ వంటి అనుభవజ్ఞులు రావడంతో ఈ ఇద్దరు బౌలర్ల ఆటలు సాగకపోవచ్చని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాటింగ్లో గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్తో పాటు కేఎల్ రాహుల్ కీలకంగా మారనున్నారు.ఆల్రౌండ్ విభాగంలో అక్షర్పటేల్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్లు ఉన్నప్పటికీ వీరిలో ఇద్దరికి మాత్రమే అవకాశం రానుంది. ఇక బౌలింగ్ విభాగాన్ని జస్ప్రీత్ బుమ్రా నడిపించనుండగా.. టీ20 సిరీస్లో విఫలమైనప్పటికీ అర్ష్దీప్కు మరో చాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరో స్పిన్నర్ అవసరమనుకుంటే కుల్దీప్ యాదవ్ తుదిజట్టులో చోటు దక్కించుకుంటాడు. లేదంటే ప్రసిధ్ క్రిష్ణ, గుర్నూర్ బ్రార్లలో ఒకరికి అవకాశం కల్పించవచ్చు. మొత్తానికి టీ20 సిరీస్లో ఓటమి పాలైనప్పటికీ వన్డే సిరీస్కు మాత్రం సీనియర్ల రాకతో టీమిండియా కొత్తగా కనిపిస్తోంది. మ్యాచ్ సమయం: భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎడ్జ్బాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది.తుదిజట్టు అంచనా: శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ క్రిష్ణ/ గుర్నూర్ బ్రార్ -
శ్రేయస్ అయ్యర్ను తొలగించండి.. ఈజీ ఆప్షన్ అదే!
సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్-2026 విజేతగా నిలిచిన టీమిండియాకు.. విదేశీ గడ్డ మీద ఘోర పరాభవం ఎదురైంది. మెగా టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత తొలి ప్రయత్నంగా ఐర్లాండ్తో తలపడ్డ భారత్ ఊహించని రీతిలో.. ఆతిథ్య జట్టు చేతిలో 2-0తో క్లీన్స్వీప్నకు గురైంది.శ్రేయస్ అయ్యర్కు చేదు అనుభవంఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలో 4-0తో వైట్వాష్ అయింది. దీంతో టీమిండియా టీ20 కెప్టెన్గా ప్రయాణం మొదలుపెట్టిన శ్రేయస్ అయ్యర్కు తొలి ప్రయత్నంలోనే అత్యంత చేదు అనుభవం మిగిలింది. ఈ రెండు టీ20 సిరీస్లలో భారత్ క్లీన్స్వీప్ కావడంతో అతడి కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈజీ ఆప్షన్ అదే!అదే సమయంలో హెడ్కోచ్ గౌతం గంభీర్పైనా మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ రెండు సిరీస్లలో టీమిండియా ఘోర ఓటమి నేపథ్యంలో గౌతం గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను తొలగించడమనేది అత్యంత సులువైన ఆప్షన్.అయితే, ఆ విషయం పక్కనపెట్టి భారత జట్టు ఓటమికి అసలు కారణాలు ఏమిటో ముందు విశ్లేషించండి. నిజానికి ఐర్లాండ్, ఇంగ్లండ్.. అంటే విదేశీ గడ్డ మీద ఈ మ్యాచ్లు జరగడమే భారత్ ఓటమికి ప్రధాన కారణం.వికెట్ ఇలా ఉంది కాబట్టే మన బ్యాటర్లు విదేశీ పిచ్ల మీద ఆడేందుకు ఏమాత్రం సన్నద్ధం కాలేదు. ఎందుకంటే.. మన సెలక్టర్లు కేవలం ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా వీరిని విదేశీ టూర్కు ఎంపిక చేశారు. ఐపీఎల్ మన బ్యాటర్లకు ఓ కవచం వంటిది. ఇక్కడ రాణిస్తే చాలు జాతీయ జట్టులోకి వచ్చేస్తామనే నమ్మకం కుదిరింది.అయితే, ఐపీఎల్ రూపొందించినటువంటి ఫ్లాట్ పిచ్లను నేను జీవితంలో ఇంత వరకు చూడనేలేదు. వికెట్ ఇలా ఉంది కాబట్టే మన బ్యాటర్లు.. ముఖ్యంగా టాపార్డర్లో వచ్చిన వాళ్లు మంచినీళ్ల ప్రాయంగా పరుగులు రాబడుతున్నారు.మరి విదేశాల్లో వికెట్లు ఇలా ఉండవు కదా. అక్కడ మార్బుల్ షీట్పై బ్యాటింగ్ చేయడం కుదరదు. ఇలాంటపుడే సెలక్టర్లు మరింత తెలివిగా ఆలోచించాల్సింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ గడ్డ మీద రాణించిన శుబ్మన్ గిల్ వంటి ఆటగాళ్లను సెలక్ట్ చేయాల్సింది.దిక్కుమాలిన ఐడియా ఇచ్చిన వారిపైనే వేటుఈ పరాజయాల నేపథ్యంలో లోతుగా విచారణ, విశ్లేషణ జరపాలి. బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్లు రూపొందించమని బీసీసీఐకి సలహా ఇచ్చిన వారిని ముందుగా తొలగించాలి. ఐపీఎల్ను మరింత పాపులర్ చేయాలని.. వాణిజ్యపరంగా లాభాలు పొందాలని చూస్తే పరిస్థితులు ఇలాగే దిగజారిపోతాయి’’ అని సంజయ్ మంజ్రేకర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా వరుస సిరీస్లలో వైట్వాష్ నేపథ్యంలో టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని ఇంగ్లండ్కు కోల్పోయింది.చదవండి: ఇంగ్లండ్ టెస్టు జట్టు హెడ్కోచ్గా ద్రవిడ్? -
భారత టీ20 జట్టులోకి ఊహించని ప్లేయర్!
ఇంగ్లండ్ చేతిలో క్లీన్స్వీప్ గండం నుంచి తప్పించుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. సౌతాంప్టన్ వేదికగా ఆతిథ్య జట్టుతో ఆఖరి టీ20 మ్యాచ్లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. కాగా విదేశీ గడ్డ మీద టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే.తొలుత పసికూన చేతిలోటీ20 ప్రపంచకప్-2026 చాంపియన్గా ఐర్లాండ్లో అడుగుపెట్టిన భారత జట్టు.. అనూహ్య రీతిలో పసికూన చేతిలో 2-0తో వైట్వాష్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్లలో భారత్ ఓటమిపాలైంది.ఫలితంగా ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ను 3-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం మూడో టీ20 జరుగనున్న నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.అనుచిత నిర్ణయాల వల్లే సెలక్షన్ విషయంలో అనుచిత నిర్ణయాల వల్లే టీమిండియాకు ఈ గతి పట్టిందని చిక్కా మండిపడ్డాడు. ఈ క్రమంలో టెస్టు జట్టులో రెగ్యులర్ సభ్యుడైన కేఎల్ రాహుల్ను తిరిగి టీ20 జట్టులోకి తీసుకోవాలని యాజమాన్యానికి సూచించాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..గిల్కు ఛాన్స్ ఇచ్చారు..‘‘ప్రస్తుత పరిస్థితుల్లో కేఎల్ రాహుల్ను భారత టీ20 జట్టులోకి తిరిగి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నిజానికి శుబ్మన్ గిల్కు ఓ అవకాశం దక్కింది. వన్డే, టెస్టు కెప్టెన్ అయిన అతడిని నేరుగా టీ20 జట్టు వైస్ కెప్టెన్గా నియమించారు.అతడిని టీ20 ఫార్మాట్లోనూ ఆడించండికానీ అతడు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కాబట్టి ఆ తర్వాత గిల్ను పక్కనపెట్టేశారు. అయితే, కేఎల్ రాహుల్కు కనీసం అలాంటి ఒక్క అవకాశం కూడూ దక్కలేదు. రాహుల్ను కేవలం టెస్టు, వన్డేలకే పరిమితం చేయాలని యాజమాన్యం భావిస్తోంది.ఫ్లాట్ పిచ్ల మీదే మనోళ్ల ప్రతాపంనిజానికి అతడి టీ20 రికార్డు అద్భుతంగా ఉంది. ఎలాంటి పిచ్ మీద అయినా రాహుల్ ఆడగలడు. ప్రస్తుత టీమిండియా బ్యాటింగ్ లైనప్ కేవలం ఫ్లాట్ పిచ్ల మీద మాత్రమే పరుగుల వరద పారిస్తోంది. సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ టోర్నీలో సౌతాఫ్రికా భయపెట్టగానే.. వెంటనే పిచ్లు మార్చమని మనోళ్లు అడిగారు. ఇక ఐపీఎల్లో లక్నో పిచ్ మీద భారత బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డారు. మన బ్యాటర్లు తడి టెన్నిస్ బాల్తో ప్రాక్టీస్ చేస్తూ పేస్, బౌన్సీ కండిషన్లకు మరింతగా అలవాటు పడాల్సిన ఆవశ్యకత ఉంది’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా పొట్టి ఫార్మాట్లో కేఎల్ రాహుల్ చివరగా 2022 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ సందర్భంగా టీమిండియాకు ఆడాడు. ఇప్పటికి మొత్తంగా 72 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 2265 పరుగులు సాధించాడు. సగటు 37.7 కాగా స్ట్రైక్రేటు 139.13. రాహుల్ ఖాతాలో 22 టీ20 అర్ధ శతకాలు, రెండు సెంచరీలు ఉన్నాయి.చదవండి: అతడు భయపడుతున్నాడు.. జట్టు నుంచి తీసేయండి -
వింబుల్డన్లో దిగ్గజాల సందడి (ఫొటోలు)
-
సచిన్, కోహ్లి సరసన గిల్.. టీమిండియా కెప్టెన్గా రికార్డు
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ అరుదైన ఫీట్ సాధించాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీని రాయల్ బాక్స్ నుంచి వీక్షించిన నాలుగో భారత కెప్టెన్గా గిల్ నిలిచాడు. గతంలో భారత్ నుంచి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు కెప్టెన్ హోదాలో రాయల్ బాక్స్ నుంచి వింబుల్డన్ టోర్నీ మ్యాచ్లను వీక్షించారు. తాజాగా గిల్ వీరి సరసన చేరాడు. శుక్రవారం లండన్లోని ఆల్ ఇంగ్లండ్ టెన్నిస్ క్లబ్లో జకోవిచ్, సినర్ మ్యాచ్ను గిల్ ప్రత్యక్షంగా వీక్షించాడు. మరో విశేషమేమిటంటే గిల్ పక్కనే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో పాటు అతడి భార్య అంజలి కూడా ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి వింబుల్డన్ మ్యాచ్ వీక్షిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక వీరితో పాటు విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా, నెదర్లాండ్స్ స్టార్ ఫుట్బాల్ ఆటగాడు వర్గిల్ వాన్ డిక్, బ్రిటన్ యాక్టర్ బెనెడిక్ట్ కంబర్బాచ్, హ్యూగ్ లారి, డామియన్ లూయిస్లు కూడా రాయల్ బాక్స్ నుంచి మ్యాచ్ను వీక్షించారు. ఇక గిల్ ఇటీవలే సిల్వర్స్టోన్ సర్క్యూట్ వేదికగా జరిగిన బ్రిటీష్ గ్రాండ్ప్రిక్స్ టోర్నీకి కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.ఇక ప్రస్తుతం టీమిండియా జట్టు ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 0-3తో ఇంగ్లండ్కు సిరీస్ కోల్పోయిన టీమిండియా ఇవాళ చివరి మ్యాచ్ను సౌతాంప్టన్ వేదికగా ఆడుతోంది. టీ20 సిరీస్ ముగిసిన వెంటనే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ మొదలుకానుంది. వన్డే సిరీస్కు గిల్తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి జాయిన్ కానుండడంతో జట్టు పరిపూర్ణం కానుంది. 2027 వన్డే ప్రపంచ కప్ సన్నాహకంగా ఈ వన్డే సిరీస్ను ఉపయోగించుకుంటామని, దక్షిణాఫ్రికా పరిస్థితులకు ఇక్కడి వాతావరణం సరితూగుతుందని గిల్ వెల్లడించాడు. Shubman Gill with Sachin Tendulkar and Anjali Tendulkar at Wimbledon ❤️ pic.twitter.com/mLkqV9Tjfg— Shubman Gill Fc (@ShubmanGill7fc) July 10, 2026Read: ఒళ్లు మండిన గాఫ్.. బదులు తీర్చుకుంటానని హెచ్చరిక! -
ఇంగ్లీష్ జట్టులో గిల్ సహచరుడు
భారత ఎడమచేతి స్పిన్నర్, గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి కిషోర్ మరోసారి ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. 29 ఏళ్ల ఈ తమిళనాడు బౌలర్తో గ్లోస్టర్షైర్ కౌంటీ క్లబ్ 2026 కౌంటీ ఛాంపియన్షిప్లోని మిగిలిన ఆరు మ్యాచ్ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది.గ్లోస్టర్షైర్ తరఫున సాయి కిషోర్ వోర్సెస్టర్షైర్, డర్హమ్, డెర్బీషైర్, లాంకషైర్, మిడిల్సెక్స్, కెంట్లతో జరిగే మ్యాచ్ల్లో బరిలోకి దిగనున్నాడు. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన గ్లోస్టర్షైర్ కేవలం ఒక విజయమే నమోదు చేసి 38 పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో సాయి రాకతో జట్టు స్పిన్ విభాగం బలోపేతం అవుతుందని యాజమాన్యం భావిస్తోంది.గతేడాది సర్రే తరఫున కౌంటీ క్రికెట్ ఆడిన సాయి కిషోర్ రెండు మ్యాచ్ల్లో 11 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా డర్హమ్పై రెండో ఇన్నింగ్స్లో 72 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసి తన ప్రతిభను చాటుకున్నాడు. ఆ అనుభవంతో ఇప్పుడు రెండోసారి ఇంగ్లండ్లో ఆడే అవకాశాన్ని అందుకున్నాడు.ఫస్ట్క్లాస్ క్రికెట్లో సాయి కిషోర్ అద్భుత రికార్డు ఉంది. 54 మ్యాచ్ల్లో 223 వికెట్లు పడగొట్టిన అతడు సగటున 24.21 పరుగులకు ఓ వికెట్ పడగొట్టాడు. ఇందులో 14 సార్లు ఐదు వికెట్ల ఘనత నమోదు చేశాడు. 2025-26 రంజీ ట్రోఫీ సీజన్లోనూ అతడు నిలకడైన ప్రదర్శన కనబర్చాడు.అయితే ఐపీఎల్ 2026లో శుభ్మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టులో సాయి కిషోర్కు పెద్దగా అవకాశాలు లభించలేదు. కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే ఆడిన అతడు ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. -
శ్రేయస్కు అండగా నిలబడ్డ సోదరి
భారత టీ20 జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు వరుస పరాజయాలు ఎదురవుతుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడి సోదరి శ్రేష్ఠ అయ్యర్ తన సోదరుడికి అండగా నిలుస్తూ, భారత దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్లను ఉదాహరణగా చూపించి విమర్శలకు సమాధానం ఇచ్చింది.సూర్యకుమార్ యాదవ్ స్థానంలో యూరప్ పర్యటనకు శ్రేయస్ అయ్యర్ను టీ20 కెప్టెన్గా ఎంపిక చేసిన భారత జట్టు యాజమాన్యం అతడిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్కు విజయవంతంగా నడిపించిన శ్రేయస్, ఐర్లాండ్తో జరిగిన సిరీస్లో 0-2తో ఓడిపోగా, ఇంగ్లండ్తో తొలి టీ20 వర్షం కారణంగా రద్దైంది. అనంతరం జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ భారత్ పరాజయం పాలవడంతో కెప్టెన్గా ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయాడు.ఈ నేపథ్యంలో ఓ పోడ్కాస్ట్లో మాట్లాడిన శ్రేష్ఠ అయ్యర్, "విరాట్ కోహ్లీ ఒక లెజెండ్, రోహిత్ శర్మ ఒక లెజెండ్, సచిన్ టెండూల్కర్ ఒక లెజెండ్. వాళ్లు కూడా తమ కెరీర్లో ఎన్నో మ్యాచ్లు ఓడిపోయారు. కానీ ప్రతిసారీ శ్రేయస్నే విమర్శిస్తే సమస్య అతనిలో కాకుండా విమర్శించే వారిలోనే ఉండొచ్చు" అని వ్యాఖ్యానించింది.అయితే శ్రేష్ఠ చేసిన ఈ పోలికలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సచిన్ టెండూల్కర్ 1996లో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి నాలుగు వన్డేల్లో రెండింట్లో జట్టుకు విజయాలు అందించాడు. విరాట్ కోహ్లీ కూడా కెప్టెన్సీ ఆరంభంలో తొలి ఓటమి తర్వాత వరుస విజయాలు సాధించాడు. రోహిత్ శర్మ తన తొలి వన్డే సిరీస్లో శ్రీలంకపై 2-1తో విజయం అందించగా, శుభ్మన్ గిల్ కూడా కెప్టెన్గా తన తొలి టీ20 సిరీస్లో ఐదు మ్యాచ్ల్లో నాలుగు విజయాలు నమోదు చేశాడు. ఈ గణాంకాలను ప్రస్తావిస్తూ శ్రేయస్ను దిగ్గజాలతో పోల్చడం సరైంది కాదని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.నెటిజన్లు శ్రేయస్ను దిగ్గజాలతో పోల్చొద్దని చెప్పినప్పటికీ.. శ్రేష్ఠ మాత్రం తన సోదరుడిపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. "శ్రేయస్ గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఆటగాడు. అతడిలో చాలా సామర్థ్యం ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు అతడే భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు పొందుతాడని నేను బలంగా నమ్ముతున్నాను" అని పేర్కొంది.ఇదిలా ఉండగా, ప్రారంభ వైఫల్యాలు ఎదురైనా శ్రేయస్ అయ్యర్పై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు జట్టు యాజమాన్యం విశ్వాసం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. 2028 టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని యువ జట్టుతో కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్న నేపథ్యంలో శ్రేయస్కు మరిన్ని అవకాశాలు లభించే అవకాశం కనిపిస్తోంది. -
IND vs SL: టెస్టు సిరీస్ నుంచి కీలక ప్లేయర్ అవుట్!
టీమిండియాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ పాతుమ్ నిసాంక ఈ సిరీస్కు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కాగా టీమిండియా వచ్చే నెల (ఆగష్టు)లో శ్రీలంకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో భారత్ రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుండగా... 23 నుంచి కొలంబోలో రెండో మ్యాచ్ జరుగుతుంది.ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శ్రీలంక వెస్టిండీస్ పర్యటనలో ఉంది. తొలి టెస్టులో ఆతిథ్య జట్టు చేతిలో 217 పరుగులతో ఓటమిపాలైన లంక.. ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని పట్టుదలగా ఉంది. రెండో టెస్టులో గెలిచి సిరీస్ 1-1తో సమం చేయాలని ఉవ్విళ్లూరుతోంది.లంక ప్రీమియర్ లీగ్ నుంచి అవుట్అయితే, ఓపెనర్ పాతుమ్ నిసాంక మణికట్టు గాయంతో ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. శస్త్ర చికిత్స కోసం అతడు యూకేకు వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జూలై 17 నుంచి మొదలుకానున్న లంక ప్రీమియర్ లీగ్-2026 నుంచి నిసాంక వైదొలిగాడు. ఈ లీగ్ తర్వాత వారం రోజుల వ్యవధిలోనే భారత్- శ్రీలంక టెస్టు సిరీస్ మొదలుకానుంది.నిలకడగా ఆడుతూ..కాబట్టి పాతుమ్ నిసాంక టీమిండియాతో సిరీస్కు కూడా దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. గతేడాది కాలంగా నిసాంక టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. 2025లో అతడు సగటు 56తో 393 పరుగులు రాబట్టాడు.ఇప్పటికి మొత్తంగా 33 ఇన్నింగ్స్లో కలిపి 1310 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఏడు అర్ధ శతకాలు ఉన్నాయి. సొంతగడ్డపై ఆడిన 18 ఇన్నింగ్స్లో అతడు రెండు శతకాల సాయంతో 725 పరుగులు చేయడం విశేషం. ఇలా నిలకడగా ఆడుతూ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్న నిసాంక.. టీమిండియాతో సిరీస్కు దూరం కావడం ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బలాంటిదే. కాగా విండీస్తో తొలి టెస్టులో గాయం కారణంగా ఇబ్బంది పడిన నిసాంక రెండు ఇన్నింగ్స్లో కలిపి కేవలం ఐదు పరుగులే చేసి నిష్క్రమించాడు.చివరిసారి వైట్వాష్ఇదిలా ఉంటే..టీమిండియా చివరిసారి 2017లో శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడింది. అప్పుడు మూడు మ్యాచ్ల సిరీస్ను భారత్ 3–0తో వైట్వాష్ చేసింది. ఇక 2008 నుంచి లంక గడ్డపై టెస్టు సిరీస్ ఓడని టీమిండియా... అదే ఆధిపత్యం కొనసాగిస్తుందా చూడాలి.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025–27లో భాగంగా ఇప్పటి వరకు 9 టెస్టులు ఆడిన శుబ్మన్ గిల్ సేన... 4 విజయాలు, 4 పరాజయాలు, ఒక ‘డ్రా’తో ప్రస్తుతం పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: చరిత్ర సృష్టించిన రొనాల్డో! -
నా సేవల్ని సరిగ్గా వాడుకోలేదు.. అందుకే: టీమిండియా స్టార్
టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ పర్యటనలో యాజమాన్యం తన సేవలను సరిగ్గా వాడుకోలేదని ఆరోపించాడు. కాగా గతేడాది టీమిండియా ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే.ఈ సిరీస్తోనే భారత జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన ప్రయాణం ఆరంభించాడు. గౌతం గంభీర్ మార్గదర్శనంలో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీని టీమిండియా 2-2తో సమం చేసింది. ఇక ఈ సిరీస్లో భాగంగా ముంబైకర్ శార్దూల్ ఠాకూర్ రెండు టెస్టులు ఆడాడు. మొత్తంగా 27 ఓవర్లు బౌలింగ్ చేసి 144 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. లీడ్స్ వేదికగా తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో ఆరు ఓవర్లు వేసిన శార్దూల్.. 38 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్లో 10 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది.అదే విధంగా మాంచెస్టర్లో నాలుగో టెస్టులో పదకొండు ఓవర్లు వేసిన శార్దూల్ ఠాకూర్ 55 పరుగులు ఇచ్చి వికెట్లు తీయలేకపోయాడు. ఈ మ్యాచ్ డ్రా అయింది. అయితే, ఈ మూడు ఇన్నింగ్స్లోనూ శార్దూల్ కంటే మిగతా బౌలర్లు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేశారు.ఈ విషయాన్ని శార్దూల్ ఠాకూర్ తాజాగా గుర్తుచేసుకున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ 2026-27 సీజన్ లాంచ్లో భాగంగా మాట్లాడుతూ.. ‘‘2024-25 సీజన్లో నేను అద్భుతంగా ఆడాను (తొమ్మిది మ్యాచ్లలో కలిపి 35 వికెట్లు). కానీ తగినన్ని మ్యాచ్లు ఆడే అవకాశాలు మాత్రం రాలేదు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నపుడు నా సేవల్ని యాజమాన్యం సరిగ్గా ఉపయోగించుకోలేదు.ఇందులో నా తప్పు కూడా ఉంది. లీడ్స్ టెస్టులో నేను సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. ఒక్క పరుగుకే అవుటయ్యాను. మాంచెస్టర్లో మాత్రం నేను అద్భుతంగా బ్యాటింగ్ చేశాను. తొలి ఇన్నింగ్స్లో 41 పరుగులు చేశాను. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 358 పరుగులు చేయగలిగింది. అందులో నా పాత్ర కూడా ఉంది. అయితే, నేను రెండో ఇన్నింగ్స్లో సరిగ్గా ఆడలేదు. ఒకవేళ బాగా ఆడి ఉంటే ఫలితం వేరుగా ఉండేదేమో’’ అని శార్దూల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు. -
రెండో స్థానానికి గిల్
దుబాయ్: ఇటీవల అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్లో సత్తా చాటిన భారత కెప్టెన్ శుబ్మన్ గిల్... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి ఎగబాకాడు. అఫ్గాన్తో రెండు మ్యాచ్ల్లో బ్యాటింగ్కు దిగిన గిల్ 238 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో మూడు స్థానాలు మెరుగుపరుచుకున్న గిల్ 791 పాయింట్లతో రెండో ర్యాంక్కు చేరుకున్నాడు. విరాట్ కోహ్లి (768 పాయింట్లు), రోహిత్ శర్మ (754 పాయింట్లు) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉండగా... న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ (815 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా నుంచి కేఎల్ రాహుల్ (651 పాయింట్లు) 11వ స్థానానికి చేరగా... శ్రేయస్ అయ్యర్ (638 పాయింట్లు) 14వ ర్యాంక్లో ఉన్నాడు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో రషీద్ ఖాన్ (682 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా... భారత్ నుంచి అత్యుత్తమంగా కుల్దీప్ యాదవ్ (614 పాయింట్లు) ఏడో ర్యాంక్లో కొనసాగుతున్నాడు. రూట్ 12వ సారి... ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో మరోసారి నంబర్వన్ స్థానానికి చేరాడు. సుదీర్ఘ కెరీర్లో రూట్ ‘టాప్’ ర్యాంక్కు చేరడం ఇది పన్నెండోసారి కావడం విశేషం. తాజాగా న్యూజిలాండ్తో రెండో టెస్టులో బెన్ స్టోక్స్ స్థానంలో ఇంగ్లండ్ జట్టుకు తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించిన రూట్... ఈ సిరీస్లో బ్యాట్తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా రెండు స్థానాలు పురోగతి సాధించిన అతడు... 871 పాయింట్లతో అగ్రస్థానానికి ఎగబాకాడు. ఇంగ్లండ్కే చెందిన హ్యారీ బ్రూక్ (866 పాయింట్లు) రెండో స్థానంలో ఉండగా... టీమిండియా నుంచి గిల్ (743 పాయింట్లు), యశస్వి జైస్వాల్ (733 పాయింట్లు) వరుసగా ఏడు, ఎనిమిది ర్యాంక్ల్లో ఉన్నారు. ఇంగ్లండ్తో రెండో టెస్టులో 11 వికెట్లతో విజృంభించిన న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ (870 పాయింట్లు), భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానానికి చేరాడు. తద్వారా 36 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో ‘టాప్’ ర్యాంక్ దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ నుంచి గతంలో జాక్ కొవీ (1947), రిచర్డ్ హాడ్లీ (1984–1990) మాత్రమే ఈ ఘనత సాధించారు. -
IND vs AFG: శతక్కొట్టిన జైసూ.. సిరీస్ క్లీన్స్వీప్
చెన్నై వేదికగా అఫ్గానిస్తాన్తో మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి విధించిన 219 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 28.4 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది.భారత ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ శతకం (86 బంతుల్లో 110 నాటౌట్)తో చెలరేగగా.. రోహిత్ శర్మ 79 పరుగులు సాధించాడు. వన్డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ 19 బంతుల్లో 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. అంతకుముందు ధర్మశాలలో ఏడు వికెట్ల తేడాతో అఫ్గాన్ను ఓడించిన గిల్ సేన.. లక్నో మ్యాచ్లో 170 పరుగుల తేడాతో పర్యాటక జట్టును చిత్తు చేసింది.Updates: చెన్నై వేదికగా టాస్ గెలిచిన అఫ్గాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి 44.2 ఓవర్లలో కేవలం 218 చేసి ఆలౌట్ అయింది. ఇక టీమిండియా 219 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగింది. హష్మతుల్లా పిచ్ ఏరియాలో పరిగెత్తిన కారణంగా అఫ్గాన్కు ఐదు పరుగుల పెనాల్టీ పడగా.. టీమిండియా.. 5/0తో తమ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.25 ఓవర్లలో టీమిండియా స్కోరు: 1771-1జైసూ 81, అయ్యర్ 4 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన భారత్22.5: నబీ బౌలింగ్లో సెదీకుల్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన రోహిత్ శర్మ (69 బంతుల్లో 79). శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 171-1. జైసూ 78 పరుగులతో ఉన్నాడు.21 ఓవర్లలో టీమిండియా స్కోరు: 153-0రోహిత్ శర్మ 65, యశస్వి జైస్వాల్ 75 పరుగులతో ఉన్నారు.రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ15.2: రషీద్ ఖాన్ బౌలింగ్లో ఫోర్ బాది.. అర్ధ శతకం పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ. 47 బంతుల్లో హాఫ్ సెంచరీ. స్కోరు: 123-0(15.3). జైసూ 58 పరుగులతో ఉన్నాడు.జైస్వాల్ అర్ద శతకం11.3: రషీద్ ఖాన్ బౌలింగ్లో సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న జైస్వాల్పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 86-0యశస్వి జైస్వాల్ 46, రోహిత్ 27 పరుగులతో ఉన్నారు.తొలి ఓవర్లోనే 23 పరుగులు5/0తో లక్ష్య ఛేదన మొదలుపెట్టిన టీమిండియా.. తొలి ఓవర్లో మొత్తంగా 23 పరుగులు ఖాతాలో వేసుకుంది. జైస్వాల్ 14 పరుగులు చేయగా.. మిగతావి ఎక్స్ట్రా రూపంలో వచ్చాయి. చెలరేగిన ప్రసిద్.. అఫ్గాన్ ఆలౌట్భారత పేసర్ ప్రసిద్ కృష్ణ అఫ్గాన్ టాపార్డర్ను కుదేలు చేశాడు. అతడి దెబ్బకు రహ్మానుల్లా గుర్బాజ్ (5), రహ్మత్ షా (5), ఇబ్రహీం జద్రాన్ (11) పెవిలియన్కు వరుస కట్టారు. ఇలాంటి దశలో హష్మతుల్లా షాహిది కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 131 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 102 పరుగులు చేశాడు. అయితే, ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో ఆఖరి వికెట్గా వెనుదిరగడంతో హష్మతుల్లా శతక ఇన్నింగ్స్కు తెరపడింది. మిగతా వారిలో అజ్మతుల్లా అర్ధ శతకం (50) చేయగా.. మహ్మద్ నబీ 21 పరుగులు చేశాడు. ఫలితంగా 44.2 ఓవర్లలో 218 పరుగులు చేసి అఫ్గాన్ ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ ఐదు వికెట్లతో చెలరేగగా.. గుర్నూర్, ప్రిన్స్, హర్ష్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.అఫ్గాన్ కెప్టెన్ సెంచరీఅఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది సెంచరీ సాధించాడు. 126 బంతుల్లో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. స్కోరు: 217-9(44).తొమ్మిదో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్41.1: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో హష్మతుల్లా సింగిల్కు వెళ్లగా ఫరీద్ రనౌట్ (0). స్కోరు: 206-9(41.2).ఎనిమిదో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్40.6: హర్ష్ దూబే బౌలింగ్లో.. హష్మతుల్లా షాహిది సింగిల్కు వెళ్లగా.. ఘజన్ఫర్ (1) రనౌట్ అయ్యాడు. స్కోరు: 206-8(41). ఫరీద్ మాలిక్ క్రీజులోకి వచ్చాడు.ఏడో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్40.3: హర్ష్ దూబే బౌలింగ్లో ప్రిన్స్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన రషీద్ ఖాన్ (5). స్కోరు: 206-7(40.3). హష్మతుల్లా 91 పరుగులతో ఆడుతున్నాడు.ఆరో వికెట్ డౌన్37.1: గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో మహ్మద్ నబీ (21) బౌల్డ్. స్కోరు: 200-6(37.2). రషీద్ ఖాన్ క్రీజులోకి రాగా.. హష్మతుల్లా 89 పరుగులతో ఉన్నాడు.ఐదో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్28.2: ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో ప్రసిద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన అజ్మతుల్లా (50). అజ్మతుల్లా అర్ధ శతకం27.3: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో సింగిల్ తీసి అజ్ముతుల్లా ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ (55 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. స్కోరు: 140-4(28). హష్ముతుల్లా 54 పరుగులతో ఆడుతున్నాడు. హష్మతుల్లా హాఫ్ సెంచరీ15.5: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో సింగిల్ తీసి అర్ధ శతకం పూర్తి చేసుకున్న హష్మతుల్లా షాహిది. 64 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్న కెప్టెన్. స్కోరు: 133-4(26). అజ్మతుల్లా 47 పరుగులతో ఆడుతున్నాడు.22 ఓవర్లకు అఫ్గాన్ స్కోర్: 108/422 ఓవర్లు ముగిసే సరికి అఫ్గానిస్తాన్ నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ హస్మతుల్లా షాహిది(36), అజ్మతుల్లా ఓమర్జాయ్(36) ఉన్నారు.పదిహేను ఓవర్లలో అఫ్గానిస్తాన్ స్కోరు: 69-4(15)హష్మతుల్లా 17, అజ్మతుల్లా 18 పరుగులతో ఆడుతున్నారు.పవర్ ప్లేలో అఫ్గానిస్తాన్ స్కోరు: 37-4 (10)హష్మతుల్లా నాలుగు పరుగులతో ఉండగా.. అజ్మతుల్లా సున్నా పరుగుల వద్ద ఉన్నాడు.నాలుగో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్9.2: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి అవుటైన డార్విష్ రసూలీ (1). అజ్మతుల్లా ఒమర్జాయ్ క్రీజులోకి రాగా.. హష్మతుల్లా షాహిది నాలుగు పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 36-4(9.3)మూడో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్7.2: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ఇబ్రహీం జద్రాన్ (11). స్కోరు: 28-3(7.2). డార్విష్ రసూలీ క్రీజులోకి రాగా.. హష్మతుల్లా ఇంకా పరుగుల ఖాతా తెరవనే లేదు.రెండో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్5.6: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి రహ్మత్ షా (15 బంతుల్లో 5) రెండో వికెట్గా వెనుదిరిగాడు. స్కోరు: 26-2. జద్రాన్ 10 పరుగులతో ఉండగా.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది క్రీజులోకి వచ్చాడు. ఐదు ఓవర్లలో అఫ్గాన్ స్కోరు: 22-1(5)రహ్మత్ ఒకటి, జద్రాన్ పది పరుగులతో క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్1.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో తొలి వికెట్గా వెనుదిరిగిన రహ్మానుల్లా గుర్బాజ్ (5). క్రీజులోకి రహ్మత్ షా. స్కోరు: 5-1(1.2). ఇబ్రహీం జద్రాన్ ఇంకా పరుగుల ఖాతా తెరవలేదు.తుదిజట్లలో మార్పులుఈ సందర్భంగా కెప్టెన్ హష్మతుల్లా షాహిది మాట్లాడుతూ.. మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, జియా ఉర్ రహ్మాన్లు తిరిగి రాగా.. ఫరీద్ మాలిక్కు కూడా తుదిజట్టులో చోటు ఇచ్చినట్లు తెలిపాడు. రాహుల్పై వేటు!ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో భారత్ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది. కుల్దీప్ యాదవ్కు బదులు హర్ష్ దూబే రాగా.. అర్ష్దీప్ సింగ్, కేఎల్ రాహుల్ స్థానాల్లో ప్రసిద్ కృష్ణ, నితీశ్ కుమార్ రెడ్డి చోటు దక్కించుకున్నారు.సిరీస్ భారత్ కైవసంకాగా మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలుత ధర్మశాలలో అఫ్గాన్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన భారత్.. లక్నో మ్యాచ్లో 170 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. భారత వన్డే జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్కు ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్.అఫ్గానిస్తాన్రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), డార్విష్ రసూలీ, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ఏఎమ్ ఘజన్ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్. -
మీ వల్ల గందరగోళంలో శుబ్మన్ గిల్: మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం తీరును భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి విమర్శించాడు. అఫ్గానిస్తాన్తో రెండో వన్డేలో టాపార్డర్లో మార్పులు చేయడాన్ని తప్పుబట్టాడు. కాగా స్వదేశంలో అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.తొలుత ధర్మశాలలో అఫ్గాన్ను చిత్తు చేసిన భారత జట్టు.. లక్నో వేదికగా బుధవారం రెండో వన్డేలో అఫ్గాన్ను 170 పరుగుల తేడాతో చిత్తు చేసి ఈ ఘనత సాధించింది. తద్వారా వన్డే కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఖాతాలో తొలి సిరీస్ విజయం చేరింది.ఇదిలా ఉంటే.. అఫ్గాన్తో రెండో వన్డేలో టీమిండియా తమ ఓపెనింగ్ జోడీని మార్చింది. కెప్టెన్ శుబ్మన్ గిల్కు బదులు.. యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మతో పాటు ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే, చాన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన జైసూ పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం నాలుగు పరుగులు చేసి నిష్క్రమించాడు.మరోవైపు.. రోహిత్ 48 పరుగులు చేయగా.. వన్డౌన్లో వచ్చిన గిల్ భారీ శతకం (154)తో దుమ్ములేపాడు. ఇక గత మ్యాచ్లో మూడో స్థానంలో ఆడిన ఇషాన్ కిషన్.. ఈసారి నాలుగో నంబర్ బ్యాటర్గా బరిలోకి దిగి మెరుపు సెంచరీ (79 బంతుల్లో 125)తో అదరగొట్టాడు. అయితే, ఈ మార్పులతో జట్టు భారీ విజయం సాధించినప్పటికీ మనోజ్ తివారీ మాత్రం నాయకత్వ బృందాన్ని విమర్శించాడు.క్రిక్బజ్తో మాట్లాడుతూ.. ‘‘భవిష్యత్తులో తలనొప్పిగా మారడం తప్ప ఈ ప్రయోగంతో ఎలాంటి ప్రయోజనం లేదు. రోహిత్ శర్మతో యశస్వి జైస్వాల్ను ఓపెనింగ్ చేయించి శుబ్మన్ గిల్ను వన్డౌన్కి డిమోట్ చేశారు. ఆ స్థానంలో గిల్ భారీగా పరుగులు రాబట్టాడు.ఇప్పుడా విషయం గందరగోళానికి కారణం కావొచ్చు. నేను మళ్లీ ఓపెనర్గా వెళ్లాలా? లేదంటే వన్డౌన్లోనే ఆడాలా అని గిల్ కన్ఫ్యూజ్ అవుతాడు. అసలు యాజమాన్యం ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదు. ఇక్కడ స్పష్టత లోపించింది.ఏదేమైనా జైస్వాల్ను ఆడించడం మంచి విషయం. ఎందుకంటే అతడు అన్ని ఫార్మాట్లలో ఆడగల సమర్థుడు. అతడికి మళ్లీ అవకాశం రావడం హర్షణీయం. ఇక రోహిత్ శర్మ అఫ్గన్తో రెండో వన్డేలో పెద్దగా దూకుడు ప్రదర్శించలేదు. అతడిపై బయటి నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది’’ అని మనోజ్ తివారి చెప్పుకొచ్చాడు. -
డబుల్ సెంచరీ చేసేవాడినే... కానీ
అఫ్గానిస్తాన్తో రెండో వన్డేలో టీమిండియా అదరగొట్టింది. లక్నో వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో ప్రత్యర్థిని ఏకంగా 170 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను సొంతం చేసుకుంది.ఆత్మవిశ్వాసంతోఈ క్రమంలో టీమిండియా వన్డే కెప్టెన్గా శుబ్మన్ గిల్ (Shubman Gill) తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నాడు. ఈ మ్యాచ్లో అతడు 154 పరుగులతో బ్యాటర్గానూ సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘మొదటి బంతి నుంచే నేను ఆత్మవిశ్వాసంతో బాదడం మొదలుపెట్టాను. నా ప్రణాళికలకు తగ్గట్లుగానే ఫలితం రావడం చూశాను.40- 45 ఓవర్ల పాటు ఈ సిరీస్లో నాకు నేనే ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. నేనే మ్యాచ్లు ఫినిష్ చేయాలని భావించాను. 40- 45 ఓవర్ల పాటు క్రీజులో ఉండాలని టార్గెట్ పెట్టుకున్నాను. శుభారంభం అందుకుంటే దానిని భారీ స్కోరుగా మలచాలని నిర్ణయించుకున్నా.డబుల్ సెంచరీ చేసేవాడినే... కానీఈరోజు డబుల్ సెంచరీ పూర్తి చేయాలనే అనుకున్నా. కానీ జట్టు స్కోరు 430, 440, 450 రేంజ్లో ఉండాలంటే నేను హిట్టింగ్ ఆపకూడదు. నా మనసులో అదొక్కటే ఉండిపోయింది. టాస్ ఓడినంత మాత్రాన పెద్దగా తేడా ఏమీ కనబడలేదు. ఈ పిచ్ మీద 310- 320 మాత్రమే స్కోరు చేసి ఉంటే.. అది ఛేదించదగ్గ టార్గెటే.అయితే, మేము ముందు నుంచే ప్రణాళికతో ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాము. మా బౌలర్లు కూడా తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారు’’ అని శుబ్మన్ గిల్ తన వ్యక్తిగత ప్రదర్శన పట్ల.. అదే విధంగా జట్టు ప్రదర్శన పట్ల హర్షం వ్యక్తం చేశాడు.ఆల్రౌండ్ ప్రదర్శనతో..ఏకనా స్టేడియంలో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్కు దిగింది. 49.5 ఓవర్లలో 402 పరుగులు చేసి ఆలౌట్ అయింది. గిల్ (154)తో పాటు ఇషాన్ కిషన్ (125) మెరుపు సెంచరీ సాధించడం వల్ల ఈ స్కోరు సాధ్యమైంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో కేవలం 232 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత పేసర్లు అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ చెరో మూడు వికెట్లతో సత్తా చాటగా.. ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. చదవండి: వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ షాక్ The in-form #RahmanullahGurbaz is sent packing as #GurnoorBrar delivers the breakthrough.#INDvAFG | 2nd ODI | LIVE NOW 👉https://t.co/YiwP9pOAPC pic.twitter.com/6JvreD78S0— Star Sports (@StarSportsIndia) June 17, 2026 -
గిల్, ఇషాన్ శతకాల మోత
లక్నో: భారత జట్టు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటింది. బలహీన జట్టు అఫ్గానిస్తాన్తో రెండో వన్డేలోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి సిరీస్ను 2–0తో సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్మన్ గిల్ (110 బంతుల్లో 154; 22 ఫోర్లు, 2 సిక్స్లు) తొమ్మిదో సెంచరీ సాధించగా... ఇషాన్ కిషన్ (79 బంతుల్లో 125; 14 ఫోర్లు, 7 సిక్స్లు) కెరీర్లో రెండో శతకంతో చెలరేగాడు. వీరిద్దరు మూడో వికెట్కు 23.3 ఓవర్లలో 224 పరుగులు జోడించారు. వన్డేల్లో భారత్ 400కు పైగా స్కోరు చేయడం ఇది 8వసారి కావడం విశేషం. అనంతరం అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులకే ఆలౌటైంది. రహ్మత్ షా (89 బంతుల్లో 79; 8 ఫోర్లు) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలిచాడు. నామమాత్రమైన చివరి వన్డే శనివారం చెన్నైలో జరుగుతుంది. డబుల్ సెంచరీ భాగస్వామ్యం... ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) రెండో ఓవర్లోనే వెనుదిరిగినా... రోహిత్ శర్మ (39 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్స్లు) తనదైన శైలిలో కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. ఘజన్ఫర్ ఓవర్లో 3 ఫోర్లతో గిల్ కూడా ధాటిని పెంచాడు. అయితే రోహిత్ను రషీద్ బౌల్డ్ చేయడంతో 87 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఈ దశలో జత కలిసిన గిల్, ఇషాన్ వేగంగా దూసుకుపోయారు. 38 బంతుల్లో గిల్ హాఫ్ సెంచరీ పూర్తి కాగా, 52 బంతుల్లో ఇషాన్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ప్రతీ బౌలర్పై చెలరేగిన వీరిద్దరిని నిలువరించడం అఫ్గాన్ వల్ల కాలేదు. సమీ వేసిన ఇన్నింగ్స్ 33వ ఓవర్లో 5 బౌండరీలతో 21 పరుగులు రాబట్టిన భారత్ 250 పరుగుల స్కోరును దాటింది. ఇదే ఓవర్ తొలి బంతికి గిల్ సెంచరీ (77 బంతుల్లో) పూర్తి కాగా, చివరి బంతికి ఇషాన్ (71 బంతుల్లో) శతకాన్ని అందుకోవడం విశేషం. ఈ దశలో గిల్ 16 బంతుల వ్యవధిలో 7 ఫోర్లు బాదడం అతని జోరును చూపించింది. ఖరోటే ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు బాదిన ఇషాన్ తర్వాతి బంతికి వెనుదిరిగాడు. గిల్, ఇషాన్ ఏకంగా 9.6 రన్రేట్తో పరుగులు జోడించడం విశేషం. గిల్ పెవిలియన్ చేరాక భారత్ ఇన్నింగ్స్ ఆశించిన వేగంతో సాగలేదు. గిల్, రాహుల్ (0) వరుస బంతుల్లో అవుట్ కాగా, శ్రేయస్ (26) పెద్దగా ప్రభావం చూపలేదు. 40 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 340/3 కాగా... చివరి 10 ఓవర్లలో భారత్ 62 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయింది. టపటపా... భారీ ఛేదనలో ఊహించినట్లే అఫ్గాన్ చేతులెత్తేసింది. గుర్బాజ్ (33 బంతుల్లో 41; 7 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించినా... ఆపై ఇతర బ్యాటర్లు నిలవలేకపోయారు. రహ్మత్, సాదిఖుల్లా (50 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్కు 57 పరుగులు జత చేసిన తర్వాత జట్టు పూర్తిగా కుప్పకూలింది. బుధవారం లక్నోలో తీవ్రమైన ఎండ కారణంగా ఇరు జట్ల ఆటగాళ్లంతా బాగా ఇబ్బంది పడ్డారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ప్లేయర్లు పదే పదే విరామాలు తీసుకున్నారు. గిల్, ఇషాన్ ఎంతో అలసిపోగా, రషీద్ ఖాన్ మధ్యలోనే మైదానం వీడాడు. కెరీర్లో తొలి వన్డే ఆడిన దార్విష్ రెండు సార్లు బయటకు వెళ్లాడు. బ్యాటింగ్ సమయంలో కండరాలు పట్టేయడంతో పెవిలియన్కు వెళ్లిన అతను మళ్లీ రాలేదు.ప్రిన్స్ యాదవ్ @263 ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో మూడు మార్పులు జరిగాయి. తొడ కండరాల గాయంతో నితీశ్ కుమార్ రెడ్డి మ్యాచ్కు దూరం కాగా... అతని స్థానంలో జైస్వాల్కు చోటు లభించింది. ప్రసిధ్, హర్ష్ దూబే స్థానాల్లో ప్రిన్స్ యాదవ్, కుల్దీప్లకు అవకాశం దక్కింది. ఈ మ్యాచ్తో ప్రిన్స్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. భారత్ తరఫున వన్డేలు ఆడిన 263వ ఆటగాడిగా అతను గుర్తింపు పొందాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) ఖరోటే (బి) సలీమ్ 4; రోహిత్ (బి) రషీద్ 48; గిల్ (సి) దార్విష్ (బి) ఖరోటే 154; ఇషాన్ కిషన్ (సి) (సబ్) ఇక్రామ్ (బి) ఖరోటే 125; శ్రేయస్ (సి) ఇబ్రహీం (బి)ఖరోటే 26; రాహుల్ (సి) ఇబ్రహీం (బి) ఖరోటే 0; సుందర్ (సి) గుర్బాజ్ (బి) రషీద్ 19; గుర్నూర్ (సి) ఇబ్రహీం (బి) రషీద్ 3; అర్ష్ దీప్ (సి) రషీద్ (బి) ఘజన్ఫర్ 3; కుల్దీప్ (నాటౌట్) 3; ప్రిన్స్ (రనౌట్) 5; ఎక్స్ట్రాలు 12; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 402. వికెట్ల పతనం: 1–9, 2–96, 3–320, 4–360, 5–360, 6–371, 7–387, 8–392, 9–396, 10–402. బౌలింగ్: ఘజన్ఫర్ 10–1–69–1, సలీమ్ 8–0–75–1, సమీ 8.5–0–90–0, ఖరోటే 10–0–76–4, రషీద్ 8–0–48–3, హష్మతుల్లా 5–0–36–0. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) రాహుల్ (బి) గుర్నూర్ 41; ఇబ్రహీమ్ (సి) ప్రిన్స్ (బి) అర్ష్ దీప్ 21; సాదిఖుల్లా (ఎల్బీ) (బి) సుందర్ 42; రహ్మత్ (సి) గుర్నూర్ (బి) ప్రిన్స్ 79; దార్విష్ (రిటైర్డ్హర్ట్) 6; హష్మతుల్లా (బి) గుర్నూర్ 4; ఖరోటే (బి) ప్రిన్స్ 6; రషీద్ (సి) రోహిత్ (బి) అర్ష్ దీప్ 12; ఘజన్ఫర్ (సి) శ్రేయస్ (బి) అర్ష్ దీప్ 1; సలీమ్ (బి) గుర్నూర్ 9; సమీ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 9; మొత్తం (44.3 ఓవర్లలో ఆలౌట్) 232. వికెట్ల పతనం: 1–52, 2–71, 3–128, 4–140, 5–170, 6–188, 7–190, 8–220, 9–232. బౌలింగ్: అర్ష్ దీప్ 9–0–45–3, ప్రిన్స్ 7.3–0–56–2, గుర్నూర్ 10–0–60–3, కుల్దీప్ 10–0–42–0, సుందర్ 7–0–24–1, జైస్వాల్ 1–0–3–0. -
రెండో వన్డేలో అఫ్గాన్ చిత్తు.. సిరీస్ భారత్ సొంతం
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన రెండో వన్డేలో 170 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది.భారత్ నిర్ధేశించిన 403 పరుగుల టార్గెట్ను చేధించలేక అఫ్గాన్ చతికల పడింది. పర్యాటక జట్టు లక్ష్య చేధనలో భారత బౌలర్ల ధాటికి 44.3 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో రెహమత్ షా(79) టాప్ స్కోరర్గా నిలవగా.. గుర్బాజ్(41), అటల్(42) పర్వాలేదన్పించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ తలా మూడు వికెట్లు సాధించారు.వీరిద్దరితో పాటు అరంగేట్ర ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించి టీమిండియా ఆలౌట్ అయింది. శుబ్మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) సెంచరీలతో కదం తొక్కారు. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే జూన్ 20న చెన్నై వేదికగా జరగనుంది. -
శుబ్మన్ సరికొత్త చరిత్ర.. తొలి భారత క్రికెటర్గా
టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్-2026లో దుమ్ములేపిన గిల్.. ఇప్పుడు అదే జోరును అఫ్గానిస్తాన్ సిరీస్లో కనబరుస్తున్నాడు. లక్నో వేదికగా అఫ్గాన్తో రెండో వన్డేలో గిల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 77 బంతుల్లోనే తన 9వ వన్డే సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 110 బంతులు ఎదుర్కొన్న గిల్.. 22 ఫోర్లు, 2 సిక్స్లతో 154 పరుగులు చేశాడు. ఈ అద్భుత శతకంతో వన్డే క్రికెట్లో 3000 పరుగుల మైలురాయిని దాటాడు.తద్వారా వన్డేల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ ఫీట్ను గిల్ కేవలం 62 ఇన్నింగ్స్లలో అందుకున్నాడు. గతంలో ఈ రికార్డు శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్(72 ఇన్నింగ్స్లు) పేరిట సంయుక్తంగా ఉండేది.తాజా నాక్తో వారిద్దరిని శుబ్మన్ అధిగమించాడు. బంతులు పరంగా ఈ ఫీట్ సాధించిన జాబితాలో మాజీ కెప్టెన్ కపిల్దేవ్(2995) అగ్రస్ధానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్ధానంలో గిల్(3016) ఉన్నాడు. అదేవిధంగా వన్డేల్లో ఫాస్టెస్ట్ 150 చేసిన మూడో ప్లేయర్గా వీరేంద్ర సెహ్వాగ్ను గిల్ అధిగమించాడు.సెహ్వాగ్ 2011లో వెస్టిండీస్పై 112 బంతుల్లో ఈ ఫీట్ సాధించగా.. అఫ్గాన్తో మ్యాచ్లో గిల్ కేవలం 108 బంతుల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో ఇషాన్ కిషన్(103) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది.చదవండి: వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ భారీ షాక్ -
గిల్, కిషన్ సెంచరీలు.. భారత్ స్కోర్ 402 పరుగులు
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు విజృంభించారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గాన్ కెప్టెన్ తొలుత టీమిండియాను బ్యాటింగ్కు అహ్హానించాడు. అయితే మొదట బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ నిలకడగా ఆడి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు.గిల్, ఇషాన్ మెరుపు సెంచరీలు..మంచి టచ్లో కన్పించిన రోహిత్ శర్మ(48) హాఫ్ సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్తో కలిసి కెప్టెన్ గిల్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. టీ20 మ్యాచ్ను తలపించేలా వీరిద్దరూ బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో గిల్ 77 బంతుల్లో తన సెంచరీ మార్క్ను అందుకోగా.. కిషన్ 71 బంతుల్లోనే శతక్కొట్టాడు.వీరిద్దరూ మూడో వికెట్కు ఏకంగా 224 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్ ఓవరాల్గా 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 154 పరుగులు చేయగా.. కిషన్ 79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్లతో 125 రన్స్ చేసి ఔటయ్యాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల వద్ద ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ బౌలర్లలో స్పిన్నర్లు నంగ్యాలియా ఖరోటి నాలుగు, రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు ఘజన్ఫర్, మహ్మద్ సలీమ్ తలా వికెట్ సాధించారు. -
IND vs AFG: ఇషాన్ కిషన్ ‘ఫాస్టెస్ట్’ సెంచరీ
అఫ్గనిస్తాన్తో రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ శతక్కొట్టాడు. లక్నో వేదికగా కేవలం 71 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్ మీద వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్గా ఇషాన్ కిషన్ నిలిచాడు.టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ధర్మశాల వేదికగా తొలి మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది భారత జట్టు. ఇక లక్నోలోని ఏకనా స్టేడియంలో బుధవారం నాటి రెండో వన్డేలో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది.జైసూ విఫలం.. పాపం రోహిత్ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (4) విఫలం కాగా.. రోహిత్ శర్మ అర్ద శతకానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రషీద్ ఖాన్ బౌలింగ్లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు.ఇలాంటి తరుణంలో వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ శుబ్మన్ గిల్, నాలుగో నంబర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. గిల్ 77 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. ఇషాన్ 71 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఇషాన్ సెంచరీ ఇన్నింగ్స్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. 𝐓𝐡𝐞 𝐈𝐬𝐡𝐚𝐧-𝐝𝐚𝐚𝐫 𝐊𝐢𝐬𝐡𝐚𝐧 𝐬𝐡𝐨𝐰 𝐢𝐧 𝐋𝐮𝐜𝐤𝐧𝐨𝐰! 🤩He switched gears seamlessly, completely taking the game away with a magnificent ton! 🔥#INDvAFG | 2nd ODI | LIVE NOW 👉https://t.co/YiwP9pOAPC pic.twitter.com/sMtq9hV2z8— Star Sports (@StarSportsIndia) June 17, 2026వీరిద్దరి విజృంభణ కారణంగా టీమిండియా 34 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 276 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఇక ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ మొత్తంగా 79 బంతుల్లో 14 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేసి.. నంగేయాలియా బౌలింగ్లో ఇక్రామ్ అలిఖిల్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.అఫ్గనిస్తాన్పై వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన క్రికెటర్లు1.ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్)- 2019లో 57 బంతుల్లో శతకం2. రోహిత్ శర్మ (ఇండియా)- 2023లో 63 బంతుల్లో శతకం3. ఇషాన్ కిషన్ (ఇండియా)- 2026లో 71 బంతుల్లో శతకం4. గ్లెన్ మాక్స్వెల్ (ఆస్ట్రేలియా)- 2023లో 76 బంతుల్లో శతకం5. శుబ్మన్ గిల్ (ఇండియా)- 2026లో 77 బంతుల్లో శతకం.చదవండి: చెలరేగిన బ్యాటర్లు.. అఫ్గన్పై భారత్ భారీ స్కోరు -
శుబ్మన్ గిల్ సూపర్ సెంచరీ
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ సూపర్ సెంచరీతో కదం తొక్కాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేసిన గిల్.. కేవలం 77 బంతుల్లో తన 9వ వన్డే సెంచరీ మార్క్ను అందుకున్నాడు. యశస్వి జైశ్వాల్ తుది జట్టులో చోటు దక్కడంతో గిల్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చాడు. అయితే జైశ్వాల్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు. కేవలం 4 పరుగులు చేసి ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఔటయ్యాడు.ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన గిల్, తన రెగ్యులర్ ఓపెనర్ పార్టనర్ రోహిత్ శర్మతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ దూకుడుగా ఆడడంతో భారత స్కోర్ పవర్ప్లేలో 80 పరుగుల మార్క్ దాటింది. అనంతరం రోహిత్ ఔటైనప్పటికి శుబ్మన్ మాత్రం వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. రోహిత్ ఔటయ్యక క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ సైతం అఫ్గాన్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కిషన్ కూడా కేవలం 71 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్లతో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. గిల్(86 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్స్లతో 121), కిషన్(111) అజేయంగా తమ బ్యాటింగ్ను కొనసాగిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత భారత్ను బ్యాటింగ్కు అహ్హానించింది. లక్నో పేసర్ ప్రిన్స్ యాదవ్ ఈ మ్యాచ్తో భారత్ తరపున అరంగేట్రం చేశాడు.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్అఫ్గనిస్తాన్రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), డార్విష్ రసూలీ, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటీ, ఏఎమ్ ఘజన్ఫర్, మహ్మద్ సలీమ్ సఫీ, బిలాల్ సమీ.చదవండి: IND vs AFG: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ𝘼 𝙘𝙖𝙥𝙩𝙖𝙞𝙣'𝙨 𝙢𝙖𝙞𝙙𝙚𝙣 𝙩𝙤𝙣!💯👏#ShubmanGill puts on a masterclass, bringing up his FIRST-EVER ODI century as captain for Team India! 🫡#INDvAFG | 2nd ODI | LIVE NOW 👉https://t.co/YiwP9pOAPC pic.twitter.com/KxFphH6k5t— Star Sports (@StarSportsIndia) June 17, 2026 -
చరిత్రకు అడుగుదూరంలో గిల్.. రోహిత్ను ఊరిస్తున్న రికార్డు!
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్లో ఇప్పటికే తొలి వన్డే గెలిచిన టీమిండియా రెండో విజయంతో పాటు సిరీస్ గెలుపుపై కూడా కన్నేసింది. ఈ నేపథ్యంలో లక్నో వేదికగా ఇవాళ రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో గిల్ తప్పిదంతో రనౌట్ అయిన సీనియర్ క్రికెటర్, ఓపెనర్ రోహిత్ శర్మను ఒక అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఆఫ్గన్తో రెండో వన్డేలో రోహిత్ శర్మ మరో 10 పరుగులు చేస్తే లిస్ట్-ఏ క్రికెట్లో 14వేల పరుగులు మైలురాయిని అందుకోనున్నాడు. ఇక కెప్టెన్గా శుబ్మన్ గిల్ కూడా ఒక అరుదైన ఫీట్కు అడుగు దూరంలో ఉన్నాడు. వన్డే కెప్టెన్గా గిల్కు ఇదే మొదటి సిరీస్. ఇప్పటికే టీమిండియా తొలి వన్డే గెలిచింది. రెండో వన్డేలోనూ గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ భారత్ వశం కానుంది. ఈ క్రమంలో స్వదేశంలో తొలి వన్డే సిరీస్ గెలిచిన కెప్టెన్గా గిల్ నిలవనున్నాడు. ఇక రెండో వన్డేకు కుల్దీప్ యాదవ్, జైస్వాల్కు చోటు దక్కే అవకాశముందని ఇప్పటికే గిల్ ప్రకటించాడు. ఇక తొలి వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గిల్ అజేయ ఇన్నింగ్స్కు తోడు కేఎల్ రాహుల్ దనాధన్ ఇన్నింగ్స్తో టీమిండియా సులువుగానే గెలిచింది. అయితే బౌలింగ్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ విజయంతో ఆ అంశం పెద్దగా ప్రభావం చూపలేదు. రెండో వన్డేలో అన్ని విభాగాల్లో రాణించి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. తొలి వన్డేకు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. రహ్మనుల్లా గుర్బాజ్ (102) సెంచరీ సాధించాడు. అనంతరం టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. గిల్ (84 నాటౌట్), కేఎల్ రాహుల్ (39 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.Read: కాన్వేకు ప్రమోషన్.. కివీస్ ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితా ఇదే! -
IND vs AFG: రెండో వన్డేలో భారత్ ఘన విజయం
భారత్ గ్రాండ్ విక్టరీలక్నో వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన రెండో వన్డేలో భారత్ 170 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. 403 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులకే ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో రెహమత్ షా(79) టాప్ స్కోరర్గా నిలవగా.. గుర్బాజ్(41), అటల్(42) పర్వాలేదన్పించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ తలా మూడు వికెట్లు సాధించారు. వీరిద్దరితో పాటు అరంగేట్ర ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించి టీమిండియా ఆలౌట్ అయింది. శుబ్మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) సెంచరీలతో కదం తొక్కారు.అఫ్గాన్ ఎనిమిదో వికెట్ డౌన్అఫ్గానిస్తాన్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన సలీమ్ సఫీ.. గుర్నూర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.అఫ్గాన్ ఏడో వికెట్అఫ్గాన్ ఏడో వికెట్ కోల్పోయింది. ఘజన్ఫర్ అర్ష్ దీప్ బౌలింగ్లో ఔటయ్యాడు.అఫ్గాన్ ఆరో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన రషీద్ ఖాన్.. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఔటయ్యాడు. అఫ్గాన్ స్కోర్: 190/6అఫ్గానిస్తాన్ ఐదో వికెట్అఫ్గానిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన ఖరోటి.. ప్రిన్స్ యాదవ్ క్లీన్ బౌల్డయ్యాడు. అఫ్గాన్ 31 ఓవర్లకు స్కోర్: 182/5అఫ్గాన్ నాలుగో వికెట్ డౌన్అఫ్గాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కెప్టెన్ షాహిది.. గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో ఔటయ్యాడు.మూడో వికెట్ డౌన్అఫ్గానిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. సెదీఖుల్లా(42).. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.20 ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 105-2సెదీఖుల్లా 28, రహ్మత్ షా 14 పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ డౌన్13.1: అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ప్రిన్స్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ఇబ్రహీం జద్రాన్ (21). రహ్మత్ షా క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 76-2(13.4).పవర్ ప్లేలో అఫ్గనిస్తాన్ స్కోరు: 62-1 (10)సెదీఖుల్లా 5, ఇబ్రహీం జద్రాన్ 15 పరుగులతో ఉన్నారు.అఫ్గానిస్తాన్ తొలి వికెట్ డౌన్52 పరుగుల వద్ద అఫ్గానిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన గుర్బాజ్.. గుర్నూర్ బౌలింగ్లో ఔటయ్యాడు.403 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ఐదు ఓవర్లలో అఫ్గానిస్తాన్ స్కోరు: 32-0రహ్మానుల్లా గుర్బాజ్ 26, ఇబ్రహీం జద్రాన్ 6 పరుగులతో ఉన్నారు.టీమిండియా భారీ స్కోరుకెప్టెన్ శుబ్మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) సెంచరీలతో కదం తొక్కగా.. రోహిత్ శర్మ 48 పరుగులతో రాణించాడు. మిగతా వారిలో శ్రేయస్ అయ్యర్ (26) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించిన టీమిండియా ఆలౌట్ అయింది.తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా48.5: రషీద్ ఖాన్ బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్ అవుట్ (19).ఎనిమిదో వికెట్ డౌన్47.6: ఘజన్ఫర్ బౌలింగ్లో రషీద్కు క్యాచ్ ఇచ్చి అర్ష్దీప్ సింగ్ (3) అవుట్. క్రీజులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్. స్కోరు: 392-8.టీమిండియా ఏడో వికెట్ డౌన్టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన గుర్నూర్ బ్రార్.. రషీద్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. స్కోరు: 387-7 (47).ఆరో వికెట్ డౌన్44.3: ఖరోటి బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ (26) ఆరో వికెట్గా వెనుదిరిగాడు. గుర్నూర్ బ్రార్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 373-6 (45).43 ఓవర్లలో టీమిండియా స్కోరు: 361-5ఐదో వికెట్ డౌన్42.3: ఖరోటి బౌలింగ్లో ఐదో వికెట్గా వెనుదిరిగిన కేఎల్ రాహుల్. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్గిల్ అవుట్42.3: ఖరోటి బౌలింగ్లో 154 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఘజన్ఫర్కు క్యాచ్ ఇచ్చి అవుటైన శుబ్మన్ గిల్. క్రీజులోకి కేఎల్ రాహుల్.40 ఓవర్లలో టీమిండియా స్కోరు: 340-3శ్రేయస్ అయ్యర్ 7, గిల్ 146 పరుగులతో ఉన్నారు.భారత్ మూడో వికెట్ డౌన్ఇషాన్ కిషన్ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్లతో 125 పరుగులు చేసిన కిషన్.. ఖరోటి బౌలింగ్లో ఔటయ్యాడు. 37 ఓవర్లలో టీమిండియా స్కోరు 322-3. శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు.ఇషాన్ మెరుపు సెంచరీలక్నో వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. కేవలం 71 బంతుల్లోనే తన రెండో వన్డే సెంచరీ మార్క్ను ఇషాన్ అందుకున్నాడు.శతక్కొట్టిన గిల్32.1: 77 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో శుబ్మన్ గిల్ సెంచరీ. 32 ఓవర్లలో టీమిండియా స్కోరు 245-2. ఇషాన్ 91 పరుగులతో ఉన్నాడు.30 ఓవర్లలో టీమిండియా స్కోరు: 220-2ఇషాన్ 70, గిల్ 96 పరుగులతో ఉన్నారు.ఇషాన్ అర్ధ శతకం27.5: హష్మతుల్లా బౌలింగ్ ఫోర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్. స్కోరు: 193-2.20 ఓవర్లలో టీమిండియా స్కోరు: 136-2గిల్ 71, ఇషాన్ కిషన్ 11 పరుగులతో ఉన్నారు.గిల్ హాఫ్ సెంచరీ16.1: ఖరోటి బౌలింగ్లో సిక్సర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.రోహిత్ శర్మ అవుట్13.1: అర్ధ శతకానికి చేరువైన ఓపెనర్ రోహిత్ శర్మ రషీద్ ఖాన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు బాది 48 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఈ మ్యాచ్సందర్భంగా రోహిత్ లిస్ట్-ఎ క్రికెట్లో 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. గిల్ 42 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 96-2(13.1)పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 80-1గిల్ 31, రోహిత్ 43 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా హాఫ్ సెంచరీ.. స్కోరు: 50-1(6.1)గిల్ 22, రోహిత్ 21 పరుగులతో ఉన్నారు.ఐదు ఓవర్లలో టీమిండియా స్కోరు: 42-1(5)గిల్ 18, రోహిత్ 18 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా1.6: సలీమ్ సఫీ బౌలింగ్లో ఖరోటికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన యశస్వి జైస్వాల్. చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులోకి వచ్చి నిరాశపరిచిన జైసూ. 9 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులే చేసి అవుట్. సలీమ్ ఖాతాలో తొలి వన్డే వికెట్గా జైసూ. గిల్ క్రీజులోకి రాగా.. రోహిత్ శర్మ 4 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 9-1 (2).ప్రిన్స్ యాదవ్ అరంగేట్రంఊహించిందే నిజమైంది. అఫ్గనిస్తాన్తో రెండో వన్డే సందర్భంగా యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం చేశాడు. తొలి వన్డేలో ఆడిన ప్రసిద్ కృష్ణను తప్పించిన యాజమాన్యం.. అతడి స్థానంలో యార్కర్ల స్పెషలిస్టు ప్రిన్స్కు తుదిజట్టులో చోటు ఇచ్చింది.ఇక ప్లేయింగ్ ఎలెవన్లో మొత్తంగా మూడు మార్పులు చేసినట్లు కెప్టెన్ శుబ్మన్ గిల్ వెల్లడించాడు. ప్రిన్స్ యాదవ్తో పాటు కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్ను ఆడిస్తున్నట్లు తెలిపాడు. కాగా తొలి వన్డేలో ఆడిన ప్రసిద్ కృష్ణతో పాటు అరంగేట్ర స్పిన్నర్ హర్ష్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డిలను ఈ మ్యాచ్ నుంచి తప్పించారు.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్అఫ్గనిస్తాన్రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), డార్విష్ రసూలీ, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటీ, ఏఎమ్ ఘజన్ఫర్, మహ్మద్ సలీమ్ సఫీ, బిలాల్ సమీ. -
IND vs AFG: రెండో వన్డే.. భారత తుదిజట్టు ఇదే
టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్తో బిజీగా ఉంది. ఇరుజట్ల మధ్య ధర్మశాలలో శనివారం తొలి వన్డే జరిగింది. వర్షం ఆటంకం కలిగించగా ఈ మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు.గుర్బాజ్ ఫాస్టెస్ట్ సెంచరీఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అఫ్గనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ విధ్వంసకర సెంచరీ (51 బంతుల్లో 102) కారణంగా ఈ మేరకు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. భారత బౌలర్లలో అరంగేట్ర కుర్రాళ్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే తలా మూడు వికెట్లు పడగొట్టారు.గిల్ అజేయ అర్ధ శతకంమిగిలిన వారిలో అర్ష్దీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు కూల్చారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 22.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ అజేయ అర్ధ శతకం (84)తో రాణించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.లక్నో వేదికగా..ఇక టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు లక్నో ఆతిథ్యం ఇస్తుండగా.. గిల్ సేన ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా భారత తుదిజట్టులో ఒక మార్పు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రసిద్ కృష్ణను తప్పించి మరో బౌలర్ను అరంగేట్రం చేయించనున్నట్లు సమాచారం.యార్కర్ల స్పెషలిస్టు అరంగేట్రంఅఫ్గన్తో తొలి వన్డేలో ప్రసిద్ ఐదు ఓవర్ల కోటా పూర్తి చేసి 35 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో అతడిపై వేటు వేసి.. పేస్ దళంలోకి యార్కర్ల స్పెషలిస్టు ప్రిన్స్ యాదవ్ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా 24 ఏళ్ల ప్రిన్స్ యాదవ్ అఫ్గన్తో సిరీస్ సందర్భంగా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.గత మ్యాచ్లో డెబ్యుడెంట్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే రాణించగా.. ఈసారి ప్రిన్స్కు కూడా వన్డే క్యాప్ ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన ప్రిన్స్ యాదవ్ ఇప్పటికి 20 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 19 వికెట్లు కూల్చాడు.అఫ్గనిస్తాన్తో రెండో వన్డేకు భారత తుదిజట్టు (అంచనా)శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.చదవండి: వైభవ్ వివాదం.. స్పందించిన బీసీసీఐ -
బాబర్ ఆజం రికార్డును బద్దలు కొట్టిన గిల్
ఆఫ్ఘనిస్తాన్తో నిన్న (జూన్ 13) జరిగిన తొలి వన్డేలో అజేయమైన 84 పరుగులు చేసి టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించిన కెప్టెన్ శుభ్మన్ గిల్.. ఈ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్తో పలు అరుదైన రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు.ఈ ఇన్నింగ్స్తో వన్డేల్లో 3000 పరుగుల మైలురాయిని చేరుకున్న అతడు.. ఈ ఘనత (కనీసం 3000 పరుగులు) సాధించిన బ్యాటర్లలో అత్యధిక సగటు కలిగిన ఆటగాళ్ల జాబితాలో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం (53.43), ఏబీ డివిలియర్స్ (53.50), మైఖేల్ బెవాన్ (53.58) లాంటి హేమాహేమీలను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరాడు. ప్రస్తుతం టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి (58.71) మాత్రమే గిల్ (57.30) కంటే ముందున్నాడు.ఈ ఇన్నింగ్స్తో గిల్ మరో భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అత్యంత వేగంగా (62 ఇన్నింగ్స్లు) 3000 పరుగులు చేసిన భారత బ్యాటర్గా అవతరించాడు. గతంలో ఈ రికార్డు శిఖర్ ధవన్ (72 ఇన్నింగ్స్లు) పేరిట ఉండేది. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (75 ఇన్నింగ్స్లు) మూడో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్గా చూస్తే, ఈ రికార్డు సౌతాఫ్రికా బ్యాటర్ హషిమ్ ఆమ్లా పేరిట ఉంది. ఆమ్లా కేవలం 57 ఇన్నింగ్స్ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. రహ్మానుల్లా గుర్బాజ్ (102) మెరుపు శతకంతో చెలరేగాడు. అతడు మినహా ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో ఎవరూ రాణించలేదు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (27), అజ్మతుల్లా ఒమర్జాయ్ (26) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే తలో 3 వికెట్లు తీయగా.. అర్షదీప్ సింగ్, నితీశ్ రెడ్డి చెరో 2 వికెట్లు పడగొట్టాడు.అనంతరం 195 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. గిల్ (84 నాటౌట్) సత్తా చాటడంతో 22.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా విజయతీరాలకు చేరింది. గిల్కు ఇషాన్ కిషన్ (34), కేఎల్ రాహుల్ (39 నాటౌట్) సహకరించగా.. రోహిత్ శర్మ (16), శ్రేయస్ అయ్యర్ (12) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే జూన్ 17న లక్నోలో జరగనుంది. -
మెరిసిన గిల్, రాహుల్ అఫ్గాన్ పై భారత్ విక్టరీ..
-
శుబ్మన్ గిల్ గెలిపించగా...
అఫ్గాన్తో ఏకైక టెస్టులో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ రికార్డు విజయం సాధించిన భారత జట్టు... వన్డే సిరీస్లోనూ అదే ఆటతీరుతో బోణీ కొట్టింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో గుర్బాజ్ సెంచరీతో అఫ్గాన్ ఓ మాదిరి స్కోరుకు పరిమితం కాగా... అరంగేట్ర బౌలర్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే చెరో మూడు వికెట్లతో సత్తా చాటారు. అనంతరం ఛేదనలో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్కు రాహుల్, ఇషాన్ మెరుపులు తోడవడంతో టీమిండియా ముందంజ వేసింది.ధర్మశాల: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత జట్టు... అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్లో శుభారంభం చేసింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన తొలి పోరులో శుబ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ నిర్ణీత సమయంకంటే నాలుగున్నర గంటలు ఆలస్యంగా ప్రారంభం కాగా... ఆటను 25 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ (51 బంతుల్లో 102; 8 ఫోర్లు, 8 సిక్స్లు) సెంచరీతో కదం తొక్కాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (27; 3 ఫోర్లు), అజ్మతుల్లా (26; 3 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. ఆడిన తొలి వన్డేలోనే గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే చెరో 3 వికెట్లు పడగొట్టగా... అర్ష్ దీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 22.5 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (66 బంతుల్లో 84 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో అలరించగా... కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు), ఇషాన్ కిషన్ (22 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించారు. రోహిత్ శర్మ (16; 2 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (12; 1 ఫోర్) భారీ స్కోరు చేయలేకపోయారు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్, జియాఉర్ రహమాన్ చెరో వికెట్ పడగొట్టారు. గుర్బాజ్ సెంచరీ... భారీ వర్షం కారణంగా మ్యాచ్ను కుదించడంతో... మొదట బ్యాటింగ్కు దిగిన అఫ్గాన్ టి20 తరహా దూకుడు కనబర్చింది. గుర్నూర్ బ్రార్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఇబ్రహీం జద్రాన్ (1) అవుట్ కాగా... అర్ష్ దీప్ సింగ్ వరుస ఓవర్లలో సాధిఖుల్లా (0), రహమత్ షా (3)ను పెవిలియన్కు పంపాడు. దీంతో అఫ్గాన్ జట్టు 26/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ హష్మతుల్లా అండతో గుర్బాజ్ రెచ్చిపోయాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిధ్యం వహించిన గుర్బాజ్... ఎడాపెడా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. బౌలర్తో సంబంధం లేకుండా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 25 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న అతడు... 48 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. వన్డేల్లో అతడికిది తొమ్మిదో శతకం. ‘టెస్టు మ్యాచ్ అనంతరం నా బ్యాటింగ్కు సంబంధించి గౌతమ్ గంభీర్ సర్తో చర్చించా. షాట్ సెలక్షన్ విషయంలో గంభీర్ సలహాలు పాటించడంతోనే సెంచరీ చేయగలిగా’ అని మ్యాచ్ అనంతరం గుర్బాజ్ అన్నాడు. నాలుగో వికెట్కు 66 బంతుల్లోనే 116 పరుగులు జోడించిన అనంతరం గుర్బాజ్ అవుట్ కాగా... ఆ తర్వాత మిగిలినవారు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో అఫ్గాన్ ఆశించిన స్కోరు చేయలేకపోయింది. హర్ష్ దూబే, గుర్నూర్ అరంగేట్రం...గత కొంతకాలంగా టీమిండియా నెట్ బౌలర్గా కొనసాగుతున్న గుర్నూర్ బ్రార్... ఈ మ్యాచ్తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.మ్యాచ్ ఆరంభానికి ముందు అతడికి జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ భారత క్యాప్ అందించాడు. దేశవాళీల్లో సత్తాచాటిన స్పిన్నర్ హర్ష్ దూబేకు సైతం ఇదే తొలి వన్డే కాగా... అతడికి కేఎల్ రాహుల్ క్యాప్ అందజేశాడు.1 టీమిండియా తరఫున వన్డే మ్యాచ్ ఆడిన అతి పెద్ద (39 సంవత్సరాల 44 రోజులు) వయసు్కడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు.మొహిందర్ అమర్నాథ్ (39 సంవత్సరాల36 రోజులు) రెండో స్థానానికి చేరాడు.స్కోరు వివరాలుఅఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (బి) నితీశ్ రెడ్డి 102; ఇబ్రహీం (సి) గిల్ (బి) గుర్నూర్ 1; సాదిఖుల్లా (ఎల్బీ) (బి) అర్ష్ దీప్ 0; రహమత్ షా (సి) హర్ష్ దూబే (బి) అర్ష్ దీప్ 3; హష్మతుల్లా (సి) రాహుల్ (బి) హర్ష్ దూబే 27; అజ్మతుల్లా (స్టంప్డ్) ఇషాన్ (బి) హర్ష్ దూబే 26; నబీ (సి) అర్ష్ దీప్ (బి) నితీశ్ రెడ్డి 9; రషీద్ (బి) గుర్నూర్ 9; ఘజన్ఫర్ (సి) గిల్ (బి) హర్ష్ దూబే 0; జియాఉర్ (సి) అర్ష్ దీప్ (బి) గుర్నూర్ 4; సలీమ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 12; మొత్తం (24.5 ఓవర్లలో ఆలౌట్) 194. వికెట్ల పతనం: 1–13, 2–16, 3–26, 4–142, 5–144, 6–172, 7–182, 8–182, 9–193, 10–194. బౌలింగ్: అర్ష్ దీప్ 5–0–27–2; గుర్నూర్ బ్రార్ 4.5–0–27–3; ప్రసిధ్ 5–0–35–0; హర్ష్ దూబే 5–0–47–3; సుందర్ 1–0–19–0; నితీశ్ రెడ్డి 4–0–31–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (రనౌట్) 16; గిల్ (నాటౌట్) 84; ఇషాన్ (బి) రషీద్ 34; శ్రేయస్ (సి) సలీమ్ (బి) జియాఉర్ 12; రాహుల్ (నాటౌట్) 39; ఎక్స్ట్రాలు 10; మొత్తం (22.5 ఓవర్లలో 3 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–46, 2–116, 3–142. బౌలింగ్: అజ్మతుల్లా 3–0–28–0; జియా ఉర్ 4–0–39–1; ఘజన్ఫర్ 5–0–28–0; సలీమ్ 3.5–0–36–0; రషీద్ ఖాన్ 5–0–37–1; నబీ 2–0–26–0. -
ఆఫ్గన్తో తొలి వన్డే.. భారత ఓపెనర్ల అరుదైన రికార్డు!
ధర్మశాల వేదికగా అఫ్గానిస్తాన్తో తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కెప్టెన్ శుబ్మన్ గిల్ వేర్వేరుగా అరుదైన రికార్డులు సాధించారు. రోహిత్ శర్మ విషయానికొస్తే మ్యాచ్లో రోహిత్ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఓపెనర్గా అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లు కలిపి 16 వేల పరుగుల మార్క్ను దాటడం విశేషం. అయితే మంచి ఈజ్తో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గిల్తో సమన్వయం లోపం వల్ల రనౌట్గా వెనుదిరిగాడు. మరోవైపు ఇదే మ్యాచ్లో ఓపెనర్ గిల్ కూడా వన్డేల్లో 3వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా 3వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్గా గిల్ నిలిచాడు. గిల్ 67 ఇన్నింగ్స్లో 3వేల పరుగుల మార్క్ను అందుకొని రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా (57 ఇన్నింగ్స్లు) తొలి స్థానంలో ఉన్నాడు. ఇక షై హోప్, ఇమామ్ ఉల్ హక్, ఫఖర్ జమాన్లు 67 ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ సాధించారు.Scaling Mt. 16,000 🗻A monumental milestone unlocked by Rohit Sharma as an opener in international cricket 👏🫡Updates ▶️ https://t.co/lCuohEZYAl #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/vyC4C0oPvg— BCCI (@BCCI) June 13, 2026 Major Milestone for our Captain 🫡Shubman Gill becomes the fastest Indian and 2⃣nd fastest player overall to amass 3⃣0⃣0⃣0⃣ ODI runs 🙌🔝He also brings up his fifty!Updates ▶️ https://t.co/lCuohEZYAl#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/tdxL7cvo7X— BCCI (@BCCI) June 13, 2026 -
గిల్, రాహుల్ విధ్వంసం.. టీమిండియా ఘన విజయం
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో ఆఫ్గన్ విధించిన 195 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత బ్యాటింగ్లో కెప్టెన్ శుబ్మన్ గిల్ (66 బంతుల్లో 84 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్తో యాంకర్ రోల్ పోషించాడు. చివర్లో కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 39 నాటౌట్) ధనాదన్ ఇన్నింగ్స్తో తనదైన శైలిలో టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఆఫ్గన్ బౌలర్లలో రషీద్ఖాన్, రెహమాన్ షరిఫీ చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది.ఆఫ్గన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. హస్మతుల్లా (26), భారత బౌలర్లలో హర్ష్దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్లు 2 వికెట్లు పడగొట్టారు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే బుధవారం లక్నో వేదికగా జరగనుంది.Picture-Perfect 🙌#TeamIndia wrap a comprehensive victory by 7️⃣ wickets in Dharamshala ✅They lead the #INDvAFG ODI series by 1️⃣-0️⃣ 👌Scorecard ▶️ https://t.co/lCuohEZYAl @IDFCFIRSTBank pic.twitter.com/RNy13a0PHX— BCCI (@BCCI) June 13, 2026 -
గిల్ స్టన్నింగ్ క్యాచ్కు నోరెళ్లబెట్టాల్సిందే!
అఫ్గానిస్తాన్తో జరిగిన తొలి వన్డేలో శుబ్మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్తో మెరిశాడు. హర్ష్ దూబే వేసిన ఇన్నింగ్స్ 22వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. హర్ష్దూబే వేసిన బంతిని అల్లా గజన్ఫర్ ఆఫ్ స్టంప్ ఔట్సైడ్ దిశగా ఆడాడు. అయితే స్లిప్లో ఉన్న గిల్ ఒక్క ఉదుటున డైవ్ చేసి సెకన్ల వ్యవధిలో ఒంటిచేత్తో క్యాచ్ అందుకోవడం విశేషం. ఇక గిల్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్కు గజన్ఫర్ నోరెళ్లబెట్టాడు.అయితే గిల్ పట్టిన క్యాచ్ను చాలా మంది టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో పోలుస్తున్నారు. ధోని తన ప్రైమ్టైమ్లో సెకన్ల వ్యవధిలోనే స్టంపింగ్లు చేసిన మ్యాచ్లు ఎన్నో ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది . ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో హర్ష్దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్లు 2 వికెట్లు పడగొట్టారు. 🔹 1st ODI | IND 🇮🇳 vs AFG 🇦🇫 🔹IND 🇮🇳 : 4️⃣0️⃣-0️⃣ (5 Overs)Rohit* : 1️⃣5️⃣¹⁴Gill* : 1️⃣7️⃣¹⁷INDIA 🇮🇳 NEED 1️⃣5️⃣5️⃣ RUNS MORE TO WIN#INDvAFG #TeamIndia #INDvsAFG #ODI #Cricketpic.twitter.com/z9dUJRGKlK https://t.co/oL8hQj02gs— Cricket Lover 🏏 (@Crick97924Lover) June 13, 2026 What. A. Catch 🤯Captain Shubman Gill with an absolute stunner of a grab 🫡Updates ▶️ https://t.co/lCuohEZYAl #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/jX2rAfSbtq— BCCI (@BCCI) June 13, 2026 -
భారత్ తరఫున అరంగేట్రం.. అతడి ఎంపిక వెనుక గిల్ హస్తం!
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న తొలి వన్డేతో టీమిండియా తరఫున గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేలు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు. హర్ష్దూబేకు కేఎల్ రాహుల్ డెబ్యూ క్యాప్ అందించగా, గుర్నూర్ బ్రార్కు కెప్టెన్ శుబ్మన్ గిల్ క్యాప్ అందించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ ఇద్దరు క్రికెటర్లపై ఒక లుక్కేద్దాం. వీరిద్దరు అరంగేట్రం చేసినప్పటికీ గుర్నూర్ ఎంపిక వెనుక మాత్రం కెప్టెన్ శుబ్మన్ గిల్ కీలకపాత్ర పోషించాడు.గిల్ మెచ్చిన క్రికెటర్..పంజాబ్కు చెందిన గుర్నూర్ బ్రార్కు సౌతాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ ఆరాధ్య క్రికెటర్. అతడి బౌలింగ్ యాక్షన్ను అచ్చుగుద్దినట్లు అనుకరించడంలో గుర్నూర్ బ్రార్ సుప్రసిద్ధుడు. అయితే గుర్నూర్ చిన్న వయసులో క్రికెట్ కంటే ఫుట్బాల్, టెన్నిస్ ఆటను ఎక్కువగా ఇష్టపడేవాడు. అయితే హైట్ అడ్వాంటేజ్ కారణంగా క్రికెట్లోకి వెళితే బాగా రాణిస్తావు అని స్నేహితులు ఇచ్చిన సలహాతో గుర్నూర్ బ్రార్ తననుత తాను పరీక్షించుకోవడానికి క్రికెట్ ట్రయల్స్కు వెళ్లాడు. ఆ తర్వాత రెండేళ్లలోనే ఇండియా అండర్-19 టీమ్కు బౌలింగ్ చేసే స్థాయికి వెళ్లాడు. అక్కడే గుర్నూర్ బ్రార్కు ప్రస్తుత టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ పరిచయమయ్యాడు. అతడి టాలెంట్ను గమనించిన గిల్ కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చాడు. అలా పంజాబ్ అండర్-23 జట్టులో చోటు దక్కించుకున్న గుర్నూర్ బ్రార్ 2021లో లిస్ట్-ఏతో పాటు ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 2023లో పంజాబ్ కింగ్స్కు నెట్బౌలర్గా వచ్చిన గుర్నూర్ బ్రార్కు అనుకోకుండా జట్టుకు ఆడే అవకాశం వచ్చింది. అప్పటి పంజాబ్ కింగ్స్ జట్టులో శిఖర్ ధావన్ గాయంతో టోర్నీకి దూరమవ్వడంతో అతడి స్థానంలో ఎంపికయిన గుర్నూర్ బ్రార్ లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్ ద్వారా ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత గిల్ మరోసారి గుర్నూర్కు అండగా నిలబడి నెట్బౌలర్గా తీసుకోవాలని గుజరాత్ టైటాన్స్కు సూచించాడు. ఈ సమయంలోనే హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, స్టార్ బౌలర్ రబాడ ఇచ్చిన సలహాలు గుర్నూర్కు చాలా ఉపయోగపడ్డాయి. అలా ఐపీఎల్ 2025 సీజన్కు ముందు జరిగిన వేలంలో గుర్నూర్ బ్రార్ను గుజరాత్ టైటాన్స్ రూ.30 లక్షలకు రిటైన్ చేసుకుంది. అయితే ఐపీఎల్ అంత మంచి ప్రదర్శన చేయనప్పటికీ విజయ్ హజారే ట్రోఫీలో సెమీస్లో అతడి ప్రదర్శన గుర్తింపు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో సెలెక్టర్ల దృష్టిలో పడిన గుర్నూర్ బ్రార్ను గతేడాది ఇండియా-ఏ జట్టుకు ఎంపిక చేయడంతో అతడి కెరీర్ మలుపు తిరిగింది.నిఖార్సైన ఆల్రౌండర్విదర్భకు చెందిన హర్ష్ దూబే నిఖార్సైన ఆల్రౌండర్, 2024-25 రంజీ సీజన్లో విదర్భ టైటిల్ గెలవడంలో హర్ష్ దూబేది కీలకపాత్ర. ఆ సీజన్లో హర్ష్దూబే మొత్తం 69 వికెట్లు పడగొట్టాడు. అతడి ప్రదర్శనకు మెచ్చిన బీసీసీఐ తర్వాతి ఏడాది ఇండియా-ఏ జట్టులోకి ఎంపిక చేసింది. రంజీ ట్రోఫీలో ప్రదర్శనకు గానూ హర్ష్దూబే బెస్ట్ ఆల్రౌండర్ (లాలా అమర్నాథ్) అవార్డు గెలుచుకున్నాడు. ఇక విజయ్ హజారే ట్రోఫీలో కెప్టెన్గా విదర్భను నడిపించిన హర్ష్దూబే ఆ జట్టుకు తొలి టైటిల్ అందించాడు. దేశవాలీ క్రికెట్లో ప్రదర్శనతో హర్ష్ దూబేను ఐపీఎల్ 2025 సీజన్కు ముందు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్తో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన హర్ష్దూబే ఆ సీజన్లో మూడు మ్యాచ్ల్లో ఐదు వికెట్లు తీశాడు. 2026 సీజన్కు ఎస్ఆర్హెచ్ అతడిని రిటైన్ చేసుకుంది.ఈ సీజన్లో 8 మ్యాచ్లాడిన హర్ష్దూబే 8 వికెట్లు తీశాడు.నిజానికి ఆఫ్గన్తో జరిగిన ఏకైక టెస్టు ద్వారానే హర్ష్దూబే అరంగేట్రం చేయాల్సింది. రవీంద్ర జడేజాకు విశ్రాంతి కల్పించడంతో మానవ్ సుతార్, హర్ష్దూబే పేర్లు వినిపించినప్పటికీ మానవ్ సుతార్ను తుదిజట్టులోకి ఎంపిక చేసింది. ఆడిన తొలి మ్యాచ్లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన మానవ్ సుతార్ అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. 𝗗𝗿𝗲𝗮𝗺 𝗰𝗼𝗺𝗲 𝘁𝗿𝘂𝗲 🧢🇮🇳Congratulations to Harsh Dubey and Gurnoor Brar on receiving their ODI debut caps from KL Rahul and Shubman Gill respectively 👏Updates ▶️ https://t.co/lCuohEZYAl #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/GoZSxHSHVf— BCCI (@BCCI) June 13, 2026చదవండి: ‘అతడు వంద టెస్టుల గురించి ఆలోచించలేదు’ -
అఫ్గన్తో వన్డే.. ఆ ఇద్దరి అరంగేట్రం.. జైసూకు నో ఛాన్స్
ఊగిసలాటల నడుమ టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య తొలి వన్డే నిర్వహణకు మార్గం సుగమమైంది. ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. ధర్మశాలలో వర్షం కారణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు పడాల్సిన టాస్ ఆలస్యమైంది. వర్షం కారణంగా దాదాపు నాలుగు గంటలపాటు ఇటు ఆటగాళ్లు.. ఇటు ప్రేక్షకులు వేచి చూడాల్సిన పరిస్థితి.అయితే, సాయంత్రం ఐదు గంటల తర్వాత వాన తగ్గడంతో మైదానంలో కప్పిన కవర్లు తీసేసిన సిబ్బంది.. మ్యాచ్కు గ్రౌండ్ను సిద్ధం చేసింది. ఈ క్రమంలో 5.15 నిమిషాలకు టాస్ పడింది. టీమిండియా కెప్టెన్ శుబ్మన్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.ఆ ఇద్దరి అరంగేట్రంఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికెట్ పాత బడే కొద్ది బ్యాటింగ్కు కాస్త అనుకూలంగా మారుతుందని భావిస్తున్నట్లు గిల్ తెలిపాడు. అదే విధంగా హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ ఈ మ్యాచ్తో టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తున్నట్లు తెలిపాడు. కాగా విరాట్ కోహ్లి స్థానంలో వన్డే జట్టులోకి వచ్చిన యశస్వి జైస్వాల్కు తుదిజట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఓపెనింగ్ జోడీగా గిల్- రోహిత్ శర్మ కొనసాతుండగా.. వన్డౌన్లో కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతున్నాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్గా ఇషాన్ కిషన్ సేవలు అందించనున్నాడు. మరోవైపు.. హార్దిక్ పాండ్యా మరోసారి గాయపడి సిరీస్కు దూరం కాగా.. ఆంధ్ర సీమ్బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చాడు. ఇక సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను పక్కనపెట్టిన యాజమాన్యం.. హర్ష్ దూబేకు తొలి అవకాశం ఇచ్చింది. పేస్ దళంలో అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణతో కలిసి గుర్నూర్ బ్రార్ బరిలోకి దిగుతున్నాడు.భారత తుదిజట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.అఫ్గనిస్తాన్ తుదిజట్టుఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదికుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, మహ్మద్ సలీమ్ సఫీ, ఏఎమ్ ఘజన్ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ. -
IND vs AFG: తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో ఆఫ్గన్ విధించిన 195 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.15 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. గిల్ (67), శ్రేయస్ (6) పరుగులతో ఆడుతున్నారు.👉ఇషాన్ కిషన్ (34) రూపంలో టీమిండియా 116 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ బాదిన గిల్అఫ్గాన్తో మ్యాచ్లో కెప్టెన్ గిల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 37 బంతుల్లో గిల్ ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది.👉10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (30), గిల్ (29) పరుగులతో ఆడుతున్నారు.రోహిత్ శర్మ రనౌట్.. తొలి వికెట్ డౌన్రోహిత్ శర్మ రనౌట్ కావడంతో టీమిండియా 46 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న టీమిండియా195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 5 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (15), శుబ్మన్ గిల్ (17) పరుగులతో ఆడుతున్నారు.ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ భారీ స్కోరు చేసింది. వర్షం అంతరాయంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది . ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో హర్ష్దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్లు 2 వికెట్లు పడగొట్టారు.ఐదో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్16.3: హర్ష్ దూబే బౌలింగ్లో హష్మతుల్లా (27) రాహుల్కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్గా వెనుదిరిగాడు. హర్ష్కు వన్డేల్లో ఇదే తొలి వికెట్. నబీ క్రీజులోకి రాగా.. అజ్మతుల్లా రెండు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 144-5(16.5).నాలుగో వికెట్ డౌన్15.3: నితీశ్ రెడ్డి బౌలింగ్లో బౌల్డ్ అయిన రహ్మానుల్లా గుర్బాజ్. 51 బంతుల్లో 102 పరుగులు చేసి నిష్క్రమణ. స్కోరు: 143-4(16). హష్మతుల్లా 27, అజ్మతుల్లా ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.శతక్కొట్టిన రహ్మానుల్లా గుర్బాజ్48 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న అఫ్గనిస్తాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 👉14 ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 130-3 సెంచరీకి చేరువైన రహ్మానుల్లా గుర్బాజ్సెంచరీ కొట్టిన అఫ్గనిస్తాన్.. స్కోరు: 110-3(12)హష్మతుల్లా 17, రహ్మానుల్లా గుర్బాజ్ 86 పరుగులతో ఉన్నారు.రహ్మానుల్లాగుర్బాజ్ హాఫ్ సెంచరీ👉10 ఓవర్లు ముగిసేసరికి అఫ్గానిస్తాన్ 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. రహమనుల్లా గుర్బాజ్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 25 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకుని.. అఫ్గన్ తరఫున రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు.ఆరు ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 35-3 (6)రహ్మానుల్లా 25 పరుగులతో ఉండగా.. హష్మతుల్లా 8 పరుగులతో క్రీజులో ఉన్నాడు.మూడో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్4.3: అర్ష్దీప్ బౌలింగ్లో హర్ష్ దూబేకు క్యాచ్ ఇచ్చి అవుటైన రహ్మత్ షా (3). క్రీజులోకి హష్మతుల్లా షాహిది. రహ్మానుల్లా 20 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 26-3(4.4).రెండో వికెట్ డౌన్2.3: అర్ష్దీప్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయిన సెదీకుల్లా (0). అంపైర్ అవుట్ ఇవ్వగా.. అఫ్గన్ రివ్యూకు వెళ్లింది. అయితే, ఎల్బీడబ్ల్యూగా తేలడంతో సెదీకుల్లా మైదానం వీడాడు. రహ్మత్ షా క్రీజులోకి రాగా.. రహ్మానుల్లా 14 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 17-2(2.4)తొలి వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో గిల్కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా వెనుదిరిగిన ఇబ్రహీం జద్రాన్ (1). స్కోరు: 13-1(1.5). క్రీజులోకి సెదీకుల్లా రాగా.. రహ్మానుల్లా 11 పరుగులతో ఉన్నాడు.👉టాస్ గెలిచిన టీమిండియా.. తొలుత బౌలింగ్👉టీమిండియా తరఫున హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ అరంగేట్రంతుదిజట్లుభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.అఫ్గనిస్తాన్ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదికుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, మహ్మద్ సలీమ్ సఫీ, ఏఎమ్ ఘజన్ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ.శుభవార్తవర్షం తగ్గుముఖం పట్టింది. సూర్యుడు మేఘాల మాటు నుంచి బయటకు వచ్చాడు. గ్రౌండ్ సిబ్బంది కవర్లు తీసేసి మాప్ చేస్తున్నారు. 5.45 నిమిషాలకు మ్యాచ్ మొదలుకానుంది. ఈ వన్డే మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. బ్యాటింగ్ పవర్ప్లే ఐదు ఓవర్లు ఉంటుంది. ఐదుగురు బౌలర్లు తలా ఐదు ఓవర్లు బౌల్ చేస్తారు. 👉4.45PM: తగ్గుముఖం పట్టిన వాన.. మైదానంలోకి వచ్చిన గ్రౌండ్ సిబ్బంది.👉కొనసాగుతున్న చిరుజల్లులు👉మరోసారి భారీగా కురుస్తున్న వర్షం. 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహణకు కటాఫ్ టైమ్ సాయంత్రం 6.32 గంటలు.మ్యాచ్ జరిగేనా?👉తగ్గుముఖం పట్టిన వానవరుణుడు కరుణిస్తాడా?👉కొనసాగుతున్న జల్లులు👉మైదానంలోకి వచ్చి పరిశీలించిన హెడ్ క్యూరేటర్.. వాన తెరిపినిస్తేనే కవర్లు ఎత్తివేసే అవకాశంవాన మొదలు👉🌧️ధర్మశాలలో మొదలైన వాన👉రన్-అప్ ఏరియాపై కవర్లు కప్పిన సిబ్బందిటాస్ ఆలస్యంక్రికెట్ అభిమానులకు చేదు వార్త. టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య తొలి వన్డేకు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ధర్మశాలలో వాతావరణం మేఘావృతం కావడంతో టాస్ ఆలస్యం కానుంది. తాజా సమాచారం ప్రకారం.. ధర్మశాలలో వాన పడేందుకు 60- 70 శాతం అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తుదిజట్ల అంచనాభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్/యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్/ప్రిన్స్ యాదవ్.అఫ్గనిస్తాన్రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, సెదీకుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇక్రమ్ అలికిల్ (వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఏఎమ్ ఘజన్ఫర్, బిలామ్ సమీ/మహ్మద్ సలీం. -
టెస్ట్ల్లో సరికొత్త 'నంబర్ వన్'
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సరికొత్త నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్గా అవతరించాడు. సహచరుడు జో రూట్ను వెనక్కు నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. తాజాగా లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్లో అర్ద సెంచరీ సాధించి నంబర్ వన్ స్థానానికి చేరాడు. ఇదే మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో ఘోరంగా విఫలమైన రూట్ రెండు స్థానాలు దిగజారి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ మధ్యలో ఆసీస్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ ఓ స్థానం మెరుగుపర్చుకొని రెండో స్థానానికి ఎగబాకాడు.తాజాగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్లో సూపర్ సెంచరీతో సత్తా చాటిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరాడు. 743 రేటింగ్ పాయింట్లు కలిగిన గిల్.. ప్రస్తుతం భారత్ తరఫున అత్యధిక రేటింగ్ కలిగిన బ్యాటర్గా నిలిచాడు.ఇదే మ్యాచ్లో సెంచరీ చేసిన మరో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ ర్యాంక్లో (34) ఎలాంటి మార్పు లేదు. గిల్తో పాటు టాప్-10లో ఉన్న మరో టీమిండియా బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓ స్థానంలో కోల్పోయి తొమ్మిదో స్థానానికి చేరాడు. ఓవరాల్గా తాజా ర్యాంకింగ్స్లో అత్యధిక లబ్ది పొందిన బ్యాటర్గా గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. ఫిలిప్స్ తాజాగా ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్లో ఓ మోస్తరు ప్రదర్శన చేసినప్పటికీ.. 15 స్థానాలు మెరుగుపర్చుకొని 40వ స్థానానికి ఎగబాకాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. న్యూజిలాండ్ టెస్ట్లో కళ్లు చెదిరే ప్రదర్శన ఇచ్చిన ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ 7 స్థానాలు మెరుగుపర్చుకొని పదో స్థానానికి ఎగబాకాడు. ఆఫ్ఘన్ టెస్ట్లో సంచలన ప్రదర్శన ఇచ్చిన టీమిండియా అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్ తొలిసారి టాప్-100లోకి ప్రవేశించాడు. ఆ మ్యాచ్లో 7 వికెట్లు తీసిన సుతార్ 272 రేటింగ్ పాయింట్లు సాధించి 72వ స్థానంలో నిలిచాడు.మిగతా భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఓ స్థానం మెరుగుపర్చుకొని 14వ స్థానానికి చేరగా.. సిరాజ్ ఓ స్థానం కోల్పోయి 15వ స్థానానికి పడిపోయాడు. ఆల్రౌండర్ల విషయానికొస్తే.. టీమిండియా వెటరన్ ఆటగాడు రవీంద్ర జడేజా టాప్ ప్లేస్ను నిలుపుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 2 స్థానాలు మెరుగుపర్చుకొని తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. -
IND vs AFG: తొలి వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
అఫ్గనిస్తాన్తో సిరీస్ను ఘనంగా ఆరంభించింది టీమిండియా. ముల్లన్పూర్ వేదికగా ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ మీద 300 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అయితే, ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో ఈ మ్యాచ్ భాగం కాదు.కాబట్టి అఫ్గన్తో టెస్టు, విజయంతో టీమిండియాకు పెద్దగా చేకూరే ప్రయోజనం ఏమీ లేదు. అయితే, కావాల్సినంత ప్రాక్టీస్ మాత్రం దొరికింది. మానవ్ సుతార్ (లెఫ్టార్మ్ స్పిన్నర్) వంటి కొత్త ఆటగాడు తనను తాను నిరూపించుకునే ఓ వేదిక దొరికింది.మూడు వన్డేలుఇదిలా ఉంటే.. జూన్ 13, 17, 20 తేదీల్లో టీమిండియా అఫ్గనిస్తాన్తో మూడు వన్డేలు ఆడనుంది. అయితే, గాయం వల్ల విరాట్ కోహ్లి అనూహ్య రీతిలో ఈ సిరీస్కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో యశస్వి జైస్వాల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు.మరోవైపు.. ఇషాన్ కిషన్ సైతం చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక గాయాల నుంచి కోలుకుని ఓపెనర్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సాధించారు. దీంతో అఫ్గన్తో తొలి వన్డేకు భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ మొదలైంది.ఇషాన్ వద్దు.. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్కు బదులు యశస్వి జైస్వాల్కు పెద్ద పీట వేయాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. ఓపెనర్గా కాకుండా మూడో స్థానంలోనూ జైసూ రాణించగలడని అభిప్రాయపడ్డాడు.స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘అఫ్గన్తో వన్డేలో కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తాడు. యశస్వి జైస్వాల్ను వన్డౌన్లో ఆడించాలి. శ్రేయస్ అయ్యర్ నాలుగు, కేఎల్ రాహుల్ ఐదు, హార్దిక్ పాండ్యా ఆరు, వాషింగ్టన్ సుందర్ ఏడు, హర్ష్ దూబే ఎనిమిదో స్థానంలో ఆడాలి.పేస్ దళంలో అర్ష్దీప్ సింగ్తో పాటు గుర్నూర్ బ్రార్ను ఆడించాలి. స్పెషలిస్టు స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఉండనే ఉన్నాడు’’ అని అభిషేక్ నాయర్ పేర్కొన్నాడు. తాను ఎంపిక చేసిన తుదిజట్టులో ఇషాన్ కిషన్కు చోటు ఇవ్వలేదు.జైసూను ఆడిస్తారా?ఐపీఎల్-2026 సందర్భంగా బరిలో దిగిన యశస్వి జైస్వాల్ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా.. 16 మ్యాచ్లు ఆడి 427 పరుగులు సాధించాడు. మరోవైపు.. సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించిన ఇషాన్ కిషన్ 602 పరుగులతో దుమ్ములేపాడు.అంతేకాదు సీజన్ ఆరంభంలో ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో సన్రైజర్స్ కెప్టెన్గా వ్యవహరించి జట్టును గెలిపించాడు ఇషాన్. అంతకుముందు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలోనూ సత్తా చాటాడు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఇషాన్ను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉండగా.. అభిషేక్ నాయర్ మాత్రం జైసూకు ఓటేయడం విశేషం.అఫ్గనిస్తాన్తో తొలి వన్డేకు అభిషేక్ నాయర్ ఎంచుకున్న జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్.చదవండి: సిరాజ్ను తప్పించిన బీసీసీఐ -
‘కొడితే సెంచరీ.. లేదంటే వస్తాడు.. అవుటై వెళ్లిపోతాడు’
స్వదేశంలో టీమిండియా అదరగొట్టింది. అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ మీద 300 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయం సాధించింది. ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (126), ఓపెనర్ కేఎల్ రాహుల్ (100) శతక్కొట్టిన సంగతి తెలిసిందే. మిగిలిన వారిలో వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (81), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (81) అర్ద శతకాలతో మెరిశారు. కాగా ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) గతేడాది కాలంగా టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. గతేడాది ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 800కు పైగా పరుగులు సాధించాడు. ఇక అఫ్గన్తో మ్యాచ్ సందర్భంగా 165 బంతుల్లో 100 రన్స్ చేసిన రాహుల్.. టెస్టు కెరీర్లో 12వ సెంచరీ నమోదు చేశాడు.అశ్విన్ సంచలన వ్యాఖ్యలుమొత్తంగా ఇప్పటికి టీమిండియా తరఫున 68 టెస్టులు ఆడిన రాహుల్ 4153 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సగటు 36.43. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కేఎల్ రాహుల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫామ్లో లేకుంటే ఈ కర్ణాటక బ్యాటర్ నుంచి ఒక్క పరుగు కూడా ఆశించలేమన్నాడు.పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా లేకుంటే..తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ... ‘‘విదేశాల్లో కఠినమైన పిచ్ల మీద ఆడటం వల్ల అతడి బ్యాటింగ్ సగటు తక్కువగా ఉందని చాలా మంది కేఎల్ రాహుల్ను వెనకేసుకువస్తారు. కానీ అతడిలో నేను ఒక విషయం స్పష్టంగా గమనించాను.పిచ్ గనుక బ్యాటింగ్కు అనుకూలంగా లేకుంటే.. అతడు ఒక్క పరుగు కూడా చేయడు. ఇలా బ్యాటింగ్కు వెళ్తాడు. అలా అవుటై పెవిలియన్కు చేరతాడు. ఒకవేళ అదే స్థానంలో విరాట్ కోహ్లి ఉంటే.. అప్పుడతడు ఫామ్లో లేకపోయినా కనీసం 30, 33, 43.. లేదంటే 28 పరుగులైనా చేస్తాడు.కొడితే సెంచరీ.. లేదంటేకానీ కేఎల్ రాహుల్ మాత్రం 0- 10 మధ్య కూడా పరుగులు రాబట్టలేడు. ఫామ్లో ఉన్నాడంటే సెంచరీ అయినా చేస్తాడు. అది వేరే సంగతి. ఒకవేళ ఫామ్లో లేడంటే మాత్రం మనం అతడి నుంచి పరుగులు ఆశించకూడదు.కొడితే సెంచరీ.. లేదంటే ఇలా వెళ్లి అలా వచ్చేయడం.. కేఎల్ రాహుల్లో నేను ఈ రెండు మాత్రమే చూశాను. అతడు మధ్యస్థంగా ఆడటం ఎప్పుడూ చూడలేదు. అయితే, గత రెండేళ్లుగా అతడి ఆట తీరులో పరిణతి కనిపిస్తోంది. పరిస్థితులను అర్థం చేసుకుని మెరుగ్గా ఆడుతున్నాడు’’ అని అశ్విన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇప్పటికి 119 టెస్టు ఇన్నింగ్స్ ఆడిన 34 ఏళ్ల కేఎల్ రాహుల్ ఖాతాలో తొమ్మిది డకౌట్లు, 31 సింగిల్ డిజిట్ స్కోర్లు ఉండటం గమనార్హం.చదవండి: పాకిస్తాన్ కంటే ప్రమాదకరమా? అని అడిగాను -
చరిత్ర సృష్టించిన టీమిండియా
తమ 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత జట్టు అతి భారీ విజయం సాధించింది. ముల్లాన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్లో ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో గెలవడంతో ఈ ఘనత సాధించింది. ఇన్నింగ్స్ తేడా పరంగా భారత్కు ఇదే అతి పెద్ద విజయం. 1932లో తొలి టెస్ట్ ఆడిన భారత్.. ఇప్పటివరకు ఇన్నింగ్స్ పరంగా ఇంత భారీ విజయం సాధించలేదు.2018లో రాజ్కోట్ వేదికగా వెస్టిండీస్పై సాధించిన ఇన్నింగ్స్ 272 పరుగుల విజయం ఈ మ్యాచ్కు ముందువరకు వరకు భారత జట్టు అతి పెద్ద విజయంగా ఉండింది. ఇన్నింగ్స్ తేడా పరంగా భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో టాప్-5 అతి పెద్ద విజయాలు ఇలా ఉన్నాయి.ఆఫ్ఘనిస్తాన్పై, ముల్లాన్పూర్ (2026) – ఇన్నింగ్స్ & 300 పరుగులువెస్టిండీస్పై, రాజ్కోట్ (2018) – ఇన్నింగ్స్ & 272 పరుగులుఆఫ్ఘనిస్తాన్పై, బెంగళూరు (2018) – ఇన్నింగ్స్ & 262 పరుగులుబంగ్లాదేశ్పై, మీర్పూర్ (2007) – ఇన్నింగ్స్ & 239 పరుగులుశ్రీలంకపై, నాగ్పూర్ (2017) – ఇన్నింగ్స్ & 239 పరుగులుభారత గడ్డపై ఇన్నింగ్స్ తేడాతో నమోదైన అతిపెద్ద విజయాల్లో ఇది రెండో స్థానంలో నిలిచింది. 1958లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్పై వెస్టిండీస్ సాధించిన ఇన్నింగ్స్ మరియు 336 పరుగుల విజయం ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది.ఆసియా జట్ల పరంగా చూస్తే, 2002లో లాహోర్లో పాక్ న్యూజిలాండ్పై సాధించిన ఇన్నింగ్స్ మరియు 324 పరుగుల విజయం తర్వాత, భారత్ తాజా విజయం రెండో అతిపెద్ద ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం.కాగా, ముల్లాన్పూర్ టెస్ట్లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చలాయించి, ఏకపక్ష విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్లో కేఎల్ రాహుల్ (100), కెప్టెన్ శుభ్మన్ గిల్ (126) సెంచరీలతో.. సాయి సుదర్శన్ (81), రిషబ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) అర్ద సెంచరీలతో చెలరేగడంతో భారత్ 564-8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.అనంతరం భారత బౌలర్లు, ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగి ఆఫ్ఘనిస్తాన్ను రెండు ఇన్నింగ్స్ల్లో (152, 112) అతి స్వల్ప స్కోర్లకే కుప్పకూల్చారు. ఫలితంగా ఆ జట్టు ఘోర ఇన్నింగ్స్ పరాభవాన్ని మూటగట్టుకుంది.అరంగేట్రం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ (తొలి ఇన్నింగ్స్లో 6, రెండో ఇన్నింగ్స్లో 1), వాషింగ్టన్ సుందర్ (1, 4) ఆఫ్ఘన్ల భరతం పట్టారు. వీరికి కుల్దీప్ (3), ప్రసిద్ద్ కృష్ణ (3) జత కలిశారు. తొలి టెస్ట్లోనే 7 వికెట్ల ప్రదర్శనతో మెరిసిన మానవ్ సుతార్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
టీమిండియాకు షాక్.. ఆఫ్గన్పై గెలిచినా దండగే!
అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముల్లన్పూర్ వేదికగా జరిగిన టెస్టును టీమిండియా మూడు రోజుల్లోనే ముగించింది. ఒక ఇన్నింగ్స్ మాత్రమే ఆడిన టీమిండియా భారీ స్కోరు చేయడమే గాక అఫ్గానిస్తాన్ను రెండుసార్లు ఆలౌట్ చేసింది. అయితే ఆఫ్గన్పై భారీ విజయం సాధించినప్పటికీ వరల్డ్ టెస్టు చాంపియన్షిఫ్ (డబ్ల్యూటీసీ) పట్టికలో భారత్ స్థానం మాత్రం మారకపోవచ్చు. ప్రస్తుతం గిల్ సేన 48.15 పర్సంటేజ్ పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతుంది. మరి ఆఫ్గన్పై టెస్టు విజయం సాధించినా డబ్ల్యూటీసీ పట్టికలో టీమిండియా స్థానం మారకపోవడానికి కారణమేంటనేది తెలుసుకుందాం. అఫ్గానిస్తాన్తో టెస్టు మ్యాచ్ డబ్ల్యూటీసీ చాంపియన్షిప్ సైకిల్లో లేదు. అందుకే ఈ మ్యాచ్లో భారీ విజయం సాధించినా ఎలాంటి పాయింట్లు రావు. అందుకే డబ్ల్యూటీసీ పట్టికలో టీమిండియా స్థానం మారదు. 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్లో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 9 టెస్టుల్లో నాలుగింట గెలిచింది. భారత్ తన డబ్ల్యూటీసీ సైకిల్ను ఇంగ్లండ్ టూర్తో మొదలుపెట్టింది. ఇంగ్లండ్తో సిరీస్ను డ్రా చేసుకున్న టీమిండియా సౌతాఫ్రికా చేతిలో మాత్రం క్లీన్స్వీప్కు గురైంది.అయితే వెస్టిండీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసిన టీమిండియా డబ్ల్యూటీసీ పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (8 టెస్టుల్లో 7 విజయాలు) 87.50 పర్సంటైల్తో తొలి స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా (75 పర్సంటైల్తో) రెండో స్థానంలో, శ్రీలంక (66.67 పర్సంటైల్తో) మూడో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ (58.33), బంగ్లాదేశ్ (58.33) పర్సంటైల్తో వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇంగ్లండ్ (37.88) ఏడో స్థానంలో ఉండగా.. పాకిస్తాన్ (8.33), వెస్టిండీస్ (4.13) పర్సంటైల్ పాయింట్లతో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి.Leaving New Chandigarh with a massive win under the belt 🇮🇳A complete team performance from #TeamIndia 🤍Scorecard ▶️ https://t.co/Au50EfVM30#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/MxUFJHvoq4— BCCI (@BCCI) June 8, 2026చదవండి: ‘నన్ను రిటైర్ అవ్వమంటున్నారా?’.. భారత కెప్టెన్ అసహనం! -
చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. తొలి భారత కెప్టెన్గా
ముల్లాన్పూర్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ను 564/8 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన భారత్.. అనంతరం బౌలింగ్లో పర్యాటక జట్టుకు చుక్కలు చూపిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ 39.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. అఫ్గాన్ ఇంకా 451 పరుగుల భారీ వెనుకంజలో ఉంది.అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో అదరగొట్టిన గిల్.. అదే జోరును అఫ్గాన్ మ్యాచ్లో కూడా కొనసాగించాడు. 177 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్తో 126 పరుగులు చేశాడు.ఈ ఇన్నింగ్స్తో కెప్టెన్గా 1000 పరుగుల మైలురాయిని కూడా గిల్ అధిగమించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన 101వ కెప్టెన్గా శుబ్మన్ నిలిచాడు. అయితే ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో గిల్ అత్యుత్తమ సగటు కలిగిన రెండో కెప్టెన్గా రికార్డులకెక్కాడు. ఈ మైలురాయిని అతడు ఏకంగా 82.76 సగటుతో అందుకోవడం విశేషం. ఆస్ట్రేలియా దిగ్గజం సర్ డాన్ బ్రాడ్మన్(101.51) మాత్రమే గిల్ కంటే మెరుగైన సగటును కలిగి ఉన్నాడు. ఈ జాబితాలో శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కర 69.6 సగటుతో మూడో స్థానంలో ఉన్నాడు. భారత క్రికెట్ నుంచి మాత్రం గిల్ కంటే ముందు ఏ కెప్టెన్ కూడా ఈ ఫీట్ సాధించలేదు.అదేవిధంగా కెప్టెన్గా అత్యంత వేగంగా 1000 టెస్ట్ పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాళ్లలో గిల్ రెండో స్థానానికి చేరుకున్నాడు. గిల్ కేవలం 15 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు. తొలి స్ధానంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(14 ఇన్నింగ్స్లు) ఉన్నారు. -
తప్పు మీద తప్పు.. ఆఫ్గన్ కొంపముంచిన కెప్టెన్!
టీమిండియాతో జరుగుతున్న ఏకైక టెస్టులో అఫ్గానిస్తాన్ తప్పు మీద తప్పులు చేస్తోంది. తొలిరోజు కేఎల్ రాహుల్ ఔట్ విషయంలో రివ్యూలు తీసుకోవడంలో తడబడ్డ అఫ్గానిస్తాన్ రెండో రోజు ఆటలోనూ అదే తప్పును పునరావృతం చేసింది. ఫలితంగా టీమిండియా భారీ స్కోరు చేయడమే గాక మ్యాచ్పై పట్టు సాధించేలా చేసింది. తొలిరోజు ఆటలో కేఎల్ రాహుల్ 16 పరుగుల వద్ద ఉన్నప్పుడు అజ్మతుల్లా ఒమర్జయ్ వేసిన బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో రాహుల్ మిస్ అయ్యాడు. దీంతో బంతి అతడి బ్యాట్ను ముద్దాడుతూ కీపర్ చేతుల్లో పడింది. కీపర్ అఫ్సర్ జజయ్ ఔట్ అప్పీల్ చేసినప్పటికీ, అంపైర్ ఔటివ్వలేదు. అయితే కెప్టెన్ హస్మతుల్లా షాహిది కీపర్ను అడిగినప్పటికీ అతడు క్లారిటీతో లేకపోవడం వల్ల రివ్యూ వెళ్లలేదు.ఆ తర్వాత రిప్లేలో రాహుల్ బ్యాట్కు బంతి తాకినట్లు స్పైక్ రావడం కనిపించింది. దీంతో 16 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ రాహుల్ ఆ తర్వాత శతకం బాదాడు. తొలిరోజు చేసిన తప్పు నుంచి పాఠాలు నేర్వని అఫ్గానిస్తాన్ రెండోరోజు ఆటలోనూ అదే తప్పిదం చేసింది. ఈసారి గిల్ విషయంలో రివ్యూకు తీసుకోవడంలో విఫలమైంది. ఇన్నింగ్స్ 89వ ఓవర్లో ఒమర్జయ్ వేసిన బంతి గిల్ ప్యాడ్లను తాకింది. అయితే ఆఫ్గన్ ఆటగాళ్లు అప్పీల్ చేసినప్పటికీ ఫీల్డ్ అంపైర్ ఔటివ్వలేదు. అయితే ఒమర్జయ్ రివ్యూ వెళ్లాలని కెప్టెన్ షాహిదిని కోరినప్పటికీ, అతడు బంతి ఇన్సైడ్ ఎడ్జ్ అవుతుందేమోనని భావించి రివ్యూ కోరలేదు. కానీ రిప్లేలో బ్యాట్కు బంతి ఎక్కడా తగలకుండా లెగ్ స్టంప్ను ఎగరేస్తున్నట్లు కనిపించింది. ఒకవేళ రివ్యూకు వెళ్లి ఉంటే గిల్ 109 పరుగుల వద్దే వెనుదిరిగేవాడు. ఈ రెండు తప్పుల తర్వాత కూడా ఆఫ్గన్ తమ లెక్కను సరిచేసుకోలేకపోయింది. ఆ మరుసటి బంతికే రిషబ్ పంత్ కూడా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఒమర్జయ్ వేసిన బంతిని పంత్ షాడ్ ఆడే ప్రయత్నంలో మిస్ చేశాడు. దీంతో బంతి కీపర్ అఫ్సర్ చేతిలో పడింది. అప్పీల్ చేసినప్పటికీ అంపైర్ ఔటివ్వలేదు.సెకండ్ స్లిప్లో ఉన్న రహమనుల్లా గుర్బాజ్ మాత్రం బంతి పంత్ బ్యాట్కు తగిలిందని, రివ్యూ వెళ్లాలని కెప్టెన్ షాహిదికి కాన్ఫిడెంట్గా చెప్పాడు. కానీ షాహిది మాత్రం రివ్యూకు వెళ్లడానికి ఇష్టపడలేదు. కానీ రిప్లేలో బంతి బ్యాట్ ఎడ్జ్ అయినట్లు స్పైక్ రావడంతో కెప్టెన్ ఆశ్చర్యపోయాడు. అలా 54 పరుగుల వద్ద ఔట్ ప్రమాదం నుంచి బయటపడిన పంత్ తన స్కోరుకు మరో 27 పరుగుల జత చేసుకున్నాడు. ఇలా మూడుసార్లు కీలక ఆటగాళ్లను ఔట్ చేసే విషయంలో ఆఫ్గన్ కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ రివ్యూ తీసుకోవడంలో విఫలమై ఆఫ్గన్ కొంపముంచాడు. అతడి తప్పుల వల్ల టీమిండియా 550 పరుగుల మార్క్ను అందుకోగలిగింది. ఒకవేళ సరైన సమయంలో రివ్యూలు తీసుకొని ఉంటే టీమిండియా ఆట నాలుగు వందల్లోపే ముగిసి ఉండేది. మ్యాచ్ విషయానికొస్తే భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ పూర్తవ్వగానే గిల్ డిక్లేర్కు పిలుపునిచ్చాడు. కేఎల్ రాహుల్, గిల్ సెంచరీలు చేయగా.. పంత్, సాయి సుదర్శన్, సుందర్లు అర్థసెంచరీలతో మెరిశారు. ఆఫ్గన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ సఫీ 6 వికెట్లతో మెరవగా, జియావుర్ రెహమాన్, హస్మతుల్లా చెరొక వికెట్ తీశారు.చదవండి: ఆత్రుత ఎందుకు పంత్.. ఓపిక వహించాల్సింది! -
కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్.. భువీ, షమీకి చోటు!
భారత టీ20 జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్ను తప్పించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. ఆ స్ధానంలో శ్రేయస్ అయ్యర్ను నూతన సారధిగా నియమించింది. సూర్యను కెప్టెన్గానే కాకుండా పూర్తిగా జట్టు నుంచే పక్కన పెట్టారు. అదేవిధంగా ఇటీవల పొట్టి ప్రపంచకప్ గెలిచిన జట్టులో భాగమైన హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్లను కూడా టీ20 జట్టు నుంచి తప్పించారు. ఐపీఎల్-2026లో దుమ్ములేపిన వెటరన్ భువనేశ్వర్ కుమార్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, రజత్ పాటిదార్లను కూడా సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్కు ఎంపిక కాని భారత స్టార్ ఆటగాళ్లతో కూడా ప్రత్యామ్నాయ జట్టును ఎక్స్లో షేర్ చేశారు. ఈ జట్టు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్కు అవకాశమిచ్చారు. అదేవిధంగా గిల్,రాహుల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ వంటి సీనియర్ ప్లేయర్లు కూడా ఉన్నాడు.అన్సెలక్టెడ్ ఆటగాళ్లతో కూడిన భారత టీ20 జట్టుశుబ్మన్ గిల్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ -
ముగిసిన రెండో రోజు ఆట.. భారత్దే ఆధిపత్యం
India vs Afghanistan test Day 2 updates and Highlights: ముల్లాన్పూర్ వేదికగా భారత్-అఫ్గానిస్తాన్ మధ్య రెండో రోజు ఆట ప్రారంభమైంది.రెండో రోజూ భారత్దేముల్లాన్పూర్ టెస్టులో అఫ్గాన్పై భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అఫ్గానిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. పర్యాటక జట్టు భారత్ కంటే తొలి ఇన్నింగ్స్లో ఇంకా 451 పరుగులు వెనకబడి ఉంది. క్రీజులో రెహమత్ షా(43) ఉన్నాడు.కాగా భారత అరంగేట్ర ఆటగాడు మానవ్ సుతార్ బౌలింగ్, బ్యాటింగ్తో అదరగొట్టాడు. బ్యాటింగ్లో 28 పరుగులు చేసిన సుతార్, బౌలింగ్లో 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు ప్రసిద్ద్ కృష్ణ రెండు వికెట్లు సాధించారు. తొలి ఇన్నింగ్స్ను భారత్ 564/8 వద్ద డిక్లేర్ చేసింది.భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్(100), శుభ్మన్ గిల్(126) సెంచరీలతో చెలరేగగా.. రిషబ్ పంత్(81), సాయిసుదర్శన్(81), వాషింగ్టన్ సుందర్(52 నాటౌట్) అర్ధ శతకాలతో సత్తాచాటారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ 6 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు జియూర్, షాహిది తలా వికెట్ సాధించారు.అఫ్గాన్ నాలుగో వికెట్ డౌన్హాస్మతుల్లా షాహిదీ(20) రూపంలో అఫ్గానిస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో వికెట్లు ముందు షాహిదీ దొరికిపోయాడు.అఫ్గాన్ మూడో వికెట్ డౌన్గుర్భాజ్ రూపంలో అఫ్గానిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన గుర్బాజ్.. సుతార్ బౌలింగ్లో ఔటయ్యాడు.రెండో వికెట్ డౌన్అఫ్గానిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన అటల్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు అఫ్గాన్ స్కోర్: 49/2తొలి వికెట్ కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్28 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. మానవ్ సుతార్ బౌలింగ్లో మొహమ్మద్ సిరాజ్ క్యాచ్ పట్టడంతో అబ్దుల్ మాలిక్ (16) ఔటయ్యాడు. మానవ్ సుతార్కు టెస్ట్ల్లో ఇది తొలి వికెట్. ఈ వికెట్ను అతడు తన తొలి ఓవర్లోనే తీయడం విశేషం. మాలిక్ ఔటయ్యాక అంపైర్లు టీ బ్రేక్కు పిలుపిచ్చారు.భారత్ భారీ స్కోర్అప్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్లో తమ తొలి ఇన్నింగ్స్ను భారత్ 564/8 వద్ద డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్(100), శుభ్మన్ గిల్(126) సెంచరీలతో చెలరేగగా.. రిషబ్ పంత్(81), సాయిసుదర్శన్(81), వాషింగ్టన్ సుందర్(52 నాటౌట్) అర్ధ శతకాలతో సత్తాచాటారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ 6 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు జియూర్, షాహిది తలా వికెట్ సాధించారు.సిరాజ్ అవుట్టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 12 బంతుల్లో 22 పరుగులు చేసిన సిరాజ్.. సలీమ్ బౌలింగ్లో ఔటయ్యాడు. భారత్ స్కోర్: 543/8భారీ స్కోర్ దిశగా భారత్రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్(14), మానవ్ సుతార్(9) ఉన్నారు. రెండో రోజు ఆటలో భారత్.. గిల్(100), రిషబ్ పంత్(81), జురెల్(19) వికెట్లు కోల్పోయింది.పంత్ అవుట్రిషబ్ పంత్(81) రూపంలో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. షాహిది బౌలింగ్లో ఔటయ్యాడు.ధ్రువ్ జురెల్ అవుట్19 పరుగులు చేసిన ధ్రువ్ జురెల్.. సలీమ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు . 102 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్: 456-5భారత్ నాలుగో వికెట్ డౌన్416 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 126 రన్స్ చేసిన గిల్..సలీమ్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో ధ్రువ్ జురెల్ వచ్చాడు.రెండో రోజు ఆట ఆరంభంముల్లాన్పూర్ వేదికగా భారత్-అఫ్గానిస్తాన్ మధ్య రెండో రోజు ఆట ప్రారంభమైంది. క్రీజులో రిషబ్ పంత్(50), శుబ్మన్ గిల్(106) ఉన్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 371 పరుగులు చేసింది. మొదటి రోజు ఆటలో కేఎల్ రాహుల్ శతక్కొట్టగా.. సాయిసుదర్శన్(81) హాఫ్ సెంచరీతో రాణించారు. అఫ్దాన్ బౌలర్లలో సలీమ్ రెండు వికెట్లు పడగొట్టగా.. జియావుర్ రెహమాన్ ఓ వికెట్ సాధించాడు.తుది జట్లుఆఫ్ఘనిస్తాన్ : సెడిఖుల్లా అటల్, రహ్మానుల్లా గుర్బాజ్, అబ్దుల్ మాలిక్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అఫ్సర్ జజాయ్(వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేలియా ఖరోటే, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేయాలియా ఖరోటే, జియావుర్ రెహమాన్ షరీఫీ, మహ్మద్ సలీమ్ సఫీభారత్ : కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ -
గిల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్
ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (జూన్ 6) ప్రారంభమైన ఏకైక టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ పరుగుల వరద పారిస్తుంది. ఈ ఇన్నింగ్స్లో ఇప్పటికే ఓపెనర్ కేఎల్ రాహుల్ (100) శతక్కొట్టగా.. తాజాగా కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. గిల్ 138 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్ సాయంతో మూండకెల మార్కును తాకాడు. ఈ సెంచరీ గిల్కు 11వ టెస్ట్ సెంచరీ. ఓవరాల్గా 20వ అంతర్జాతీయ సెంచరీ. కేవలం 26 ఏళ్ల వయసులోనే గిల్ ఇన్ని సెంచరీలు చేయడం విశేషం.అరుదైన ఫీట్టీమిండియా కెప్టెన్గా గిల్ టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్క్ను అందుకున్నాడు. 15 ఇన్నింగ్స్ల్లో గిల్ ఈ ఫీట్ సాధించాడు. తద్వారా భారత్ తరఫున కెప్టెన్గా తక్కువ ఇన్నింగ్స్లో వెయ్యి పరుగుల మార్క్ దాటిన రెండో క్రికెటర్గా నిలిచాడు. మొదటి స్థానంలో సునీల్ గావస్కర్ (14 ఇన్నింగ్స్లు) ఉన్నాడు.అంతేకాదు కెప్టెన్ అయిన అతి తక్కువ రోజుల్లోనే టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గానూ నిలిచాడు. ఇక ఓవరాల్గా భారత్ తరఫున కెప్టెన్గా వెయ్యి పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో 11వ స్థానంలో నిలిచాడు.అలాగే అత్యధిక టెస్ట్ శతకాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో టాప్-5లోకి చేరాడు. గిల్ భారత టెస్ట్ జట్టు కెప్టెన్గా 6 శతకాలు సాధించాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (20) టాప్ ప్లేస్లో ఉండగా.. సునీల్ గవాస్కర్ (11), మొహమ్మద్ అజహారుద్దీన్ (9), సచిన్ టెండూల్కర్ (7) గిల్కు ముందున్నారు. గిల్ 6 టెస్ట్ శతకాలను కేవలం 15 ఇన్నింగ్స్లోనే సాధించడం మరో విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. ముల్లాన్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో భారత్ అతి భారీ స్కోర్ దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి జట్టు స్కోర్ 368-3గా ఉంది. రాహుల్ (100), యశస్వి జైస్వాల్ (24), సాయి సుదర్శన్ (81) ఔట్ కాగా.. గిల్ (103), వికెట్కీపర్ రిషబ్ పంత్ (50) క్రీజ్లో ఉన్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో సలీం సాఫి 2, జియా ఉర్ షరిఫీ ఓ వికెట్ పడగొట్టారు. -
ఆఫ్గన్తో టెస్టు.. గిల్ అరుదైన ఫీట్!
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా బ్యాటర్లు రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నారు. ఇప్పటికే కేఎల్ రాహుల్ శతకంతో సరికొత్త రికార్డులు నెలకొల్పగా.. తాజాగా టీమిండియా సారథి శుబ్మన్ గిల్ అరుదైన ఫీట్ సాధించాడు. టీమిండియా కెప్టెన్గా గిల్ టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్క్ను అందుకున్నాడు. 15 ఇన్నింగ్స్లో గిల్ ఈ ఫీట్ సాధించాడు. తద్వారా భారత్ తరఫున కెప్టెన్గా తక్కువ ఇన్నింగ్స్లో వెయ్యి పరుగుల మార్క్ దాటిన రెండో క్రికెటర్గా గిల్ నిలిచాడు. మొదటి స్థానంలో సునీల్ గావస్కర్ (14 ఇన్నింగ్స్లు) ఉన్నాడు. అంతేకాదు కెప్టెన్ అయిన తక్కువ రోజుల్లోనే టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గానూ గిల్ నిలిచాడు. ఇక ఓవరాల్గా భారత్ తరఫున కెప్టెన్గా వెయ్యి పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో గిల్ 11వ స్థానంలో నిలిచాడు. ఆఫ్గన్పై సాధించిన అర్థసెంచరీ గిల్కు తొమ్మిదోది కావడం విశేషం.ఇక గిల్ ఇప్పటివరకు 40 టెస్టు మ్యాచ్లాడి 2,843 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 8 అర్థసెంచరీలున్నాయి. మ్యాచ్ విషయానికొస్తే టీమిండియా భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది. 68 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (65), రిషబ్ పంత్ (25) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు కేఎల్ రాహుల్ శతకం చేసిన వెంటనే ఔట్ అయ్యాడు. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam)చదవండి: తెలుగోడే అర్హుడు.. అందుకే అక్షర్ను తప్పించాం! -
రాహుల్, గిల్ సెంచరీలు.. టీమిండియా ఆధిపత్యం
అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో శనివారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 85 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 368 పరుగులు సాధించింది. గిల్ 103, పంత్ 50 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (24) నిరాశపరచగా.. కేఎల్ రాహుల్ (100) శతక్కొట్టాడు. మిగిలిన వారిలో వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ భారీ అర్ధ శతకం (81)తో అలరించాడు. అఫ్గన్ బౌలర్లలో మహ్మద్ సలీ సఫీ రెండు వికెట్లు తీయగా.. జియాఉర్ రహ్మాన్ ఒక వికెట్ పడగొట్టాడు.శుబ్మన్ గిల్ సెంచరీ82.5: సలీమ్ సఫీ బౌలింగ్లో సింగిల్ తీసి శతకం పూర్తి చేసుకున్న కెప్టెన్ గిల్. 138 బంతుల్లో సెంచరీ చేసిన గిల్. స్కోరు: 358/3 83).మూడు వందల మార్కు దాటిన టీమిండియా.. స్కోరు: 340/3(79)గిల్ 91, పంత్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు.మూడో వికెట్ డౌన్సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మరుసటి బంతికే రాహుల్ అవుట్. క్రీజులోకి రిషభ్ పంత్. స్కోరు: 249/3 (61). గిల్ 39 పరుగులతో ఉండగా.. పంత్ రెండు పరుగులతో ఉన్నాడు.కేఎల్ రాహుల్ సెంచరీ60.1: జియాఉర్ రహ్మాన్ బౌలింగ్లో రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్. కెరీర్లో 12వ టెస్టు సెంచరీ సాధించిన కర్ణాటక బ్యాటర్.45 ఓవర్లలో టీమిండియా స్కోరు: 191-2గిల్ 8, రాహుల్ 75 పరుగులతో ఉన్నారు.సాయి సుదర్శన్ అవుట్42.4: సలీమ్ సపీ బౌలింగ్లో రెండో వికెట్గా వెనుదిరిగిన సాయి సుదర్శన్ (81). సెంచరీకి పందొమ్మిది పరుగుల దూరంలో పెవిలియన్ చేరిన సాయి. క్రీజులోకి కెప్టెన్ శుబ్మన్ గిల్ రాగా.. రాహుల్ 72 పరుగులతో ఉన్నాడు.సాయి అర్ద శతకం31.3: నంగేయాలియా ఖరోటే బౌలింగ్లో ఫోర్ బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్న సాయి సుదర్శన్. స్కోరు: 133/1 (31.4)కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ29.3: నంగేయాలియా ఖరోటే బౌలింగ్లో సింగిల్ తీసి అర్ధ శతకం పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్. టెస్టు కెరీర్లో అతడికి ఇది 21వ హాఫ్ సెంచరీ. 31 ఓవర్లలో టీమిండియా స్కోరు: 121-1.లంచ్ బ్రేక్కు భారత్ స్కోరెంతంటే?లంచ్ బ్రేక్ సమయానికి భారత్ వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(37), సాయిసుదర్శన్(32) ఉన్నారు.నిలకడగా ఆడుతున్న సుదర్శన్, రాహుల్21 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(32), సాయిసుదర్శన్(26) ఉన్నారు.తొలి వికెట్ డౌన్టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన జైశ్వాల్.. సలీం బౌలింగ్లో ఔటయ్యాడు.నిలకడగా ఆడుతున్న భారత్భారత ఓపెనర్లు రాహుల్(16), యశస్వి జైశ్వాల్(20) నిలకడగా ఆడుతున్నారు. 10 ఓవర్లకు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. 16 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.బ్యాటింగ్ భారత్దేముల్లాన్పూర్ వేదికగా భారత్-అఫ్గానిస్తాన్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్తో రాజస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుత్తార్ భారత తరపున అరంగేట్రం చేశాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో అతడికి టీమిండియా తరపున ఆడే అవకాశం లభించింది.అదేవిధంగా సాయిసుదర్శన్కు కూడా తుది జట్టులో చోటు దక్కింది. ఈ తమిళనాడు ఆటగాడు ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ రానున్నాడు. ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కలేదు. అతడి స్ధానంలో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్కు ఛాన్స్ ఇచ్చారు.తుది జట్లుఆఫ్ఘనిస్తాన్ : సెడిఖుల్లా అటల్, రహ్మానుల్లా గుర్బాజ్, అబ్దుల్ మాలిక్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అఫ్సర్ జజాయ్(వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేలియా ఖరోటే, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేయాలియా ఖరోటే, జియావుర్ రెహమాన్ షరీఫీ, మహ్మద్ సలీమ్ సఫీభారత్ : కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ -
‘సొంతగడ్డపై టీమిండియా పటిష్టంగా కనిపించట్లేదు’
గత కొంతకాలంగా టెస్టుల్లో టీమిండియా స్థాయికి తగ్గట్లు రాణించడం లేదు. ముఖ్యంగా గౌతం గంభీర్ హెడ్కోచ్గా వచ్చిన తర్వాత భారత్కు ఘోర పరాజయాలు ఎదురయ్యాయి. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఏకంగా 3-0తో వైట్వాష్కు గురైంది టీమిండియా.ఇక ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 3-2తో కోల్పోయింది. దాదాపుగా దశాబ్దకాలం తర్వాత టీమిండియా ఈ సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి. అనంతరం ఇంగ్లండ్ పర్యటనలో 2-2తో డ్రా చేసుకోవడంతో జట్టుపై విమర్శల జడి కాస్త తగ్గింది.ఇదిలా ఉంటే.. చాన్నాళ్ల తర్వాత టీమిండియా టెస్టు బరిలో దిగనుంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టు ఆడనుంది. జూన్ 6 నుంచి ముల్లన్పూర్లో ఈ మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, ఈ మ్యాచ్ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగం కాదు.భారత్కు అత్యంత ముఖ్యంఅయినప్పటికీ ఈ మ్యాచ్ భారత్కు అత్యంత ముఖ్యమని అంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ సబా కరీం. జియోస్టార్తో మాట్లాడుతూ.. ‘‘ఈ టెస్టు మ్యాచ్ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగం కాదు. అయినప్పటికీ ఈ మ్యాచ్ను తేలికగా తీసుకోకూడదు.టీమిండియాకు ఇది అతి ముఖ్యమైన మ్యాచ్. ఈ మ్యాచ్ ద్వారా తమ లోపాల్ని సరిచేసుకుని.. జట్టును పరీక్షించుకునే వీలు కలిగింది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటిని అధిగమించాల్సి ఉంది.టెస్టు క్రికెట్పై భారత జట్టు మరింత దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా సొంతగడ్డపై గతంలో మాదిరి టీమిండియా పటిష్టంగా కనిపించడం లేదు’’ అని సబా కరీం అభిప్రాయపడ్డాడు.యువ ఆటగాళ్లను పరీక్షించే అవకాశంఅదే విధంగా.. ‘‘అఫ్గన్తో టెస్టు రూపంలో యువ ఆటగాళ్లను కూడా పరీక్షించే అవకాశం వచ్చింది. కొత్త కొత్త కాంబినేషన్లు ప్రయత్నించండి. ఒకవేళ వాళ్లు బాగా ఆడితే తదుపరి సిరీస్లకు కూడా ఎంపిక చేయండిజఇది ఇప్పటికప్పుడు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. అయితే, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొన్నిసార్లు ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. ఇది గెలుపోటముల గురించి ఆలోచించే సమయం కాదు. భవిష్యత్తును తప్పక దృష్టిలో పెట్టుకోండి’’ అని సబా కరీం సెలక్టర్లకు సూచించాడు.అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టుకు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవ్దత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, ధ్రువ్ జురెల్.చదవండి: కావ్యా మారన్పై SRH ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు -
అత్యుత్తమ టెస్టు జట్టు ఇదే.. జైసూకు దక్కని చోటు!
సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ బరిలో దిగేందుకు సిద్ధమైంది. దాదాపు రెండు నెలల పాటు ఐపీఎల్-2026 టోర్నీతో బిజీగా గడిపిన భారత ఆటగాళ్లు.. జూన్ 6 నుంచి జాతీయ జట్టు తరఫున విధుల్లో చేరనున్నారు.స్వదేశంలో అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టు ఆడే క్రమంలో ముల్లన్పూర్లో ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టిన ప్లేయర్లు.. నెట్స్లో చెమటోడుస్తున్నారు. శుబ్మన్ గిల్ కెప్టెన్సీలో భారత్ అఫ్గన్తో టెస్టుతో పాటు.. మూడు వన్డేలు ఆడనుంది.ప్రస్తుత అత్యుత్తమ జట్టు ఇదేఇలాంటి తరుణంలో టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ జట్టు ఇదేనంటూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇందులో నలుగురు భారత క్రికెటర్లకు మాత్రమే చోటు దక్కింది.తన జట్టులో కేఎల్ రాహుల్కు ఓపెనర్గా స్థానమిచ్చిన సంజయ్ బంగర్.. యశస్వి జైస్వాల్ను మాత్రం విస్మరించాడు. అతడికి బదులు ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్ను రాహుల్కు జోడీగా ఎంపిక చేశాడు.ఆసీస్, ఇంగ్లండ్ దిగ్గజాలకు చోటుకాగా గతేడాది జైసూ ఏకంగా మూడు సెంచరీల సాయంతో 700కు పైగా పరుగులు చేశాడు. మరోవైపు.. హెడ్ 817, రాహుల్ 813 పరుగులు సాధించారు. ఇక వన్డౌన్లో ఇంగ్లండ్ లెజెండ్ జో రూట్ను ఎంపిక చేసిన సంజయ్ బంగర్.. నాలుగో స్థానానికి టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ను ఎంచుకున్నాడు. ఐదో స్థానంలో ఆసీస్ దిగ్గజం స్టీవ్ స్మిత్కు చోటు ఇచ్చాడు.గతేడాది రూట్ 805 పరుగులతో సత్తా చాటగా.. స్మిత్ 651 రన్స్ రాబట్టాడు. వీరిద్దరి కంటే మెరుగ్గా గిల్.. ఏకంగా 983 పరుగులతో దుమ్ములేపాడు. ఇక తన జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్గా బంగర్.. టీమిండియా స్టార్ రిషభ్ పంత్కు స్థానమిచ్చాడు. ఇక ఏడో స్థానానికి ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ను ఎంపిక చేశాడు.పేస్ దళంలో ఎవరంటేఅదే విధంగా స్పిన్నర్ల కోటాలో సౌతాఫ్రికా లెఫ్టార్మ్ బౌలర్ కేశవ్ మహరాజ్ను బంగర్ ఎంచుకున్నాడు. గతేడాది అతడు ఆరు మ్యాచ్లలో కలిపి ఏకంగా 25 వికెట్లు పడగొట్టాడు. పేస్ దళంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్లతో పాటు టీమిండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు బంగర్ చోటిచ్చాడు.ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ కంబైన్డ్ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్ (సంజయ్ బంగర్)కేఎల్ రాహుల్, ట్రవిస్ హెడ్, జో రూట్, శుబ్మన్ గిల్, స్టీవ్ స్మిత్, రిషభ్ పంత్, బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, కేశవ్ మహరాజ్, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: కావ్యా మారన్పై SRH ప్లేయర్ సంచలన ఆరోపణలు! -
‘నువ్వు కూర్చో.. అతడినే వన్డౌన్లో పంపుతాం అన్నాడు’
గత రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్ టాపార్డర్ అద్భుతంగా రాణిస్తోంది. ఐపీఎల్-2025లో గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ 15 మ్యాచ్లు ఆడి 759 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.పరుగుల వీరులుఇక మరో ఓపెనర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) కూడా 15 మ్యాచ్లలో కలిపి 650 పరుగులు రాబట్టి సత్తా చాటాడు. వీరికి తోడుగా వన్డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ 14 మ్యాచ్లు ఆడి 538 పరుగులు సాధించాడు. ఐపీఎల్-2026లోనూ ఈ ముగ్గురూ రాణించారు.గిల్ 732, సాయి సుదర్శన్ 722 పరుగులతో మరోసారి సత్తా చాటగా.. బట్లర్ 526 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో ఫైనల్లో గుజరాత్ యాజమాన్యం బట్లర్ను వన్డౌన్లో కాకుండా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు పంపింది.అనూహ్య నిర్ణయంమూడో స్థానంలో అన్క్యాప్డ్ ప్లేయర్ నిశాంత్ సింధు (20)ను పంపగా.. అతడు విఫలమయ్యాడు. ఇక నాలుగో స్థానంలో వెళ్లిన బట్లర్ సైతం 19 పరుగులే చేసి నిష్క్రమించాడు. ఇక గిల్, సాయి వరుసగా 10, 12 పరుగులే చేశారు. ఫలితంగా 155 పరుగులే చేసిన గుజరాత్.. ఐదు వికెట్ల తేడాతో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది.కాగా బట్లర్ను వన్డౌన్లో కాకుండా నాలుగో నంబర్ బ్యాటర్గా పంపడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఈ విషయంలో గుజరాత్ నాయకత్వ బృందాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. ఈ విషయంపై బట్లర్ తాజాగా స్పందించాడు.నువ్వు ఇక్కడే కూర్చో.. తనను నాలుగో స్థానంలో ఆడించాలన్న ఆలోచన హెడ్కోచ్ ఆశిష్ నెహ్రాదేనని బట్లర్ స్పష్టం చేశాడు. ‘ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్’తో మాట్లాడుతూ.. ‘‘తొలి వికెట్ (గిల్) పడగానే.. బ్యాటింగ్కు వెళ్లేందుకు హెల్మెట్ పెట్టుకుని సిద్ధమయ్యాను.ఇంతలో ఆశిష్ నెహ్రా.. ‘నువ్వు ఇక్కడే కూర్చో.. వన్డౌన్లో మేము నిశాంత్ను పంపాలని నిర్ణయించుకున్నాము’ అని చెప్పాడు. మ్యాచ్ తర్వాత ఈ విషయం గురించి నేను నెహ్రాను అడిగాను.అప్పుడు నిశాంత్ను పంపితే బాగుంటుందని.. టాపార్డర్లో ఆడేందుకు అతడికి ఇదే మంచి అవకాశం అని నెహ్రా నాతో అన్నాడు.వర్కౌట్ కాలేదుఅతడిని ఏడో స్థానంలో బ్యాటింగ్కు పంపలేము కదా.. అందుకే ఫైనల్లో ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు. కోల్కతా మ్యాచ్లో కూడా అతడు నాకంటే ముందే బ్యాటింగ్కు వెళ్లాడు. అది తప్పో.. ఒప్పో తెలియదు. ఫైనల్లో మాత్రం ఆ నిర్ణయం మాకు వర్కౌట్ కాలేదు’’ అని బట్లర్ పేర్కొన్నాడు.చదవండి: శ్రేయస్ అయ్యర్ విఫలం.. ఘోర పరాజయం -
టీమిండియా కెప్టెన్గా కేఎల్ రాహుల్?
అఫ్గానిస్తాన్తో ఈ నెల 6 నుంచి జరిగే ఏకైక టెస్టు మ్యాచ్ కోసం భారత జట్టు సన్నద్ధమవుతోంది. మంగళవారం ముల్లాన్పూర్కు చేరుకున్న టీమిండియా తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టింది. ఈ మ్యాచ్ కోసం రెగ్యులర్ టీమ్ సభ్యులతో పాటు అదనంగా నెట్ ప్రాక్టీస్ కోసం ఆరుగురు బౌలర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. పేసర్లు ఆఖిబ్ నబీ, ప్రిన్స్ యాదవ్, గుర్జప్నీత్ సింగ్ పేస్ బౌలింగ్ను నెట్స్లో భారత బ్యాటర్లు ఎదుర్కోనున్నారు.లెగ్ స్పిన్నర్ జీషాన్ అన్సారి, ఎడంచేతి వాటం మణికట్టు స్పిన్నర్ శివాంగ్ కుమార్, ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. టెస్టు జట్టులోని ప్రధాన పేసర్లు సిరాజ్, ప్రసిధ్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఐదు రోజుల వ్యవధిలో మూడు కీలక మ్యాచ్లు ఆడి తీవ్రంగా అలసిపోయారు.వేడి వాతావరణం నేపథ్యంలో వారికి తగినంత విశ్రాంతినిచ్చేందుకు నెట్ బౌలర్ల అవసరం ఏర్పడిందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. టెస్టుకు ముందు భారత బ్యాటర్లకు తగినంత ప్రాక్టీస్ అవసరమని, అందుకే అదనపు బౌలర్లను ఎంపిక చేశామని ఆయన అభిప్రాయపడ్డారు.కెప్టెన్గా రాహుల్!కాగా ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే ఆటగాళ్లు ముల్లన్పూర్ చేరుకోవాల్సి ఉన్నప్పటికీ, కొంతమంది కీలక ఆటగాళ్లు ఇంకా జట్టుతో కలవలేదు. ఈ జాబితాలో కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు తన సహచరులు సాయి సుదర్శన్, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్ ఉన్నారు. వీరంతా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడిన గుజరాత్ జట్టులో భాగంగా ఉన్నారు.అయితే ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రయాణిస్తున్న బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఊహించని ఘటన వల్ల గుజరాత్ ఆటగాళ్లు తొలి బృందంతో కలిసి చండీగడ్కు చేరుకోలేకపోయారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్కు గిల్తో పాటు పేసర్ మహ్మద్ సిరాజ్కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గిల్ స్ధానంలో కేఎల్ రాహుల్ జట్టును నడిపించనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అదేవిధంగా సిరాజ్ స్ధానంలో గుర్నూర్ బ్రార్ టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశముంది.ఆఫ్ఘనిస్తాన్ టెస్టుకు భారత జట్టుశుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, హర్ష్ దూబే, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్)నెట్ బౌలర్లు: గుర్జప్నీత్ సింగ్, అకిబ్ నబీ, ప్రిన్స్ యాదవ్, శరన్ష్ జైన్, జీషన్ అన్సారీ, శివంగ్ కుమార్ -
IPL 2026: టాప్-10 వివాదాలపై ఒక లుక్కేద్దామా!
ఐపీఎల్లో పరుగుల పండుగ అభిమానులకు ఎంత కిక్ ఇస్తుందో, వివాదాలు, గొడవలు కూడా అదే స్థాయిలో ఫ్యాన్స్ను అలరించాయి. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి తాజా 19వ సీజన్ దాకా ఎన్నో గొడవలు, వివాదాలు చోటు చేసుకున్నాయి. మరి ఈ సీజన్లో అభిమానులకు కిక్ ఇచ్చిన టాప్-10 వివాదాలు ఏంటనేవి ఇప్పుడు తెలుసుకుందాం.1) కోహ్లి-గిల్ క్యాచ్ వివాదంఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లి క్యాచ్ ఔట్పై ఎంత రగడ జరిగిందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 63 పరుగులతో కోహ్లి ఆర్సీబీని విజయం వైపు నడిపిస్తున్న సమయంలో ఈ వివాదం చోటుచేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి అర్షద్ ఖాన్ వేసిన బంతిని కోహ్లి మిడాఫ్ మీదుగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ గిల్ డైవ్ చేసి మరీ క్యాచ్ అందుకున్నాడు. అయితే, ఆ క్యాచ్ను గిల్ సరిగ్గా పట్టలేదని, చేతుల్లోకి వెళ్లడానికి ముందు బంతి నేలను తాకిందని కోహ్లీ భావించాడు. A chat between Virat Kohli and Shubman Gill on the catch. - The celebration by Kohli after winning the argument. 😄 pic.twitter.com/9yVbseOqGy— Mufaddal Vohra (@mufaddal_vohra) May 31, 2026అయితే అంపైర్ నితిన్ మీనన్ ఔట్ ఇవ్వడంతో షాక్ తిన్న కోహ్లీ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. తాను ఔట్ కాదని, క్రీజు వదలి వెళ్లనని, థర్డ్ అంపైర్ రివ్యూకు చాన్స్ ఇవ్వాలిని మొండిపట్టు పట్టాడు. చేసేదేం లేక అంపైర్ తన నిర్ణయాన్ని థర్డ్ అంపైర్కు నివేదించాడు. రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్కు కూడా అది స్పష్టంగా కనిపించకపోయినా.. బంతిలో కొంత భాగం నేలను తాకినట్లు గుర్తించి ఔట్ నిర్ణయాన్ని రద్దు చేసి నాటౌట్గా ప్రకటించాడు. కోహ్లీ సంబరాలు చేసుకోగా, గిల్ మాత్రం నిరాశతో చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత 75 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో కోహ్లీ ఆర్సీబీకి రెండో టైటిల్ అందించాడు.2) షేక్హ్యాండ్ వివాదం..ఈ సీజన్లో అభిమానులకు మరింత కిక్ ఇచ్చిన ఎపిసోడ్ అంటే కోహ్లీ, హెడ్ మధ్య జరిగిన షేక్ హ్యాండ్ వివాదమే అని చెప్పొచ్చు. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీతో హెడ్ వ్యంగ్యంగా మాట్లాడడం, దానికి కోహ్లీ ధీటుగా బదులివ్వడం జరిగిపోయాయి. అయితే ఈ గొడవ ఇక్కడితో సద్దుమణగలేదు. Look behind the whole SRH coaching staff, including Daniel Vettori and Muttiah Muralitharan, were watching Virat Kohli and Travis Head, expecting some drama and ready to stop a fight. But Kohli didn’t shake hands, and everyone started laughing. 😂Kohli you character 🔥 pic.twitter.com/W9CS6KM52t— Avénue.1 (@Avnueone8) May 23, 2026మ్యాచ్ పూర్తైన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో హెడ్ తన వద్దకు వచ్చినా కోహ్లీ అతడిని పట్టించుకోకుండా పక్కకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఈ వివాదం హెడ్ భార్యను కూడా తాకింది. ఆమెపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు పెడుతూ కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. మరి ఈ వివాదానికి ఈ సీజన్తో ముగింపు పడిందా అంటే చెప్పలేని పరిస్థితి.3) టిమ్ డేవిడ్ అనైతిక చర్యమే 11న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ విజయం తర్వాత ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ చేతి వేళ్లతో అసభ్య సంజ్ఞలు చేయడం వివాదాస్పదమైంది. సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన మెగా వేలంలో ముంబై ఇండియన్స్ తనను విడుదల చేయడంపై వ్యంగ్యంగా ఈ సైగలు చేసినట్లు తేలింది. దీంతో బీసీసీఐ టిమ్ డేవిడ్ చర్యను తప్పుబడుతూ అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించడంతో పాటు రెండు డీ మెరిట్ పాయింట్లు కేటాయించింది.4) టాస్ వివాదం..ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్-2 పోరు సందర్భంగా టాస్ సమయంలో నెలకొన్న గందరగోళం వివాదంగా మారింది. మొదట టాస్ వేసినప్పుడు పరాగ్ హెడ్ అని చెప్పాడు. అయితే మ్యాచ్ రిఫరీ ప్రకాశ్ భట్ మాత్రం పరాగ్ చెప్పింది అర్థం కాలేదంటూ టాస్ మళ్లీ వేయించాడు. రెండో ప్రయత్నంలో రాజస్తాన్ రాయల్స్కు టాస్ అనుకూలించడంతో బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలి ప్రయత్నంలో గుజరాత్కు టాస్ అనుకూలంగా వచ్చినట్లు తర్వాత తేలింది. ఈ సమయంలో గుజరాత్ కెప్టెన్ గిల్ కాస్త అయోమయానికి గురయ్యాడు. కానీ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించడంతో ఈ వివాదంపై పెద్దగా చర్చ జరగలేదు.5) అంపైరింగ్పై ఎస్ఆర్హెచ్ ఫిర్యాదు ఈ సీజన్లో వరుస వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయాలు తమను తీవ్ర ప్రభావితం చేశాయంటూ ఎస్ఆర్హెచ్ బీసీసీఐని ఆశ్రయించడం హైలైట్గా నిలిచింది. ఆర్సీబీతో మ్యాచ్లో క్లాసెన్ వివాదాస్పద క్యాచ్, కేకేఆర్తో మ్యాచ్లో అభిషేక్ శర్మ క్యాచ్పై, లక్నో ఆటగాడు అవేశ్ ఖాన్ బంతి బౌండరీ లైన్ను దాటకముందే, ఆ తాడును వెనక్కి నెట్టేయడంపై ఎస్ఆర్హెచ్ అసహనం వ్యక్తం చేసింది. ఎంసీసీ నిబంధనల ప్రకారం ఈ చర్యపై ఆటగాడికి భారీ జరిమానా విధించాలని బీసీసీఐ ఎదుట వాదించడం చర్చనీయాంశమైంది.6) పరాగ్ డ్రెస్సింగ్ రూమ్ ఘటనపంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ డ్రెస్సింగ్ రూమ్లో ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ వేపింగ్ (ఈ-సిగరేట్) చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. నిబంధనల ప్రకారం ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లో ఇలాంటి చర్యలకు పాల్పడడం నిషిద్ధం. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన బీసీసీఐ ఆట పరువుకు భంగం కలిగించినందుకు పరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు, ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది.Captain of Rajasthan Royals team Riyan Parag enjoying vape in the RR dressing room .Vaping is illegal in India . Hello @BCCI is this allowed? #PBKSvsRR pic.twitter.com/banIgJDO6u— Surbhi (@SurrbhiM) April 29, 20267) రాజస్తాన్ డగౌట్ మొబైల్ వివాదంఈ సీజన్లో వివాదాల్లో హైలైట్గా నిలిచిన వాటిలో రాజస్తాన్ రాయల్స్ డగౌట్లో మొబైల్ ఫోన్ కనిపించడమే. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా డగౌట్లో రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమి భిందర్ మొబైల్ ఫోన్ ఉపయోగిస్తుండడం కెమెరాల కంటికి చిక్కింది. ఈ చర్య పట్ల సీరియస్ అయిన బీసీసీఐ భిందర్ మొబైల్ అనుకోకుండా వాడానని, మెడికల్రిపోర్ట్స్ చూసుకునేందుకే ఫోన్ వాడినట్లు తెలిపాడు. తన చర్య పట్ల క్షమాపణ చెప్పినప్పటికీ, అతడి వివరణతో సంతృప్తి చెందని బీసీసీఐ రోమి భిందర్కు రూ.లక్ష జరిమానా విధించింది. రోమి భిందర్ చర్యను వ్యతిరేకిస్తూ బీసీసీఐ ఆటగాళ్లకు కఠిన ఆంక్షలు, నిబంధనలు జారీ చేసింది.8) అబ్స్ట్రకింగ్ ది ఫీల్డ్ఐపీఎల్ 2026 సీజన్లో లక్నోతో మ్యాచ్ సందర్భంగా కేకేఆర్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔటయ్యాడు. షాట్ ఆడిన అంగ్క్రిష్ సింగిల్ తీయడానికి ప్రయత్నించాడు. నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న గ్రీన్ వద్దని వారించడంతో వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ దశలో బంతిని అందుకున్న షమీ స్ట్రైకింగ్ ఎండ్ వికెట్ల వైపు విసిరాడు. The infamous Angkrish Raghuvanshi Run out today ! 😔What's your opinion on this decision 🤔 , my opinion is that it was not out, a blunder by 3rd umpire ! What was the hurry 😯?#LSGvsKKR #IPL2026pic.twitter.com/eJmxLm5Gwk— Cricket IQ (@S17Anurag) April 26, 2026ఈ నేపథ్యంలో తన రన్నింగ్ దిశను మార్చుకున్న రఘువంశీ షమీ వేసిన బంతికి అడ్డు రావడంతో అది అతడి ప్యాడ్లకు తగిలింది. దీంతో లక్నో ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో ఉద్దేశపూర్వకంగానే బంతిని అడ్డుకున్నందుకు అంపైర్ అంగ్క్రిష్ రఘువంశీని ఔట్గా ప్రకటించాడు.9) అర్ష్దీప్ ఇన్స్టా వివాదంపంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో దాదాపు 200 పైగా పోస్టులను తొలగించడం ఆసక్తిగా నిలిచింది. ఐపీఎల్ 2026 సీజన్లో పలు వివాదాల నేపథ్యంలో అర్ష్దీప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తేలింది. టోర్నీ జరుగుతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్ సహా జట్టు సమావేశాలకు సంబంధించి కంటెంట్ను సోషల్మీడియాలో షేర్ చేసుకోవద్దంటూ బీసీసీఐ ఆటగాళ్లను హెచ్చరించింది. అందుకే అర్ష్దీప్ తన ఇన్స్టాలో పోస్టులు తొలగించి ఉంటాడని అభిమానులు భావించారు.10) జాసన్ హోల్డర్ క్యాచ్ వివాదంగుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్లో రజత్ పాటీదార్ ఇచ్చిన క్యాచ్ హోల్డర్ డైవ్ చేసి పట్టినప్పటికీ ఆ క్యాచ్ పూర్తి వివాదాస్పదమయింది. పాటిదార్ ఇచ్చిన క్యాచ్ను అందుకునే క్రమంలో హోల్డర్ బంతిని తొలుత నేలకు ఆనించినట్లు కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, అంపైర్ ఔటివ్వడం ఆర్సీబీ డగౌట్లో ఆటగాళ్లకు ఆగ్రహం తెప్పించింది. They checked the runout for 1 min and there was indeed a check of that Patidar's catch by Jason Holder, just judged in 17 secsTruly disappointing to see umpiring at this level this season. New day, new lowpic.twitter.com/KGgbi2a7qb— Gautam (@indiantweetrian) April 30, 2026హోల్డర్ పట్టిన క్యాచ్పై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఔట్ కాదని తెలుస్తున్నప్పటికీ మూడో అంపైర్ పాటిదార్ను ఔట్ అని ప్రకటించడం అత్యంత వివాదాస్పదమయ్యింది.చదవండి: భారత్లో ఫిఫా ప్రసార హక్కులు ఆ సంస్థకే! -
అతడిని వన్డౌన్లో ఆడిస్తారా?: ఇంగ్లండ్ దిగ్గజం ఫైర్
ఐపీఎల్-2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ అనుసరించిన వ్యూహాలపై ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ మండిపడ్డాడు. అసలు గుజరాత్ నాయకత్వ బృందం ఆలోచన ఏమిటో తనకు అర్థం కాలేదన్నాడు.జోస్ బట్లర్ను కాదని నిశాంత్ సింధును వన్డౌన్లో ఎలా ఆడిస్తారని బ్రాడ్ ప్రశ్నించాడు. అహ్మదాబాద్లో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో గుజరాత్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.ఈ క్రమంలో బెంగళూరు వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడగా.. గుజరాత్ రన్నరప్తో సరిపెట్టుకుంది. కాగా ఆర్సీబీతో ఫైనల్ సందర్భంగా గుజరాత్ తమ టాపార్డర్ను మార్చిన సంగతి తెలిసిందే.ఆదిలోనే షాక్ఓపెనర్లుగా సాయి సుదర్శన్, కెప్టెన్ శుబ్మన్ గిల్ కొనసాగగా.. వన్డౌన్లో మాత్రం బట్లర్ను కాదని నిశాంత్ సింధును ఆడించారు. అయితే, సీజన్ ఆసాంతం ఆకట్టుకున్న సాయి ఫైనల్లో 12, గిల్ 10 పరుగులే చేయడంతో గుజరాత్కు ఆదిలోనే షాక్ తగిలింది.ఇలాంటి తరుణంలో అన్క్యాప్డ్ నిశాంత్ సింధు మూడో స్థానంలో వచ్చి 18 బంతుల్లో 20 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ నాలుగో నంబర్ బ్యాటర్గా బరిలోకి దిగి 23 బంతుల్లో 19 పరుగులే చేసి నిష్క్రమించాడు.ఈ నేపథ్యంలో స్టువర్ట్ బ్రాడ్ గుజరాత్ జట్టు యాజమాన్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ యూట్యూబ్ చానెల్తో మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీ ఆసాంత బట్లర్ మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. కానీ ఫైనల్లో అనూహ్య రీతిలో అతడిని నాలుగో స్థానానికి మార్చారు.నాకైతే అర్థం కావడం లేదుఅసలు ఫైనల్లో.. అది కూడా ముందుగా బ్యాటింగ్ చేస్తూ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఏబీ డివిలియర్స్ సైతం దీనిని ఆత్మరక్షణ ధోరణిగానే అభివర్ణించాడు.ఇక ఈ సీజన్లో ఓపెనర్లు గిల్, సాయి చెరో 700కు పైగా పరుగులు సాధించారు. ఓపెనర్లు ఇంత నిలకడగా రాణించడం మంచిదే. అదే సమయంలో ఇలాంటి ప్రదర్శనల వల్ల మిడిలార్డర్ను పరీక్షించేందుకు వీలుకాదు. ఇద్దరు ఓపెనర్లు విఫలం కాగానే..ఒత్తిడిలో వారు ఎలా రాణిస్తారో తెలియదు. టైటిల్ పోరులో ఇద్దరు ఓపెనర్లు విఫలం కాగానే.. మిగతా వాళ్లు కూడా పెవిలియన్కు క్యూ కట్టేశారు’’ అని స్టువర్ట్ బ్రాడ్ విమర్శించాడు.బహుశా అందుకేనేమో!ఇక ఇదే షోలో ఇంగ్లండ్ మరో మాజీ ఆటగాడు స్టీవెన్ ఫిన్స్పందిస్తూ.. ‘‘ఇంగ్లండ్ తరఫున చాలా ఏళ్ల పాటు ఓపెనర్గా ఆడిన అనుభవం బట్లర్కు ఉంది. అలాంటిది అతడిని డిమోట్ చేయడం ఆశ్చర్యకరంగా అనిపించింది.అయితే, పాత బడుతున్న కొద్దీ వికెట్ బ్యాటింగ్కు అనుకూలిస్తుందని గుజరాత్ నాయకత్వ బృందం భావించి ఉంటుంది. కాసేపు నిశాంత్ స్టాండింగ్ ఇస్తే బట్లర్ కుదురుకోగలడని అంచనా వేసి ఉంటుంది. కానీ అదేమీ జరుగలేదు’’ అని పేర్కొన్నాడు.కాగా గుజరాత్ టాపార్డర్ కుదేలు కాగా.. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అజేయ అర్ధ శతకం (50)తో రాణించాడు. ఫలితంగా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగలిగింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలో పూర్తి చేసి టైటిల్ విజేతగా నిలిచింది.చదవండి: ఈ ఐదుగురు తమ చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడేశారు?! -
ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా ఇవే తగ్గించుకో.. కోహ్లి
-
ఆ విషయంలో గిల్ తోపు.. రబాడ తక్కువేం కాదు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్లలో గుజరాత్ టైటాన్స్ ఒకటిగా నిలిచిపోనుంది. 2022 సీజన్ నుంచి స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆడిన నాలుగు సీజన్లలో మూడుసార్లు ఫైనల్ చేరడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. 2022లో చాంపియన్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ 2023లో రన్నరప్గా, 2024 సీజన్లో లీగ్ దశ, 2025 సీజన్లో ప్లేఆఫ్స్, తాజా సీజన్లో మరోసారి రన్నరప్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ను 5 వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్ అందుకుంది. అయితే రన్నరప్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్లో ఉత్తమ ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లకు రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ ఆడిన తుది జట్టు సహా మొత్తం 15 మందికి సంబంధించిన ఆటగాళ్ల రేటింగ్ను విడుదల చేశారు. 10 పాయింట్లతో కూడిన రేటింగ్లో జట్టును అంతా తానై నడిపించిన కెప్టెన్ శుబ్మన్ గిల్, బౌలర్ కగిసో రబాడ చెరో 9 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా, సాయి సుదర్శన్ (8 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. జాసన్ హోల్డర్, మహ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్లు ఏడేసి పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. ఇక వికెట్ కీపర్ జాస్ బట్లర్ 6.5 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా, వాషింగ్టన్ సుందర్, ప్రసిధ్ కృష్ణ చెరో 6 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. అశోక్ శర్మ, అర్షద్ ఖాన్లు చెరో 4 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా, 3 పాయింట్లతో రాహుల్ తెవాటియా ఏడో స్థానంలో నిలిచాడు.ఈ సీజన్లో ద్దగా ప్రభావం చూపని గ్లెన్ ఫిలిప్స్ (2 పాయింట్లు), షారుక్ ఖాన్, నిషాంత్ సింధూ ఒక్కో పాయింట్తో ఆఖరి స్థానాల్లో ఉన్నారు. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్ల్లో 9 విజయాలతో పట్టికలో రెండో స్థానంలో నిలిచిన గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది. అయితే క్వాలిఫయర్-2లో రాజస్తాన్ను చిత్తు చేసిన గుజరాత్ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే ఫైనల్లో ఆర్సీబీ చేతిలో చతికిలపడిన గుజరాత్ రన్నరప్కు పరిమితమైంది.చదవండి: 'కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ అయిపోలేదు!' -
ఫైనల్లో ఓటమి అనంతరం గిల్ విశ్లేషణ
నిన్న (మే 31) జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీ చేతిలో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో గుజరాత్ ఆర్సీబీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. తొలుత బ్యాటింగ్లో సాధారణ స్కోర్కు (155-8) పరిమితమై, ఆతర్వాత దాన్ని కాపాడుకోవడంలో దారుణంగా విఫలమైంది. విరాట్ కోహ్లి (75 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు.సీజన్ ఆధ్యాంతం గుజరాత్ విజయాల్లో ప్రధానపాత్ర పోషించిన బౌలర్లు తుది సమరంలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. 9వ ఓవర్లో రషీద్ ఖాన్ రెండు వికెట్లు (రజత్, కృనాల్) తీయడం మినహా, మిగతా బౌలర్లు చేసిందేమీ లేదు. కాస్త పొదుపుగా బౌలింగ్ చేయగలిగినా, స్కోర్ మరీ చిన్నది కావడంతో కాపాడుకోలేకపోయారు. మ్యాచ్ అనంతరం గుజరాత్ సారధి శుభ్మన్ గిల్ విశ్లేషణ ఇలా ఉంది. "180-190 పరుగులు చేసుంటే, మ్యాచ్ మరింత పోటీగా ఉండేది. పిచ్ పూర్తిగా స్లోగా లేదు. ఆరంభ ఓవర్లలో మాత్రం పేసర్లకు కొంత సహకారం లభించింది.ఆదిలోనే వికెట్లు కోల్పోవడం జట్టు మోమెంటంను దెబ్బతీసింది. మధ్య ఓవర్లలో వేగంగా పరుగులు చేయలేకపోవడం కష్టాలను అధికం చేసింది. ఫైనల్ మ్యాచ్ కావడంతో 150-160 పరుగులు చేసినా, పవర్ప్లేలో రెండు-మూడు వికెట్లు తీసుంటే పోటీలో ఉండేవాళ్లం.టార్గెట్ను కాపాడుకునే క్రమంలో పవర్ప్లేలో 15-20 పరుగులు ఎక్కువగా ఇచ్చేశాము. ఆ దశలో ప్రత్యర్థిని 50-55 పరుగులకు కట్టడి చేసి ఉంటే మ్యాచ్ మరోలా ఉండేది.సీజన్ మొత్తాన్ని పరిశీలిస్తే, మా బౌలింగ్ యూనిట్ అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచింది. తొలి రెండు మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత కూడా జట్టు వెనక్కి తగ్గకుండా, చిన్నచిన్న అంశాల్లో మెరుగుపడుతూ బలంగా తిరిగి వచ్చింది.తుది మెట్టుపై ట్రోఫీ చేజారినా ఈ సీజన్ చాలా సంతృప్తినిచ్చింది. గెలిచినా, ఓడినా మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు ఎప్పుడూ ఉంటాయి. జట్టుగా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అంశాలపై దృష్టి పెడతాము" -
కోహ్లీ వీరవిహారం.. చాంపియన్స్గా ఆర్సీబీ
ఐపీఎల్ 2026 చాంపియన్గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చేజింగ్ మాస్టర్గా పేరు పొందిన విరాట్ కోహ్లీ ఆఖరి దాకా నిలిచి ఆర్సీబీని గెలిపించాడు. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 75 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్ (16 బంతుల్లో 32), టిమ్ డేవిడ్ (17 బంతుల్లో 24 పరుగులు) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్, రబాడ, అర్షద్ ఖాన్ తలా వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (50 నాటౌట్), నిషాంత్ సిందూ (20 పరుగులు) ఆడుతున్నారు. రసిక్ సలామ్ 3 వికెట్లు తీయగా, హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ చెరో 2 వికెట్లు తీశాడు.కోహ్లీ కమాల్..156 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. వెంకటేశ్ అయ్యర్, కోహ్లీలు కలిసి తొలి వికెట్కు 4.3 ఓవర్లలో 62 పరుగులు జోడించి మంచి పునాది వేశారు. ఈ దశలో పడిక్కల్, పాటీదార్లు రషీద్ఖాన్ బౌలింగ్లో వెనువెంటనే ఔట్ కావడంతో ఆర్సీబీ శిబిరంలో ఆందోళన నెలకొన్నప్పటికీ కోహ్లీ నిలకడగా ఆడి జట్టును విజయం దిశగా నడిపించాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ ఔటైనప్పటికీ జితేశ్ శర్మ (11 నాటౌట్)తో కలిసి కోహ్లీ ఆర్సీబీని గెలిపించి వరుసగా రెండో కప్పును అందించాడు.ఆర్సీబీ అరుదైన ఫీట్ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఒక అరుదైన ఫీట్ సాధించింది. వరుసగా రెండు సీజన్లలో టైటిల్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ రికార్డులకెక్కింది. గతంలో చెన్నై సూపర్కింగ్స్ (2010, 2011), ముంబై ఇండియన్స్ (2019, 2020) ఈ ఫీట్ను సాధించాయి.Finishing off in style 🥳And it's none other than King Kohli 😎👑Scorecard ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/FZNGQ26gBs— IndianPremierLeague (@IPL) May 31, 2026 -
'కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ అయిపోలేదు!'
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఫైనల్లో ఇప్పటికైతే ఆర్సీబీదే పైచేయిగా ఉంది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతున్న గుజరాత్ టైటాన్స్ సాధారణ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. అయితే గుజరాత్ వికెట్లు పడిన ప్రతీసారి కోహ్లీ హైపర్ యాక్టివ్గా కనిపించాడు. ముఖ్యంగా గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ వికెట్లు పడ్డప్పుడు కోహ్లీ ఇచ్చిన రియాక్షన్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హాజిల్వుడ్ బౌలింగ్లో గిల్ ఔటైన వెంటనే పిచ్పైకి పరిగెత్తుకొచ్చిన కోహ్లి గిల్వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకోవడం కనిపించింది. అంతటితో ఆగకుండా సాయి సుదర్శన్ ఔట్ కావడానికి ముందు కోహ్లీ శ్రుతి మించిపోయాడు. హాజిల్వుడ్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లు ప్రతీ బంతికి ముందు కోహ్లీ సాయి సుదర్శన్ను టార్గెట్ చేస్తూ ఏదో ఒక మాట అనడం స్టంప్ మైక్లో రికార్డయింది. అదే ఓవర్ నాలుగో బంతికి సాయి సుదర్శన్ భారీ షాట్కు యత్నించి జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే కోహ్లీ చర్యలపై గుజరాత్ టైటాన్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ ఇంకా అయిపోలేదు. అని కామెంట్లు పెడుతున్నారు.మరో విషయమేంటంటే.. గత రెండు మ్యాచ్ల్లో హిట్ వికెట్గా వెనుదిరిగిన సాయి సుదర్శన్ ఈ మ్యాచ్లోనూ అలా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. హాజిల్వుడ్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్ రెండో బంతిని ఆడే క్రమంలో బ్యాట్ అతని చేతి నుంచి జారిపోయేలా కనిపించినప్పటికీ ఈసారి మాత్రం అలా జరగలేదు. ఇక మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాష్టింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. రసిక్ సలామ్ మూడు వికెట్లు తీయగా, హాజిల్వుడ్, భువనేశ్వర్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు.pic.twitter.com/E5HLX9ALPr— crictalk (@crictalk7) May 31, 2026చదవండి: అయ్యో గుజరాత్.. సీన్ రివర్స్ అయ్యేలా ఉందే! -
అయ్యో గుజరాత్.. సీన్ రివర్స్ అయ్యేలా ఉందే!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పూర్తిగా తడబడుతోంది. ఆదిలోనే ఓపెనర్లిద్దరి వికెట్లను కోల్పోయిన గుజరాత్ కష్టాల్లో పడింది. అయితే హోంగ్రౌండ్లో గుజరాత్ టైటాన్స్కు మంచి రికార్డే ఉంది. టాస్ ఓడినా, గెలిచినా 2025 నుంచి చూసుకుంటే అప్పటినుంచి గుజరాత్ టైటాన్స్ ఐదు మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ ఐదు మ్యాచ్ల్లోనూ గుజరాత్ విజయాలను సాధించింది. ఇందులో ముంబై ఇండియన్స్పై 36 పరుగులతో, రాజస్తాన్పై 58 పరుగులతో, ఎస్ఆర్హెచ్పై 38 పరుగులతో, ఎస్ఆర్హెచ్పై 82 పరుగులతో, సీఎస్కేపై 89 పరుగులతో విజయాలను అందుకుంది. అయితే ఈసారి జరుగుతున్న ఫైనల్లో మాత్రం గుజరాత్ టైటాన్స్కు సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తుంది. పైగా టాస్ సమయంలో గిల్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా అనిపించాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ పటీదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అహ్మదాబాద్ పిచ్పై చేజింగ్ చేసిన జట్టే ఎక్కువ విజయాలు అందుకుంది. అయితే గిల్ మాత్రం తాను టాస్ గెలిచి ఉంటే బ్యాటింగ్ ఎంచుకునేవాడినని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు తొలుత బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ గుజరాత్ ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కోలేకపోతుంది. 8 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 2 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. నిషాంత్ సిందూ (20), జాస్ బట్లర్ (10) పరుగులతో ఆడుతున్నారు.🚨 Toss Update from the FINAL 🚨@RCBTweets have won the toss & will bowl first against @gujarat_titans in Ahmedabad.Updates ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/kgrF0LJ0gQ— IndianPremierLeague (@IPL) May 31, 2026చదవండి: చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడీ -
‘అతడు మూడు ఓవర్లు వేశాడంటే ఆర్సీబీ ఓటమి ఖాయం’
డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈసారీ కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది. ఐపీఎల్-2026 సీజన్ ఆది నుంచి ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న పాటిదార్ సేన.. టేబుల్ టాపర్గా, తొలి ఫైనలిస్టుగా నిలిచింది.ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్తో ఆదివారం నాటి టైటిల్ పోరుకూ పూర్తిస్థాయిలో సన్నద్ధమైన ఆర్సీబీ.. ఆఖరి గండాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా తాజా ఎడిషన్లోనూ ఆర్సీబీ బౌలింగ్ దళం అదరగొడుతున్న సంగతి తెలిసిందే.పటిష్టంగా పేస్ దళంటీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇప్పటికి 26 వికెట్లతో సత్తా చాటగా.. యువ ఆటగాడు రసిఖ్ దర్ సైతం 16 వికెట్లు కూల్చాడు. మిగిలిన వారిలో కృనాల్ పాండ్యా, జట్టుతో ఆలస్యంగా చేరిన జోష్ హాజిల్వుడ్ చెరో 13 వికెట్లతో ఉన్నారు. వీరికి తోడుగా సూయశ్ శర్మ (9), జేకబ్ డఫీ (9) కూడా రాణిస్తున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ బెంగళూరు జట్టు నాయకత్వ బృందానికి కీలక సూచన చేశాడు. గుజరాత్తో ఫైనల్లో రొమారియో షెఫర్డ్ చేతికి మాత్రం బంతిని ఇవ్వొద్దని సూచించాడు. అదే విధంగా ఫిల్ సాల్ట్ తిరిగి వచ్చినా వెంకటేశ్ అయ్యర్నే ఓపెనర్గా కొనసాగించాలని చిక్కా పేర్కొన్నాడు.అతడినే ఓపెనర్గా కొనసాగించాలిఈ మేరకు.. ‘‘ఫిల్ సాల్ట్ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించాడా? లేదా? అన్న అంశంపై స్పష్టత లేదు. ఒకవేళ అతడు ఫిట్గా ఉన్నా వెంకటేశ్ అయ్యర్ బాగా ఆడుతున్నాడు కాబట్టి అతడినే ఓపెనర్గా కొనసాగిస్తే మంచిది.అతడు 3 ఓవర్లు వేశాంటే ఆర్సీబీ ఖేల్ ఖతమేఇక బౌలింగ్ విషయానికొస్తే... ఒకవేళ రొమారియో షెఫర్డ్తో కనీసం మూడు ఓవర్లు బౌలింగ్ చేయించినా సరే ఆర్సీబీ ఓడిపోవడం లాంఛనమే. అతడు కచ్చితంగా మూడు ఓవర్లు వేశాంటే ఆర్సీబీ ఖేల్ ఖతమే.PC: BCCIషెఫర్డ్ చేతికి అస్సలు బంతిని ఇవ్వకండి. నన్నడిగితే అతడికి తుదిజట్టులో కూడా చోటు ఇవ్వకండి’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. కాగా వెస్టిండీస్ ఆల్రౌండర్ రొమారియో షెఫర్డ్ గతేడాది కప్పు గెలిచిన ఆర్సీబీ జట్టులో సభ్యుడు.పేలవ ప్రదర్శనఈ క్రమంలో తాజా ఎడిషన్కు కూడా ఆర్సీబీ షెఫర్డ్ను అట్టిపెట్టుకుంది. ఇక ఈ సీజన్లో అతడు.. ఇప్పటికి 14 మ్యాచ్లలో కలిపి సగటు 42, ఎకానమీ 12తో చెత్తగా బౌలింగ్ చేసి.. ఏడు వికెట్లు తీయగలిగాడు. ఇక బ్యాటర్గా 14 మ్యాచ్లలో కలిపి కేవలం 83 పరుగులే రాబట్టాడు. చివరగా గుజరాత్తో క్వాలిఫయర్-1లో షెఫర్డ్ ఒక ఓవర్ వేసి 15 పరుగులు ఇచ్చుకున్నాడు.ఐపీఎల్-2026 ఫైనల్.. ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ తుది జట్లు (అంచనా) ఆర్సీబీ: రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్/ వెంకటేశ్ అయ్యర్, దేవ్దత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్, రసిఖ్ దర్, జేకబ్ డఫీ/ సుయశ్ శర్మ గుజరాత్: శుబ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సంధు, జేసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, సాయికిషోర్. చదవండి: కెప్టెన్ రేసు.. ఆ ముగ్గురిని ఎంపిక చేసిన బీసీసీఐ! -
సామ్రాజ్యాన్ని కూల్చేసిన గిల్-సుదర్శన్..!
-
గిల్ విశ్వరూపం... IPL 2026 ఫైనలు గుజరాత్
-
వైభవ్కు షాకిచ్చి.. రికార్డుల మోత మోగించిన గిల్
గుజరాత్ టైటాన్స్ ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ఫైనల్కు చేరింది. తమ అరంగేట్ర సీజన్ 2022లో ఏకంగా చాంపియన్గా నిలిచిన టైటాన్స్.. 2023లో రన్నరప్తో సరిపెట్టుకుంది. తాజాగా ఐపీఎల్-2026లో ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించిన గుజరాత్ జట్టు.. క్వాలిఫయర్-2లో జయభేరి మోగించింది.రాజస్తాన్ రాయల్స్తో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్కు దూసుకువెళ్లింది. ముల్లన్పూర్లో రాయల్స్ విధించిన 215 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే గుజరాత్ ఊదేసింది. తద్వారా ఆర్సీబీతో ఆదివారం నాటి టైటిల్ పోరుకు అర్హత సాదించింది. 47 బంతుల్లోనేఇక ఈ విజయంలో ఓపెనర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill)ది కీలక పాత్ర. రాజస్తాన్తో మ్యాచ్లో కేవలం 47 బంతుల్లోనే అతడు శతక్కొట్టాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 104 పరుగులు సాధించాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోవడంతో గిల్ మెరుపు ఇన్నింగ్స్కు తెరపడింది.ఏదేమైనా క్వాలిఫయర్-2లో అద్భుత శతకంతో రాణించి జట్టును గెలిపించిన గిల్.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. కాగా అతడికి ఐపీఎల్లో ఇది ఐదో సెంచరీ. ఈ మ్యాచ్ సందర్భంగా గిల్ సాధించిన రికార్డులు ఇవీ..A 1️⃣0️⃣0️⃣ of the highest quality! 🤩🔥👏GT skipper #ShubmanGill brings up a sensational century and what an occasion to deliver this masterclass! ❤️🙌#TATAIPL Qualifier 2 👉 #GTvRR | LIVE NOW 👉https://t.co/pv6LOaRl1f pic.twitter.com/wEbwNXzply— Star Sports (@StarSportsIndia) May 29, 2026ఐపీఎల్లో అత్యధిక శతకాల వీరుల జాబితాలో..👉విరాట్ కోహ్లి- 9 శతకాలు👉జోస్ బట్లర్- 7 శతకాలు👉క్రిస్ గేల్, కేఎల్ రాహుల్- 6 శతకాలు👉సంజూ శాంసన్, శుబ్మన్ గిల్- 5 శతకాలు👉డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్- 4 శతకాలుగుజరాత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలు👉శుబ్మన్ గిల్- 47 బంతుల్లో 2026లో రాజస్తాన్పై👉శుబ్మన్ గిల్- 49 బంతుల్లో 2023లో ముంబైపై👉శుబ్మన్ గిల్- 50 బంతుల్లో 2024లో చెన్నైపై👉సాయి సుదర్శన్- 50 బంతుల్లో 2024లో చెన్నైపైఐపీఎల్లో కెప్టెన్గా అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్లు👉విరాట్ కోహ్లి- 5👉కేఎల్ రాహుల్- 3👉శుబ్మన్ గిల్- 2.కాగా గుజరాత్తో మ్యాచ్లోనూ రాజస్తాన్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడాడు. 47 బంతులలో 96 పరుగులు చేశాడు. అయితే, గిల్ సెంచరీతో చెలరేగి అతడి ఇన్నింగ్స్కు విలువ లేకుండా చేసి పడేశాడు.చదవండి: మేము ఇక్కడిదాకా రావటమే గొప్ప: రియాన్ పరాగ్ -
గుజరాత్ ఘనంగా ఫైనల్కు
ఐపీఎల్లో ఫైనల్ చేరేందుకు రెండో క్వాలిఫయర్లో గుజరాత్ విజయలక్ష్యం 215 పరుగులు... కానీ నాకౌట్ మ్యాచ్లోనూ ఒత్తిడి లేకుండా శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్ జోడీ తమ ఆటతో దీనిని చాలా చిన్నదిగా మార్చేశారు. విధ్వంసక ప్రదర్శన లేకుండానే తమదైన శైలిలో ఓపెనర్లు 77 బంతుల్లోనే 167 పరుగులు జోడించడంతో టైటాన్స్ ఫైనల్ చేరడం లాంఛనంగా మారిపోయింది. కీలక పోరులో రాజస్తాన్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. అంతకుముందు మరోసారి సెంచరీ చేజారినా... వైభవ్ సూర్యవంశీ తుఫాన్ బ్యాటింగ్తోనే రాయల్స్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది. తమ సొంతగడ్డపై ఫైనల్ ఆడనున్న గుజరాత్... తుది పోరులో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించి రెండోసారి టైటిల్ సాధిస్తుందా చూడాలి. న్యూ చండీగఢ్: మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ మూడోసారి ఐపీఎల్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్–2లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ (47 బంతుల్లో 96; 8 ఫోర్లు, 7 సిక్స్లు) వరుసగా రెండో మ్యాచ్లోనూ సెంచరీ అవకాశం కోల్పోయాడు. రవీంద్ర జడేజా (35 బంతుల్లో 45 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, డొనొవాన్ ఫెరీరా (11 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్లు) చివర్లో చెలరేగాడు. అనంతరం గుజరాత్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 219 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’కెప్టెన్ శుబ్మన్ గిల్ (53 బంతుల్లో 104; 15 ఫోర్లు, 3 సిక్స్లు) ఐపీఎల్లో ఐదో సెంచరీతో చెలరేగగా... సాయి సుదర్శన్ (32 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. రేపు అహ్మదాబాద్లో జరిగే ఫైనల్లో బెంగళూరుతో గుజరాత్ తలపడుతుంది. వైభవ్ దూకుడు... గత మ్యాచ్లతో పోలిస్తే వైభవ్ ఈసారి కాస్త ఓపికను ప్రదర్శించాడు. తొలి ఓవర్లోనే జైస్వాల్ (1), తర్వాతి ఓవర్లో ధ్రువ్ జురేల్ (7) వెనుదిరగడం కూడా అందుకు కారణం. సిరాజ్ ఓవర్లో 3 ఫోర్లు బాదిన వైభవ్ 14వ బంతికిగానీ తన తొలి సిక్స్ కొట్టలేదు. అయితే నాలుగో స్థానంలో వచి్చన జడేజా చకచకా పరుగులు రాబట్టాడు. ప్రసిధ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను 19 బంతుల్లోనే 34 పరుగులకు చేరుకున్నాడు. అయితే మోచేతి గాయంతో రిటైర్డ్హర్ట్గా తప్పుకోగా, ఆ తర్వాత రాజస్తాన్ ఇన్నింగ్స్ తడబడింది. జడేజా మళ్లీ క్రీజ్లోకి వచి్చనా తర్వాతి 14 బంతుల్లో 11 పరుగులే చేయగలిగాడు. మరోవైపు 46 పరుగుల వద్ద సుదర్శన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన వైభవ్ 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని కెరీర్లో ఇదే అది నెమ్మదైన అర్ధ సెంచరీ! హాఫ్ సెంచరీ తర్వాత దూకుడు చూపించిన వైభవ్ తర్వాత ఆడిన 15 బంతుల్లో చెలరేగి 2 ఫోర్లు, 5 సిక్స్లతో 96కు చేరుకున్నాడు. ఈసారైనా సెంచరీ ఖాయం అనుకోగా... మళ్లీ సరిగ్గా గత మ్యాచ్ తరహాలోనే ర్యాంప్ షాట్ ఆడబోయి మరోసారి షార్ట్ థర్డ్మాన్లోకి క్యాచ్ ఇచ్చాడు. అయితే రషీద్ వేసిన చివరి ఓవర్లో రెచి్చపోయిన ఫెరీరా 4 సిక్స్లు బాదడంతో మొత్తం 27 పరుగులు లభించాయి. పరుగుల జుగల్బందీ... ఛేదనలో గుజరాత్ అలవోకగా దూసుకుపోయింది. రాయల్స్ పేలవ బౌలింగ్తో సుదర్శన్, గిల్ ఎలాంటి శ్రమ లేకుండా ఒకరితో మరొకరు పోటీ పడుతూ సునాయాసంగా పరుగులు రాబట్టారు. ఆర్చర్ వేసిన తొలి ఓవర్లో ఇద్దరూ చెరో 2 ఫోర్లతో మొదలు పెట్టగా, పవర్ప్లేలో జట్టు 10 ఫోర్లు సహా 69 పరుగులు రాబట్టింది. సుదర్శన్ 14 వద్ద ఉన్నప్పుడు ఫెరీరా, షనక సమన్వయ లోపంతో క్యాచ్ వదిలేయడం కూడా గుజరాత్కు కలిసొచి్చంది. ఆపై తుషార్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టి 30 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరిన గిల్... జడేజా ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్ కొట్టాడు. అనంతరం 26 బంతుల్లోనే సుదర్శన్ అర్ధ సెంచరీ కూడా పూర్తయింది. ఎట్టకేలకు 13వ ఓవర్లో సుదర్శన్ ‘హిట్ వికెట్’తో ఈ భారీ భాగస్వామ్యానికి తెర పడింది. సుదర్శన్ వరుసగా రెండో మ్యాచ్లోనూ అనూహ్యంగా ఒకే తరహాలో అవుట్ కావడం విశేషం. 47 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న గిల్, సుందర్ (16) తక్కువ వ్యవధిలో అవుటైనా... తెవాటియా (17 నాటౌట్), బట్లర్ (9 నాటౌట్) కలిసి ఆటను ముగించారు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) ప్రసిధ్ (బి) సిరాజ్ 1; వైభవ్ (సి) ప్రసిధ్ (బి) రబాడ 96; జురేల్ (సి) గిల్ (బి) రబాడ 7; జడేజా (నాటౌట్) 45; పరాగ్ (సి) రబాడ (బి) హోల్డర్ 11; షనక (సి) బట్లర్ (బి) హోల్డర్ 3; ఆర్చర్ (సి) బట్లర్ (బి) ప్రసిధ్ 7; ఫెరీరా (నాటౌట్) 38; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 214. వికెట్ల పతనం: 1–2, 2–9, 3–101, 4–109, 5–118, 6–172. బౌలింగ్: సిరాజ్ 4–0–42–1, రబాడ 4–0–35–2, ప్రసిధ్ 4–0–42–1, సుందర్ 2–0–23–0, హోల్డర్ 4–0–27–2, రషీద్ 2–0–45–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (హిట్ వికెట్) (బి) బ్రిజేశ్ 58; గిల్ (ఎల్బీ) (బి) ఆర్చర్ 104; బట్లర్ (నాటౌట్) 9; సుందర్ (సి) ఫెరీరా (బి) బర్గర్ 16; తెవాటియా (నాటౌట్) 17; ఎక్స్ట్రాలు 15; మొత్తం (18.4 ఓవర్లలో 3 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–167, 2–182, 3–201. బౌలింగ్: ఆర్చర్ 4–0–45–1, బర్గర్ 4–0–35–1, బ్రిజేశ్ 3.4–0–44–1, తుషార్ 3–0–34–0, యశ్రాజ్ 2–0–29–0, జడేజా 2–0–28–0. టాస్ గందరగోళం... మ్యాచ్కు ముందు టాస్ సమయంలో జరిగిన ఘటన తీవ్ర చర్చకు కారణమైంది. గిల్ నాణెం విసరగా, పరాగ్ ‘హెడ్స్’ చెప్పాడు. అయితే నాణెం కింద పడిన తర్వాత దానిని స్పష్టంగా చూపించకుండా రిఫరీ ప్రకాశ్ భట్ తాను ‘సరిగా వినలేదని’... టాస్ మళ్లీ వేయమని కోరాడు. దాంతో మళ్లీ నాణెం విసరగా, ఈసారి పరాగ్ టాస్ నెగ్గాడు. దాంతో గిల్ తన అసంతృప్తిని ప్రదర్శించాడు. గత మ్యాచ్లో వాడిన పిచ్ కాబట్టి తాను కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాడినని, అయితే దురదృష్టవశాత్తూ రిఫరీ సరిగా వినలేదని అతను వ్యాఖ్యానించాడు. మ్యాచ్లో టైటాన్స్ ఓడి ఉంటే ఇది కూడా పెద్ద వివాదానికి కారణమయ్యేదేమో. -
క్వాలిఫయర్ 2లో 'టాస్' డ్రామా.. పాపం శుబ్మన్ గిల్
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ క్వాలిఫయర్-2 మ్యాచ్ టాస్ సమయంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. టాస్ కోసం గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్, రాజస్తాన్ సారథి రియాన్ పరాగ్ మైదానంలోకి వచ్చారు. టాస్ ప్రెజెంటేర్ రవిశాస్త్రి వ్యవహరించగా.. మ్యాచ్ రిఫరీగా ప్రకాష్ భట్ ఉన్నారు. అయితే టాస్ టైమ్లో శుభ్మన్ గిల్ కాయిన్ గాల్లోకి విసిరాడు.రియాన్ పరాగ్ 'హెడ్స్' అని కాల్ చేశాడు. కానీ కాయిన్ కింద పడ్డాక 'టెయిల్స్' వచ్చింది. దీంతో టాస్ గెలిచానని గిల్ సంబరపడ్డాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. రియాన్ పరాగ్ చేసిన కాల్ తనకు సరిగ్గా వినపడలేదని మ్యాచ్ రిఫరీ ప్రకాష్ భట్ ప్రకటించారు. దీంతో మొదటి వేసిన టాస్ను రద్దు చేసి, రెండో సారి టాస్ వేయాల్సి వచ్చింది. రెండోసారి గిల్ కాయిన్ను విసరగా.. రియాన్ పరాగ్ గట్టిగా 'హెడ్స్' అని పిలిచాడు.ఈసారి కాయిన్ హెడ్స్ పడటంతో రాజస్తాన్ టాస్ గెలిచింది. పరాగ్ వెంటనే ఏమి ఆలోచించకుండా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఇక్కడ గిల్ కూడా టాస్ గెలిచి ఉంటే బ్యాటింగ్ ఎంచుకునేవాడని చెప్పడం కొసమెరుపు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కావాలనే గుజరాత్కు అన్యాయం చేశారని కామెంట్లు పెడుతున్నారు.చదవండి: రిషబ్ పంత్ సంచలన నిర్ణయంToss clip 🔥SCAM?? MISTAKE??FIXED??? OR WOTTT??? 🙊 #GTvsRR pic.twitter.com/atQe43C6Mm— CHICO (@CHICOx58) May 29, 2026 -
కోహ్లీకి షాక్.. వైభవ్ సూర్యవంశీకి చోటు!
ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరి దశకు చేరుకుంది. ఇవాళ్టి నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్లు జరగనున్నాయి. క్వాలిఫయర్-1 పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. అయితే సీజన్ ముగియకముందే మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ తన బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ జట్టును ప్రకటించాడు. అయితే ఈ జట్టులో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఊహించినట్లుగానే రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి స్థానం దక్కింది. ఓపెనింగ్లో వైభవ్కు జంటగా గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్ను ఎంపిక చేసిన బద్రీనాథ్ కీలకమైన మూడో స్థానానికి కోహ్లీని కాదని ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్కు చోటు కల్పించాడు.మిడిలార్డర్లో హెన్రిచ్ క్లాసెన్ (ఎస్ఆర్హెచ్), రజత్ పటీదార్ (ఆర్సీబీ), ఆల్రౌండర్ స్థానానికి కృనాల్ పాండ్యా (ఆర్సీబీ)ని ఎంపిక చేశాడు. జట్టులో ఏకైక స్పిన్నర్గా కేకేఆర్కు చెందిన సునీల్ నరైన్కు చోటు కల్పించిన బద్రీనాథ్ పేస్ బౌలింగ్ విభాగంలో ఏకంగా ఐదుగురిని ఎంపిక చేయడం విశేషం. పర్పుల్ క్యాప్ రేసులో ఉన్న భువనేశ్వర్ కుమార్ (ఆర్సీబీ)తో పాటు జోఫ్రా ఆర్చర్ (రాజస్తాన్), కగిసో రబాడ (గుజరాత్ టైటాన్స్)లను ఎంచుకున్నాడు. మరో పేసర్ స్థానానికి యువ బౌలర్లు ప్రిన్స్ యాదవ్, కార్తిక్ త్యాగిలను ఎంపిక చేశాడు. ఇక విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్లోనూ 500 పరుగుల మార్క్ను దాటాడు. కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్ కూడా స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ జట్టులో చోటు దక్కలేదు. ఇక ఓపెనర్లుగా ఎంపికైన వైభవ్ సూర్యవంశీ (14 మ్యాచ్ల్లో 583 పరుగులు), శుబ్మన్ గిల్ (14 మ్యాచ్ల్లో 616 పరుగులు) సాధించారు. ఇక ఆర్సీబీకి కీలక బౌలర్గా ఉన్న భువనేశ్వర్ కుమార్, గుజరాత్కు చెందిన రబాడ చెరో 24 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.ఇక బద్రీనాథ్ టీమిండియా తరఫున రెండు టెస్టులు, ఏడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్లో 95 మ్యాచ్లాడిన బద్రీనాథ్ 1441 పరుగులు సాధించాడు.బద్రీనాథ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్:వైభవ్ సూర్యవంశీ, శుబ్మాన్ గిల్, సాయి సుదర్శన్, హెన్రిచ్ క్లాసెన్, రజత్ పటీదార్, కృనాల్ పాండ్యా, సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్, జోఫ్రా ఆర్చర్, కగిసో రబాడ, ప్రిన్స్ యాదవ్/కార్తీక్ త్యాగి.చదవండి: విండీస్తో సిరీస్.. లంక జట్టుకు కొత్త కెప్టెన్! -
క్వాలిఫయర్-1 పోరు.. ఫైనల్ అడుగు ఎవరిది?
ఐపీఎల్లో అసలు సమరానికి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్, మాజీ చాంపియన్ జట్లు మరో టైటిల్ వేటలో ముందుగా ఫైనల్లోకి అడుగు పెట్టేందుకు సై అంటున్నాయి. చెరో 9 విజయాలతో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన బెంగళూరు, గుజరాత్ టీమ్ల మధ్య మ్యాచ్ తొలి క్వాలిఫయర్ విజేత నేరుగా తుది పోరుకు అర్హత సాధించే అవకాశం ఉండగా... ఓడిన జట్టు నిష్క్రమించకుండా రెండో క్వాలిఫయర్లో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ ఏడాది లీగ్ దశ రెండు ముఖాముఖి మ్యాచ్ల్లో ఇరు జట్లు చెరో విజయంతో సమంగా నిలిచాయి. ధర్మశాల: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి క్వాలిఫయర్–1 ద్వారా నేరుగా ఫైనల్కు చేరుతుందా? గత సీజన్లో ఎలిమినేటర్లో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న గుజరాత్ టైటాన్స్ మూడేళ్ల తర్వాత మరోసారి తుది పోరుకు అర్హత సాధిస్తుందా? ఈ రెండు మేటి జట్ల మధ్య మరికొన్ని గంటల్లో జరిగే సమరంలో పైచేయి ఎవరిదో తేలనుంది. టోర్నీ ఆసాంతం బెంగళూరు కీలక సమరాల్లో ఆధిక్యాన్ని అందుకొని ముందంజ వేయగా... రెండో అర్ధ భాగంలో అసాధారణంగా రాణించి గుజరాత్ దూసుకొచ్చింది. ఐపీఎల్లో ఇరు జట్లు ‘ప్లే ఆఫ్స్’లో తలపడటం ఇదే మొదటిసారి కావడం విశేషం కాగా... ఓవరాల్గా ముఖాముఖి పోరులో రెండు జట్లు 4–4తో సమానంగా ఉన్నాయి. ఆద్యంతం నిలకడగా..వరుసగా రెండో సీజన్లో టాప్–2తో ముగించడం బెంగళూరు నిలకడను చూపిస్తోంది. టోర్నీ తొలి అర్ధభాగంలో ఐదు మ్యాచ్లు గెలిచిన జట్టు రెండో అర్ధభాగంలో నాలుగు విజయాలు సాధించింది. ఈ సీజన్లో అతి తక్కువ మంది ఆటగాళ్లను ఉపయోగించిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. అంటే టీమ్ ఎంత స్థిరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లో కీలక ఆటగాళ్లంతా సత్తా చాటారు. వరుసగా నాలుగో సీజన్లో 500కు పైగా పరుగులు సాధించిన విరాట్ కోహ్లి (557) ముందుండి నడిపించగా... పడిక్కల్ (433), పాటీదార్ (393) తమ వంతు పాత్ర పోషించారు. ఒక సెంచరీ, 4 అర్ధసెంచరీలతో చెలరేగుతున్న కోహ్లిని తాజా ఫామ్లో నిలువరించడం అంత సులువు కాదు. బౌలింగ్లో భువనేశ్వర్ (24 వికెట్లు) టోరీ్నలో ఆర్సీబీకి విజయాలు అందిస్తూ అగ్ర స్థానంలో నిలిచాడు. హాజల్వుడ్, రసిఖ్ సలామ్లనుంచి అతనికి సరైన సహకారం లభించింది. ఇక ఆల్రౌండర్గా కృనాల్ పాండ్యా రాణిస్తున్నాడు. భిన్నమైన బౌలింగ్ శైలితో ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరిస్తున్న అతను... బ్యాటింగ్లో అవకాశం వచ్చిన ప్రతీసారి తన విలువను ప్రదర్శించాడు. టిమ్ డేవిడ్ కూడా కీలక ఇన్నింగ్స్లతో తన బాధ్యతను నెరవేర్చాడు. చివరి మ్యాచ్లో సన్రైజర్స్ చేతిలో దెబ్బతిన్నా... భువీ, హాజల్వుడ్ ఇచ్చే ఆరంభం మరోసారి ఆర్సీబీకి కీలకం కానుంది. స్వింగ్, సీమ్కు అనుకూలించే ధర్మశాల మైదానం వారి ప్రదర్శనకు సరైన వేదిక కాగలదు. పూర్తి ఫిట్గా ఉంటే కోహ్లికి తోడుగా ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ చేయడం ఖాయం. లేదంటే వెంకటేశ్ అయ్యర్నే కొనసాగిస్తారు. స్పిన్నర్ సుయాశ్ స్థానంలో పేసర్ డఫీని ఆడించే అంశాన్ని కూడా మేనేజ్మెంట్ పరిశీలిస్తోంది. టాప్–3 బ్యాటింగ్తోనే..గుజరాత్ జట్టు ధర్మశాలలో ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఇది కొంత ప్రతికూలమే అయినా... పదునైన పేస్ బౌలింగ్ బృందం ఆ లోటు కనపడనీయకుండా చేయగలదు. సిరాజ్, రబాడ అద్భుతంగా బౌలింగ్ చేస్తుండగా, అర్షద్ ఖాన్ కూడా నిలకడగా రాణించాడు. రబాడ కూడా 24 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, తక్కువ వికెట్లే (17) తీసినా... సిరాజ్ ఎంతో ప్రభావం చూపించాడు. ఆల్రౌండర్ హోల్డర్ పేస్ బౌలింగ్ కూడా జట్టుకు అదనపు బలంగా మారింది. రషీద్ ఖాన్ ఎప్పటిలాగే మరోసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తే బెంగళూరు మిడిలార్డర్ను కట్టడి చేయగలడు. గత మ్యాచ్లో ఆర్సీబీని గుజరాత్ ఓడించడంలో అతనిదే ప్రధాన (2/19) పాత్ర. పిచ్ పరిస్థితిని బట్టి ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిధ్ లేదా సాయికిషోర్లలో ఒకరికి చాన్స్ లభిస్తుంది. బ్యాటింగ్లో మరోసారి టైటాన్స్ టాప్–3పైనే ఆధారపడుతోంది. సాయిసుదర్శన్ (638), శుబ్మన్ గిల్ (616), జోస్ బట్లర్ (469) చెలరేగడంతోనే టైటాన్స్ ప్రస్థానం ప్లే ఆఫ్స్ వరకు చేరింది. వాషింగ్టన్ సుందర్ (303) కూడా నిలకడగా తన వంతు పాత్ర పోషించాడు.పిచ్, వాతావరణంభారీ స్కోర్లకు వేదిక ఇది. ఈ సీజన్లో ధర్మశాల మైదానంలో మూడు లీగ్ మ్యాచ్లు జరిగాయి. ఐదు ఇన్నింగ్స్లలో 200కు పైగా స్కోరు నమోదు కాగా, మరో ఇన్నింగ్స్లో 199 పరుగులు వచ్చాయి. డే మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ నెగ్గగా... సాయంత్రం జరిగిన రెండు మ్యాచ్లలో కూడా ఛేదన చేసిన టీమ్ విజయం సాధించింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ సమయంలో బ్యాట్ను తాకిన బంతి వాతావరణం కారణంగా చాలా వేగంగా దూసుకుపోవడం ఖాయం. పంజాబ్పై ముంబై గెలిచిన మ్యాచ్లో ఇది బాగా కనిపించింది. వర్షసూచన లేదు. The steepest climb of the season, but the view from the top is a spot in the Final! 🏔️Dharamshala is READY for the #Qualifier1 🏟️#TATAIPL | #TheFinalLeap | #RCBvGT | @RCBTweets | @gujarat_titans pic.twitter.com/sCdPkNMzyZ— IndianPremierLeague (@IPL) May 25, 2026 చదవండి: ఈ చిత్రం చూశారా.. వైభవ్ ఫ్యామిలీ మొత్తం ఒకేలా! -
BCCI: వరల్డ్కప్ ఓపెనర్ రేసులో ఊహించని పేరు!
భారత క్రికెట్లో సరికొత్త సంచలనం వైభవ్ సూర్యవంశీ. గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఈ బిహారీ పిల్లాడు.. ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో)తో దుమ్ములేపాడు. ఆ తర్వాత భారత అండర్-19 జట్టు తరఫున, వరల్డ్కప్-2025లో సత్తా చాటాడు.గాలివాటం కాదుప్రపంచకప్ ఫైనల్లో భారీ విధ్వంసకర శతకం (80 బంతుల్లో 175)తో రాణించిన వైభవ్.. భారత్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్-2026లోనూ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా దుమ్ములేపుతున్నాడు. పదమూడు మ్యాచ్లలో కలిపి 579 పరుగులు సాధించాడు. తద్వారా తన ప్రదర్శనలు గాలివాటం కాదని నిరూపించుకున్నాడు.భారత్-‘ఎ’ జట్టులో చోటుఈ నేపథ్యంలో పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే, బీసీసీఐ మాత్రం తొలుత అతడిని భారత్-‘ఎ’ జట్టులో ఆడించాలని నిర్ణయించింది. శ్రీలంకలో జరిగే ముక్కోణపు వన్డే సిరీస్కు అతడిని ఎంపిక చేసింది. లంక, అఫ్గన్ ‘ఎ’ జట్లతో తలపడే ఈ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్.రోహిత్కు గండంఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి ఇప్పటి నుంచే ఓపెనింగ్ జోడీపై టీమిండియా యాజమాన్యం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దిగ్గజ ఓపెనర్ రోహిత్ శర్మను ఫిట్నెస్ కారణాల దృష్ట్యా టోర్నీ నుంచి తప్పించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో కెప్టెన్ శుబ్మన్ గిల్కు జోడీగా ఇషాన్ కిషన్ను ఆడిస్తూ.. బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్ను ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇందుకు తగ్గట్లుగానే అఫ్గన్తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్కు ఇషాన్ ఎంపికయ్యాడు.జైసూ ఎదురుచూపులుఇక రోహిత్ శర్మ ఫిట్నెస్కు లోబడి.. ఈ సిరీస్లో ఆడతాడని బీసీసీఐ తెలిపింది. మరోవైపు.. అఫ్గన్తో ఏకైక టెస్టుకు ఎంపికైన యశస్వి జైస్వాల్ను వన్డేల నుంచి మాత్రం పక్కనపెట్టారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఓ వార్త సంచలనంగా మారింది.శ్రీలంకలో భారత్-‘ఎ’ జట్టు తరఫున గనుక నిలకడగా రాణిస్తే.. వన్డే వరల్డ్కప్-2027 నేపథ్యంలో వైభవ్ పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారన్నది దాని సారాంశం. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు క్రిక్బ్లాగర్తో మాట్లాడుతూ..ఫామ్ కొనసాగిస్తే వన్డే వరల్డ్కప్ జట్టులో చోటు‘‘వైభవ్ సూర్యవంశీ త్వరలోనే టీమిండియాకు ఆడబోతున్నాడు. భారత్-ఎ తరఫున అతడి ప్రదర్శనను బట్టి ఎంత త్వరగా జాతీయ జట్టులోకి వస్తాడన్నది తెలుస్తుంది. సెలక్టర్లు అతడి ఆట తీరును నిశితంగా గమనిస్తున్నారు. అతడు ఇలాగే నిలకడగా ఆడుతూ.. ఫామ్ కొనసాగిస్తే వన్డే వరల్డ్కప్-2027 ఆడే భారత జట్టులో చోటు దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అతడికి ఆకాశమే హద్దు’’ అని పేర్కొన్నాయి. కాగా ఒకవేళ 15 ఏళ్ల వైభవ్ గనుక ఊహించని రీతిలో ఈ జట్టులోకి వస్తే నిజంగా అదొక సంచలనమే అవుతుంది.చదవండి: ‘నేను పుట్టకముందు సచిన్ అరంగేట్రం.. ఆ రికార్డు బద్దలు కొడతా’ -
గుజరాత్ ఓపెనర్కు అశ్విన్ చురకలు!
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ నిలకడ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 14 మ్యాచ్లాడిన సాయి సుదర్శన్ 157 స్ట్రైక్రేట్తో 638 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో లీడింగ్లో కొనసాగుతున్నాడు. అయితే సాయి సుదర్శన్ ప్రదర్శన బాగానే ఉన్నప్పటికీ బ్యాటింగ్లో ఇంకా దూకుడు పెంచాల్సిన అవసరముందని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చురకలు అంటించాడు.ఐపీఎల్లో స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తున్నప్పటికీ ఆఖరి ఓవర్లలో వేగంగా పరుగులు రాబట్టడంలో సాయి సుదర్శన్ విఫలమవుతున్నాడని తెలిపాడు. అశ్విన్ మాట్లాడుతూ..'నేను శుబ్మన్ గిల్ బ్యాటింగ్ను ప్రశంసించాలనుకుంటున్నా. గుజరాత్ టైటా న్స్ను అటు కెప్టెన్గా సమర్థంగా నడిపిస్తూనే బ్యాటర్గా రాణిస్తున్నాడు. ముఖ్యంగా పవర్ప్లేలో గిల్ పట్టుదలతో భారీ ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. కానీ సాయి సుదర్శన్ ప్రదర్శన మెచ్చుకునే రీతిలో ఉన్నప్పటికీ మోడ్రన్ టీ20 క్రికెట్కు సరిపోయేలా అతడు ఆడడం లేదు. సాయి సుదర్శన్ ఎక్కువగా సంప్రదాయబద్ధంగానే క్రికెట్ ఆడతాడు, కానీ ఇన్నింగ్స్ చివర్లో వేగంగా ఆడలేకపోతున్నాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో బ్యాటింగ్లో వేగం పెంచితే మాత్రం సాయి సుదర్శన్కు తిరుగుండకపోవచ్చు. ఆరెంజ్ క్యాప్లో లీడింగ్లో ఉన్నప్పటికీ సాయి సుదర్శన్ తన ప్రదర్శనను చాలా మెరుగుపరుచుకోవాల్సి ఉంది. అతడు దీనిని చేయగలడని ఆశిస్తున్నా. ఇక గిల్ బాగా ఆడుతున్నప్పటికీ తనలోని పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీయలేదని నాకు అనిపిస్తోంది.' అంటూ చెప్పుకొచ్చాడు. గురువారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 89 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (84), కెప్టెన్ గిల్ (64) అర్థశతకాలతో రాణించారు. జాస్ బట్లర్ (57 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్కింగ్స్ 13.4 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. శివమ్ దూబే (47) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. మ్యాచ్లో ఓటమితో సీఎస్కే టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: ఆటగాళ్లకు అవమానం.. పాక్ జట్టులో సంక్షోభం! -
చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
ఐపీఎల్ 2026లో అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ సత్తాచాటాడు. ఈ మ్యాచ్లో గిల్ కేవలం 37 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్స్ర్లతో 64 పరుగులు చేశాడు. దీంతో ఈ ఏడాది సీజన్లో శుభ్మన్ 600 పరుగుల మైలు రాయిని దాటేశాడు. కెప్టెన్గా గిల్ ఒకే సీజన్లో 600 పరుగులను పూర్తి చేసుకోవడం ఇది రెండో సారి. ఈ క్రమంలో 26 ఏళ్ల గిల్ పలు అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గిల్ సాధించిన రికార్డులు ఇవే👉ఐపీఎల్ చరిత్రలో 27 ఏళ్ల వయస్సులోపు కెప్టెన్గా ఒకటి కంటే ఎక్కువ సీజన్లలో 600 ప్లస్ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా గిల్ నిలిచాడు. గతంలో ఆర్సీబీ కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లి 27 ఏళ్ల వయస్సు లోపు కేవలం ఒక్క సీజన్లో మాత్రం ఈ ఫీట్ సాధించాడు. తాజా మ్యాచ్తో కోహ్లిని గిల్ అధిగమించాడు.👉అదేవిధంగా వరుస సీజన్లలో కెప్టెన్గా 600కు పైగా పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడైన కెప్టెన్గా గిల్ నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ కేఎల్ రాహుల్( 29 ఏళ్ల వయసులో) పేరిట ఉండేది.👉27 ఏళ్లు నిండకముందే ఒక ఆటగాడిగా ఐపీఎల్లో మూడు వేర్వేరు సీజన్లలో 600 ప్లస్ పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్గా గిల్ రికార్డులకెక్కాడు.👉ఐపీఎల్ చరిత్రలో వరుస సీజన్లలో కెప్టెన్గా 600 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మూడో సారథిగా గిల్ నిలిచాడు. అంతకుముందు డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్ మాత్రమే ఈ ఘనత సాధించారు.ఇక మ్యాచ్లో సీఎస్కేపై 89 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్తో పాటు సాయి సుదర్శన్ (53 బంతుల్లో 84), జోస్ బట్లర్ (27 బంతుల్లో 57 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీలతో రాణించారు. సీఎస్కే బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్, అన్షుల్ కాంబోజ్, ముకేశ్ చౌదరి తలా వికెట్ సాధించారు. అనంతరం 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే.. 13.4 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ, రషీద్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టి సీఎస్కేను దెబ్బ తీశారు. -
గుజరాత్ ఓపెనర్ల ప్రపంచ రికార్డు
చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఐపీఎల్-2026లో భాగంగా గురువారం నాటి ఈ పోరులో వీరిద్దరు అర్ధ శతకాలతో రాణించారు.కెప్టెన్ గిల్ 37 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేయగా.. సాయి సుదర్శన్ 53 బంతులు ఎదుర్కొని 84 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.74 బంతుల్లో 125 పరుగులుఇక చెన్నైతో మ్యాచ్లో సాయి- గిల్ కలిసి తొలి వికెట్కు 74 బంతుల్లో 125 పరుగులు జోడించారు. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘనత సాధించారు. సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ- ట్రవిస్ హెడ్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టారు.ఐపీఎల్లో అత్యధికసార్లు వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్ జోడీగా సాయి సుదర్శన్- శుబ్మన్ గిల్ నిలిచారు. అంతేకాదు.. పాకిస్తాన్ బ్యాటర్లు బాబర్ ఆజం- మహ్మద్ రిజ్వాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు సమం చేశారు. టీ20 క్రికెట్లో అత్యధికసార్లు వందకు పైగా పరుగులు జోడీగా నిలిచారు.ఐపీఎల్లో అత్యధికసార్లు 100కు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్ జోడీలు👉సాయి సుదర్శన్- శుబ్మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్)- ఏడుసార్లు👉అభిషేక్ శర్మ- ట్రవిస్ హెడ్ (సన్రైజర్స్ హైదరాబాద్)- ఆరుసార్లు👉శిఖర్ ధావన్- డేవిడ్ వార్నర్ (సన్రైజర్స్ హైదరాబాద్)- ఆరుసార్లు👉జానీ బెయిర్ స్టో- డేవిడ్ వార్నర్ (సన్రైజర్స్ హైదరాబాద్)ఐదుసార్లు👉ఫాఫ్ డుప్లెసిస్- విరాట్ కోహ్లి (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) ఐదుసార్లుటీ20 క్రికెట్లో అత్యధికంగా పదిసార్లు 100కు పైగా పరుగులు జోడించిన జంటలు👉బాబర్ ఆజం- మహ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్- కరాచీ కింగ్స్)👉ఏబీ డివిల్లియర్స్- విరాట్ కోహ్లి (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)👉క్రిస్ గేల్- విరాట్ కోహ్లి (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)👉సాయి సుదర్శన్- శుబ్మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్)మ్యాచ్ విషయానికొస్తే.. చెన్నైతో మ్యాచ్లో గుజరాత్ ఓపెనర్లు కెప్టెన్ శుబ్మన్ గిల్ (37 బంతుల్లో 64), సాయి సుదర్శన్ (53 బంతుల్లో 84) అర్ధ శతకాలతో రాణించారు. వీరికి తోడు వన్డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ మెరుపు హాఫ్ సెంచరీ (27 బంతుల్లో 57 నాటౌట్)తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ నాలుగు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.చదవండి: మా చేతిలో పాక్ ఓటమి బాధించింది: బంగ్లాదేశ్ కోచ్6️⃣th fifty in TATA IPL 2026 for Shubman Gill! 👏GT skipper’s consistent run continues as he brings up his second-fastest fifty in the league! #TATAIPL Race to Playoffs 2026 👉 #GTvCSK | LIVE NOW https://t.co/BgI4AiRKkW pic.twitter.com/9aqFJiS8UL— Star Sports (@StarSportsIndia) May 21, 2026 -
సీఎస్కేపై గుజరాత్ ఘన విజయం
అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 89 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 13.4 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(17 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 47) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ, రషీద్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టి చెన్నై పతనాన్ని శాసించారు.Updates:సీఎస్కే ఏడో వికెట్ డౌన్రషీద్ ఖాన్ వేసిన 13వ ఓవర్లో సీఎస్కే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి బంతికి కాంబోజ్(19) అవుట్ కాగా.. నాలుగో బంతికి బ్రెవిస్(8) పెవిలియన్కు చేరాడు.శివమ్ దూబే(17 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 47) రూపంలో సీఎస్కే ఆరో వికెట్ కోల్పోయింది. 11 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 123/6దూకుడుగా ఆడుతున్న దూబే10 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. శివమ్ దూబే దూకుడుగా ఆడుతున్నాడు. 15 బంతుల్లో 41 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్2.3: సిరాజ్ బౌలింగ్లో ప్రసిద్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ఉర్విల్ పటేల్ (0). స్కోరు: 36-3(3.2)కార్తిక్ శర్మ 6, మాథ్యూ షార్ట్ 13 పరుగులతో ఉన్నారు. విజయానికి 194 పరుగులు కావాలి.2.2: సిరాజ్ బౌలింగ్లో రుతురాజ్ బౌల్డ్ (7 బంతుల్లో 16)సంజూ శాంసన్ డకౌట్ఇన్నింగ్స్ తొలి బంతికే చెన్నై తమ ఓపెనర్ సంజూ శాంసన్ (0) వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి సంజూ వెనుదిరిగాడు. మాథ్యూ షార్ట్కు తోడుగా రుతురాజ్ గైక్వాడ్ క్రీజులోకి వచ్చాడు.గుజరాత్ భారీ స్కోరు!ఓపెనర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ (37 బంతుల్లో 64), సాయి సుదర్శన్ (53 బంతుల్లో 84) అర్ధ శతకాలతో రాణించి బలమైన పునాది వేశారు. వీరికి తోడు వన్డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ మెరుపు హాఫ్ సెంచరీ (27 బంతుల్లో 57 నాటౌట్)తో దుమ్ములేపాడు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ నాలుగు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్ గిల్ను అవుట్ చేయగా.. అన్షుల్ కాంబోజ్ సాయి వికెట్ దక్కిచుకున్నాడు. ముకేశ్ చౌదరి వాషింగ్టన్ సుందర్ (7)ను పెవిలియన్కు పంపగా.. రాహుల్ తెవాటియా (0) రనౌట్ అయ్యాడు.వాషీ అవుట్19.6: ముకేశ్ చౌదరి బౌలింగ్లో పెవిలియన్ చేరిన వాషీ (7).మూడో వికెట్ డౌన్18.3: రాహుల్ తెవాటియా (0) రనౌట్. మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్. స్కోరు: 207-3(18.3). వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి వచ్చాడు.సాయి సుదర్శన్ అవుట్18.2: అన్షుల్ కాంబోజ్ బౌలింగ్లో మాథ్యూ షార్ట్కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్గా వెనుదిరిగిన సాయి సుదర్శన్. 53 బంతుల్లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసిన సాయి. రాహుల్ తెవాటియా క్రీజులోకి రాగా.. బట్లర్ 43 పరుగులతో ఉన్నాడు. గుజరాత్ డబుల్ సెంచరీ17.6: గుర్జప్నీత్ బౌలింగ్లో బట్లర్ ఫోర్ తీయగా.. గుజరాత్ డబుల్ సెంచరీ మార్కు అందుకుంది. స్కోరు: 201-1(18). బట్లర్ 43, సుదర్శన్ 78 పరుగులతో ఉన్నారు.పదిహేను ఓవర్లలో గుజరాత్ స్కోరు: 159-1జోస్ బట్లర్ 26, సాయి సుదర్శన్ 57 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్12.2: గిల్ రూపంలో గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్లో శివం దూబేకు క్యాచ్ ఇచ్చి.. 64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గిల్ పెవిలియన్ చేరాడు.మొత్తంగా 37 బంతులు ఎదుర్కొన్న గిల్ ఖాతాలో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. స్కోరు: 129-1. జోస్ బట్లర్ క్రీజులోకి రాగా.. సుదర్శన్ 51 పరుగులతో ఉన్నాడు.సాయి సుదర్శన్ ఫిఫ్టీ11.1: నూర్ అహ్మద్ బౌలింగ్లో సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న సాయి సుదర్శన్. ఈ సీజన్లో అతడికి ఇది వరుసగా ఐదో అర్ధ శతకం.పది ఓవర్లలో గుజరాత్ స్కోరు: 111-0ఓపెనర్లు గిల్ 30 బంతుల్లో 62, సుదర్శన్ 30 బంతుల్లో 43 పరుగులతో ఉన్నారు.గిల్ అర్ధ శతకం6.6: నూర్ అహ్మద్ బౌలింగ్లో సిక్సర్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్న శుబ్మన్ గిల్. 23 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్న గిల్. స్కోరు: 78-0.పవర్ ప్లేలో గుజరాత్ స్కోరు: 62-0 (6)గిల్ 18 బంతుల్లో 35, సుదర్శన్ 18 బంతుల్లో 21 పరుగులతో ఉన్నారు.హాఫ్ సెంచరీ5.1: అన్షుల్ కాంబోజ్ బౌలింగ్లో సాయి సుదర్శన్ ఫోర్ బాదగా.. గుజరాత్ యాభై పరుగుల మార్కు అందుకుంది.తొలి ఓవర్లో గుజరాత్ స్కోరు: 8-0ముకేశ్ చౌదరి చెన్నై బౌలింగ్ ఎటాక్ మొదలుపెట్టగా.. గిల్ ఏడు, సాయి సుదర్శన్ ఒక పరుగుతో ఉన్నారు.టాస్ గెలిచిన చెన్నై ఐపీఎల్-2026లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందుగా టాప్-4లో అడుగుపెట్టగా.. సన్రైజర్స్ హైదరాబాద్ కీలక మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించి అర్హత సాధించింది. తమతో పాటు గుజరాత్ టైటాన్స్ను కూడా ప్లే ఆఫ్స్నకు తీసుకువెళ్లింది.మిగిలిన ఒక్క స్థానం కోసంఇక మిగిలిన ఒక్క స్థానం కోసం ఐదు జట్లు (రాజస్తాన్, పంజాబ్, కోల్కతా, చెన్నై, ఢిల్లీ) అధికారికంగా రేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై తమ లీగ్ దశలో భాగంగా ఆఖరి మ్యాచ్లో అద్భుతం జరగాలని కోరుకుంటోంది. ఇందుకు పటిష్ట గుజరాత్ టైటాన్స్తో గురువారం తలపడేందుకు సిద్ధమైంది.తుదిజట్లలో మార్పులు ఇవీఅహ్మదాబాద్ వేదికగా ఇరుజట్ల మధ్య మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసినట్లు వెల్లడించాడు. అకీల్ హొసేన్ స్థానంలో గుర్జప్నీత్ సింగ్, ప్రశాంత్ వీర్ స్థానంలో మాథ్యూ షార్ట్ వచ్చినట్లు తెలిపాడు.ఇక గుజరాత్ టైటాన్స్ సైతం తమ తుదిజట్టులో ఒక మార్పు చేసినట్లు కెప్టెన్ శుబ్మన్ గిల్ పేర్కొన్నాడు. సాయి కిషోర్ స్థానంలో ప్రసిద్ కృష్ణను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు.గుజరాత్ వర్సెస్ చెన్నై తుదిజట్లుగుజరాత్సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, కగిసో రబడ, అర్షద్ ఖాన్, మహ్మద్ సిరాజ్.చెన్నైసంజు శాంసన్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, ముకేశ్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్. -
BCCI: రోహిత్ శర్మకు బై.. బై!.. వరల్డ్కప్ జట్టులోకి అతడు?
టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ భవితవ్యంపై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. భారత్కు రెండు ప్రపంచకప్ ట్రోఫీలు అందించిన ఈ మాజీ కెప్టెన్.. వన్డే వరల్డ్కప్-2027లో పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సన్నిహిత వర్గాలు తాజాగా వెల్లడించిన వివరాలే ఇందుకు కారణం.టైటిల్ గెలిచిన తర్వాత వేటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన తర్వాత అనూహ్య రీతిలో రోహిత్ శర్మ (Rohit Sharma)ను వన్డే కెప్టెన్సీ నుంచీ తప్పించింది బీసీసీఐ. ప్రస్తుతం కేవలం యాభై ఓవర్ల ఫార్మాట్లోనే హిట్మ్యాన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఐసీసీ టైటిల్ గెలిచిన తర్వాత అతడిపై వేటు వేసింది యాజమాన్యం.ప్రస్తుతం కేవలం బ్యాటర్గా కొనసాగుతున్న 39 ఏళ్ల రోహిత్ శర్మ ఊహించని రీతిలో సన్నబడ్డాడు. దాదాపు పది కిలోలకు పైగా బరువు తగ్గి ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో సత్తా చాటాడు. స్వదేశంలోనూ మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు.ఫిట్నెస్ సమస్యలుఇదిలా ఉంటే.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికినప్పటికీ ఐపీఎల్లో రోహిత్ శర్మ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్తో కొనసాగుతున్న అతడు 2026 సీజన్లో తొడ కండరాల గాయం వల్ల కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు.ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్కు సెలక్టర్లు అతడిని ఎంపిక చేసినప్పటికీ.. ఫిట్నెస్కు లోబడి ఈ సిరీస్లో పాల్గొంటాడని స్పష్టం చేశారు. ఈ క్రమంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ సంచలన కథనం వెలువరించింది.బాగా సన్నబడ్డాడు.. కానీ రోహిత్ భవిష్యత్ గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు గత మూడు వారాల్లో రోహిత్ ఎప్పుడూ రిపోర్టు చేయలేదు. అతడు బాగా సన్నబడ్డాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అతడి శరీరం యాభై ఓవర్ల ఫార్మాట్కు సిద్ధంగా ఉందా? లేదా? అన్న అంశంపై ఆందోళన నెలకొంది.జట్టులో ఉంటే అతడు యాభై ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఐపీఎల్ మాదిరి వన్డే క్రికెట్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ లేదు కదా!.. నలభై ఏళ్ల వయసుకు దగ్గరపడుతున్న తరుణంలో రోహిత్ శరీరం ఎలా స్పందిస్తుందన్నది ముఖ్యం.రోహిత్కు బై.. బై!.. జైసూకు లైన్ క్లియర్!నిజానికి వరల్డ్కప్ టోర్నీకి ముందు ఆడే వన్డేల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. కాబట్టి రోహిత్కు ప్రత్యామ్నాయంగా బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్ను సిద్ధం చేయాల్సి ఉంది. ఇషాన్ కిషన్ ఇప్పటికే వన్డే జట్టులోకి వచ్చాడు.అతడు కూడా ఓపెనింగ్ చేయగలడు. వన్డే వరల్డ్కప్ జట్టులో రోహిత్ ఫిట్నెస్ కారణాల దృష్ట్యా చోటు దక్కించుకోలేకపోయినా.. శుబ్మన్ గిల్ లేదంటే యశస్వి జైస్వాల్ గాయపడినా మరో బ్యాకప్ ఓపెనర్ను కూడా సిద్ధం చేసుకుంటే బాగుంటుంది’’ అని తెలిపినట్లు సదరు కథనం పేర్కొంది. అగార్కర్ సంకేతాలుకాగా చాలా ఏళ్లుగా.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ- ప్రస్తుత సారథి శుబ్మన్ గిల్ భారత వన్డే జట్టు ఓపెనింగ్ జోడీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల స్పందించే క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ కంటే ముందు ఓపెనర్గా యశస్వి జైస్వాల్కే తాము ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశాడు. తద్వారా రోహిత్కు ఉద్వాసన పలికి.. జైసూను బ్యాకప్ ఓపెనర్గా ఎంపిక చేస్తామనే సంకేతాలు ఇచ్చాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.చదవండి: హార్దిక్ పాండ్యాను శిక్షించిన బీసీసీఐ -
పంత్ డిమోషన్ వెనుక అతడిదే కీలకపాత్ర!
అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్టు మ్యాచ్కు గిల్ నేతృత్వంలో 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్సీ కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే పంత్ డిమోషన్ వెనుక గిల్ కీలకపాత్ర పోషించాడంటూ ఒక అభిమాని సంచలన ఆరోపణలు చేయడం ఆసక్తి రేపింది. పంత్ వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఒక అభిమాని ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టుకు పంత్ సోదరి సాక్షి లైక్ కొట్టింది. 'పంత్ వైస్ కెప్టెన్సీ పదవి ఊడిపోవడానికి తెర వెనుక కెప్టెన్ శుబ్మన్ గిల్ పెద్ద రాజకీయమే నడిపాడు. తన పదవికి ఉన్న ముప్పును తొలగించుకోవడానికే వైస్ కెప్టెన్సీకి పంత్ను కాదని రాహుల్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది’ అంటూ పోస్టు పెట్టాడు. పంత్ భవిష్యత్తులో టెస్టు కెప్టెన్ అయ్యే అవకాశం ఉండడంతోనే గిల్ ఇలా చేసి ఉండొచ్చని సదరు అభిమాని ఆరోపించాడు. అయితే ఇదంతా ఒక అభిమాని ఎలాంటి ఆధారాలు లేకుండా తన అభిప్రాయంగా పోస్టును పెట్టడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే పంత్ సోదరి సాక్షి అభిమాని పెట్టిన పోస్టును లైక్ చేస్తూ ‘ఇది నిజమే అయి ఉండొచ్చు’ అని పేర్కొనడం ఆసక్తిని రేపింది. అయితే అభిమాని పెట్టిన పోస్టుకు లైక్ కొట్టింది నిజంగా పంత్ సోదరి సాక్షినా? కాదా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ పోస్టుపై సోషల్మీడియాలో అభిమానులు రెండు విధాలుగా స్పందించారు. కొందరు పంత్కు సపోర్ట్ చేస్తే, మరికొందరు గిల్కు మద్దతుగా పోస్టులు పెట్టారు. ఈ సంగతి పక్కనబెడితే యాక్సిడెంట్ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి పంత్ పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. 2025లో ఇంగ్లండ్ టూర్లో పంత్ సరైన ప్రదర్శన చేయలేదు. దీంతో వన్డే, టీ20 జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. అయితే టెస్టుల్లో పంత్కు మంచి రికార్డు ఉండడంతో ఆఫ్గన్తో టెస్టుకు ఎంపిక చేశారు. కానీ తుది జట్టులో ఉంటాడా లేడా అన్నది చూడాలి. ఇక ఐపీఎల్ 2026 సీజన్లోనూ పంత్ పెద్దగా రాణించలేదు. 132 మ్యాచ్లాడి కేవలం 286 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు లక్నో సూపర్జెయింట్స్ కెప్టెన్గా పంత్ జట్టును ప్లేఆఫ్స్ చేర్చడంలోనూ విఫలమయ్యాడు. వరుస ఓటములతో ఈ సీజన్లో లక్నో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.🚨 Rishabh Pant’s sister has liked an Instagram reel that says Shubman Gill has played politics with Rishabh Pant and removed him from the Vice Captaincy so that he don't have any competition in Test captaincy. 🚨Someone should tell her, that India lost 2-0 vs South Africa at… pic.twitter.com/DpNs4ACLKu— Ahmed Says (@AhmedGT_) May 20, 2026 View this post on Instagram A post shared by Pahul Walia (@cricketwithpahul)చదవండి: ప్లేఆఫ్స్ ముంగిట ఆర్సీబీకి గుడ్న్యూస్! -
నితీశ్ రెడ్డి, ఇషాన్కు లక్కీ ఛాన్స్.. పాపం పంత్!
అఫ్గనిస్తాన్తో టెస్టు, వన్డే సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. శుబ్మన్ గిల్ సారథ్యంలో సొంతగడ్డపై అఫ్గన్తో తలపడే జట్ల వివరాలను మంగళవారం వెల్లడించింది. ఇందులో ప్రధానంగా గమనించదగ్గ అంశాలు ఏమిటంటే..పాపం పంత్!ఐపీఎల్-2026లో వరుస వైఫల్యాలతో సతమతమైన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్కు సెలక్టర్లు షాకిచ్చారు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను టెస్టు జట్టు వైస్ కెప్టెన్ పదవి నుంచి తొలగించారు. పంత్ స్థానంలో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను గిల్ డిప్యూటీగా నియమించారు.అంతేకాదు వన్డే జట్టులోనూ పంత్కు చోటు దక్కలేదు. కేఎల్ రాహుల్తో కలిసి వికెట్ కీపర్ కోటాలో ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నాడు. కాగా 2023 అక్టోబరులో చివరగా టీమిండియా తరఫున వన్డే ఆడిన ఇషాన్ కిషన్.. ఈ సిరీస్తో రీఎంట్రీ ఇస్తున్నాడు. అతడికి ఇదొక గోల్డెన్ ఛాన్స్ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటిన ఈ జార్ఖండ్ పాకెట్ డైనమైట్.. ఏకంగా టీ20 ప్రపంచకప్-2026లో ఆడిన సంగతి తెలిసిందే. మూడేళ్ల తర్వాత వచ్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్.. ఐపీఎల్-2026లో సన్రైజర్స్ తరఫునా సత్తా చాటుతున్నాడు. వారిద్దరికి విశ్రాంతిఈ క్రమంలోనే వన్డే జట్టులోనూ అతడికి సెలక్టర్లు చోటిచ్చారు. నిజంగా అతడికి ఇదొక గోల్డెన్ ఛాన్స్ లాంటిదే. ఇక ముందుగా ఊహించినట్లుగానే ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. అతడిపై పనిభారాన్ని తగ్గించే క్రమంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.అయితే, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను కూడా ఈ సిరీస్లకు ఎంపిక చేయకపోవడం గమనార్హం. అతడికి కూడా విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. రంజీల్లో సత్తా చాటిన జమ్మూ కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఆకిబ్ నబీకి సెలక్టర్లు మొండిచేయి చూపారు.కొత్త ముఖాలకు చోటుతాజా ఎడిషన్లో ఆకిబ్ 60 వికెట్లు తీసినప్పటికీ అతడికి అవకాశం ఇవ్వలేదు. ఇక ఐపీఎల్, దేశీ క్రికెట్లో సత్తా చాటుతున్న యువ పేసర్ ప్రిన్స్ యాదవ్కు మాత్రం తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు బీసీసీఐ ప్రిన్స్ను ఎంపిక చేసింది.రోహిత్, హార్దిక్ డౌటేఇక ప్రిన్స్ యాదవ్తో పాటు పేసర్ గుర్నూర్ బ్రార్, స్పిన్నర్ మానవ్ సుతార్, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ హర్ష్ దూబే వంటి కొత్త ఆటగాళ్లు కూడా తొలిసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. ప్రధాన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, దిగ్గజ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్నెస్కు లోబడి అందుబాటులో ఉంటారని బీసీసీఐ తెలిపింది.ఇప్పటికే టెస్టు జట్టులో పాతుకుపోయిన ఆంధ్ర పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి.. హార్దిక్ ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా వన్డే జట్టులోనూ చోటు సంపాదించాడు. ఇక వన్డే జట్టు వైస్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తన స్థానం నిలబెట్టుకోగా.. అఫ్గన్తో సిరీస్ ద్వారా దిగ్గజ బ్యాటర్, వన్డే రారాజు విరాట్ కోహ్లి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టుకు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, రోహిత్ శర్మ*, హార్దిక్ పాండ్యా*.టీమిండియా- అఫ్గనిస్తాన్ టెస్టు, వన్డే సిరీస్ షెడ్యూల్ఏకైక టెస్టు: జూన్ 6 నుంచి మొదలు- న్యూ చండీగఢ్- ఉదయం 9.30 గంటలకు ఆరంభంతొలి వన్డే: జూన్ 14- ధర్మశాల- మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభంరెండో వన్డే: జూన్ 17- లక్నో- మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభంమూడో వన్డే: జూన్ 20- చెన్నై- మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం.చదవండి: IPL 2026: ముంబై ఇండియన్స్ కీలక ప్లేయర్లు అవుట్ -
అఫ్గాన్తో సిరీస్కు భారత జట్టు ప్రకటన
ఐపీఎల్ 2026 సీజన్లో వేర్వేరు జట్లలో ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లు మళ్లీ ఒక్కటిగా కలిసి ఆడనున్నారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా స్వదేశంలో అప్గానిస్తాన్తో ఒక టెస్టు సహా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. ఏకైక టెస్టుతో పాటు వన్డేలకు శుబ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. జూన్ 6 నుంచి ముల్లన్పూర్ వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది.ఏకైక టెస్టు మ్యాచ్కు కెప్టెన్ గిల్కు కేఎల్ రాహుల్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. మరోవైపు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కోల్పోయాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున నిలకడగా రాణిస్తున్న ప్రిన్స్ యాదవ్కు తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు.ఇక టీమిండియా సీనియర్ క్రికెటర్లు రవీంద్ర జడేజాతో పాటు స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రాలకు అఫ్గాన్తో సిరీస్కు విశ్రాంతి కల్పించిట్లు బీసీసీఐ తెలిపింది. అఫ్గానిస్తాన్తో ఒకే టెస్టు మ్యాచ్ కావడంతో జడేజాను తప్పించామని, టీ20 ప్రపంచకప్ నుంచి బిజీగా క్రికెట్ ఆడుతున్న బుమ్రాను భవిష్యత్తులో టీమిండియా ఆడబోయే కీలక సిరీస్లను దృష్టిలో ఉంచుకొని అతడికి విశ్రాంతి కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఇక సీనియర్ ఆటగాడు కోహ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరో సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాలను వన్డే జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ, ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఐపీఎల్లో అదరగొడుతున్న టీమిండియా సీనియర్ భువనేశ్వర్ కుమార్ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. మరోవైపు మహ్మద్ షమీ విషయంలో సెలెక్షన్ కమిటీలో ఎలాంటి చర్చ జరగలేదని అగార్కర్ తెలిపాడు. ఇక తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి టెస్టు జట్టులో తన స్థానాన్ని నిలుపుకున్నాడు.అఫ్గాన్తో ఏకైక టెస్టుకు టీమిండియా: శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.అఫ్గాన్తో వన్డేలకు భారత జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, రోహిత్ శర్మ*, హార్దిక్ పాండ్యా*.మ్యాచ్ల షెడ్యూల్..జూన్ 6 నుంచి 10 వరకు- ఏకైక టెస్టు (ముల్లన్ పూర్, ఛండీగఢ్)తొలి వన్డే : జూన్ 14 (ధర్మశాల)రెండో వన్డే : జూన్ 17 (లక్నో)మూడో వన్డే : జూన్ 20 (చెన్నై)🚨 News 🚨Presenting #TeamIndia's squads for the @IDFCFIRSTBank Test match and the 3️⃣-match ODI series against Afghanistan in June 🙌#INDvAFG pic.twitter.com/hFiABALLld— BCCI (@BCCI) May 19, 2026📸The Men's Selection Committee Meeting for #TeamIndia's squad announcement for the upcoming @IDFCFIRSTBank Test match and the three-match ODI series against Afghanistan is underway in Guwahati.#INDvAFG pic.twitter.com/VlA94h1nFC— BCCI (@BCCI) May 19, 2026చదవండి: ధోని వీడ్కోలు.. ఒక శకం ముగిసింది! -
మాకు గెలిచే అర్హత లేదు.. తప్పంతా వాళ్లదే: గిల్
ఐపీఎల్-2026 ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖాయం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు కోల్కతా నైట్ రైడర్స్ షాకిచ్చింది. సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్లో ఆకాశమే హద్దుగా చెలరేగి.. గుజరాత్పై 29 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవం చేసుకుంది.ఈ నేపథ్యంలో కోల్కతా చేతిలో ఓటమి అనంతరం గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్ తమ జట్టు ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాటింగ్లో అదరగొట్టినా ఫీల్డింగ్లో తాము విఫలమయ్యామని.. క్యాచ్లు జారవిడిచి మ్యాచ్ను చేజార్చుకున్నామని పేర్కొన్నాడు.మాకు గెలిచే అర్హత లేదుఈ మేరకు.. ‘‘ఈ వికెట్ బాగుంది. ఇక్కడ 200- 210 పరుగులు స్కోరు చేయవచ్చు. మేము ఇక్కడ బాగా బ్యాటింగ్ చేశాము. ఈ విషయంలో ఆందోళన లేదు. అయితే, మా ఫీల్డింగ్ చెత్తగా సాగింది.మూడు సులువైన క్యాచ్లు వదిలేశాం. కాబట్టి ఈ మ్యాచ్లో గెలిచేందుకు మాకు అర్హత లేదనే చెప్తాను. ఏదేమైనా క్వాలిఫయర్స్కు చేరువవుతున్న సమయంలో ఇలాంటి ఉత్కంఠభరిత మ్యాచ్ మాకు మంచి ప్రాక్టీస్ను ఇచ్చింది.కాస్త విశ్రాంతి తీసుకున్న తర్వాత బలంగా తిరిగి వస్తాము. తదుపరి మ్యాచ్ మా సొంతమైదానంలో జరుగనుంది. అందుకోసం అహ్మదాబాద్ బయల్దేరుతాం. అక్కడి వికెట్కు అనుగుణంగా మా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాము’’ అని గిల్ పేర్కొన్నాడు. ఓటమికి ప్రధాన కారణం అదేఫీల్డింగ్ తప్పిదాలే తమ కొంపముంచాయని.. తమ ఓటమికి ప్రధాన కారణం అదేనని గిల్ తెలిపాడు. కాగా కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. జేసన్ హోల్డర్ బౌలింగ్లో ఇచ్చిన క్యాచ్ను గుజరాత్ వదిలేసింది. 200 games done, will there be 200 more? 😯Sunil Narine speaks about playing more and more for @kkriders 💜#TATAIPL | #KhelBindaas | #KKRvGT pic.twitter.com/m7m6Pj1isd— IndianPremierLeague (@IPL) May 16, 2026ఈ క్రమంలో అలెన్ తనకు లభించిన లైఫ్ను సద్వినియోగం చేసుకుని.. 35 బంతుల్లోనే 93 పరుగులు సాధించి జట్టు గెలుపునకు బాటలు వేశాడు.ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్ (28 బంతుల్లో 53 నాటౌట్), గిల్ (49 బంతుల్లో 85).. వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ (35 బంతుల్లో 57) అర్ధ శతకాలతో రాణించారు.అయితే, కేకేఆర్ విధించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో గుజరాత్ విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 218 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా విజయానికి 29 పరుగుల దూరంలో నిలిచిపోయింది.చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన కేకేఆర్ ఓపెనర్ -
గుజరాత్పై విజయం.. కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం
ఐపీఎల్-2026లో కోల్కతా నైట్రైడర్స్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో 29 పరుగుల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. 248 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ క్రీజులో ఉన్నంతసేపు గుజరాత్ లక్ష్యాన్ని అందుకుంటుందని అంతా భావించారు. కానీ సునీల్ నరైన్ బౌలింగ్లో గిల్ భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ కావడంతో మ్యాచ్ చేజారిపోయింది. చివరిలో సాయిసుదర్శన్, జోస్ బట్లర్ కాస్త దూకుడుగా ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయారు. గుజరాత్ బ్యాటర్లలో శుభ్మన్ గిల్ (49 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్లతో 85) టాప్ స్కోరర్గా నిలవగా.. బట్లర్(57), సాయిసుదర్శన్(53 నాటౌట్) రాణించారు.అంతకముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ ఫిన్ అలెన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 35 బంతుల్లో 10 సిక్సర్లు, 4 ఫోర్లుతో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు అంగ్క్రిష్ రఘువంశీ(44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్లతో 82), కామెరూన్ గ్రీన్(52) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్,సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు. -
ఓటమిలోనూ ఎస్ఆర్హెచ్ రికార్డుల వెల్లువ!
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) 82 పరుగుల తేడాతో దారుణ ఓటమిని చవిచూసింది. గుజరాత్ విధించిన 169 పరుగులను ఛేదించే క్రమంలో ఎస్ఆర్హెచ్ 86 పరుగులకే కుప్పకూలింది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ పలు చెత్త రికార్డులను తన పేరిట లిఖించుకుంది. అవి ఏంటనేది ఒకసారి పరిశీలిద్దాం.👉గుజరాత్తో మ్యాచ్లో 89 పరుగులకే కుప్పకూలిన ఎస్ఆర్హెచ్కు ఐపీఎల్లో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. 2019లో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో 96 పరుగులు, 2015లో ముంబైతో మ్యాచ్లో 113 పరుగులు, 2024లో కేకేఆర్తో మ్యాచ్లో 113 పరుగులు, 2020 సీజన్లో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో 114 పరుగులకు ఆలౌటైంది.👉ఐపీఎల్లో పరుగుల పరంగా (గుజరాత్ చేతిలో 82 పరుగుల తేడాతో) చూసుకుంటే ఎస్ఆర్హెచ్కు ఇదే అతిపెద్ద ఓటమి. 2025లో కేకేఆర్ చేతిలో 80 పరుగులు, 2024లో సీఎస్కే చేతిలో 78 పరుగులు, 2013లో సీఎస్కే చేతిలో 77 పరుగులు, 2014లో పంజాబ్ చేతిలో 72 పరుగులు, 2023లో రాజస్తాన్ చేతిలో 72 పరుగులతో భారీ ఓటములు చవిచూసింది.👉అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ చేసిన 86 పరుగులే అత్యల్ప స్కోరు. గతంలో గుజరాత్ టైటాన్స్ (2024లో ఢిల్లీతో మ్యాచ్లో 89 పరుగులు) ఇప్పటిదాకా అత్యల్పం. అంతకముందు ఇదే సీజన్లో ముంబైతో మ్యాచ్లో గుజరాత్ వంద పరుగులకు ఆలౌటైంది. 2014లో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో రాజస్తాన్ 102 పరుగులకు ఆలౌటైంది.👉ఐపీఎల్లో పరుగుల పరంగా గుజరాత్ టైటాన్స్కు (82 పరుగులు) ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ సీజన్లో రాజస్తాన్పై 77 పరుగులతో, 2023లో ముంబైపై 62 పరుగులతో, 2022లో లక్నోపై 62 పరుగులతో, 2025లో రాజస్తాన్పై 58 పరుగులతో భారీ విజయాలు అందుకుంది.👉ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచి ప్లేఆఫ్స్కు మరింత చేరువైంది. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న ఎస్ఆర్హెచ్ మిగిలిన రెండు మ్యాచ్లను సీఎస్కే, ఆర్సీబీతో ఆడనుంది. ఇందులో ఆర్సీబీతో మ్యాచ్ను సొంత గ్రౌండ్లో ఆడనుండడం ఎస్ఆర్హెచ్కు కలిసొచ్చే అంశం. ఈ రెండు మ్యాచ్ల్లోనూ ఎస్ఆర్హెచ్ నెగ్గితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లేఆఫ్స్కు చేరనుంది.చదవండి: ‘టైటిల్ మాదే.. రాసిపెట్టుకోండి’.. గిల్ హెచ్చరిక! -
‘టైటిల్ మాదే.. రాసిపెట్టుకోండి’.. గిల్ హెచ్చరిక!
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరుసగా ఐదో విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. మంగళవారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ 82 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 200 ప్లస్ స్కోర్లు కూడా ఈజీగా ఛేదిస్తున్న ఈ సీజన్లో 160 ప్లస్ స్కోరును కాపాడుకోవడం గుజరాత్కు మాత్రమే చెల్లింది. మ్యాచ్ విజయం అనంతరం గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్ మాట్లాడాడు. ‘అహ్మదాబాద్ వికెట్ పై 170 పరుగులు చేయడం కూడా కష్టమే. మేం 160-170 పరుగులు చేస్తే.. మా బౌలింగ్ అటాక్ ముందు ఆ స్కోర్ను ఛేదించడం అంత సులువు కాదని ముందే అంచనా వేశాం. ఈ మ్యాచ్లో మా వ్యూహం కూడా అదే. సన్రైజర్స్ బ్యాటింగ్ లైనప్, ముఖ్యంగా టాపార్డర్ను పడగొట్టడానికి మేం వేసిన ప్రణాళికలు పక్కాగా పనిచేశాయి.సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ ఈ స్లో పిచ్పై అద్భుతంగా రాణించారు. ఈ గెలుపు క్రెడిట్ వారికి ఇవ్వాల్సిందే. ఓ వైపు వికెట్లు పడిపోతున్నా.. వారిద్దరూ నిలబడి జట్టుకు ఆ స్కోర్ను అందించారు. మేము ఒక బ్రాండ్ క్రికెట్కు మాత్రమే పరిమితం అవ్వాలని అనుకోవడం లేదు. మేము ఒక నిర్దిష్ట శైలి లేదా బ్రాండ్ క్రికెట్ ఆడే జట్టు కాదని మీకు తెలుసు. వరుస విజయాలు ఊరికే రాలేదు. రాసిపెట్టుకోండి.. ఈసారి టైటిల్ కొట్టబోతున్నాం. పిచ్ను చూసి, పరిస్థితులను అంచనా వేసి ఆడి గెలిచే జట్టుగా ఉండాలని కోరుకుంటున్నాం. 240 పరుగులు చేసే వికెట్ అయితే కచ్చితంగా ఆ స్కోర్ కోసం ప్రయత్నిస్తాం. ముఖ్యంగా జాసన్ హోల్డర్.. మా టీమ్ గెలుపు సీక్రెట్. అతడు వేస్తున్న లెంగ్త్లు మా జట్టుకు చాలా ప్లస్ అవుతున్నాయి. దాదాపు ప్రతి మ్యాచ్లో హోల్డర్ వరుసగా నాలుగు ఓవర్లు వేస్తూ రాణిస్తూ మాకు గెలుపు మంత్రంగా మారిపోయాడు.’ అని గిల్ వెల్లడించాడు.చదవండి: ‘నన్ను పావుగా వాడుకొని కోహ్లీపై కుట్ర పన్నాగం’ -
లీకైన భారత టెస్ట్ జట్టు.. గుజరాత్ స్టార్ ప్లేయర్పై వేటు
ఐపీఎల్ 2026 తర్వాత స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే ఏకైక టెస్ట్ కోసం భారత జట్టును మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకముందే సోషల్మీడియా జట్టు వివరాలు లీకయ్యాయి.ఈ జట్టుకు కెప్టెన్గా శుభ్మన్ గిల్ కొనసాగనున్నాడు. సీనియర్లు కేఎల్ రాహుల్, పంత్, జడేజా, సిరాజ్, జైస్వాల్ కొనసాగనున్నారు. షమీ పునరాగమనం చేశాడు. ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా అన్షుల్ కంబోజ్కు అవకాశం దొరికింది. రంజీ ప్రదర్శనల ఆధారంగా ఆకిబ్ నబీ, హర్ష్ దూబేకు చోటు కల్పించారు.ఆసక్తికరంగా గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్పై వేటు పడింది. సాయి ఐపీఎల్ 2026లో మంచి ప్రదర్శనలు చేస్తున్నా, గత టెస్ట్ ప్రదర్శనల దృష్ట్యా అతనిని తప్పించినట్లు తెలుస్తోంది. సాయి స్థానంలో ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా చెలరేగుతున్న దేవ్దత్ పడిక్కల్కు ఛాన్స్ ఇచ్చారు. స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు.వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్కు సీనియర్లకంతా విశ్రాంతినిస్తారని ప్రచారం జరిగింది. లీకైన జట్టును బట్టి చూస్తే అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. మరో పక్క ఇదే జట్టు కొనసాగుతుందన్న గ్యారెంటీ అయితే లేదు. కేవలం సోషల్మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే ఇది. జట్టుపై త్వరలో అధికారిక ప్రకటన రావొచ్చు. ఒక్కటైతే గ్యారెంటీ జట్టు దాదాపుగా ఇలాగే ఉండవచ్చు. ఎందుకంటే సెలెక్టర్లు ఇప్పటికే జట్టును డిసైడ్ చేసినట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్ ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ 6 నుంచి ముల్లాన్పూర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కూడా ఆడనుంది. ఆ మ్యాచ్లు జూన్ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా జరుగనున్నాయి. సోషల్మీడియాలో ప్రచారం జరుగుతున్న భారత జట్టు:శుభ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్, ధృవ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా,కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ఆకిబ్ నబీ, హర్ష్ దూబే, మహ్మద్ షమీ, అన్షుల్ కంబోజ్ -
దుమ్ములేపిన రషీద్, గిల్.. టాప్-2కు దూసుకొచ్చిన గుజరాత్
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 16.3 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా 38 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, వైభవ్ సూర్యవంశీ (16 బంతుల్లో 36 పరుగులు) మరోసారి ఆకట్టుకున్నాడు. వీరిద్దరు మినహా మిగతావారు విఫలం కావడంతో రాజస్తాన్ లక్ష్య ఛేదనలో పూర్తిగా చతికిలపడింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 వికెట్లతో చెలరేగగా, జాసన్ హోల్డర్ మూడు వికెట్లు తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (84), సాయి సుదర్శన్ (55) అర్థసెంచరీలతో రాణించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (20 బంతుల్లో 37 నాటౌట్), రాహుల్ తెవాటియా (4 బంతుల్లో 14 నాటౌట్) రాణించడంతో గుజరాత్ 229 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో బ్రిజేశ్ శర్మ 2 వికెట్లు తీయగా, యష్రాజ్, జడేజా చెరొక వికెట్ తీశారు. గుజరాత్ టైటాన్స్ 11 మ్యాచ్ల్లో ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించి పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు వరుసగా రెండో ఓటమి చవిచూసిన రాజస్తాన్ ఐదో స్థానానికి పడిపోయింది.గుజరాత్ ఓపెనర్ల దూకుడు..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్కు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ శుభారంబాన్ని ఇచ్చారు. తొలి వికెట్కు ఈ ఇద్దరు శతక భాగస్వామ్యం (118 పరుగులు) జోడించి ఇన్నింగ్స్కు గట్టి పునాది వేశారు. అర్థసెంచరీ అనంతరం సాయి సుదర్శన్ వెనుదిరిగినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన బట్లర్, వాషింగ్టన్ సుందర్లతో కలిసి గిల్ భాగస్వామ్యాలు నిర్మించాడు. చివర్లో సుందర్, తెవాటియా ధాటిగా ఆడడంతో గుజరాత్ 220 ప్లస్ స్కోరును దాటింది.చేధనలో చతికిలపడి..230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్కు వైభవ్ సూర్యవంశీ తన దనాధన్ ఇన్నింగ్స్తో మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే సూర్యవంశీ ఔటైన తర్వాత రాజస్తాన్ వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. జురేల్, జడేజాలు కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకోవడం మినహా ఏం చేయలేకపోయారు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన రాజస్తాన్ ఓటమి దిశగా పయనించింది. ఈ సీజన్లో గుజరాత్ చేతిలో రాజస్తాన్కు ఇది రెండో ఓటమి కావడం గమనార్హం.A 𝙏𝙞𝙩𝙖𝙣𝙞𝙘 𝙑𝙞𝙘𝙩𝙤𝙧𝙮 by 7⃣7⃣ runs✌️4⃣th consecutive win for @gujarat_titans as they move to no.2⃣ in the Points Table 🔢This is also #GT's biggest #TATAIPL win (by runs) 👏👏Scoreboard ▶️ https://t.co/t7CEEL9Bzp#KhelBindaas | #RRvGT pic.twitter.com/jXKWcdBfru— IndianPremierLeague (@IPL) May 9, 2026చదవండి: వైభవ్ ప్రపంచ రికార్డు.. ఐపీఎల్లో తొలి క్రికెటర్గా! -
IPL 2026: రాజస్తాన్పై గుజరాత్ టైటాన్స్ విజయం
శనివారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 16.3 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓటమి దిశగా రాజస్తాన్ రాయల్స్గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ ఓటమి దిశగా పయనిస్తోంది. 15 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. దాసున్ షనక 9 పరుగులతో క్రీజులో ఉన్నాడు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. కష్టాల్లో రాజస్తాన్గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ కష్టాల్లో పడింది. రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఫెరీరా (4)ను క్లీన్బౌల్డ్ చేసిన రషీద్ ఖాన్ అంతకముందు 24 పరుగులు చేసిన ధ్రువ్ జురేల్ను కూడా క్లీన్బౌల్డ్గా పెవిలియన్ చేర్చాడు. 8 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ 5 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. రెండో వికెట్ కోల్పోయిన రాజస్తాన్మూడు పరుగులు చేసిన స్టాండ్ ఇన్ కెప్టెన్ జైస్వాల్ రబాడ బౌలింగ్లో వెనుదిరగడంతో రాజస్తాన్ 40 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. సూర్యవంశీ (38) ఔట్.. రాజస్తాన్ 38/1230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ ఛేదనను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల సునామీ సృష్టించాడు. అయితే సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో మూడు ఫోర్లు బాదిన సూర్యవంశీ 36 పరుగులు చేసి అర్షద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో రాజస్తాన్ 38 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.రాజస్తాన్ లక్ష్యం 230 పరుగులుఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ రాజస్తాన్ రాయల్స్ ముందు 230 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (84), సాయి సుదర్శన్ (55) అర్థసెంచరీలతో రాణించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (20 బంతుల్లో 37 నాటౌట్), రాహుల్ తెవాటియా (4 బంతుల్లో 14 నాటౌట్) రాణించడంతో గుజరాత్ 229 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో బ్రిజేశ్ శర్మ 2 వికెట్లు తీయగా, యష్రాజ్, జడేజా చెరొక వికెట్ తీశారు.గిల్ (84) ఔట్.. మూడో వికెట్ డౌన్84 పరుగులు చేసిన శుబ్మన్ గిల్ బ్రిజేశ్ శర్మ బౌలింగ్లో తుషార్ దేశ్పాండేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో గుజరాత్ టైటాన్స్ 185 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.16 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. గిల్ (78), వాషింగ్టన్ సుందర్ 17 పరుగులతో ఆడుతున్నాడు.మరో వికెట్ డౌన్జోస్ బట్లర్ కూడా ఔటయ్యాడు. రవీంద్ర జడేజా బౌలింగ్లో డోనోన్కు క్యాచ్ ఇచ్చి 13 పరుగులకే జోస్ బట్లర్ వెనుదిరిగాడు. స్కోరు 15 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 166గా ఉంది.సాయి సుదర్శన్ ఔట్ సాయి సుదర్శన్ 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. మరోవైపు, శుభ్మన్ గిల్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. క్రీజులో బట్లర్ 6 పరుగులతో ఉన్నాడు. సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ గుజరాత్ టైటాన్స్ స్కోరు 10 ఓవర్లకి వికెట్ నష్టపోకుండా 114గా ఉంది. సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ బాదాడు. 32 బంతుల్లో 52 పరుగుల చేశాడు. శుభ్మన్ గిల్ 29 బంతుల్లో 49 పరుగులు చేశాడు. గుజరాత్ ఓపెనర్లు దూకుడురాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ దూకుడు ప్రదర్శిస్తోంది. 6 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 81 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (39), శుబ్మన్ గిల్ (32) పరుగులతో ఆడుతున్నారు.4 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (34), గిల్ (7) పరుగులతో ఆడుతున్నారు.ఒకే ఓవర్లో 18 పరుగులిచ్చిన ఆర్చర్గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తొలి ఓవర్లోనే వైడ్ల రూపంలో 18 పరుగులు సమర్పించుకున్నాడు. 2 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. సుదర్శన్ (14), గిల్ (2) పరుగులతో ఆడుతున్నారు.టాస్ నెగ్గిన రాజస్తాన్..టాస్ గెలిచిన రాజస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. పరాగ్ తొడ కండరాల గాయంతో దూరం కావడంతో ఈ మ్యాచ్కు రాజస్తాన్ను జైస్వాల్ నడిపించనున్నాడు. ఇక గుజరాత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. మానవ్ సుతర్ స్థానంలో ప్రసిధ్ క్రిష్ణ జట్టులోకి వచ్చాడు. మరోవైపు రాజస్తాన్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. హెట్మైర్తో పాటు యష్రాజ్ పుంజా తుదిజట్టులోకి వచ్చాడు. ఈ సీజన్లో తొలి అంచె పోటీలో రాజస్తాన్పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. సొంతగడ్డపై మ్యాచ్ ఆడుతున్న రాజస్తాన్ గుజరాత్పై ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అన్నది చూడాలి. ముఖాముఖి పోరులో ఇప్పటివరకు ఇరుజట్లు తొమ్మిది మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో గుజరాత్ ఆరుసార్లు నెగ్గితే.. రాజస్తాన్ మూడుసార్లు విజయాన్ని అందుకుంది. జైపూర్లో కూడా గుజరాత్దే పైచేయి. ఇక్కడ ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండింటిలో గుజరాత్ గెలుపొందింది.తుది జట్లు:గుజరాత్ టైటాన్స్: శుభ్మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), నిషాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్.రాజస్తాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్(కెప్టెన్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబే, దాసున్ షనక, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా.గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ సబ్స్: ప్రసిద్ధ్ కృష్ణ, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కుమార్ కుశాగ్రారాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ సబ్లు: వైభవ్ సూర్యవంశీ, ఆడమ్ మిల్నే, రవి సింగ్, సుశాంత్ మిశ్రా, రవి బిష్ణోయ్ -
పాక్ జట్టులో రోహిత్, గిల్..!
పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఓ ఘోర తప్పిదం జరిగింది. బ్రాడ్కాస్టర్ చేసిన ఓ భారీ పొరపాటు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాక్ ఆటగాళ్ల గణాంకాలు చూపాల్సిన సమయంలో, స్క్రీన్పై భారత క్రికెటర్ల పేర్లు కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.పాక్-బంగ్లా మధ్య తొలి టెస్ట్ మే 8న షేర్-ఏ బంగ్లా స్టేడియం వేదికగా ప్రారంభమైంది. రెండో రోజు ఆట సందర్భంగా బ్రాడ్కాస్టర్ పాక్ జట్టు టెస్ట్ గణాంకాలను ప్రదర్శించే గ్రాఫిక్ను చూపించింది. అయితే అందులో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, అర్షదీప్ సింగ్ తదితర భారత ఆటగాళ్ల పేర్లు కనిపించాయి.ఈ తప్పిదం వెంటనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానులు మీమ్స్, సరదా కామెంట్లతో బ్రాడ్కాస్టర్ను ట్రోల్ చేశారు. కొందరు ఐపీఎల్ మోడ్లోనే గ్రాఫిక్స్ తయారు చేశారా..? అంటూ సెటైర్లు వేశారు. మరోవైపు పాక్ అభిమానులు మాత్రం ఇది సాధారణ తప్పిదం కాదని, నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే, బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసింది. కెప్టెన్ నజ్ముల్ హొసేన్ షాంటో అద్భుత సెంచరీతో జట్టును నిలబెట్టాడు. మొమినుల్ హక్ 91, ముష్ఫికర్ రహీం 71 పరుగులతో కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 413 పరుగులకు ఆలౌటైంది. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ ఐదు వికెట్లతో మెరవగా.. షాహీన్ అఫ్రిది 3, హసన్ అలీ, నౌమన్ అలీ తలో వికెట్ తీశారు. కాగా, ఈ మ్యాచ్కు పాక్ స్టార్ బ్యాటర్ గాయం కారణంగా దూరమయ్యాడు. -
పెళ్లిపై నిశ్శబ్దం వీడిన శుభ్మన్ గిల్
టీమిండియా టెస్ట్, వన్డే.. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ తన పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ ఇవాళ (మే 3) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ టాస్ సమయంలో గిల్ తన వివాహంపై క్లారిటీ ఇచ్చాడు.త్వరలో పెళ్లి చేసుకోబోతున్నావా..? అని ప్రెజెంటర్ డ్యానీ మోరిసన్ అడగగా, అలాంటిదేమీ లేదని ఒక్క మాటలో సమాధానం చెప్పాడు. ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలతో గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లైంది.గిల్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ను పెళ్లి చేసుకోబోతున్నాడని కొందరు.. బాలీవుడ్ నటీమణులు సారా అలీ ఖాన్, అవ్నీత్ కౌర్, సోనమ్ బజ్వా ప్రేమాయణం సాగిస్తున్నాడని మరికొందరు పుకార్లు పుట్టించారు. వీటిలో ఎంత మాత్రం నిజం లేదని తాజాగా గిల్ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్దమవుతుంది.తన పెళ్లి, డేటింగ్పై వచ్చిన వార్తలను గిల్ గతంలోనూ చాలాసార్లు ఖండించాడు. తాను సింగిల్గానే ఉన్నానని క్లారిటీ ఇచ్చాడు. అయినా గిల్ ఏదో దాస్తున్నాడని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.ఇదిలా ఉంటే, గిల్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనూ గత సీజన్లలో మాదిరిగానే రాణిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడి 3 అర్ద సెంచరీల సాయంతో 373 పరుగులు చేసి, లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.ఈ సీజన్లో గిల్ నేతృత్వంలోని గుజరాత్ ప్లే ఆఫ్స్ రేసులో ప్రధాన పోటీదారుగా ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.ఇవాళ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ ఆదిలోనే ప్రత్యర్దిని చావు దెబ్బకొట్టినప్పటికీ.. సూర్యాంశ్ షేడ్గే (58), మార్కస్ స్టోయినిస్ (29) కలిసి పంజాబ్ను తిరిగి గేమ్లోకి తెచ్చారు. వీరిద్దరు ఆరో వికెట్కు 78 పరుగులు జోడించి బ్యాటింగ్ను కొనసాగిస్తున్నారు. 15.5 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 126-5గా ఉంది. -
Kohli vs Gill: ఏడిపించిన కోహ్లి.. ఇచ్చిపడేసిన గిల్!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు గుజరాత్ టైటాన్స్ షాకిచ్చింది. గత వారం ఎదురైన పరాభవానికి సొంతగడ్డపై బదులు తీర్చుకుంది. ఐపీఎల్-2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గురువారం గుజరాత్- ఆర్సీబీ తలపడ్డాయి.కోహ్లి, గిల్ స్కోర్లు ఎంతంటే?ఇందులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 19.2 ఓవర్లలో 155 పరుగులుకు ఆలౌటైంది. దేవ్దత్ పడిక్కల్ (24 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా, విరాట్ కోహ్లి (13 బంతుల్లో 28; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.అనంతరం గుజరాత్ 15.5 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి గెలిచింది. శుబ్మన్ గిల్ (18 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్లు), జోస్ బట్లర్ (19 బంతుల్లో 39; 2 ఫోర్లు, 4 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. 12 పరుగులు చేయడంతోపాటు, 2 వికెట్లు పడగొట్టి, 3 క్యాచ్లు పట్టిన జేసన్ హోల్డర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.పక్కా ప్రత్యర్థిలా వ్యవహరించిన కోహ్లి.. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ దిగ్గజం, కింగ్ కోహ్లి- గుజరాత్ కెప్టెన్, ప్రిన్స్ గిల్ మధ్య చోటు చేసుకున్న సరదా సన్నివేశాలు వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ సమయంలో గిల్ పట్ల పక్కా ప్రత్యర్థిలా వ్యవహరించిన కోహ్లి.. ఆ తర్వాత మాత్రం అతడిని టీజ్ చేశాడు. ఇందుకు గిల్ కూడా గట్టిగానే బదులిచ్చాడు.Vintage #ViratKohli energy! 🔥KING catches, PRINCE departs - Absolute cinema! 🙌 🎯#TATAIPL 2026 ➡️ #GTvRCB | LIVE NOW 👉https://t.co/K8vuSzrZ1d pic.twitter.com/jCKi1Qo4zA— Star Sports (@StarSportsIndia) April 30, 2026ఏడిపించిన కోహ్లి.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో గిల్ ఇచ్చిన క్యాచ్ పట్టిన కోహ్లి.. అతడు పెవిలియన్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఆసమయంలో కోహ్లి వైల్డ్గా సెలబ్రేట్ చేసుకోగా.. గిల్ నిరాశగా వెనుదిరిగాడు. ఈ క్రమంలో గిల్ డగౌట్లో కూర్చోగా.. ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి.. అతడిని అవుట్ చేసిన విధానాన్ని సైగలతో చూపిస్తూ టీజ్ చేశాడు.Virat Kohli: "Ye le thullu, kaise catch out kiya 😭"Shubman Gill: "Scoreboard dekh lo, kya hi farak padta hai? Hum jeet rahe hain!"Kohli: "Run-out hote-hote bacha tu, kaise bhaag raha tha!"Gill: "Chhodo jaane do, Virat bhai hai ❤️" pic.twitter.com/KCWwV0xDWk— GillTheWill (@GillTheWill77) May 1, 2026ఇచ్చిపడేసిన గిల్!ఇందుకు గిల్.. ‘స్కోరు బోర్డు చూడు భయ్యా.. నేను అవుటైతే ఏంటి? గెలిచేది మేమే’ అన్నట్లుగా తానూ సైగలతోనే కౌంటర్ వేశాడు. ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ ఆర్సీబీపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన తర్వాత.. ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో గిల్- కోహ్లి ఆలింగనం చేసుకుని నవ్వులు చిందించారు.అయితే, ఆ తర్వాత కూడా గిల్ కోహ్లి, ఆర్సీబీని వదిలిపెట్టలేదు. కోహ్లి, తానూ ఉన్న ఫొటోను పంచుకుంటూ.. ‘జేసన్ హోల్డర్.. ప్లే హోల్డ్ బోల్డ్.. ఈరోజు రాత్రి అత్యద్భుతమైన ప్రదర్శన’ అంటూ ఆర్సీబీ, కోహ్లిని టార్గెట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఇచ్చిన క్యాచ్ను హోల్డర్ పట్టాడు.అయితే, ఇది క్లీన్ క్యాచ్ కాదని కోహ్లి వాదించగా.. థర్డ్ అంపైర్ మాత్రం అవుట్గా ప్రకటించాడు. దీంతో వివాదం చెలరేగింది. అయితే, ఫలితం మాత్రం గుజరాత్కు మేలు చేసింది. మరోవైపు.. ఆర్సీబీ ప్లే బోల్డ్ అన్న నినాదంతో ముందుకు సాగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ రెండింటినీ ప్రస్తావిస్తూ గిల్ ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు.చదవండి: కింద పడేసి తొక్కుతా బిడ్డా!.. క్లాసెన్ మాస్ వార్నింగ్! The award for the best senior and junior duo goes to… 😁#TATAIPL #GTvRCB #ShubmanGill #ViratKohli pic.twitter.com/4lccF2wv9u— Star Sports (@StarSportsIndia) April 30, 2026 -
కోహ్లి విధ్వంసం చేసినా కోలుకున్నాం.. ఆ క్రెడిట్ మొత్తం వారికే: గిల్
ఐపీఎల్-2026లో గుజరాత్ టైటాన్స్ ఐదో విజయాన్ని నమోదు చేసింది. గురువారం అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టైటాన్స్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. మొదట ఆర్సీబీని 155 పరుగులకే కట్టడి చేసిన గుజరాత్.. అనంతరం బ్యాటింగ్లోనూ సత్తాచాటింది.15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంపై మ్యాచ్ అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందిచాడు. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన తమ బౌలర్లను గిల్ కొనియాడాడు."కీలక మ్యాచ్లో విజయం సాధించింనందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఇలాంటి వికెట్పై ప్రత్యర్ధి జట్టును 160 పరుగులలోపు కట్డడి చేయడం అంత సులువు కాదు. కానీ మా బౌలర్లు మాత్రం ఆసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఫీల్డింగ్లో కూడా మెరుగ్గా రాణించాము. గత మ్యాచ్తో పోలిస్తే ఈ రోజు అన్ని విభాగాల్లో మేము పై చేయి సాధించాము. ప్రతీ ఒక్కరూ జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. రెండో ఓవర్లో విరాట్ భాయ్ వరుస బౌండరీలతో విరుచుకుపడ్డారు. కానీ ఆ తర్వాత మేము పుంజుకున్న తీరు చాలా బాగుంది. అతడి వికెట్తో తిరిగి మేము గేమ్లోకి వచ్చాము. నేనేమి ఈ మ్యాచ్లో ప్రత్యేక ప్రణాళికలతో బరిలోకి దిగలేదు. నేను ఒక రిథమ్లో ఉన్నాను అన్పించింది. మొదటి బంతికి కాస్త అదృష్టం తోడైంది, రెండో బంతి నాకు కావాల్సిన స్లాట్లో పడింది. దీంతో ఈ రోజునే నాదే అనుకున్నాను.అందుకే బౌలర్లపై ఎదురుదాడికి దిగాను. ఇక తెవాటియా మా జట్టులో కీలక సభ్యుడు. ఈ రోజు అతడు మ్యాచ్ ఫినిష్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. జోస్ భాయ్ మ్యాచ్ ఫినిష్ చేస్తాడనుకున్నా. కానీ ఆ తర్వాత వరుసగా మూడు వికెట్లు కోల్పోయాము. ఆ బాధ్యతను తెవాటియా తీసుకుని మ్యాచ్ను ముగించాడు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో గిల్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో గిల్ 43 పరుగులు చేశాడు.చదవండి: IPL 2026: పాటిదార్ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి? -
గిల్ వివాదాస్పద పోస్టు.. బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు!
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్కింగ్స్ విషయంలో ఆన్ఫీల్డ్, ఆఫ్ఫీల్డ్లో చాలా ఆసక్తికర విషయాలు జరుగుతున్నాయి. ఆరం భంలో వరుస పరాజయాలు, మధ్యలో విజయాలు, మళ్లీ ఓటమి.. ఇలా సీఎస్కే తన ప్రయాణాన్ని పడుతూ లేస్తూ కొనసాగిస్తుంది. అయితే ఆన్ఫీల్డ్లో ఇలా ఉంటే ఆఫ్ఫీల్డ్లో సీఎస్కే కు అవమానాలు జరుగుతున్నాయి. సీజన్ ఆరంభంలో ఆర్సీబీపై బీసీసీఐకి ఫిర్యాదు చేసిన సీఎస్కే తాజాగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్పై ఫిర్యాదు చేయడం ఆసక్తి కలిగించింది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ గిల్పై సీఎస్కే చేసిన ఫిర్యాదు కాపీ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అసలేం జరిగింది?ఆదివారం (ఏప్రిల్ 26) చెన్నై వేదికగా గుజరాత్ టైటాన్స్తో చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే) తలపడింది. అయితే ఈ మ్యాచ్లో సీఎస్కేపై గుజరాత్ 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్ విజయం అనంతరం గుజరాత్ కెప్టెన్ గిల్ తన ఇన్స్టాగ్రామ్లో సీఎస్కే ఫ్రాంచైజీని ట్రోల్ చేస్తూ పోస్ట్ చేశాడు. ఏఐతో రూపొందించిన తన ఫొటోను పంచుకున్న గిల్ చేతిలో పసుపు రంగు విజిల్ పట్టుకొని నవ్వుతూ కనిపించాడు. అయితే గిల్ పెట్టిన పోస్టు సీఎస్కే జెర్సీని, ఫ్రాంచైజీ నినాదం అయిన విజిల్ పోడును అవమానిస్తున్నట్లుగా ఉందంటూ సీఎస్కకే ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది నకిలీదా లేక నిజమైనదేనా అన్నది ఇంకా తెలియదు. అయితే సీఎస్కే ఫ్రాంచైజీ గిల్పై బీసీసీఐకి ఫిర్యాదు చేసిన కాపీ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.CSK filed another complaint this time against India skipper & star batter Shubham Gill... pic.twitter.com/w6iGlOydw1— The Cricket View (@TheCricketView) April 26, 2026గతంలో ఆర్సీబీపై ఫిర్యాదుఇక ఇదే సీజన్లో 11వ మ్యాచ్లో ఆర్సీబీ, సీఎస్కే తలపడ్డాయి. సీఎస్కే ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు ’దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ’ అంటూ ఓ ట్రాక్ను డీజే ప్లే చేశారు. అయితే ఇవి దక్షిణాదికి చెందిన ప్రజలు ఎక్కువగా తినే ఆహార పదార్థాలు. ఈ ట్రాక్పై సీఎస్కే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ’ అనే పదాలను వాడుతూ తమిళనాడు గుర్తింపును ఎగతాళి చేశారంటూ సీఎస్కే ఆర్సీబీ ఫ్రాంచైజీపై బీసీసీఐకి ఫిర్యాదులో చేసింది. కాగా ఐపీఎల్ 19వ సీజన్లో సీఎస్కే ఐదో ఓటమిని మూటగట్టుకుంది. సీఎస్కే విధించిన 159 పరుగుల టార్గెట్ను గుజరాత్ మరో 20 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. సాయి సుదర్శన్ (87), గిల్ (33), బట్లర్ (39 నాటౌట్) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.చదవండి: ‘వైభవ్పై అనుమానముంది.. డోపింగ్ టెస్ట్ చేయాల్సిందే!’ -
సీఎస్కే వర్సెస్ గుజరాత్ మ్యాచ్.. తుది జట్లు ఇవే
ఐపీఎల్-2026లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. గుజరాత్ జట్టులోకి అర్షద్ ఖాన్ రాగా.. సీఎస్కే జట్టులోకి ఉర్విల్ పటేల్ వచ్చాడు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), షారుక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, మానవ్ సుతార్చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, జామీ ఓవర్టన్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్ -
ఆ మూడు ఓవర్లలో తడబడ్డాం: గిల్
ఐపీఎల్ 2026లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్, ఓపెనర్ సాయి సుదర్శన్ (100) సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లి (81), పడిక్కల్ (55) చెలరేగడంతో ఆర్సీబీ మరో 7 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది.వాస్తవానికి గుజరాత్ ఈ మ్యాచ్లో ఇంకా భారీ స్కోర్ చేయాల్సింది. అయితే చివరి ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు అనూహ్యంగా పుంజుకొని వారిని కట్టడి చేశారు. ఛేదన సమయంలోనూ గుజరాత్కు పైచేయి సాధించే అవకాశం ఉండింది. స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు తీయగలిగినా, ఆతర్వాత ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచలేకపోయింది. చివరికి మూల్యం చెల్లించుకుంది.మ్యాచ్ అనంతరం గిల్ ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకున్నాడు. అతని మాటల్లో.. పవర్ప్లే ముగిసే సమయానికి మంచి స్థితిలో ఉన్నాం. కానీ, 16 నుంచి 19వ ఓవర్ వరకు ఆశించిన రీతిలో పరుగులు చేయలేకపోయాము. ఆ మూడు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా రాకపోవడం మ్యాచ్ గమనాన్ని మార్చేసింది.మధ్య ఓవర్లలో వికెట్లు తీయలేకపోయాంప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలంటే మధ్య ఓవర్లలో వికెట్లు తీయడం చాలా ముఖ్యం. అయితే, పవర్ప్లే తర్వాత మా బౌలర్లు ఆ పనిని చేయలేకపోయారు. ఆ సమయంలో కొన్ని మంచి బంతులు వేసినా, అవసరమైన స్థాయిలో లెంగ్త్ను మెయిన్టైన్ చేయలేకపోయారు.సుతార్కు బంతి ఇవ్వడంపై వివరణపిచ్ స్పిన్కు సహకరిస్తోందని తాను బ్యాటింగ్ చేసే సమయంలోనే గమనించాను. ముఖ్యంగా కృనాల్ వేసిన బంతులు బాగా టర్న్ అయ్యాయి. అందుకే చివర్లో మానవ్ సుతార్కు అవకాశం ఇచ్చాను.మరో రెండు వికెట్లు పడుంటే మ్యాచ్ మళ్లీ తమవైపు తిరిగేది.సాయి సుదర్శన్పై సరదా వ్యాఖ్యసాయి ఇటీవల రెండు మ్యాచ్ల్లో నిరాశపరిచినా, ఈ మ్యాచ్లో అద్భుతంగా పుంజుకున్నాడు. అతని ప్రదర్శనపై గిల్ ప్రశంసలు కురిపించాడు. వచ్చే మ్యాచ్లో అయినా సాయి తనకు పవర్ప్లేలో స్ట్రైక్ ఇస్తాడని ఆశిస్తున్నానంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. -
గిల్ స్థానంలో కెప్టెన్గా పంత్..?
ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే ఏకైక టెస్ట్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినివ్వడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. సీనియర్ల జాబితాలో కెప్టెన్ శుభ్మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నట్లు సమాచారం.ఒకవేళ గిల్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్కు దూరమైతే అతని స్థానంలో కెప్టెన్ ఎవరన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ నేపథ్యంలో గిల్కు ప్రత్యామ్నాయంగా ముగ్గురి పేర్లు పరిశీలను రావచ్చు. వీరిలో ముందుగా రిషబ్ పంత్ పేరు ఉంటుంది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా పేర్లు కూడా పరిశీలనలో ఉంటాయి.రిషబ్ పంత్ విషయానికొస్తే.. ప్రస్తుతం అతను భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్గా ఉన్నాడు. ఈ కారణంగా గిల్ స్థానంలో అతడే సహజమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. దూకుడు నాయకత్వం, మ్యాచ్ను ఒంటరిగా మలుపు తిప్పగల సామర్థ్యం పంత్ ప్రత్యేకత. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా దేశాల్లోని కఠిన పిచ్లపై సెంచరీలు సాధించడం అతని స్థాయి తెలియజేస్తుంది. ఇప్పటికే నాయకత్వ అనుభవం ఉండటం కూడా అతనికి అదనపు బలం.కేఎల్ రాహుల్భారత సెలెక్టర్లు ఒకవేళ పంత్కు కూడా విశ్రాంతినివ్వాలని భావిస్తే, తదుపరి ప్రత్యామ్నాయంగా కేఎల్ రాహుల్ ఉంటాడు. రాహుల్కు గతంలో భారత టెస్ట్ జట్టుకు సారథ్యం వహించిన అనుభవం ఉంది. 2022 బంగ్లాదేశ్ పర్యటనలో జట్టును విజయవంతంగా నడిపించడం అతని నాయకత్వ నైపుణ్యాన్ని నిరూపించింది.గిల్కు మూడో ప్రత్యామ్నాయ ఆప్షన్గా రవీంద్ర జడేజా ఉంటాడు. జడ్డూ జట్టులో అత్యంత అనుభవజ్ఞుల్లో ఒకరు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ కీలక పాత్ర పోషించే ఆల్రౌండర్గా జడేజా ఎప్పుడూ జట్టుకు ఆధారంగా ఉంటాడు. గతంలో వైస్ కెప్టెన్గా పనిచేసిన అనుభవం ఉంది. -
సెలెక్టర్ల పరిధిలో లేని గిల్, బుమ్రా
ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ఎంపికను భారత సెలెక్టర్లు ఇప్పటి నుంచే పరిశీలిస్తున్నారు. జూన్ 6 నుంచి న్యూ చంఢీఘడ్లో జరుగబోయే ఈ మ్యాచ్ కోసం సీనియర్లకు విశ్రాంతినివ్వాలని వారు యోచిస్తున్నారు. సీనియర్ల జాబితాలో కెప్టెన్ శుభ్మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగం కాకపోవడంతో సెలెక్టర్లు ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. వర్క్లోడ్ మరో కారణంగా తెలుస్తుంది.భారత పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్తో పాటు మూడు వన్డేలు కూడా ఆడనుంది. ఆతర్వాత భారత జట్టు రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్కు వెళ్లనుంది. అనంతరం భారత్ 5 టీ20లు, 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్కు వెళ్లనుంది. ఇంగ్లండ్ సిరీస్ నేపథ్యంలో భారత సెలెక్టర్లు గిల్, బుమ్రాకు విశ్రాంతినివ్వాలని అనుకుంటున్నారు. టీమిండియా-ఇంగ్లండ్ సిరీస్ జులై 1 నుంచి ప్రారంభమవుతుంది.ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ సిరీస్లకు గిల్, బుమ్రాకు విశ్రాంతినివ్వడానికి సెలెక్టర్ల వద్ద మరో కారణం కూడా ఉంది. 2027 వన్డే వరల్డ్కప్కు వీరిద్దరు కీలకం కాబటి, మెగా టోర్నీకి ముందు వీలైనంత విశ్రాంతినివ్వవచ్చు. గిల్, బుమ్రా ఇటీవల తరుచూ గాయాల బారిన పడుతుండటంతో సెలెక్టర్లు వీరి విషయంలో రిస్క్ తీసుకునే సాహసం చేయరు. ఒకవేళ ప్రపంచకప్ దృష్ట్యా వన్డేల్లో ఆడించాలని అనుకుంటే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు ఎంపిక చేయవచ్చు.బుమ్రా, గిల్ గైర్హాజరీలో ఆకిబ్ నబీ, దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి తదితర పేర్లను సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. వీరిలో నబీ పేరు ఖరారైందని సమాచారం. -
ముంబై చేతిలో పరాజయాన్ని బౌలర్లపై నెట్టిన గిల్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 20) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ 99 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. తిలక్ వర్మ (101 నాటౌట్) రికార్డు శతకంతో ముంబై ఇండియన్స్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. నాలుగు వరుస పరాజయాల తర్వాత ముంబైకి వచ్చిన మొదటి గెలుపు ఇది. ఈ మ్యాచ్లో ముంబై గెలిచి ఉండకపోయుంటే ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా సంక్లిష్టం అయ్యేవి. మరోవైపు గుజరాత్కు ఇది హ్యాట్రిక్ విజయాల తర్వాత తొలి పరాజయం. ఈ మ్యాచ్లో ముంబై నిర్దేశించిన 200 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ చేతులెత్తేసింది. అశ్వనీ కుమార్ (4-0-24-4), ఘజన్ఫర్ (2.5-0-17-2), సాంట్నర్ (3-0-16-2) ధాటికి 15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్మన్ గిల్ ఓటమిపై సమీక్షిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. మధ్య ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇవ్వడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డాడు.గిల్ మాటల్లో.. ఈ పిచ్పై 160-170 పరుగుల స్కోర్ చాలా ఎక్కువ. మా బౌలర్లు మధ్య ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయలేకపోవడం వల్ల ప్రత్యర్థి జట్టు అదనపు పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. వాటిని భవిష్యత్తులో అమలు చేయాల్సిన అవసరం ఉంది.ఈ ఓటమిని పెద్ద సమస్యగా చూడదలచుకోలేదు. చిన్న అవాంరంగానే పరిగణిస్తాం. ఇకపై బయట మైదానాల్లో జరిగే మ్యాచ్ల్లో తిరిగి విజయాల బాట పడతాం. జట్టు ప్రదర్శనను మెరుగుపరుచుకోవడానికి అవసరమైన మార్పులు చేసుకుంటాము.పిచ్పై మాట్లాడుతూ.. వికెట్ కొంచెం నెమ్మదిగా ఉంది. బంతి సరిగా బ్యాట్పైకి రాకపోవడం బౌలర్లకు సవాలుగా మారింది. కొన్ని బంతులు వేగంగా, మరికొన్ని నెమ్మదిగా, ఇంకొన్ని తక్కువ ఎత్తులో ఉండటం వల్ల సరైన లెంగ్త్ను నిరంతరం కొనసాగించలేకపోయాము. ముఖ్యంగా మధ్య ఓవర్లలో ఒకే లెంగ్త్ను కచ్చితంగా పాటించలేకపోవడం మా ప్రధాన లోపం.ప్రత్యర్థి బ్యాటింగ్ సమయంలో పిచ్లో మార్పులపై ప్రశ్నించగా.. పెద్దగా తేడా లేదని చెప్పాడు. అయితే తమ బ్యాటింగ్ సమయానికి కొంత మంచు ప్రభావం ఉండిందని అన్నాడు. ఇది ముంబై బౌలర్లకు కలిసొచ్చిందని పరోక్షంగా తెలిపాడు.మొత్తంగా, గిల్ ఈ మ్యాచ్లో జరిగిన తప్పిదాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకుంటే మళ్లీ విజయాల బాట వచ్చని నమ్మకం వ్యక్తం చేశాడు. కెప్టెన్గా తన జట్టును మళ్లీ సమతుల్యంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తానని స్పష్టం చేశాడు. -
కోల్ ‘కథ’ మారలేదు
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో మాజీ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్ల్లో ఓడిన రహానే సారథ్యంలోని నైట్రైడర్స్... మరో ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో కోల్కతాను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. పాతిక కోట్ల విలువైన ప్లేయర్ కామెరాన్ గ్రీన్ (55 బంతుల్లో 79; 7 ఫోర్లు, 4 సిక్స్లు) ఎట్టకేలకు రాణించగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. రషీద్ ఖాన్ను లక్ష్యంగా చేసుకున్న గ్రీన్ భారీ షాట్లతో పరుగులు రాబట్టాడు. గుజరాత్ ఫీల్డింగ్ లోపాలు కూడా అతడికి కలిసి రావడంతో ఈ సీజన్లో తొలి అర్ధశతకం తన పేరిట లిఖించుకున్నాడు. పావెల్ (27; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించగా... కెప్టెన్ అజింక్యా రహానే (0), రఘువంశీ (8), సీఫెర్ట్ (19), అనుకూల్ రాయ్ (9), రింకూ సింగ్ (1) పెవిలియన్కు క్యూ కట్టారు. గుజరాత్ బౌలర్లలో రబాడ 3 వికెట్లు పడగొట్టగా... సిరాజ్, అశోక్ శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్మన్ గిల్ (50 బంతుల్లో 86; 8 ఫోర్లు, 4 సిక్స్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో టైటాన్స్కిది మూడో విజయం. శుబ్మన్ దూకుడు... ఓపెనర్లు చెలరేగడంతో గుజరాత్కు శుభారంభం దక్కింది. తొలి ఓవర్లో ఓ ఫోర్ కొట్టిన శుబ్మన్, రెండో ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. మూడో ఓవర్లో గిల్, సాయి సుదర్శన్ (16 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్) కలిసి 3 సిక్స్లు కొట్టడంతో 20 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత కూడా గిల్ దూకుడు కొనసాగడంతో పవర్ప్లేలో గుజరాత్ 71 పరుగులు చేసి సుదర్శన్ వికెట్ కోల్పోయింది. వచ్చీ రావడంతోనే 4, 6, 4 కొట్టిన బట్లర్ (15 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్లు)... వరుణ్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఈ క్రమంలో గిల్ 27 బంతుల్లో హాఫ్సెంచరీ సాధించాడు. బట్లర్, సుందర్ (13) వెనుదిరిగినా... ఛేదించాల్సిన లక్ష్యం పెద్దది కాకపోవడంతో గుజరాత్కు ఇబ్బంది లేకుండా పోయింది. సెంచరీ చేసేలా కనిపించిన గిల్... గ్రీన్ పట్టిన చక్కటి క్యాచ్కు పెవిలియన్ బాటపట్టాడు. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: సైఫెర్ట్ (సి) ఫిలిప్స్ (బి) రబాడ 19; రహానే (సి) రబాడ (బి) సిరాజ్ 0; రఘువంశీ (సి) బట్లర్ (బి) రబాడ 8; గ్రీన్ (సి) బట్లర్ (బి) రషీద్ 79; పావెల్ (సి) సిరాజ్ (బి) అశోక్ 27; రాయ్ (సి) బట్లర్ (బి) ప్రసిధ్ 9; రింకూ (సి) బట్లర్ (బి) రబాడ 1; రమణ్దీప్ (సి) సిరాజ్ (బి) అశోక్ 17; నరైన్ (సి) ఫిలిప్స్ (బి) సిరాజ్ 0; కార్తీక్ (రనౌట్) 6; వైభవ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లో ఆలౌట్) 180. వికెట్ల పతనం: 1–5, 2–21, 3–32, 4–87, 5–147, 6–148, 7–165, 8–166, 9–173, 10–180. బౌలింగ్: సిరాజ్ 4–0–23–2; రబాడ 4–0–29–3; ప్రసిధ్ 4–0–32–1; అశోక్ 4–0–45–2; రషీద్ 4–0–44–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (సి) కార్తీక్ (బి) నరైన్ 22; గిల్ (సి) గ్రీన్ (బి) అరోరా 86; బట్లర్ (సి) గ్రీన్ (బి) వరుణ్ 25; సుందర్ (సి) కార్తీక్ (బి) వరుణ్ 13; ఫిలిప్స్ (సి) రింకూ (బి) రమణ్దీప్ 19; తెవాటియా (నాటౌట్) 7; షారుక్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 6; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–57, 2–95, 3–141, 4–158, 5–177. బౌలింగ్: వైభవ్ 4–0–35–1; కార్తీక్ 4–0–40–0; అనుకూల్ రాయ్ 3–0–37–0; నరైన్ 4–0–28–1; వరుణ్ 4–0–34–2; రమణ్దీప్ 0.4–0–5–1. -
గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 181 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.కెప్టెన్ గిల్ (86) సూపర్ ఇన్నింగ్స్తో గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. బట్లర్ (25), సాయి సుదర్శన్ (22) పర్వాలేద నిపించారు. గిల్ ఔటయ్యాక కాస్త ఉత్కంఠ నెలకొన్నప్పటికీ చివర్లో గ్లెన్ ఫిలిప్స్ (17), రాహుల్ తెవాటియా (7 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా, సునీల్ నరైన్, రమన్దీప్, వైభవ్ అరోరాలు ఒక్కో వికెట్ పడగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. గ్రీన్ (79) టాప్ స్కోరర్గా నిలిచాడు. గ్రీన్ మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో రబాడ 3 వికెట్లు తీయగా, సిరాజ్, అశోక్ శర్మలు చెరో 2 వికెట్ల పడగొట్టారు. ఈ విజయంతో గుజరాత్ పట్టికలో నాలుగో స్థానానికి చేరుకోగా, కేకేఆర్ వరుసగా ఐదో పరాజయంతో అట్టడుగు స్థానంలో నిలిచింది.2⃣ points in the bag ✅Hat-trick of wins ✅@gujarat_titans wrap a fantastic all-round show at home 🥳🏠 Scorecard ▶️ https://t.co/FACeUzse3B#TATAIPL | #KhelBindaas | #GTvKKR pic.twitter.com/mVnSg3ZI5p— IndianPremierLeague (@IPL) April 17, 2026 -
IPL 2026: ఉత్కంఠపోరులో గుజరాత్ విజయం
Gujarat Titans Vs KKR Updates..ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 181 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గిల్ 86 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా, సునీల్ నరైన్, రమన్దీప్, వైభవ్ అరోరాలు ఒక్కో వికెట్ పడగొట్టారు. కేకేఆర్ 180 పరుగులకు ఆలౌటైంది. కామెరున్ గ్రీన్ (79) పరుగులతో కేకేఆర్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. గుజరాత్ బౌలర్లలో రబాడ 3 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మలు చెరో 2 వికెట్లు పడగొట్టారు.86 పరుగులు చేసిన శుబ్మన్ గిల్ వైభవ్ అరోరా బౌలింగ్లో కామెరున్ గ్రీన్ అద్భుత క్యాచ్కు వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.16 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. గిల్ 81, పిలిప్స్ 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు వాషింగ్టన్ సుందర్ (13) వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో వెనుదిరిగాడు.గిల్ అర్థశతకం.. గుజరాత్ 101/2కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ అర్థశతకం సాధించాడు. గిల్ 27 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. అంతకముందు గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన జాస్ బట్లర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో గ్రీన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 11 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్కేకేఆర్తో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన సాయి సుదర్శన్ సునీల్ నరైన్ బౌలింగ్లో కార్తిక్ త్యాగికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది.దంచికొడుతున్న గుజరాత్181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఛేదనను దూకుడుగిఆ ఆరంభించింది. 5 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (22), గిల్ (34) క్రీజులో ఉన్నారు.గుజరాత్ టార్గెట్ 181 పరుగులుగుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ 180 పరుగులకు ఆలౌటైంది. కామెరున్ గ్రీన్ (79) పరుగులతో కేకేఆర్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. రోవ్మెన్ పావెల్ 27 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఒక దశలో 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులతో పటిష్టంగా కనిపించిన కేకేఆర్ చివరి ఐదు ఓవర్లలో కేవలం 32 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. గుజరాత్ బౌలర్లలో రబాడ 3 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మలు చెరో 2 వికెట్లు పడగొట్టారు.16 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అంతకముందు రింకూ సింగ్ రబాడ బౌలింగ్లో ఆరో వికెట్గా వెనుదిరిగాడు.ఐదో వికెట్ కోల్పోయిన కేకేఆర్గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో కేకేఆర్ 147 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన అనుకుల్ రాయ్ ప్రసిధ్ క్రిష్ణ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కామెరున్ గ్రీన్ 75 పరుగులతో బ్యాటింగ్ ఆడుతున్నాడు.87 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. పావెల్ (27).. అశోక్ శర్మ బౌలింగ్లో ఔటయ్యాడు.8 ఓవర్లలో కేకేఆర్ 59/38 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 3 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. పావెల్ (21), గ్రీన్ (8) క్రీజులో ఉన్నారు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన సీఫెర్ట్ రబాడ బౌలింగ్లో గ్లెన్ ఫిలిప్స్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది.రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్8 పరుగులు చేసిన అంగ్క్రిష్ రఘువంశీ రబాడ బౌలింగ్లో జాస్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం కేకేఆర్ 2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది.రహానే గోల్డెన్ డక్గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ అజింక్య రహానే సిరాజ్ బౌలింగ్లో గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు.బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం 25వ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ బ్యాటింగ్ ఎంచుకుంది. కేకేఆర్ ఈ మ్యాచ్కు ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఫిన్ అలెన్ స్థానంలో టిమ్ సీఫెర్ట్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు గుజరాత్ మాత్రం జట్టులో ఏ మార్పు చేయలేదు. ఈ సీజన్లో కేకేఆర్ ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. ఐదు మ్యాచ్ల్లో నాలుగింటి పరాజయాలు, ఒక మ్యాచ్ రద్దు కావడంతో పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఆడిన 4 మ్యాచ్ల్లో రెండు విజయాలతో ఐదో స్థానంలో ఉంది. ముఖాముఖి పోరులో నాలుగుసార్లు తలపడగా గుజరాత్ మూడుసార్లు, కేకేఆర్ ఒకసారి గెలుపొందాయి.కోల్కతా నైట్ రైడర్స్: టిమ్ సీఫెర్ట్, సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రోవ్మన్ పావెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి.గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్),వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అశోక్ శర్మ, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ క్రిష్ణ. -
సూర్యకు బైబై!.. భారత టీ20 కెప్టెన్గా ఎవరంటే?!
సొంతగడ్డపై టీమిండియాకు ఇటీవల టీ20 ప్రపంచకప్ టైటిల్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. అయితే, అతడి భవితవ్యంపై క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా సారథిగా సూపర్ హిట్ అవుతున్నా.. బ్యాటర్గా మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు.ఈ నేపథ్యంలో సెలక్టర్లు సైతం సూర్యను కొనసాగించాలా వద్దా? అన్న అంశంపై తీవ్రంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ ముగిసిన వెంటనే జరిగే ఐర్లాండ్, ఇంగ్లండ్తో సిరీస్లలో అతడి ప్రదర్శనను పరిశీలించిన అనంతరమే వారు అంతిమ నిర్ణయానికి రానున్నారు.వచ్చే రెండేళ్లలో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ (2028)తో పాటు లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ (2028) జరగనున్నాయి. వీటికి సూర్యకుమార్ సారథ్యంలోనే సిద్ధం కావాలా లేక కొత్త నాయకుడిని ఎంపిక చేయాలా అనే విషయంపై సెలక్టర్లు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనతో ఒక అవగాహనకు రానున్నారు.విషమ పరీక్షఈ టూర్లో అటు సారథిగా, ఇటు ప్లేయర్గా సూర్యకుమార్కు విషమ పరీక్ష కానుంది. గౌతమ్ గంభీర్ 2028 ఒలింపిక్స్ వరకు టీమిండియా హెడ్కోచ్గా కొనసాగే అవకాశాలున్న నేపథ్యంలో... సూర్యకుమార్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం 35వ పడిలో ఉన్న సూర్యకుమార్ ఒలింపిక్స్ సమయానికి ఫిట్గా ఉంటాడా అనేది అనుమానమే.‘సూర్యకుమార్ ప్రస్తుతం జట్టును నడిపిస్తున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు అతడే కెప్టెన్ అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనేది అందులో అతడి ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది’ అని బీసీసీఐ అధికారి తెలిపారు.గతేడాది పేలవ ఆటతీరు కనబర్చిన సూర్యకుమార్ కనీసం ఒక్క హాఫ్సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. ఈ ఏడాది ఫర్వాలేదినిపించిన ఈ ముంబైకర్... వరల్డ్కప్ ఆరంభంలో ఆకట్టుకున్నా... కీలక మ్యాచ్ల్లో మాత్రం విఫలమయ్యాడు. సౌతాఫ్రికాపై 18 పరుగులు, వెస్టిండీస్పై 18 పరుగులు, ఇంగ్లండ్పై 11 పరుగులు చేసిన సూర్యకుమార్... న్యూజిలాండ్తో ఫైనల్లో డకౌటయ్యాడు. ఒకవేళ సూర్యను సెలక్టర్లు తప్పిస్తే.. అతడి స్థానంలో టీమిండియా టీ20 కెప్టెన్ కాగల అర్హత ఉన్న టాప్-5 ఆటగాళ్లు ఎవరో తెలుసా?శుబ్మన్ గిల్ఇప్పటికే టీమిండియా టెస్టు, వన్డే పగ్గాలు చేపట్టాడు శుబ్మన్ గిల్. అయితే, టీ20 జట్టు కెప్టెన్సీ విషయంలో మాత్రం బీసీసీఐ గిల్ గురించి వెంటనే నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. ఆసియా కప్-2025తో టీ20 జట్టులో పునరాగమనం చేసిన అతడు వరుసగా విఫలం కావడం ఇందుకు కారణం.అయితే, ఐపీఎల్-2026లో గనుక బ్యాటర్గా గిల్ సత్తా చాటితే అతడి ఎంపిక లాంఛనమే అవుతుంది. కాగా ఫామ్లేమి కారణంగా గిల్ను టీ20 ప్రపంచకప్-2026 జట్టు నుంచి సెలక్టర్లు తప్పించిన సంగతి తెలిసిందే.హార్దిక్ పాండ్యానిజానికి 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ ఫార్మాట్కు గుడ్బై చెప్పిన తర్వాత కెప్టెన్ కావాల్సింది హార్దిక్ పాండ్యానే. అయితే, అనూహ్యంగా యాజమాన్యం సూర్యకు పగ్గాలు అప్పగించింది.ఆ సమయంలో.. అరుదైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యాపై అధిక భారం పడకుండా.. తాము ఈ నిర్ణయం తీసుకున్నటుట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. కాబట్టి సూర్య స్థానంలో హార్దిక్ను సారథిగా ఎంపిక చేస్తారా లేదా అన్నది చర్చనీయాంశం. ఐపీఎల్లో కెప్టెన్గా అతడికి అనుభవం ఉంది.సంజూ శాంసన్జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయిన సంజూ శాంసన్... టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించి హీరో అయ్యాడు. సూపర్-8 నాకౌట్ మ్యాచ్లో వెస్టిండీస్పై 97 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ కేరళ వికెట్ బ్యాటర్.. ఇంగ్లండ్తో సెమీస్లో 89, న్యూజిలాండ్తో ఫైనల్లో 89 రన్స్తో దుమ్ములేపాడు.ఇక ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు సుదీర్ఘకాలం కెప్టెన్గా పనిచేసిన అనుభవం సంజూకు ఉంది. కేరళ జట్టుకు కూడా గతంలో అతడు సారథ్యం వహించాడు.అక్షర్ పటేల్టీ20 వరల్డ్కప్-2026లో టీమిండియా వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు ఆల్రౌండర్ అక్షర్ పటేల్. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున సారథిగానూ అతడు సత్తా చాటుతున్నాడు. సూర్య వారసుడిగా అక్షర్ ఎంపికయ్యే అవకాశాలు లేకపోలేదు.శ్రేయస్ అయ్యర్ముంబై సారథిగా, ఐపీఎల్లో వివిధ జట్ల కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు అపార అనుభవం ఉంది. 2024లో అతడి సారథ్యంలోనే కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలిచింది. గతేడాది పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా, బ్యాటర్గా ఇరగదీసి ఫైనల్కు చేర్చాడు. అయితే, 2023 డిసెంబరు తర్వాత ఇంత వరకు అతడు భారత టీ20 జట్టు తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా త్వరలోనే జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.చదవండి: PSL: అక్కడ వద్దంటేనే ఇక్కడికి: పీసీబీ పరువు తీసిన పాక్ క్రికెటర్ -
విజ్డెన్ అవార్డ్స్ 2026లో టీమిండియా ప్లేయర్ల హవా
క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విజ్డెన్ అవార్డుల్లో టీమిండియా ప్లేయర్లు ఆధిపత్యం చాటారు. ఈ ఏడాది తొమ్మిది ప్రధాన అవార్డుల్లో ఏకంగా ఏడు అవార్డులు భారత ఆటగాళ్లకే దక్కాయి. ఐదు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుల్లో నాలుగు టీమిండియా ప్లేయర్లే కైవసం చేసుకున్నారు.క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్ శుభ్మన్ గిల్– గతేడాది ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్లో 754 పరుగులు, ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో 269 & 161 రవీంద్ర జడేజా– గతేడాది ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్లో 86 సగటు 516 పరుగులు. మాంచెస్టర్లో మ్యాచ్ సేవ్ చేసిన శతకం. రిషభ్ పంత్– గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో హెడింగ్లే టెస్ట్లో రెండు శతకాలు (134 & 118), మరో మ్యాచ్లో గాయంతోనూ హాఫ్ సెంచరీ. మొహమ్మద్ సిరాజ్– గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో 23 వికెట్లు, ఓవల్ టెస్ట్లో చివరి రోజు తొలి సెషన్లో 5 వికెట్లు. హసీబ్ హమీద్– ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో నాటింగ్హామ్షైర్కు 15 ఏళ్ల తర్వాత ఛాంపియన్షిప్. ఈ టోర్నీలో 66 సగటున 1258 పరుగులు. భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన దీప్తి శర్మకు లీడింగ్ వుమెన్స్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ అవార్డు లభించింది. టీమిండియా విధ్వంకర ఓపెనర్ అభిషేక్ శర్మ లీడింగ్ టీ20 క్రికెటర్ ఇన్ ద వరల్డ్ అవార్డును ఎగరేసుకుపోయాడు. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో విశేషంగా రాణించిన భారత టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ విజ్డెన్ ట్రోఫీ (సింగిల్ టెస్ట్ ప్రదర్శనకు) గెలుచుకున్నాడు. ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో డబుల్ సెంచరీ, భారీ సెంచరీ సహా 430 పరుగులు చేసి భారత్ను గెలిపించినందుకు గానూ గిల్ను ఈ అవార్డు వరించింది. ఆసీస్ స్పీడ్స్టర్ మిచెల్ స్టార్క్కు లీడింగ్ మెన్స్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ అవార్డు లభించింది. -
LSG vs GT: అర్జున్ టెండుల్కర్ భార్య అలా.. అక్క ఇలా!
ఐపీఎల్-2026లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. లక్నోలోని ఏకనా స్టేడియంలో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.నిప్పులు చెరిగిన ప్రసిద్ కృష్ణఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (30) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ నాలుగు వికెట్లతో చెలరేగి లక్నో బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్18.4 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. శుబ్మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (40 బంతుల్లో 56) ఆడగా.. జోస్ బట్లర్ (37 బంతుల్లో 60), వాషింగ్టన్ సుందర్ (13 బంతుల్లో 21 నాటౌట్) ధనాధన్ దంచికొట్టారు. ఫలితంగా గుజరాత్ జయభేరి మోగించింది.స్టాండ్స్లో సచిన్ కుమార్తె, కోడలుఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్, కోడలు సానియా చందోక్ ఏకనా స్టేడియానికి విచ్చేశారు. కాగా ముంబై ఇండియన్స్ ఈ సీజన్ ఆరంభానికి ముందు సచిన్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ను లక్నోకు ట్రేడ్ చేసిన సంగతి తెలిసిందే.అయితే, ఇప్పటికి లక్నో నాలుగు మ్యాచ్లు ఆడినా అర్జున్ టెండుల్కర్కు ఒక్కసారి కూడా తుదిజట్టులో చోటు దక్కలేదు. గుజరాత్తో మ్యాచ్లోనూ అతడు బెంచ్కే పరిమితం అయ్యాడు. అయినప్పటికీ అర్జున్ ఉన్న లక్నో జట్టుకు మద్దతు ఇచ్చేందుకు అతడి అక్క సారా, భార్య సానియా స్టేడియానికి రావడం విశేషం.లక్నో జెర్సీలో సానియా.. సారా మాత్రంసారా, సానియా పక్క పక్కనే కూర్చుని మ్యాచ్ చూస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. సానియా లక్నో జెర్సీ ధరించి రాగా.. సారా మాత్రం నార్మల్ కుర్తీసెట్ వేసుకుంది. దీంతో సారా ఇప్పటికీ ముంబై ఇండియన్స్నే తన ఫేవరెట్ జట్టుగా భావిస్తోందని అందుకే వేరే జెర్సీ వేసుకునేందుకు కూడా ఇష్టపడటం లేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు మాత్రం తమ్ముడు ఎలాగో తుదిజట్టులో లేడు.. అందుకే ఈసారి ఆమె గుజరాత్ కెప్టెన్ గిల్కు మద్దతు ఇచ్చి ఉంటుందని పేర్కొంటున్నారు. కాగా సారా- గిల్ ప్రేమలో ఉన్నారంటూ గతంలో వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇటు సారా గానీ.. అటు గిల్ గానీ ఎప్పుడూ స్పందించలేదు.చదవండి: హార్దిక్తో విభేదాలు.. స్పందించిన కృనాల్ -
అరుదైన మైలురాయిని తాకిన గిల్.. కోహ్లి కంటే వేగంగా..!
ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో ఇవాళ (ఏప్రిల్ 12) జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో గిల్ 4000 ఐపీఎల్ పరుగుల మైలురాయిని అధిగమించాడు. తద్వారా అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.గిల్ ఈ మైలురాయిని 118వ ఇన్నింగ్స్లో చేరుకోగా.. రాహుల్ 105, క్రిస్ గేల్ 112, డేవిడ్ వార్నర్ 114, జోస్ట్ బట్లర్ 116 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించారు. ఈ జాబితా టాప్-5లో గిల్ రెండో భారత ప్లేయర్గా నిలిచాడు. దిగ్గజం విరాట్ కోహ్లికి ఈ మైలురాయిని తాకేందుకు 128 ఇన్నింగ్స్లు అవసరం కాగా.. గిల్ అతని కంటే వేగంగా ఈ ఘనత సాధించాడు.బంతుల ప్రకారం చూస్తే.. అత్యంత వేగంగా 4000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో గిల్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ టాప్ ప్లేస్లో ఉండగా.. దిగ్గజం విరాట్ కోహ్లి టాప్-5లో కూడా లేడు.అత్యంత వేగంగా (బంతులు) 4000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసిన టాప్-5 భారత ఆటగాళ్లు..సూర్యకుమార్ యాదవ్- 2714శుభ్మన్ గిల్- 2875సురేష్ రైనా- 2886 ఎంఎస్ ధోని- 2887 సంజూ శాంసన్- 2915మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రసిద్ద్ కృష్ణ (4-0-28-4), అశోక్ కుమార్ (4-0-32-2), సిరాజ్ (4-0-19-1) అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నోను కట్టడి చేశారు. లక్నో ఇన్నింగ్స్లో 30 పరుగులు చేసిన మార్క్రమ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి, లక్ష్యం దిశగా సాగుతోంది. -
‘గిల్ను కలవాలి’.. కూతురుకు మాజీ క్రికెటర్ షాక్!
క్రికెటర్లకు అభిమానులుండడం సహజం. కానీ మాజీ క్రికెటర్ కూతురు మరో క్రికెటర్కు అభిమానిగా ఉండడం, అతడిని కలవాలని కోరడం ఇక్కడ ఆసక్తి కలిగించే విషయం. టీమిండియా మాజీ క్రికెటర్ వృద్దిమాన్ సాహా, అతడి కూతురు అన్వి మధ్య జరిగిన సంభాషణను సాహా భార్య రోమి మిత్రా సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియోలో సాహా, కూతురు అన్వి మధ్య సంభాషణ ఆద్యంతం ఆకట్టుకుంది. విషయంలోకి వెళితే.. అన్వి శుబ్మన్ గిల్కు అభిమాని. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న గిల్ను కల్పించాలాంటూ అన్వి పదే పదే తండ్రి సాహాను రిక్వెస్ట్ చేసింది. అయితే దీనిపై సాహా కూతురుకు ఊహించని షాక్ ఇచ్చాడు. ‘గిల్ను కలవాలనుకోవడం ఓకే. కానీ అందరిలానే లైన్లో నిలబడి అతడిని కలవాల్సి ఉంటుంది. ఇందులో నీకు ఎలాంటి మినహాయింపు ఉండదు’ అని సాహా తన కూతురితో పేర్కొన్నాడు. అందుకు అన్వి.. ‘అదేంటి.. మీరు గిల్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నారుగా’ అని గుర్తుచేసింది. దానికి సాహా ‘అదంతా ఒకప్పుడు.. ఇప్పుడు నేను ఐపీఎల్ ఆడడం లేదు కదా’ అని నవ్వుతూ బదులిచ్చాడు. వీరిద్దరి మధ్య సంభాషణను సాహా భార్య రోమి మిత్రా రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. కాగా సాహా గతంలో గుజరాత్ టైటాన్స్ తరఫున గిల్తో కలిసి ఇన్నింగ్స్లు పంచుకున్న సంగతి తెలిసిందే. వృద్దిమాన్ సాహా ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2022లో ఐపీఎల్ టైటిల్ సాధించిన గుజరాత్ టైటాన్స్ జట్టులో సాహా సభ్యుడిగా ఉన్నాడు. అంతేకాదు ఒక ఐపీఎల్ సీజన్ ఫైనల్లో సెంచరీ సాధించిన తొలి క్రికెటర్గా సాహా రికార్డులకెక్కాడు. ఐపీఎల్ కెరీర్లో 170 మ్యాచ్లాడిన సాహా 2,934 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ సహా 13 అర్థశతకాలున్నాయి. ధోని హయాంలో పెద్దగా వెలుగులోకి రాలేకపోయిన వృద్దిమాన్ సాహా టీమిండియా తరఫున 40 టెస్టులు, 9 వన్డే మ్యాచ్లు ఆడాడు. 2024 రంజీ సీజన్లో బెంగాల్ తరఫున ఆడిన సాహా ఆ తర్వాత అంతర్జాతీయ సహా అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 2024-25 రంజీ సీజన్లో పంజాబ్తో మ్యాచ్ సందర్భంగా బెంగాల్ ఆటగాళ్లు సాహాకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చి గౌరవించారు. సాహా తన ఫస్ట్క్లాస్ కెరీర్లో 142 మ్యాచ్లాడి 7 వేలకు పైగా పరుగులు సాధించాడు. View this post on Instagram A post shared by Romi Mitra (@romi_mitra) చదవండి: నడిరోడ్డుపై చాహల్ హల్చల్! -
శుబ్మన్ గిల్కు ‘ఊహించని’ షాక్!
గుజరాత్ టైటాన్స్ ఎట్టకేలకు ఐపీఎల్-2026 టోర్నీలో బోణీ కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్తో బుధవారం నాటి మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో గెలిచింది. ఢిల్లీ హిట్టర్ డేవిడ్ మిల్లర్ (20 బంతుల్లో 41 నాటౌట్) చేసిన పొరపాటు టైటాన్స్ నెత్తిన పాలు పోసింది. ఫలితంగా ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో టైటాన్స్ను విజయం వరించింది.ధనాధన్సొంతమైదానం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా టాస్ గెలిచిన ఢిల్లీ.. గుజరాత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ నాలుగు వికెట్లు నష్టపోయి 210 పరుగులు సాధించింది. శుబ్మన్ గిల్ (45 బంతుల్లో 70) కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరవగా.. జోస్ బట్లర్ (27 బంతుల్లో 52), వాషింగ్టన్ సుందర్ (32 బంతుల్లో 55) ధనాధన్ దంచికొట్టారు.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 209 పరుగుల వద్ద నిలిచిపోయింది. పాతుమ్ నిస్సాంక (24 బంతుల్లో 41), కేఎల్ రాహుల్ (52 బంతుల్లో 92), మిల్లర్ ఇన్నింగ్స్ వృథా అయ్యాయి. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీయగా.. ప్రసిద్ కృష్ణ రెండు, మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ దక్కించుకున్నారు.శుబ్మన్ గిల్కు ఊహించని షాక్అయితే, గెలుపు జోష్లో ఉన్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్కు ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీతో మ్యాచ్లో నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున ఐపీఎల్ పాలక మండలి అతడికి జరిమానా విధించింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది.‘‘ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్కు జరిమానా విధించడమైనది. ఈ సీజన్లో ఇదే అతడి తొలి తప్పిదం కాబట్టి రూ. 12 లక్షల జరిమానాతో సరిపెడుతున్నాము’’ అని ఐపీఎల్ పాలక మండలి ప్రకటనలో పేర్కొంది. చదవండి: ఢిల్లీ కొంపముంచిన మిల్లర్.. అక్షర్ పటేల్ రియాక్షన్ ఇదే!Watch it yourself to believe it 🤯A nerve-wrecking finish to a #TATAIPL classic 🥶 @gujarat_titans fans, you can breathe now 😅Updates ▶️ https://t.co/oOdPR1oSeP#TATAIPL | #KhelBindaas | #DCvGT pic.twitter.com/Wh5EQvshqd— IndianPremierLeague (@IPL) April 8, 2026 -
‘సింగిల్’తో ఢిల్లీ డీలా
ఢిల్లీ విజయానికి చివరి 18 బంతుల్లో 45 పరుగులు కావాలి. రిటైర్డ్హర్ట్గాతప్పుకొని మళ్లీ క్రీజ్లోకి వచ్చిన మిల్లర్పైనే ఆశలు ఉన్నాయి. 18వ ఓవర్లో 9 పరుగులే వచ్చాయి. అయితే సిరాజ్ వేసిన 19వ ఓవర్లో మిల్లర్ చెలరేగి 2 సిక్స్లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 23 పరుగులు లభించాయి. ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా, తొలి 4 బంతుల్లో 11 పరుగులు లభించాయి. ఇక చేయాల్సింది 2 బంతుల్లో 2 పరుగులే! అయితే డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ వరకు బంతి వెళ్లినా సునాయాస సింగిల్ తీయకుండా కుల్దీప్ను మిల్లర్ వెనక్కి పంపించాడు. ఈ అనూహ్య నిర్ణయం ఢిల్లీని దెబ్బ తీసింది. ప్రసిధ్ కృష్ణ వేసిన షార్ట్ బంతిని మిల్లర్ ఆడలేకపోగా, సింగిల్ తీసే ప్రయత్నంలో కుల్దీప్ రనౌటయ్యాడు. వైడ్ కోసం అంపైర్లు పరిశీలించగా అది సరైందేనని తేలింది. దాంతో గుజరాత్ సంబరాలు చేసుకోగా... ఢిల్లీ బృందం నిరాశలో మునిగింది. అంతకుముందు గిల్, బట్లర్, సుందర్ అర్ధసెంచరీలతో గుజరాత్ భారీ స్కోరు చేసి ప్రత్యర్థికి సవాల్ విసిరింది. న్యూఢిల్లీ: మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్లో గెలుపు బోణీ చేసింది. గత రెండు మ్యాచ్ల్లో ఓడిన గుజరాత్ బుధవారం జరిగిన పోరులో ఒక పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (45 బంతుల్లో 70; 4 ఫోర్లు, 5 సిక్స్లు), వాషింగ్టన్ సుందర్ (32 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్స్లు), జోస్ బట్లర్ (27 బంతుల్లో 52; 3 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించడం విశేషం. రెండో వికెట్కు బట్లర్తో 32 బంతుల్లో 60 పరుగులు జోడించిన గిల్... మూడో వికెట్కు సుందర్తో 61 బంతుల్లో 104 పరుగులు జత చేశాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 209 పరుగులు చేసి ఓడిపోయింది. కేఎల్ రాహుల్ (52 బంతుల్లో 92; 11 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీ చేజార్చుకోగా, డేవిడ్ మిల్లర్ (20 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) పోరాడాడు. భారీ భాగస్వామ్యం... ఓపెనర్ సాయి సుదర్శన్ (12) ఎక్కువ సేపు నిలవలేకపోయినా... చాలా కాలం తర్వాత బట్లర్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడటంతో టైటాన్స్ భారీ స్కోరుకు పునాది పడింది. సిక్స్తో పరుగుల ఖాతా తెరిచిన బట్లర్...అక్షర్ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టాడు. అనంతరం ముకేశ్ వేసిన మూడో ఓవర్లో అతను చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో వరుసగా 6, 6, 4 కొట్టిన అతను ఆ తర్వాత మరో సిక్స్ బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. పవర్ప్లేలో జట్టు 68 పరుగులు చేయగా, 24 బంతుల్లోనే బట్లర్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే కుల్దీప్ చక్కటి బంతితో అతని ఆటను ముగించాడు. ఈ దశలో గిల్, సుందర్ కలిసి ధాటిని ప్రదర్శించారు. విప్రాజ్ వేసిన 12వ ఓవర్ గుజరాత్కు కలిసొచ్చింది. ఈ ఓవర్లో సుందర్ 2 ఫోర్లు, సిక్స్ కొట్టగా, గిల్ మరో సిక్స్ బాదడంతో మొత్తం 23 పరుగులు లభించాయి. 33 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్న గిల్... కుల్దీప్ ఓవర్లో మరో రెండు సిక్స్లతో చెలరేగాడు. గుజరాత్ ఆఖరి 4 ఓవర్లలో 42 పరుగులు రాబట్టగా... 30 బంతుల్లో సుందర్ అర్ధసెంచరీ పూర్తయింది. అనారోగ్యంతో గత మ్యాచ్లో ఆడని గిల్ కోలుకొని మళ్లీ బరిలోకి దిగాడు. ఒక్క కుల్దీప్ బౌలింగ్లోనే అతను నాలుగు సిక్సర్లు బాదడం విశేషం. రిజ్వీ విఫలం... సిరాజ్ వేసిన తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు బాది నిసాంక జోరుగా ఛేదనను మొదలు పెట్టాడు. ఆ తర్వాత అశోక్ ఓవర్లోనూ అతను వరుసగా 4, 6, 4, 4తో దూకుడు ప్రదర్శించాడు. గత రెండు మ్యాచ్లలో విఫలమైన రాహుల్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 63 పరుగులకు చేరింది. అశోక్ ఓవర్లోనే ఢిల్లీ 23 పరుగులు రాబట్టింది. తొలి వికెట్కు 76 పరుగుల (49 బంతుల్లో) తర్వాత నిసాంకను ప్రసిధ్ అవుట్ చేయగా...అదే ఓవర్ చివరి నాలుగు బంతుల్లో రాహుల్ వరుసగా 4, 6, 6, 4తో చెలరేగి 29 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. నితీశ్ రాణా (5) మళ్లీ విఫలం కాగా, గత రెండు మ్యాచ్ల హీరో సమీర్ రిజ్వీ (0) ఈసారి తొలి బంతికే బౌల్డయ్యాడు. అక్షర్ పటేల్ (2) కూడా నిలబడలేకపోగా, దూకుడుగా ఆడే ప్రయత్నంలో రాహుల్ అవుటయ్యాడు. 12 పరుగుల వద్ద గాయంతో రిటైర్డ్హర్ట్గా బయటకు వెళ్లిన మిల్లర్ ఈ దశలో తిరిగొచ్చి చివరి వరకు పోరాడినా లాభం లేకపోయింది.స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (బి) ముకేశ్ 12; గిల్ (సి) రాణా (బి) ఎన్గిడి 70; బట్లర్ (బి) కుల్దీప్ 52; సుందర్ (సి) రాణా (బి) ముకేశ్ 55; ఫిలిప్స్ (నాటౌట్) 14; తెవాటియా (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 210. వికెట్ల పతనం: 1–19, 2–79, 3–183, 4–205. బౌలింగ్: ముకేశ్ కుమార్ 4–0–55–2, ఎన్గిడి 4–0–24–1, అక్షర్ 3–0–32–0, కుల్దీప్ 4–0–42–1, నటరాజన్ 4–0–34–0, విప్రాజ్ 1–0–23–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: నిసాంక (సి) తెవాటియా (బి) ప్రసిధ్ 41; రాహుల్ (సి) బట్లర్ (బి) సిరాజ్ 92; రాణా (సి) సుదర్శన్ (బి) రషీద్ 5; రిజ్వీ (బి) రషీద్ 0; మిల్లర్ (నాటౌట్) 41; అక్షర్ (సి) ఫిలిప్స్ (బి) రషీద్ 2; స్టబ్స్ (రనౌట్) 7; విప్రాజ్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 12; కుల్దీప్ (రనౌట్) 1; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–76, 2–101, 3–101, 4–134, 5–160, 6–166, 7–202, 8–209. బౌలింగ్: సిరాజ్ 4–0–52–1, రబాడ 4–0–32–0, రషీద్ ఖాన్ 4–0–17–3, అశోక్ శర్మ 3–0–45–0, ప్రసిధ్ కృష్ణ 4–0–52–2, సుందర్ 1–0–11–0.ఐపీఎల్లో నేడుకోల్కతా X లక్నో వేదిక: కోల్కతారాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్,జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
మ్యాచ్ హీరో అతడే.. ప్రత్యర్థి కెప్టెన్పై ప్రశంసలు
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. మ్యాచ్ హీరో కచ్చితంగా కూపర్ కనోలీనేనని, అతడి వల్లే ఈ గెలుపు సాధ్యమైందన్నాడు. అయితే గుజరాత్ కెప్టెన్ గిల్పై శ్రేయస్ ప్రశంసలు కురిపించడం ఆసక్తిగా మారింది. శ్రేయస్ మాట్లాడుతూ..‘నా చేతికి స్పల్ప గాయమైంది. పెద్దది అవ్వొద్దని గట్టిగా కోరుకున్నా. ప్రస్తుతం అంతా బాగుంది. గాయం తీవ్రత కూడా పెద్దగా లేదు. అయితే ఈ మ్యాచ్లో హీరో మాత్రం కూపర్ కనోలీనే. అద్భుతమైన టెక్నిక్తో మ్యాచ్ ఆడాడు. కనోలీ బాదిన కొన్ని షాట్లు మాత్రం అద్భుతం. డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లి చేతి గాయానికి ఐస్ పెట్టుకునే లోపే టపాటపా వికెట్లు పడిపోయాయి. క్రికెట్లో ఇలాంటి పరిస్థితులు సహజం. ఏం జరిగినా పోరాటం ఆపొద్దు. కనోలీ అదే చేశాడు. ప్రశాంతంగా ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించాడు. అర్ష్దీప్ సింగ్ వచ్చి బంతి కాస్త ఆగి వస్తోందని చెప్పాడు. అందుకే మేం బంతిని వీలైనంత త్వరగా పాతబడేలా చేయడానికి ప్రయత్నించాం. విజయ్ కుమార్ వైశాఖ్ గత సీజన్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. అతడు బిగ్ మ్యాచ్ ప్లేయర్. అయితే నేను బ్యాటింగ్ చేసే సమయంలో షార్ట్ లెగ్ ఫీల్డర్ను చూసి షాకయ్యాను. ఇంతకుముందు ఏ కెప్టెన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నేను చూడలేదు. ఈ విషయాన్ని గిల్తో కూడా చెప్పాను. శుభ్మన్ గిల్ ఇలాంటి అటాకింగ్ ఫీల్డింగ్ సెట్ చేయడం బాగుంది’ అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఇటలీకి షాక్.. ఫిపా ప్రపంచకప్కు అనర్హత -
టైటాన్స్తో పంజాబ్ ఢీ.. పంజా విసిరేదెవరు?
మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, గతేడాది రన్నరప్ పంజాబ్ కింగ్స్ ఈ ఐపీఎల్ సీజన్లో శుభారంభంపై దృష్టి పెట్టాయి. నేడు జరిగే పోరులో శుబ్మన్ గిల్ నాయకత్వంలోని టైటాన్స్తో శ్రేయస్ అయ్యర్ సారథిగా ఉన్న పంజాబ్ కింగ్స్ తలపడుతుంది. భారత టి20 జట్టులో స్థానంలేని ఇరు జట్ల కెప్టెన్లు అటు తమ బ్యాటింగ్తో, ఇటు నాయకత్వంతో తమను తాము నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నారు. ప్రతీ సీజన్లో నిలకడగా పరుగులు సాధిస్తున్నా... గిల్ స్ట్రయిక్రేట్పై ఇటీవల చర్చ పెరిగింది. ఈ నేపథ్యంలో తనలో దూకుడు పెంచాలని అతను భావిస్తున్నాడు. మరోవైపు శ్రేయస్ గత ఏడాది అద్భుత బ్యాటింగ్తో 604 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించాడు. ఈసారి కూడా అదే ఫామ్ను కొనసాగిస్తే జట్టు ముందంజ వేయవచ్చు. ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు ఆరుసార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. మూడుసార్లు గుజరాత్, మూడుసార్లు పంజాబ్ గెలిచి సమఉజ్జీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చదవండి: సినెర్దే మయామి మాస్టర్స్ -
శుభ్మన్ గిల్ లగ్జరీ అపార్ట్మెంట్.. ధర తెలిస్తే షాకవుతారు!
ఇప్పటికే చాలామంది సినీతారలు, పారిశ్రామిక వేత్తలు, క్రికెటర్లు ముంబైలో ఆస్తులు, ఇల్లు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ప్రముఖ టీమిండియా క్రికెటర్ 'శుభ్మన్ గిల్' కూడా చేరారు.శుభ్మన్ గిల్.. ముంబై నగరంలోని జుహూ ప్రాంతంలో ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. ఈ అపార్ట్మెంట్ విలువ సుమారు రూ.20.7 కోట్లు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం.. ఈ ఫ్లాట్ను పూజా లీజర్ అండ్ లైఫ్స్టైల్ అనే సంస్థ నుంచి కొనుగోలు చేశారు.శుభ్మన్ గిల్ కొనుగోలు చేసిన ఈ అపార్ట్మెంట్.. ముంబైలోని జుహూ తారా రోడ్డుపై ఉన్న పూజా ల్యూమినేర్ అనే భవనంలో 12వ అంతస్తులో ఉంది. గిల్ ఈ 12వ అంతస్తు మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఫ్లాట్ విస్తీర్ణం సుమారు 3,369 చదరపు అడుగులు. ఈ లావాదేవీ కోసం రూ.1.24 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ కొనుగోలు మార్చి 26, 2026న జరిగింది. మహారాష్ట్ర RERA వివరాల ప్రకారం.. ఈ భవనం ఇంకా నిర్మాణంలో ఉంది. 2029 ఆగస్టు నాటికి పూర్తి కావాల్సి ఉంది.ముంబైలో ఇతర క్రికెటర్ల అపార్ట్మెంట్స్ఇటీవల కాలంలో భారత క్రికెటర్లు ముంబై రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం గమనించదగ్గ విషయం. ఇందులో సూర్య కుమార్ యాదవ్, రోహిత్ శర్మ, జహీర్ ఖాన్ మొదలైనవారు ఉన్నారు.👉సూర్యకుమార్ యాదవ్, అతని భార్య దేవిషా యాదవ్ ముంబైలోని డియోనార్ ప్రాంతంలో రూ.7.18 కోట్ల విలువైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు.👉రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేహ్ ప్రాభాదేవి ప్రాంతంలో రూ.26.30 కోట్ల విలువైన విలాసవంతమైన ఫ్లాట్ను సొంతం చేసుకున్నారు.👉జహీర్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి సుమారు రూ.11 కోట్ల విలువైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. -
ఆశల పల్లకిలో...
ఐపీఎల్లో అడుగు పెట్టిన తొలి ఏడాదే చాంపియన్గా నిలిచి సంచలనం సృష్టించడంతో పాటు తర్వాతి ఏడాది కూడా రన్నరప్గా నిలిచి గుజరాత్ టైటాన్స్ తమ స్థాయిని ప్రదర్శించింది. అయితే ఆ తర్వాతి సీజన్లో అనూహ్యంగా వెనుకబడి ఎనిమిదో స్థానానికే పరిమితమైంది. కానీ గత సీజన్లో మెరుగైన ప్రదర్శనతో ‘ప్లే ఆఫ్స్’కు చేరగలిగింది. 2025తో పోలిస్తే పెద్దగా మార్పులు లేకుండా ఈసారి కూడా జట్టు బరిలోకి దిగుతోంది. శుబ్మన్ గిల్ నాయకత్వానికి ఆశిష్ నెహ్రా కోచింగ్ వ్యూహాలు తోడైతే రెండో టైటిల్ను ఆశించవచ్చు. అయితే జోస్ బట్లర్, రషీద్ ఖాన్లాంటి స్టార్స్ ఇటీవలి తమ వైఫల్యాలను అధిగమించి ఫామ్లోకి రావడం జట్టుకు కీలకం. –సాక్షి క్రీడా విభాగం గత సీజన్లో లీగ్ దశలో 9 మ్యాచ్లు గెలిచి మూడో స్థానంలో నిలిచిన టైటాన్స్... ‘ఎలిమినేటర్’లో ముంబై చేతిలో ఓడి నిష్క్రమించింది. ఐపీఎల్ వేలంలో ఈ ఏడాది గుజరాత్ ఐదుగురు ఆటగాళ్లనే ఎంచుకుంది. వీరిలో ముగ్గురు విదేశీయులు హోల్టర్, టామ్ బాంటన్, ల్యూక్ వుడ్ ఉన్నారు. షెర్ఫాన్ రూథర్ఫర్డ్ను జట్టు వదిలేసుకొని అతని స్థానంలో టామ్ బాంటన్ను ఎంచుకుంది. గాయం కారణంగా గత సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన ఫిలిప్స్ ఈసారి అందుబాటులో ఉండటం గుజరాత్ బలాన్ని పెంచింది. తుది జట్టులో ఆడే విదేశీ ఆటగాళ్లలో రషీద్, బట్లర్లకు చోటు ఖాయం కాబట్టి బాంటన్, ఫిలిప్స్లలో ఒకరికే అవకాశం దక్కవచ్చు. ఎందుకంటే బౌలింగ్లో రబాడ లేదా హోల్డర్కు అవకాశం కల్పించడం కూడా కీలకం. టాప్–3 పైనే... గుజరాత్ మరోసారి తమ టాప్–3 బ్యాటింగ్ ఆర్డర్పైనే ప్రధానంగా ఆధారపడుతోంది. గిల్, సాయి సుదర్శన్, బట్లర్ కలిసి 2025 సీజన్లో జట్టు మొత్తం స్కోరులో 74.54 శాతం స్కోరు సాధించారు. ఒకే టీమ్ నుంచి టాప్–3 ఒక సీజన్లో 500కు పైగా పరుగులు చేయడం కూడా ఇదే తొలిసారి. అయితే ఈసారి టైటాన్స్ ఇదే విషయంలో కొంత సవాల్ను కూడా ఎదుర్కొంటోంది. గిల్ భారత టి20 జట్టులో చోటు కోల్పోయాడు. బట్లర్ తన కెరీర్లోనే అతి ఘోరమైన ఫామ్లో ఉన్నాడు. ఇటీవలి టి20 వరల్డ్ కప్లో ఎనిమిది మ్యాచ్లలో అతని అత్యధిక స్కోరు 26 కాగా, ఐదుసార్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. సాయిసుదర్శన్ కూడా గాయం నుంచి కోలుకుంటున్నాడు. కాబట్టి మిడిలార్డర్లో బాంటన్, ఫిలిప్స్, సుందర్, షారుఖ్, తెవాటియాలపై భారీ స్కోరు భారం ఉంది. గత రెండు సీజన్లలో మిడిలార్డర్ బ్యాటర్లు కలిపి అతి తక్కువ పరుగులు చేసిన జట్టు గుజరాత్దే. ఈసారి మాత్రం అదనపు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్ను గుజరాత్ తాజా సీజన్ కోసం బ్యాటింగ్ కోచ్గా ఎంచుకుంది కాబట్టి అతని ప్రభావం కూడా కొంత ఉండవచ్చు. రషీద్ రాణించేనా... ఐపీఎల్లో 9 సీజన్లు ఆడిన లెగ్స్పిన్నర్ రషీద్ ఖాన్ అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. కానీ ఇటీవల రషీద్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. గత రెండు సీజన్లలో అతని ఫామ్ పేలవంగా ఉంది. 2025లోనైతే మరీ ఘోరంగా కనీసం 10 వికెట్లు కూడా తీయలేకపోయిన రషీద్ ఏకంగా 57.11 సగటు నమోదు చేశాడు. ఎకానమీ కూడా 9కి పైగా ఉంది. ఇలాంటి స్థితిలో అతను మళ్లీ లయ అందుకుంటే తప్ప గుజరాత్ బౌలింగ్ బలహీనంగా మారిపోతుంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ సాయికిషోర్ ప్రభావం చూపించగలడు. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ ప్రధాన పేసర్లు కాగా...మూడో పేసర్గా ఆల్రౌండర్ నైపుణ్యం ఉన్న హోల్డర్ వైపే జట్టు మొగ్గు చూపవచ్చు. వేలంలో రూ.7 కోట్లకు ఎంచుకున్న హోల్డర్ ఇటీవలి వరల్డ్ కప్లో మెరుగ్గా రాణించాడు. గత ఏడాది డోపింగ్ నిషేధం కారణంగా నాలుగు మ్యాచ్లకే పరిమితమైన రబాడ ఈసారి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాడు. విదేశీ ప్రత్యామ్నాయ పేసర్గా లెఫ్టార్మ్ బౌలర్ ల్యూక్వుడ్ అందుబాటులో ఉన్నాడు. సీనియర్ పేసర్ ఇషాంత్కు తుది జట్టులో స్థానం లభించడం కష్టమే. ఆంధ్ర ఆటగాడు పృథ్వీరాజ్ గాయం కారణంగా లీగ్కు దూరమయ్యాడు. 2019 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ తరఫున 2 మ్యాచ్లు ఆడిన తర్వాత అతను ఇప్పటి వరకు మరో ఐపీఎల్ మ్యాచ్ ఆడలేదు.గుజరాత్ టైటాన్స్ గణాంకాలుఆడిన మ్యాచ్లు 60 గెలిచినవి 37 ఓడినవి 23 అత్యుత్తమ ప్రదర్శనవిజేత (2022), రన్నరప్ (2023) గుజరాత్ టైటాన్స్ జట్టు: శుబ్మన్ గిల్ (కెపె్టన్), జోస్ బట్లర్, కుమార్ కుశాగ్ర, అనూజ్ రావత్, టామ్ బాంటన్, గ్లెన్ ఫిలిప్స్, సాయిసుదర్శన్, నిశాంత్, వాషింగ్టన్ సుందర్, అర్షద్ ఖాన్, సాయికిషోర్, జయంత్ యాదవ్, జేసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, రబాడ, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ సింగ్, ఇషాంత్ శర్మ, అశోక్ శర్మ, ల్యూక్వుడ్, రషీద్ ఖాన్, కుల్వంత్ ఖెజ్రోలియా. -
గర్జించేందుకు గిల్ రెడీ
అహ్మదాబాద్: మైదానంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా... ప్రశాంతంగా ఉండటం వల్ల సునిశిత దృష్టి అలవడుతుందని గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ కెప్టెన్ శుబ్మన్ గిల్ పేర్కొన్నాడు. ఇటీవల టి20 వరల్డ్కప్ గెలిచిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన గిల్... ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు రెండో టైటిల్ అందించేందుకు సిద్ధమవుతున్నాడు. 2022లో ఐపీఎల్లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ తొలి సీజన్లోనే చాంపియన్ అవతరించింది. ఆ తర్వాత ఏడాది రన్నరప్గా నిలిచిన టైటాన్స్... గత సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరింది. శుక్రవారం నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో... ఆ ఫ్రాంచైజీ ‘శుభారంభం–2026’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం గిల్ మాట్లాడుతూ... ‘నేను సాధారణంగా ప్రశాంతంగానే ఉంటాను. అదే నాకు జట్టుపై నమ్మకం, విశ్వాసం పెంచుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి లోనూ కాకుండా ఉండటం ద్వారా విశాల దృక్పథం అలవుడుతుంది. దీంతో ఆ క్షణాలను విభిన్నంగా చూడగల శక్తి వస్తుంది. అప్పుడు సమస్యల పరిష్కారం సులువు అవుతుంది’ అని వెల్లడించాడు.ఫ్రాంచైజీ క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి మాట్లాడుతూ... ‘గతేడాది మా జట్టు మంచి ప్రదర్శన చేసింది. ఈ సీజన్ ప్రారంభానికి ముందే ఈ కార్యక్రమం ద్వారా ఆటగాళ్లందరినీ ఒక్క చోటకు చేర్చాం. దీంతో జట్టు సభ్యుల మధ్య అనుబంధం పెరగడంతో పాటు పరస్పర నమ్మకం కలుగుతుంది. వేలంలో చిన్నచిన్న మార్పులు మాత్రమే చేశాం. జట్టు కూర్పుకు తగ్గట్లు ప్లేయర్లను ఎంపిక చేసుకున్నాం. ఆ ఫలితాలు మరి కొన్ని రోజుల్లో మీ ముందు ఉంటాయి’ అని అన్నాడు. -
IPL 2026: ‘గెలవడానికే బరిలోకి దిగుతున్నాం’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ టైటాన్స్ ప్రస్థానం 2022లో మొదలైంది. ఆ సీజన్లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ బరిలోకి దిగిన తొలిసారే చాంపియన్గా నిలవడం విశేషం. ఆ మరుసటి ఏడాది అంచనాలను అందుకుంటూ మరోసారి ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్కే పరిమితమయింది. అయితే 2024 సీజన్లో పేలవ ఆటతీరుతో లీగ్ దశకే పరిమితమైన గుజరాత్ గత సీజన్లో మాత్రం మరోసారి మంచి ప్రదర్శన నమోదు చేసింది. గిల్ కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఐదో సీజన్ ఆడనున్న గుజరాత్ టైటాన్స్ ఈసారి కప్పు గెలవడానికే బరిలోకి దిగుతోందని ఆ జట్టు ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా ధీమా వ్యక్తం చేశాడు. సోమవారం రాత్రి గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ పూర్తిస్థాయి జట్టుతో శుభారంభ్-2026 కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆటగాళ్లతో పాటు అభిమానులు, ఫ్రాంచైజీ ఓనర్లు, సహాయక సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నెహ్రా మాట్లాడాడు. ‘ఈ సీజన్లో భిన్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నేను ఆలోచించడానికేం లేదు. ఎందుకంటే బరిలోకి దిగనున్న జట్టు మ్యాచ్ ఎలా ఆడాలన్నది ఆలోచిస్తోంది, జట్టు ఆటగాళ్లు దీని గురించి ఆలోచిస్తారు. ఒక కోచ్గా నేను సలహాలు మాత్రమే అందివ్వగలను. ఈ శుభారంబ్ వేడుక సాక్షిగా ఒక విషయం చెప్పదలచుకున్నా. ఈ సీజన్కు పూర్తి ఆత్మవిశ్వాసంతో వస్తున్నాం. ఈసారి కేవలం పాల్గొనడానికి రాలేదు, ఐపీఎల్లో కప్పు గెలవడానికే వస్తున్నాం. కొత్త జట్టుకు సమయం పడుతుందని అంతా అంటున్నారు. కానీ మా విధానాలు, ప్రణాళికలు ఎప్పుడు రెండు అడుగులు ముందే ఉంటాయి. ఐదేళ్లుగా గుజరాత్ జట్టుతోనే ఉన్నాను. ఈ ఐదేళ్లలో జట్టుతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ శుభారంభ్ మా గుజరాత్ టైటాన్స్కు కొత్త శోభను తీసుకొచ్చింది. ఇది ఇచ్చిన స్ఫూర్తి, ఐక్యతతో ముందుకు సాగుతాం’ అని చెప్పుకొచ్చాడు. ఇక గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లో తొలి మ్యాచ్ను మార్చి 31 ముల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో ఆడనుంది. -
ఇదేం పద్ధతి?.. బీసీసీఐపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఫైర్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీరుపై టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘అసలు ఇదేం పద్ధతి.. చరిత్ర చెరిగిపోదు.. మీ కుట్రలు ఫలించవు’’ అంటూ తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం ‘నమన్-2026’లో దొర్లిన తప్పిదమే ఇందుకు కారణం.రెండు ఐసీసీ టైటిళ్లువిరాట్ కోహ్లి (Virat Kohli) తర్వాత టీమిండియా పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ 2024లో టీ20 ప్రపంచకప్, 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని భారత్కు అందించాడు. తద్వారా మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni-3)తర్వాత టీమిండియాకు అత్యధిక టైటిళ్లు అందించిన సారథిగా చరిత్రకెక్కాడు.ఇక 2024లో టీ20 వరల్డ్కప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. గతేడాది టెస్టులకూ గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్న హిట్మ్యాన్కు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది,వన్డే కెప్టెన్గా ఇప్పటికీ సిరీస్ గెలవని గిల్గతేడాది.. అనూహ్య రీతిలో ఆస్ట్రేలియాతో సిరీస్కు ముందు రోహిత్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి.. శుబ్మన్ గిల్ను సారథిగా నియమించింది. గిల్ కెప్టెన్సీలో భారత్ ఇప్పటి వరకు ఒక్క వన్డే సిరీస్ కూడా గెలవలేదు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతిలో ఓడిన గిల్ సేన.. సొంతగడ్డపై మరీ దారుణంగా న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్స్వీప్నకు గురైంది.ఇదిలా ఉంటే.. నమన్ అవార్డుల పురుషుల విభాగంలో భారత అత్యుత్తమ క్రికెటర్ అవార్డు గిల్కు దక్కింది. ఇంగ్లండ్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో 754 పరుగులు చేసి అటు బ్యాటర్గా, ఇటు సారథిగా గిల్ అత్యుత్తమ ఆటతీరు కనబరిచినందుకు ఈ అవార్డు వరించింది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 విన్నింగ్ కెప్టెన్?ఈ నేపథ్యంలో గిల్ మాట్లాడుతున్న సమయంలో.. నిర్వాహకులు.. ‘శుబ్మన్ గిల్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 విన్నింగ్ కెప్టెన్’’ అని అతడి పేరును స్క్రీన్పై వేశారు. ఇదే రోహిత్ శర్మ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.ఇంత వరకు ఒక్క వన్డే సిరీస్ గెలవని కెప్టెన్కు ఏకంగా చాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్ అని వేయడం ఏమిటని, రోహిత్ శర్మ ఘనత చెరిపేసినా చెరిగిపోదని బీసీసీఐకి చురకలు అంటిస్తున్నారు. మరికొందరు మాత్రం పొరపాటున తప్పు దొర్లి ఉంటుందని కామెంట్ చేస్తుండగా.. రోహిత్ను అవమానించేందుకే ఇలా చేశారంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.చదవండి: : అతడికి 6 ఓవర్లు చాలు.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడుReally???? pic.twitter.com/R0w8hrjFZq— Rohan💫 (@rohann__45) March 15, 2026 -
గురుశిష్యులకు అరుదైన గౌరవం!
టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ అరుదైన గౌరవం అందుకోనున్నాడు. క్రికెట్లో అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డుగా పేరున్న సీకే నాయుడు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును రాహుల్ ద్రవిడ్ సొంతం చేసుకోనున్నాడు. మార్చి 15న ఢిల్లీ వేదికగా బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక జరగనుంది.ఈ వేడుకలోనే రాహుల్ అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించనున్నాడు. కాగా ఇదే వేడుకలో భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకోనున్నాడు. ఇక దేశవాలీ క్రికెట్లో వన్డే ఫార్మాట్లో ఆల్రౌండర్గా గతేడాది అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆయుశ్ మాత్రే ‘లాలా అమర్నాథ్’ అవార్డు అందుకోనున్నాడు. ఇక భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ కూడా లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోనుంది.భారత క్రికెట్లో రాహుల్ ద్రవిడ్ స్థానం ప్రత్యేకమైనది. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్తో సంయుక్తంగా స్థానం సంపాదించిన ద్రవిడ్ ‘ది వాల్’గా గుర్తింపు పొందాడు. టెస్టు క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్గా పేరు పొందిన ద్రవిడ్ ఆల్టైమ్ గ్రేట్ బ్యాటర్గా నిలిచాడు. భారత క్రికెట్లో ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్లు ఆడిన ద్రవిడ్.. 2001లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్లో లక్ష్మణ్తో కలిసి 376 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడంతో పాటు ఆ మ్యాచ్లో భారత్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్ అవతారమెత్తిన ద్రవిడ్.. 2018 అండర్-19 ప్రపంచకప్ టీమిండియా గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. కప్ గెలిచిన జట్టులో శుబ్మన్ గిల్, పృథ్వీ షాలు సభ్యులుగా ఉన్నారు. ఒకప్పుడు గురువు శిక్షణలో అండర్-19 ప్రపంచకప్ సాధించిన గిల్ ఇప్పుడు గురువుతో కలిసి ఒకే వేదికపై అవార్డు అందుకోబోతుండడం విశేషం.ఇక 2021లో టీమిండియా ప్రధాన కోచ్గా ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కోచింగ్లోనూ తనదైన మార్క్ చూపించాడు. ద్రవిడ్ హయాంలోనే టీమిండియా 2023 వన్డే వరల్డ్కప్లో రన్నరప్గా నిలిచింది. 2024లో అమెరికా, వెస్టిండీస్లో జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత్ విజేతగా నిలిచి 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.ఇక శుబ్మన్ గిల్ చివరిగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడాడు. కెప్టెన్ అయిన తర్వాత ఒత్తిడిలో పడిపోయిన గిల్ సరైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఫామ్ లేమితో సతమతమవుతున్న నేపథ్యంలో టీ20 జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది.చదవండి: సచిన్ రిటైర్మెంట్ వెనుక అసలు కథ -
టూ టైమ్ విన్నింగ్ కోచ్తో ఒప్పందం చేసుకున్న గుజరాత్
తమ తొలి సీజన్లోనే (2022) టైటిల్ ఎగరేసుకుపోయి సంచలనం సృష్టించిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ మళ్లీ సక్సెస్ బాట పట్టేందుకు కీలక అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగా టూ టైమ్ విన్నింగ్ కోచ్ విజయ్ దాహియాతో ఒప్పందం చేసుకుంది. రానున్న సీజన్ కోసం అతన్ని అసిస్టెంట్ కోచ్గా నియమించుకుంది. దాహియా ఇటీవలే నియమితుడైన హెడ్ కోచ్ మాథ్యూ హేడెన్కు డిప్యూటీగా వ్యవహరిస్తాడు. దాహియా 2012, 2014లో కేకేఆర్ టైటిల్ గెలిచినప్పుడు ఆ బృందంలో అసిస్టెంట్ కోచ్గా ఉన్నాడు. దాహియా తన ఐపీఎల్ కెరీర్లో కేకేఆర్తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్కు కూడా పని చేశాడు. అతని కోచింగ్లో ఢిల్లీ జట్టు 2007-08 సీజన్లో రంజీ ట్రోఫీ గెలిచింది. ఈ అనుభవం గుజరాత్ టైటాన్స్కి కొత్త ఉత్సాహాన్ని తీసుకురావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, హార్దిక్ పాండ్యా సారథ్యంలో తొలి సీజన్లోనే టైటిల్ గెలిచిన గుజరాత్.. ఆతర్వాత సీజన్లో కూడా ఫైనల్కు చేరినా, సీఎస్కే చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. 2024లో హార్దిక్ పాండ్యా ఆ ఫ్రాంచైజీని వీడి ముంబై ఇండియన్స్లో చేరడంతో శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. గిల్ సారథ్యంలో గుజరాత్ తొలి సీజన్లో ఎనిమిదో స్థానంలో నిలిచింది. గత సీజన్లో ఆ జట్టు మూడో స్థానంలో నిలిచినా ఫైనల్స్కు చేరలేకపోయింది. రాబోయే సీజన్లో మరోసారి గిల్ నేతృత్వంలో గుజ.రాత్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.ఇదిలా ఉంటే, 2026 సీజన్కు సంబంధించి తొలి విడత షెడ్యూల్ (20 మ్యాచ్లు) ఇవాళే విడుదలైంది. గుజరాత్ తమ తొలి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్లో (మార్చి 28) ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్ పోటీపడనున్నాయి. తొలి విడతలో ప్రతి జట్టు తలో నాలుగు మ్యాచ్లు ఆడనుంది.గుజరాత్ టైటాన్స్ తొలి విడత షెడ్యూల్.. - మార్చి 31: GT vs PBKS - ఏప్రిల్ 4: GT vs RR - ఏప్రిల్ 8: GT vs DC - ఏప్రిల్ 12: GT vs LSG దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా షెడ్యూల్ను విడతల వారీగా ప్రకటిస్తామని బీసీసీఐ ముందే చెప్పిన విషయం తెలిసిందే. -
గంభీర్కు వ్యతిరేకంగా అగార్కర్ నిర్ణయాలు!.. ఫలితం?
టీమిండియా హెడ్కోచ్గా టెస్టు ఫార్మాట్లో విమర్శలు మూటగట్టుకున్న గౌతం గంభీర్.. వైట్ బాల్ క్రికెట్లో మాత్రం తిరుగులేని కోచ్ అనిపించుకుంటున్నాడు. అతడి మార్గదర్శనంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ గెలిచిన భారత్.. ఆ తర్వాత పొట్టి ఫార్మాట్ ఆసియాకప్ను కైవసం చేసుకుంది.తాజాగా టీ20 ప్రపంచకప్-2026లోనూ చాంపియన్గా నిలిచిన టీమిండియా.. ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని విధంగా సొంతగడ్డపై కప్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో గంభీర్ విజయవంతమైన కోచ్ అంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది.క్రెడిట్ గంభీర్ ఒక్కడిదే కాదు!అయితే, భారత జట్టు వరుస విజయాల్లో.. ముఖ్యంగా టీ20 వరల్డ్కప్ గెలవడంలో క్రెడిట్ గంభీర్ ఒక్కడికే కాకుండా.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్కూ దక్కాలనేది విశ్లేషకుల మాట. 2023లో టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టాడు ఈ మాజీ క్రికెటర్.అప్పటి నుంచి తనదైన మార్కు చూపించడంలో అగార్కర్ ఎప్పుడూ విఫలం కాలేదు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత.. రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అతడి వారసుడిగా హార్దిక్ పాండ్యా ఎంపిక లాంఛనమేనని అంతా భావించారు.హార్దిక్ స్థానంలో సూర్యను ఎంపిక చేసిఅయితే, అనూహ్య రీతిలో అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సూర్యకుమార్ యాదవ్కు టీ20 జట్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఈ సందర్భంగా విమర్శలు వెల్లువెత్తగా.. అరుదైన పేస్ ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యాను కాపాడుకోవాల్సిన బాధ్యత తమకు ఉందని అగార్కర్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. అదనపు బాధ్యతను పాండ్యా నెత్తిన వేయలేమని పేర్కొన్నాడు.అందుకు తగ్గట్లే విజయవంతమైన కెప్టెన్గా సూర్య రాణించగా.. టీ20 ప్రపంచకప్-2026 గెలవడంలో ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. 2024 తర్వాత టీమిండియా టీ20 ఓపెనింగ్ జోడీగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించారు.సంజూ అయితే ఏకంగా సౌతాఫ్రికా గడ్డ మీద సెంచరీలు బాది సత్తా చాటాడు. అయితే, ఆసియా కప్-2025 సందర్భంగా అప్పటికే టెస్టు, వన్డే జట్ల కెప్టెన్గా ఉన్న శుబ్మన్ గిల్ తిరిగి రావడంతో.. ఓపెనర్గా సంజూ స్థానం గల్లంతైది. కానీ సెలక్టర్ల నమ్మకాన్ని గిల్ వమ్ము చేశాడు. వరుస వైఫల్యాలతో అతడు సతమతం కాగా.. మేనేజ్మెంట్ తీరుపై విమర్శల వర్షం కురిసింది.గిల్పై వేటు వేస్తూ సంచలన నిర్ణయంగిల్ కోసం సంజూ లాంటి ప్రతిభావంతుడైన ఆటగాడిని బలిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మెగా టోర్నీ ఆరంభానికి ముందు సెలక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఊహించని రీతిలో గిల్పై వేటు వేసింది. ప్రపంచకప్ జట్టుకు అతడిని ఎంపిక చేయకుండా పక్కన పెట్టింది.ఈ విషయంలో గంభీర్- అగార్కర్ (Gautam Gambhir- Ajit Agarkar) మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం.. గంభీర్ గిల్ను ఎంపిక చేయాలని పట్టుబట్టగా.. ‘‘మీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. అతడు నాణ్యమైన ఆటగాడు.కానీ జట్టులో ఇప్పుడు ఎవరో ఒకరికే స్థానం. ఒకరిని తప్పించక తప్పదు. ఆ ఒక్కడు గిల్. దీనర్థం అతడు ఇందుకు అనర్హుడని కాదు. అదృష్టవశాత్తూ భారత క్రికెట్లో ఎన్నో ఆప్షన్లు ఉండటమే ఇందుకు కారణం’’ అని అగార్కర్ వాదించినట్లు తెలుస్తోంది.ఇషాన్ విషయంలోనూ..అదే విధంగా... దేశీ క్రికెట్లో సత్తా చాటిన ఇషాన్ కిషన్.. దాదాపు మూడేళ్ల తర్వాత ఏకంగా ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలోనూ అగార్కర్దే తుది నిర్ణయం అని సమాచారం. ‘‘వైట్ బాల్ క్రికెట్లో అతడు టాపార్డర్లో ఆడతాడు.మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంతకు ముందు కూడా టీమిండియాకు ఆడాడు. రిషభ్ పంత్. ధ్రువ్ జురెల్ కారణంగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అంతేగానీ ప్రతిభ లేక కాదు’’ అని అగార్కర్ కన్విన్స్ చేసినట్లు తెలుస్తోంది. రింకూ సింగ్ను ఎంపిక చేయడంలోనూ చీఫ్ సెలక్టర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇటు ఇషాన్.. అటు సంజూఇక సెలక్టర్ల నమ్మకానికి తగ్గట్లు ఇషాన్ కిషన్ వరల్డ్కప్ టోర్నీలో దుమ్ములేపాడు. అయితే, గంభీర్ నిర్ణయానికి అనుగుణంగా నాకౌట్ దశలో తుదిజట్టులోకి వచ్చిన సంజూ ఆకాశమే హద్దుగా చెలరేగి.. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి సత్తా చాటాడు.ఇదిలా ఉంటే.. భారత్ వరల్డ్కప్ గెలిచిన తర్వాత గంభీర్ మాట్లాడుతూ.. అగార్కర్కు క్రెడిట్ ఇవ్వడం విశేషం. ‘‘ఈ ట్రోఫీని నేను అగార్కర్కు అంకితం చేయాలి. అతడు చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా సరే వెనక్కి తగ్గలేదు. నిజాయితీ గల ఇలాంటి వ్యక్తితో పనిచేయడం పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను’’ అని గంభీర్ పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: 'భారత్ ఒక ఛాంపియన్ జట్టు.. తప్పులు వెతకడం ఆపండి'⭐ 2007 ⭐ 2024 ⭐ 2026History repeated. History defeated. 🇮🇳💙#T20WorldCup pic.twitter.com/dRrraSdOoi— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
భారీ శతకం బాదిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్.. ట్రోలింగ్ కూడా భారీగానే..!
అండర్-19 ప్రపంచకప్ 2026లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఫైసల్ షినోజాదా భారీ సెంచరీతో కదంతొక్కాడు. ఐర్లాండ్తో ఇవాళ (జనవరి 30) జరిగిన మ్యాచ్లో 142 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లు, సిక్సర్ సాయంతో 163 పరుగులు చేశాడు. ఫైసల్తో పాటు కెప్టెన్ మహబూబ్ ఖాన్ (89) కూడా సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఆఫ్ఘన్ బౌలర్లు చెలరేగిపోయారు. కలిసికట్టుగా రాణించి ఐర్లాండ్ను 40.4 ఓవర్లలో 124 పరుగులకే కుప్పకూల్చారు. తద్వారా ఈ మ్యాచ్లో ఆఫ్ఘన్లు 191 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ 1 (సూపర్ సిక్స్) నుంచి సెమీఫైనల్ (ఆస్ట్రేలియాతో పాటు) బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ గెలుపుతో అప్పటిదాకా సెమీస్ రేసులో ఉండిన శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ గ్రూప్ నుంచి వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఐర్లాండ్ కూడా ఇంటిముఖం పట్టాయి. గ్రూప్-2 విషయానికొస్తే.. ఈ గ్రూప్లో ఇంగ్లండ్ ఒక్కటే ఇప్పటివరకు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరో బెర్త్ కోసం భారత్, పాకిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. ఈ గ్రూప్ నుంచి బంగ్లాదేశ్, న్యూజిలాండ్, జింబాబ్వే జట్లు నిష్క్రమించాయి.ఇదిలా ఉంటే, ఐర్లాండ్తో మ్యాచ్లో భారీ శతకం బాదిన ఫైసల్ షినోజాదాపై సోషల్మీడియా వేదికగా భారీ ట్రోలింగ్ జరుగుతుంది. ఫైసల్ను చూసిన వారు ఇతను 17 ఏళ్ల పిల్లాడేంటీ అని అవాక్కవుతున్నారు. వయసు తక్కువగా చూపించుకొని, తప్పుడు ధృవపత్రాలతో అతను అండర్-19 విభాగంలో ఆడుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా పాకిస్తాన్ ఆటగాళ్ల విషయంలో ఇలాంటి ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి ఆఫ్ఘనివస్తాన్ ఆటగాడు దీనికి బలయ్యాడు. వాస్తవానికి ఫైసల్ను చూస్తే నిజంగానే ఎవరూ 17 ఏళ్ల కుర్రాడంటే ఒప్పుకోరు. అతని ఆహార్యం మధ్యవయస్కుడిలా కనిపిస్తుంది. భారత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ కూడా ఇలాంటి ట్రోలింగ్నే ఎదుర్కొన్నాడు. అతను భారీ షాట్లు ఆడే విధానం చూసి, గిట్టని వారు వ్యతిరేక కామెంట్లు చేశారు. -
గిల్కు బాగానే అర్థమైంది: రాహుల్ ద్రవిడ్
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ను ఉద్దేశించి భారత జట్టు మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మూడు ఫార్మాట్లు ఆడుతున్న ప్లేయర్గా ఇప్పటికైనా గిల్కు అందులోని కష్టం అర్థమైందని పేర్కొన్నాడు. టెస్టు ప్రాధాన్యత ఏమిటో అతడికి తెలిసివచ్చిందని.. అందుకే ఆ దిశగా మార్పుల కోసం గొంతు విప్పాడని ద్రవిడ్ అన్నాడు.ఘోర పరాభవాలుగత రెండేళ్ల కాలంలో సొంతగడ్డపై టీమిండియాకు రెండు ఘోర పరాభవాలు ఎదురయ్యాయి. న్యూజిలాండ్ చేతిలో తొలిసారి 3-0తో టెస్టు సిరీస్లో వైట్వాష్కు గురైన భారత్.. ఇటీవల సౌతాఫ్రికా చేతిలోనూ పాతికేళ్ల విరామం తర్వాత తొలిసారి 2-0తో క్లీన్స్వీప్ అయింది.అందుకే ఈ చేదు అనుభవాలుఈ పరిణామాల నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. మరోవైపు.. కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన గిల్ (Shubman Gill)కు సైతం సఫారీల చేతిలో వైట్వాష్ రూపంలో పీడకల మిగిలింది. విరామం లేకుండా వరుస సిరీస్లు ఆడటం.. సరైన విధంగా సన్నద్ధం కాకపోవడం వల్లే టెస్టుల్లో చేదు అనుభవం మిగిలిందని గిల్ భావించాడు.బీసీసీఐకి ఓ విజ్ఞప్తిఈ నేపథ్యంలోనే టెస్టు సిరీస్కు ముందు కనీసం పదిహేను రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని గిల్.. బీసీసీఐని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తాజాగా స్పందించాడు. బెంగళూరులో ఓ ఈవెంట్కు హాజరైన సందర్భంగా ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ..గిల్కు బాగానే అర్థమైంది‘‘టెస్టు సన్నద్ధత గురించి శుబ్మన్ ఇటీవలే ఓ కీలక సలహా ఇచ్చినట్లు తెలిసింది. అనుభవజ్ఞుడైన ఆటగాడిగా అతడికి ఈ విషయంలో అవగాహన ఉంది. ఇటీవల కాలంలో అతడు మూడు ఫార్మాట్లు ఆడుతూ బిజీగా గడిపాడు.ఈ క్రమంలోనే టెస్టు ఫార్మాట్కు ఎలా సన్నద్ధం కావాలన్న అంశం అతడికి ఇప్పటికి బాగా అర్థమై ఉంటుంది. సంప్రదాయ క్రికెట్లో ఉన్న కష్టం ఏమిటో అతడికి తెలుసు. ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు.మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లు.. వెనువెంటనే ఒక ఫార్మాట్ నుంచి మరొకదానికి మారటం కాస్త కష్టంగానే ఉంటుంది. టెస్టు సిరీస్కు నాలుగు రోజుల ముందు కూడా మ్యాచ్ ఆడాల్సి ఉంటే పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. అసలు టెస్టు మ్యాచ్కు సన్నద్ధమయ్యే సమయమే దొరకదు.ప్రాక్టీస్తో పాటు నైపుణ్యం అవసరంగత నాలుగైదు నెలల క్రితం జరిగిన రెడ్బాల్ మ్యాచ్ల ఆధారంగా జట్టులోని కొంతమంది ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి వచ్చిన విషయాన్ని గమనించాలి. ఇదే అతిపెద్ద సవాలు. టర్నింగ్ ట్రాక్స్, లేదంటే సీమింగ్ పిచ్ల మీద గంటల తరబడి బ్యాటింగ్ చేయడం అంత సులువేమీ కాదు. ఇందుకు ప్రాక్టీస్తో పాటు నైపుణ్యం అవసరం’’ అని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు.చదవండి: టీ20 వరల్డ్కప్-2026: సెమీ ఫైనల్ చేరే జట్లు ఇవే! -
WC 2027: రోహిత్ శర్మ వరల్డ్కప్ ఆడకుండా కుట్ర!?
టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత రోహిత్ శర్మది. హిట్మ్యాన్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిళ్లను భారత్ కైవసం చేసుకుంది.అయితే, కోరుకున్నట్లుగానే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకొన్న రోహిత్ శర్మ.. అనూహ్య రీతిలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఊహించని విధంగా వన్డే కెప్టెన్సీ నుంచి మేనేజ్మెంట్ అతడిని తొలగించింది.అగార్కర్ అలారోహిత్ శర్మ స్థానంలో శుబ్మన్ గిల్ (Shubman Gill)కు వన్డే పగ్గాలూ అప్పగించగా.. వరుసగా రెండు సిరీస్లలో టీమిండియా ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్కప్-2027లో రోహిత్ ఆడే విషయంపై స్పష్టత లేనందనే అతడిని కెప్టెన్గా తప్పించామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పాడు.ఆస్ట్రేలియా గడ్డ మీద హిట్ఈ క్రమంలో.. కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత ఆస్ట్రేలియా గడ్డ మీద రోహిత్ శర్మ అదరగొట్టాడు. సెంచరీ చేసి మరీ తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నాడు. అనంతరం బీసీసీఐ ఆదేశాల మేరకు ముంబై తరఫున దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ బరిలో దిగి అక్కడా శతక్కొట్టాడు.అయితే, తాజాగా న్యూజిలాండ్తో సిరీస్లో మాత్రం రోహిత్ శర్మ స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాడు. మూడు వన్డేలలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ చేసిన స్కోర్లు వరుసగా.. 26, 24, 11. ఈ నేపథ్యంలో రోహిత్ ఆట తీరుపై విమర్శలు రాగా.. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే కూడా ఇందుకు మద్దతు ఇచ్చినట్లుగానే వ్యాఖ్యలు చేశాడు.డష్కాటే కామెంట్స్‘‘తొలి వన్డేలో రోహిత్ స్థాయికి తగినట్లు ఆడలేదు. ఆ తర్వాతి మ్యాచ్లూ అతడికి సవాలుగా మారాయి. ఈ సిరీస్కు ముందు పెద్దగా క్రికెట్ ఆడకపోవడం వల్లే ఇలా జరిగింది’’ అని డష్కాటే పేర్కొన్నాడు. నిజానికి ఆసీస్తో సిరీస్లో సత్తా చాటిన రోహిత్.. దేశీ క్రికెట్లోనూ ఆడాడు. అయినప్పటికీ డష్కాటే ఇలా వ్యాఖ్యానించాడు.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి డష్కాటే తీరును ఎండగట్టాడు. కోచ్ చేసే ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఆటగాళ్ల మానసిక స్థితి ప్రభావితం అవుతుందని.. అతడిని ఒత్తిడిలోకి నెట్టివేయాలనే ప్రయత్నం తగదని చురకలు అంటించాడు.కోచ్కు ఇచ్చిపడేసిన మనోజ్ తివారిటీమిండియా సహాయక సిబ్బందిలో భాగమై ఉండి ఇలా మాట్లాడటం సరికాదని మనోజ్ తివారి డష్కాటేను విమర్శించాడు. రోహిత్తో నెట్స్లో తీవ్రంగా ప్రాక్టీస్ చేయిస్తూనే.. మీడియా ముందుకు వచ్చి అందుకు విరుద్ధంగా మాట్లాడటం ఏమిటని మండిపడ్డాడు. రోహిత్ ఫామ్ గురించి అడిగినపుడు నోరు మూసుకుని ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.మరోవైపు.. టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మను వన్డే జట్టులోకి తీసుకుని.. వరల్డ్కప్-2027లోనూ ఆడిస్తే బాగుంటుందని ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. అతడి కంటే యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ముందు వరుసలో ఉన్నాడని పేర్కొన్నాడు. కాగా వన్డేల్లో ప్రస్తుతం గిల్- రోహిత్ ఓపెనర్లుగా ఉన్నారు.వరల్డ్కప్ ఆడకుండా కుట్ర!?ఓవైపు అగార్కర్, డష్కాటే కామెంట్స్.. మరోవైపు ఇర్ఫాన్ పఠాన్ అంచనాలు.. వీటన్నింటిని చూసి రోహిత్ శర్మ అభిమానులు చిర్రెత్తిపోతున్నారు. హిట్మ్యాన్ను వన్డే వరల్డ్కప్-2027 ఆడకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లి విషయంలోనూ అగార్కర్ ఇలాగే మాట్లాడాడని.. అయితే, అతడు వరుస సెంచరీలు చేయడంతో ఇప్పట్లో అతడికి జోలికి వెళ్లరని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా డష్కాటేకు మనోజ్ తివారి చివాట్లు పెట్టిన తీరు బాగుందని.. దిగ్గజ ఆటగాడి పట్ల ఒక కోచ్ ఇలా వ్యవహరించడం సరికాదని పేర్కొంటున్నారు.చదవండి: IND vs NZ: అతడు అవుట్!.. భారత తుదిజట్టులో మార్పు! -
‘గిల్పై వేటు.. వన్డే కెప్టెన్గా తిరిగి రోహిత్ శర్మనే’
టీమిండియా వన్డే కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన శుబ్మన్ గిల్కు వరుసగా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అతడి సారథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఆతిథ్య జట్టు చేతిలో భారత్ 2-1 తేడాతో ఓడిపోయింది.అనంతరం తాజాగా న్యూజిలాండ్తో సొంతగడ్డపై జరిగిన వన్డే సిరీస్లోనూ టీమిండియాకు పరాభవం ఎదురైంది. స్వదేశంలో మొట్టమొదటి సారి కివీస్కు భారత్ వన్డే సిరీస్ను కోల్పోయింది. తొలి వన్డేలో విజయం సాధించిన గిల్ సేన.. ఆ తర్వాత వరుసగా రెండో వన్డేల్లోనూ ఓటమిపాలైంది. అయితే, ఈ సిరీస్లో కివీస్ తమ ద్వితీయ శ్రేణి జట్టుతో ఆడటం గమనార్హం.గిల్పై వేటు.. రోహిత్ శర్మకే పగ్గాలు ఇవ్వండిఈ నేపథ్యంలో శుబ్మన్ గిల్ (Shubman Gill) కెప్టెన్సీపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గిల్పై వేటు వేసి వన్డే కెప్టెన్సీని తిరిగి రోహిత్ శర్మ (Rohit Sharma)కు అప్పగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి విజ్ఞప్తి చేశాడు.ఈ మేరకు.. ‘‘ఇప్పటికీ సమయం మించిపోలేదు. తప్పును సరిచేసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది. ఇదేదో ద్వైపాక్షిక సిరీస్ గురించి కాదు. ముందుంది వరల్డ్కప్ టోర్నీ. ప్రతిష్టాత్మక టోర్నీలో ప్రయోగాలు అవసరం లేదు.అసలు వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ కివీస్తో సిరీస్లో గనుక రోహిత్ కెప్టెన్గా ఉండి ఉంటే ఫలితం కచ్చితంగా వేరుగా ఉండేది. అతడి సారథ్యంలోనే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన విషయాన్ని మర్చిపోకూడదు.రోహిత్ కెప్టెన్గా ఉంటేఅప్పుడే జట్టు సరైన దిశలో వెళ్తోందని నాకు అనిపించింది. గిల్ కంటే రోహిత్ ఎన్నోరెట్లు గొప్ప కెప్టెన్. అతడొక విజయవంతమైన సారథి. గిల్ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్కప్ గెలిచే అవకాశాలు ఉండవచ్చు. అయితే, రోహిత్ కెప్టెన్గా ఉంటే జట్టు కచ్చితంగా చాంపియన్గా నిలుస్తుంది. ఇందుకు 85- 90 శాతం అవకాశం ఉంది’’ అని ఇన్సైడ్స్పోర్ట్తో మనోజ్ తివారి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన సారథికాగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్ చేరిన టీమిండియా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో విజేతగా నిలిచింది. ఈ క్రమంలో వన్డే వరల్డ్కప్-2027లోనూ భారత జట్టును ముందుకు నడిపించాలని రోహిత్ భావించగా.. బీసీసీఐ అనూహ్య రీతిలో అతడిపై వేటు వేసింది. ఆస్ట్రేలియా టూర్కు ముందు రోహిత్ను తప్పించి గిల్కు వన్డే పగ్గాలు అప్పగించింది.ఇక అంతకుముందే రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలకగా.. అతడి స్థానంలో గిల్ సారథిగా నియమితుడయ్యాడు. మరోవైపు.. భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉన్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ను చాంపియన్గా నిలిపిన తర్వాత రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించగా.. సారథిగా సూర్య అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. చదవండి: వరల్డ్కప్-2027లో అతడిని ఆడించాలి: భారత మాజీ క్రికెటర్ -
ఒకే రోజు 23 వికెట్లు
రాజ్కోట్: టీమిండియా వన్డే, టెస్టు జట్ల సారథి శుబ్మన్ గిల్... దేశవాళీ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో ప్రభావం చూపలేకపోయాడు. గ్రూప్ ‘బి’లో భాగంగా గురువారం సౌరాష్ట్రతో ప్రారంభమైన పోరులో పంజాబ్ కెప్టెన్గా బరిలోకి దిగిన గిల్ (0) రెండు బంతులు ఎదుర్కొని పార్థ్ బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగాడు. ఇరు జట్ల బ్యాటర్లు సైతం స్పిన్నర్లను ఎదుర్కోవడంలో విఫలమవడంతో ఈ మ్యాచ్ తొలి రోజే 23 వికెట్లు నేలకూలాయి. మొదట సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 47.1 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. జయ్ గోహిల్ (117 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్స్లు) ఒక్కడే అర్ధశతకంతో రాణించగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (7) నిరాశ పర్చగా.. హార్విక్ దేశాయ్ (13), చిరాగ్ జానీ (8), అర్పిత్ (2), సమర్ (0) ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు వరుసకట్టారు. ప్రేరక్ మన్కడ్ (32) ఫర్వాలేదనిపించాడు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ 38 పరుగులిచ్చి 6 వికెట్లతో అదరగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ తీవ్రంగా తడబడింది. 40.1 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. ప్రభ్సిమ్రన్ సింగ్ (60 బంతుల్లో 44; 7 ఫోర్లు), అన్మోల్ప్రీత్ సింగ్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. గిల్తో పాటు హర్నూర్ సింగ్ (0), నేహల్ వధేరా (6), ప్రేరిత్ దత్తా (11), ఉదయ్ శరణ్ (23) విఫలమయ్యారు. సౌరాష్ట్ర బౌలర్లలో పార్థ్ భట్ 33 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... రవీంద్ర జడేజా, ధర్మేంద్ర జడేజా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌరాష్ట్ర తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. హార్విక్ దేశాయ్ (6), చిరాగ్ జానీ (5), జయ్ గోహిల్ (8) అవుటయ్యారు. చేతిలో 7 వికెట్లు ఉన్న సౌరాష్ట్ర ఓవరాల్గా 57 పరుగుల ఆధిక్యంలో ఉంది. ధర్మేంద్ర జడేజా (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఇదే గ్రూప్లో భాగంగా మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్లో గోవా జట్టు తొలి ఇన్నింగ్స్లో 82.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్లో మధ్యప్రదేశ్ 90 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. చండీగఢ్తో మ్యాచ్లో కేరళ తొలి ఇన్నింగ్స్లో 56 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటైంది. చండీగఢ్ 34 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 142 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. -
శుబ్మన్ గిల్ ఫెయిల్.. జడ్డూ విఫలమైనా..
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ దేశవాళీ క్రికెట్లో పునరాగమనం చేశాడు. ఇటీవల వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా పంజాబ్ తరఫున ఒక్క మ్యాచ్ ఆడాడు గిల్. అనంతరం న్యూజిలాండ్తో వన్డే సిరీస్తో బిజీ అయ్యాడు.ఈ సిరీస్లో గిల్ సేన కివీస్ చేతిలో 2-1తో ఓటమిపాలై విమర్శలు మూటగట్టుకుంది. ఇక కివీస్తో టీ20 సిరీస్, టీ20 ప్రపంచకప్-2026 జట్టు నుంచి సెలక్టర్లు గిల్ (Shubman Gill)ను తప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీ క్రికెట్పై దృష్టి సారించిన అతడు.. పంజాబ్ కెప్టెన్గా రంజీ సెకండ్ లీగ్ బరిలో దిగాడు.పంజాబ్ తొలుత బౌలింగ్రాజ్కోట్ వేదికగా సౌరాష్ట్రతో మ్యాచ్లో టాస్ ఓడిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసింది. హర్ప్రీత్ బ్రార్ (Harpreet Brar) ఆరు వికెట్లతో చెలరేగగా.. జసిందర్ సింగ్ రెండు, సన్వీర్ సింగ్, ప్రేరిత్ దత్తా చెరో వికెట్తో సత్తా చాటారు. ఫలితంగా సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకే ఆలౌట్ అయింది.జడ్డూ విఫలంసౌరాష్ట్ర ఇన్నింగ్స్లో వన్డౌన్ బ్యాటర్ జై గోహిల్ 82 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. ప్రేరక్ మన్కడ్ 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. టీమిండియా సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (7) సహా మిగిలిన వారంతా విఫలమయ్యారు.ఈ క్రమంలో గురువారం నాటి తొలి రోజు ఆటలోనే పంజాబ్ బ్యాటింగ్ మొదలుపెట్టింది. సౌరాష్ట్ర పేసర్, కెప్టెన్ జయదేవ్ ఉనాద్కట్ దెబ్బకు పంజాబ్ ఓపెనర్ హర్నూర్ సింగ్ (0) పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.అయితే, మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (44) నిలకడగా ఆడే ప్రయత్నం చేయగా అతడితో పాటు.. వన్డౌన్ బ్యాటర్ ఉదయ్ సహారన్ (23)ను ధర్మేంద్రసిన్హ జడేజా పెవిలియన్కు పంపాడు. ఇక నాలుగో నంబర్ బ్యాటర్ నేహాల్ వధేరా (6)ను పార్థ్ భూట్ అవుట్ చేశాడు.గిల్ డకౌట్ఈ క్రమంలో ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన గిల్ను సైతం పార్థ్ వెనక్కి పంపాడు. అతడి బౌలింగ్లో రెండు బంతులు ఎదుర్కొన్న గిల్ లెగ్ బిఫోర్ వికెట్ (LBW)గా పెవిలియన్ చేరాడు. ఇలా రీఎంట్రీలో గిల్కు చేదు అనుభవమే మిగిలింది. సౌరాష్ట్ర తరఫున రవీంద్ర జడేజా.. పంజాబ్ తరఫున గిల్ బరిలోకి దిగడంతో ఈ మ్యాచ్పై ఆసక్తి నెలకొనగా ఇద్దరూ నిరాశపరచడంతో అభిమానులు ఉసూరుమంటున్నారు.పంజాబ్ ఆలౌట్.. సౌరాష్ట్రకుకు ఆధిక్యంకాగా పంజాబ్ తరఫున ప్రభ్సిమ్రన్ (44), అన్మోల్ప్రీత్ సింగ్ (35) రాణించారు. మిగిలిన వారంతా చేతులెత్తేయడంతో 139 పరుగులకే ఆలౌట్ అయింది. సౌరాష్ట్ర బౌలర్లలో పార్థ్ ఐదు వికెట్లతో దుమ్ములేపగా.. రవీంద్ర జడేజా, ధర్మేంద్రసిన్హ జడేజా చెరో రెండు.. ఉనాద్కట్ ఒక వికెట్ తమ ఖాతాలో జమచేసుకున్నారు. బౌలర్ల అద్భుత ప్రదర్శన కారణంగా సౌరాష్ట్రకు 33 పరుగుల ఆధిక్యం లభించింది. బ్యాటింగ్లో నిరాశపరిచిన జడ్డూ బౌలింగ్లో మాత్రం ఫర్వాలేదనిపించాడు.చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే!During today’s Ranji match, Shubman Gill was actually not out. It was clearly bat first, but since there is no DRS in domestic matches, he was given out. BCCI, if you can’t provide DRS or even a proper live stream, then don’t conduct tournaments like this. pic.twitter.com/0LEZFFANgd— MARCUS (@MARCUS907935) January 22, 2026 -
అటు గిల్... ఇటు జడేజా
రాజ్కోట్: రెండు నెలల విరామం అనంతరం దేశవాళీ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ చివరి అంకానికి రంగం సిద్ధమైంది. ఒకవైపు భారత జట్టు న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడుతుండగా... ఈ ఫార్మాట్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని టాప్ ఆటగాళ్లందరూ రంజీ ట్రోఫీలో తమ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారత వన్డే, టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్... పంజాబ్ జట్టుకు సారథ్యం వహిస్తుండగా... సిరాజ్ హైదరాబాద్ జట్టును నడిపించనున్నాడు. వీరితో పాటు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి ఇలా పలువురు టీమిండియా ప్లేయర్లు ఈ టోర్నీ బరిలోకి దిగనున్నారు. నవంబర్ రెండో వారంలో చివరగా రంజీ మ్యాచ్లు జరగగా... రెండో అంచె పోటీలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. రంజీ ట్రోఫీకి విరామం ఇచ్చిన సమయంలో ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నీ, విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీ జరిగాయి. గ్రూప్ ‘ఎ’లో భాగంగా మాజీ విజేత విదర్భతో ఆంధ్ర జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్కు అనంతపురం వేదిక కానుంది. తొలి అంచె పోటీల్లో 5 మ్యాచ్లాడిన ఆంధ్ర జట్టు 3 విజయాలు, 2 ‘డ్రా’లతో 22 పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో ఉంది. విదర్భ 25 పాయింట్లతో ‘టాప్’లో కొనసాగుతోంది. మొత్తం 32 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించగా... ఇప్పటి వరకు ఒక్కో జట్లు ఐదేసి మ్యాచ్లు ఆడాయి. ఇక లీగ్ దశలో రెండేసి మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉండగా... ఒక్కో గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర, విదర్భ పోరు మరింత ఆసక్తి రేపుతోంది. న్యూజిలాండ్తో చివరి వన్డేలో హాఫ్సెంచరీతో ఆకట్టుకున్న పేస్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి. శ్రీకర్ భరత్, రికీ భుయ్, షేక్ రషీద్లతో ఆంధ్ర జట్టు బలంగా ఉండగా... విదర్భ జట్టు ఇటీవలే విజయ్ హజారే వన్డే ట్రోఫీ నెగ్గి ఫుల్ జోష్లో ఉంది. సొంతగడ్డపై తొలిసారి న్యూజిలాండ్ చేతిలో టీమిండియా వన్డే సిరీస్ కోల్పోగా... ఆ వెంటనే శుబ్మన్ గిల్ పంజాబ్ జట్టుతో చేరాడు. నేటి నుంచి సౌరాష్ట్రతో జరగనున్న గ్రూప్ ‘బి’ మ్యాచ్లో గిల్ పంజాబ్ జట్టును నడిపించనున్నాడు. మరోవైపు సౌరాష్ట్ర తరఫున రవీంద్ర జడేజా బరిలోకి దిగనున్నాడు. కర్ణాటక తరఫున కేఎల్ రాహుల్, బెంగాల్ తరఫున మొహమ్మద్ షమీ కూడా మ్యాచ్లకు సిద్ధమయ్యారు. -
టీమిండియా టీ20 కెప్టెన్గా అతడే!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్గా టీమిండియా బరిలో దిగనుంది. సొంతగడ్డపై ఈ ఐసీసీ ఈవెంట్ జరుగనుండటం సూర్యకుమార్ సేనకు మరో సానుకూలాంశం. ఇక ఈ మెగా టోర్నీకి సన్నాహకంగా న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ పాల్గొననుంది.ఇదిలా ఉంటే.. కివీస్తో పాటు ప్రపంచకప్ టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టు నుంచి సెలక్టర్లు శుబ్మన్ గిల్ను తప్పించిన విషయం తెలిసిందే. టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్గా ఉన్న గిల్.. చాన్నాళ్ల తర్వాత అంతర్జాతీయ టీ20లలోకి తిరిగి వచ్చి వరుసగా విఫలం కావడమే ఇందుకు కారణం.అద్భుతమైన ఆటగాడుఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్కప్ టోర్నీ తర్వాత గిల్ భారత టీ20 జట్టులోకి తిరిగి రావడమే కాకుండా.. ఏకంగా కెప్టెన్ కూడా అవుతాడని అంచనా వేశాడు. ఈ సందర్భంగా గిల్ అద్భుతమైన ఆటగాడు అని క్లార్క్ ప్రశంసలు కురిపించాడు.ఫామ్లేమి కారణంగానేబియాండ్23క్రికెట్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికీ అతడు పోటీలోనే ఉన్నాడు. ప్రస్తుతం జట్టుకు అవసరమైన రీతిలో అతడు బ్యాటింగ్ చేయడం లేదన్న కారణంగా పక్కనపెట్టారు. అంతేకాదు.. టీమిండియాకు లెక్కకు మిక్కిలి ఓపెనింగ్ బ్యాటర్ ఆప్షన్లు ఉన్నాయి.ప్రస్తుతం అతడు కెప్టెన్ కూడా కాదు. అందుకే వరల్డ్కప్ జట్టు నుంచి అతడిని తొలగించే సాహసం చేశారు. ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా భావిస్తున్న న్యూజిలాండ్ సిరీస్కు కూడా అతడిని ఎంపిక చేయలేదు. ఫామ్లేమి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.కెప్టెన్సీ చేపట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదుఅయితే, ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తర్వాత గిల్ జట్టులోకి తిరిగి రావడమే కాదు.. కెప్టెన్సీ చేపట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అతడొక అద్భుతమైన ప్లేయర్. ప్రస్తుతం అతడు ఫామ్లో లేకపోవచ్చు. అయితే, కెప్టెన్ అయ్యేందుకు అతడికి అర్హత ఉంది. ప్రస్తుతానికి వరల్డ్కప్ టోర్నీ మీద దృష్టి పెట్టినందు వల్లే మేనేజ్మెంట్ అతడిని తప్పించింది’’ అని క్లార్క్ అభిప్రాయపడ్డాడు.రోహిత్ స్థానంలో సూర్య, గిల్ కాగా రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ భారత టీ20 జట్టు సారథిగా అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. ఇక టెస్టుల్లో రోహిత్ రిటైర్మెంట్ తర్వాత శుబ్మన్ గిల్ పగ్గాలు చేపట్టగా.. గతేడాది వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ను తప్పించి గిల్కు ఆ బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం. అయితే, క్లార్క్ అభిప్రాయపడినట్లు వరల్డ్కప్ తర్వాత గిల్ సూర్య స్థానాన్ని భర్తీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్- శ్రీలంకలు వేదికలుగా టీ20 ప్రపంచకప్-2026 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: T20 WC: సూర్యకుమార్ యాదవ్కు రోహిత్ శర్మ వార్నింగ్ -
గిల్ కెప్టెన్సీపై అశ్విన్ ఘాటు విమర్శలు
టెస్టులకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత శుబ్మన్ గిల్ టీమిండియా సారథిగా పగ్గాలు చేపట్టాడు. అనంతరం వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ను తప్పించి మరీ ఆ బాధ్యతలను గిల్కు అప్పగించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI).అయితే, పూర్తి స్థాయి కెప్టెన్గా గిల్ (Shubman Gill) ఇంత వరకు చెప్పుకోదగ్గ విజయాలు ఏవీ సాధించలేదు. ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేయగలిగాడు. అయితే, స్వదేశంలో వెస్టిండీస్ను 2-0తో టెస్టుల్లో వైట్వాష్ చేసినా.. సౌతాఫ్రికా చేతిలో పాతికేళ్ల తర్వాత భారత్ తొలిసారి 2-0తో వైట్వాష్కు గురైంది.అశూ స్పందన ఇదేతాజాగా గిల్ సేనకు న్యూజిలాండ్ చేతిలోనూ ఘోర పరాభవం ఎదురైంది. కివీస్ జట్టు భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుబ్మన్ గిల్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) కూడా ఈ విషయంపై స్పందించాడు.ధోని, రోహిత్లను చూసి నేర్చుకోకివీస్ సిరీస్లో ముఖ్యంగా ఇండోర్లో ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో గిల్ అనుసరించిన వ్యూహాలను అశూ తప్పుబట్టాడు. ఈ మేరకు.. ‘‘మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మలను గొప్ప కెప్టెన్లు అని ఎందుకు ప్రశంసిస్తారో తెలుసు కదా!వారిద్దరికి ఏ సమయంలో ఏ అస్త్రాన్ని ఉపయోగించాలో బాగా తెలుసు. తమకు ఉన్న వనరులను వారు ఎల్లప్పుడూ సద్వినియోగం చేసుకుంటారు. ఏ బ్యాటర్కు ఏ బౌలర్తో బౌలింగ్ వేయించాలో వాళ్లకు బాగా తెలుసు. అయితే, కివీస్తో సిరీస్లో ఇది మిస్సయింది.ఎంతమాత్రం సరికాదుఈ విషయంలో గిల్ కెప్టెన్సీలో లోపాలు కనిపిస్తున్నాయి. గత మ్యాచ్లో బాగా ఆడకపోయినంత మాత్రాన నీ బౌలర్లపై నమ్మకం కోల్పోతావా? కెప్టెన్కు ఇది ఎంతమాత్రం సరికాదు. ముఖ్యంగా మూడో వన్డేలో గ్లెన్ ఫిలిప్స్ ఫాస్ట్ బౌలర్లను చితకబాదుతుంటే.. మధ్య ఓవర్లలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఎందుకు బరిలోకి దించలేదు.అతడితో రెండు ఓవర్లు వేయించి ఉంటే మ్యాచ్ వేరే విధంగా ఉండేది. డారిల్ మిచెల్ విషయంలోనూ అనుకున్న ఫలితం రాబట్టగలిగేవాళ్లు. అందుబాటులో ఉన్న వనరులను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం అన్నింటికంటే పెద్ద వైఫల్యం. ఒకవేళ అన్ని సరిగ్గా చేసినా ఓడిపోతే అదివేరు. కానీ ఇక్కడ మీ బెస్ట్ బౌలర్ల సేవలను సరైన సమయంలో ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు’’ అని అశ్విన్.. గిల్ కెప్టెన్సీపై ఘాటు విమర్శలు చేశాడు.చదవండి: భారత్ నెత్తిన మిచెల్ పిడుగువాళ్లను పక్కనపెడతారా?: గిల్పై రహానే, జహీర్ ఖాన్ ఫైర్! -
బీసీసీఐ సంచలన నిర్ణయం!.. రో-కోలకు భారీ షాక్!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలనాత్మక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టుల విషయంలో పెను మార్పులు చేయాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.కాగా ప్రస్తుతం సెంట్రల్ కాంట్రాక్టులో నాలుగు కేటగిరీలు ఉన్న విషయం తెలిసిందే. A+, A, B, C అనే గ్రేడ్లు ఉన్నాయి. చివరగా గతేడాదికి గానూ ఏప్రిల్లో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించింది. దీని ప్రకారం..రూ. 7 కోట్ల వార్షిక వేతనంA+ గ్రేడ్లో బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మతో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ప్రధాన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఉన్నారు. వీరికి రూ. 7 కోట్ల వార్షిక వేతనం లభిస్తుంది.వీరికి ఐదు.. వారికి మూడుఇక A గ్రేడ్లో ఉన్న రిషభ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీ, కేఎల్ రాహుల్, శుబ్మన్ గిల్, హార్దిక్ పాండ్యాలు రూ. 5 కోట్ల వార్షిక వేతనం అందుకుంటున్నారు. అదే విధంగా.. B గ్రేడ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్లకు రూ. 3 కోట్ల వార్షిక వేతనం లభిస్తోంది.వీళ్లందరికి కోటిఇక C గ్రేడ్లో ఉన్న రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ముకేశ్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాలకు రూ. కోటి వేతనం అందుతోంది.A+ గ్రేడ్ను ఎత్తివేసే యోచనతాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది వార్షిక క్రాంటాక్టుల విషయంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కీలక ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. A+ గ్రేడ్ను ఎత్తివేసి.. A, B, C అనే మూడు గ్రేడ్లను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే, వార్షిక వేతనం విషయంలోనూ ఈ మార్పులు వర్తిస్తాయా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు.రో-కోకు భారీ షాక్తదుపరి అపెక్స్ మీటింగ్లో ఈ విషయమై బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అగార్కర్ అండ్ కో ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపితే.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు భారీ షాక్ తప్పదు. ప్రస్తుతం వీరిద్దరు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. కాబట్టి ఈసారి వీరిని B గ్రేడ్లోకి వేసే అవకాశం ఉంది.ఈ నలుగురు అంతేకాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత రో-కోలతో పాటు జడేజా కూడా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ఇక గతేడాది రో-కో టెస్టులకూ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ప్రధాన పేసర్ బుమ్రా పనిభారం తగ్గించుకునే క్రమంలో పలు కీలక సిరీస్లకు దూరమవుతున్నాడు. ఇలా A+ గ్రేడ్లో ఉన్న నలుగురు ఆటగాళ్లు గత కొంతకాలంగా జాతీయ విధుల్లో ఏదో ఒక ఫార్మాట్కు మాత్రమే పరిమితం కావడం గమనార్హం.చదవండి: ఓటమిని అంగీకరించడు.. అతడిని చూసి నేర్చుకోండి -
‘రంజీ’ బరిలో గిల్
న్యూఢిల్లీ: భారత టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుబ్మన్ గిల్ విశ్రాంతి తీసుకోకుండా వెంటనే రంజీ ట్రోఫీ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. గిల్ సారథ్యంలోని టీమిండియా 1–2తో తొలిసారి భారత గడ్డపై న్యూజిలాండ్కు వన్డే సిరీస్ను కోల్పోయింది. ఆదివారమే కివీస్తో ఈ సిరీస్ ముగిసింది. రోజుల వ్యవధిలోనే గురువారం నుంచి సౌరాష్ట్రతో తలపడే పంజాబ్ తరఫున రంజీ మ్యాచ్ బరిలోకి దిగేందుకు గిల్ సై అంటున్నాడు. 26 ఏళ్ల ఈ కెప్టెన్ విశ్రాంతి గురించి ఆలోచించడం లేదని, రాజ్కోట్లో జరిగే రంజీ పోరు కోసం ఇండోర్ నుంచి నేరుగా అక్కడికే పయనమవుతాడని పంజాబ్ జట్టు వర్గాలు తెలిపాయి. గత సీజన్లో మాదిరిగా ఈసారి కూడా రంజీ ట్రోఫీకి మధ్యలో విరామమిచ్చారు. ముస్తాక్ అలీ టి20, విజయ్ హజారే వన్డే టోరీ్నల కోసం రంజీలకు బ్రేక్ ఇచ్చారు. ఈ రెండు పరిమిత ఓవర్ల ఈవెంట్లు ముగియడంతో గురువారం నుంచి దేశవ్యాప్తంగా మిగిలిన రెండు రౌండ్ల రంజీ ట్రోఫీ మ్యాచ్ల్ని కొనసాగించనున్నారు. మొత్తం ఎనిమిది జట్లున్న గ్రూప్ ‘బి’లో పంజాబ్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్లాడింది. ఒక మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్ ఓడింది. మిగతా మూడింటిని ‘డ్రా’ చేసుకున్న పంజాబ్ 11 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఈ సీజన్లో ఇంకా మూడే లీగ్ మ్యాచ్లున్నాయి. నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే ఈ మూడు మ్యాచ్ల్నీ తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. గిల్ రాకతో పంజాబ్ పటిష్టంగా మారింది. -
గౌతమ్ గంభీర్పై ఫ్యాన్స్ ఫైర్
టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ భవితవ్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా అతడి మార్గదర్శకంలో భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ను (1-2) కోల్పోవడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సిరీస్కు ముందు వరకు గంభీర్ను టెస్ట్ల నుంచి మాత్రమే తప్పించాలనే డిమాండ్లు వినిపించాయి. అయితే తాజా పరాభవం తర్వాత గంభీర్పై వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. అతన్ని మొత్తానికే టీమిండియా నుంచి తప్పించాలని ఫ్యాన్స్ పట్టుబడుతున్నారు. స్వదేశంలో, అందులో సి-టీమ్ (న్యూజిలాండ్) చేతిలో పరాభవాన్ని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.వాస్తవానికి గంభీర్ పేలవ ప్రదర్శన టెస్ట్లకు మాత్రమే పరిమితం అని అంతా అనుకుంటారు. కానీ, వన్డేల్లోనూ అతనికి చెత్త ట్రాక్ రికార్డే ఉంది. అతని జమానాలో టీమిండియా చిన్న జట్టైన శ్రీలంక చేతిలో కూడా వన్డే సిరీస్ కోల్పోయింది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలోనూ భారత్కు భంగపాటే ఎదురైంది.అతడి పుణ్యమా అని భారత్ తొలిసారి స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది. మొత్తంగా అతని పదవీకాలంలో భారత జట్టు వన్డేల్లో 11 విజయాలు సాధించి, 6 పరాజయాలు ఎదుర్కొంది. వన్డేల్లో గంభీర్ చెప్పుకోదగ్గ విజయం ఏదైనా ఉందంటే అది ఛాంపియన్స్ ట్రోఫీ ఒక్కటే.గంభీర్ పేలవ ప్రదర్శన టెస్ట్ల నుంచి చిన్నగా వన్డేలకు కూడా పాకడంతో, ఇక భరించేది లేదని అభిమానులు కరాఖండిగా చెబుతున్నారు. కేవలం టీ20ల కోసమే అతన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. గంభీర్ స్థానంలో రాజకీయాలు చేయని ఎవరికైనా అవకాశం ఇవ్వాలని బీసీసీఐని కోరుతున్నారు.గంభీర్ కోచ్గా తన ప్రదర్శన కంటే రాజకీయాల కారణంగానే ఎక్కువగా వార్తల్లో ఉంటాడు. అతని జమానాలో టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రచారం జరుగుతుంది. గంభీర్ కారణంగానే వారిద్దరు అనూహ్యంగా టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారని టాక్. రోహిత్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంలోనూ గంభీర్దే కీలకపాత్ర అని అంతా అంటుంటారు. అంతగా అర్హం కాని శుభ్మన్ గిల్కు టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్సీ కట్టబెట్టడంలోనూ గంభీర్దే కీలకపాత్ర అని ప్రచారం జరిగింది. సంజూ శాంసన్కు అన్యాయం చేసి గిల్ను టీ20ల్లోనూ ప్రమోట్ చేయాలని గంభీర్ ప్రణాళికలు రచించాడని సమాచారం.మహ్మద్ షమీ లాంటి సీనియర్ను అకారణంగా తప్పించి, హర్షిత్ రాణాకు ఎవరికీ ఇవ్వని అవకాశాలు ఇవ్వడం మనం చూస్తున్నాం. సర్ఫరాజ్ ఖాన్, మహ్మద్ సిరాజ్ గంభీర్ రాజకీయాలకు బలైయ్యారనే టాక్ కూడా నడుస్తుంది. కోచ్గా తన పనితనంపై ఫోకస్ పెట్టకుండా గంభీర్ ఇలాంటి రాజకీయాలు కోకొల్లలు చేశాడని చాలామంది టీమిండియా మాజీలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.ఇవన్నీ పరిగణలోకి తీసుకొని బీసీసీఐ వెంటనే గంభీర్పై వేటు వేయాలని సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.గురువు ఎంతో శిష్యుడూ అంతే..!గంభీర్ ప్రమోట్ చేసిన శుభ్మన్ గిల్ సైతం భారత కెప్టెన్గా పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. అతని హయాంలో భారత్ తొలిసారి న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో వన్డే సిరీస్ కోల్పోయింది. అంతకుముందు ఆస్ట్రేలియా చేతిలోనూ పరాభవం ఎదుర్కొంది. టెస్ట్ల్లోనూ గిల్ (కెప్టెన్గా) ప్రదర్శన పేలవంగానే ఉంది. అరంగేట్రం సిరీస్లో (ఇంగ్లండ్) చావుతప్పి కన్ను లొట్ట పోయింది (2-2తో డ్రా). తాజాగా సౌతాఫ్రికా చేతిలో స్వదేశంలోనే ఘోర భంగపాటు (క్లీన్ స్వీప్) ఎదురైంది. ప్రదర్శన విషయంలో గిల్ తన గురువు గంభీర్తో పోటీ పడుతున్నాడు. -
వాళ్లను పక్కనపెడతారా?: రహానే, జహీర్ ఖాన్ ఫైర్!
న్యూజిలాండ్తో మూడో వన్డేలో శుబ్మన్ గిల్ కెప్టెన్సీని భారత వెటరన్ క్రికెటర్ అజింక్య రహానే విమర్శించాడు. టీమిండియా బౌలర్ల సేవలను అతడు సరిగ్గా వాడుకోలేదని.. అందుకే కివీస్ భారీ స్కోరు సాధించగలిగిందని అభిప్రాయపడ్డాడు.ఇండోర్లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది.డారిల్, గ్లెన్ ఫిలిప్స్ సెంచరీలుడారిల్ మిచెల్ (Daryl Mitchell- 137), గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips-106) శతకాలతో చెలరేగడంతో న్యూజిలాండ్కు ఈ భారీ స్కోరు సాధ్యమైంది. వీరిద్దరు కలిసి 219 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ నేపథ్యంలో ఇన్నింగ్స్ బ్రేక్ అనంతరం క్రిక్బజ్ వేదికగా అజింక్య రహానే మాట్లాడుతూ.. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలకు గిల్ సరైన సమయంలో బంతిని ఇవ్వలేదని విమర్శించాడు.వాళ్లను పక్కనపెట్టి తప్పు చేశారు‘‘మధ్య ఓవర్లలో కుల్దీప్తో కేవలం మూడు ఓవర్లు మాత్రమే వేయించాడు గిల్. అక్కడే అతడు పొరపాటు చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ 37-38వ ఓవర్ వరకు అతడి చేతికి బంతి రాలేదు.అదే విధంగా జడేజాను సైతం 30వ ఓవర్ వరకు అలాగే ఉంచారు. ఈ ఇద్దరు మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేసి వికెట్లు తీయగల సత్తా కలిగిన వారు. అయినప్పటికీ వారిని పక్కనపెట్టారు. అక్కడే టీమిండియా అతిపెద్ద తప్పు చేసింది’’ అని రహానే అభిప్రాయపడ్డాడు.మిడిల్ ఓవర్లలో రప్పించి ఉంటేఇందుకు భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ సైతం మద్దతు పలికాడు. కుల్దీప్ కంటే కూడా జడేజాను మిడిల్ ఓవర్లలో రప్పించి ఉంటే ఫలితం వేరుగా ఉండేదన్నాడు. జడ్డూను ఆలస్యంగా బరిలోకి దించి తప్పు చేశారని విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆరు ఓవర్లు వేసి 48 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.మరోవైపు.. జడేజా ఆరు ఓవర్లు వేసి 41 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. ఇదిలా ఉంటే అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో మూడు వికెట్లు తీయగా.. మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ తడబడింది.ఓపెనర్లు రోహిత్ శర్మ (11), కెప్టెన్ శుబ్మన్ గిల్ (23) నిరాశపరచగా.. శ్రేయస్ అయ్యర్ (3), కేఎల్ రాహుల్ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి దశలో వన్డౌన్ బ్యాటర్ కోహ్లి పట్టుదలగా నిలబడ్డాడు. సెంచరీ (124)తో కదం తొక్కాడు. అతడికి తోడుగా ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (53), ఎనిమిదో నంబర్ బ్యాటర్ హర్షిత్ రాణా (52) అర్ధ శతకాలతో రాణించారు.అయితే, మిగతా వారంత విఫలం కావడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. కివీస్ బౌలర్ల ధాటికి 46 ఓవర్లలో 296 పరుగులకే ఆలౌట్ అయిన గిల్ సేన.. మ్యాచ్తో పాటు తొలిసారి సొంతగడ్డపై కివీస్కు వన్డే సిరీస్నూ కోల్పోయింది. చదవండి: ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి -
శుభ్మన్ గిల్ కీలక నిర్ణయం
టీమిండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్ వరుసగా రెండో సిరీస్ ఓటమిని ఎదుర్కొన్నాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కోల్పోయింది. గతేడాది ఆక్టోబర్లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో కూడా మెన్ బ్లూ ఓడిపోయింది. గిల్ కెప్టెన్సీలో భారత్ కేవలం వెస్టిండీస్తో టెస్టు సిరీస్ను మాత్రమే సొంతం చేసుకుంది.దీంతో గిల్ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన గిల్.. మళ్లీ దాదాపు ఏడు నెలల తర్వాత మళ్లీ జాతీయ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడు. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్లో ఆతిథ్య జట్టుతో భారత తలపడనుంది.ఈ టూర్లో వన్డే సిరీస్లో గిల్ జట్టును ముందుకు నడిపించనున్నాడు. ఇప్పటికే టీ20 జట్టుకు అతడు దూరం అయ్యాడు కాబట్టి... ఈ టూర్ మొదలయ్యే వరకు గిల్ భారత్ తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడే సూచనలు కన్పించడం లేదు. ఈ క్రమంలో గిల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన బ్యాటింగ్ స్కిల్స్ను మెరుగుపరుచుకోవడానికి రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో ఆడాలని గిల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ దేశవాళీ టోర్నీ సెకెండ్ లీగ్లో పంజాబ్ ఆడే తొలి మ్యాచ్లో గిల్ బరిలోకి దిగే అవకాశముంది. జనవరి 22న రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో సౌరాష్ట్రతో పంజాబ్ తలపడనుంది. ఈ మ్యాచ్లో సౌరాష్ట్ర తరపున సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఆడనున్నాడు.న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో జడేజా అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లోనూ విఫలమయ్యాడు. దీంతో తన ఫామ్ను తిరిగి అందుకోవడానికి జడేజాకు రంజీ ట్రోఫీ కీలకం కానుంది. అవేవిధంగా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా హైదరాబాద్ జట్టు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.చదవండి: ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి -
అతడు అద్భుతం.. నితీశ్ రెడ్డికి అందుకే ఛాన్స్: గిల్
సొంతగడ్డపై టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. ఇండోర్లో ఇప్పటి వరకు వన్డే ఓటమి రుచి చూడని భారత జట్టుకు న్యూజిలాండ్ షాకిచ్చింది. మూడో వన్డేలో టీమిండియాను ఓడించి సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి శతక్కొట్టినా మిగిలిన వారి నుంచి పెద్దగా సహకారం లభించకపోవడంతో టీమిండియాకు పరాజయం తప్పలేదు.ఈ నేపథ్యంలో సిరీస్ ఓటమిపై భారత జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) స్పందించాడు. ‘‘తొలి మ్యాచ్లో గెలిచాం. రెండో వన్డేలో వాళ్లు గెలిచి 1-1తో సమం చేశారు. అయితే, ఇక్కడ ఈరోజు మా ఆట తీరు నన్నెంతగానో నిరాశపరిచింది.విరాట్ భాయ్ అద్భుతం.. హర్షిత్ సూపర్మేము ఆటను సరిదిద్దుకోవాల్సి ఉంది. పొరపాట్లను సరిచేసుకుంటాం. విరాట్ (Virat Kohli) భాయ్ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. ఈ మ్యాచ్లో మాకు అదే అతిపెద్ద సానుకూలాంశం. ఇక ఈ సిరీస్లో ఎనిమిదో స్థానంలో వచ్చి హర్షిత్ రాణా బ్యాటింగ్ చేసిన తీరు కూడా ఆకట్టుకుంది.A sight that never gets old, a sight we’re never tired of! 💯👑#ViratKohli’s 7th ODI century against New Zealand - most by any batter 🙌Another run chase, another masterclass, and he knows the job is not done yet 🎯#INDvNZ | LIVE NOW 👉 https://t.co/CixSjUFkhU pic.twitter.com/0qf8wSXfVW— Star Sports (@StarSportsIndia) January 18, 2026నితీశ్ రెడ్డిని అందుకే ఆడించాంఅందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. మా ఫాస్ట్ బౌలర్లు సిరీస్ ఆసాంతం మెరుగ్గా బౌలింగ్ చేశారు. ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)కి అవకాశాలు ఇస్తున్నాం. సరిపడా ఓవర్లు వేయించడంతో పాటు బ్యాటింగ్ కూడా చేయిస్తున్నాం.A cracker to bring up his maiden ODI fifty! Well played, Nitish Kumar Reddy.#INDvNZ | LIVE NOW 👉 https://t.co/CixSjUFkhU pic.twitter.com/hKLft9Eu0G— Star Sports (@StarSportsIndia) January 18, 2026వివిధ రకాల కాంబినేషన్లు ట్రై చేస్తున్నాం. ఇందులో నితీశ్ కూడా భాగం. అతడి బౌలింగ్ తీరును కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం’’ అని గిల్ పేర్కొన్నాడు. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది.41 పరుగుల తేడాతో ఓటమిఈ క్రమంలో తొలుత వన్డే సిరీస్ జరుగగా.. వడోదరలో టీమిండియా.. రాజ్కోట్లో కివీస్ గెలిచాయి. ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేలో గెలిచి న్యూజిలాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో కివీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 337 పరుగులు సాధించింది.లక్ష్య ఛేదనలో 46 ఓవర్లలో భారత్ కేవలం 296 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఈ మ్యాచ్లో కోహ్లి సెంచరీ (124) చేయగా.. నితీశ్ కుమార్ రెడ్డి (53), హర్షిత్ రాణా (52) అర్ధ శతకాలతో రాణించారు. మిగిలిన వారిలో గిల్ (23) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. చదవండి: IND vs NZ: ఏంటి రోహిత్ ఇది..? ఛాన్స్ వచ్చినా కూడా! వీడియో -
న్యూజిలాండ్తో మూడో వన్డే.. టాస్ గెలిచిన టీమిండియా
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇండోర్లోని హోల్కర్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 18) జరుగునున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కీలకమైన ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ఓ మార్పు చేసింది. తొలి రెండు మ్యాచ్ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ప్రసిద్ద్ కృష్ణ స్థానంలో స్టార్ పేసర్ అర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్ ఈ మ్యాచ్ల్లో ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతుంది. కాగా, ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో భారత్, రెండో మ్యాచ్లో న్యూజిలాండ్ గెలుపొందాయి. మూడో మ్యాచ్లో గెలిచే జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్వెల్(c), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ -
అందుకు మూల్యం చెల్లించుకున్నాం.. రెండో వన్డేలో ఓటమిపై గిల్ కామెంట్స్
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో నిన్న (జనవరి 14) జరిగిన రెండో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (112 నాటౌట్) సూపర్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ (56) అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లలో రోహిత్ శర్మ 24, విరాట్ కోహ్లి 23, శ్రేయస్ అయ్యర్ 8, రవీంద్ర జడేజా 27, నితీశ్ కుమార్ రెడ్డి 20, హర్షిత్ రాణా 2 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ 3, జేమీసన్, ఫౌల్క్స్, లెన్నాక్స్, బ్రేస్వెల్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. డారిల్ మిచెల్ (131 నాటౌట్) అద్భుతమైన సెంచరీతో కదంతొక్కడంతో 47.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మిచెల్కు విల్ యంగ్ (87) సహకరించాడు. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ క్యామియో (మెరుపు ఇన్నింగ్స్) ఆడాడు. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు ఎంత శ్రమించినా మిచెల్, యంగ్ను నిలువరించలేకపోయారు. కుల్దీప్ యాదవ్ అయితే ఒక్క వికెట్ తీసి, ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు. మిగతా బౌలర్లది కూడా అదే పరిస్థితి. హర్షిత్, ప్రసిద్ద్ తలో వికెట్ తీసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ సైతం తమ బౌలింగ్ ప్రదర్శనపై పెదవి విరిచాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడం వల్ల మూల్యం చెల్లించుకున్నామని అన్నాడు. అదనంగా 15-20 పరుగులు చేసినా ఫలితం ఇలాగే ఉండేదని అభిప్రాయపడ్డాడు. బోర్డుపై మంచి స్కోర్ ఉంచినా, మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడమే మ్యాచ్ను తమ చేతి నుంచి లాగేసుకుందని తెలిపాడు.మరిన్ని విషయాలు గిల్ మాటల్లో.. 10–15 ఓవర్లలో బంతి కాస్త కదిలి బౌలర్లకు సహకరించింది. కానీ 20–25 ఓవర్ల తర్వాత పిచ్ స్థిరపడింది. మధ్య ఓవర్లలో మేము మరింత ధైర్యంగా బౌలింగ్ చేసి, రిస్క్ తీసుకొని ఉండాల్సింది. అలా చేసుంటే ఫలితం వేరుగా ఉండేది.ఫీల్డింగ్ లోపాలు కూడా జట్టును ఇబ్బందుల్లోకి నెట్టాయి. గత మ్యాచ్లో కూడా కొన్ని అవకాశాలు వదిలేశాం. ఫీల్డింగ్లో మెరుగుపడటానికి ప్రయత్నిస్తాం. అవకాశాలు వదిలేస్తే మాత్రం ఈ ఫార్మాట్లో ఓటమి తప్పదని గిల్ అభిప్రాయపడ్డాడు. మొత్తంగా గిల్ బౌలింగ్పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి మ్యాచ్ గెలవగా.. తాజాగా న్యూజిలాండ్ రెండో వన్డే గెలిచింది. ఈ సిరీస్లో నిర్ణయాత్మక మూడో వన్డే ఇండోర్ వేదికగా జనవరి 18న జరుగనుంది. -
న్యూజిలాండ్తో రెండో వన్డే.. టీమిండియా బ్యాటింగ్
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 14) జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ ఓడింది. ప్రత్యర్థి ఆహ్వానం మేరకు భారత్ తొలుత బ్యాటింగ్కు దిగనుంది. ఈ మ్యాచ్లో భారత్ ఓ మార్పుతో బరిలోకి దిగుతుంది. తొలి వన్డే సందర్భంగా గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్ కూడా ఓ మార్పు చేసింది. ఆ జట్టు తరఫున జేడన్ లెన్నాక్స్ (ఆదిత్య అశోక్ స్థానంలో) అరంగేట్రం చేయనున్నాడు. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్వెల్(c), జకారీ ఫౌల్క్స్, జేడెన్ లెన్నాక్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్భారత్: రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ


