Shubman Gill
-
హైస్కోరింగ్ థ్రిల్లర్లో గుజరాత్పై పంజాబ్ గెలుపు
GT vs PBKS Live Updates And highlights: గుజరాత్పై పంజాబ్ విజయంఐపీఎల్-2025ను గుజరాత్ విజయంతో ఆరంభించింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్లో 11 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(74), జోస్ బట్లర్(54) రూథర్ ఫర్డ్(46) పోరాడినప్పటకి తమ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. కెప్టెన్ శుబ్మన్ గిల్(33) తన వంతు ప్రయత్నం చేశాడు. కానీ కొండంత లక్ష్యాన్ని కరిగించలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ రెండు, జానెసన్, మాక్స్వెల్ తలా వికెట్ సాధించారు.17 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 187/217 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ రెండు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(47), రూథర్ ఫర్డ్(23) పరుగులతో ఉన్నారు.15 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 174/215 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ రెండు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(40), రూథర్ ఫర్డ్(20) పరుగులతో ఉన్నారు.సుదర్శన్ ఆన్ ఫైర్..12 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 134 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(74), జోస్ బట్లర్(25) ఉన్నారు. గుజరాత్ విజయానికి 46 బంతుల్లో 106 పరుగులు కావాలి.తొలి వికెట్ డౌన్..శుబ్మన్ గిల్ రూపంలో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన గిల్.. మాక్స్వెల్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి జోస్ బట్లర్ వచ్చాడు. 7 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 75/1దూకుడుగా ఆడుతున్న గుజరాత్ ఓపెనర్లు..245 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ దూకుడుగా ఆడుతోంది. 5 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ శుబ్మన్ గిల్(27), సాయిసుదర్శన్(23) ఉన్నారు.శ్రేయస్, శశాంక్ విధ్వంసం.. గుజరాత్ ముందు భారీ టార్గెట్అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్( 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్లతో 97) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ ఐదో వికెట్ డౌన్.. స్టోయినిష్ ఔట్మార్కస్ స్టోయినిష్ రూపంలో పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన స్టోయినిష్.. సాయికిషోర్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 16 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 165/5. క్రీజులో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(66) పరుగులతో ఉన్నాడు.కిషోర్ ఆన్ ఫైర్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లుపంజాబ్ కింగ్స్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. 11 ఓవర్ వేసిన సాయికిషోర్ బౌలింగ్లో మూడో బంతికి ఒమర్జాయ్(16), నాలుగో బంతికి గ్లెన్ మాక్స్వెల్(0) ఔటయ్యాడు. 12 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 108/4పంజాబ్ రెండో వికెట్ డౌన్..ప్రియాంష్ ఆర్య రూపంలో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 20 బంతుల్లో 42 పరుగులు చేసిన ప్రియాంష్.. రషీద్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(14), ఒమర్జాయ్(6) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన ప్రభుసిమ్రాన్.. రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాంష్ ఆర్య(17), శ్రేయస్ అయ్యర్(14) పరుగులతో ఉన్నారు.ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గుజరాత్ తరపున అరంగేట్రం చేశాడు.తుది జట్లుపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, సూర్యాంశ్ షెడ్జ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ -
అస్సలు జీర్ణించుకోలేకపోయా.. అయినా భాయ్కు అంతా తెలుసు: సిరాజ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో కొత్త ఫ్రాంఛైజీ తరఫున ఆడబోతున్నాడు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్. దాదాపు ఏడేళ్ల పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కి ఆడిన ఈ హైదరాబాదీని.. మెగా వేలానికి ముందు ఆ ఫ్రాంఛైజీ వదిలేసింది. ఈ క్రమంలో రూ. 12.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సిరాజ్ను కొనుగోలు చేసింది.బౌలర్ల కెప్టెన్ఇక ఐపీఎల్-2025లో తమ తొలి మ్యాచ్లో భాగంగా గుజరాత్ మంగళవారం పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ‘బోరియా సీజన్ సిక్స్’తో ముచ్చటించిన సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘శుబ్మన్ గిల్ (Shubman Gill) బౌలర్ల కెప్టెన్. గొప్ప సారథి.బౌలర్లు ఏది అడిగినా.. కాదనడు. వాళ్లకు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తాడు. స్వేచ్ఛనిస్తాడు. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. నేను, రిషభ్ పంత్, శుబ్మన్, అక్షర్ పటేల్.. కలిసి తరచుగా డిన్నర్లకు వెళ్తూ ఉంటాం. గిల్, నేను ఒకేసారి టెస్టుల్లో అడుగుపెట్టాము. అందుకే మా బంధం ఇంతగా బలపడి ఉంటుంది’’ అని గిల్తో తనకున్న స్నేహం గురించి చెప్పుకొచ్చాడు.ఆయనొక లెజెండ్ఇక గుజరాత్ కోచ్ ఆశిష్ నెహ్రా గురించి మాట్లాడుతూ.. ‘‘ఆయనొక లెజెండ్. నెహ్రా భాయ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకుండా ఎలా ఉండాలో ఆయనను చూసే తెలుసుకున్నా. గతంలో షమీ భాయ్ ఈ ఫ్రాంఛైజీకి ఆడాడు.నేను కూడా తనలా అద్భుతంగా ఆడి వికెట్లు తీయడం మీద మాత్రమే దృష్టి పెట్టాను. జట్టు విజయాల కోసం నా శాయశక్తులా కృషి చేస్తా’’ అని సిరాజ్ పేర్కొన్నాడు. ఇక ఈ సందర్భంగా చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులో చోటు దక్కకపోవడం గురించి ప్రస్తావన రాగా.. ఈ హైదరాబాదీ పేసర్ హుందాగా స్పందించాడు.అస్సలు జీర్ణించుకోలేకపోయా.. ‘‘జట్టు గురించి ప్రకటన రాగానే తొలుత ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను. ఐసీసీ ఈవెంట్ ఆడే జట్టులో నాకు చోటు లేదే అని బాధపడ్డాను. అయితే, జట్టు ప్రయోజనాల గురించే రోహిత్ భాయ్ ఆలోచిస్తాడని నాకు తెలుసు.దుబాయ్లో పేసర్లకు పెద్దగా పని ఉండదని భాయ్కు తెలుసు. ఆయన ఎంతో అనుభవజ్ఞుడైన కెప్టెన్. అక్కడి పిచ్లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయని ఆయనకు తెలుసు. అందుకే నన్ను పక్కనపెట్టాలని వాళ్లు నిర్ణయించుకున్నారు’’ అని సిరాజ్ పేర్కొన్నాడు.విశ్రాంతి దొరికిందిఏదేమైనా దేశం కోసం ఆడేటప్పుడు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుందని.. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ కోరుకుంటాడని సిరాజ్ అన్నాడు. ఇక చాంపియన్స్ట్రోఫీ జట్టులో లేనందు వల్ల తనకు చాలాకాలం పాటు విశ్రాంతి లభించిందని.. ఆ సమయాన్ని ఫిట్నెస్ మెరుగుపరచుకునేందుకు ఉపయోగించుకున్నానని తెలిపాడు.కాగా పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడింది. ఇక ఈ మెగా వన్డే టోర్నమెంట్లో గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్లను ఓడించిన రోహిత్ సేన.. సెమీస్లో ఆస్ట్రేలియాపై గెలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది.ఇక సిరాజ్ చివరగా ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ ఆడాడు. తదుపరి జూన్లో ఇంగ్లండ్ టూర్కు వెళ్లే జట్టుకు అతడు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇక మళ్లీ పరిమిత ఓవర్ల జట్టులో తిరిగి స్థానం సంపాదించాలంటే సిరాజ్ మియా.. ఐపీఎల్-2025లో సత్తా చాటాల్సి ఉంటుంది.చదవండి: ‘గిల్ ఒక్కడే ఏమీ చేయలేడు.. మేమంతా ఉంటేనే ఏదైనా సాధ్యం’ -
‘గిల్ ఒక్కడే ఏమీ చేయలేడు.. మేమంతా ఉంటేనే ఏదైనా సాధ్యం’
న్యూజిలాండ్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill)ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతేడాది టైటాన్స్ వైఫల్యాలకు అతడు ఏమాత్రం కారణం కాదని పేర్కొన్నాడు. కెప్టెన్ ఒక్కడి ప్రదర్శన మీద జట్టు జయాపజయాలు ఆధారపడి ఉండవని.. ఆటగాళ్లంతా సమిష్టిగా రాణిస్తేనే గెలుపు వరిస్తుందని ఫిలిప్స్ అన్నాడు.అరంగేట్ర సీజన్లోనే చాంపియన్గాకాగా 2022లో గుజరాత్ టైటాన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా సారథ్యంలో.. తమ అరంగేట్ర సీజన్లోనే చాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాతి ఏడాది ఫైనల్ చేరింది. అయితే, 2024లో పాండ్యా టైటాన్స్ను వీడి తన సొంతజట్టు ముంబై ఇండియన్స్లో చేరాడు. ఫలితంగా టైటాన్స్ పగ్గాలను యాజమాన్యం భారత యువ తార గిల్కు అప్పగించింది.పేలవ ప్రదర్శన అయితే, గతేడాది తొలిసారిగా గిల్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ పేలవ ప్రదర్శన కనబరిచింది. పద్నాలుగు మ్యాచ్లకు గానూ కేవలం ఐదే గెలిచి.. పది పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. పాండ్యా జట్టును వీడటంతో పాటు మహ్మద్ షమీ (అప్పుడు టైటాన్స్ జట్టులో) గాయం వల్ల సీజన్ మొత్తానికి దూరం కావడం టైటాన్స్ ప్రదర్శనపై ప్రభావం చూపింది.అయితే, ఈసారి తాము ఆ ప్రతికూలతలు అధిగమించి అనుకున్న ఫలితాలు రాబడతామని గిల్ స్పష్టం చేశాడు. తమ జట్టు ప్రస్తుతం అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో గ్లెన్ ఫిలిప్స్ హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ.. ‘‘క్రికెట్ జట్టుగా ఆడాల్సిన ఆట.గిల్ ఒక్కడే ఏమీ చేయలేడు.. మేమంతా ఉంటేనే ఏదైనా సాధ్యంఒక్క ఆటగాడు లేదా కెప్టెన్ జట్టు మొత్తాన్ని గెలిపించలేదు. కాబట్టి శుబ్మన్ గిల్ కెప్టెన్సీ వల్లే గతేడాది గుజరాత్ ప్రదర్శన బాలేదని చెప్పడం సరికాదు. టీ20 క్రికెట్ స్వరూపమే వేరు. మ్యాచ్ రోజు ఎవరు ఫామ్లో ఉంటారో వారిదే పైచేయి అవుతుంది. గతేడాది సన్రైజర్స్, కేకేఆర్ సీజన్ ఆసాంతం ఒకే లయను కొనసాగించి ఫైనల్ వరకు చేరాయి.ఏదేమైనా తమ తొలి రెండు సీజన్లలో గుజరాత్ అద్భుతంగా ఆడింది. మంచి ఫామ్ కనబరిచింది. ఈ ఏడాది అదే ఫలితాన్ని పునరావృతం చేయగలమని నమ్ముతున్నా. శుబ్మన్ గిల్ కెప్టెన్సీ విషయంలో ఒత్తిడికి గురవుతాడని నేను అస్సలు అనుకోను. అతడు టీమిండియా ప్రధాన ప్లేయర్. జాతీయ జట్టుకు ఆడటం కంటే లీగ్ క్రికెట్లో ఆడటం తేలికే’’ అని గిల్కు ఫిలిప్స్ మద్దతు ప్రకటించాడు.రూ. 2 కోట్లకు కొనుగోలుకాగా 2021లో గ్లెన్ ఫిలిప్స్ను రాజస్తాన్ రాయల్స్ కొనుక్కోగా.. ఆ మరుసటి ఏడాది సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 1.5 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది. కానీ తుదిజట్టులో మాత్రం ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదు. ఈ క్రమంలో మెగా వేలం-2025కి ముందు రైజర్స్ అతడిని విడిచిపెట్టింది. దీంతో గుజరాత్ టైటాన్స్ రూ. 2 కోట్లకు అతడిని వేలంపాటలో కొనుక్కుంది.ఇక ఇప్పటి వరకు ఐపీఎల్లో కేవలం ఎనిమిది మ్యాచ్లు ఆడిన ఫిలిప్స్ 65 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్ మంగళవారం తమ తొలి మ్యాచ్లో భాగంగా పంజాబ్ కింగ్స్ను ఢీకొట్టనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: అలా అయితే.. నేను జట్టులో ఉండటం వేస్ట్: ధోని -
సాహసోపేత నిర్ణయాలు.. టైటాన్స్ ఈసారి విజృంభిస్తుందా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లోకి అడుగుపెట్టిన తొలి సీజన్లోనే (2022)లో టైటిల్ సాధించి తనదైన ముద్రవేసింది గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans). ఆ తర్వాత సీజన్లో మళ్ళీ ఫైనల్లోకి ప్రవేశించింది. కానీ టైటిల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమితో రన్నర్ అప్ తో సరిపెట్టుకుంది. అయితే, గతేడాది గుజరాత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టుకి స్ఫూర్తిదాయకంగా నిలిచి ముందుండి నడిపించిన భారత్ అల్ రౌండర్, జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్కు బదిలీ అయ్యాడు.ఈ మార్పుతో భారత్ యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ (Shubman Gill)కు కెప్టెన్గా పగ్గాలు అప్పగించారు. కానీ గత సీజన్ గుజరాత్ కి పెద్దగా కలిసిరాలేదు. కేవలం 5 విజయాలు, 7 ఓటములతో గుజరాత్ 8వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనితో కొత్త సీజన్ కోసం గుజరాత్ కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది.భారత్ సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, దక్షిణాఫ్రికాకి చెందిన డేవిడ్ మిల్లర్ వంటి సీనియర్ ఆటగాళ్ళని పక్కకుపెట్టాలని నిర్ణయించారు. ఇందుకు బదులుగా కొత్త తరహా జట్టుని నిర్మించాలని నిర్ణయించారు. ప్రపంచ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్ల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలని నిర్ణయించుకుంది.మాజీ ఆరెంజ్ క్యాప్ విజేత జోస్ బట్లర్, దక్షిణాఫ్రికా పేస్ స్పియర్హెడ్ కగిసో రబాడను దక్కించుకోవడానికి గుజరాత్ పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ లో తన వీరోచిత ప్రదర్శనలతో అందరినీ ఆశ్చర్యపరిచిన గ్లెన్ ఫిలిప్స్ను కూడా తీసుకున్నారు.వేలంలో గుజరాత్ ఎలా రాణించింది?ఐపీఎల్ 2025 మెగా వేలంలో గుజరాత్ చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించింది. గిల్, రాహుల్ తెవాటియా, సాయి సుదర్శన్ మరియు షారుఖ్ ఖాన్లతో పాటు రషీద్ ఖాన్ను వేలానికి ముందు రెటైన్ చేసింది. వేలంలో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ని రూ 15.75 కోట్లు కు కనుగోలు చేసారు.ఇంకా భారత్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ( (రూ12.25 కోట్లు), రబాడ (రూ 10.75 కోట్లు) మరియు ప్రసిధ్ కృష్ణ (రూ 9.5 కోట్లు) ముగ్గురితో పేస్ బౌలింగ్ ని బలోపేతం చేశారు. గత సీజన్లో వారికి సమస్యగా ఉన్న రంగాల కోసం భారీగా ఖర్చు చేశారు. ఇక మిల్లర్ స్థానంలో జిటి ఫిలిప్స్ మరియు షెర్ఫేన్ రూథర్ఫోర్డ్లను జట్టులోకి తీసుకువచ్చారుగుజరాత్ టైటాన్స్ జట్టులో ప్రధాన ఆటగాళ్లుశుబ్మన్ గిల్ఒకప్పుడు భారత టీ20ఐ జట్టులో ప్రధాన ఆటగాళ్లలో ఒకడైన గిల్ ఇప్పుడు మునుపటి రీతిలో రాణించలేక పోతున్నాడన్నది వాస్తవం. 2023 ఐపీఎల్ లో చెలరేగిపోయిన గిల్ దాదాపు 900 పరుగులు సాధించాడు.గత సీజన్ను ఆశాజనకంగా ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత అతని ఫామ్ తగ్గింది . 2024లో తన మొదటి ఆరు మ్యాచ్ల్లో 151.78 స్ట్రైక్ రేట్తో 255 పరుగులు చేశాడు, కానీ ఆ తర్వాత 147.40 సగటుతో 426 పరుగులు చేశాడు. ఈ సీజన్లో గిల్ మళ్ళీ మునుపటి ఫామ్ ని ప్రదర్శించాలని, జట్టుని విజయ బాటలో నడిపించాలని కృత నిశ్చయంతో ఉన్నాడు.జోస్ బట్లర్జట్టులో అత్యంత ఖరీదైన ఆటగాడు కావడంతో, బట్లర్ పై అందరి దృష్టి ఉంటుందనడంలో సందేహం లేదు. 2022 ఐపిఎల్ లో ఏకంగా 863 పరుగులు చేసిన తర్వాత, బట్లర్ 2023 మరియు 2024 సీజన్లలో 400 కి మించి పరుగులు చేయలేకపోయాడు. అయితే గత సంవత్సరం ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా పై జరిగిన ఫైనల్లో 224 పరుగుల లక్ష్యం సాధించడంలో బట్లర్ చేసిన సెంచరీ లీగ్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్నింగ్స్లలో ఒకటిగా నిలిచింది. బట్లర్ ఈ సీజన్ లో గిల్ తో కలిసి గుజరాత్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశముంది. లేదా గత సీజన్లో లేని ఫైర్పవర్ను అందించడానికి 3వ స్థానంలోకి వస్తాడని భావిస్తున్నారు. అదనంగా అతన్ని స్టంప్స్ వెనుక కూడా చూడవచ్చు.రషీద్ ఖాన్గాయం నుంచి ఇప్పుడు పూర్తిగా కోలుకున్న ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మరోసారి గుజరాత్కు ట్రంప్ కార్డ్ గా భావించవచ్చు. గత సీజన్లో, రషీద్ శస్త్రచికిత్స నుండి కోలుకుంటున్నందున తన పూర్తి స్థాయిలో ఆడలేక పోయాడు. ఈసారి మాత్రం గుజరాత్ టైటిల్ సాధించాలన్న ఆశయాన్ని సాధించడంలో రషీద్ పెద్ద పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు.కగిసో రబాడపంజాబ్ కింగ్స్ తరుపున ఆది కాస్త నిరాశబరిచిన కగిసో రబాడ ఇప్పుడు గుజరాత్ జట్టులో చేరడంతో కోచ్ ఆశిష్ నెహ్రా ఆధ్వర్యంలో మళ్ళీ పుంజుకోగలడని భావిస్తున్నారు.మహ్మద్ సిరాజ్ఇటీవలి కాలంలో పెద్దగా రాణించలేక పోతున్న హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ కి మళ్ళీ మునుపటి వైభవం సాధించడానికి ఐపీఎల్ మంచి అవకాశం కల్పిస్తోంది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు లో స్థానం పొందలేకపోయిన సిరాజ్ తన విమర్శకులను సమాధానము చెప్పాలని, తన కెరీర్ను తిరిగి ట్రాక్లోకి తీసుకురావాలని పట్టుదలతో ఉన్నాడు.గుజరాత్ టైటాన్స్ జట్టురషీద్ ఖాన్, శుబ్మాన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, కగిసో రబాడ, జోస్ బట్లర్. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నిషాంత్ సింధు, మహిపాల్ లోమ్రోర్, కుమార్ కుషాగ్ర, అనుజ్ రావత్, మానవ్ సుతార్, వాషింగ్టన్ సుందర్, జెరాల్డ్ కోట్జీ, అర్షద్ ఖాన్, గుర్నూర్ బ్రార్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, సాయి కిషోర్, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్, కరీం జనత్, కుల్వంత్ ఖేజ్రోలియా. చదవండి: విధ్వంసకర వీరులు.. పంత్కు పగ్గాలు.. లక్నో ఫైనల్ చేరుతుందా? -
ఐపీఎల్-2025 ప్రారంభానికి ముందు గుజరాత్ కెప్టెన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఐపీఎల్-2025 ప్రారంభానికి ముందు గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సారథ్యాన్ని, బ్యాటింగ్ను విడివిడిగా చూడగలిగితేనే విజయవంతమవుతామని అభిప్రాయపడ్డాడు. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 18వ సీజన్లో గిల్ గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ... ‘కెప్టెన్సీని, బ్యాటింగ్ను వేర్వేరుగా ఉంచాలి. అప్పుడే విజయవంతం కాగలం. క్రీజులో అడుగుపెట్టినప్పుడు కేవలం బ్యాటింగ్పైనే దృష్టి పెడతా. నా అనుభవంలో ఇదే నేర్చుకున్నా. ఫీల్డ్లో ఉన్నప్పుడు మాత్రం కెప్టెన్గా మరింత బాధ్యతగా వ్యవహరిస్తా’ అని అన్నాడు.2023 సీజన్లో టైటాన్స్ తరఫున హార్దిక్ పాండ్యా సారథ్యంలో బరిలోకి దిగిన గిల్ 890 పరుగులతో సత్తా చాటాడు. ఇక గత ఏడాది సారథిగా బాధ్యతలు తీసుకున్న గిల్ 426 పరుగులు చేశాడు. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే అతడి స్ట్రయిక్రేట్ 10 శాతం తగ్గింది. ‘సారథిగా ప్రతి రోజు నేర్చుకుంటూనే ఉంటా. అదే ఒక ఆటగాడిగా, కెప్టెన్గా నన్ను మరింత మెరుగు పరుస్తుందని నమ్ముతున్నా. కోచ్ ఆశిష్ నెహ్రా, విక్రమ్ సోలంకి సూచనలతో ముందుకు సాగుతున్నా. ఇంటా బయట అనే తేడా ఏమీ లేదు. మంచి లయలో ఉంటే వేదికతో సంబంధం ఉండదు. గత మూడేళ్ల ఫలితాలు పరిశీలిస్తే లీగ్లో అత్యధిక విజయాల శాతం మా జట్టుదే. దాన్నే కొనసాగిస్తే ఈ సీజన్ను కూడా చిరస్మరణీయం చేసుకోగలం’ అని వివరించాడు. మ్యాచ్లు గెలవాలంటే భారీ స్కోర్లు చేయడం మాత్రమే కాదని... పిచ్, పరిస్థితులకు తగ్గట్లు ఆడటం ముఖ్యమని పేర్కొన్నాడు. కాగా, ఈ సీజన్లో గుజరాత్ తమ తొలి మ్యాచ్లో (మార్చి 25) పంజాబ్ కింగ్స్ను ఢీకొట్టనుంది. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్.. ఈ సీజన్లో కొత్తగా కనిపిస్తుంది. జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి విధ్వంసకర బ్యాటర్ల చేరికతో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం ప్రమాదకరంగా కనిపిస్తుంది. శుభ్మన్ గిల్ నేతృత్వంలో ఆ జట్టు టైటిల్ గెలిచేందుకు ఉరకలేస్తుంది. గుజరాత్ బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తుంది. రబాడ, సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ద్ కృష్ణ, గెరాల్డ్ కొయెట్జీ లాంటి అంతర్జాతీయ స్థాయి పేసర్లతో కళకళలాడుతుంది. ప్రపంచ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్ జట్టులో ఉండనే ఉన్నాడు. అతనితో పాటు కొత్తగా వాషింగ్టన్ సుందర్ చేరాడు. దేశీయ ఆటగాళ్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాతియా, షారుఖ్ ఖాన్, మహిపాల్ లోమ్రార్ గుజరాత్కు అదనపు బలాన్ని ఇస్తున్నారు.గుజరాత్ టైటాన్స్శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాతియా, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, రషీద్ ఖాన్, మహిపాల్ లోమ్రార్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, షారుఖ్ ఖాన్, నిషాంత్ సింధు, అర్షద్ ఖాన్, కరీమ్ జనత్, వాషింగ్టన్ సుందర్, జయంత్ యాదవ్, జోస్ బట్లర్, కుమార్ కుషాగ్రా, అనూజ్ రావత్, గెరాల్డ్ కొయెట్జీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, ఇషాంత్ శర్మ, కగిసో రబాడ, కుల్వంత్ కేజ్రోలియా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ -
నేను క్రికెటర్ అవడానికి కారణం సచిన్ సర్: శుబ్మన్ గిల్
టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సన్నాహకాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన ఈ పంజాబీ బ్యాటర్.. ఈసారి కూడా జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2025 ఆరంభానికి ముందు గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.మరింత వినోదాత్మకంగాఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల జట్లకు అదనపు ప్రయోజనం కలుగుతుందని శుబ్మన్ గిల్ అభిప్రాయపడ్డాడు. ఈ రూల్ కారణంగా అదనపు బ్యాటర్ లేదంటే బౌలర్ సేవలను ఉపయోగించుకునేందుకు వీలుగా ఉంటుందని.. ఈసారి స్కోర్లు 300 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని పేర్కొన్నాడు. ఈ నిబంధన ఐపీఎల్ను మరింత వినోదాత్మకంగా మార్చిందని గిల్ జియోహాట్స్టార్ షోలో వ్యాఖ్యానించాడు. అదే విధంగా.. ఐపీఎల్తో ముడిపడిన తన చిన్ననాటి జ్ఞాపకాలను ఈ సందర్భంగా గిల్ గుర్తు చేసుకున్నాడు. ‘‘పంచకులలోని తౌ దేవి లాల్ స్టేడియానికి మా నాన్నతో కలిసి మూడు, నాలుగు మ్యాచ్లకు వెళ్లాను. నాకు తెలిసి అప్పటికి ఐపీఎల్ మొదలై మూడేళ్లు గడిచి ఉంటాయి.నేను క్రికెటర్ అవడానికి కారణం సచిన్ సర్అప్పట్లో ముంబై ఇండియన్స్ జట్టు అక్కడ ప్రాక్టీస్ చేసేందుకు వచ్చింది. నాకప్పుడు తొమ్మిదేళ్లు ఉంటాయనుకుంటా.. సచిన్ సర్తో గ్లెన్ మాక్స్వెల్తో నేను ఫొటో తీసుకున్నా.వాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నపుడు బాల్స్ త్రో చేసేవాడిని. ఐపీఎల్తో నాకున్న తొలి జ్ఞాపకం అదే. సచిన్ సర్ గురించి నాకు ముందు నుంచే తెలుసు. ఆయనను చూసే నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను.మా నాన్న ఆయనకు వీరాభిమానిఇక మా నాన్న అయితే.. సచిన్ సర్కి వీరాభిమాని. మా గ్రామంలో ఎక్కడ చూసినా ఆయన పోస్టర్లే కనిపించేవి’’ అని శుబ్మన్ గిల్ తెలిపాడు. ఇక కెప్టెన్సీ అనేది ఓ నిరంతర ప్రయాణమన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. నాయకుడిగా భిన్న అనుభవాలు ఎదుర్కోక తప్పదని పేర్కొన్నాడు.జట్టులోని ప్రతి ఒక్క సభ్యుడి నైపుణ్యాలపై అవగాహన పెంచుకుని.. వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకున్న వారే నాయకులుగా రాణిస్తారని గిల్ అన్నాడు. ప్రతి మ్యాచ్ సరికొత్తగా ఉంటుందని.. ఆటగాళ్ల బలాలు, బలహీనతలు అర్థం చేసుకుంటే.. వారి సేవలు ఎలా వినియోగించుకోవాలో తెలుస్తుందని పేర్కొన్నాడు. కెప్టెన్గా అనుభవం గడించినపుడే..ఇక సారథిగా చేసే ప్రయాణంలో అనుభవం గడిస్తున్న కొద్దీ మరింత రాటుదేలతామని.. అయితే, ఒక్కోసారి కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. అలాంటపుడు సంయమనంతో ముందుకు సాగితే ప్రతికూల ప్రభావం పడదని గిల్ చెప్పుకొచ్చాడు. టైటాన్స్ పగ్గాలు చేపట్టిన కొత్తల్లో తాను సహచర ఆటగాళ్లతో ఎక్కువగా మమేకం కాలేకపోయానన్న.. అయితే, నాయకుడిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చే క్రమంలో తనకు తెలియకుండానే ఎంతో మారిపోయానని పేర్కొన్నాడు. ప్రతి ఒక్క ఆటగాడితో వ్యక్తిగతంగా మాట్లాడటం.. వారి మైండ్సెట్ను అర్థం చేసుకోవడం అలవాటు చేసుకున్నానని గిల్ తెలిపాడు.చదవండి: BCCI: విరాట్ కోహ్లి ఘాటు విమర్శలు.. స్పందించిన బీసీసీఐ -
సచిన్ కూతురుకి హ్యాండ్ ఇచ్చిన గిల్..!
-
శుబ్మన్ గిల్కు ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు.. బుమ్రా రికార్డు బ్రేక్!
టీమిండియా స్టార్ క్రికెటర్ శుబ్మన్ గిల్ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’(ICC Player of the Month) అవార్డు గెలుచుకున్నాడు. ఫిబ్రవరి నెలకు గానూ ఈ పురస్కారానికి అతడు ఎంపికయ్యాడు. తద్వారా ఇప్పటి వరకు అత్యధికసార్లు ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలిచిన తొలి భారత క్రికెటర్గా గిల్ నిలిచాడు.ట్రోఫీ గెలిచిన టీమిండియా..కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ అదరగొట్టిన విషయం తెలిసిందే. గత నెల 19న పాకిస్తాన్లో మొదలైన ఈ మెగా వన్డే టోర్నమెంట్.. దుబాయ్లో మార్చి 9న టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఫైనల్తో ముగిసింది. ఇక ఈ ఈవెంట్లో రోహిత్ సేన తమ మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడింది.గిల్ అదరగొట్టాడుగ్రూప్ దశలో వరుసగా మూడు గెలిచి సెమీస్ చేరిన భారత్.. అనంతరం సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో కివీస్ జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్గా నిలిచింది. ఐదు మ్యాచ్లలోనూ అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది.భారత్ ఈ ఘనత సాధించడంలో గిల్ది కూడా కీలక పాత్ర. ఈ టోర్నీలో బంగ్లాదేశ్పై 101 పరుగులు సాధించిన గిల్.. పాకిస్తాన్తో మ్యాచ్లో 46 పరుగులు చేశాడు. అంతకు ముందు ఇంగ్లండ్తో వన్డే సిరీస్(India vs England)లోనూ గిల్ అదరగొట్టాడు. మూడు మ్యాచ్లలో వరుసగా 87, 60, 112 పరుగులు సాధించాడు.వారిని ఓడించిఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఫిబ్రవరి నెలకు నామినేట్ అయ్యాడు గిల్. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ కూడా ఈ అవార్డు కోసం పోటీపడ్డారు. వారిద్దరిని ఓడించి అత్యధిక ఓట్లతో గిల్ విజేతగా నిలిచాడు.బుమ్రా రికార్డు బ్రేక్ఇక గిల్ ఈ అవార్డు గెలవడం ఇది మూడోసారి. 2023 జనవరి, సెప్టెంబర్ నెలలకు గానూ గిల్ గతంలో ప్లేయర్ ఆఫ్ ది మంత్గా నిలిచాడు. అంతకు ముందు భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండుసార్లు ఈ పురస్కారం పొందాడు. అయితే, గిల్ ఇప్పుడు బుమ్రాను అధిగమించి ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు అందుకున్న భారత క్రికెటర్లు వీరే👉శుబ్మన్ గిల్- మూడుసార్లు👉జస్ప్రీత్ బుమ్రా- రెండుసార్లు👉రిషభ్ పంత్- ఒకసారి👉రవిచంద్రన్ అశ్విన్- ఒకసారి👉భువనేశ్వర్ కుమార్- ఒకసారి👉శ్రేయస్ అయ్యర్- ఒకసారి👉విరాట్ కోహ్లి- ఒకసారి👉యశస్వి జైస్వాల్- ఒకసారి.టాప్లోనే గిల్మరోవైపు.. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో గిల్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ మూడో ర్యాంకు సాధించాడు. మరోవైపు.. విరాట్ కోహ్లి ఐదో స్థానంలో నిలిచాడు.చదవండి: IND vs ENG: గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఇంత వరకు ఏ కోచ్ చేయని విధంగా.. -
హీరోయిన్తో శుభ్మన్ గిల్ డేటింగ్.. ఆ ఒక్క ఫోటో వల్లే !
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని మరోసారి సగర్వంగా ముద్దాడింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్గా నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన తుదిపోరులో న్యూజిలాండ్పై ఘనవిజయం సాధించిన. కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ ఫైనల్ మ్యాచ్లో నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో విజయం భారత్ను వరించింది. దీంతో టీమిండియా ఖాతాలో మరో ఐసీసీ ట్రోఫీ వచ్చి చేరింది. దుబాయ్లో జరిగిన పలువురు బాలీవుడ్ సినీ తారలు సైతం ఈ మ్యాచ్ను వీక్షించారు.అయితే ఈ మ్యాచ్ తర్వాత భారత ఓపెనర్ బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అవనీత్ కౌర్తో శుభ్మన్ గిల్ డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ చూసిన ఫోటోలను అవనీత్ కౌర్ ఇన్స్టాలో పంచుకుంది. అయితే ఆ ఫోటోలు భారత్- ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్ సందర్బంగా అవనీత్ కౌర్ తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది.తాజాగా టీమిండియా కప్ గెలవడంతో మరోసారి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అంతేకాకుండా గతేడాది శుభ్మన్ బర్త్ డే సందర్భంగా అవనీత్ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపింది. గిల్తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. దీంతో వీరిద్దరిపై మరోసారి డేటింగ్పై చర్చ మొదలైంది. ఈ రూమర్స్ నేపథ్యంలో ఆమె రాఘవ్ శర్మ అనే నిర్మాతతో డేటింగ్ చేస్తున్నట్లు కొందరు అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కాగా.. క్రికెటర్ గిల్పై గతంలో కూడా సారా అలీ ఖాన్తో పాటు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్తో రిలేషన్లో ఉన్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.కాగా.. 26 ఏళ్ల అవనీత్ కౌర్ బాలీవుడ్లో పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ల్లోనూ కనిపించింది. ఎనిమిదేళ్ల వయసులో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అవనీత్ కౌర్ మొదటిసారిగా 2010లో 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ షోలో కనిపించింది. ఆ తర్వాత ఆమె 'డ్యాన్స్ కే సూపర్స్టార్స్'లో పాల్గొంది. ఆ తర్వాత 2012లో 'మేరీ మా' టీవీ షోతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఝలక్ దిఖ్లా జా (2012), మసావిత్రిక్, ఏక్ ముత్తి ఆస్మాన్ లాంటి సీరియల్స్లో నటించింది. ఆ తర్వాత 'మర్దానీ' మూవీతో బిగ్ స్క్రీన్లోకి అడుగుపెట్టింది. 2023లో కంగనా రనౌత్ నిర్మించిన టికు వెడ్స్ షేరు చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన రొమాంటిక్ పాత్రలో కనిపించింది. కౌర్ చివరిసారిగా 2024లో వచ్చిన 'పార్టీ టిల్ ఐ డై'అనే మర్డర్ మిస్టరీలో నటించింది. View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) -
CT 2025 Final: గ్లెన్ ఫిలిప్స్ కళ్లు చెదిరే క్యాచ్.. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమం
క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమమైన క్యాచ్ నమోదైంది. న్యూజిలాండ్తో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో గ్లెన్ ఫిలిప్స్ ఈ క్యాచ్ను అందుకున్నాడు. మిచెల్ సాంట్నర్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ ఆడిన షాట్ను (కవర్స్ దిశగా) ఫిలిప్స్ అమాంతం గాల్లోకి ఎగిరి పట్టేసుకున్నాడు. ఈ క్యాచ్ను ఫిలిప్స్ సైతం నమ్మలేకపోయాడు. క్యాచ్ పట్టిన తర్వాత కింద కూర్చుని క్యాచ్ పట్టానా అన్నట్లు ఎక్స్ప్రెషన్ పెట్టాడు. What a magnificent catch by GLENN PHILLIPS 🤯👏👏👏#INDvsNZ #ChampionsTrophyFinal pic.twitter.com/1CxjG3QYiw— INNOCENT EVIL ⁶𓅓 (@raju_innocentev) March 9, 2025ఈ క్యాచ్ను చూసి గిల్ నోరెళ్లపెట్టాడు. ఈ క్యాచ్ తర్వాత దుబాయ్ స్టేడియంలో నిశ్శబ్దం ఆవహించింది. అప్పటిదాకా భారత్కు సపోర్ట్ చేసిన ప్రేక్షకులు ఫిలిప్స్ క్యాచ్ చూసి షాక్లో ఉండిపోయారు. అస్సలు సాధ్యంకాని క్యాచ్ను పట్టడంతో అభిమానులు ఫిలిప్స్కు జేజేలు పలుకుతున్నారు. ఈ క్యాచ్ను సంబంధించిన వీడియో సోషల్మీడియాను షేక్ చేస్తుంది. ఫిలిప్స్ మనిషా లేక పక్షా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఫిలిప్స్ ఇదే టోర్నీలో విరాట్ కోహ్లి క్యాచ్ను (గ్రూప్ దశ మ్యాచ్లో) కూడా ఇలాగే నమ్మశక్యంకాని రీతిలో పట్టుకున్నాడు. ఆ క్యాచ్ను ఇది తలదన్నేలా ఉంది. క్యాచెస్ విన్ మ్యాచెస్ అన్న నానుడుని ఫిలిప్స్ నిజం చేస్తాడేమో చూడాలి.ఫిలిప్స్ పట్టుకున్న క్యాచ్ ఆషామాషీ వ్యక్తిది కాదు. గిల్ మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసే సత్తా ఉన్న ఆటగాడు. అదీ కాక భారత్ అప్పటిదాకా బాగా స్కోర్ చేసి విజయం దిశగా దూసుకుపోతుండుంది. ఫిలిప్స్ క్యాచ్తో భారత్ డిఫెన్స్లో పడింది. పుండుపై కారం చల్లినట్లు గిల్ (31) ఔటైన పరుగు వ్యవధిలోనే భారత్ అత్యంత కీలకమైన విరాట్ కోహ్లి (1) వికెట్ కూడా కోల్పోయింది. మరో 17 పరుగుల తర్వాత క్రీజ్లో కుదురుకుపోయిన రోహిత్ శర్మ (76) కూడా ఔటయ్యాడు. దీంతో భారత్ ఒక్కసారిగా కష్టాల్లో కూరుకుపోయినట్లైంది. శ్రేయస్ అయ్యర్ (35), అక్షర్ పటేల్ (13) భారత ఇన్నింగ్స్ను చక్కద్దిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 35 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 161/3గా ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే 90 బంతుల్లో 91 పరుగులు చేయాలి. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. స్పిన్కు అనుకూలిస్తున్న పిచ్పై డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్వెల్ (53 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలు చేసి న్యూజిలాండ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో విల్ యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, కేన్ విలియమ్సన్ 11, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 34, మిచెల్ సాంట్నర్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినా న్యూజిలాండ్ మంచి స్కోర్ చేసింది. -
శుబ్మన్ గిల్కు ప్రమోషన్.. ఏకంగా రూ. 7 కోట్ల జీతం!?
భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) 2025-26 ఏడాదికి గాను ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించేందుకు సిద్దమైంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముగిసిన తర్వాత ఈ లిస్ట్ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. గతేడాది సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు ప్రమోషన్ దక్కనున్నట్లు సమాచారం.అతని సెంట్రల్ కాంట్రాక్ట్ను పునరుద్దరించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దేశీవాళీ క్రికెట్లో ఆడాలన్న తమ ఆదేశాలను ధిక్కరించడంతో బీసీసీఐ అయ్యర్పై వేటు వేసింది. ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని రంజీల్లో ఆడిన శ్రేయస్ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు.జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన అయ్యర్.. తన అద్బుతప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనూ శ్రేయస్ దుమ్ములేపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి తిరిగి మళ్లీ కాంట్రాక్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించుకుంది.గిల్కు ప్రమోషన్.. కోహ్లి, రోహిత్కు డిమోషన్మరోవైపు అద్బుతమైన ఫామ్లో ఉన్న టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill)కు సైతం ప్రమోషన్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గిల్ ప్రస్తుతం బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ల్లో ఏ కేటగిరిలో ఉన్నాడు. ఇప్పుడు అతడిని టాప్ గ్రేడ్(ఏ ప్లస్)కు ప్రమోట్ చేయాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించుకున్నారంట. కాగా ప్రస్తుతం ఏ ప్లస్ కేటగిరిలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలు మాత్రమే ఉన్నారు. అయితే అంతర్జాతీయ టీ20లకు విడ్కోలు పలికిన కోహ్లి, రోహిత్ శర్మ, జడేజా కాంట్రాక్లు మారనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సీనియర్ త్రయాన్ని ఏ ప్లస్ నుంచి ఏ గ్రేడ్కు డిమోట్ చేసే అవకాశముంది. వీరిస్ధానాల్లో గిల్తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఏ ప్లస్ కేటగిరిలో చోటు దక్కే సూచనలు కన్పిస్తున్నాయి.కేటగిరి వారీగా ఆటగాళ్లకు దక్కే మొత్తం ఎంతంటే?ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది.కివీస్తో ఫైనల్ పోరు..ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు కివీస్ కూడా భారత్ను ఓడించి రెండోసారి ఈ మెగా టోర్నీ టైటిల్ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది.చదవండి: CT 2025: భారత్-న్యూజిలాండ్ ఫైనల్ పోరు.. బ్యాటర్లకు చుక్కలే! ఎందుకంటే? -
ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీగా శుభ్మన్ గిల్.. రేసులో మరో ఇద్దరు స్టార్లు
ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీల వివరాలను ఐసీసీ ఇవాళ (మార్చి 7) ప్రకటించింది. పురుషుల విభాగంలో టీమిండియా యువ ఆటగాడు శుభ్మన్ గిల్, న్యూజిలాండ్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్, ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ నామినేట్ అయ్యారు. మహిళల విభాగంలో అలానా కింగ్ (ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్), అన్నాబెల్ సదర్ల్యాండ్ (ఆసీస్ బ్యాటర్), తిసాట్చా పుత్తవోంగ్ (థాయ్ల్యాండ్ బౌలర్) నామినీస్గా నిలిచారు. ఫిబ్రవరిలో ఆయా ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శనలు కనబర్చిన వారిని ఐసీసీ నామినీస్గా ఎంపిక చేసింది. ఓటింగ్ ఆధారంగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ విజేతలను ప్రకటిస్తారు.శుభ్మన్ గిల్: ఫిబ్రవరి నెలలో గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ నెలలో అతను 100కుపైగా సగటుతో 406 పరుగులు చేశాడు. ఇంగ్లండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో గిల్ వరుసగా 87, 60, 112 పరుగులు చేశాడు. అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్పై మరో సెంచరీ బాదాడు. ఇదే నెలలో గిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు.గ్లెన్ ఫిలిప్స్: ఫిబ్రవరి నెలలో ఫిలిప్స్ అద్భుత ప్రదర్శనలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్లో జరిగిన వన్డే సిరీస్లో కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. ఈ సిరీస్లో ఫిలిప్స్ వరుసగా 28 నాటౌట్, 20 నాటౌట్, 106 (74 బంతుల్లో 7 సిక్సర్లు) స్కోర్లు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లోనూ ఫిలిప్స్ విజృంభించాడు. ఈ మ్యాచ్లో ఫిలిప్స్ మెరుపు అర్ద సెంచరీ (39 బంతుల్లో 61) సాధించాడు. ఇదే మ్యాచ్లో ఫిలిప్స్ పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ క్యాచ్ను నమ్మశక్యంకాని రీతిలో అందుకున్నాడు.స్టీవ్ స్మిత్: ఫిబ్రవరి నెలలో స్మిత్ టెస్ట్ల్లో అద్భుతంగా రాణించాడు. ఈ నెలలో శ్రీలంకతో జరిగిన రెండు టెస్ట్ల్లో స్మిత్ రెండు సెంచరీలు బాదాడు. ఫలితంగా ఈ సిరీస్లో స్మిత్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ ప్రదర్శనలతో స్మిత్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో టాప్-5లోకి చేరుకున్నాడు. -
‘ఆ ఇద్దరు రాణిస్తే ట్రోఫీ మనదే.. కివీస్ ప్రధాన టార్గెట్ అతడే’
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)ఫైనల్లో టీమిండియా- న్యూజిలాండ్(India vs New Zealand) అమీతుమీ తేల్చుకోనున్నాయి. పాతికేళ్ల తర్వాత మరోసారి ఈ రెండు జట్లు ఈ మెగా వన్డే టోర్నీ టైటిల్ పోరులో తలపడనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాడు కివీస్ టీమిండియాపై పైచేయి సాధించి ఐసీసీ నాకౌట్ ట్రోఫీ గెలవగా.. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అన్ని విభాగాల్లోనూ భారత్ పటిష్టంగా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఈసారి ఫైనల్ మామూలుగా ఉండబోదని ఇరుజట్ల అభిమానులు ఈ రసవత్తర పోరు కోసం ఎదురుచూస్తున్నారు. దుబాయ్ వేదికగా ఆదివారం భారత్- కివీస్ తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అతడేటైటిల్ సమరంలో టీమిండియా తరఫున మిడిలార్డర్ శ్రేయస్ అయ్యర్ ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అవుతాడని అంచనా వేసిన ఈ మాజీ ఓపెనర్.. శుబ్మన్ గిల్ కూడా కీలకం కాబోతున్నాడని పేర్కొన్నాడు. ఏదేమైనా ఈసారి కివీస్ బౌలర్లు ప్రధానంగా శ్రేయస్ అయ్యర్నే టార్గెట్ చేస్తారని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్పై వన్డేల్లో శ్రేయస్ అయ్యర్ ఒక్కసారి మాత్రమే 30 కంటే తక్కువ పరుగులు చేశాడనుకుంటా. అదొక్కటి మినహా ప్రతిసారీ అతడు కివీస్పై బాగానే రన్స్ రాబట్టాడు. కాబట్టి ఈసారి అతడినే ఎక్కువగా టార్గెట్ చేస్తారనిపిస్తోంది.మిడిల్ ఓవర్లలో వాళ్లు బాగా బౌలింగ్ చేస్తున్నారు. మిచెల్ సాంట్నర్, బ్రాస్వెల్ లేదంటే రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్.. ఈ నలుగురే ఎక్కువగా బరిలోకి దిగవచ్చు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ స్పిన్ బాగా ఆడతాడు కదా! అందుకే అతడిని త్వరగా పెవిలియన్కు పంపేందుకు ఈ స్పిన్ బౌలర్లు ప్రయత్నిస్తారు. అతడిపైనే దృష్టి పెడతారు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.కివీస్తో ఆటంటే శ్రేయస్కు మజాకాగా న్యూజిలాండ్తో వన్డేల్లో ఇప్పటి వరకు ఎనిమిది ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్.. సగటున 70.38తో 563 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఇక కివీస్పై శ్రేయస్ అత్యల్ప స్కోరు 33. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా పైవిధంగా స్పందించాడు.ఇక ఓపెనింగ్ బ్యాటర్ శుబ్మన్ గిల్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘బంగ్లాదేశ్పై సెంచరీ చేయడం ద్వారా ఈ ఐసీసీ టోర్నీలో గిల్ బిగ్బ్యాంగ్తో ముందుకు వచ్చాడు. పాకిస్తాన్పై కూడా మెరుగ్గా ఆడాడు. అయితే, ఆ తర్వాత అతడు కాస్త వెనుకబడ్డాడు. ఫైనల్లో బ్యాట్ ఝులిపిస్తేనే జట్టుకు, అతడికి ప్రయోజనకరంగా ఉంటుంది. మరో విరాట్ కావాలంటే గిల్ ఫైనల్లో తన ముద్రను వేయాలి. శ్రేయస్ అయ్యర్, శుబ్మన్ గిల్ గనుక రాణిస్తే చాంపియన్స్ ట్రోఫీ మనదే అని రాసిపెట్టుకోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. డబుల్ సెంచరీ వీరుడుకాగా కివీస్పై గిల్కు కూడా గొప్ప రికార్డు ఉంది. ఇప్పటి వరకు కివీస్పై పదకొండు ఇన్నింగ్స్లో అతడు 592 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండగా.. హైదరాబాద్లో 2023లో డబుల్ సెంచరీ(208) కూడా కివీస్పైనే సాధించాడు. చదవండి: కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్బై? ఆటగాడిగా కొనసాగింపు? బీసీసీఐ నిర్ణయం? -
గిల్ చేసిన ‘తప్పు’..! టీమిండియాకు శాపమయ్యేది! ఎందుకంటే..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత జట్టు అజేయంగా ఫైనల్కు చేరుకుంది. ఆస్ట్రేలియా(India vs Australia)తో మంగళవారం నాటి సెమీస్లో సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టి.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అయితే, ఈ మ్యాచ్కు ముందు భారత మాజీ క్రికెటర్లలో అత్యధిక మంది టీమిండియాకు చేసిన ప్రధాన సూచన.. ఆసీస్ విధ్వంసకర వీరుడు ట్రవిస్ హెడ్ను వీలైనంత త్వరగా అవుట్ చేయాలనే!!...ఎందుకంటే.. రోహిత్ సేన సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023(ODI World Cup) గెలవకుండా అడ్డుపడి.. ఆస్ట్రేలియాను ఒంటిచేత్తో గెలిపించిన ఘనత అతడి సొంతం. అందుకే ‘తలనొప్పి’ తెచ్చిపెట్టే ఈ బ్యాటర్పైనే ముందుగా దృష్టి సారించాలని సంజయ్ మంజ్రేకర్, హర్భజన్ సింగ్, దినేశ్ కార్తిక్ తదితరులు భారత బౌలర్లకు సూచించారు. అందుకు తగ్గట్లుగానే మంగళవారం హెడ్ను టీమిండియా తక్కువ స్కోరుకే పెవిలియన్కు పంపించింది.టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో శుబ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి హెడ్ అవుటయ్యాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి నిష్క్రమించాడు. ‘అతి’ ఆనందంఅయితే, హెడ్ ఇచ్చిన క్యాచ్ పట్టిన తర్వాత గిల్ చేసిన తప్పిదం టీమిండియా కొంపముంచేది. హెడ్ క్యాచ్ పట్టినప్పుడు శుబ్మన్ గిల్ ప్రదర్శించిన ‘అతి’ ఆనందం అంపైర్ నుంచి హెచ్చరికకు గురయ్యేలా చేసింది. క్యాచ్ అందుకోగానే కొద్ది సేపయినా తన చేతిలో ఉంచకుండా గిల్ బంతిని గాల్లోకి విసిరేశాడు.నిజానికి క్యాచ్ పట్టడంలో అతడు ఎక్కడా తడబడలేదు. అయితే బాల్ను ఎంతసేపు చేతిలో ఉంచుకోవాలనే విషయంలో నిబంధనలు సరిగ్గా లేకపోయినా... కనీసం 2–3 సెకన్ల పాటు ఫీల్డర్ బంతిని తన నియంత్రణలో ఉంచుకోవాలి.క్లీన్’గా ఉన్నా.. వార్నింగ్ ఎందుకు?ఇదే విషయాన్ని అంపైర్ ఇల్లింగ్వర్త్ ప్రత్యేకంగా గిల్కు వివరించాడు. ఇలాంటి సందర్భాల్లో అవుట్/నాటౌట్ ఇచ్చే విషయంలో అంపైర్కు విచక్షణాధికారం ఉంటుంది. ఒకవేళ ఇల్లింగ్వర్త్ గనుక గిల్ వెనువెంటనే బంతిని విసిరేయడాన్ని సీరియస్గా తీసుకుని నాటౌట్ ఇచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఒక్కసారి లైఫ్ లభిస్తే హెడ్ను ఆపటం అంత తేలికేమీ కాదు. అందుకే గిల్ చర్య విమర్శలకు దారి తీసింది.ఇదిలా ఉంటే.. ఓపెనర్ హెడ్ అవుటైన తర్వాత కెప్టెన్ , వన్డౌన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. మార్నస్ లబుషేన్(29) మరో ఎండ్ నుంచి సహకారం అందించగా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.నిజానికి అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో అనూహ్యం చోటు చేసుకుంది. స్మిత్ డ్రైవ్ చేయగా బంతి అతడి ప్యాడ్ల మీదుగా స్టంప్స్ను తాకింది. అయితే బెయిల్స్ పడకపోవడంతో స్మిత్ బతికిపోయాడు. ఆపే ప్రయత్నం చేస్తే తన కాలితోనే స్టంప్స్ పడిపోతాయని భావనతో కావచ్చు స్మిత్ అలా కూడా చేయలేదు. ఆ సమయంలో అతని స్కోరు 23 పరుగులు. అతని స్కోరు 36 వద్ద ఉన్నప్పుడు షమీ బౌలింగ్లో బలంగా షాట్ కొట్టగా... తన ఎడమ చేత్తో క్యాచ్ పట్టే ప్రయత్నం చేసిన షమీ విఫలమయ్యాడు. అయితే ఇది చాలా కఠినమైన క్యాచ్. ఏదేమైనా స్మిత్ 73 పరుగుల చేసి షమీ బౌలింగ్లో బౌల్డ్ కాగా.. అలెక్స్ క్యారీ అర్ధ శతకం(61) కారణంగా ఆసీస్ 264 పరుగులు చేయగలిగింది.వరల్డ్ చాంపియన్స్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించిఅయితే, లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆరంభించిన టీమిండియా ఆ తర్వాత తడబడ్డప్పటికీ విరాట్ కోహ్లి(98 బంతుల్లో 84) అద్భుతం చేశాడు. అతడికి తోడుగా శ్రేయస్ అయ్యర్(45), వికెట్ కీపర్ కేఎల్ రాహుల్(34 బంతుల్లో 42) రాణించారు. గ్లెన్ మాక్స్వెల్ బౌలింగ్లో రాహుల్ కొట్టిన సిక్సర్తో టీమిండియా విజయం ఖరారైంది. ఫలితంగా వరల్డ్ చాంపియన్స్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి రోహిత్ సేన ఫైనల్కూ దూసుకెళ్లింది.చదవండి: #Steve Smith: భారత్ చేతిలో ఓటమి.. స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం -
IND vs NZ: కివీస్తో మ్యాచ్కు రోహిత్ దూరం.. కెప్టెన్గా అతడు!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా ఆఖరి లీగ్ మ్యాచ్కు సన్నద్ధమవుతోంది. ఈ ఐసీసీ వన్డే టోర్నమెంట్లో ఇప్పటికే సెమీ ఫైనల్ చేరుకున్న రోహిత్ సేన.. న్యూజిలాండ్తో ఆదివారం నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. అయితే, ఈ మ్యాచ్కు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.రోహిత్కు రెస్ట్ ఇవ్వడమే మంచిదిపాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా హిట్మ్యాన్ పిక్కల నొప్పితో బాధపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మైదానం వీడి కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ ఫీల్డింగ్కు వచ్చాడు. అయితే, నొప్పి ఇంకా పూర్తిగా తగ్గలేదని తెలుస్తోంది. దుబాయ్లో జరిగిన ప్రాక్టీస్ సెషన్లోనూ అతడు బ్యాటింగ్ చేయలేకపోయాడు. దీంతో కివీస్తో మ్యాచ్కు దూరంగా ఉండాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.సెమీస్ మ్యాచ్ మార్చి 4, 5 తేదీల్లోనే జరుగనున్న తరుణంలో రోహిత్కు విశ్రాంతిన్విడమే మంచిదని యాజమాన్యం కూడా భావిస్తున్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill) తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. గిల్తో పాటు ఓపెనర్గా రాహుల్అయితే, గిల్ జ్వరంతో బాధపడుతున్నాడని వార్తలు రాగా.. ఆప్షనల్ నెట్ సెషన్లో అతడు గంటలపాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడంతో వాటికి చెక్ పడింది.ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ గనుక దూరమైతే గిల్కు ఓపెనింగ్ జోడీగా కేఎల్ రాహుల్ వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే మరో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్కు తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక గ్రూప్-‘ఎ’ నుంచి కివీస్ కూడా భారత్తో పాటు సెమీస్ చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 2 నాటి మ్యాచ్లో గెలిచి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో సెమీ ఫైనల్ బరిలో దిగాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. అంతేకాదు.. ఈ మ్యాచ్లో గెలుపు ఆధారంగానే గ్రూప్-‘ఎ’ విజేతతో పాటు సెమీస్ ప్రత్యర్థి ఎవరన్నది తేలనుంది.కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలైంది. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ బరిలో నిలిచాయి. అయితే, గ్రూప్-‘ఎ’లో వరుసగా రెండు మ్యాచ్లో ఓడటంతో పాటు.. తమ మధ్య ఆఖరి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో పాక్- బంగ్లా కనీసం ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించాయి. ఇక గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ ఇంటిబాటపట్టింది. ఇక ఈ టోర్నీలో టీమిండియా తమ మ్యాచ్లు అన్నీ దుబాయ్లో ఆడుతోంది.చదవండి: అఫ్గన్ చేతిలో ఓటమి.. బట్లర్ సంచలన నిర్ణయం?! -
Shubman Gill: పరుగుల వేటగాడు.. మిస్టర్ నంబర్ వన్
అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు అధిరోహిస్తున్న 25 ఏళ్ల శుభ్మన్ గిల్(Shubman Gill) ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో వరల్డ్ నంబర్వన్ ర్యాంకర్గా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)లో భారత జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికైన అతడు బ్యాటర్గానూ ఇరగదీస్తున్నాడు. అంతా కలిసొస్తే భవిష్యత్లో భారత భావి కెప్టెన్గా గిల్ను చూడవచ్చు.... పంజాబ్ యువ ఓపెనర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన గిల్ ప్రస్థానం వర్దమాన ఆటగాళ్లకు ఆదర్శం.బ్యాట్ పట్టగానే ఆ కుర్రాడు తన పరుగుల వేట ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపెట్టాడు. అంతర్ జిల్లా అండర్–16 క్రికెట్ టోర్నీ మ్యాచ్లో 351 పరుగులు చేసి ప్రకంపనలు రేపాడు. అదే ఊపులో విజయ్ మర్చంట్ ట్రోఫీ అరంగేట్రంలోనే అజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. అండర్–19 జాతీయ జట్టుకు సులువుగానే ఎంపికయ్యాడు. అప్పటికే ఓపెనర్గా రాటుదేలిన ఆ కుర్రాడు 2018లో జరిగిన అండర్–19 ప్రపంచకప్ టోర్నీలో విశ్వరూపం ప్రదర్శించాడు.న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఆ టోర్నీలో 372 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవడంతో పాటు ’ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కించుకొని యువభారత జట్టు ట్రోఫీ చేజిక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తదనంతరం అండర్–19 ప్రదర్శనతో అనతి కాలంలోనే జాతీయ సీనియర్ జట్టుకు ఎంపికయ్యాడు. మనం చెప్పుకున్న ఈ విశేషాలన్నీ పంజాబ్ యువ క్రికెటర్ శుభ్మన్ గిల్ గురించే. సీనియర్ ప్లేయర్లు ఉన్న జట్టుకు వైస్ కెప్టెన్విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, షమీ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్న జట్టుకు గిల్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడంటే అతడి ప్రతిభ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. మూడు ఫార్మాట్లలోనూ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన గిల్ ముఖ్యంగా వన్డేల్లో తన అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు.2019లో న్యూజిలాండ్పై అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన గిల్ ఇప్పటి వరకు 52 మ్యాచ్లు ఆడి 62.13 సగటుతో 2734 పరుగులు సాధించాడు. క్రీజులో నిలదొక్కుకుంటే చాలు భారీ ఇన్నింగ్స్లు ఆడతాడనే గుర్తింపు తెచ్చుకున్న గిల్ ఇప్పటికే ఒక డబుల్ సెంచరీ, 8 సెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు.మూడు ఫార్మాటల్లో సెంచరీలు చేసిన అతికొద్దిమంది ఆటగాళ్లలో ఒకడైన గిల్ ఇటీవల ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో వీరవిహారం చేశాడు. మూడు మ్యాచ్లలో ఒక సెంచరీ రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేసుకొని ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో తిరిగి అగ్రస్థానం దక్కించుకున్నాడు.అండర్–19 స్థాయిలోనే గిల్ కంటే మెరుగైన నైపుణ్యం ఉన్న ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ప్రపంచకప్ అందించిన పృథ్వీ షా ఇప్పుడు టీమిండియా సెలక్షన్ దరిదాపుల్లో కూడా లేకుండా పోగా ప్రతిభకు క్రమశిక్షణ జోడించిన శుభ్మన్ గిల్ ‘ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి’ అనే ప్రాథమిక సూత్రాన్ని పాటిస్తున్నాడు. 2023 ఐపీఎల్ సీజన్ గుజరాత్ టైటాన్స్ తరఫున 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్న గిల్ ప్రస్తుతం ఆ ఫ్రాంచైజీ సారథిగా కొనసాగుతున్నాడు. – ఇంతియాజ్ మొహమ్మద్చదవండి: CT 2025 Aus Vs Afg: వరుణుడు కరుణిస్తే... -
Ind vs NZ: కివీస్తో మ్యాచ్లో ఓపెనర్గా అతడు.. పంత్కి ఛాన్స్!
న్యూజిలాండ్(India vs New Zealand)తో వన్డే నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓపెనింగ్ జోడీ మారవచ్చని.. అదే విధంగా.. కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు జట్టులో దక్కవచ్చని అంచనా వేశాడు. అయితే, తాను మాత్రం ఇలాంటి మార్పులు వద్దనే సూచిస్తానని పేర్కొన్నాడు.సెమీస్లో భారత్, కివీస్ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా భారత్.. పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్లతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది. ఈ క్రమంలో లీగ్ దశలో భాగంగా తొలుత బంగ్లాదేశ్ను ఓడించిన రోహిత్ సేన.. అనంతరం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై కూడా జయభేరి మోగించింది. మరోవైపు.. న్యూజిలాండ్ కూడా ఈ రెండు జట్లపై గెలిచి భారత్తో పాటు సెమీస్ చేరింది.రోహిత్ శర్మ దూరం?ఈ క్రమంలో లీగ్ దశలో చివరగా నామమాత్రపు మ్యాచ్లో భారత్- కివీస్ ఆదివారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇరుజట్లకు సెమీస్కు సన్నాహకంగా మారనుంది. ఇందులో గెలిచి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని భారత్- న్యూజిలాండ్ పట్టుదలగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. పాక్తో మ్యాచ్ సందర్భంగా పిక్కల్లో నొప్పితో బాధపడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. పూర్తిస్థాయిలో కోలుకోలేదని సమాచారం.అదే విధంగా.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ కూడా జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్తో మ్యాచ్లో టీమిండియా మార్పులు చేయబోతోందా? రోహిత్ శర్మ ఇందులో ఆడకపోవచ్చు. మహ్మద్ షమీ కూడా విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది.రిషభ్ పంత్, అర్ష్దీప్ సింగ్లకు అవకాశంకేఎల్ రాహుల్ ఓపెనర్గా రాబోతున్నాడు. రిషభ్ పంత్, అర్ష్దీప్ సింగ్లకు ఈసారి తుదిజట్టులో చోటు దక్కుతుందనే వార్తలు వస్తున్నాయి. ఇలా జరగొచ్చు. లేదంటే జరగకపోవచ్చు. కానీ నా అభిప్రాయం ప్రకారం భారత్ గత రెండు మ్యాచ్లలో ఆడిన జట్టుతోనే ముందుకు వెళ్లాలి.గెలుపు మనకు ఓ అలవాటుగా మారినప్పుడు.. అదే జట్టును కొనసాగిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయి. చాంపియన్స్ ట్రోఫీలో జడ్డూ గత మ్యాచ్లలో పెద్దగా వికెట్లు తీయలేదు. అయినా సరే అతడిని కొనసాగించాల్సిందే. జడ్డూను కాదని వరుణ్ చక్రవర్తిని తీసుకువచ్చే ఆలోచన కూడా యాజమాన్యానికి ఉండి ఉండవచ్చు.జడ్డూనే ఆడించాలిలేదా.. కివీస్ జట్టులో ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఎక్కువ కాబట్టి వాషింగ్టన్ సుందర్ను ఆడించే యోచనలో ఉండొచ్చు. కానీ జడ్డూనే ఆడించాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే.. అతడు తదుపరి సెమీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇలాంటి సమయంలో విశ్రాంతి పేరిట పక్కనపెట్టకూడదు’’ అని అభిప్రాయపడ్డాడు.ఒకవేళ తుదిజట్టులో మార్పు చేయాలని భావిస్తే షమీని తప్పించి అర్ష్దీప్ను ఆడిస్తే ప్రయోజనకరంగానే ఉంటుందని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో తొమ్మిది ఓవర్ల కోటా వేసిన స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 37 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. ఇక పాకిస్తాన్తో మ్యాచ్లో మాత్రం ఏడు ఓవర్లలోనే 40 రన్స్ ఇచ్చిన జడ్డూ ఒక వికెట్ తీయగలిగాడు. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో కేఎల్ రాహుల్తో కలిసి వికెట్ కీపర్ కోటాలో అవకాశం దక్కించుకున్న రిషభ్ పంత్కు మాత్రం తుదిజట్టులో ఆడే ఛాన్స్ రావడం లేదు. అయితే, కివీస్తో మ్యాచ్కు రోహిత్ దూరంగా ఉంటే మాత్రం.. రాహుల్ ఓపెనర్గా వస్తే.. పంత్కు చోటు దక్కవచ్చు.బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో మ్యాచ్లలో ఆడిన భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.బెంచ్: రిషభ్ పంత్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్.చదవండి: అతడొక అద్భుతం.. క్రెడిట్ తనకే.. బాధగా ఉంది: బట్లర్ -
టీమిండియాకు భారీ షాక్.. రోహిత్కు గాయం! గిల్కు జ్వరం?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా తమ ఆఖరి లీగ్ మ్యాచ్కు సన్నద్దమవుతోంది. ఈ టోర్నీలో భాగంగా మార్చి 2న న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. ఇప్పటికే సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకున్న భారత జట్టు.. కివీస్పై కూడా గెలిచి గ్రూపు స్టేజిని విజయంతో ముగించాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ కోసం దుబాయ్లోని ఐసీసీ ఆకాడమీ గ్రౌండ్లో మెన్ ఇన్ బ్లూ తీవ్రంగా శ్రమిస్తోంది.అయితే ఈ మ్యాచ్కు ముందు భారత్కు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో భాదపడుతున్నట్లు తెలుస్తోంది. హిట్మ్యాన్తో పాటు స్టార్ ప్లేయర్ శుబ్మన్ గిల్కు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో వీరిద్దరూ బుధవారం జరిగిన టీమ్ నెట్ ప్రాక్టీస్కు దూరమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అస్వస్థత కారణంగా గిల్ హోటల్ రూమ్కే పరిమితం కాగా.. రోహిత్ శర్మ మైదానంకు వచ్చినప్పటికి ప్రాక్టీస్లో మాత్రం పాల్గోలేదని క్రిక్బజ్ తమ కథనంలో పేర్కొంది. గాయం తీవ్రతరం కాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ప్రాక్టీస్ను రోహిత్ స్కిప్ చేశాడని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.కాగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు. కొన్ని ఓవర్ల పాటు ఆటకు కూడా దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత తిరిగి మైదానంలో వచ్చాడు. అయినప్పటికి రోహిత్ అంత ఫిట్నెస్గా కన్పించలేదు. అయితే రోహిత్, గిల్ ప్రాక్టీస్కు దూరంగా ఉండడంపై బీసీసీఐ నుంచి ఎటుంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.సూపర్ ఫామ్లో గిల్..కాగా శుబ్మన్ గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో 101 పరుగులు చేసిన గిల్.. పాకిస్తాన్పై 46 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ కూడా తొలి రెండు మ్యాచ్ల్లో తన బ్యాట్ను ఝలిపించాడు. ఒకవేళ వీరిద్దరూ న్యూజిలాండ్తో మ్యాచ్కు దూరమైతే భారత్కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. మరోవైపు గాయం నుంచి కోలుకున్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన ప్రాక్టీస్ను మొదలు పెట్టాడు. రోహిత్, గిల్ కివీస్తో మ్యాచ్కు దూరమైతే వారి స్ధానాల్లో వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.చదవండి: అతడొక అద్భుతం.. క్రెడిట్ తనకే.. బాధగా ఉంది: బట్లర్ -
శుబ్మన్ గిల్ ‘టాప్’ ర్యాంక్ పటిష్టం
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత ఆటగాడు శుబ్మన్ గిల్ తన నంబర్వన్ ర్యాంక్ను మరింత పటిష్టం చేసుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో గిల్ 817 రేటింగ్ పాయింట్లతో ‘టాప్’ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గిల్ ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్పై అజేయ సెంచరీ (101 నాటౌట్) చేసిన ఈ పంజాబ్ బ్యాటర్ పాకిస్తాన్తో జరిగిన పోరులో 46 పరుగులు సాధించాడు. దాంతో గిల్ ఖాతాలో 21 రేటింగ్ పాయింట్లు చేరాయి. పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ 770 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. గిల్, బాబర్ ఆజమ్ మధ్య 47 పాయింట్ల వ్యత్యాసం ఉంది. భారత కెపె్టన్ రోహిత్ శర్మ (757 పాయింట్లు) మూడో ర్యాంక్లో ఎలాంటి మార్పు లేదు. చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్పై అజేయ సెంచరీ చేసిన భారత స్టార్ విరాట్ కోహ్లి ఒక స్థానం మెరుగుపర్చుకొని ఐదో ర్యాంక్లో నిలిచాడు. భారత్కే చెందిన శ్రేయస్ అయ్యర్ తొమ్మిదో ర్యాంక్లో, కేఎల్ రాహుల్ 15వ ర్యాంక్లో ఉన్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడో ర్యాంక్లో నిలిచాడు. -
ఐదో స్థానానికి ఎగబాకిన విరాట్.. టాప్-10లో నలుగురు టీమిండియా బ్యాటర్లు
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో (ICC ODI Rankings) భారత బ్యాటర్ల హవా కొనసాగింది. టాప్-10లో ఏకంగా నలుగురు భారత బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు. శుభ్మన్ గిల్ (Shubman Gill) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రోహిత్ (Rohit Sharma) మూడు, విరాట్ (virat Kohli) ఐదు, శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తొమ్మిది స్థానాల్లో ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్పై సెంచరీ చేయడంతో విరాట్ ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి చేరాడు. తాజా ర్యాంకింగ్స్లో ఛాంపియన్స్ ట్రోఫీ సెంచరీ హీరోలు గణనీయంగా లబ్ది పొందారు. విల్ యంగ్ 8 స్థానాలు మెరుగుపర్చుకుని 14వ స్థానానికి.. బెన్ డకెట్ 27 స్థానాలు మెరుగుపర్చుకుని 17వ స్థానానికి.. రచిన్ రవీంద్ర 18 స్థానాలు మెరుగుపర్చుకుని 24వ స్థానానికి.. టామ్ లాథమ్ 11 స్థానాలు మెరుగుపర్చుకుని 31వ స్థానానికి.. జోస్ ఇంగ్లిస్ 18 స్థానాలు మెరుగుపర్చుకుని 88వ స్థానానికి చేరారు. టాప్-10లో భారత బ్యాటర్లతో పాటు బాబర్ ఆజమ్ (2), హెన్రిచ్ క్లాసెన్ (4), డారిల్ మిచెల్ (6), హ్యారీ టెక్టార్ (7), చరిత్ అసలంక (8), షాయ్ హోప్ (10) ఉన్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టాప్-10లో కుల్దీప్ (3వ స్థానం) మినహా భారత్కు ప్రాతినిథ్యం లేదు. లంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ టాప్లో కొనసాగుతుండగా.. రషీద్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు. కేశవ్ మహారాజ్, బెర్నాల్డ్ స్కోల్జ్, మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్, గుడకేశ్ మోటీ, షాహీన్ అఫ్రిది, ఆడమ్ జంపా టాప్-10లో ఉన్నారు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టాప్-10లో ఎలాంటి మార్పులు లేవు. మొహమ్మద్ నబీ, సికందర్ రజా, అజ్మతుల్లా ఒమర్జాయ్, మెహిది హసన్ మిరాజ్, రషీద్ ఖాన్, మిచెల్ సాంట్నర్, మ్యాక్స్వెల్, బ్రాండన్ మెక్ముల్లెన్, రవీంద్ర జడేజా, గెర్హార్డ్ ఎరాస్మస్ టాప్-10లో కొనసాగుతున్నారు. ఈ వారం ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో ఒకే ఒక చెప్పుకోదగ్గ మార్పు జరిగింది. న్యూజిలాండ్ ఆటగాడు మైఖేల్ బ్రేస్వెల్ ఏకంగా 26 స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి చేరాడు.జట్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా ఎవరికీ అందనంత ఎత్తులో టాప్ ప్లేస్లో కొనసాగుతుంది. ఆసీస్, పాకిస్తాన్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఆతర్వాతి స్థానాల్లో నిలిచాయి. -
కోహ్లి, రోహిత్ మర్రిచెట్టు లాంటి వాళ్లు.. అయినా అతడు ఎదుగుతున్నాడు!
టీమిండియా స్టార్ ప్లేయర్ శుబ్మన్ గిల్(Shubman Gill) తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి మ్యాచ్లో సెంచరీతో మెరిసిన గిల్.. ఆదివారం పాకిస్తాన్తో జరిగిన కీలక మ్యాచ్లోనూ సత్తాచాటాడు. 52 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు.గిల్ క్రీజులో ఉన్నంతసేపు తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. ఈ క్రమంలో గిల్పై భారత మాజీ క్రికెటర్లు సంజయ్ బంగర్, నవజ్యోత్ సింగ్ సిద్దూ ప్రశంసల వర్షం కురిపించారు. రాబోయే రోజుల్లో భారత జట్టు బ్యాటింగ్ ఎటాక్ను గిల్ లీడ్ చేస్తాడని వారిద్దరూ కొనియాడారు."శుబ్మన్ గిల్ ఒక అద్బుతం. తన కెరీర్ ఆరంభం నుంచే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తన రెండున్నర ఏళ్ల వన్డే క్రికెట్ కెరీర్లో ఎన్నో మైలు రాయిలను సాధించాడు. ప్రపంచ నంబర్-1 బ్యాటర్గా కొనసాగుతున్నాడు. అతడి బ్యాటింగ్ టెక్నిక్ కూడా చాలా బాగుంది.స్ట్రెయిట్ డ్రైవ్, ఆన్-డ్రైవ్ షాట్లను అద్బుతంగా ఆడుతున్నాడు. మిడ్-ఆఫ్, మిడ్ ఆన్ ఫీల్డర్లు 30 యార్డ్ సర్కిల్ ఉన్నప్పటికి వారి మధ్య నుంచి బంతిని బౌండరీకు తరలిస్తున్నాడు. అతడు కచ్చితంగా రాబోయే రోజుల్లో భారత బ్యాటింగ్ యూనిట్కు వెన్నముకగా నిలుస్తాడని" బంగర్ జియో హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. గిల్ షాట్ ఆడే టైమింగ్ అద్బుతంగా ఉంది. భారత జట్టులో విరాట్ కోహ్లి, రోహిత్ మర్రిచెట్టు లాంటి వాళ్లు. సాధరణంగా మర్రి చెట్టు కింద ఎటువంటి మెక్కలు పెరగవు. కానీ గిల్ మాత్రం.. రోహిత్, విరాట్ వంటి మర్రిచెట్టు నీడల్లోంచి గొప్ప క్రికెటర్గా ఎదుగుతున్నాడు. ఈ మ్యాచ్లో గిల్ కొట్టిన రెండు స్ట్రెయిట్ డ్రైవ్లు, కవర్ డ్రైవ్ షాట్లను చూడటానికి రెండు కళ్లు సరిపోలేదు. ఆ షాట్లు చూసి ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లు సైతం షాక్ అయిపోయారు" అని సిద్దూ చెప్పుకొచ్చాడు.చదవండి: చాలా అలసిపోయాను.. అది నా బలహీనత.. కానీ అదే బలం: కోహ్లి -
అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం
పాకిస్తాన్ యువ బౌలర్ అబ్రార్ అహ్మద్ వ్యవహారశైలిపై ఆ దేశ దిగ్గజ పేసర్ వసీం అక్రం ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని.. అంతేతప్ప అతి చేయకూడదంటూ చీవాట్లు పెట్టాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా పాకిస్తాన్ ఆదివారం టీమిండియాతో తలపడింది.దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, భారత బౌలర్ల ధాటికి పాకిస్తాన్ 241 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ తీయగా.. పేసర్లలో హార్దిక్ పాండ్యా రెండు, హర్షిత్ రాణా ఒక వికెట్ దక్కించుకున్నారు.పాకిస్తాన్ ఇన్నింగ్స్లో వన్డౌన్ బ్యాటర్ సౌద్ షకీల్(62) టాప్ స్కోరర్గా నిలవగా.. రిజ్వాన్(46) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా ఆరంభం నుంచే ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ 15 బంతుల్లోనే 20 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ ఆదిలో దూకుడుగా ఆడినా వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు.చక్కటి షాట్లతో అలరిస్తూ అర్ధ శతకానికి చేరువైన సమయంలో అనూహ్య రీతిలో గిల్ పెవిలియన్ చేరాడు. మొత్తంగా 52 బంతులు ఎదుర్కొన్న ఈ 25 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్.. పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ వేసిన అద్భుత బంతికి బౌల్డ్ అయ్యాడు. దీంతో 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.అయితే, ఆ సమయంలో అబ్రార్ అహ్మద్ కాస్త అతిగా స్పందించాడు. రెండు చేతులు కట్టుకుని నిలబడి.. ‘‘ఇక వెళ్లు’’.. అన్నట్లుగా కళ్లతోనే సైగలు చేయగా సహచర ఆటగాళ్లు కూడా వచ్చి అతడితో ఆనందం పంచుకున్నారు. అప్పుడు మరో ఎండ్లో ఉన్న విరాట్ కోహ్లి కాస్త సంయమనం పాటించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ కాగా.. అబ్రార్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.‘‘ప్రిన్స్తో పెట్టుకున్నందుకు.. కింగ్ మీకు చుక్కలు చూపించాడు. మిమ్మల్ని ఓడించాడు. అందుకే అతి చేయొద్దు’’ అంటూ టీమిండియా అభిమానులు కోహ్లి శతకంతోనే పాక్ జట్టుకు బదులిచ్చాడంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ గిల్ వికెట్ తీసిన తర్వాత అబ్రార్ అహ్మద్ వ్యవహరించిన తీరుపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్బౌలర్ వసీం అక్రం కూడా స్పందించాడు.‘‘అబ్రార్ బంతి వేసిన తీరు నన్ను ఆకట్టుకుంది. కానీ అతడి చర్య ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. సెలబ్రేట్ చేసుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. వికెట్ తీసిన ఆనందాన్ని వ్యక్తపరచడంలో తప్పులేదు. కానీ.. మ్యాచ్లో మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటివి పనికిరావు. ఎంత హుందాగా ఉంటే అంత మంచిది. అయితే, ఈరోజు అబ్రార్ అతి చేశాడు. అతడిని వారించేందుకు అక్కడ ఒక్కరూ ముందుకు రాలేదు. ఇలాంటి ప్రవర్తన టీవీల్లో చూడటానికి కూడా అస్సలు బాగాలేదు’’ అని వసీం అక్రం అబ్రార్కు చురకలు అంటించాడు. కాగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్.. గ్రూప్-ఎ నుంచి సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. ఇక మెగా వన్డే టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్లతో పాటు గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. -
గిల్ను ఔట్ చేశాక పాక్ బౌలర్ ఓవరాక్షన్.. ఏకి పారేస్తున్న టీమిండియా అభిమానులు
భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ల్లో ఆటగాళ్లు ఒకరినొకరు కవ్వించుకోవడం, మాటల యుద్దానికి దిగడం సర్వ సాధారణం. అయితే ఇటీవలికాలంలో ఇలాంటి వాతావరణంలో బాగా మార్పు వచ్చింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు. స్నేహపూర్వకంగా మెలుగుతున్నారు. మైదానంలో హుందాగా ప్రవర్తిస్తున్నారు. కోహ్లి, రోహిత్ జమానా మొదలయ్యాక భారత్, పాకిస్తాన్ మ్యాచ్ల్లో స్లెడ్జింగ్ అనేదే కనిపించడం లేదు. జూనియర్లు సీనియర్లను గౌరవిస్తున్నారు. వీలైతే సలహాలు తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో చాలామంది పాక్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి దగ్గర చిట్కాలు తీసుకోవడం చూశాం.Virat Kohli to Abrar Ahmed pic.twitter.com/4BrIhnw6vb— Sagar (@sagarcasm) February 23, 2025అయితే తాజాగా జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్లో పాక్ యువ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఈ మంచి సంప్రదాయానికి తూట్లు పొడిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో అబ్రార్ చాలా ఓవరాక్షన్ చేశాడు. ఫలితంగా భారత క్రికెట్ అభిమానుల నుంచి తిట్ల దండకాన్ని అందుకుంటున్నాడు. Look at audacity of Abrar 🤬Beta Karachi airport ke liye flight pakdo, hold this elimination ✌🏽 pic.twitter.com/J6c3ax7LDS— 🥹 shim8u (@veerjatt007) February 23, 2025అసలేం జరిగిందంటే.. భారత్, పాకిస్తాన్ జట్లు నిన్న (ఫిబ్రవరి 23) దుబాయ్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అబ్రార్ అహ్మద్ అతి చేశాడు. పాక్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ సాఫీగా ఛేదిస్తుండగా.. శుభ్మన్ గిల్ రెండో వికెట్గా వెనుదిరిగాడు. గిల్ను అబ్రార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. గిల్ను ఔట్ చేశాక అబ్రార్ ఓవరాక్షన్ అంతాఇంతా కాదు. Batao, ye Abrar Ahmed ne utne matches nahi khele jitney ki Centuries Gill ki hai, lekin send-off dekho lukkhe ka https://t.co/3C8Sd4TLNz pic.twitter.com/dhtHqbPUPG— Mihir Jha (@MihirkJha) February 23, 2025చేతులు కట్టుకుని నిలబడి 'వెళ్లు.. ఇక వెళ్లు.. వెళ్లి బ్యాగ్ సర్దుకో' అన్నట్టు సైగలు చేశాడు. దీంతో భారత అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. అబ్రార్ను సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. బ్యాగ్ సర్దుకోవాల్సింది గిల్ కాదు, మీరే అంటూ కామెంట్లు చేస్తున్నారు. Watch it before it get remove Abrar reaction to Gill One word for abrar 👇🏼👇🏼 #indvspak #viratkohli pic.twitter.com/coEQydD2qy— Vodka triceps (@vodkatriceps) February 24, 2025కొందరు గిల్ హార్డ్ కోర్ అభిమానులు వాడకూడని భాషలో అబ్రార్ను దూషిస్తున్నారు. ఇంకొందరేమో నీకు సరిగ్గా బుద్ది చెప్పే విరాట్ కోహ్లి ఇంకా క్రీజ్లోనే ఉన్నాడంటూ కామెంట్స్ చేశారు. మొత్తానికి అబ్రార్ చేసిన ఓవరాక్షన్తో పాక్ జట్టు మొత్తం ట్రోలింగ్కు గురైంది.మ్యాచ్ విషయానికొస్తే.. విరాట్ సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో పాక్పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ అజేయ సెంచరీతో భారత్ను విజయతీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రిజ్వాన్ (46), ఖుష్దిల్ షా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరు మినహా పాక్ ఇన్నింగ్స్లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఇమామ్ ఉల్ హక్ 10, బాబర్ ఆజమ్ 23, సల్మాన్ అఘా 19, తయ్యబ్ తాహిర్ 4, షాహీన్ అఫ్రిది 0, నసీం షా 14, హరీస్ రౌఫ్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, హార్దిక్ 2, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.అనంతరం బరిలోకి దిగిన భారత్.. కోహ్లి శతక్కొట్టడంతో (111 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు) 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ (56).. విరాట్తో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత విజయాన్ని ఖరారు చేయగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ (20), శుభ్మన్ గిల్ (46) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. పాక్ బౌలర్లలో అఫ్రిది 2, అబ్రార్ అహ్మద్, ఖుష్దిల్ షా తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. వరుస పరాజయాలతో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. -
ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) అసహనం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్(India vs Pakistan)తో మ్యాచ్లో అనవసర చర్య ద్వారా వికెట్ కోల్పోయే ప్రమాదం తెచ్చుకున్నాడని.. అయితే, అదృష్టవశాత్తూ బయటపడటంతో తాము ఊపిరి పీల్చుకున్నామన్నాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్ ఆదివారం పాకిస్తాన్తో తలపడింది.దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడిన రోహిత్ సేన తొలుత ఫీల్డింగ్ చేసింది. బౌలర్ల విజృంభణ కారణంగా దాయాదిని 241 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనను దూకుడుగా ఆరంభించిన టీమిండియా.. మిడిల్ ఓవర్లలో మాత్రం ఆచితూచి నిలకడగా ఆడింది. సెంచరీ మార్కు.. విన్నింగ్ షాట్ముఖ్యంగా ఓపెనర్ శుబ్మన్ గిల్(46), నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(56)లతో కలిసి విరాట్ కోహ్లి అద్భుత భాగస్వామ్యాలు నెలకొల్పాడు.ఏ దశలో నిర్లక్ష్యపు షాట్లకు యత్నించకుండా.. సహచర బ్యాటర్లతో చక్కగా సమన్వయం చేసుకుంటూ ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ క్రమంలో అర్ధ శతకం పూర్తి చేసుకున్న కోహ్లి.. దానిని శతకంగా మలిచాడు. అంతేకాదు బౌండరీ బాది సెంచరీ మార్కు అందుకున్న ఈ రన్మెషీన్.. టీమిండియాను గెలుపుతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లిపై భారత్తో పాటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.అయితే, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లి చేసిన ఓ పని మాత్రం సునిల్ గావస్కర్కు ఆగ్రహం తెప్పించింది. భారత ఇన్నింగ్స్లో 21 ఓవర్ను పాక్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ వేయగా.. ఐదో బంతికి కోహ్లి సింగిల్ తీశాడు. ఈ క్రమంలో సురక్షితంగానే క్రీజులోకి చేరుకున్న కోహ్లి.. ఆ తర్వాత ఓవర్ త్రో కాబోతున్న బంతిని తన చేతితో ఆపేశాడు.నిజానికి అక్కడ దగ్గర్లో పాకిస్తాన్ ఫీల్డర్లు ఎవరూ లేరు. ఒకవేళ ఓవర్ త్రో అయినా ఓ అదనపు పరుగు వచ్చేది. అయినా, ఎంసీసీ నిబంధనల ప్రకారం ఓ బ్యాటర్ బంతి లైవ్లో ఉన్నపుడు దానిని తన మాటలు, చేతల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా అతడు అలా చేసినట్లు భావించి ఫీల్డింగ్ చేస్తున్న జట్టు అప్పీలు చేస్తే.. సదరు బ్యాటర్ను అవుట్గా ప్రకటించవచ్చు.అబ్స్ట్రక్ట్ ఫీల్డ్ నిబంధన కింద..కోహ్లి విషయంలో ఒకవేళ పాక్ జట్టు ఈ విషయంలో అప్పీలుకు వెళ్లి ఉంటే పరిస్థితి చేజారిపోయేదని గావస్కర్ అన్నాడు. కామెంట్రీ సమయంలో.. ‘‘అతడు తన చేతితో బంతిని ఆపాడు. ఒకవేళ పాకిస్తాన్ గనుక అప్పీలు చేస్తే ఏమయ్యేది?.. అబ్స్ట్రక్ట్ ఫీల్డ్ నిబంధన కింద అతడు అవుటయ్యేవాడేమో?!.. కానీ వాళ్లు అలా చేయలేదు. ఎందుకంటే.. అక్కడ దగ్గర్లో ఫీల్డర్ లేడు.అంతేకాదు ఓవర్ త్రో ద్వారా అదనపు పరుగు రాకుండా ఉండిపోయిందని భావించి ఉండవచ్చు. నిజానికి మిడ్వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాడు డైవ్ చేస్తే బాగుండేది. కానీ ముందుకు వెళ్లిపోతున్న బంతిని కోహ్లి జోక్యం చేసుకుని మరీ ఆపడం సరికాదు. అదృష్టవశాత్తూ ఎవరూ అప్పీలు చేయలేదు కాబట్టి సరిపోయింది’’ అని గావస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. కాగా 21వ ఓవర్ ముగిసే సరికి కోహ్లి కేవలం 41 పరుగుల వద్ద ఉండటం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లో 111 బంతులు ఎదుర్కొన్న కోహ్లి సరిగ్గా 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వన్డేల్లో అతడికి ఇది 51వ సెంచరీ కాగా.. అంతర్జాతీయ కెరీర్లో 82వది కావడం విశేషం. సచిన్ టెండ్కులర్ వంద సెంచరీల రికార్డుకు కోహ్లి ఇంకా 18 శతకాల దూరంలో ఉన్నాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025: భారత్ వర్సెస్ పాకిస్తాన్ స్కోర్లు👉పాకిస్తాన్- 241(49.4) ఆలౌట్👉భారత్- 244/4 (42.3)👉ఫలితం: పాక్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన భారత్.చదవండి: ‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా! -
గిల్ సెంచరీ కోసం హాఫ్ సెంచరీని త్యాగం చేసిన రాహుల్.. అదే హార్దిక్ అయ్యుంటే..!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్తో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదయ్ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్కు జాకిర్ అలీ (68) సహకరించాడు. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండిన బంగ్లాదేశ్కు ఈ ఇద్దరు గౌరవప్రదమైన స్కోర్ను అందించారు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు.అనంతరం శుభ్మన్ గిల్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్ను ఝులింపించగా.. కేఎల్ రాహుల్ (41 నాటౌట్) సిక్సర్ కొట్టి భారత్ను గెలిపించాడు.కాగా, నిన్నటి మ్యాచ్లో గిల్ సెంచరీ అనంతరం సోషల్మీడియాలో ఓ టాపిక్ హైలైట్గా మారింది. ఈ మ్యాచ్లో గిల్ సెంచరీ పూర్తి చేసుకునేందుకు కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీని త్యాగం చేశాడు. గిల్ సెంచరీ కోసం రాహుల్ చేసిన త్యాగాన్ని నెటిజన్లు ప్రశంశిస్తున్నారు. రాహుల్ స్వలాభం కోసం ఆడే ఆటగాడు కాదని కితాబునిస్తున్నారు. రాహుల్ గతంలో కూడా ఓ సందర్భంలో విరాట్ కోహ్లి సెంచరీ కోసం తన హాఫ్ సెంచరీని త్యాగం చేశాడని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు హార్దిక్ పాండ్యాను విమర్శిస్తున్నారు. రాహుల్ స్థానంలో హార్దిక్ ఉంటే గిల్ సెంచరీ పూర్తయ్యేది కాదని అంటున్నారు. హార్దిక్ చాలా సెల్ఫిష్ ఆటగాడని.. మ్యాచ్ పూర్తి చేసేందుకు అతను తోటి వారి మైలురాళ్ల గురించి పట్టించుకోడని కామెంట్స్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వెస్టిండీస్లో తిలక్ వర్మ (49) హాఫ్ సెంచరీని పట్టించుకోకుండా హార్దిక్ సిక్సర్స్తో మ్యాచ్ను మిగించిన వైనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్లో గిల్ సెంచరీకి ముందు రాహుల్ ఎక్కడ ఔటవుతాడో, హార్దిక్ ఎక్కడ క్రీజ్లో వస్తాడో అని అని టెన్షన్ పడినట్లు చెబుతున్నారు. మొత్తానికి గిల్ అభిమానులు హార్దిక్ను ఏకి పారేసి, రాహుల్ను ప్రశంసలతో ముంచెత్తారు.కాగా, నిన్నటి మ్యాచ్లో గిల్ సెంచరీకి సహకరించే క్రమంలో రాహుల్ చాలా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్.. గిల్తో కలిసి ఐదో వికెట్కు అజేయమైన 87 పరుగులు జోడించి భారత్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో రాహుల్ ఏమాత్రం తేడాగా ఆడిన ఫలితం వేరేలా ఉండేది. అప్పటికే భారత్.. రోహిత్, కోహ్లి, శ్రేయస్, అక్షర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండింది. పిచ్ నుంచి కూడా బ్యాటర్లకు ఎలాంటి సహకారం లేదు. ఇలాంటి తరుణంలో రాహుల్ చాలా జాగ్రత్తగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వ్యక్తిగత ప్రయోజనాన్ని పక్కన పెట్టి గిల్ సెంచరీకి కూడా సహకరించాడు. రాహుల్ సహకారంతో గిల్ వన్డేల్లో తన ఎనిమిదో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో గిల్ కూడా చాలా బాధ్యతాయుతంగా ఆడాడు. గిల్ చివరి వరకు క్రీజ్లో నిలదొక్కుకోకపోయినా ఫలితం వేరేలా ఉండేది. బంగ్లాదేశ్ బౌలర్లు పిచ్ స్వభావానికి తగట్టుగా బౌలింగ్ చేసి భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ఏదిఏమైనా గిల్, రాహుల్ భాగస్వామ్యం భారత్ను గెలిపించింది. అంతకుముందు రాహుల్ కీపింగ్లోనూ అదరగొట్టాడు. మూడు అద్భుతమైన క్యాచ్లు పట్టుకుని బెస్ట్ ఫీల్డర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్లో పాకిస్తాన్ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. -
IND Vs BAN: చాంపియన్స్ ట్రోఫీ తొలి పోరులో బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
షమీ... శుబ్... ఆరంభం
229 పరుగుల స్వల్ప విజయలక్ష్యం...భారత్లాంటి బలమైన జట్టు ఆడుతూపాడుతూ దీనిని ఛేదిస్తుందని ఎవరైనా భావిస్తారు... కానీ పిచ్ ఒక్కసారిగా నెమ్మదించింది... పరుగులు రావడం కష్టంగా మారిపోయింది. ఈ స్థితిలో శుబ్మన్ గిల్ పట్టుదలగా నిలబడ్డాడు... కీలక భాగస్వామ్యాలతో జట్టును గెలుపుతీరం చేర్చడంతో పాటు వరుసగా రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు భారత్ పదునైన బౌలింగ్కు ఒకదశలో 35/5 వద్ద కుప్పకూలే స్థితిలో నిలిచిన బంగ్లాదేశ్... తౌహీద్, జాకీర్ ఆటతో 200 పరుగులు దాటగలిగింది. మరో ఐసీసీ మ్యాచ్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో షమీ తన పునరాగమాన్ని ఘనంగా ప్రదర్శించాడు. శుభారంభం తర్వాత ఆదివారం అసలు పోరులో పాకిస్తాన్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలుపు బోణీ చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. తౌహీద్ హృదయ్ (118 బంతుల్లో 100; 6 ఫోర్లు, 2 సిక్స్లు) కెరీర్లో తొలి సెంచరీ సాధించగా... జాకీర్ అలీ (114 బంతుల్లో 68; 4 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు ఆరో వికెట్కు 34.2 ఓవర్లలో 154 పరుగులు జోడించారు. మొహమ్మద్ షమీ (5/53) ఐదు వికెట్లతో చెలరేగగా... హర్షిత్ రాణా 3, అక్షర్ 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లకు 231 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్మన్ గిల్ (129 బంతుల్లో 101 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ శతకం నమోదు చేయగా... కెప్టెన్ రోహిత్ శర్మ (36 బంతుల్లో 41; 7 ఫోర్లు), కేఎల్ రాహుల్ (47 బంతుల్లో 41 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) రాణించారు. భారీ భాగస్వామ్యం... తొలి 5 వికెట్లకు 35 పరుగులు... చివరి 5 వికెట్లకు 39 పరుగులు... మధ్యలో తౌహీద్, జాకీర్ భారీ భాగస్వామ్యం! బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సాగిన తీరిది. షమీ, రాణా దెబ్బకు టపటపా 3 వికెట్లు కోల్పోయిన బంగ్లాను అక్షర్ తన తొలి ఓవర్లోనే దెబ్బ కొట్టాడు. వరుస బంతుల్లో తన్జీద్ (25 బంతుల్లో 25; 4 ఫోర్లు), ముష్ఫికర్ (0)ను అవుట్ చేసిన అతను త్రుటిలో హ్యాట్రిక్ కోల్పోయాడు. 35/5 నుంచి తౌహీద్, జాకీర్ జట్టును ఆదుకున్నారు. భారత ఆటగాళ్ల పేలవ ఫీల్డింగ్ కూడా వారికి కలిసొచ్చింది. సుదీర్ఘ ప్రయత్నం తర్వాత ఎట్టకేలకు 206 బంతుల ఈ భాగస్వామ్యాన్ని షమీ విడగొట్టాడు. ఆ తర్వాత 49వ ఓవర్ తొలి బంతికి సింగిల్తో తౌహీద్ 114 బంతుల్లో కెరీర్లో తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రాణించిన రాహుల్... స్వల్ప లక్ష్యమే అయినా భారత్ ఛేదన సులువుగా సాగలేదు. ముస్తఫిజుర్ ఓవర్లో 3 ఫోర్లు సహా కొన్ని చక్కటి షాట్లు ఆడిన రోహిత్ పదో ఓవర్లో వెనుదిరగ్గా, గిల్ తన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పిచ్ ఒక్కసారిగా మందగించడంతో పరుగుల రాక గగనమైంది. గిల్, విరాట్ కోహ్లి (38 బంతుల్లో 22; 1 ఫోర్) కలిసి 12.5 ఓవర్లలో 43 పరుగులే జోడించగలిగారు. అనంతరం 11 పరుగుల వ్యవధిలో శ్రేయస్ అయ్యర్ (15), అక్షర్ పటేల్ (8) అవుటయ్యారు. అయితే గిల్కు రాహుల్ అండగా నిలిచాడు. బంగ్లా బౌలర్లు మధ్యలో కొద్ది సేపు ఆధిపత్యం ప్రదర్శించినట్లు కనిపించినా... నిలదొక్కుకున్న తర్వాత వీరిద్దరు స్వేచ్ఛగా ఆడారు. గిల్, రాహుల్ 16.2 ఓవర్లలో అభేద్యంగా 87 పరుగులు జోడించి మ్యాచ్ను ముగించారు. ఈ క్రమంలో 46వ ఓవర్లో సింగిల్తో 125 బంతుల్లో గిల్ వన్డేల్లో ఎనిమిదో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తన్జీద్ (సి) రాహుల్ (బి) అక్షర్ 25; సౌమ్య సర్కార్ (సి) రాహుల్ (బి) షమీ 0; నజు్మల్ (సి) కోహ్లి (బి) రాణా 0; మిరాజ్ (సి) గిల్ (బి) షమీ 5; తౌహీద్ (సి) షమీ (బి) రాణా 100; ముష్ఫికర్ (సి) రాహుల్ (బి) అక్షర్ 0; జాకీర్ (సి) కోహ్లి (బి) షమీ 68; రిషాద్ (సి) పాండ్యా (బి) రాణా 18; తన్జీమ్ (బి) షమీ 0; తస్కీన్ (సి) అయ్యర్ (బి) షమీ 3; ముస్తఫిజుర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 228. వికెట్ల పతనం: 1–1, 2–2, 3–26, 4–35, 5–35, 6–189, 7–214, 8–215, 9–228, 10–228. బౌలింగ్: షమీ 10–0–53–5, హర్షిత్ రాణా 7.4–0–31–3, అక్షర్ 9–1–43–2, పాండ్యా 4–0–20–0, జడేజా 9–0–37–0, కుల్దీప్ 10–0–43–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రిషాద్ (బి) తస్కీన్ 41; గిల్ (నాటౌట్) 101; కోహ్లి (సి) సర్కార్ (బి) రిషాద్ 22; అయ్యర్ (సి) నజ్ముల్ (బి) ముస్తఫిజుర్ 15; అక్షర్ (సి అండ్ బి) రిషాద్ 8; రాహుల్ (నాటౌట్) 41; ఎక్స్ట్రాలు 3; మొత్తం (46.3 ఓవర్లలో 4 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–69, 2–112, 3–133, 4–144. బౌలింగ్: తస్కీన్ 9–0–36–1, ముస్తఫిజుర్ 9–0–62–1, తన్జీమ్ 8.3–0–58–0, మిరాజ్ 10–0–37–0, రిషాద్ 10–0–38–2. అక్షర్ ‘హ్యాట్రిక్’ మిస్ మ్యాచ్లో బంగ్లాను తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగినా భారత్ ఫీల్డింగ్ స్థాయికి తగినట్లుగా లేకపోయింది. అక్షర్ తొలి ఓవర్లో వరుసగా రెండు వికెట్ల తర్వాత జాకీర్ (0 వద్ద) ఇచ్చిన అతి సునాయాస క్యాచ్ను స్లిప్లో రోహిత్ వదిలేశాడు. దాంతో అక్షర్ ‘హ్యాట్రిక్’ అవకాశం చేజారింది. రోహిత్ ఆ క్యాచ్ పట్టి ఉంటే స్కోరు 35/6తో ఇక కోలుకునే అవకాశం లేకపోయేది. ఆ తర్వాత జాకీర్ 24 వద్ద ఉన్నప్పుడు జడేజా బౌలింగ్లో స్టంప్ చేసే అవకాశాన్ని రాహుల్ చేజార్చాడు. చివరకు బ్యాటర్ 68 పరుగులు సాధించగలిగాడు. తౌహీద్ స్కోరు 23 వద్ద కుల్దీప్ బౌలింగ్లో మిడాఫ్లో పాండ్యా సునాయాస క్యాచ్ వదిలేయగా చివరకు అతను సెంచరీ పూర్తి చేసుకోగలిగాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో 12 వద్ద తన్జీద్ను రనౌట్ చేసే అవకాశం వచ్చినా...అయ్యర్ త్రో స్టంప్స్కు చాలా దూరంగా వెళ్లింది. భారత్ ఇన్నింగ్స్లో రాహుల్ 9 వద్ద ఉన్నప్పుడు జాకీర్ సులువైన క్యాచ్ వదిలేసి మేలు చేశాడు.200 వన్డేల్లో షమీ 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. బంతుల పరంగా చూస్తే అందరికంటే వేగంగా (5126 బంతుల్లో) ఈ ఘనత సాధించిన బౌలర్గా అతను రికార్డు సాధించాడు. ఇందు కోసం మిచెల్ స్టార్క్కు (ఆ్రస్టేలియా) 5240 బంతులు పట్టాయి. తక్కువ ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించిన భారత బౌలర్గానూ షమీ గుర్తింపు పొందాడు. గతంలో అజిత్ అగార్కర్ 133 ఇన్నింగ్స్లో ఈ మైలురాయి అందుకోగా... షమీ 103 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు.60 ఐసీసీ టోర్నీల్లో అత్యధిక (60) వికెట్లు తీసిన భారత బౌలర్గా షమీ నిలిచాడు. జహీర్ ఖాన్ (32 ఇన్నింగ్స్లలో 59) రికార్డును షమీ (19 ఇన్నింగ్స్లలో 60) సవరించాడు.11000 వన్డేల్లో రోహిత్ 11 వేల పరుగులు పూర్తి చేసుకొని ఈ ఘనత సాధించిన 10వ ఆటగాడిగా నిలిచాడు.156 వన్డేల్లో కోహ్లి క్యాచ్ల సంఖ్య. భారత్ తరఫున అత్యధిక క్యాచ్లు పట్టిన ఫీల్డర్గా అజహరుద్దీన్ (156) రికార్డును సమం చేయగా... జయవర్ధనే (218), పాంటింగ్ (160) వీరికంటే ముందున్నారు. చాంపియన్స్ ట్రోఫీలో నేడు దక్షిణాఫ్రికా X అఫ్గానిస్తాన్ వేదిక: కరాచీ మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18, జియోహాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
IND Vs BAN: శుబ్మన్ గిల్ సూపర్ సెంచరీ.. బంగ్లాపై భారత్ ఘన విజయం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ శుభారంభం చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 229 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 46.3 ఓవర్లలో చేధించింది. భారత యువ ఓపెనర్, వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్ను గిల్ ఫినిష్ చేశాడు.తొలుత దూకుడుగా ఆడిన గిల్.. వరుసగా వికెట్ల పడడంతో కాస్త ఆచితూచి ఆడాడు. ఎప్పుడైతే లక్ష్యానికి జట్టు చేరువైందో గిల్ తన బ్యాటింగ్లో జోరును పెంచాడు. ఈ క్రమంలో 125 బంతుల్లో గిల్ తన ఎనిమిదవ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 129 బంతులు ఎదుర్కొన్న గిల్..9 ఫోర్లు, 2 సిక్స్లతో 101 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ(41), కేఎల్ రాహుల్(41) రాణించారు. బంగ్లా బౌలర్లలో రిషాద్ హొస్సేన్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్ రెహ్మన్, టాస్కిన్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు.హృదయ్ సూపర్ సెంచరీ..ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హ్రిదయ్(118 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 100) సూపర్ సెంచరీతో కదం తొక్కగా.. జాకర్ అలీ(68) ఆర్ధ శతకంతో రాణించాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఫైవ్ వికెట్ హాల్తో మెరిశాడు. తన 10 ఓవర్ల కోటాలో షమీ 53 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. అతడితో పాటు హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా భారత్ తమ తదుపరి మ్యాచ్లో ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్తో దుబాయ్ వేదికగా తలపడనుంది. -
అగ్రపీఠాన్ని అధిరోహించిన శుభ్మన్ గిల్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. గత వారం ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉండిన గిల్.. ఓ స్థానం మెరుగుపర్చుకుని టాప్ ర్యాంక్కు చేరాడు. నంబర్ వన్ స్థానానికి చేరే క్రమంలో గిల్ పాక్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ను వెనక్కు నెట్టాడు. ప్రస్తుత ర్యాంకింగ్స్లో బాబర్ 773 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్, విరాట్, ధోని తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానానికి చేరిన నాలుగో భారత బ్యాటర్గా గిల్ రికార్డుల్లోకెక్కాడు. వన్డే ర్యాంకింగ్స్లో గిల్ నంబర్ స్థానానికి చేరడం ఇది తొలిసారి కాదు. 2023 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ గిల్ టాప్ ర్యాంక్లో ఉన్నాడు. ప్రస్తుతం గిల్ ఖాతాలో 796 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. గిల్కు రెండో స్థానంలో ఉన్న బాబర్కు మధ్య 23 పాయింట్ల వ్యత్యాసం ఉంది.ఈ వారం ర్యాంకింగ్స్లో గిల్తో కలుపుకుని భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లు టాప్-10లో ఉన్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో.. విరాట్ కోహ్లి ఆరులో.. శ్రేయస్ అయ్యర్ 9వ స్థానంలో నిలిచారు. గత వారంతో పోలిస్తే శ్రేయస్ ఓ ర్యాంక్ మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి చేరాడు. తాజా ర్యాంకింగ్స్లో సౌతాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ నాలుగులో, న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్ ఐదులో.. ఐర్లాండ్ ఆటగాడు హ్యారీ టెక్టార్ ఏడులో.. లంక కెప్టెన్ అసలంక ఎనిమిదిలో.. షాయ్ హోప్ పదో స్థానంలో ఉన్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ను కిందకు దించి లంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ టాప్ ర్యాంక్కు చేరుకున్నాడు. భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ ఓ స్థానం మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి చేరాడు. భారత్ నుంచి టాప్-10లో కుల్దీప్తో పాటు సిరాజ్ (10వ ర్యాంక్) మాత్రమే ఉన్నాడు. నమీబియా బౌలర్ బెర్నాల్డ్ స్కోల్జ్ మూడులో.. షాహీన్ అఫ్రిది ఐదులో.. కేశవ్ మహారాజ్ ఆరులో.. మిచెల్ సాంట్నర్ ఏడులో .. మ్యాట్ హెన్రీ ఎనిమిదిలో.. గుడకేశ్ మోటీ తొమ్మిది స్థానాల్లో ఉన్నారు.ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ మొహమ్మద్ నబీ టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా రెండో స్థానంలో నిలిచాడు. భారత్ నుంచి రవీంద్ర జడేజా ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. జడ్డూ 217 రేటింగ్ పాయింట్లతో పదో స్థానంలో నిలిచాడు. జట్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా టాప్ ర్యాంక్లో కొనసాగుతుంది. భారత్.. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకు అందనంత ఎత్తులో ఉంది. ఇరు జట్లకు మధ్య దాదాపు 800 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది. -
బాబర్ను దించి అగ్రపీఠాన్ని అధిరోహించనున్న గిల్
టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో (ICC ODI Rankings) అగ్రపీఠాన్ని అధిరోహించనున్నాడు. ఈ వారం ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉన్న గిల్ (781 రేటింగ్ పాయింట్లు).. వచ్చే బుధవారం వెలువడే ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంక్కు చేరుకోనున్నాడు. ఇప్పటిదాకా టాప్ ర్యాంక్లో ఉన్న పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ (Babar Azam) (786).. ఇవాళ (ఫిబ్రవరి 14) న్యూజిలాండ్తో జరుగుతున్న ట్రై సిరీస్ ఫైనల్లో విఫలమయ్యాడు. బాబర్కు గిల్కు మధ్య కేవలం ఐదు పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ఈ బుధవారం ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో గిల్ సెంచరీ చేశాడు. ఈ వారం ర్యాంకింగ్స్లో ఇది పరిగణలోకి రాలేదు. కాబట్టి వచ్చే వారం ర్యాంకింగ్స్లో ఈ సెంచరీ తాలుకా పాయింట్లు గిల్కు యాడ్ అవుతాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్కు (బంగ్లాదేశ్తో) ముందే గిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో బాబర్ను కిందకు దించి టాప్ ర్యాంక్కు చేరుకుంటాడు.రేసులో రోహిత్ కూడా..!వన్డే ర్యాంకింగ్స్ టాప్ ర్యాంక్ రేసులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా ఉన్నాడు. ఈ వారం ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉన్న రోహిత్.. ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ ఆడితే గిల్ను సైతం వెనక్కునెట్టి టాప్ ర్యాంక్కు చేరుకుంటాడు. ప్రస్తుతం టాప్ ర్యాంక్లో ఉన్న బాబర్కు రోహిత్కు మధ్య కేవలం 13 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. బాబర్ ఖాతాలో 786 పాయింట్లు ఉండగా.. రోహిత్ ఖాతాలో 773 పాయింట్లు ఉన్నాయి.చరిత్ర సృష్టించిన బాబర్న్యూజిలాండ్తో జరుగుతున్న ట్రై సిరీస్ ఫైనల్లో విఫలమైనా పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హాషిమ్ ఆమ్లాతో కలిసి రికార్డు షేర్ చేసుకున్నాడు. ఆమ్లా, బాబర్కు తలో 123 ఇన్నింగ్స్ల్లో 6000 పరుగులు పూర్తి చేశారు. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన టాప్-5 ఆటగాళ్ల జాబితాలో బాబర్, ఆమ్లా తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. విరాట్ 136 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని తాకితే.. కేన్ మామ, వార్నర్ భాయ్ తలో 139 ఇన్నింగ్స్ల్లో 6000 పరుగుల క్లబ్లో చేరారు.ట్రై సిరీస్ ఫైనల్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 41.5 ఓవర్ల అనంతరం ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్లో ఇప్పటివరకు ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కాలేదు. రిజ్వాన్ 46, సల్మాన్ అఘా 45, తయ్యబ్ తాహిర్ 38, బాబర్ ఆజమ్ 29 పరుగులు చేశారు. ఖుష్దిల్ షా (6), ఫమీమ్ అష్రఫ్ (1) క్రీజ్లో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ, మైఖేల్ బ్రేస్వెల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. నాథన్ స్మిత్, జేకబ్ డఫీ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
బాబర్ ఆజమ్ టాప్ ర్యాంక్కు అతి చేరువగా శుభ్మన్ గిల్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో (ICC ODI Rankings) టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) రెండో స్థానానికి ఎగబాకాడు. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam) టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. బాబర్కు గిల్కు మధ్య రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. గిల్ మరో 6 పాయింట్లు సాధిస్తే బాబర్ ఆజమ్కు కిందకు దించి టాప్ ర్యాంక్కు చేరుకుంటాడు. గిల్ రెండో స్థానానికి చేరడంతో అప్పటివరకు ఆ స్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మూడో స్థానానికి పడిపోయాడు. వచ్చే వారం ప్రకటించే ర్యాంకింగ్స్లో రోహిత్కు కూడా అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. మూడో స్థానంలో ఉన్న రోహిత్కు టాప్ ప్లేస్లో ఉన్న బాబర్కు మధ్య కేవలం 13 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ప్రస్తుతం బాబర్ ఖాతాలో 786 పాయింట్లు, గిల్ ఖాతాలో 781, రోహిత్ ఖాతాలో 773 పాయింట్లు ఉన్నాయి.ఈ వారం ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి రెండు స్థానాలు కోల్పోయాడు. గత వారం నాలుగో ప్లేస్లో ఉన్న కోహ్లి.. ఇంగ్లండ్తో రెండో వన్డేలో విఫలం కావడంతో ఆరో స్థానానికి పడిపోయాడు. ఇంగ్లండ్తో తొలి రెండు వన్డేల్లో రాణించిన భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ ఓ స్థానం మెరుగుపర్చుకుని 10వ స్థానానికి చేరుకున్నాడు. ఈ వారం టాప్-10 బ్యాటర్ల ర్యాంకింగ్స్లో నలుగురు భారత బ్యాటర్లు ఉన్నారు. ఐర్లాండ్ ఆటగాడు హ్యారీ టెక్టార్ నాలుగో స్థానంలో, హెన్రిచ్ క్లాసెన్ ఐదులో, డారిల్ మిచెల్ ఏడులో, షాయ్ హోప్, రహ్మానుల్లా గుర్భాజ్ ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లండ్తో నిన్న జరిగిన మూడో వన్డే తాజా ర్యాంకింగ్స్ పరిగణలోకి రాలేదు.వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. రషీద్ ఖాన్ అగ్రస్థానానికి నిలబెట్టుకున్నాడు. మహీశ్ తీక్షణ ఓ స్థానం మెరుగుపర్చుకుని రెండో స్థానానికి ఎగబాకాడు. నమీబియా బౌలర్ బెర్నార్డ్ స్కోల్జ్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో ప్లేస్కు చేరాడు. పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది నాలుగో స్థానాన్ని కాపాడుకోగా.. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు స్థానాలు కోల్పోయి ఐదో ప్లేస్కు పడిపోయాడు. ఇంగ్లండ్తో తాజాగా జరిగిన సిరీస్కు దూరంగా ఉన్న మొహమ్మద్ సిరాజ్ నాలుగు స్థానాలు కోల్పోయి 10వ ప్లేస్కు పడిపోయాడు. తాజా ర్యాంకింగ్స్లో భారత్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే టాప్-10లో ఉన్నారు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో మొహమ్మద్ నబీ టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. రవీంద్ర జడేజా 10వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. -
ఘనమైన ముగింపు
వన్డేల్లో భారత జట్టు మరోసారి తమ బలాన్ని ప్రదర్శించింది. సొంతగడ్డపై తమ స్థాయిని చూపిస్తూ ఇంగ్లండ్ను క్లీన్స్వీప్ చేసింది. గత రెండు మ్యాచ్ల తరహాలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన టీమిండియా చివరి పోరులోనూ ఘన విజయాన్ని అందుకుంది. కెరీర్లో 50వ వన్డే ఆడిన శుబ్మన్ గిల్ శతకానికి తోడు శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి రాణించడంతో భారీ స్కోరు సాధించిన టీమిండియా ఆ తర్వాత బలమైన బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టి పడేసింది.‘బజ్బాల్‘ మాయలో ‘బ్యాడ్బాల్’గా మారిపోయిన ఆటతో ఇంగ్లండ్ మరో భారీ ఓటమిని మూటగట్టుకుంది. మరోవైపు కోహ్లి సహా ప్రధాన బ్యాటర్లంతా ఫామ్లోకి వచ్చిన సానుకూలతతో ఇక చాంపియన్స్ ట్రోఫీ సమరానికి రోహిత్ బృందం సన్నద్ధమైంది. అహ్మదాబాద్: ఇంగ్లండ్పై టి20 సిరీస్ను 4–1తో గెలుచుకున్న భారత్ జట్టు ఇప్పుడు వన్డే సిరీస్ను 3–0తో క్లీన్స్వీప్ చేసింది. బుధవారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన చివరిదైన మూడో మ్యాచ్లో భారత్ 142 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్మన్ గిల్ (102 బంతుల్లో 112; 14 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీతో చెలరేగగా... శ్రేయస్ అయ్యర్ (64 బంతుల్లో 78; 8 ఫోర్లు, 2 సిక్స్లు), కోహ్లి (55 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. కోహ్లితో 116 పరుగులు జోడించిన గిల్, అయ్యర్తో 104 పరుగులు జత చేశాడు. అనంతరం ఇంగ్లండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌటైంది. అట్కిన్సన్ (19 బంతుల్లో 38; 6 ఫోర్లు, 1 సిక్స్), బాంటన్ (41 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సిరీస్లో 259 పరుగులు చేసిన గిల్కే ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. శతక భాగస్వామ్యాలు... గత మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ (1) ఈసారి రెండో బంతికే వెనుదిరిగాడు. అయితే గిల్, కోహ్లి భాగస్వామ్యంలో భారత్ ఇన్నింగ్స్ సరైన దిశలో సాగింది. 7 పరుగుల వద్ద సమన్వయ లోపంతో కోహ్లి రనౌట్ ప్రమాదంలో పడినా వుడ్ త్రో నేరుగా వికెట్లను తగలకపోవడంతో బతికిపోయాడు. తొలి 10 ఓవర్లలో భారత్ 52 పరుగులు చేసింది. ఆ తర్వాత వీరిద్దరు కొన్ని చక్కటి షాట్లతో అలరించారు. ఐదు బంతుల వ్యవధిలో గిల్ (51 బంతుల్లో), కోహ్లి (50 బంతుల్లో) అర్ధ సెంచరీలు పూర్తయ్యాయి. అయితే తర్వాతి ఓవర్లో రషీద్ వేసిన చక్కటి బంతిని ఆడలేక కోహ్లి వెనుదిరిగాడు. అనంతరం ఫామ్లో ఉన్న అయ్యర్...గిల్తో జత కలిశాడు. ఈ జోడీ కూడా పదునైన బ్యాటింగ్తో అలవోకగా పరుగులు సాధించింది. వుడ్ ఓవర్లో డీప్ మిడ్వికెట్ మీదుగా ఫోర్ కొట్టి 95 బంతుల్లోనే గిల్ సెంచరీ మార్క్ను చేరుకున్నాడు. ఆ వెంటనే 43 బంతుల్లో అయ్యర్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే తక్కువ వ్యవధిలో వీరిద్దరిని ఆదిల్ రషీద్ వెనక్కి పంపించాడు. గత రెండు వన్డేల్లో విఫలమైన కేఎల్ రాహుల్ (29 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్) ఈసారి మెరుగ్గా ఆడగా... రషీద్ ఓవర్లో వరుసగా 6, 6 బాది తర్వాతి బంతికి హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 17) అవుటయ్యాడు.తర్వాత వచ్చిన బ్యాటర్లందరూ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయినా... భారత్ 350 పరుగుల స్కోరును దాటగలిగింది. ఆఖరి 7 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. భారత తుది జట్టులో వరుణ్ చక్రవర్తి, షమీ, రవీంద్ర జడేజా స్థానాల్లో కుల్దీప్, వాషింగ్టన్ సుందర్, అర్ష్ దీప్ తుది జట్టులోకి వచ్చారు. సమష్టి వైఫల్యం... భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (21 బంతుల్లో 23; 4 ఫోర్లు), బెన్ డకెట్ (22 బంతుల్లో 34; 8 ఫోర్లు) సరైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్కు 6.2 ఓవర్లలోనే 60 పరుగులు జోడించారు. రాణా తన తొలి 2 ఓవర్లలో 5 ఫోర్లతో 22 పరుగులు ఇవ్వగా... అర్ష్ దీప్ ఓవర్లో డకెట్ వరుసగా 4 బంతుల్లో 4 ఫోర్లు కొట్టాడు. అయితే ఈ భాగస్వామ్యం విడిపోయిన తర్వాత ఇంగ్లండ్ తడబడింది. బాంటన్, రూట్ (29 బంతుల్లో 24; 2 ఫోర్లు) కొద్దిసేపు నిలబడినా వీరిద్దరు ఎనిమిది పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. ఆ తర్వాత జట్టు కోలుకోలేకపోయింది. టపటపా వికెట్లను కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. రాణా వరుసగా రెండు ఓవర్లలో బట్లర్ (6), బ్రూక్ (26 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్)లను బౌల్డ్ చేయడంతో జట్టు ఆశలు కోల్పోయింది. మిగతా లాంఛనం ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. మరో 15.4 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టు కుప్పకూలింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) సాల్ట్ (బి) వుడ్ 1; గిల్ (బి) రషీద్ 112; కోహ్లి (సి) సాల్ట్ (బి) రషీద్ 52; అయ్యర్ (సి) సాల్ట్ (బి) రషీద్ 78; రాహుల్ (ఎల్బీ) (బి) మహమూద్ 40; పాండ్యా (బి) రషీద్ 17; అక్షర్ (సి) బాంటన్ (బి) రూట్ 13; సుందర్ (సి) బ్రూక్ (బి) వుడ్ 14; రాణా (సి) బట్లర్ (బి) అట్కిన్సన్ 13; అర్ష్ దీప్ (రనౌట్) 2; కుల్దీప్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 356. వికెట్ల పతనం: 1–6, 2–122, 3–226, 4–259, 5–289, 6–307, 7–333, 8–353, 9–353, 10–356. బౌలింగ్: సాఖిబ్ మహమూద్ 10–0–68–1, మార్క్ వుడ్ 9–1–45–2, అట్కిన్సన్ 8–0–74–1, రూట్ 5–0–47–1, ఆదిల్ రషీద్ 10–0–64–4, లివింగ్స్టోన్ 8–0–57–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అక్షర్ (బి) అర్ష్ దీప్ 23; డకెట్ (సి) రోహిత్ (బి) అర్ష్ దీప్ 34; బాంటన్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 38; రూట్ (బి) అక్షర్ 24; బ్రూక్ (బి) రాణా 19; బట్లర్ (బి) రాణా 6; లివింగ్స్టోన్ (స్టంప్డ్) రాహుల్ (బి) సుందర్ 9; అట్కిన్సన్ (బి) అక్షర్ 38; రషీద్ (బి) పాండ్యా 0; వుడ్ (సి) అయ్యర్ (బి) పాండ్యా 9; మహమూద్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 12; మొత్తం (34.2 ఓవర్లలో ఆలౌట్) 214. వికెట్ల పతనం: 1–60, 2–80, 3–126, 4–134, 5–154, 6–161, 7–174, 8–175, 9–193, 10–214. బౌలింగ్: అర్ష్ దీప్ 5–0–33–2, హర్షిత్ రాణా 5–1–31–2, వాషింగ్టన్ సుందర్ 5–0–43–1, అక్షర్ పటేల్ 6.2–1–22–2, పాండ్యా 5–0–38–2, కుల్దీప్ యాదవ్ 8–0–38–1. ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడకుండానే..చాంపియన్స్ ట్రోఫీ బరిలో టీమిండియా దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీకి ముందు సన్నాహకంగా భారత జట్టు ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడటం లేదు. బుధవారం వరకు స్వదేశంలో ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడిన టీమిండియా... తమకు ప్రాక్టీస్ మ్యాచ్ల అవసరం లేదని తేల్చేసింది. టోర్నీలో ప్రాక్టీస్ మ్యాచ్లు ఫిబ్రవరి 14–17 మధ్య జరుగుతాయి. 19న టోర్నీ ప్రారంభం కానుండగా, భారత జట్టు 15న దుబాయ్ చేరుకుంటుంది. మరోవైపు అఫ్గానిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ టీమ్లు మాత్రం పాక్ గడ్డపైనే ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడబోతున్నాయి. ఈ మూడు మ్యాచ్లలో తలపడేందుకు ప్రత్యర్థులుగా పాకిస్తాన్ మూడు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. మరో ప్రాక్టీస్ పోరులో న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ తలపడతాయి. 1ఒకే మైదానంలో మూడు ఫార్మాట్లలోనూ (టెస్టు, వన్డే, టి20) సెంచరీలు చేసిన తొలి భారతీయ క్రికెటర్గా శుబ్మన్ గిల్ గుర్తింపు పొందాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో గిల్ టి20ల్లో (న్యూజిలాండ్పై 126 నాటౌట్; 2023లో), టెస్టుల్లో (ఆ్రస్టేలియాపై 128; 2023లో), వన్డేల్లో (ఇంగ్లండ్పై 112; 2025లో) ఒక్కో సెంచరీ సాధించాడు. -
అహ్మదాబాద్లో అదరగొట్టిన భారత బ్యాటర్లు.. ఇదే తొలిసారి
ఇంగ్లండ్తో మూడో వన్డే(India vs England)లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. ఫలితంగా అహ్మదాబాద్లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. తద్వారా నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ ఖాతాలో అతిపెద్ద స్కోరు(Highest ODI total) నమోదైంది. కాగా రోహిత్ సేన ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా నాగ్పూర్, కటక్ వన్డేల్లో ఇంగ్లండ్ను నాలుగేసి వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం మూడో వన్డేలోనూ గెలిచి వైట్వాష్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది.అయితే, ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆరంభంలోనే కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) వికెట్ రూపంలో టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. గత వన్డేలో సెంచరీ(119)తో చెలరేగిన హిట్మ్యాన్ మూడో వన్డేలో మాత్రం ఒక్క పరుగే చేసి మార్క్వుడ్ బౌలింగ్లో వెనుదిరిగాడు.ఎట్టకేలకు ఫామ్లోకిఈ నేపథ్యంలో మరో ఓపెనర్ శుబ్మన్ గిల్కు జతైన వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. మూడుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 55 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 52 పరుగులు చేశాడు. అప్పటికే, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.. దానిని శతకంగా మార్చుకున్నాడు.గిల్ శతకంమొత్తంగా 102 బంతులు ఎదుర్కొన్న శుబ్మన్ గిల్ 14 ఫోర్లు, 3 సిక్స్లు బాది.. 112 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(64 బంతుల్లో 78 రన్స్) అద్భుత అర్ధ శతకంతో మెరిశాడు. మరోవైపు.. తన రెగ్యులర్ స్థానమైన ఐదో నంబర్లో వచ్చిన కేఎల్ రాహుల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.కేవలం 29 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి 40 పరుగులు సాధించాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. మిగతా వాళ్లలో ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా(17), అక్షర్ పటేల్(13), వాషింగ్టన్ సుందర్(14).. పేసర్లు హర్షిత్ రాణా(13), అర్ష్దీప్ సింగ్(2), కుల్దీప్ యాదవ్(1*) నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు.అవయవ దానం గురించిఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 356 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. పేసర్లు మార్క్ వుడ్ రెండు, గస్ అట్కిన్సన్ ఒకటి, పార్ట్ టైమ్ స్పిన్నర్ జో రూట్ ఒక వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా- ఇంగ్లండ్ క్రికెటర్లు అవయవ దానం గురించి అవగాహన కల్పించే చేసే క్రమంలో గ్రీన్ ఆర్మ్ బ్యాండ్తో బరిలోకి దిగడం విశేషం.అహ్మదాబాద్లో వన్డేల్లో అత్యధిక స్కోర్లుసౌతాఫ్రికా వర్సెస్ ఇండియా- 2010లో 365/2ఇండియా వర్సెస్ ఇంగ్లండ్- 2025లో 356ఇండియా వర్సెస్ వెస్టిండీస్- 2002లో 325/5వెస్టిండీస్ వర్సెస్ ఇండియా- 2002లో 324/4 పాకిస్తాన్ వర్సెస్ ఇండియా- 2007లో 319/7.చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్గా అరుదైన రికార్డువారెవ్వా!.. శుబ్మన్ గిల్ ప్రపంచ రికార్డు -
వారెవ్వా!.. శుబ్మన్ గిల్ ప్రపంచ రికార్డు
టీమిండియా యువ ఓపెనర్, వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill) సూపర్ సరికొత్త చరిత్ర లిఖించాడు. వన్డేల్లో సౌతాఫ్రికా బ్యాటర్ హషీం ఆమ్లా(Hashim Amla) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్తో మూడో వన్డే(India vs England) సందర్భంగా శతకం బాదిన ‘ప్రిన్స్’ ఈ ఘనత సాధించాడు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత నాగ్పూర్లో నాలుగు వికెట్ల తేడాతో పర్యాటక జట్టును ఓడించిన రోహిత్ సేన.. కటక్లో జరిగిన రెండో వన్డేలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. తద్వారా సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది.గిల్ సూపర్ సెంచరీఈ క్రమంలో ఇరుజట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా నామామాత్రపు మూడో వన్డేలోనూ గెలిచి క్లీన్స్వీప్ చేయాలనే లక్ష్యంతో ఉంది. నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం నాటి ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్కు దిగింది. అయితే, గత మ్యాచ్లో శతకం(119) బాదిన కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ(1) ఈసారి విఫలం కాగా.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ మాత్రం సెంచరీతో మెరిశాడు.తొలి యాభై ఇన్నింగ్స్లోమొత్తంగా 102 బంతులు ఎదుర్కొని 112 పరుగులు సాధించాడు. గిల్ ఇన్నింగ్స్లో ఏకంగా పద్నాలుగు ఫోర్లతో పాటు మూడు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే గిల్ హషీం ఆమ్లాను అధిగమించాడు. వన్డేల్లో ఆడిన తొలి యాభై ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.అంతేకాదు.. ఒకే వేదికపై మూడు ఫార్మాట్లలో శతకం బాదిన ఐదో బ్యాటర్గానూ శుబ్మన్ గిల్ చరిత్రకెక్కాడు. ఇక ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్లో బౌల్డ్ కావడంతో మూడో వన్డేలో గిల్ సెంచరీ ఇన్నింగ్స్కు తెరపడింది.కోహ్లి కూడా ఫామ్లోకిఇక ఈ మ్యాచ్తో మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా ఫామ్లోకి వచ్చాడు. అహ్మదాబాద్లో 55 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 52 పరుగులు సాధించాడు. మరోవైపు.. నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా అద్భుత హాఫ్ సెంచరీ(64 బంతుల్లో 78)తో మెరిశాడు.ఇదిలా ఉంటే.. 2019లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన శుబ్మన్ గిల్ ఇప్పటి వరకు 50 వన్డేలు, 32 టెస్టులు, 21 టీ20లు ఆడాడు. వరుసగా ఆయా ఫార్మాట్లలో 2587, 1893, 578 పరుగులు చేశాడు.అంతర్జాతీయ స్థాయిలో వన్డేల్లో తొలి యాభై ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు👉శుబ్మన్ గిల్(ఇండియా)- 2587 పరుగులు👉హషీం ఆమ్లా(సౌతాఫ్రికా)- 2486 పరుగులు👉ఇమామ్ ఉల్ హక్(పాకిస్తాన్)- 2386 పరుగులు👉ఫఖర్ జమాన్(పాకిస్తాన్)- 2262 పరుగులు👉షాయీ హోప్(వెస్టిండీస్)- 2247 పరుగులుఒకే వేదికపై వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో శతకం బాదిన క్రికెటర్లు👉ఫాఫ్ డుప్లెసిస్(సౌతాఫ్రికా)- వాండరర్స్ స్టేడియం, జొహన్నస్బర్గ్👉డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా)- అడిలైడ్ ఓవల్, అడిలైడ్👉బాబర్ ఆజం(పాకిస్తాన్)- నేషనల్ స్టేడియం, కరాచి👉క్వింటన్ డికాక్(సౌతాఫ్రికా)- సూపర్స్పోర్ట్ పార్క్, సెంచూరియన్👉శుబ్మన్ గిల్(ఇండియా)- నరేంద్ర మోదీ స్టేడియం(మొతేరా), అహ్మదాబాద్.చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్గా అరుదైన రికార్డుJubilation as @ShubmanGill gets to a fine CENTURY!Keep at it, young man 🙌🙌Live - https://t.co/S88KfhFzri… #INDvENG@IDFCFIRSTBank pic.twitter.com/Xbcy6uaO6J— BCCI (@BCCI) February 12, 2025 -
శుబ్మన్ గిల్ అరుదైన రికార్డు.. తొలి భారత ప్లేయర్గా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముందు టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్(Shubman Gill) అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ మెగా టోర్నీ సన్నహాకాల్లో భాగంగా స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో గిల్ దుమ్ములేపుతున్నాడు. తొలి రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలతో సత్తాచాటిన గిల్.. ఇప్పుడు అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో అద్బుతమైన శతకంతో మెరిశాడు.టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు గిల్ మరోసారి అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఆదిలోనే ఔటైనప్పటికి గిల్ మాత్రం కోహ్లితో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో గిల్ 92 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లతో సాయంతో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. గిల్కు ఇది ఏడో వన్డే సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం 104 పరుగులతో గిల్ తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్లో శుబ్మన్ గిల్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన గిల్..వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 2,500 పరుగుల మైలు రాయిని అందుకున్న భారత క్రికెటర్గా గిల్ నిలిచాడు. గిల్ కేవలం 50 ఇన్నింగ్స్లలో ఈ రికార్డును అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా మిడిలార్డర్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ పేరిట ఉండేది.అయ్యర్ 59 ఇన్నింగ్స్లలో ఈ ఫీట్ను సాధించాడు. తాజా మ్యాచ్తో అయ్యర్ అల్టైమ్ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. అదే విధంగా 50వ వన్డే మ్యాచ్లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. కాగా శుబ్మన్ గిల్ ఇప్పటివరకు 50 వన్డేలు ఆడి 60.83 సగటుతో 2535 పరుగులు చేశాడు. అతడి ఇననింగ్స్లలో 7 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ, 16 ఆర్ధశతకాలు ఉన్నాయి.- Look at Rohit Sharma's reaction - Look at the crowd's reaction "They all know how aesthetically pleasing Shubman Gill is..."🔥💯• The Most Talented Youngster Everpic.twitter.com/UUJS2Ot6Vw— Gillfied⁷ (@Was_gill) February 12, 2025వన్డేల్లో అత్యంతవేగంగా 2500 పరుగులు చేసిన భారత ప్లేయర్లు వీరే..శుబ్మన్ గిల్- 50 ఇన్నింగ్స్లుశ్రేయాస్ అయ్యర్- 59 ఇన్నింగ్స్లుశిఖర్ ధావన్ -59 ఇన్నింగ్స్లుకేఎల్ రాహుల్-63 ఇన్నింగ్స్లువిరాట్ కోహ్లీ/నవ్జోత్ సిద్ధూ- 64 ఇన్నింగ్స్లుచదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్గా అరుదైన రికార్డు -
IPL 2025: కొత్త యాజమాన్యం చేతిలోకి గుజరాత్ టైటాన్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) యాజమాన్యంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. భారత్కు చెందిన టొరంట్ గ్రూపు(Torrent Group) ఈ ఫ్రాంఛైజీలో అరవై ఏడు శాతం వాటా కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. కాగా అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్ (ఐరిలియా కంపెనీ లిమిటెడ్) 2021లో ఐపీఎల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.నాడు రూ. 5,625 కోట్లతోభారీ స్థాయిలో ఏకంగా రూ. 5,625 కోట్లతో గుజరాత్ ఫ్రాంఛైజీని సొంతం చేసుకుంది. అయితే, తమ వాటలో మెజారిటీ మొత్తాన్ని అమ్మేందుకు సీవీసీ క్యాపిటల్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ విషయం గురించి సంస్థ సన్నిహిత వర్గాలు వార్తా సంస్థ పీటీఐకి వెల్లడించాయి.‘‘టొరంట్ గ్రూపుతో చర్చలు కొలిక్కివచ్చినట్లే. మూడింట రెండు వంతుల వాటాను అమ్మేందుకు నిర్ణయం జరిగింది. యజమానులుగా సీవీసీ గ్రూప్ లాక్- ఇన్ పీరియడ్ ఫిబ్రవరి 2025తో ముగుస్తుంది. కాబట్టి అప్పుడు వారు తమ వాటాలను అమ్ముకునేందుకు స్వేచ్ఛ లభిస్తుంది.బీసీసీఐ అనుమతి తప్పనిసరిటొరంట్ గ్రూపు భారత ఫార్మాసుటికల్ రంగంలో కీలకమైనది. బీసీసీఐ 2021లో రెండు కొత్త ఫ్రాంఛైజీల నిర్వహణకు బిడ్లను ఆహ్వానించినపుడు ఈ గ్రూపు ఆసక్తి కనబరిచింది. ఈసారి తన ఆకాంక్షను నెరవేర్చుకోనుంది. అయితే, ఐపీఎల్ ఫ్రాంఛైజీ యాజమాన్య మార్పు జరగాలంటే బీసీసీఐ నుంచి అనుమతి తప్పనిసరి. త్వరలోనే ఇది జరుగుతుంది’’ అని పేర్కొన్నాయి.కాగా ఐపీఎల్ పాలక మండలి నుంచి అనుమతి లభించిన తర్వాత గుజరాత్ టైటాన్స్ పగ్గాలు చేతులు మారనున్నాయి. ఐపీఎల్-2025 సీజన్ నుంచే యాజమాన్యంలో మార్పులు అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇక 2021లో క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. తమ అరంగేట్ర ఎడిషన్లోనే చాంపియన్గా నిలిచింది.హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో చాంపియన్గాటీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టైటిల్ గెలిచింది. ఆ మరుసటి ఏడాది పాండ్యా సారథ్యంలోనే ఫైనల్కు చేరింది. అయితే, ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ను వీడి.. తన సొంతగూటికి చేరాడు. అతడు ముంబై ఇండియన్స్ సారథిగా బాధ్యతలు చేపట్టగా.. మరో టీమిండియా స్టార్, భవిష్య కెప్టెన్ శుబ్మన్ గిల్ టైటాన్స్ పగ్గాలు చేపట్టాడు. గిల్ సారథ్యంలో ఇలాఅయితే, గిల్ సారథ్యంలో గతేడాది టైటాన్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పద్నాలుగు మ్యాచ్లకు గానూ కేవలం ఐదే గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. టొరంట్ గ్రూపు విలువ దాదాపుగా 41 వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇక టొరంట్ స్పోర్ట్స్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 2021లో అహ్మదాబాద్ కోసం రూ. 4653 కోట్లు, లక్నో ఫ్రాంఛైజీ కోసం రూ. 4356 కోట్లతో బిడ్ వేసింది. ఆ తర్వాత వుమెన్స్ ప్రీమియర్ లీగ్ బరిలోకి వచ్చిన టొరంట్ గ్రూప్ ఫ్రాంఛైజీ కొనుగోలు విషయంలో సఫలం కాలేకపోయింది. ఇప్పుడు ఏకంగా ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా మార్కులు కొట్టేసిన టైటాన్స్కు యజమానిగా మారనుంది.కాగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ పేరిట మొత్తం పదిజట్లు ఉన్నాయి.చదవండి: తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం: మాజీ క్రికెటర్ ఫైర్ -
జట్టు కోసం కొన్ని పరుగులు చేశా.. అతడొక క్లాసీ ప్లేయర్: రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఫామ్లోకి వచ్చేశాడు. ఇంగ్లండ్(India vs England)తో రెండో వన్డేలో విధ్వంసకర బ్యాటింగ్తో శతక్కొట్టి తన ఆటను విమర్శిస్తున్న వాళ్లకు బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. కో..డితే బంతి బౌండరీ దాటడమే అన్నట్లుగా తనదైన శైలిలో హిట్టింగ్ ఆడి.. క్రికెట్ ప్రేమికులకు కనులవిందు చేశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్తో చెలరేగి.. జట్టును గెలిపించాడు.నా గేమ్ప్లాన్ అదేఈ నేపథ్యంలో విజయానంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ... సెంచరీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈరోజు ఆటను పూర్తిగా ఆస్వాదించాను. జట్టు కోసం పరుగులు చేయడం ఎల్లప్పుడూ సంతృప్తిని ఇస్తుంది. ముఖ్యంగా సిరీస్ గెలవాలంటే మాకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం.నిజానికి టీ20 ఫార్మాట్ కంటే కాస్త సుదీర్ఘమైన.. టెస్టుల కంటే చిన్నదైన ఫార్మాట్ ఇది. అందుకే పరిస్థితులకు తగ్గట్లుగా ఎప్పుటికప్పుడు ప్రణాళికలు మార్చుకుంటూ వెళ్లాలి. ఈరోజు నా వ్యూహాలను పక్కాగా అమలు చేయగలిగాను.నల్లరేగడి మట్టి పిచ్ ఇది. జారుతూ ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. వికెట్ మీదకు కాకుండా.. శరీరం మీదకు బంతులు సంధిస్తున్న ఇంగ్లండ్ బౌలర్ల వ్యూహాన్ని పసిగట్టి నేను పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాను.గిల్ క్లాసీ ప్లేయర్గ్యాప్ దొరికినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాను’’ అని రోహిత్ శర్మ తన ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేశాడు. అదే విధంగా.. శుబ్మన్ గిల్(Shubman Gill), శ్రేయస్ అయ్యర్ నుంచి తనకు మద్దతు లభించించదన్న హిట్మ్యాన్.. ‘‘ఇద్దరూ చక్కగా సహకరించారు. వాళ్లతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదించాను. గిల్ చాలా చాలా క్లాసీ ప్లేయర్. అతడి ఆటను నేను దగ్గరగా గమనించాను. పరిస్థితి ఎలా ఉన్న తలవంచని స్వభావం. అతడి బ్యాటింగ్ గణాంకాలే ఇందుకు నిదర్శనం’’ అని రోహిత్ శర్మ గిల్పై ప్రశంసలు కురిపించాడు.మిడిల్ ఓవర్లే ముఖ్యంఇక టీమిండియా ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఏదేమైనా మిడిల్ ఓవర్లలో వికెట్లు కాపాడుకోవడం అత్యంత ముఖ్యం. మధ్య ఓవర్లలో ఆట తీరును బట్టే ఫలితం నిర్ణయించబడుతుంది. ఒకవేళ అప్పుడే మనం జాగ్రత్తపడితే డెత్ ఓవర్లలో పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు.నాగ్పూర్లో కూడా మేము ఇదే విధంగా మిడిల్ ఓవర్లలో చక్కగా రాణించాం. తద్వారా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి అనుకున్న ఫలితాన్ని రాబట్టగలిగాం. రోజురోజుకూ మరింత గొప్పగా మారేలా మా జట్టు సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోంది. జట్టులోని ప్రతి సభ్యుడికి తన పాత్ర ఏమిటో తెలుసు. కెప్టెన్, కోచ్ వాళ్ల నుంచి ఎలాంటి ఆట తీరును ఆశిస్తున్నారో ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. కాబట్టి ముందుకు అనుకున్న వ్యూహాలను పక్కాగా అమలు చేస్తే దేని గురించి ఆందోళన చెందాల్సిన పని ఉండదు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.సిరీస్ కైవసంకాగా ఇంగ్లండ్తో రెండో వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒడిశాలోని కటక్లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. 49.5 ఓవర్లలో 204 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ బెన్ డకెట్(65), జో రూట్(69) అర్ధ శతకాలతో రాణించారు.భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా.. మహ్మద్ షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు. ఇక లక్ష్య ఛేదనలో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్లు- 119) సెంచరీతో చెలరేగి జట్టు విజయానికి బాటలు చేశాడు.మరో ఓపెనర్ శుబ్మన్ గిల్(60) అర్ధ శతకంతో రాణించగా.. శ్రేయస్ అయ్యర్(44), అక్షర్ పటేల్(41 నాటౌట్) లక్ష్యాన్ని పూర్తి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. రో‘హిట్’ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఇక ఈ విజయంతో టీమిండియా ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. ఇరుజట్ల మధ్య బుధవారం నామమాత్రపు మూడో వన్డే జరుగుతుంది.చదవండి: SA T20: ఫైనల్లో సన్రైజర్స్ చిత్తు.. ఛాంపియన్స్గా ముంబై టీమ్What a way to get to the HUNDRED! 🤩A treat for the fans in Cuttack to witness Captain Rohit Sharma at his best 👌👌Follow The Match ▶️ https://t.co/NReW1eEQtF#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/oQIlX7fY1T— BCCI (@BCCI) February 9, 2025𝗔 𝘀𝘂𝗽𝗲𝗿 𝘀𝗵𝗼𝘄 𝘁𝗼 𝘀𝗲𝗮𝗹 𝗮 𝘄𝗶𝗻 𝗶𝗻 𝗖𝘂𝘁𝘁𝗮𝗰𝗸! ✅The Rohit Sharma-led #TeamIndia beat England by 4⃣ wickets in the 2nd ODI & take an unassailable lead in the ODI series! 👏 👏Scorecard ▶️ https://t.co/NReW1eEQtF#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/G63vdfozd5— BCCI (@BCCI) February 9, 2025 -
IND Vs ENG: రోహిత్ సూపర్ సెంచరీ..రెండో వన్డేలో ఇంగ్లండ్పై టీమిండియా గెలుపు (ఫొటోలు)
-
సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్(KL Rahul) తీరుపై భారత దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏ ఆటగాడైనా జట్టు ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించాలని హితవు పలికాడు. అలా కాకుండా ప్రతి ఒక్కరు స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తే ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందంటూ చురకలు అంటించాడు.కాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్తో వన్డే సిరీస్(India vs England ODIs)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇరుజట్ల మధ్య గురువారం నాగ్పూర్ వేదికగా తొలి వన్డే జరిగింది. 248 పరుగులుఇందులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్(26 బంతుల్లో 43), బెన్ డకెట్(29 బంతుల్లో 32)లు శుభారంభం అందించగా.. కెప్టెన్ జోస్ బట్లర్(67 బంతుల్లో 52), జాకొబ్ బెతెల్(64 బంతుల్లో 51) అర్ధ శతకాలతో మెరిశారు.అయితే, భారత బౌలర్ల విజృంభణ కారణంగా మరెవరూ రాణించలేకపోయారు. ఫలితంగా 47.4 ఓవర్లలో 248 పరుగులు చేసి ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణాతో పాటు రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు.అయ్యర్ మెరుపు అర్ధ శతకంఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(15), కెప్టెన్ రోహిత్ శర్మ(2) వికెట్లు కోల్పోగా.. శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ భారత ఇన్నింగ్స్ చక్కదిద్దారు. గిల్ పట్టుదలగా క్రీజులో నిలబడి కాస్త నెమ్మదిగానే ఆడగా.. అయ్యర్ మెరుపు అర్ధ శతకం(36 బంతుల్లో 59), అక్షర్ పటేల్(52) విలువైన హాఫ్ సెంచరీ చేసి నిష్క్రమించారు.ఈ దశలో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ శుబ్మన్ గిల్కు తోడయ్యాడు. అప్పటికి గిల్ సెంచరీకి 19 పరుగులు, టీమిండియా విజయానికి 28 పరుగులు కావాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో స్ట్రైక్లో ఉన్న రాహుల్ ఆదిల్ రషీద్ బౌలింగ్లో అతడికే క్యాచ్ ఇచ్చి 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ కేఎల్ రాహుల్ వ్యవహారశైలిని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. గిల్ సెంచరీ పూర్తి చేసుకునేందుకు సహకరించే క్రమంలో రాహుల్ తన ఆటపై శ్రద్ధ పెట్టలేక నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడని మండిపడ్డాడు. హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ.. ‘‘అతడు తన సహజశైలిలో ఆడాల్సింది.కానీ తన బ్యాటింగ్ పార్ట్నర్ సెంచరీ పూర్తి చేసుకునేందుకు వీలు కల్పించే క్రమంలో అజాగ్రత్తగా వ్యవహరించాడు. అందుకు ఫలితంగా ఏం జరిగిందో చూడండి. ఇది టీమ్ గేమ్. కాబట్టి ఏ ఆటగాడు కూడా ఇలా చేయకూడదు. స్ట్రైక్ రొటేట్ చేసేందుకు ఏదో కొత్తగా ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. ఇది పూర్తిగా అతడు అనాసక్తితో ఆడిన షాట్’’ అని గావస్కర్ కేఎల్ రాహుల్ తీరును విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్లో గిల్ 96 బంతుల్లో 87 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.చదవండి: తుదిజట్టులో నాకసలు స్థానమే లేదు.. రోహిత్ కాల్ తర్వాత..: శ్రేయస్ అయ్యర్ -
శుబ్మన్ గిల్ కాదు.. ఫ్యూచర్ టీమిండియా కెప్టెన్ అతడే?!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం భారత క్రికెట్ జట్టు తమ సన్నాహాకాలను ప్రారంభించింది. ఈ మెగా టోర్నీ ప్రిపేరేషన్లో భాగంగా టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో తలపడుతోంది. ఇప్పటికే తొలి వన్డేలో పర్యాటక ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్.. మిగిలిన రెండు వన్డేలకు సిద్దమవుతోంది.ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఫిబ్రవరి 15న రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలోని భారత జట్టు దుబాయ్ పయనం కానుంది. ఈ మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ మ్యాచ్ కంటే ముందు టీమిండియా.. యూఏఈ లేదా బంగ్లాదేశ్తో వామాప్ మ్యాచ్ ఆడనుంది. కాగా ఈ మెగా ఈవెంట్ కోసం 15 మంది సభ్యులతో కూడిన పటిష్టమైన జట్టును అజిత్ అగర్కార్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే వెన్ను గాయంతో బాధపడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటుపై మాత్రం ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది.కెప్టెన్గా హార్దిక్..!ఇక ఇది ఇలా ఉండగా.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడంలో భారత్ విఫలమైతే రోహిత్ శర్మ స్ధానంలో వన్డే కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం వన్డేల్లో రోహిత్ శర్మ డిప్యూటీగా స్టార్ ప్లేయర్ శుబ్మన్ గిల్(Shubman Gill) ఉన్నాడు. అయితే గిల్ను వైస్ కెప్టెన్గానే కొనసాగించి జట్టు పగ్గాలను మాత్రం హార్దిక్కు అప్పగించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. కాగా గతేడాది వరకు టీ20ల్లో టీమిండియా వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా కొనసాగాడు.రోహిత్ శర్మ గైర్హజారీలో చాలా మ్యాచ్ల్లో భారత కెప్టెన్గా పాండ్యా వ్యవహరించాడు. టీ20 వరల్డ్కప్-2024లో కూడా రోహిత్ శర్మ డిప్యూటీగా ఈ బరోడా ఆల్రౌండర్ ఉన్నాడు. కానీ రోహిత్ శర్మ రిటైరయ్యాక భారత టీ20 కెప్టెన్గా హార్దిక్ను కాదని సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేసి సెలక్షన్ కమిటీ అందరికి షాకిచ్చింది. అయితే సూర్య కెప్టెన్గా రాణిస్తున్నప్పటికి వ్యక్తిగత ప్రదర్శన పరంగా మాత్రం విఫలమవుతున్నాడు.రోహిత్ రిటైర్మెంట్..!కాగా ఈ మెగా టోర్నీ అనంతరం రోహిత్ శర్మ కూడా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తలపై రోహిత్ శర్మ మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇంగ్లండ్తో తొలి వన్డేకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో రోహిత్కు ఇదే ప్రశ్న ఎదురైంది. "నా ప్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడటానికి ఇది సందర్భం కాదు. ప్రస్తుతం నా దృష్టి అంతా ఇంగ్లండ్ సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ పైనే ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం" అంటూ హిట్మ్యాన్ బదులిచ్చాడు. దీంతో రిటైర్మెంట్ పై క్లారిటీ ఇవ్వకుండా దాటవేసేలా రోహిత్ మాట్లాడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. రోహిత్ భవితవ్యం తేలాలంటే మరో నెల రోజులు అగాల్సిందే.చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు.. -
'శుబ్మన్ గిల్ కూడా అలాంటివాడే.. అతడికి తిరుగు లేదు'
నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్(England)తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill) అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 249 పరుగుల లక్ష్య చేధనలో గిల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో మూడో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన గిల్ తొలుత ఆచితూచి ఆడాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ బౌలర్లను ఊతికారేశాడు. శ్రేయస్ అయ్యర్తో కలిసి భారత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 96 బంతుల్లో 87 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో శుబ్మన్ గిల్పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్ ఒక అద్బుతమైన ఆటగాడని, చాలా కాలం పాటు భారత క్రికెట్ జట్టులో కొనసాగుతాడని మంజ్రేకర్ కొనియాడాడు."భారత క్రికెట్లో ఎక్కువ కాలం కొనసాగగల క్రికెటర్లకు మేము ఓ పదాన్ని ఉపయోగిస్తాం. ‘లంబీ రేస్ కా ఘోడా’(సుదీర్ఘ దూరం పరిగెత్తగల గుర్రం). శుబ్మన్ గిల్ కూడా అలాంటివాడే! అంటూ ఎక్స్లో మంజ్రేకర్ రాసుకొచ్చాడు.ఓపెనింగ్ స్లాట్ త్యాగం..కాగా ఈ మ్యాచ్లో అరంగేట్ర ఆటగాడు యశస్వి జైశ్వాల్ కోసం గిల్ తన ఓపెనింగ్ స్ధానాన్ని త్యాగం చేశాడు. విరాట్ కోహ్లి జట్టులో లేకపోవడంతో మూడో స్ధానంలో గిల్ బ్యాటింగ్కు వచ్చాడు. తన బ్యాటింగ్ పొజిషేన్ అది కానప్పటికి గిల్ మాత్రం ప్రశాంతంగా ఉండి క్రీజులో ఇన్నింగ్స్ను ముందుకు నడ్పించాడు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్తో కలిసి విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఒకవేళ రెండో వన్డేకు విరాట్ కోహ్లి అందుబాటులోకి వస్తే.. గిల్ మళ్లీ ఓపెనర్గానే బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.ఇక ఈ మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్పై గిల్ స్పందించాడు. "వైస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక నాపై ఎటువంటి ఒత్తిడి లేదు. నా బ్యాటింగ్లో కూడా ఎటువంటి మార్పు రాదు. కానీ మైదానంలో నా ఆలోచనలను రోహిత్ భాయ్కు షేర్ చేస్తాను. అదే విధంగా రోహిత్ ప్రణాళకలను కూడా నేను అడిగి తెలుసుకుంటాను.నా వ్యూహాలను కూడా అతడితో పంచుకుంటున్నాను. మ్యాచ్ గురించి ఏదైనా సలహా ఇవ్వాలనకుంటే, సంకోచించకుండా తనతో చెప్పమని రోహిత్ నాతో అన్నాడని" పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్లో గిల్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: కింగ్ వచ్చేస్తున్నాడు.. పాపం అతడు! ఒక్క మ్యాచ్కే వేటు -
క్రెడిట్ మొత్తం అతడికే.. మా ఓటమికి కారణం అదే: బట్లర్
భారత్లో ఇంగ్లండ్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. తొలుత ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1తో కోల్పోయిన బట్లర్ బృందం.. వన్డే సిరీస్(India vs England ODIs)నూ ఓటమితోనే ఆరంభించింది. నాగ్పూర్లో గురువారం జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) విచారం వ్యక్తం చేశాడు.క్రెడిట్ మొత్తం అతడికేశుభారంభం అందుకున్నా దానిని కొనసాగించలేకపోవడమే తమ పరాజయానికి కారణమని బట్లర్ అన్నాడు. అదే విధంగా.. టీమిండియా విజయంలో క్రెడిట్ మొత్తం శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)కు దక్కుతుందంటూ అతడి బ్యాటింగ్ తీరును ప్రశంసించాడు. కాగా విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచిన బట్లర్ తొలుత బ్యాటింగ్ వైపు మొగ్గుచూపాడు.అతడి రనౌట్లో అయ్యర్ కీలక పాత్రఈ క్రమంలో టీమిండియా సీనియర్ పేసర్ భారత బౌలింగ్ అటాక్ ఆరంభించి.. తొలి ఓవర్లో పరుగులేమీ ఇవ్వలేదు. అనంతరం వన్డే అరంగేట్ర ఆటగాడు, మరో పేసర్ హర్షిత్ రాణా సైతం మెయిడిన్ వేసి సత్తా చాటాడు. అయితే, ఆ తర్వాత ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ధనాధన్ ఇన్నింగ్స్తో హర్షిత్ రాణాకు చుక్కలు చూపించాడు.ఒకే ఓవర్లో ఏకంగా ఇరవై ఆరు పరుగులు పిండుకుని రాణాను పనిష్ చేశాడు. కానీ మంచి జోరు మీదున్న సమయంలో అనవసరపు పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫీల్డింగ్ కారణంగా సాల్ట్(26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు- 43 రన్స్) వెనుదిరిగాడు.A moment of brilliance on the field by #ShreyasIyer and #PhilSalt is RUNOUT! 🙌🏻Start watching FREE on Disney+ Hotstar ➡️ https://t.co/gzTQA0IDnU#INDvENGOnJioStar 1st ODI 👉 LIVE NOW on Disney+ Hotstar, Star Sports 2, Star Sports 3, Sports 18 1 & Colors Cineplex! pic.twitter.com/n9hvFfJQpE— Star Sports (@StarSportsIndia) February 6, 2025 ఇక మరో ఓపెనర్ బెన్ డకెట్ సైతం 29 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 32 పరుగులతో రాణించగా.. వన్డౌన్లో వచ్చిన రీఎంట్రీ స్టార్ జో రూట్(19) నిరాశపరిచాడు. ఇక హ్యారీ బ్రూక్ హర్షిత్ రాణా దెబ్బకు పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఇలాంటి తరుణంలో బట్లర్, జాకొబ్ బెతెల్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.బట్లర్ 67 బంతుల్లో 52 పరుగులు చేయగా.. బెతెల్ 64 బాల్స్ ఎదుర్కొని 51 రన్స్ సాధించాడు. కానీ మిగతా వాళ్లు మాత్రం చేతులెత్తేశారు. లియామ్ లివింగ్స్టోన్(5), బ్రైడన్ కార్సే(10), ఆదిల్ రషీద్(8) త్వరత్వరగా పెవిలియన్ చేరగా.. టెయిలెండర్ జోఫ్రా ఆర్చర్ 18 బంతుల్లో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. 38.4 ఓవర్లలోనే..ఫలితంగా ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 38.4 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(15), కెప్టెన్ రోహిత్ శర్మ(2) విఫలమైనా.. శుబ్మన్ గిల్ (87) అద్భుత అర్థ శతకంతో మెరిశాడు. అతడికి తోడుగా నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ టీ20 తరహా మాదిరి 36 బంతుల్లోనే 59 పరుగులతో దుమ్ములేపాడు. ఇక ఆల్రౌండర్ అక్షర్ పటేల్(47 బంతుల్లోనే 52) కూడా హాఫ్ సెంచరీ సాధించాడు.మా ఓటమికి కారణం అదేఈ నేపథ్యంలో ఓటమి అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ.. ‘‘గెలవలేకపోయినందుకు బాధగా ఉంది. పవర్ ప్లేలో మేము అద్భుతంగా రాణించాం. కానీ త్వరత్వరగా వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. ఇంకో 40- 50 పరుగులు చేసేందుకు వికెట్ అనుకూలంగానే ఉంది. కానీ మేము ఆఖరిదాకా నిలవలేకపోయాం.ఏదేమైనా మా వాళ్లు శుభారంభం అందించారనేది వాస్తవం. ఆ సమయంలో మ్యాచ్ మాకు అనుకూలంగానే ఉంది. ఇక టీమిండియా విజయంలో శ్రేయస్ అయ్యర్కు క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అతడి అద్భుత ఇన్నింగ్స్ వల్ల భారత్కు మెరుగైన భాగస్వామ్యం లభించింది. ఏదేమైనా.. ఇకపై మేము ఇన్నింగ్స్ ఆసాంతం ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సి ఉంది’’ అని పరాజయానికి గల కారణాలను విశ్లేషించాడు. చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు -
IND Vs ENG: శుబ్మన్, శ్రేయస్ సత్తా చాటగా...
స్వదేశంలో జరుగుతున్న పోరులో ఇంగ్లండ్పై భారత్ సంపూర్ణ ఆధిపత్యం కొనసాగుతోంది. టి20 సిరీస్లో ఘన విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు వన్డేల్లో గెలుపుతో బోణీ చేసింది. బౌలింగ్లో జడేజా, రాణా రాణించడంతో ముందుగా ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన జట్టు...ఆపై గిల్, శ్రేయస్, అక్షర్ బ్యాటింగ్తో 11.2 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరింది. పేలవ బ్యాటింగ్తో ఇంగ్లండ్ మరోసారి పరాజయానికే పరిమితమైంది. నాగ్పూర్: ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో భారత్ 1–0తో ముందంజ వేసింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్ (67 బంతుల్లో 52; 4 ఫోర్లు), జాకబ్ బెతెల్ (64 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేయగా...ఫిల్ సాల్ట్ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడాడు.భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 38.4 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్మన్ గిల్ (96 బంతుల్లో 87; 14 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 59; 9 ఫోర్లు, 2 సిక్స్లు), అక్షర్ పటేల్ (47 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. రెండో వన్డే ఆదివారం కటక్లో జరుగుతుంది. కీలక భాగస్వామ్యాలు... ఓపెనర్లు సాల్ట్, బెన్ డకెట్ (29 బంతుల్లో 32; 6 ఫోర్లు) ఇంగ్లండ్కు శుభారంభం అందించారు. వీరిద్దరు దూకుడుగా ఆడుతూ తొలి వికెట్కు 8.5 ఓవర్లలోనే 75 పరుగులు జోడించారు. ఓపెనర్లను నిలువరించడంలో భారత బౌలర్లు విఫలమవుతున్న స్థితిలో ఇంగ్లండ్ స్వయంకృతం ఇన్నింగ్స్ను మలుపు తిప్పింది. లేని మూడో పరుగు కోసం ప్రయత్నించిన సాల్ట్ను చక్కటి ఫీల్డింగ్తో శ్రేయస్ రనౌట్ చేయడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రెండు పరుగుల వ్యవధిలో మరో 2 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడింది. సుదీర్ఘ విరామం తర్వాత వన్డే ఆడిన జో రూట్ (19) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో బట్లర్, బెతెల్ కలిసి ఇంగ్లండ్ను ఆదుకున్నారు. వీరిద్దరు భారీ షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఆడారు. 58 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తయిన వెంటనే బట్లర్ నిష్క్రమించాడు. బెతెల్తో కలిసి ఐదో వికెట్కు అతను 14.3 ఓవర్లలో 59 పరుగులు జత చేశాడు. 62 బంతుల్లో బెతెల్ హాఫ్ సెంచరీ మార్క్ను చేరుకోగా...తర్వాతి బ్యాటర్లెవరూ నిలవలేకపోవడంతో మరో 16 బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ ఆట ముగిసింది. రాణించిన అక్షర్... ఛేదనలో ఆరంభంలో భారత్ తడబడింది. 19 పరుగుల వద్దే యశస్వి జైస్వాల్ (15), రోహిత్ శర్మ (2) వెనుదిరిగారు. అయితే గిల్, శ్రేయస్ భాగస్వామ్యంలో జట్టు దూసుకుపోయింది. ముఖ్యంగా శ్రేయస్ మెరుపు బ్యాటింగ్తో అలరించాడు. ఆర్చర్ ఓవర్లో వరుసగా 2 సిక్స్లు బాదిన అతను, కార్స్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టాడు. ఈ జోరులో 30 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తయింది. గిల్తో కలిసి మూడో వికెట్కు 94 పరుగులు (10.4 ఓవర్లలో) జోడించిన తర్వాత శ్రేయస్ వెనుదిరిగాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ అయిన అక్షర్ పటేల్ కూడా గిల్కు తగిన విధంగా సహకరించడంతో జట్టు లక్ష్యం దిశగా సాగింది. ఈ క్రమంలో గిల్ 60 బంతుల్లో, అక్షర్ 46 బంతుల్లోనే హాఫ్ సెంచరీలను అందుకున్నారు. నాలుగో వికెట్కు 17.5 ఓవర్లలో 108 పరుగులు జత చేసిన అనంతరం అక్షర్ అవుటయ్యాడు. ఈ దశలో భారత్ విజయానికి 28 పరుగులు, గిల్ సెంచరీకి 19 పరుగులు అవసరమయ్యాయి. అయితే గిల్ సెంచరీ చేజార్చుకోగా, రాహుల్ (2) కూడా నిలబడలేదు. కానీ పాండ్యా (9 నాటౌట్), జడేజా (12 నాటౌట్) కలిసి మ్యాచ్ను ముగించారు.26 పరుగులు సమర్పించుకున్నా... కెరీర్లో తొలి వన్డే ఆడుతున్న రాణా బౌలింగ్ ఆరంభంలో తడబడ్డాడు. ముఖ్యంగా అతని మూడో ఓవర్లో సాల్ట్ 3 సిక్స్లు, 2 ఫోర్లతో చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో సాల్ట్ వరుసగా 6, 4, 6, 4, 0, 6 బాదడంతో మొత్తం 26 పరుగులు వచ్చాయి. అయితే తన నాలుగో ఓవర్లో అతను సత్తా చాటి పరిస్థితిని మార్చాడు. మూడో బంతికి డకెట్ను అవుట్ చేసిన రాణా చివరి బంతికి బ్రూక్ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత కీలకమైన లివింగ్స్టోన్ వికెట్ కూడా రాణా ఖాతాలోనే చేరింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (రనౌట్) 43; డకెట్ (సి) జైస్వాల్ (బి) రాణా 32; రూట్ (ఎల్బీ) (బి) జడేజా 19; బ్రూక్ (సి) రాహుల్ (బి) రాణా 0; బట్లర్ (సి) పాండ్యా (బి) అక్షర్ 52; బెతెల్ (ఎల్బీ) (బి) జడేజా 51; లివింగ్స్టోన్ (సి) రాహుల్ (బి) రాణా 5; కార్స్ (బి) షమీ 10; రషీద్ (బి) జడేజా 8; ఆర్చర్ (నాటౌట్) 21; మహమూద్ (స్టంప్డ్) రాహుల్ (బి) కుల్దీప్ 2; ఎక్స్ట్రాలు 5; మొత్తం (47.4 ఓవర్లలో ఆలౌట్) 248. వికెట్ల పతనం: 1–75, 2–77, 3–77, 4–111, 5–170, 6–183, 7–206, 8–220, 9–241, 10–248. బౌలింగ్: షమీ 8–1–38–1, రాణా 7–1–53–3, అక్షర్ 7–0–38–1, పాండ్యా 7–1–37–0, కుల్దీప్ 9.4–0–53–1, జడేజా 9–1–26–3. భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) సాల్ట్ (బి) ఆర్చర్ 15; రోహిత్ శర్మ (సి) లివింగ్స్టోన్ (బి) మహమూద్ 2; గిల్ (సి) బట్లర్ (బి) మహమూద్ 86; శ్రేయస్ (ఎల్బీ) (బి) బెతెల్ 59; అక్షర్ (బి) రషీద్ 52; రాహుల్ (సి) అండ్ (బి) రషీద్ 2; పాండ్యా (నాటౌట్) 9; జడేజా (నాటౌట్) 12; ఎక్స్ట్రాలు 13; మొత్తం (38.4 ఓవర్లలో 6 వికెట్లకు) 251. వికెట్ల పతనం: 1–19, 2–19, 3–113, 4–221, 5–225, 6–235. బౌలింగ్: ఆర్చర్ 7–1–39–1, మహమూద్ 6.4–0–47–2, కార్స్ 5–0–52–0, రషీద్ 10–1–49–2, బెతెల్ 3–0–18–1, లివింగ్స్టోన్ 5–0–28–0, రూట్ 2–0–10–0. సినిమా చూస్తుండగా... ‘నేను ఈ మ్యాచ్ ఆడతానని అనుకోలేదు. కాస్త ఎక్కువ సేపు మెలకువతో ఉండవచ్చు అనుకొని రాత్రి సినిమా చూస్తూ కూర్చున్నాను. అయితే కోహ్లి మోకాలికి గాయం అయిందని నువ్వు ఆడాల్సి ఉంటుందని కెప్టెన్ రోహిత్నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే సినిమాను సగంలోనే ఆపేసి వెంటనే వెళ్లి పడుకున్నాను’ –శ్రేయస్ అయ్యర్ జైస్వాల్ను ఆడించాలని టీమ్ మేనేజ్మెంట్ ముందే సిద్ధమైందని శ్రేయస్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. గత కొంత కాలంగా వన్డేల్లో ఘనమైన రికార్డు ఉన్నా సరే... శ్రేయస్కు తుది జట్టులో చోటు లేకపోవడం ఆశ్చర్యకరం.గాయంతో దూరమైన కోహ్లి టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లి లేకుండానే భారత జట్టు తొలి వన్డేలో బరిలోకి దిగింది. కుడి మోకాలికి గాయం కారణంగా కోహ్లి ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. బుధవారం ప్రాక్టీస్ సమయంలోనే అతనికి ఈ గాయమైందని టాస్ సమయంలో కెప్టెన్ రోహిత్ వెల్లడించాడు. అయితే మ్యాచ్ ముందు రోజు టీమ్ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని చెప్పలేదు. గురువారం జట్టు సభ్యులందరితో కలిసి మైదానానికి వచ్చిన కోహ్లి స్వల్పంగా డ్రిల్స్లో పాల్గొన్నాడు. అయితే ఈ సమయంలో అతను కాలికి ప్లాస్టర్తో కనిపించాడు. యశస్వి జైస్వాల్, రాణా అరంగేట్రం పేస్ బౌలర్ హర్షిత్ రాణా, ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్తో వన్డే క్రికెట్లోకి అడుగు పెట్టారు. భారత్ తరఫున వన్డేలు ఆడిన 257, 258వ ఆటగాళ్లుగా వీరిద్దరు గుర్తింపు పొందారు. భారత్ తరఫున ఇప్పటికే 19 టెస్టులు, 23 టి20లు ఆడిన 23 ఏళ్ల ముంబై ఆటగాడు జైస్వాల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగా... ఢిల్లీకి చెందిన రాణా ఆ్రస్టేలియా గడ్డపై తొలి రెండు టెస్టులు ఆడాడు. ఆపై ఇంగ్లండ్తో గత శుక్రవారం జరిగిన చివరి మ్యాచ్తో అంతర్జాతీయ టి20ల్లోకి అడుగు పెట్టాడు. -
రాణించిన జడ్డూ, శ్రేయస్, గిల్, అక్షర్.. తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం
ఇంగ్లండ్తో (England) మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా (Team India) ఘనంగా ప్రారంభించింది. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో 248 పరుగులకే (47.4 ఓవర్లలో) ఆలౌటైంది. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ను దెబ్బ కొట్టారు. షమీ, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు.ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (52), జేకబ్ బేతెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (32), ఫిలిప్ సాల్ట్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రూట్ 19, బ్రూక్ 0, లివింగ్స్టోన్ 5, కార్స్ 10, ఆదిల్ రషీద్ 8, సాకిబ్ మహమూద్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్.. 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ (2), యశస్వి జైస్వాల్ (15) త్వరగా ఔటైనా.. మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్ (59), శుభ్మన్ గిల్ (87), అక్షర్ పటేల్ (52) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా శ్రేయస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి మధ్యలోనే భారత్ గెలుపు ఖరారు చేశాడు. లక్ష్యానికి చేరువైన తరుణంలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా (9 నాటౌట్), రవీంద్ర జడేజా (12 నాటౌట్) భారత్ను విజయతీరాలకు చేర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్చర్, జేకబ్ బేతెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. రెండో వన్డే కటక్ వేదికగా ఫిబ్రవరి 9న జరుగనుంది.జడేజా@600ఈ మ్యాచ్లో టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్లో మూడు వికెట్లు తీసిన జడేజా.. అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. జడ్డూకు ముందు అనిల్ కుంబ్లే (953), అశ్విన్ (765), హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687) మాత్రమే 600 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టారు. భారత్ తరఫున 600 వికెట్లు పడగొట్టిన తొలి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, అలాగే అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లతో పాటు 6000 పరుగులు చేసిన ఏకైక భారత స్పిన్నర్ జడేజానే.అరంగ్రేటంలోనే మెరిసిన రాణా.. నిరాశపరిచిన జైస్వాల్ఈ మ్యాచ్తో వన్డే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన హర్షిత్ రాణా తనపై పెట్టుకున్న అంచనాలకు న్యాయం చేశాడు. ఈ మ్యాచ్లో తొలుత ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆతను.. ఆతర్వాత కోలుకుని మూడు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆరంభంలో ఫిల్ సాల్ట్ రాణాకు చుక్కలు చూపించాడు. ఇదే మ్యాచ్తో వన్డే అరంగేట్రం చేసిన మరో భారత ఆటగాడు యశస్వి జైస్వాల్ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో జైస్వాల్ 22 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు.కొనసాగిన రోహిత్ వైఫల్యాల పరంపరఅంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ వైఫల్యాల పరంపర కొనసాగింది. ఈ మ్యాచ్లో అతను 7 బంతులు ఎదుర్కొని 2 పరుగులకే ఔటయ్యాడు. ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా రోహిత్ ప్రదర్శనలు చాలా దారుణంగా ఉన్నాయి.గత 16 ఇన్నింగ్స్ల్లో రోహిత్ కేవలం ఒకే అర్ద సెంచరీ చేశాడు. గత ఏడాదంతా కలుపుకుని రోహిత్ చేసింది కేవలం 166 పరుగులే. విరాట్ దూరం.. పంత్కు నో ప్లేస్ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరంగా ఉన్నాడు. మోకాలి గాయం కారణంగా కోహ్లి ఈ మ్యాచ్లో ఆడలేదు. గాయాల కారణంగా కోహ్లి మ్యాచ్లకు దూరం కావడం చాలా అరుదు. ఈ మ్యాచ్లో మరో భారత స్టార్ ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. వికెట్కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ బెంచ్కే పరిమితమయ్యాడు. కేఎల్ రాహుల్ అదనంగా వికెట్కీపింగ్ బాధ్యతలు మోశాడు. -
మా మధ్య అలాంటి పోటీ లేనేలేదు.. రోహిత్ భయ్యా మాత్రం: గిల్
జట్టు విజయానికి కారణమైన ప్రతి ఒక్కరిని తాను అభినందిస్తానని టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill) అన్నాడు. తనకు ఎవరిపట్లా ద్వేషభావన లేదని స్పష్టం చేశాడు. దేశం కోసం ఆడేటపుడు ఆటగాళ్లంతా జట్టు ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తారని.. తాను కూడా అంతేనని పేర్కొన్నాడు.కాగా వన్డే, టీ20, టెస్టు.. ఇలా మూడు ఫార్మాట్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు ఓపెనింగ్ జోడీగా ఒకప్పుడు శుబ్మన్ గిల్కు ప్రాధాన్యం దక్కిన విషయం తెలిసిందే. అయితే, యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) రాకతో టెస్టుల్లో ఓపెనర్గా గిల్ స్థానం గల్లంతైంది. ఇక అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మ వీడ్కోలు పలికిన తర్వాత.. కొత్త హెడ్కోచ్ గౌతం గంభీర్ కొత్త ఓపెనింగ్ జోడీని రంగంలోకి దింపిన విషయం తెలిసిందే.టీ20లలో కొత్త జోడీకేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్తో పాటు పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ టీ20లలో భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారు. సౌతాఫ్రికా గడ్డపై రెండు శతకాలతో సంజూ.. ఇంగ్లండ్తో స్వదేశంలో తాజా సిరీస్లో అద్భుత ప్రదర్శనతో అభిషేక్ ఓపెనర్లుగా తమ స్థానాలను పటిష్టం చేసుకున్నారు.ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో సంజూ విఫలమైనా అతడికి మరో ఛాన్స్ ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధంగానే ఉందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. అభిషేక్ ఈ సిరీస్లో రికార్డు శతకం(54 బంతుల్లో 135)తో సత్తా చాటి ఓపెనర్గా పాతుకుపోయేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు.‘టాక్సిక్’ కాంపిటిషన్?ఈ నేపథ్యంలో ఓపెనింగ్ స్థానం విషయంలో శుబ్మన్ గిల్కు అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్ పోటీగా తయారయ్యారని.. దీంతో అతడు ఇబ్బందులు పడుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయం గురించి మంగళవారం మీడియా గిల్ను ప్రశ్నించగా.. హుందాగా స్పందించాడు.‘‘అభిషేక్ నాకు చిన్ననాటి నుంచే స్నేహితుడు. అదే విధంగా జైస్వాల్ కూడా నాకు ఫ్రెండే. మా మధ్య అనారోగ్యకరమైన పోటీ ఉందని నేను అనుకోను. దేశం కోసం ఆడుతున్నప్పుడు ప్రతి ఒక్క ఆటగాడు తాను గొప్పగా రాణించాలని కోరుకుంటాడు.అతడు బాగా ఆడకూడదనుకోనుప్రతి మ్యాచ్లోనూ అద్బుతంగా ఆడాలనే అనుకుంటాడు. అంతేకానీ.. ‘అతడు బాగా ఆడకూడదు. అలాగైతేనే నేను బాగుంటాను’ అనుకునే వాళ్లు ఎవరూ ఉండరు. జట్టు కోసం ఎవరైతే కష్టపడి ఆడి.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటారో వారిని తప్పక అభినందించాలి’’ అని శుబ్మన్ గిల్ సమాధానం ఇచ్చాడు.ఇక ఇంగ్లండ్తో వన్డే సిరీస్ నేపథ్యంలో రోహిత్ శర్మ ఫామ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘వన్డేల్లో గత ఏడాదిన్నర కాలంగా రోహిత్ భాయ్ అద్భుతంగా ఆడుతున్నాడు. మాకు అదొక గేమ్ చేంజింగ్ మూమెంట్. ఇక ముందు కూడా అదే జోరును కొనసాగిస్తాడు’’ అని శుబ్మన్ గిల్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో గిల్తో కలిసి ఓపెనింగ్ చేసిన రోహిత్ శర్మ.. జట్టు ఫైనల్ చేరడంలో కీలకప్రాత పోషించాడు. అంతేకాదు.. శ్రీలంకతో గతేడాది వన్డే సిరీస్లోనూ రెండు అర్ధ శతకాలు బాదాడు. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య గురువారం(ఫిబ్రవరి 6) నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. ఇందులో రోహిత్ శర్మ- శుబ్మన్ గిల్ ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగనున్నారు.చదవండి: ఐసీసీ టోర్నీ తర్వాత రోహిత్ గుడ్బై? కోహ్లికి మాత్రం బీసీసీఐ గ్రీన్సిగ్నల్! -
‘ఒక్క సిరీస్తో తక్కువ చేయవద్దు’
నాగ్పూర్: ఆ్రస్టేలియాతో ఇటీవల జరిగిన బోర్డర్–గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లో భారత్ 1–3 తేడాతో పరాజయం పాలైంది. దాంతో జట్టులో ప్రధాన ఆటగాళ్ల ప్రదర్శనపై పలు రకాల విశ్లేషణలు సాగాయి. సీనియర్ల ఆటపై పలు విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ తరహా విమర్శలను వన్డే టీమ్ వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ తప్పు పట్టాడు. నిజానికి తాము ఆసీస్ గడ్డపై కూడా మెరుగ్గానే ఆడామని, కొద్దిలో ఓటమి పాలయ్యామని అతను వివరించాడు. ‘ఒక్క సిరీస్ ఫలితం మా జట్టు ఫామ్ను చూపించదు. జట్టులోని కీలక ఆటగాళ్లంతా గతంలో ఎన్నో టోర్నీల్లో నిలకడగా రాణించారు. ఆ్రస్టేలియాతో సిరీస్లో మేం అంచనాలకు తగినట్లుగా ఆడలేదనేది వాస్తవం. అయితే మరీ ఘోరంగా విఫలమేమీ కాలేదు. చివరి రోజు బుమ్రా లేకపోవడం దురదృష్టకరం. అతను ఆడితే మేం మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేసేవాళ్లం. ఒక మ్యాచ్ లేదా ఒక రోజు మా ఆటేంటో చెప్పదు. గతంలో అక్కడ రెండుసార్లు సిరీస్ సాధించాం. వన్డే వరల్డ్ కప్లో ఫైనల్ వెళ్లడంతో పాటు టి20 వరల్డ్ కప్ కూడా గెలిచామని మరచి పోవద్దు’ అని గిల్ సమాధానమిచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల్లో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడన్న గిల్... టీమ్లో వరుసగా మార్పులు చేర్పులు సరైంది కాదన్నాడు. ‘విజయ్ హజారే వన్డే ట్రోఫీలో కరుణ్ నాయర్ చాలా గొప్పగా ఆడాడు. అందరూ ఇది అంగీకరించాలి. కానీ ఎవరి స్థానంలో తీసుకుంటారు. మేమంతా కూడా ఇక్కడికి రావడానికి ఎంతో కష్టపడ్డాం. ఇప్పుడు జట్టులో ఉన్నవాళ్లంతా చాలా బాగా ఆడుతున్నారు. మేం వరల్డ్ కప్లో ఒక్కటే మ్యాచ్ ఓడాం. కాబట్టి టీమ్లో అనవసరపు మార్పులు చేయవద్దు. కొంతకాలం ఒకే టీమ్ను కొనసాగించకపోతే జట్టు బలహీనంగా మారుతుంది’ అని గిల్ విశ్లేషించాడు. వైస్ కెప్టెన్ గా తనపై అదనపు బాధ్యత ఉందని... జట్టుకు అవసరమైనప్పుడల్లా రోహిత్కు తన సూచనలు అందిస్తానని గిల్ చెప్పాడు. టి20ల్లో చిత్తుగా ఓడినా... వన్డేల్లో ఇంగ్లండ్ బలమైన జట్టు కాబట్టి గట్టి పోటీ తప్పదని అతను అభిప్రాయపడ్డాడు. -
శతకంతో చెలరేగిన శుబ్మన్ గిల్.. కానీ..
టీమిండియా స్టార్ క్రికెటర్, పంజాబ్ కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill) ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. రంజీ మ్యాచ్లో శతకంతో చెలరేగి తనను తాను నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో గిల్ విఫలమైన సంగతి తెలిసిందే. వరుస వైఫల్యాలుగాయం కారణంగా పెర్త్లో జరిగిన తొలి టెస్టుకు దూరమైన ఈ పంజాబీ బ్యాటర్.. రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చినా పెద్దగా రాణించలేకపోయాడు. అడిలైడ్లో జరిగిన ఈ పింక్ బాల్ టెస్టులో రెండు ఇన్నింగ్స్లో కలిపి 59(31, 28) పరుగులు చేశాడు. అయితే, గబ్బాలో జరిగిన మూడో టెస్టులో గిల్ తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే, నాలుగో టెస్టు జట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. దీంతో బాక్సింగ్ డే టెస్టుకు దూరమైన గిల్.. ఆ తర్వాత సిడ్నీ టెస్టు ఆడినా అందులోనూ విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్లో వరుసగా 20, 13 పరుగులు సాధించాడు.రంజీ బరిలో పంజాబ్ సారథిగాకాగా కంగారూ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్లో ఓవరాల్గా 93 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో శుబ్మన్ గిల్ ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బోర్డు నిబంధనలకు అనుగుణంగా రంజీ ట్రోఫీ బరిలో దిగాడు. తాజా ఎడిషన్ రెండో దశ పోటీల్లో భాగంగా కర్ణాటకతో మ్యాచ్ సందర్భంగా ఈ పంజాబ్ ఓపెనర్ రంగంలోకి దిగాడు.మొదటి ప్రయత్నంలో విఫలంఅయితే, మొదటి ప్రయత్నంలో గిల్కు మరోసారి నిరాశే ఎదురైంది. తొలి ఇన్నింగ్స్లో ఎనిమిది బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి.. అవుటయ్యాడు. కర్ణాటక పేసర్ అభిలాష్ శెట్టి బౌలింగ్లో క్రిష్ణన్ శ్రీజిత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గిల్తో పాటు పంజాబ్ మిగతా బ్యాటర్లు కూడా దారుణంగా విఫలం కావడంతో తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే ఆలౌట్ అయింది.స్మరణ్ డబుల్ సెంచరీఈ క్రమంలో కర్ణాటక స్టార్ రవిచంద్రన్ స్మరణ్ (277 బంతుల్లో 203; 25 ఫోర్లు, 3 సిక్స్లు) డబుల్ సెంచరీతో విజృంభించగా.. జట్టు భారీ స్కోరు సాధించింది. మొదటి ఇన్నింగ్స్లో ఏకంగా 475 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (20), దేవదత్ పడిక్కల్ (27) ఎక్కువసేపు నిలవలేకపోయిన చోట స్మరణ్ చక్కటి ఇన్నింగ్స్తో జట్టుకు భారీ స్కోరు అందించాడు. తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకు ఆలౌటైన పంజాబ్... శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రన్ సింగ్ (1), అన్మోల్ప్రీత్ సింగ్ (14) అవుట్ అయ్యారు.గిల్ సూపర్ ఇన్నింగ్స్.. కానీఈ నేపథ్యంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న శుబ్మన్ గిల్ మూడో రోజు ఆటలో భాగంగా సెంచరీతో చెలరేగాడు. చిన్నస్వామి స్టేడియంలో శనివారం 159 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో పద్నాలుగు ఫోర్లు, మూడు సిక్స్లు ఉన్నాయి. గిల్ ఓవరాల్గా 171 బంతుల్లో 102 పరుగులు సాధించగా.. మిగతా వాళ్ల నుంచి మాత్రం సహకారం అందలేదు. ఈ క్రమంలో 213 పరుగులకు ఆలౌట్ అయిన పంజాబ్.. కర్ణాటక చేతిలో ఇన్నింగ్స్ 207 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది.చదవండి: అతడిని తప్పించి మంచి పనిచేశారు.. ఇదొక విన్నింగ్ టీమ్: డివిలియర్స్Shubman Gill gets his century.. a fine & confident innings #RanjiTrophy #KarvsPun pic.twitter.com/iA1gm6I1Ib— Manuja (@manujaveerappa) January 25, 2025Shubman Gill Celebration after One of best Hundred under pressure in Ranji trophy match against Karnataka 💥📹📷 @Sebashiyun pic.twitter.com/7IMnWegWSy— JassPreet (@JassPreet96) January 25, 2025 -
జైస్వాల్ టీ20 జట్టులో ఉండాలి.. గైక్వాడ్ సంగతేంటి?: అశ్విన్
టీమిండియా చీఫ్ సెలక్టర్ పదవిపై భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు సెలక్షన్ కమిటీ చైర్మన్ అయ్యే అవకాశం వచ్చినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బాధ్యతలు చేపట్టబోనని తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా చీఫ్ సెలక్టర్గా ఉండటం తలనొప్పితో కూడిన పని అని అశూ వ్యాఖ్యానించాడు.ఆచితూచి...భారత్లో ప్రతిభ ఉన్న క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారని.. అయితే, వారిలో ఎవరిని జట్టుకు ఎంపిక చేయాలనేది ఎల్లప్పుడూ క్లిష్టతరంగానే ఉంటుందని అశ్విన్ పేర్కొన్నాడు. ఏదేమైనా ఓ ఆటగాడి వైపు మొగ్గు చూపేటపుడు ప్రదర్శన, ప్రత్యేక నైపుణ్యాల ఆధారంగానే ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు.కాగా ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్లు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి జట్లను ప్రకటించిన సమయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్పై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అతడి గురించే ఎక్కువగా చర్చముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కని సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్కు ఇంగ్లండ్తో వన్డేల్లోనైనా అవకాశం ఇవ్వాల్సిందని కొంతమంది అభిప్రాయపడగా.. సంజూ శాంసన్కు ఈసారీ అన్యాయం జరిగిందంటూ సునిల్ గావస్కర్, మహ్మద్ కైఫ్ వంటి మాజీ క్రికెటర్లు పేర్కొన్నారు.వన్డేల్లో రిషభ్ పంత్ కంటే మెరుగ్గా ఉన్న సంజూ శాంసన్ను వికెట్ కీపర్ కోటాలో చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్ అంతర్జాతీయ టీ20లకి తిరిగి వస్తే.. అభిషేక్ శర్మ- సంజూ శాంసన్ పరిస్థితి ఏమిటి?వీరే కాకుండా ఓపెనింగ్ కోటాలో రుతురాజ్ గైక్వాడ్కు దక్కుతున్న ప్రాధాన్యం ఎంత? దేశవాళీ క్రికెట్ వన్డే ఫార్మాట్లో పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్ను సెలక్టర్లు కనికరించకపోవడానికి కారణం? .. ఇలాంటి చర్చలు భారత క్రికెట్ వర్గాల్లో జరుగుతున్నాయి.జైస్వాల్ టీ20 జట్టులో ఉండాలి.. గైక్వాడ్ సంగతేంటి?ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అంతర్జాతీయ టీ20లలోకి యశస్వి జైస్వాల్ తప్పక తిరిగి రావాలి. అతడు వరల్డ్ కప్ జట్టులో ఉన్న వ్యక్తి. మొదటి ప్రాధాన్యం కలిగిన ఓపెనర్.ఒకవేళ వచ్చే ఐపీఎల్ సీజన్లో శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ భారీగా పరుగులు చేస్తే.. సెలక్టర్లకు తలనొప్పి మరింత ఎక్కువవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్గా లేదంటే.. టీమ్ మేనేజర్గా.. అదీ కాదంటే నిర్ణయాలు తీసుకునే నాయకత్వ బృందంలో ఉండే అవకాశం వస్తే మాత్రం నేను అస్సలు తీసుకోను.ప్రతిభ ఉన్న క్రికెటర్లకు కొదువలేకపోవడం అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే, సెలక్టర్లకు మాత్రం ఇది ఒక సమస్య. ఏదేమైనా.. పోటీలో ఉన్న ఆటగాళ్లందరి ప్రదర్శన, ప్రధాన టోర్నమెంట్లో ఒత్తిడిని ఏమేరకు జయించగలరన్న అంశాల ఆధారంగా ఎంపిక చేస్తే బాగుంటుంది.క్లిష్ట పరిస్థితుల్లోనూ రాణించగలిగే వాళ్లకే పెద్దపీట వేయాలి. ఎవరు గొప్ప ఆటగాడు అన్న ప్రశ్నలకు సమాధానమిచ్చే కొలమానాలు ఏవీ లేవు’’ అని అశ్విన్ పేర్కొన్నాడు. అయితే, అరుదైన నైపుణ్యాలు, ఫామ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఈ మాజీ క్రికెటర్ సూచించాడు. చదవండి: భారత్తో రెండో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు -
రోహిత్, జైస్వాల్, గిల్, పంత్ మాత్రమే కాదు.. రహానే, పుజారా కూడా..!
రంజీ ట్రోఫీలో ఇవాళ (జనవరి 23) టీమిండియా స్టార్ బ్యాటర్లకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. రోహిత్ శర్మ మొదలుకుని.. వెటరన్లు రహానే, పుజారా, హనుమ విహారి వరకు అంతా దారుణంగా విఫలమయ్యారు. ప్రస్తుత భారత టెస్ట్ జట్టు సభ్యులు రోహిత్ (3), జైస్వాల్ (4), శుభ్మన్ గిల్ (4), రిషబ్ పంత్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔట్ కాగా.. భారత వన్డే జట్టు సభ్యుడు శ్రేయస్ అయ్యర్ (11), టీమిండియా భవిష్యత్తు తార రుతురాజ్ గైక్వాడ్ (10) స్వల్ప స్కోర్లకే నిష్క్రమించారు. గతంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడిన భారత క్లాసికల్ బ్యాటర్లు రహానే (12), పుజారా (6), హనుమ విహారి (6) కూడా తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. విధ్వంసకర ఆటగాళ్లు రజత్ పాటిదార్ (0), శివమ్ దూబేకు (0) కూడా ఇవాళ బ్యాడ్ డేనే.టీమిండియా ఆటగాళ్లలో ఇవాళ ఎవరైనా సత్తా చాటారా అంటే అది రవీంద్ర జడేజా మాత్రమే. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో జడ్డూ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. జమ్మూ అండ్ కశ్మీర్తో జరిగిన మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ (51) మెరుపు అర్ద సెంచరీ చేసి తన జట్టు (ముంబై) పరువు నిలబెట్టాడు.ఇవాల్టి నుంచి ప్రారంభంరంజీ ట్రోఫీ 2024-25లో ఇవాల్టి నుంచి (జనవరి 23) సెకెండ్ లెగ్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. తొలి రోజు టీమిండియా ఆటగాళ్లంతా దాదాపుగా తేలిపోయారు. రవీంద్ర జడేజా మినహాయించి చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు.రంజీ ట్రోఫీలో ఇవాల్టి హైలైట్స్- ఢిల్లీపై రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర) ఐదు వికెట్ల ప్రదర్శన- ఉత్తరాఖండ్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 9 వికెట్లు పడగొట్టిన గుజరాత్ బౌలర్ సిద్దార్థ్ దేశాయ్- మేఘాలయతో జరిగిన మ్యాచ్లో ఒడిషా బౌలర్ తపస్ దాస్ 6 వికెట్ల ప్రదర్శన- ఉత్తర్ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసిన బీహార్ ఆటగాడు ఆయుష్ లోహారుకా (101)- జార్ఖండ్తో జరిగిన మ్యాచ్లో పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్న చత్తీస్ఘడ్ ఆటగాడు అనుజ్ తివారి- ఇదే మ్యాచ్లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన జార్ఖండ్ బౌలర్ ఉత్కర్ష్ సింగ్- హర్యానాతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బెంగాల్ బౌలర్ సూరజ్ సింధు జైస్వాల్- చండీఘడ్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసిన తమిళనాడు ఆటగాడు ఆండ్రీ సిద్దార్థ్ (106)- ఇదే మ్యాచ్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన చండీఘడ్ బౌలర్ విషు కశ్యప్ - మధ్యప్రదేశ్తో మ్యాచ్లో 5 వికెట్లు తీసిన కేరళ బౌలర్ నిధీశ్- హిమాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో అజేయ శతకం బాదిన హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (137)- పుదుచ్ఛేరిపై సెంచరీ చేసిన ఆంధ్ర ఓపెనర్ షేక్ రషీద్ (105)- విదర్భపై 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రాజస్థాన్ బౌలర్ ఖలీల్ అహ్మద్ -
ఘోరంగా విఫలమైన రోహిత్, యశస్వి, గిల్, పంత్.. ఐదు వికెట్లతో సత్తా చాటిన జడేజా
రంజీ ట్రోఫీ 2024-25 సెకెండ్ లెగ్ మ్యాచ్లు ఇవాల్టి నుంచి (జనవరి 23) ప్రారంభమయ్యాయి. ఖాళీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లంతా రంజీల్లో తప్పక ఆడాలని బీసీసీఐ కండీషన్ పెట్టిన నేపథ్యంలో హేమాహేమీలంతా బరిలోకి దిగారు. ముంబై తరఫున రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్.. పంజాబ్ తరఫున శుభ్మన్ గిల్.. ఢిల్లీ తరఫున రిషబ్ పంత్.. సౌరాష్ట్ర తరఫున రవీంద్ర జడేజా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.తేలిపోయిన పంత్.. ఐదేసిన జడేజాఎలైట్ గ్రూప్ డిలో భాగంగా ఇవాళ ఢిల్లీ, సౌరాష్ట్ర జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 188 పరుగులకే ఆలౌటైంది. ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన టీమిండియా స్టార్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. పంత్ 10 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఆయుశ్ బదోని (60), యశ్ ధుల్ (44), మయాంక్ గుసెయిన్ (38 నాటౌట్) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడటంతో ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ను టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కకావికలం చేశాడు. జడ్డూ 17.4 ఓవర్లలో 66 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. జడేజాకు మరో జడేజా (ధర్మేంద్రసిన్హ్) తోడయ్యాడు. ఈ జడేజా 19 ఓవర్లలో 63 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్, యువరాజ్ సింగ్ దోడియా తలో వికెట్ దక్కించుకున్నారు. ఢిల్లీ ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు వికెట్లు తీసిన రవీంద్ర జడేజాకు సెకెండ్ ఇన్నింగ్స్లో హ్యాట్రిక్ తీసే అవకాశం ఉంటుంది. 36 ఏళ్ల జడ్డూకు ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇది 35వ ఐదు వికెట్ల ఘనత.పేలవ ఫామ్ను కొనసాగించిన రోహిత్.. నిరాశపరిచిన జైస్వాల్, శ్రేయస్, దూబేఎలైట్ గ్రూప్-ఏలో భాగంగా రోహిత్ శర్మ, జైస్వాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై.. జమ్మూ అండ్ కశ్మీర్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై.. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్ల ధాటికి విలవిలలాడిపోయింది. ముంబై తొలి ఇన్నింగ్స్లో 33.2 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన రంజీల్లోనూ కొనసాగింది. హిట్మ్యాన్ కేవలం 3 పరుగులకే వెనుదిరిగాడు. మరో టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ 4 పరుగులకే ఔటయ్యాడు. టీమిండియా పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్లు శ్రేయస్ అయ్యర్ (11), శివమ్ దూబే (0) నిరాశపరిచారు. ముంబై కెప్టెన్, టీమిండియా ఆటగాడు అజింక్య రహానే (12) కూడా తేలిపోయాడు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబైను మరో టీమిండియా ఆటగాడు శార్దూల్ ఠాకూర్ (51) గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. శార్దూల్ హాఫ్ సెంచరీ పుణ్యమా అని ముంబై 100 పరుగుల మార్కును దాటగలిగింది. శార్దూల్కు తనుశ్ కోటియన్ (26) కాసేపు సహకరించాడు. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్లు యుద్వీర్ సింగ్ చరక్ (8.2-2-31-4), ఉమర్ నజీర్ మిర్ (11-2-41-4), ఆకిబ్ నబీ దార్ (13-3-36-2) స్టార్లతో నిండిన ముంబై బ్యాటింగ్ లైనప్కు బెంబేలెత్తించారు.తీరు మార్చుకోని గిల్గిల్ వైఫల్యాల పరంపర రంజీల్లోనూ కొనసాగుతుంది. బీజీటీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన గిల్.. కర్ణాటకతో జరుగుతున్న రంజీ మ్యాచ్లోనూ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 55 పరుగులకే కుప్పకూలింది. కర్ణాటక బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పంజాబ్ ఇన్నింగ్స్ను మట్టుబెట్టారు. వి కౌశిక్ 4, అభిలాశ్ షెట్టి 3, ప్రసిద్ద్ కృష్ణ 2, యశోవర్దన్ పరంతాప్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో పంజాబ్ సారధిగా వ్యవహరిస్తున్న గిల్ కేవలం 4 పరుగులకే ఔటయ్యాడు. పంజాబ్ ఇన్నింగ్స్లో రమన్దీప్సింగ్ (16), మార్కండే (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. -
Shubman Gill: అక్కడే కాదు.. ఇక్కడా ఫెయిల్!.. సింగిల్ డిజిట్ స్కోర్
దేశవాళీ క్రికెట్ పునరాగమనంలో టీమిండియా స్టార్ శుబ్మన్ గిల్(Shubman Gill) పూర్తిగా నిరాశపరిచాడు. పంజాబ్(Punjab) తరఫున బరిలోకి దిగిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. కాగా గత కొంతకాలంగా భారత ప్రధాన ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుబ్మన్ గిల్ తదితరులు టెస్టుల్లో విఫలమవుతున్న విషయం తెలిసిందే.తారలు దిగి వచ్చారుఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు ప్రతి ఒక్కరు దేశవాళీ క్రికెట్ ఆడాలన్న నిబంధనలు కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ముంబై తరఫున.. రిషభ్ పంత్ ఢిల్లీ తరఫున.. శుబ్మన్ గిల్ పంజాబ్ తరఫున రంజీ ట్రోఫీ(Ranji Trophy) సెకండ్ లెగ్ బరిలో దిగారు. కోహ్లి మాత్రం మెడనొప్పి వల్ల ఢిల్లీ జట్టుకు దూరంగా ఉన్నాడుపంజాబ్ ఓపెనర్గా గిల్ విఫలంఇక బెంగళూరు వేదికగా కర్ణాటక- పంజాబ్ మధ్య గురువారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన కర్ణాటక.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ప్రభ్సిమ్రన్ సింగ్తో కలిసి శుబ్మన్ గిల్ పంజాబ్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే, కర్ణాటక బౌలర్ అభిలాష్ శెట్టి వరుస ఓవర్లలో ఓపెనింగ్ జోడీని విడగొట్టాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ బౌలింగ్లో తొలి వికెట్గా గిల్ వెనుదిరిగాడు.కర్ణాటక పేసర్ల జోరుమొత్తంగా ఎనిమిది బంతులు ఎదుర్కొన్న గిల్.. ఒకే ఒక్క ఫోర్ కొట్టి నిష్క్రమించాడు. క్రిష్ణన్ శ్రీజిత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరోవైపు.. ప్రభ్సిమ్రన్ సింగ్ 28 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో ఆరు పరుగులు చేసి.. అభిలాష్ శెట్టి బౌలింగ్లో అనీశ్ కేవీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక మరో పేసర్ వాసుకి కౌశిక్ కూడాపంజాబ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.వన్డౌన్ బ్యాటర్ బ్యాటర్ ఫుఖ్రాజ్ మన్(1)తో పాటు.. నాలుగో స్థానంలో వచ్చిన అన్మోల్ప్రీత్ సింగ్(0)ను సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేర్చాడు. ఈ క్రమంలో ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన 10 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే చేసి.. కష్టాల్లో కూరుకుపోయింది.బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో గిల్ ఫ్లాఫ్ షోకాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో శుబ్మన్ గిల్ విఫలమైన విషయం తెలిసిందే. గాయం వల్ల తొలి టెస్టుకు దూరమైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చాడు. అడిలైడ్లో జరిగిన ఈ మ్యాచ్లో గిల్ రెండు ఇన్నింగ్స్లో వరుసగా 31, 28 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.అయితే, గబ్బా మైదానంలో జరిగిన మూడో టెస్టులో మాత్రం ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్టుకు దూరంగా ఉన్న ఈ వన్డౌన్ బ్యాటర్.. ఆఖరిదైన సిడ్నీ టెస్టులో 20, 13 పరుగులు చేశాడు. మొత్తంగా ఆస్ట్రేలియాతో ఈ ఐదు టెస్టుల సిరీస్లో శుబ్మన్ గిల్ కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్- జైస్వాల్ కూడా ఫెయిల్ఇందులో ఒక్క అర్ధ శతకం కూడా లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రంజీ బరిలో దిగి ఫామ్లోకి రావాలని ఆశించిన గిల్కు మొదటి ప్రయత్నంలోనే చుక్కెదురైంది. కర్ణాటకతో మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లోనైనా అతడు రాణిస్తాడేమో చూడాలి! మరోవైపు.. జమ్మూ- కశ్మీర్తో మ్యాచ్లో ముంబై ఓపెనర్లు యశస్వి జైస్వాల్- రోహిత్ శర్మ కూడా ఫెయిలయ్యారు. జైస్వాల్ నాలుగు, రోహిత్ మూడు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యారు. చదవండి: NADA: బుమ్రా, సూర్య, పంత్, సంజూ శాంసన్.. ఇంకా.. -
‘గిల్ కంటే బెటర్.. టీమిండియా భవిష్య కెప్టెన్గా అతడికే నా ఓటు’
టీమిండియా స్టార్ శుబ్మన్ గిల్ను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ(Basit Ali) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడిపై భారీ అంచనాలు పెట్టుకోవడం సరికాదని.. పాకిస్తాన్పై శతకం బాదినప్పుడు మాత్రమే గిల్ ప్రశంసలకు అర్హుడని పేర్కొన్నాడు. నిజానికి గిల్ కంటే.. యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ టెక్నిక్ బాగుంటుందన్నాడు. అదే విధంగా.. భారత జట్టు భవిష్య కెప్టెన్(India Future Captain) ఎవరైతే బెటర్ అన్న అంశం గురించి కూడా బసిత్ అలీ ఈ సందర్భంగా కామెంట్ చేశాడు. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్ మొదలుకానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దుబాయ్ స్టేడియంలో బంగ్లాదేశ్తో మ్యాచ్తో రోహిత్ సేన ఫిబ్రవరి 20న తమ వేట మొదలుపెట్టనుంది. ఈ క్రమంలో.. ఈ ఐసీసీ వన్డే ఫార్మాట్ ఈవెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ఈ టీమ్కు శుబ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది.గిల్ కంటే జైస్వాల్ బెటర్అంతేకాదు.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ను తొలిసారిగా వన్డే జట్టులోకి తీసుకుంది. ఇక వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్తో పాటు రిషభ్ పంత్కు కూడా బీసీసీఐ చోటిచ్చింది. ఈ నేపథ్యంలో గిల్, జైస్వాల్, పంత్ పేర్లను ప్రస్తావిస్తూ.. చాంపియన్స్ ట్రోఫీలో తుదిజట్టు కూర్పు గురించి బసిత్ అలీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘గిల్ కంటే జైస్వాల్ బిగ్ ప్లేయర్. గిల్ ఓవర్రేటెడ్. ఒకవేళ అతడు పాకిస్తాన్ మీద సెంచరీ కొడితే అప్పుడు అతడిని మనం ప్రశంసించవచ్చు. అయినా సరే.. నా దృష్టిలో గిల్ కంటే.. జైస్వాల్ మెరుగైన ఆటగాడు. అతడి టెక్నిక్ బాగుంటుంది. ప్రతి విషయంలోనూ జైస్వాలే బెటర్.టీమిండియా భవిష్య కెప్టెన్గా అతడికే నా ఓటుఇక టీమిండియా భవిష్య కెప్టెన్గా నా ఆప్షన్ రిషభ్ పంత్(Rishabh Pant). అతడికే నా ఓటు. కెప్టెన్గా శుబ్మన్ గిల్కు అవకాశాలు ఉండవచ్చు. అయితే, రిషభ్ పంత్ నాణ్యమైన నైపుణ్యాలున్న ఆటగాడు. అతడిని కెప్టెన్ను చేస్తే వ్యక్తిగత ప్రదర్శనతో పాటు.. సారథిగానూ అదరగొట్టగలడు. టీమిండియాకు అతడికి అవసరం ఉంది’’ అని బసిత్ అలీ పేర్కొన్నాడు.ఓపెనర్గా జైసూ, మిడిల్ ఆర్డర్లో పంత్ఇక చాంపియన్స్ ట్రోఫీలో భారత తుదిజట్టు గురించి మాట్లాడుతూ.. ‘‘ఈసారి టీమిండియా ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాటర్లతో బరిలోకి దిగితే మంచిది. ఒకరు ఓపెనర్(జైస్వాల్)గా.. మరొకరు మిడిలార్డర్(పంత్)లో రావాలి. ఏదేమైనా జైస్వాల్ లేకుండా ప్లేయింగ్ ఎలెవన్ ఉండదనే అనుకుంటున్నా.అదే విధంగా.. రిషభ్ పంత్ కూడా తుదిజట్టులో ఉంటాడు. మైదానం నలుమూలలా షాట్లు బాదగల సత్తా అతడి సొంతం. కేఎల్ రాహుల్కు అలాంటి నైపుణ్యాలు లేవు’’ అని బసిత్ అలీ అభిప్రాయపడ్డాడు. కాగా టెస్టు, టీ20లో టీమిండియా తరఫున రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.అతడి వన్డే గణాంకాలు మాత్రం అంతంత మాత్రమేఅయితే, వన్డేల్లో మాత్రం రోహిత్- గిల్ భారత జట్టు ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారు. మరి.. చాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్-వైస్ కెప్టెన్ జోడీని విడదీసి.. జైస్వాల్ను ఓపెనర్గా పంపుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో బసిత్ అలీ మాత్రం గిల్ను కాదని.. ఇంత వరకు వన్డేల్లో అరంగేట్రం చేయని జైసూకు ఓటేయడం గమనార్హం.ఇక వన్డేల్లో గిల్కు మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 47 మ్యాచ్లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 2328 పరుగులు చేశాడు. ఇందులో ఆరు శతకాలతో పాటు ఓ డబుల్ సెంచరీ ఉండటం విశేషం. మరోవైపు.. పంత్ వన్డే గణాంకాలు మాత్రం అంతంత మాత్రమే. 31 వన్డేల్లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 871 రన్స్ మాత్రమే చేశాడు.చదవండి: CT 2025: భారత జట్టు ప్రకటన.. సిరాజ్కు దక్కని చోటు.. నితీశ్ రెడ్డికి ఛాన్స్! -
కరుణ్ నాయర్ను ఎలా సెలక్ట్ చేయగలం?: అగార్కర్
విజయ్ హజారే ట్రోఫీలో దుమ్ములేపుతున్న కరుణ్ నాయర్(Karun Nair)ను టీమిండియా సెలక్టర్లు పట్టించుకోలేదు. దేశవాళీ వన్డే టోర్నమెంట్లో సత్తా చాటుతున్నప్పటికీ అతడిని కనికరించలేదు. కాగా విదర్భ కెప్టెన్గా బరిలోకి దిగిన కరుణ్ నాయర్ సూపర్ ఫామ్లో ఉన్న విషయం తెలిసిందే.ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడి ఐదు శతకాల సాయంతో కరుణ్ నాయర్ ఏకంగా 752 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో అతడిపై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. ఇదొక అసాధారణ ప్రదర్శన అంటూ టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్(sachin Tendulkar) కూడా కరుణ్ నాయర్ను అభినందించాడు.ఇక స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఓ అడుగు ముందుకేసి అతడికి ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో పాటు... చాంపియన్స్ ట్రోఫీ జట్టు(Champions Trophy Squad)లోనూ చోటివ్వాలని సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ అజిత్ అగార్కర్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ప్రకటించిన జట్టులో కరుణ్ నాయర్కు మాత్రం చోటు దక్కలేదు.కరుణ్ నాయర్ను ఎలా సెలక్ట్ చేయగలం?ఈ విషయం గురించి అగార్కర్కు మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు. నిజంగానే అదొక ప్రత్యేకమైన, అద్భుతమైన ప్రదర్శన. దాని గురించి మా మధ్య చర్చ జరిగింది.అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అతడికి జట్టులో చోటు ఇవ్వడం కష్టం. నలభైలకు దగ్గరపడుతున్న వాళ్లను మళ్లీ తీసుకోలేం. అయినా.. జట్టులో పదిహేను మంది సభ్యులకు మాత్రమే చోటు ఉంది. అలాంటపుడు ప్రతి ఒక్కరిని ఇందులో ఇరికించలేము.అయితే, అలాంటి ప్రదర్శనలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. సదరు ఆటగాడి గురించి చర్చ జరుగుతుంది. కొంతమంది ఫామ్లేమి, గాయాల వల్ల కూడా చర్చనీయాంశంగా మారతారు’’ అని అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. కాగా 33 ఏళ్ల కరుణ్ నాయర్ 2016లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఆ మరుసటి ఏడాదే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశాడు. ఇంత వరకు మళ్లీ భారత జట్టులో పునరాగమనం చేయలేకపోయాడు.ఇక రాజస్తాన్లో జన్మించిన కరుణ్ నాయర్.. దేశవాళీ క్రికెట్లో గతంలో కర్ణాటకకు ఆడాడు. గతేడాది నుంచి విదర్భకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో సారథిగా, బ్యాటర్గా ఆకట్టుకుంటూ విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ తొలిసారి ఫైనల్కు చేరేలా చేశాడు. అందుకే వాళ్లకు వైస్ కెప్టెన్లుగా అవకాశంఇంగ్లండ్తో టీ20 సిరీస్కు అక్షర్ పటేల్, వన్డే సిరీస్కు శుబ్మన్ గిల్ వైస్ కెప్టెన్లుగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ విషయంపై శనివారం అగార్కర్ స్పందిస్తూ.. ‘‘డ్రెస్సింగ్ రూమ్ నుంచి మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. అయినా ప్రతి ఒక్కరూ కెప్టెన్ లేదంటే వైస్ కెప్టెన్ ఆప్షన్ కాబోరు. కొద్ది మందికి మాత్రమే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అలాంటి వారిపైనే మేము దృష్టి సారిస్తాం’’ అని పేర్కొన్నాడు.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య జనవరి 22- ఫిబ్రవరి 12 వరకు ఐదు టీ20, మూడు వన్డేలు జరుగుతాయి. అనంతరం.. చాంపియన్స్ ట్రోఫీతో టీమిండియా బిజీ కానుంది. పాకిస్తాన్- యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ జరుగుతుంది.చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే -
CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వన్డే ఫార్మాట్ టోర్నీలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఓ ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ను పంపించాలని సూచించాడు. తద్వారా శుబ్మన్ గిల్పై వేటు వేయాలని పరోక్షంగా సెలక్టర్లకు సలహా ఇచ్చాడు.దుబాయ్ వేదికగాపాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) మొదలుకానుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తటస్థ వేదికైన దుబాయ్(Dubai)లో భారత జట్టు తమ మ్యాచ్లు ఆడనుంది.ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్లో టీమిండియా ఫిబ్రవరి 20న తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 13 డెడ్లైన్ విధించగా.. బీసీసీఐ మాత్రం మినహాయింపు కోరింది. జనవరి 17 నాటికి తమ జట్టును ప్రకటిస్తామని పేర్కొన్నప్పటికీ.. ఇంత వరకు ఆ వివరాలు వెల్లడించలేదు.అతడిని సెలక్ట్ చేయండిఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ హిందుస్తాన్ టైమ్స్తో ఈ విషయం గురించి మాట్లాడాడు. ‘‘సెలక్టర్లకు నాదో సలహా. యశస్వి జైస్వాల్ను 50 ఓవర్ల ఫార్మాట్లో కూడా ఆడించండి. అంతర్జాతీయ టీ20, వన్డేల్లో అతడు బ్యాటింగ్ చేసే విధానం అద్బుతం. వన్డే ఫార్మాట్కు కూడా అతడు సరిగ్గా సరిపోతాడు. కచ్చితంగా అతడిని టీమిండియా వన్డే జట్టులోకి తీసుకోవాలి’’ అని వీరూ భాయ్ పేర్కొన్నాడు.పంత్ వద్దు: భజ్జీమరోవైపు.. టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టుపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్గా తన మొదటి ఓటు సంజూ శాంసన్కే వేస్తానని కుండబద్దలు కొట్టాడు. కాగా ఓపెనింగ్ జోడీగా సెహ్వాగ్ రోహిత్- జైస్వాల్ల పేర్లను సూచించగా.. భజ్జీ రిషభ్ పంత్ను కాదని సంజూ శాంసన్కే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించడం విశేషం.కాగా ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ టెస్టు, టీ20లలో టీమిండియా ఓపెనర్గా పాతుకుపోయాడు. అరంగేట్రంలోనే టెస్టుల్లో భారీ శతకం(171)తో మెరిసిన జైసూ ఖాతాలో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.ఇక ఇప్పటి వరకు ఓవరాల్గా భారత్ తరఫున 19 టెస్టులు, 23 టీ20 మ్యాచ్లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 1798, 723 పరుగులు చేశాడు. అయితే, జైస్వాల్కు ఇంత వరకు వన్డేల్లో ఆడే అవకాశం మాత్రం రాలేదు. రోహిత్ శర్మతో కలిసి శుబ్మన్ గిల్ యాభై ఓవర్ల ఫార్మాట్లో ఓపెనర్గా బరిలోకి దిగుతున్నాడు.జైసూ భేష్అయితే, ఇటీవలి కాలంలో గిల్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ యశస్వి జైస్వాల్ పేరు చెప్పడం గమనార్హం. కాగా లిస్ట్-‘ఎ’ క్రికెట్లో జైసూ గణాంకాలు మెరుగ్గానే ఉన్నాయి. కేవలం 32 మ్యాచ్లలోనే అతడు ఐదు సెంచరీలు, ఏడు అర్ధ శతకాలు, ఓ డబుల్ సెంచరీ సాయంతో 1511 పరుగులు సాధించాడు. చదవండి: ILT20 2025: చరిత్రపుటల్లోకెక్కిన పోలార్డ్ -
నేను ముందే చెప్పా.. అతడిపై అంచనాలు పెట్టుకోవడం వేస్ట్: శ్రీకాంత్
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ను 3-1 తేడాతో టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రధానంగా బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే పదేళ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియాకు భారత్ సమర్పించుకుంది. ఈ సిరీస్లో టీమిండియా యువ ఆటగాడు శుబ్మన్ గిల్ సైతం తీవ్ర నిరాశపరిచాడు. ఐదు ఇన్నింగ్స్ల్లో 18.60 సగటుతో కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడు.అందులో 31 పరుగులు అతడి అత్యధిక స్కోర్గా ఉంది. సొంతగడ్డపై బ్యాట్ ఝూలిపించే శబ్మన్.. విదేశాల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. 2021లో అరంగేట్రం చేసినప్పటి నుంచి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్లలో 18 ఇన్నింగ్స్లు ఆడాడు. అయితే ఈ ఇన్నింగ్స్లలో అతడి అత్యధిక స్కోర్ కేవలం 36 పరుగులు మాత్రమే కావడం గమానర్హం.ఈ క్రమంలో గిల్పై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. గిల్ ఒక ఓవర్రేటెడ్ క్రికెటర్ అని శ్రీకాంత్ ఫైరయ్యాడు."శుబ్మన్ గిల్ ఒక ఓవర్రేటెడ్ క్రికెటర్. అతడిపై ఎక్కువగా అంచనాలు పెట్టుకోవద్దని నేను ముందు నుంచి చెబుతునే ఉన్నా. కానీ ఎవరూ నా మాట వినలేదు. అతడిని ఆకాశానికెత్తేశారు. గిల్కు చాలా అవకాశాలు లభిస్తున్నాయి.పది ఛాన్స్లలో వరుసగా తొమ్మిది మ్యాచ్ల్లో విఫలమై ఆఖరి మ్యాచ్లో పరుగులు సాధిస్తున్నాడు. దీంతో అతడు జట్టులో తన స్ధానాన్ని పదిలం చేసుకుంటున్నాడు. అంతే తప్ప స్పెషల్ టాలెంట్ ఏమీ లేదు.భారత పిచ్లపై ఎవరైనా పరుగులు సాధిస్తారు. సేనా దేశాల్లో పరుగులు సాధించడం గొప్ప విషయం. ఈ విషయంలో కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు తమను తాము నిరూపించుకున్నారు అని ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ పేర్కొన్నాడు.చదవండి: ఆసీస్ గడ్డపై ఎంతో నేర్చుకున్నాను.. మళ్లీ బలంగా పైకి లేస్తాం: జైస్వాల్ -
CT 2025: శుబ్మన్ గిల్పై ‘వేటు’?.. అతడికి ప్రమోషన్?
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్లో చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది టీమిండియా. ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యం కారణంగా దాదాపు దశాబ్దం తర్వాత ఈ టెస్టు సిరీస్ను ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. కంగారూ గడ్డపై 3-1తో ఓడి రిక్తహస్తాలతో స్వదేశానికి పయనమైంది.బౌలర్గా, కెప్టెన్గా రాణించిఇక ఆసీస్తో ఈ ప్రతిష్టాత్మక సిరీస్లో టీమిండియా కనీసం ఒక్క మ్యాచ్లోనైనా గెలిచిందంటే అందుకు కారణం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)నే. పెర్త్లో జరిగిన తొలి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గైర్హాజరీలో ఈ ఫాస్ట్బౌలర్ భారత జట్టును ముందుకు నడిపించాడు. పేసర్గా, కెప్టెన్గా రాణించి ఆసీస్ గడ్డపై టీమిండియాకు అతిపెద్ద టెస్టు విజయం(295 పరుగుల తేడాతో) అందించాడు.వెన్నునొప్పి వేధించినాఅయితే, ఆ తర్వాత రోహిత్ శర్మ తిరిగి వచ్చినా టీమిండియా ఇదే జోరును కొనసాగించలేకపోయింది. బ్యాటర్గా, సారథిగా రోహిత్ విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఆఖరిదైన ఐదో టెస్టు నుంచి అతడు స్వచ్చందంగా తప్పుకోగా.. బుమ్రా మరోసారి పగ్గాలు చేపట్టాడు. వెన్నునొప్పి వేధించినా జట్టును గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశాడు.కానీ సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్టులో టీమిండియాకు భంగపాటు తప్పలేదు. మ్యాచ్తో పాటు సిరీస్లోనూ ఓటమిని చవిచూసింది. బుమ్రా లేకపోయి ఉంటే.. టీమిండియా ఆసీస్ చేతిలో 5-0తో వైట్వాష్కు గురయ్యేదని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడంటే.. ఈ సిరీస్లో అతడి ప్రాధాన్యం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు.పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్గా?ఈ నేపథ్యంలో ఇప్పటికే పేస్ దళ నాయకుడిగా ఉన్న బుమ్రా.. త్వరలోనే పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్గా పగ్గాలు చేపట్టనున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మరో ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. వన్డేల్లోనూ రోహిత్ వారసుడిగా బుమ్రా ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గిల్పై వేటు.. బుమ్రాకు ప్రమోషన్?ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా రోహిత్ శర్మకు బుమ్రా డిప్యూటీగా వ్యవహరించనున్నట్లు సమాచారం. కాగా శ్రీలంక పర్యటన 2024 సందర్భంగా వన్డే, టీ20లలో యువ బ్యాటర్ శుబ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). అయితే, ఏదేని కారణాల వల్ల రోహిత్ దూరమైతే.. గిల్ ఇప్పటికప్పుడు కెప్టెన్గా వ్యవహరించే పరిణతి సాధించలేదని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అందుకే బుమ్రాను వైస్ కెప్టెన్గా ఎంపిక చేయాలనే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఇదిలా ఉంటే.. సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ శర్మ తప్పుకొన్న తర్వాత.. వన్డే కెప్టెన్సీకి అతడు దూరం కానున్నాడనే వదంతులు వచ్చాయి. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించనున్నారనే ఊహాగానాలు వినిపించాయి.ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్లుకాగా చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడనుంది. ఇందులో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేల్లో ఇంగ్లండ్తో తలపడనుంది. అయితే, ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు బుమ్రా దూరంగా ఉండనున్నట్లు సమాచారం. వెన్నునొప్పి కారణంగా అతడు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుంది. పాకిస్తాన్ ఈ మెగా వన్డే టోర్నీకి ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా మ్యాచ్లు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్లో జరుగుతాయి. హైవోల్టేజీ పోరు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.చదవండి: 13 నిమిషాల్లోనే ఖేల్ ఖతం.. రషీద్ ఖాన్ మాయాజాలం.. అఫ్గన్ సరికొత్త చరిత్ర -
స్మిత్, లబుషేన్ మైండ్గేమ్.. ఇచ్చిపడేసిన గిల్! కానీ మనోడికే..
సిడ్నీ టెస్టులోనూ టీమిండియా బ్యాటింగ్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా బౌలర్ల దూకుడు కారణంగా భారత ఓపెనర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. కేఎల్ రాహుల్ 14 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో నిష్క్రమించాడు.పట్టుదలగా నిలబడ్డ గిల్, కోహ్లిఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 26 బంతుల్లో పది పరుగులు చేసి స్కాట్ బోలాండ్కు వికెట్ సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ శుబ్మన్ గిల్(Shubman Gill).. నాలుగో స్థానంలో వచ్చిన విరాట్ కోహ్లి(Virat Kohli)తో కలిసి ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. అయితే, కంగారూ జట్టు స్పిన్నర్ నాథన్ లియాన్ ఈ జోడీని విడదీశాడు. మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న గిల్ రెండు ఫోర్ల సాయంతో 20 పరుగులు చేసి బోలాండ్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.నిజానికి తన ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు పన్నిన వ్యూహంలో చిక్కిన గిల్.. ఒత్తిడిలోనే వికెట్ కోల్పోయాడని చెప్పవచ్చు. భారత తొలి ఇన్నింగ్స్ 25వ ఓవర్ను బోలాండ్ వేశాడు. ఐదో బంతికి షాట్ ఆడేందుకు ప్రయత్నించి గిల్ విఫలమయ్యాడు. గిల్ను స్లెడ్జ్ చేసిన స్మిత్, లబుషేన్అనంతరం గిల్ పిచ్ మధ్యలోకి వచ్చి బ్యాట్ను టాప్ చేస్తూ కాస్త అసహనం ప్రదర్శించాడు. ఈ క్రమంలో మార్నస్ లబుషేన్.. ఈజీ.. ఈజీగానే క్యాచ్ పట్టేయవచ్చు అని పేర్కొన్నాడు. ఇందుకు స్టీవ్ స్మిత్ స్పందిస్తూ.. ‘బుల్షిట్.. ఆట మొదలుపెడితే మంచిది’ అని గిల్ను ఉద్దేశించి అన్నాడు. ఇచ్చి పడేసిన గిల్!ఇందుకు బదులిస్తూ.. ‘‘నీ టైమ్ వచ్చినపుడు చూసుకో స్మితీ.. నీ గురించి ఇప్పుడు ఎవరూ ఏమీ మాట్లాడలేదే’’ అని గిల్ పేర్కొనగా.. ‘‘నువ్వైతే ఆడు’’ అని స్మిత్ గిల్తో అన్నాడు.కానీ మనోడికే భంగపాటుదీంతో 25వ ఓవర్లో ఆఖరి బంతిని ఎదుర్కొనేందుకు గిల్ సిద్ధం కాగా.. అప్పటికే మాటలు మొదలుపెట్టిన లబుషేన్.. ‘‘స్మిత్.. నీ టైమ్ వచ్చింది చూడు’’ అని అరిచాడు. ‘‘నేను అలాగే చేస్తాను చూడు’’ అని చెప్పిన స్మిత్.. గిల్ ఇచ్చిన క్యాచ్ను ఒడిసిపట్టాడు. అలా శుబ్మన్ గిల్ ఇన్నింగ్స్కు తెరపడింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గిల్ అవుటైన కాసేపటికే కోహ్లి(69 బంతుల్లో 17) కూడా నిష్క్రమించగా.. రిషభ్ పంత్(40), రవీంద్ర జడేజా(26) కాసేపు పోరాటం చేశారు. బుమ్రా మెరుపులుఆఖర్లో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మెరుపు ఇన్నింగ్స్(17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్) కారణంగా టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో పేసర్లు బోలాండ్ నాలుగు, స్టార్క్ మూడు, కమిన్స్ రెండు వికెట్లు దక్కించుకోగా.. స్పిన్నర్ నాథన్ లియాన్ ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే.. వరుస వైఫల్యాల నేపథ్యంలో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆసీస్తో ఆఖరిదైన ఐదో టెస్టుకు దూరంగా ఉన్నాడు. అతడి స్థానంలో బుమ్రా సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.చదవండి: CT 2025: వన్డే కెప్టెన్గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే! View this post on Instagram A post shared by Fox Cricket (@foxcricket) -
CT 2025: వన్డే కెప్టెన్గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథి?
ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టుకు రోహిత్ శర్మ(Rohit Sharma) దూరమయ్యాడు. విశ్రాంతి పేరిట తనంత తానే తుదిజట్టు నుంచి తప్పుకొన్నాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు రోహిత్ నిర్ణయం గొప్పదని కొనియాడుతున్నారు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా కెప్టెన్ బెంచ్కే పరిమితం కావడం అతడి పరిణతికి నిదర్శమని పేర్కొంటున్నారు.ఇదిలా ఉంటే.. ఇప్పటికే రోహిత్ శర్మ టెస్టు రిటైర్మెంట్పై క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. సిడ్నీ టెస్టు తర్వాత అతడు తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర వార్త తెర మీదకు వచ్చింది. టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ(ODI Captaincy) నుంచి వైదొలగనున్నాడనే వదంతులు వస్తున్నాయి.చివరగా లంక పర్యటనలో.. పరాభవంతో ఇంటికికాగా గతేడాది టీమిండియా ఒకే ఒక్క ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆడింది. శ్రీలంక పర్యటనలో భాగంగా రోహిత్ సేన ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు ఆడి.. 0-2తో సిరీస్ను కోల్పోయింది. తద్వారా రెండున్నర దశాబ్దాల తర్వాత లంకకు వన్డే సిరీస్ సమర్పించుకున్న తొలి భారత జట్టుగా నిలిచింది. అంతేకాదు.. 45 ఏళ్ల తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్లో ఒక్క వన్డే కూడా గెలవని జట్టుగానూ అపఖ్యాతి మూటగట్టుకుంది రోహిత్ సేన.రోహిత్పై వేటు.. చాంపియన్స్ ట్రోఫీ నాటికి కొత్త సారథిఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) మొదలుకానుంది. ఈ మెగా వన్డే టోర్నీలో టీమిండియా మ్యాచ్లు తటస్థ వేదికైన దుబాయ్లో జరుగనున్నాయి. అయితే, ఈ ఐసీసీ ఈవెంట్ కంటే ముందు భారత్ ఒకే ఒక్క ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆడనుంది. స్వదేశంలో ఇంగ్లండ్తో మూడు మ్యాచ్లలో తలపడనుంది.ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నాయకత్వం వన్డే కెప్టెన్సీ మార్పు అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెస్టుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూ బలవంతపు రిటైర్మెంట్కు చేరువైన రోహిత్.. ఇలాంటి మానసిక స్థితిలో ఇక జట్టును ముందుకు నడిపించేందుకు సిద్ధంగా లేడని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.రేసులో ముందుంది అతడేశ్రీలంక పర్యటన తాలూకూ చేదు అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని.. వన్డే పగ్గాలను వేరొకరికి అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వన్డే కెప్టెన్సీ రేసులో ప్రధానంగా హార్దిక్ పాండ్యా(Hardik Pandya), శుబ్మన్ గిల్, రిషభ్ పంత్ పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే, పాండ్యా వైపే మేనేజ్మెంట్ మొగ్గుచూపుతున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు మైఖేల్ సైట్ పేర్కొంది.‘‘గిల్ ఇంకా పూర్తి స్థాయిలో పరిణతి చెందలేదు. అతడు నాయకుడిగా ఎదగడానికి ఇంకాస్త సమయం పడుతుంది. ఇక సూర్యకుమార్ యాదవ్ వన్డే గణాంకాలు అంత గొప్పగా లేవు.. ఈ టీ20 కెప్టెన్ పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పంత్ కంటే కూడా హార్దిక్ పాండ్యానే సరైన కెప్టెన్ అనే భావన నాయకత్వంలో ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నట్లు తెలిపింది.వరుస వైఫల్యాలతో సతమతంకాగా టెస్టుల్లో గత కొంతకాలంగా రోహిత్ శర్మ కెప్టెన్గా, బ్యాటర్గా విఫలమవుతున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్తో సొంతగడ్డపై 3-0తో రోహిత్ సేన వైట్వాష్ కాగా.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ నిరాశపరుస్తోంది. పెర్త్లో బుమ్రా సారథ్యంలో గెలిచిన భారత జట్టు.. రెండో టెస్టు నుంచి రోహిత్ కెప్టెన్సీలో విఫలమైంది.అడిలైడ్లో పింక్ బాల్ టెస్టులో ఓడి.. బ్రిస్బేన్లో వర్షం వల్ల డ్రాతో గట్టెక్కింది. మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టులో 184 పరుగుల భారీ తేడాతో ఆసీస్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడింది. ఈ సిరీస్లో రోహిత్ ఐదు ఇన్నింగ్స్ ఆడి మొత్తంగా కేవలం 31 పరుగులే చేశాడు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగా ఆసీస్తో ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి విశ్రాంతి పేరిట తనంతట తానే స్వయంగా తప్పుకొన్నాడు. చదవండి: IND vs AUS: మళ్లీ అదే తప్పు చేసిన విరాట్ కోహ్లి.. వీడియో వైరల్ -
సిడ్నీ టెస్టుకు భారత తుదిజట్టు ఇదే! అతడి ఎంట్రీ ఫిక్స్!
ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు నేపథ్యంలో భారత తుదిజట్టులో రెండు మార్పులు చేటుచేసుకున్నట్లు సమాచారం. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) విశ్రాంతి పేరిట ఈ మ్యాచ్కు దూరంగా ఉండాలని భావించగా.. శుబ్మన్ గిల్కు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. ఆకాశ్ దీప్ స్థానంలో యువ పేసర్మరోవైపు.. ఆకాశ్ దీప్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. ఓ యువ పేసర్ ఏడాది కాలం తర్వాత పునరాగమనం చేయనున్నట్లు సమాచారం. అదే విధంగా రోహిత్ శర్మ గైర్హాజరీలో ప్రధాన పేసర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత నాలుగు పర్యాయాలుగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత జట్టు.. ఈసారి మాత్రం అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోతోంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపుతోంది. కోహ్లి, రోహిత్ విఫలంఆసీస్తో ఐదు టెస్టుల్లో భాగంగా ఇప్పటికి నాలుగు పూర్తి కాగా.. తొలి మ్యాచ్లో శతకం సాధించడం మినహా కోహ్లి పెద్దగా రాణించలేకపోతున్నాడు. ముఖ్యంగా ఆఫ్ సైడ్ బంతుల్ని ఎదుర్కొనే క్రమంలో పదే పదే తప్పుల్ని పునరావృతం చేస్తూ వికెట్ పారేసుకుంటున్నాడు.మరోవైపు.. రోహిత్ సారథిగా, బ్యాటర్గా విఫలమవుతున్నాడు. అడిలైడ్లో జరిగిన రెండో టెస్టుతో జట్టులోకి వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఐదు ఇన్నింగ్స్లో కలిపి మరీ దారుణంగా31 పరుగులే చేశాడు. ఇక అతడి సారథ్యంలో రెండో టెస్టులో ఓడిన భారత్, బ్రిస్బేన్ టెస్టును డ్రాగా ముగించగలిగింది. అయితే, మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం 184 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది.సిడ్నీ టెస్టు నుంచి వైదొలిగిన రోహిత్!ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే సమయం ఆసన్నమైందని.. అతడు వెంటనే తప్పుకొని యువకులకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆసీస్తో ఆఖరి టెస్టు ముగిసిన తర్వాత రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తనకు తానుగా సిడ్నీ టెస్టు నుంచి వైదొలగాలని అతడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో యశస్వి జైస్వాల్తో ఓపెనింగ్ జోడీగా కేఎల్ రాహుల్ మరోసారి బరిలోకి దిగనుండగా.. శుబ్మన్ గిల్(Shubhman Gill) మూడో స్థానంలో ఆడనున్నట్లు సమాచారం. అదే విధంగా గాయపడిన పేసర్ ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ కృష్ణ తుదిజట్టుకు ఎంపికైనట్లు తెలుస్తోంది. రెండే మార్పులుఈ రెండు మార్పులు మినహా.. పాత జట్టుతోనే భారత్ సిడ్నీ టెస్టుకు సన్నద్ధమైనట్లు సమాచారం. కాగా శుక్రవారం నుంచి మంగళవారం(జనవరి 3-7) వరకు ఆసీస్- భారత్ మధ్య ఐదో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో గెలిస్తేనే టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్ను 2-2తో డ్రా చేసుకోగలుగుతుంది. అదే విధంగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025 అవకాశాలు కూడా సజీవంగా ఉంటాయి.ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టుకు భారత తుదిజట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.చదవండి: కెప్టెన్ కంటే బెటర్.. అతడిని మాత్రం తప్పించకండి: భారత మాజీ క్రికెటర్ -
రోహిత్, బుమ్రా కాదు!.. సిడ్నీ టెస్టులో టీమిండియా కెప్టెన్ అతడే!
ఆస్ట్రేలియాతో టీమిండియా ఆఖరి టెస్టుకు సమయం ఆసన్నమైంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో శుక్రవారం ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఇందుకోసం ఇరుజట్లు ఇప్పటికే పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి. సిడ్నీలో గెలిచి ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-2తో డ్రా చేసుకోవాలని భారత్ భావిస్తోంది.మరోవైపు.. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని తామే కైవసం చేసుకోవాలని ఆసీస్ పట్టుదలగా ఉన్నాయి. ఫలితంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు మరింత రసవత్తరంగా మారనుంది. అయితే, ఈ కీలక టెస్టుకు ముందు టీమిండియా డ్రెసింగ్రూమ్లో విభేదాలు తలెత్తాయనే వార్తలు అభిమానులను కలవరపెడుతున్నాయి.హెడ్కోచ్ గౌతం గంభీర్తో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు సమన్వయం కుదరడం లేదని.. అదే విధంగా ఆటగాళ్ల తీరు పట్ల కోచ్ అసంతృప్తితో ఉన్నాడనే వదంతులు వచ్చాయి. అయితే, గౌతీ మాత్రం ఇవన్నీ అబద్దాలేనని కొట్టిపారేశాడు. అయినప్పటికీ, టీమిండియా కెప్టెన్ మార్పు అంశం మీద మాత్రం ఊహాగానాలు ఆగటం లేదు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదో టెస్టుకు ముందు కెప్టెన్గా రోహిత్పై వేటు పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అతడి గైర్హాజరీలో పెర్త్లో టీమిండియాను గెలిపించిన జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) పగ్గాలు చేపట్టడం లాంఛనమేనని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, బెంగాల్ మాజీ క్రికెటర్, ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన శ్రీవత్స్ గోస్వామి మాత్రం భిన్నంగా స్పందించాడు.సిడ్నీ టెస్టులో టీమిండియా కెప్టెన్ అతడే!‘‘టీమిండియాలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే.. సిడ్నీ టెస్టులో గిల్ కెప్టెన్గా వ్యవహరించునున్నాడని అనిపిస్తోంది. తదుపరి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ సైకిల్ కోసం మేనేజ్మెంట్ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదెంతో ఆసక్తికరంగా ఉంది’’ అని శ్రీవత్స్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.సరైన నాయకుడు బుమ్రానేఅయితే, మెజారిటీ మంది నెటిజన్లు మాత్రం శ్రీవత్స్ అభిప్రాయంతో విభేదిస్తున్నారు. గిల్కు తుదిజట్టులోనే చోటు దక్కనపుడు కెప్టెన్ ఎలా అవుతాడని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో గిల్కు పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందని.. ఇప్పుడు మాత్రం బుమ్రాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాకు ప్రస్తుత పరిస్థితుల్లో బుమ్రానే సరైన నాయకుడు అని పేర్కొంటున్నారు. ఏదేమైనా శుక్రవారం సిడ్నీ టెస్టు మొదలైన తర్వాతే ఈ ఊహాగానాలకు చెక్ పడుతుంది.ఇదిలా ఉంటే.. ఐదు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియాకు సానుకూల ఫలితాలు రావడం లేదు. పెర్త్లో గెలిచిన భారత జట్టు.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. బ్రిస్బేన్లో జరిగిన మూడో టెస్టులో వర్షం వల్ల డ్రాతో గట్టెక్కగలిగింది. అయితే, మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టులో మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.రోహిత్ వైఫల్యాల వల్లే ఇలాఈ బాక్సింగ్ డే టెస్టులో ఆతిథ్య ఆసీస్ చేతిలో 184 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి.. సిరీస్లో 1-2తో వెనుకబడింది. ఈ సిరీస్లో రోహిత్ శర్మ సారథిగా, బ్యాటర్గా విఫలం అవుతుండటంతో అతడు వెంటనే రాజీనామా చేసి.. రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త కెప్టెన్ అంశం తెరమీదకు వచ్చింది.చదవండి: లవ్ యూ కాంబ్లీ.. త్వరలోనే వచ్చి కలుస్తా: టీమిండియా దిగ్గజం భరోసా -
రోహిత్ శర్మ అందుకు సిద్ధంగానే ఉన్నాడు: రవిశాస్త్రి
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను ఉద్దేశించి మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు. సిడ్నీ టెస్టు ముగిసిన వెంటనే హిట్మ్యాన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందన్నాడు. రోజురోజుకీ రోహిత్ వయసు పెరుగుతోందని.. కాబట్టి తనకు తానుగా రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకొనేందుకు సిద్ధంగానే ఉన్నాడని అభిప్రాయపడ్డాడు.బ్యాటర్గా.. కెప్టెన్గా వైఫల్యాలుకాగా గత కొంతకాలంగా రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటు బ్యాటర్గా.. అటు కెప్టెన్గా ఘోర పరాభవాలు చవిచూస్తున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టుల్లో 3-0తో క్లీన్స్వీప్.. తాజాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ వైఫల్యాలు రోహిత్ను వేధిస్తున్నాయి.ఆసీస్ పర్యటనలో రెండో టెస్టు నుంచి జట్టుతో చేరిన రోహిత్ శర్మ అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోతున్నాడు. ఇప్పటి వరకు కంగారూ జట్టుతో ముగిసిన మూడు టెస్టుల్లో ఐదు ఇన్నింగ్స్ ఆడిన అతడు.. కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ సారథ్యంలో ఈ మూడు మ్యాచ్లలో రెండింటిలో ఓడిన టీమిండియా.. ఒకటి మాత్రం డ్రా చేసుకోగలిగింది.ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలి, కెప్టెన్సీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్వరగా అతడు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాటు.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ శర్మ అందుకు సిద్ధంగానే ఉన్నాడుఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ తన కెరీర్ గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాడనిపిస్తోంది. సిడ్నీ టెస్టు తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకంటే.. రోజురోజుకీ అతడేమీ యువకుడు కావడం లేదు కదా! శుబ్మన్ గిల్ (Shubman Gill)వంటి ఎంతో మంది యువ ఆటగాళ్లు జట్టులో సుస్థిర స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది సగటున 40 పరుగులు చేసిన గిల్ వంటి ఆటగాళ్లను పక్కనపెట్టడం సరికాదు. ప్రతిభ ఉన్న యువకులను బెంచ్కే పరిమితం చేయడం తెలివైన నిర్ణయం అనిపించుకోదు. కాబట్టి రోహిత్ వైదొలుగుతాడనే అనిపిస్తోంది. ఒకవేళ సిడ్నీలో టీమిండియా గెలిచి.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరినా.. చేరకపోయినా రోహిత్ మాత్రం తుది నిర్ణయం వెల్లడిస్తాడని.. అందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. 37 ఏళ్ల రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలికితే యువకులకు మార్గం సుగమమవుతుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు.సిడ్నీలో గెలిస్తేనేకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్తో ఐదు టెస్టులు ఆడుతున్న టీమిండియా.. ఆతిథ్య జట్టు చేతిలో 2-1తో వెనుకబడి ఉంది. పెర్త్లో గెలిచిన భారత్.. అడిలైడ్లో ఓడి.. బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకుంది. అయితే, మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో మాత్రం 184 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఇరుజట్ల మధ్య జనవరి 3-7 మధ్య సిడ్నీ వేదికగా ఆఖరిదైన ఐదో టెస్టు జరుగుతుంది. ఇందులో గెలిస్తేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి.చదవండి: లవ్ యూ కాంబ్లీ.. త్వరలోనే వచ్చి కలుస్తా: టీమిండియా దిగ్గజం భరోసా -
శుబ్మన్ గిల్కు షాక్.. గుజరాత్ సీఐడీ సమన్లు!?
బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కుంభకోణం కేసులో నలుగురు భారత క్రికెటర్లకు గుజరాత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) సమన్లు పంపింది. వారిలో టీమిండియా ప్లేయర్లు శుబ్మన్ గిల్, సాయిసుదర్శన్, మొహిత్ శర్మ, రాహుల్ తెవాటియా ఉన్నారు. వీరు నలుగురూ ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టినందుకు గుజరాత్ సిఐడి సమన్లు పంపింది. త్వరలోనే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది.అహ్మదాబాద్ మిర్రర్ కథనం ప్రకారం.. ఆ కంపెనీలో గిల్ రూ.1.95 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. మిగతా ముగ్గురు గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు రూ. 10 లక్షల నుంచి కోటి మధ్య ఇన్వెస్ట్ చేసినట్లు సమాచారం. కాగా శుబ్మన్ గిల్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 ముగిసిన అనంతరం గిల్ విచారణకు హాజరు కానున్నాడు. అయితే మిగితా ముగ్గురు ఆటగాళ్లు భారత్లోనే ఉండడంతో గిల్ కంటే ముందు విచారణకు హాజరు అయ్యే అవకాశముంది.ఏంటీ బీజడ్ గ్రూపు స్కామ్?గుజరాత్లోని హిమ్మత్నగర్ చెందిన భూపేంద్రసిన్హ్ జాలా.. బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బీజడ్ ట్రేడర్స్ కంపెనీలను స్దాపించాడు. ఈ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలను గుజరాత్లోని పలు జిల్లాల్లో విస్తరించాడు. ఈ కంపెనీలలో పెట్టుబడి పెడితే బ్యాంకుల కంటే మెరుగైన వడ్డీ రేటును చెల్లిస్తామని ప్రజలను నమ్మించారు.అంతేకాకుండా బహుమతులను ప్రకటించి పెట్టుబడిదారులను భారీగా ఆకర్షించారు. ఉదాహరణకు వారి కంపెనీలో రూ. 5 లక్షల పెట్టుబడి పెడితే 32 ఇంచ్ టీవీ, రూ.10 లక్షల పెట్టుబడి పెడితే గోవా ట్రిప్స్ వంటి గిప్ట్ ప్యాకేజిలను బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫర్ చేసింది. దీంతో ప్రజలు భారీగా పెట్టుబడులు పెట్టారు. అయితే వారు ఇచ్చిన హామీలు అన్ని బూటకమని, మోసపోయాయని తెలుసుకున్న ప్రజలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఫోర్జరీ కేసు నమోదు చేసిన పోలీసులు బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో భూపేంద్రసిన్హ్ జాలాను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ కేసును సిఐడీ అప్పగించారు.తొలుత భూపేంద్రసిన్హ్ రూ. 6000 కోట్ల చిట్-ఫండ్ మోసానికి పాల్పడ్డారని నివేదించిన గుజరాత్ సీఐడీ.. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ. 450 కోట్లగా ఖారారు చేసింది. అయితే పోలీసుల విచారణలో గిల్, సాయిసుదర్శన్, మొహిత్ శర్మ, తెవాటియా సైతం పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. ఈ క్రమంలోనే ఈ నలుగురుకు సిఐడి సమన్లు పంపింది. -
ఆసీస్తో నాలుగో టెస్టు.. గిల్, నితీశ్ రెడ్డిపై వేటు! వారికి ఛాన్స్?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగో టెస్టులో తలపడేందుకు ఆస్ట్రేలియా, భారత్ జట్లు సిద్దమయ్యాయి. డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే ఈ బాక్సింగ్ డే టెస్టు కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమించాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్లో ఆధిక్యం సంపాదించాలని అటు ఆస్ట్రేలియా, ఇటు భారత్ రెండూ భావిస్తున్నాయి. అయితే ఈ నాలుగో టెస్టులో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.ఓపెనర్గా రోహిత్.. ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి భారత ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నట్లు సమాచారం. కేఎల్ రాహుల్ ఓపెనర్గా రాణిస్తుండడంతో గత రెండు మ్యాచ్ల్లో రోహిత్ ఆరో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఈ రెండు మ్యాచ్ల్లోనూ హిట్మ్యాన్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలోనే అతడిని తన రెగ్యూలర్ బ్యాటింగ్ పొజిషేన్లోనే పంపాలని జట్టు మెనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు వినికిడి. కాగా కేఎల్ రాహుల్ మూడో స్ధానంలో బ్యాటింగ్కు రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఈ నేపథ్యంలో ఫస్ట్ డౌన్ బ్యాటర్ శుబ్మన్ గిల్పై వేటు పడే అవకాశం ఉంది.. ఎందుకంటే రోహిత్ ఓపెనర్గా, రాహుల్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ వస్తే.. గిల్ ఆరో స్ధానంలో బ్యాటింగ్కు రాక తప్పదు. అతడు ఎప్పుడూ టాపర్డర్లో తప్ప లోయార్డర్లో బ్యాటింగ్ చేసిన అనుభవం లేదు. దీంతో గిల్ స్దానంలో ధ్రువ్ జురెల్కు చోటు ఇవ్వాలని భారత జట్టు మెనెజ్మెంట్ యోచిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు టైమ్స్ ఇండియా కథనం ప్రకారం.. బ్యాక్సింగ్ డే టెస్టులో భారత్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సందర్లు బ్యాక్సింగ్ డే టెస్టులో స్పిన్నర్లగా ఆడున్నట్లు సమాచారం. యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టాలని రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గంభీర్ భావిస్తున్నరంట. నితీశ్ బ్యాటింగ్ పరంగా అద్బుతంగా రాణిస్తున్నప్పటికి, బౌలింగ్లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడి స్ధానంలో స్పిన్ ఆల్రౌండర్ సుందర్కు అవకాశమివ్వనున్నారంట.భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), KL రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్చదవండి: IND vs AUS: భారత్తో నాలుగో టెస్టు.. ఆసీస్ తుది జట్టు ప్రకటన! 19 ఏళ్ల కుర్రాడికి చోటు -
గిల్.. భారత్లో ఆడినట్లు అక్కడ ఆడితే కుదరదు: దినేష్ కార్తీక్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా యువ ఆటగాడు శుబ్మన్ గిల్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న సంగతి తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు గాయం కారణంగా దూరమైన గిల్ రెండో టెస్టు నుంచి అందుబాటులో వచ్చాడు.ఇప్పటివరకు ఈ సిరీస్లో మూడు ఇన్నింగ్స్లు ఆడిన గిల్.. వరుసగా 31, 28, 1 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో గిల్పై భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్ తన బ్యాటింగ్ టెక్నిక్లో స్వల్ప మార్పులు చేయాలని చేయాలని కార్తీక్ సూచించాడు."శుబ్మన్ గిల్ బ్యాటింగ్లో చిన్న సాంకేతిక లోపం ఉంది. అతడు బంతిని బలంగా కొట్టడానికి ప్రయత్నించి తన వికెట్ను కోల్పోతున్నాడు. మీరు వైట్బాల్ క్రికెట్ ఎక్కువగా ఆడే సమయంలో ఇది సహజంగా జరుగుతోంది. ట్రావిస్ హెడ్ కూడా అలానే ఆడేవాడు.కానీ ఇప్పుడు అతడు తన సమస్యకు పరిష్కరం కనుగొన్నాడు. శుబ్మన్ గిల్ వంటి ఆటగాళ్లు భారత కండీషన్స్కు ఎక్కువగా అలవాటు పడడంతోనే.. విదేశీ పిచ్లలో ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. బౌలర్ బంతిని రిలీజ్ చేసిన వెంటనే మీ మనసు దానిని ఫుల్బాల్గా అంచనావేసి.. ఫ్రంట్ ఫుట్కు వెళ్లి ఆడమని చెబుతుంది.కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వంటి విదేశీ టార్లకు వెళ్లే ఆటగాళ్లు కొత్త బంతిని ఎలా ఆడాలో ముందే ప్రాక్టీస్ చేస్తారు. కొత్త బాల్ను ఆడేందుకు రెండు రకాలుగా ప్రయత్నిస్తారు. ఒకటి షాప్ట్ హ్యాండ్స్తో ఆడుతారు లేదా శరీరానికి దగ్గరగా బంతిని ఆడటం లేదా వదిలేయడం చేస్తారు. శుబ్మన్ గిల్ భారత్లో ఆడినట్లే ఆస్ట్రేలియాలో ఆడుతున్నాడు.స్వదేశంలో పరిస్థితులకు ఆసీస్ కండీషన్స్కు చాలా తేడా ఉంది. బంతిని గట్టిగా హిట్ చేయడానకి వెళ్లి ఔట్ అవుతున్నాడు. గబ్బా వంటి స్టేడియాల్లో ఫ్రంట్ ఫుట్ ఆడటం కొంచెం కష్టం. ఇన్నింగ్స్ ఆరంభంలోనే మీ మనస్సును నియంత్రించుకుని అలాంటి బంతులను వదిలేస్తాని నిర్ణయించుకోవాలి.టెస్టుల్లో చాలా కాలం నుంచి నంబర్3లో ఆడుతున్నావు. అటువంటి అప్పుడు అంత సులువగా ఔట్ అవ్వడం సరైనది కాదు. నిజం చెప్పాలంటే గిల్ ఒక్కడే కాదు, భారత బ్యాటింగ్ సమష్టిగానే విఫలమవుతోంది. ప్రతీ ఇన్నింగ్స్లో వారు ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు అన్పిస్తోందని క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. -
నేను బాగానే ఉన్నా.. వాళ్లు పుంజుకుంటారు: రోహిత్ శర్మ
ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test)కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన గాయం గురించి కీలక అప్డేట్ అందించాడు. తన మోకాలు బాగానే ఉందని.. ఈ విషయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. అదే విధంగా.. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే బ్యాటింగ్ ఆర్డర్ కూర్పు ఉంటుందని మరోసారి స్పష్టం చేశాడు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy) ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెర్త్లో భారత్, అడిలైడ్లో ఆసీస్ గెలవగా.. బ్రిస్బేన్లో జరిగిన మూడో టెస్టు వర్షం వల్ల డ్రా అయింది. ఫలితంగా ఇరుజట్లు సిరీస్లో ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్నాయి.నేను బాగానే ఉన్నానుఈ క్రమంలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో డిసెంబరు 26(బాక్సింగ్ డే) నుంచి నాలుగో టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma PC) మంగళవారం మీడియాతో మాట్లాడాడు. ప్రాక్టీస్లో తనకు తీవ్ర గాయమైందన్న వార్తలను ఖండించిన హిట్మ్యాన్.. తన మోకాలు బాగానే ఉందని పేర్కొన్నాడు.అతడిపై ఒత్తిడి లేదుఅదే విధంగా.. టీమిండియా యువ ఆటగాళ్ల వైఫల్యాల గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘‘రిషభ్ పంత్పై ఎలాంటి ఒత్తిడి లేదు. అతడు గత కొంతకాలంగా ఫామ్లోనే ఉన్నాడు. అయితే, రెండు, మూడో టెస్టులో మాత్రం రాణించలేకపోయాడు.వాళ్లు తిరిగి పుంజుకుంటారుఅంతమాత్రాన ఏకపక్షంగా అతడి గురించి తీర్పులు ఇచ్చేయడం సరికాదు. ఎలా ఆడాలన్న అంశంపై అతడికి పూర్తి స్పష్టత ఉంది. శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ కూడా తిరిగి పుంజుకుంటారు. జట్టులో వారి పాత్ర ఏమిటో వారికి బాగా తెలుసు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.కాగా ఆస్ట్రేలియాతో ఇప్పటి వరకు పూర్తయిన మూడు టెస్టుల్లో యశస్వి జైస్వాల్ 193, రిషభ్ పంత్ 96 పరుగులు చేశారు. ఇక రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చిన శుబ్మన్ గిల్ 60 పరుగులు చేశాడు. మరోవైపు.. వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్టుకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ.. రెండు(3, 6), మూడు టెస్టు(10)ల్లో పూర్తిగా విఫలమయ్యాడు. అయితే, ఈ సిరీస్లో కేఎల్ రాహుల్ కోసం ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసిన రోహిత్.. ఆరో స్థానంలో బరిలోకి దిగుతున్నాడు.చదవండి: BGT: అశ్విన్ స్థానంలో ఆస్ట్రేలియాకు.. ఎవరీ తనుశ్? -
‘షాట్ సెలక్షన్ చెత్తగా ఉంది.. నీ ఇమేజ్ను వదిలెయ్’
టీమిండియా స్టార్ బ్యాటర్ శుబ్మన్ గిల్ ఆట తీరును భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ విమర్శించాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో గిల్ షాట్ సెలక్షన్ను సన్నీ తప్పుబట్టాడు. బ్యాటింగ్కు వచ్చే ముందు డ్రెస్సింగ్ రూమ్లోనే ఇమేజ్ను వదిలేస్తే ఇలాంటి పొరపాట్లు జరగవంటూ చురకలు అంటించాడు.అడిలైడ్లో అలాబోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఐదు టెస్టులు ఆడుతోంది. పెర్త్లో జరిగిన తొలి టెస్టుకు గాయం కారణంగా గిల్ దూరమయ్యాడు. అయితే, రెండో టెస్టు నాటికి అతడు అందుబాటులోకి వచ్చాడు. అడిలైడ్లో జరిగిన ఈ పింక్బాల్ మ్యాచ్లో గిల్ ఫర్వాలేదనిపించాడు. రెండు ఇన్నింగ్స్లో వరుసగా 31, 28 పరుగులు చేశాడు.అయితే, బ్రిస్బేన్ టెస్టులో మాత్రం గిల్ పూర్తిగా నిరాశపరిచాడు. మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఆఫ్ స్టంప్ వెలుపలా వెళ్తున్న బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. నీ ఇమేజ్ను డ్రెస్సింగ్ రూమ్లోనే వదిలెయ్అయితే, షాట్ సరిగ్గా కనెక్ట్ కాలేదు. ఈ క్రమంలో బ్యాట్ ఎడ్జ్ను తాకిన బంతి గల్లీ పాయింట్లో ఉన్న మిచెల్ మార్ష్ చేతిలో పడింది. దీంతో గిల్ పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘నీ ఇమేజ్ను డ్రెస్సింగ్ రూమ్లోనే వదిలెయ్. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇలాంటి షాట్లు ఆడటం ప్రమాదకరమని తెలిసినా.. నువ్వు జాగ్రత్త పడలేదు.చెత్త షాట్ సెలక్షన్కాస్త కుదురుకున్న తర్వాత ఇలాంటివి ప్రయత్నించవచ్చు. 30- 40- 50 పరుగులు సాధించిన తర్వాత రిస్క్ తీసుకోవచ్చు. కానీ ఆరంభంలోనే ఇలాంటి చెత్త షాట్ సెలక్షన్ ఏమిటి? నిజానికి మార్ష్ క్యాచ్ పట్టిన తీరు అద్భుతం. ఈ విషయంలో గిల్కు కాస్త దురదృష్టం ఎదురైందని చెప్పవచ్చు.ఏదేమైనా.. ఆ బంతిని ఆడకుండా.. అలా వదిలేసి ఉంటే బాగుండేది. అనవసరపు షాట్కు యత్నించినందుకు గిల్ డగౌట్లో కూర్చోవాల్సి వచ్చింది’’ అని పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో భాగంగా గావస్కర్ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కష్టాల్లో టీమిండియాకాగా బ్రిస్బేన్లోని గబ్బా మైదానంలో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయగా.. భారత్ కనీసం మూడు వందల పరుగుల మార్కును కూడా చేరుకునేలా కనిపించడం లేదు. గాబ్బాలో మంగళవారం నాటి నాలుగో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి రోహిత్ సేన ఏడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇక ఈ సిరీస్లో పెర్త్లో టీమిండియా, అడిలైడ్లో ఆసీస్ గెలిచి ప్రస్తుతానికి 1-1తో సమంగా ఉన్నాయి.చదవండి: కెప్టెన్గా రింకూ సింగ్ -
అవునా.. నాకైతే తెలియదు: కమిన్స్కు ఇచ్చిపడేసిన గిల్
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు టీమిండియా సిద్ధమవుతోంది. బ్రిస్బేన్ వేదికగా ఇరుజట్ల మధ్య శనివారం ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత స్టార్ బ్యాటర్ శుబ్మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.చెరో గెలుపుతో సమంగాకాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా పెర్త్లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఇందుకు ధీటుగా బదులిచ్చిన కంగారూ జట్టు అడిలైడ్లో భారత్ను పది వికెట్ల తేడాతో ఓడించింది. ఇక ఈ పింక్ బాల్ మ్యాచ్లో తాము షార్ట్ బాల్స్తో టీమిండియాను కట్టడి చేశామని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పేర్కొన్నాడు.అవునా.. నాకైతే తెలియదే!అడిలైడ్ ఓవల్ మైదానంలో షార్ట్ బాల్ వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి.. టీమిండియా బ్యాటర్ల పనిపట్టామని కమిన్స్ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని శుబ్మన్ గిల్ దగ్గర విలేకరులు ప్రస్తావించగా.. ‘‘అవునా.. నాకైతే తెలియదే!.. షార్ట్ బాల్తో బహుశా వాళ్లు ఒక టెయిలెండర్ను లేదంటే లోయర్ ఆర్డర్ బ్యాటర్ను మాత్రమే అవుట్ చేశారు.కానీ.. అతడు ఏ షార్ట్బాల్ను ఉపయోగించి విజయం సాధించామని చెప్తున్నాడో నాకైతే తెలియదు’’ అంటూ కమిన్స్కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. కాగా గాయం వల్ల పెర్త్ టెస్టుకు దూరమైన గిల్.. అడిలైడ్లో పింక్ బాల్ మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడు.ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 31 పరుగులు చేసిన శుబ్మన్ గిల్ స్కాట్ బోలాండ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా మిచెల్ స్టార్క్ గిల్ను బౌల్డ్ చేశాడు. ఇక మూడో టెస్టు జరుగనున్న బ్రిస్బేన్ స్టేడియంతో ఈ కుడిచేతి వాటం బ్యాటర్కు మధురానుభవం ఉంది.నాడు 91 పరుగులతో చెలరేగిన గిల్2021 నాటి టెస్టులో గిల్ 91 పరుగులు చేసిన గిల్.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈసారి కూడా గతంలో మాదిరి ప్రదర్శనను పునరావృతం చేయాలని పట్టుదలగా ఉన్నాడు. మూడో టెస్టునే ఫైనల్ మ్యాచ్గా భావించి బరిలోకి దిగుతామన్న గిల్.. గాబాలో గెలిస్తే.. మెల్బోర్న్, సిడ్నీ టెస్టుల్లో మరింత ఆత్మవిశ్వాసంతో ఆడగలమని పేర్కొన్నాడు. కాగా మూడో టెస్టు కోసం ఇప్పటికే బ్రిస్బేన్ చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ సెషన్లలో తీవ్రంగా శ్రమించింది.చదవండి: IND vs AUS: మూడో టెస్టుకు ఆసీస్ తుది జట్టు ప్రకటన.. వికెట్ల వీరుడు వచ్చేశాడుShots fired already? 👀While @patcummins30 claims Australia have succeeded in their short ball ploy, look what @ShubmanGill has to say about it! 😁😅1️⃣ DAY TO GO for #AUSvINDOnStar 3rd Test 👉 SAT 14 DEC, 5.20 AM onwards! #ToughestRivalry pic.twitter.com/vS55v5Qgwz— Star Sports (@StarSportsIndia) December 13, 2024 -
‘గిల్ను బెంచ్కే పరిమితం చేయండి.. అతడికి మరొక్క ఛాన్స్ ఇవ్వాలి’
టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్ బ్యాటర్ శుబ్మన్ గిల్ను మరికొన్నాళ్లపాటు బెంచ్కే పరిమితం చేయాలని భారత జట్టు యాజమాన్యానికి సూచించాడు. యువ ఆటగాడు ధ్రువ్ జురెల్కు మరొక్క అవకాశం ఇవ్వాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు.గాయం వల్ల జట్టుకు దూరంకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో పెర్త్లో జరిగిన తొలి మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల దూరంగా ఉండగా.. టెస్టుల్లో వన్డౌన్లో ఆడుతున్న గిల్ గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు.రిషభ్ పంత్ ఉన్నప్పటికీఈ నేపథ్యంలో రోహిత్ గైర్హాజరీలో యశస్వి జైస్వాల్తో కలిసి కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు. మరోవైపు.. గిల్ లేకపోవడంతో.. రిషభ్ పంత్ ఉన్నప్పటికీ మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్కు తుదిజట్టులో చోటు దక్కింది. అయితే, రెండో టెస్టుకు రోహిత్ శర్మ, గిల్ అందుబాటులోకి రావడంతో ఎవరిపై వేటు పడుతుందనే చర్చ నడుస్తోంది.ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇండియా టుడేతో మాట్లాడాడు. ‘‘కేఎల్ రాహుల్- యశస్వి జైస్వాల్లను ఓపెనింగ్ జోడీగా కొనసాగించాలి. కెప్టెన్ రోహిత్ శర్మ కోసం శుబ్మన్ గిల్ తన మూడోస్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇక విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో రాగా.. మిగతా స్థానాల్లో యథావిధిగా అందరూ కొనసాగాలి.గిల్ను బెంచ్కే పరిమితం చేయండి.. అతడికి మరొక్క ఛాన్స్ ఇవ్వాలిగిల్ మరికొన్నాళ్లు వేచి చూడాలి. నిజానికి జురెల్కు తొలి టెస్టులో అవకాశం ఇచ్చారు. కానీ అతడు పరుగులేమీ రాబట్టలేకపోయాడు. కాబట్టి అతడిని బెంచ్కే పరిమితం చేసే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ.. గిల్ను ఓపెనింగ్ నుంచి ఐదో స్థానం వరకు ఎక్కడా ఆడించలేము కదా!ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురవడం మంచిదే. బెంచ్ ఎంత పటిష్టంగా ఉందో తెలియజేస్తుంది. మేనేజ్మెంట్ గిల్ వైపు మొగ్గు చూపి జురెల్ను తప్పించవచ్చు. అయితే, నా అభిప్రాయం ప్రకారం జురెల్కు మరొక్క అవకాశం ఇవ్వాలి’’ అని భజ్జీ పేర్కొన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్లో గిల్ ఫిఫ్టీకాగా ఆసీస్-‘ఎ’ జట్టుతో రాణించిన జురెల్.. తొలి టెస్టులో మాత్రం నిరాశపరిచారడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్లో వరుసగా 11, 1 పరుగులు చేశాడు. మరోవైపు.. ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్తో పింక్ బాల్తో ప్రాక్టీస్ మ్యాచ్లో గిల్ ఫిఫ్టీ(రిటైర్డ్ హర్ట్) సాధించాడు.ఇక భారత్- ఆసీస్ మధ్య అడిలైడ్ వేదికగా డిసెంబరు 6 నుంచి రెండో టెస్టు జరుగనుంది. దీనిని పింక్ బాల్తో నిర్వహించనున్నారు. ఇక పెర్త్లో జరిగిన తొలి టెస్టులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో టీమిండియా అదరగొట్టింది. ఆస్ట్రేలియాను ఏకంగా 295 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. చదవండి: ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ బుమ్రా.. నా మనుమలకూ చెబుతా: సన్రైజర్స్ విధ్వంసకర వీరుడు -
టీమిండియాకు గుడ్ న్యూస్.. ప్రిన్స్ వచ్చేస్తున్నాడు!
ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న రెండో టెస్టుకు ముందు టీమిండియాకు ఓ గుడ్న్యూస్ అందినట్లు తెలుస్తోంది. చేతి వేలి గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన టీమిండియా యువ ఆటగాడు శుబ్మన్ గిల్ తిరిగి ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం.శుక్రవారం(నవంబర్ 29) మొదటిసారి గిల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఒకవేళ ప్రాక్టీస్లో అతడికి ఎటువంటి సమస్యలు తలెత్తకపోతే సెకెండ్ టెస్టుకు జట్టు సెలక్షన్కు అందుబాటులో ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ పింక్ బాల్ టెస్టుకు ముందు భారత జట్టు ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్తో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో గిల్ బరిలోకి దిగనున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా తొలి టెస్టుకు ముందు ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా గిల్ బొటన వేలికి గాయమైంది. దీంతో ఆఖరి నిమిషంలో పెర్త్ టెస్టుకు దూరమయ్యాడు.అతడి స్ధానంలో దేవ్దత్త్ పడిక్కల్ తుది జట్టులోకి వచ్చాడు. కానీ అతడు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు. మరోవైపు రెండో టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అందుబాటులోకి వచ్చాడు.వీరిద్దరూ జట్టులోకి వస్తే పడిక్కల్, ధ్రువ్ జురెల్ బెంచ్కే పరిమితం కానున్నారు. ఇక ఈ రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ వేదికగా మొదలు కానుంది. కాగా తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఆస్ట్రేలియాతో టెస్టులకు భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ జడేజా, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రానా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్చదవండి: వేలంలో ఎవరూ కొనలేదు..! రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్ -
IND vs AUS: రెండో టెస్ట్కూ గిల్ అనుమానమే..?
ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. ప్రాక్టీస్ సందర్భంగా గిల్ ఎడమ చేతి బొటన వేలు ప్రాక్చర్ అయ్యింది. ఈ కారణంగా అతను పెర్త్ టెస్ట్కు (తొలి టెస్ట్) దూరమయ్యాడు. డాక్టర్లు గిల్కు రెండు వారాల విశ్రాంతి అవసరమని చెప్పారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గిల్ రెండో టెస్ట్కు కూడా దూరం అవుతాడని తెలుస్తుంది. గిల్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా రెండో టెస్ట్కు తగినంత ప్రాక్టీస్ అవసరమని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తుందట. అందుకు అతన్ని పరిగణలోకి తీసుకోవడం లేదని సమాచారం. గిల్ రెండో టెస్ట్కు ముందు జరిగే రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా పాల్గొనడని తెలుస్తుంది. పింక్ బాల్తో జరిగే ఈ ప్రాక్టీస్ మ్యాచ్ నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో జరుగనుంది. ఒకవేళ రెండో టెస్ట్కు గిల్ దూరమైతే తొలి టెస్ట్లో ఓపెనింగ్ చేసిన కేఎల్ రాహుల్ వన్ డౌన్లో బరిలోకి దిగుతాడు. తొలి టెస్ట్లో దారుణంగా విఫలమైన దేవ్దత్ పడిక్కల్ జట్టు నుంచి తప్పించబడతాడు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో టెస్ట్లో యశస్వి జైస్వాల్తో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగుతాడు.గిల్ అందుబాటులోకి వస్తే..గిల్ గాయం నుంచి కోలుకునే సమయం డిసెంబర్ 1తో ముగుస్తుంది. ఒకవేళ టీమిండియా మేనేజ్మెంట్ ఎలాంటి ప్రాక్టీస్ లేకపోయినా గిల్ను బరిలోకి దించాలని భావిస్తే, రెండో టెస్ట్లో అతను పడిక్కల్ స్థానంలో వన్డౌన్లో బరిలోకి దిగుతాడు. యశస్వికి జతగా రోహిత్ అందుబాటులో ఉంటాడు కాబట్టి రాహుల్ మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగుతాడు. గిల్ రెండో టెస్ట్లో బరిలోకి దిగితే అడిలైడ్ ఓవల్ మైదానంలో అతనికి మొదటి టెస్ట్ అవుతుంది. గిల్ గత పర్యటనలో మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్లలో టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. అడిలైడ్ వేదికగా జరిగే రెండో టెస్ట్ పింక్ బాల్తో జరుగనున్న విషయం తెలిసిందే.తొలి టెస్ట్లో టీమిండియా ఘన విజయంబోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకే పరిమితమైన భారత్.. రెండో ఇన్నింగ్స్లో అనూహ్యంగా పుంజుకుని ఆసీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్లో సత్తా చాటిన టీమిండియా బౌలర్లు రెండో ఇన్నింగ్స్లోనూ సమిష్టిగా రాణించి ఆసీస్ను గెలుపు దరిదాపుల్లోకి కూడా చేరనివ్వలేదు. ఈ మ్యాచ్ బుమ్రా 8 వికెట్లు పడగొట్టగా.. సెకెండ్ ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి సూపర్ సెంచరీలతో మెరిశారు. -
ఆసీస్తో తొలి టెస్టు.. టీమిండియాకు శుభవార్త?!
ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ యువ ఆటగాడు శుబ్మన్ గిల్ రోజురోజుకు మెరుగు అవుతున్నాడని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపాడు. పెర్త్ టెస్టుకు అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటూ అభిమానులకు శుభవార్త అందించాడు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడనుంది. శుక్రవారం నుంచి ఈ మెగా సిరీస్ మొదలుకానుంది. ఇందుకోసం ఇప్పటికే ఆసీస్కు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్లో బిజీబిజీగా గడుపుతోంది.ఈ క్రమంలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గిల్ ఎడమ బొటన వేలికి గాయం అయింది. అయితే, బౌలింగ్ కోచ్ మోర్కెల్ అందించిన సమాచారం ప్రకారం.. గిల్ వేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. బలహీనంగా టాపార్డర్ఇదిలా ఉంటే.. ఇప్పటికే వ్యక్తిగత కారణాల వల్ల రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరం కావడంతో... టాపార్డర్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో గిల్ కూడా మ్యాచ్ ఆడకపోతే జట్టుకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.మ్యాచ్ ప్రారంభానికి ముందుఈ నేపథ్యంలో చివరి వరకు వేచి చూసే ధోరణి అవలభించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. మ్యాచ్ రోజు వరకు గిల్ ఫిట్నెస్ సాధించాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ‘గిల్ రోజు రోజుకు మెరుగవుతున్నాడు. టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు అతడిపై నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొన్నాడు.ఇక రోహిత్ శర్మ గైర్హాజరీలో కెప్టెన్సీ చేయబోతున్న బుమ్రా గురించి మోర్కెల్ మాట్లాడుతూ.. ‘ఆస్ట్రేలియా పిచ్లపై బుమ్రాకు మంచి అనుభవం ఉంది. నాయకత్వ బృందంలో బుమ్రా కూడా భాగం. అతడు గతంలో ఇక్కడ చాలా మంచి ప్రదర్శనలు చేశాడు. జట్టును ముందుండి నడిపించడాన్ని ఇష్టపడే బౌలర్ అతడు. మిగిలిన వాళ్లు అతడిని అనుసరిస్తారు’ అని తెలిపాడు.ఒత్తిడిని దరిచేరనివ్వం... ఇక స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0–3తో టెస్టు సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో భారత జట్టు ఒత్తిడిలో ఉందని అంతా అనుకుంటున్నారని... అయితే దాన్ని మార్చి వేసుకునేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు మించింది లేదని మోర్కెల్ అన్నాడు. ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియాలో రాణిస్తే వచ్చే పేరు ప్రఖ్యాతులు వేరని పేర్కొన్నాడు. ‘ప్రతి ఒక్కరు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు అని అడుగుతున్నారు. మా వరకు దాన్ని పక్కన పెట్టేసి మెరుగైన ప్రదర్శనపైనే దృష్టి పెట్టాం’ అని మోర్కెల్ అన్నాడు. చదవండి: సంజూ శాంసన్ తండ్రి క్షమాపణ చెప్పాల్సిందే.. లేదంటే! -
BGT 2024: టీమిండియాకు గుడ్న్యూస్
ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్’(బీజీటీ) సిరీస్కు ముందు టీమిండియాకు శుభవార్త. ప్రాక్టీస్ మ్యాచ్లో గాయపడ్డ మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కోలుకున్నాడు. తిరిగి మైదానంలో అడుగుపెట్టి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్లతో పాటు మిగతా ఆటగాళ్ల బౌలింగ్లో దాదాపు గంటసేపు క్రీజులో నిలబడినట్లు సమాచారం.నెట్స్లోనూఅనంతరం.. కేఎల్ రాహుల్ నెట్స్లోనూ తీవ్రంగా చెమటోడ్చాడు. కొత్త, పాత బంతులతో సైడ్ ఆర్మ్ త్రోయర్స్ బౌలింగ్ చేస్తుండగా.. రాహుల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. కాగా బీజీటీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్ వేదికగా నవంబరు 22న తొలి టెస్టు ఆరంభం కానుంది.ఇందుకోసం.. భారత జట్టు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఆసీస్తో సిరీస్ సన్నాహకాల్లో భాగంగా ఇండియా-‘ఎ’ జట్టుతో కలిసి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ మోచేతికి గాయమైంది. దీంతో ఒకరోజు మొత్తం ప్రాక్టీస్కు దూరంగా ఉన్న ఈ సీనియర్ బ్యాటర్.. ఆదివారం తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు.శుబ్మన్ గిల్కు గాయంఇదిలా ఉంటే.. టీమిండియా మరో స్టార్ క్రికెటర్ శుబ్మన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. టెస్టు మ్యాచ్ను పోలిన పరిస్థితుల మధ్య (సిమ్యులేషన్) ‘వాకా’ మైదానంలో ప్రాక్టీస్ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా... బంతిని ఆపే క్రమంలో గిల్ ఎడమ బొటన వేలికి తీవ్రగాయమైంది. బాధతో విలవిల్లాడి గిల్ వెంటనే గ్రౌండ్ను వీడాడు.పరీక్షల అనంతరం గిల్ వేలు ఫ్యాక్చర్ అయినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. తొలి టెస్టుకు గిల్ అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. సాధారణంగా ఇలాంటి గాయాల నుంచి కోలుకునేందుకు కనీసం రెండు వారాల సమయం అవసరం కావడంతో... గిల్ తొలి మ్యాచ్ ఆడటం దాదాపు అసాధ్యమే. అయితే తొలి టెస్టుకు రెండో టెస్టుకు మధ్య వ్యవధి ఎక్కువ ఉండటంతో అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న రెండో మ్యాచ్ వరకు అతడు కోలుకోవచ్చని టీమ్ మేనేజ్మెంట్ అంచనా వేస్తోంది. గత ఆసీస్ పర్యటనలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన గిల్... ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీని నిలబెట్టుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. టాపార్డర్ బలహీనం! టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరమవుతాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో... గిల్ కూడా అందుబాటులో లేకపోతే భారత టాపార్డర్ బలహీనపడే అవకాశాలున్నాయి. రోహిత్ శర్మ భార్య శుక్రవారం పండంటి బాబుకు జన్మనివ్వగా... టెస్టు సిరీస్ ప్రారంభానికి ఇంకా గడువు ఉండటంతో అతడు జట్టుతో చేరితే ఓపెనింగ్ విషయంలో ఎలాంటి సమస్య ఉండదు.లేదంటే ఇప్పటి వరకు అంతర్జాతీయ అరంగేట్రం చేయని అభిమన్యు ఈశ్వరన్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఇలాంటి తరుణంలో కేఎల్ రాహుల్ కోలుకోవడం నిజంగా టీమిండియాకు సానుకూలాంశం. ఇక ఆదివారంతో ప్రాక్టీస్ మ్యాచ్ ముగియనుండగా... మంగళవారం నుంచి మూడు రోజుల పాటు భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొననుంది.మరోవైపు గాయం నుంచి కోలుకొని రంజీ ట్రోఫీలో సత్తా చాటిన మహ్మద్ షమీ... ఆసీస్తో రెండో టెస్టుకు ముందు జట్టులో చేరే చాన్స్ ఉంది. రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్తో మ్యాచ్లో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన షమీ 43.2 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టడంతో పాటు 37 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. చదవండి: నాకు కాదు.. వాళ్లకు థాంక్యూ చెప్పు: తిలక్ వర్మతో సూర్య -
ఆసీస్తో తొలి టెస్ట్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్
ఆసీస్తో తొలి టెస్ట్కు (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ) ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఇండియా-ఏతో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా స్టార్ ఆటగాడు శుభ్మన్ గిల్ గాయపడ్డాడు. గిల్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తూ చేతి వేలిని గాయపర్చుకున్నాడు. గాయం తీవ్రతపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. మెడికల్ టీమ్ గిల్కు తగిలిన గాయాన్ని దగ్గరి నుంచి పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తుంది. గిల్ గాయం నేపథ్యంలో అతను తొలి టెస్ట్ ఆడేది లేదన్నది సందిగ్దంలో పడింది.కాగా, గిల్ గాయానికి ముందు టీమిండియా ఆటగాళ్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్ కూడా ప్రాక్టీస్ సందర్భంగా గాయపడ్డారు. ఈ ముగ్గురిలో రాహుల్ గాయం కాస్త తీవ్రమైందిగా తెలుస్తుంది. విరాట్ తనకు తగిలిన స్వల్ప గాయం నుంచి పూర్తిగా కోలుకుని ప్రాక్టీస్ మ్యాచ్లో చురుకుగా పాల్గొన్నాడు. సర్ఫరాజ్ సైతం మోచేతి గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని తెలుస్తుంది. శుభ్మన్ గిల్ గాయమే ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్కు ఆందోళన కలిగిస్తుంది.ఇదిలా ఉంటే, తొలి టెస్ట్లో కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్ను (యశస్వి జైస్వాల్తో కలిసి) ప్రారంభిస్తాడని తెలుస్తుంది. శుభ్మన్ గిల్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తే వన్డౌన్లో వస్తాడు. ఆతర్వాత విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ బ్యాటింగ్కు దిగుతారు. ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్లలో ఎవరో ఒకరికి తుది జట్టులో చోటు దక్కవచ్చు. ఆల్రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా బరిలో ఉంటాడు. అశ్విన్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి టెస్ట్ అరంగేట్రం చేయడం ఖాయమని తెలుస్తుంది. స్పెషలిస్ట్ పేసర్లుగా బుమ్రా, సిరాజ్, ఆకాశ్దీప్ బరిలోకి దిగడం దాదాపుగా ఖయమైపోయింది. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. -
BGT 2024: రోహిత్ ఓపెనర్గా వద్దు.. వాళ్లిద్దరే ఆడాలి: పాక్ మాజీ క్రికెటర్
టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. నవంబరు 22 నుంచి బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్తో మ్యాచ్లు ఆడనుంది. వీటిలో కనీసం నాలుగు గెలిస్తేనే రోహిత్ సేన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్కు చేరే అవకాశం ఉంటుంది.ఇదే తొలిసారి..కాగా ఇటీవలే సొంతగడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. న్యూజిలాండ్తో ఆడిన మూడు టెస్టుల్లో ఓడి 0-3తో క్లీన్స్వీప్నకు గురైంది. స్వదేశంలో భారత జట్టు ఇలా మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో అన్ని మ్యాచ్లలో ఓడిపోవడం ఇదే తొలిసారి.ఈ నేపథ్యంలో రోహిత్ సేన ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంతగడ్డపైనే రాణించలేనివాళ్లు.. ఆసీస్ పిచ్లపై ఆడటం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.రోహిత్ ఓపెనర్గా వద్దుఆస్ట్రేలియాతో టెస్టుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్గా కాకుండా వన్డౌన్లో బరిలోకి దిగాలని సూచించాడు. కివీస్తో సిరీస్లో పేసర్ టిమ్ సౌతీని ఎదుర్కొనేందుకు రోహిత్ ఇబ్బందిపడ్డాడన్న కనేరియా.. ఆస్ట్రేలియాలో బంతి మరింత స్వింగ్ అవుతుంది కాబట్టి.. వన్డౌన్లో వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఇండియలో సౌతీ బౌలింగ్లో ఆడేందుకు రోహిత్ ఇబ్బందిపడ్డాడు. రెండుసార్లు అతడి బౌలింగ్లోనే అవుటయ్యాడు. కాబట్టి అతడి బ్యాటింగ్ ఆర్డర్ మారిస్తే బాగుంటుంది.జైస్వాల్కు జోడీగా అతడు రావాలిటాపార్డర్లో యశస్వి జైస్వాల్తో కలిసి శుబ్మన్ గిల్ ఓపెనర్గా రావాలి. రోహిత్ వన్డౌన్లో, కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాలి. బ్యాటింగ్ లైనప్ విషయంలో గౌతం గంభీర్ తప్పక మార్పులు చేయాలి. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కూడా బ్యాట్తో వీలైనంత ఎక్కువగా రాణిస్తేనే ఫలితం ఉంటుంది’’ అని డానిష్ కనేరియా పేర్కొన్నాడు. కాగా ఆసీస్- టీమిండియా మధ్య నవంబరు 22 నుంచి జనవరి 3 వరకు మూడు టెస్టుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: BCCI- Pant: ప్రపంచంలోనే సంపన్న బోర్డు.. మరి ఆ టెక్నాలజీ ఎందుకు వాడదంటే? -
చరిత్ర సృష్టించిన అజాజ్ పటేల్
న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్లో ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా రికార్డు సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి కివీస్ క్రికెటర్ కూడా అతడే! అంతేకాదు.. మాతృదేశంలో.. విదేశీ జట్టుకు ఆడుతూ ఈ ఫీట్ నమోదు చేసిన అరుదైన రికార్డునూ అజాజ్ పటేల్ సొంతం చేసుకున్నాడు.కాగా ముంబైలో జన్మించాడు అజాజ్ పటేల్. ఆ తర్వాత అతడి కుటుంబం న్యూజిలాండ్కు మకాం మార్చింది. అయితే, బాల్యం నుంచే క్రికెట్పై మక్కువ పెంచుకున్న అజాజ్ అంచెలంచెలుగా ఎదిగి కివీస్ ప్రధాన స్పిన్నర్లలో ఒకడిగా మారాడు. ఈ క్రమంలో 2021లో టీమిండియా- న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్తో ఒక్కసారిగా అతడు భారత్లో ఫేమస్ అయ్యాడు.నాడు 10 వికెట్ల హాల్ముంబైలోని వాంఖడే స్టేడియంలో నాడు టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 10 వికెట్లు కూల్చాడు. జన్మనిచ్చిన గడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగి ఈ అరుదైన ఘనత సాధించాడు. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ నాలుగు వికెట్లు అజాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ తన జట్టును గెలిపించలేకపోయాడు.ఈసారి ఐదేసిన అజాజ్ఇక తాజాగా టీమిండియాతో మ్యాచ్లో మరోసారి అజాజ్ పటేల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఐదు వికెట్లతో మెరిశాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(30)తో పాటు శుబ్మన్ గిల్(90), మహ్మద్ సిరాజ్(0), సర్ఫరాజ్ ఖాన్(0), రవిచంద్రన్ అశ్విన్(6)ల వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో భారత్ ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక జట్టు బౌలర్ల జాబితాలో అజాజ్ పటేల్ చోటు సంపాదించాడు. వాంఖడే స్టేడియంలో ఇప్పటి వరకు అజాజ్ 19 వికెట్లు(10+4+5) పడగొట్టాడు.భారత్లో ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక జట్టు బౌలర్లుఇయాన్ బోతమ్(ఇంగ్లండ్)- వాంఖడేలో 22 వికెట్లుఅజాజ్ పటేల్(న్యూజిలాండ్)- వాంఖడేలో 19 వికెట్లురిచీ బెనాడ్(ఆస్ట్రేలియా)- ఈడెన్ గార్డెన్స్లో 18 వికెట్లుకర్ట్నీ వాల్ష్(వెస్టిండీస్)- వాంఖడేలో 17 వికెట్లు.భారత్ 263 ఆలౌట్ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య శుక్రవారం మొదలైన మూడో టెస్టులో ఇరుజట్ల బౌలర్లు రాణిస్తున్నారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ను భారత్ 235 పరుగులకు తొలిరోజే ఆలౌట్ చేసింది. టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్ సుందర్ నాలుగు, పేసర్ ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నారు. తర్వాత భారత్ బ్యాటింగ్ చేసింది.ఈ క్రమంలో 86/4 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా 263 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఐదు వికెట్లు పడగొట్టగా.. గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: విధ్వంసకర ఇన్నింగ్స్.. భారత తొలి క్రికెటర్గా పంత్ రికార్డు -
విధ్వంసకర ఇన్నింగ్స్.. భారత తొలి క్రికెటర్గా పంత్ రికార్డు
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్తో టెస్టుల్లో వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసిన భారత బ్యాటర్గా రికార్డు సాధించాడు. కాగా రోహిత్ సేన స్వదేశంలో కివీస్ జట్టుతో టెస్టు సిరీస్ ఆడుతోంది.ఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఓడిన టీమిండియా సిరీస్ను 0-2తో కోల్పోయింది. ఈ క్రమంలో శుక్రవారం ముంబై వేదికగా మూడో టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. వాంఖడే మైదానంలో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది.పాత కథను పునరావృతం చేస్తూతొలిరోజే బౌలర్లు రాణించడంతో కివీస్ను 235 పరుగులకు ఆలౌట్ చేసింది. అయితే, పాత కథను పునరావృతం చేస్తూ బ్యాటింగ్లో మళ్లీ విఫలమైంది. దీంతో మొదటి రోజు ఆట ముగిసేసరికి నాలుగు వికెట్లు నష్టపోయి కేవలం 86 పరుగులు చేసింది. ఈ క్రమంలో శనివారం నాటి రెండో రోజు ఆరంభం నుంచి నైట్వాచ్మెన్లు శుబ్మన్ గిల్, రిషభ పంత్ దూకుడుగా ఆడారు.యశస్వి జైస్వాల్ రికార్డు బద్దలు గిల్ 66 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. పంత్ 36 బంతుల్లోనే యాభై పరుగులు సాధించాడు. ఈ క్రమంలో కివీస్పై తక్కువ బంతుల్లోనే అర్ధ శతకం చేసిన భారత బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు.కాగా కివీస్తో తాజా సిరీస్లో భాగంగా పుణెలో జరిగిన రెండో టెస్టులో 41 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా న్యూజిలాండ్పై టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన తొలి భారత బ్యాటర్గా నిలిచాడు. అయితే, పంత్ ఇప్పుడు ఆ రికార్డును సవరించి.. జైస్వాల్ను వెనక్కినెట్టి నంబర్ వన్గా అవతరించాడు. గిల్ సెంచరీ మిస్ ఇదిలా ఉంటే.. ముంబైలో జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజు యశస్వి జైస్వాల్(30) ఫర్వాలేదనిపించగా.. రోహిత్ శర్మ(18), మహ్మద్ సిరాజ్(0), విరాట్ కోహ్లి(4) పూర్తిగా నిరాశపరిచారు. అయితే, రెండో రోజు గిల్, పంత్ అర్ధ శతకాల వల్ల టీమిండియా ఆధిక్యంలోకి రాగలిగింది.దురదృష్టవశాత్తూ గిల్ సెంచరీ(90) మిస్ కాగా.. పంత్ 59 బంతుల్లో 60 పరుగులు రాబట్టాడు. రవీంద్ర జడేజా 14 పరుగులకే నిష్క్రమించగా.. సర్ఫరాజ్ ఖాన్ డకౌట్గా వెనుదిరిగాడు. రవిచంద్రన్ అశ్విన్ తొమ్మిదో వికెట్గా పెవిలియన్ చేరాడు. ఇక వాషింగ్టన్ సుందర్(36 బంతుల్లో 38 నాటౌట్) నిలకడగా ఆడినా.. ఆకాశ్ దీప్ రనౌట్ కావడంతో భారత తొలి 263 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగిసింది. కివీస్ కంటే కేవలం 28 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా న్యూజిలాండ్ బౌలర్లలో స్పిన్నర్ అజాజ్ పటేల్ 5 వికెట్లతో చెలరేగగా.. గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ ఒక్కో వికెట్ తీశారు.చదవండి: IND vs NZ: 'అదొక చెత్త నిర్ణయం.. రోహిత్, గంభీర్కు కొంచెం కూడా తెలివి లేదు' -
పంత్ అవుట్.. గిల్ సెంచరీ మిస్.. భారత్ స్కోరెంతంటే?
న్యూజిలాండ్తో మూడో టెస్టులో టీమిండియా మెరుగైన స్కోరు దిశగా పయనిస్తోంది. శనివారం నాటి మూడో రోజు ఆటలో భోజన విరామ సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగుల వద్ద నిలిచింది. కాగా కివీస్తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ను రోహిత్ సేన ఇప్పటికే 0-2తో చేజార్చుకుంది.ఈ క్రమంలో ముంబై వేదికగా శుక్రవారం మొదలైన మూడో టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్ చేరాలన్నా.. కివీస్ చేతిలో వైట్వాష్ నుంచి తప్పించుకోవాలన్నా భారత్ ఈ మ్యాచ్లో తప్పక గెలవాలి.తొలిరోజు కివీస్ 235 పరుగులకు ఆలౌట్ ఇక వాంఖడే వేదికగా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. న్యూజిలాండ్ జట్టును నామమాత్రపు స్కోరుకు పరిమితం చేయగలిగింది. స్పిన్కు అనుకూలిస్తున్న వాంఖడే పిచ్పై రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీయగా.. పేసర్ ఆకాశ్ దీప్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో కివీస్ జట్టు తొలి రోజే.. తొలి ఇన్నింగ్స్లో 235 పరుగులకు ఆలౌట్ అయింది.రోహిత్, కోహ్లి ఫెయిల్ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్(30) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(18) మరోసారి విఫలమయ్యాడు. ఇక జైస్వాల్ వచ్చిన మహ్మద్ సిరాజ్ డకౌట్ కాగా.. విరాట్ కోహ్లి(4) రనౌట్ రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది.ఫలితంగా శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 86 పరుగులే చేసింది. ఈ క్రమంలో శుబ్మన్ గిల్ 31, రిషభ్ పంత్ ఒక పరుగుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టి.. ఆది నుంచే దూకుడు ప్రదర్శించారు. కివీస్ బౌలర్లపై అటాక్ చేస్తూ ఇద్దరూ అర్ధ శతకాలు సాధించారు.గిల్కు టెస్టుల్లో ఏడో ఫిఫ్టీగిల్ 66 బంతుల్లో యాభై పరుగులు పూర్తి చేసుకోగా.. పంత్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే, ఇష్ సోధి బౌలింగ్లో పంత్(60) లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరగగా.. భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. అతడి స్థానంలో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. 𝐒𝐡𝐚𝐚𝐧𝐝𝐚𝐫 𝐉𝐚𝐛𝐚𝐫𝐝𝐚𝐬𝐭 𝐙𝐢𝐧𝐝𝐚𝐛𝐚𝐝 🙌 #INDvNZ #IDFCFirstBankTestTrophy #JioCinemaSports #ShubmanGill pic.twitter.com/SujiHXhlOw— JioCinema (@JioCinema) November 2, 2024 ఇక శనివారం భోజన విరామ సమయానికి టీమిండియా 43 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ 70, జడేజా 10 పరుగులతో ఆడుతున్నారు. కాగా కివీస్ తొలి ఇన్నింగ్స్ కంటే టీమిండియా ఇంకా 40 పరుగులు వెనుకబడి ఉంది. గిల్ సెంచరీ మిస్అయితే, లంచ్ తర్వాత గిల్ 90 పరుగుల వ్యక్తిగతస్కోరు వద్ద అవుయ్యాడు. అంతకంటే ముందు రవీంద్ర జడేజా(14), సర్ఫరాజ్ ఖాన్(0) వికెట్లను భారత్ కోల్పోయింది. 53.2 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి టీమిండియా 227 పరుగులు చేసింది.టీమిండియా-న్యూజిలాండ్ మూడో టెస్టుప్లేయింగ్ ఎలెవన్ టీమిండియారోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్దీప్, మహ్మద్ సిరాజ్న్యూజిలాండ్ టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓ రూర్కీ. చదవండి: IPL 2025: మన లీడర్.. మన కెప్టెన్.. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరు? -
Ind vs NZ: గిల్ ఫిఫ్టీ.. పంత్ మెరుపు హాఫ్ సెంచరీ.. దూకుడుగా భారత్
టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ముంబై వేదికగా మూడో టెస్టు రెండో రోజు ఆట మొదలైంది. ఓవర్నైట్ స్కోరు 86/4తో శనివారం ఆట మొదలుపెట్టిన భారత్ పటిష్ట స్థితిలో నిలవాలంటే కీలక భాగస్వామ్యాలు నమోదు చేయడం తప్పనిసరి. ఈ క్రమంలో రిషభ్ పంత్, శుబ్మన్ గిల్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు.గేర్ మార్చిన గిల్, పంత్శుక్రవారం ఆట పూర్తయ్యేసరికి ఒక బంతి ఎదుర్కొని ఒక పరుగు మాత్రమే చేసిన పంత్.. 31 పరుగులతో ఉన్న గిల్ శనివారం గేర్ మార్చారు. కివీస్ బౌలింగ్పై ఆది నుంచే అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో గిల్ 66 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే గిల్ 46 పరుగుల వద్ద ఉండగా.. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్లో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఫిలిప్స్ వేసిన బంతిని గిల్ లాంగాన్ మీదుగా తరలించగా.. ఫీల్డర్ చాప్మన్ క్యాచ్ పట్టేందుకు వచ్చి విఫలమయ్యాడు. దీంతో గిల్కు లైఫ్ లభించింది. పంత్ మెరుపు హాఫ్ సెంచరీఇక రిషభ్ పంత్ ధనాధన్ ఇన్నింగ్స్తో చెలరేగి మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 36 బంతుల్లోనే యాభై పరుగుల మైలురాయి చేరుకున్నాడు. ఈ క్రమంలో 31 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కివీస్ తొలి ఇన్నింగ్స్ కంటే ఇంకా 74 పరుగులు వెనుకబడి ఉంది.ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమిండియాకాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా భారత్ సొంతగడ్డపై న్యూజిలాండ్తో మూడు మ్యాచ్లు ఆడుతోంది. ఈ మూడూ గెలవడం ఖాయమని.. రోహిత్ సేన సులువుగానే ఫైనల్కు చేరుతుందని సిరీస్ ఆరంభంలో అంతా అనుకున్నారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి.బెంగళూరు, పుణెలో జరిగిన తొలి రెండు టెస్టుల్లో భారత బౌలర్లు రాణించినా.. బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో రెండింటిలో ఓటమి తప్పలేదు. ఫలితంగా పన్నెండేళ్ల తర్వాత భారత్ తొలిసారిగా స్వదేశంలో టెస్టు సిరీస్ కోల్పోయింది. దీంతో ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్టు టీమిండియాకు మరింత ప్రతిష్టాత్మకంగా మారింది.తొలిరోజు ఆటలో రాణించిన జడ్డూ, వాషీ..కానీ.. ఇక్కడా టీమిండియా తడ‘బ్యాటు’కు గురైంది. తొలిరోజు బౌలర్లు శుభారంభం అందించినా.. బ్యాటర్లు దానిని నిలబెట్టలేకపోయారు. కాగా వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్బుత రీతిలో రాణించి కివీస్ బ్యాటర్లను కట్టడి చేశారు.జడ్డూ ఐదు, వాషీ నాలుగు వికెట్లు తీయగా.. పేసర్ ఆకాశ్ దీప్(ఒక వికెట్) కూడా తన వంతు సహకారం అందించాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 235 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు.ఆ ఆనందం కాసేపట్లోనే ఆవిరిభారత్ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాసేపటికే కెప్టెన్, రోహిత్ శర్మ(18 బంతుల్లో 18)పెవిలియన్ చేరాడు. ఆది నుంచే దూకుడుకనబరిచిన అతడు.. కివీస్ ఫీల్డర్ల తప్పిదాల వల్ల రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయినప్పటికీ అగ్రెసివ్గా ఆడి పేసర్ మ్యాట్ హెన్రీ బౌలింగ్లో టామ్ లాథమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఇక వన్డౌన్ బ్యాటర్ శుబ్మన్ గిల్తో కలిసి మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేశాడు. కానీ కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ జైస్వాల్(30)ను బౌల్డ్ చేసి.. ఈ జోడీని విడదీశాడు. అయితే, ఇక్కడే టీమిండియా మేనేజ్మెంట్ ఓ ప్రయోగం చేసింది. నాలుగో నంబర్లో నైట్వాచ్మన్గా పేసర్ మహ్మద్ సిరాజ్ను పంపించింది.ఆఖరి 15 నిమిషాల్లో అంతా తలకిందులుజైస్వాల్ స్థానంలో సిరాజ్ క్రీజులోకి వచ్చీ రాగానే.. అజాజ్ పటేల్ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఎదుర్కొన్న తొలి బంతికే సిరాజ్ డకౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లి(4).. రనౌట్ అయి వికెట్ సమర్పించుకున్నాడు. ఫలితంగా టీమిండియా 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.ఇక తొలి రోజు ఆట ముగిసే సరికి.. తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ కంటే 149 పరుగులు వెనుకబడి ఉంది. రిషభ్ పంత్ ఒకటి, శుబ్మన్ గిల్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. నిజానికి శుక్రవారం 4. 45 నిమిషాల వరకు టీమిండియాదే పైచేయి. కానీ పదిహేను నిమిషాల్లోనే అంతా తారుమారైంది. జైస్వాల్, సిరాజ్, కోహ్లి అవుటైన తర్వాత కివీస్ పటిష్ట స్థితికి చేరుకుంది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్టు(నవంబరు 1- 5)👉వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై👉టాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్👉కివీస్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 235 రన్స్.. ఆలౌట్👉తొలిరోజు ఆట ముగిసే సరికి భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 86/4 (19)తుది జట్లుభారత్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్దీప్, మహ్మద్ సిరాజ్న్యూజిలాండ్ టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓ రూర్కీ. చదవండి: Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమిInd vs NZ: చెప్పినా వినని సర్ఫరాజ్ ఖాన్.. రోహిత్కు వార్నింగ్.. ఆఖరికి! -
IPL 2025: అతడికి రూ. 18 కోట్లు.. గుజరాత్ రిటెన్షన్ లిస్టు ఇదే!
ఐపీఎల్-2025 మెగా వేలానికి సమయం ఆసన్నమవుతోంది. నవంబరు చివరి వారంలో ఆక్షన్ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. అదే విధంగా.. వేలానికి ముందు పది ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను అక్టోబరు 31లోపు సమర్పించాలని డెడ్లైన్ విధించినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్కు సంబంధించిన ఆసక్తికర వార్తలు తెరమీదకు వచ్చాయి. టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీని విడిచిపెట్టాలని ఫ్రాంఛైజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక కెప్టెన్గా శుబ్మన్ గిల్ను కొనసాగించడంతో పాటు అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ను కూడా టైటాన్స్ రిటైన్ చేసుకోనుందట!పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంకాగా 2022లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్లోనే చాంపియన్గా నిలిచింది. మరుసటి ఏడాది రన్నరప్గా నిలిచి సత్తా చాటింది. అయితే, ఆ రెండు దఫాల్లో కెప్టెన్గా వ్యవహరించిన టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ ఏడాది జట్టును వీడి.. ముంబై ఇండియన్స్లో చేరాడు. ఈ క్రమంలో హార్దిక్ స్థానంలో శుబ్మన్ గిల్కు ఫ్రాంఛైజీ సారథ్య బాధ్యతలు అప్పగించింది.అయితే, ఐపీఎల్-2024లో గిల్ సేన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. గాయం కారణంగా షమీ సీజన్ మొత్తానికి దూరం కావడం.. కొన్ని మ్యాచ్లలో ఆఖరి వరకు పోరాడినా ఒత్తిడిలో చిత్తు కావడం ప్రభావం చూపింది. దీంతో పద్నాలుగు మ్యాచ్లకు గానూ కేవలం ఐదే గెలిచిన గుజరాత్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.అతడికి రూ. 18 కోట్లుఅయినప్పటికీ.. టీమిండియా భవిష్య కెప్టెన్గా గుర్తింపు పొందిన శుబ్మన్ గిల్పై నమ్మకం ఉంచిన ఫ్రాంఛైజీ యాజమాన్యం అతడికి రూ. 18 కోట్ల మేర చెల్లించి తమ జట్టు నాయకుడిగా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇక వరల్డ్క్లాస్ స్పిన్నర్ అయిన రషీద్ ఖాన్ సైతం ఈ సీజన్లో నిరాశపరిచాడు. 12 మ్యాచ్లు ఆడి కేవలం పది వికెట్లే తీశాడు. అయినప్పటికీ రషీద్ నైపుణ్యాలపై నమ్మకంతో అతడిని కూడా రిటైన్ చేసుకోనున్నారట.సాయి కిషోర్ను కూడా...అదే విధంగా.. ఐపీఎల్-2024లో శతకం బాది.. ఓవరాల్గా 527 పరుగులతో సత్తా చాటిన సాయి కిషోర్ను కూడా టైటాన్స్ అట్టిపెట్టుకోనుందట. ఇక అన్క్యాప్డ్ ప్లేయర్లు షారుఖ్ ఖాన్,రాహుల్ తేవటియాలను కూడా కొనసాగించనున్నట్లు సమాచారం. కాగా షమీ వన్డే వరల్డ్కప్-2023లో సత్తా చాటిన అనంతరం చీలమండకు సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో ఆటకు దూరమైన అతడు ఇంతవరకు పునరాగమనం చేయలేదు. అందుకే టైటాన్స్ షమీని వదిలేయనున్నట్లు సమాచారం.చదవండి: Ranji Trophy: 68 బంతుల్లోనే సెంచరీ.. ఆర్సీబీకి స్ట్రాంగ్ మెసేజ్! -
IND vs NZ Day 3 Lunch: రోహిత్ ఔటైనా దూకుడుగా ఆడుతున్న భారత్
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్.. టీమిండియా ముందు 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో భారత్ లంచ్ సమయానికి వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. 34 పరుగుల వద్దే కెప్టెన్ రోహిత్ శర్మ (8) వికెట్ కోల్పోయినప్పటికీ.. టీమిండియా దూకుడు తగ్గలేదు. యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) టీ20 తరహాలో రెచ్చిపోతుండగా.. శుభ్మన్ గిల్ (20 బంతుల్లో 22; 4 ఫోర్లు) అడపాదడపా షాట్లతో అలరిస్తున్నాడు. టీమిండియా లక్ష్యానికి మరో 278 పరుగుల దూరంలో ఉంది. రోహిత్ శర్మ వికెట్ మిచెల్ సాంట్నర్కు దక్కింది.అంతకుముందు న్యూజిలాండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 255 పరుగులకు ఆలౌటైంది. 198/5 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ ఓవర్నైట్ స్కోర్కు మరో 57 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4, రవీంద్ర జడేజా 3, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో (సెకెండ్) టామ్ లాథమ్ అర్ద సెంచరీతో (86) రాణించగా.. టామ్ బ్లండెల్ (41), గ్లెన్ ఫిలిప్స్ (48 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.దీనికి ముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 156 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ సాంట్నర్ ఏడు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాశించాడు. గ్లెన్ ఫిలిప్స్ 2, సౌతీ ఓ వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా (38) టాప్ స్కోరర్గా నిలిచాడు. యశస్వి, గిల్ చెరో 30 పరుగులు చేశారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 259 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ ఏడు వికెట్లతో చెలరేగి కివీస్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చాడు. అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కివీస్ ఇన్నింగ్స్లో కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) అర్ద సెంచరీలతో రాణించారు. -
వారిద్దరూ సిద్ధమే
పుణే: గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన శుబ్మన్ గిల్తో పాటు... మోకాలి వాపుతో కీపింగ్ చేసేందుకు ఇబ్బంది పడిన రిషబ్ పంత్ రెండో టెస్టు వరకు అందుబాటులో ఉంటారని భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే వెల్లడించాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా... భారత్, న్యూజిలాండ్ మధ్య గురువారం నుంచి పుణేలో రెండో టెస్టు ప్రారంభం కానుండగా.. మంగళవారం టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. అనంతరం డస్కటే మీడియాతో మాట్లాడాడు. బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కాన్వేను స్టంపౌట్ చేసే ప్రయత్నంలో పంత్ మోకాలికి గాయమైంది. గతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అదే కాలికి శస్త్రచికిత్స జరగడంతో జట్టు మొత్తం ఆందోళనకు గురైంది. గాయం తీవ్రత ఎక్కువ ఉండటంతో వెంటనే పంత్ మైదానాన్ని వీడగా... అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. అనంతరం అత్యవసర పరిస్థితుల్లో రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చిన పంత్... పరిగెత్తడానికి ఇబ్బంది పడుతూనే విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మ్యాచ్ అనంతరం ‘పంత్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరముంది’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొనడంతో అతడు రెండో టెస్టులో ఆడతాడా లేదా అనే సంశయం నెలకొంది. అయితే తాజాగా డస్కటే ఈ అంశంపై స్పష్టత ఇచ్చాడు. ‘పంత్ పూర్తిగా కోలుకున్నాడు. పుణే టెస్టుకు అతడు అందుబాటులో ఉంటాడు. గిల్ ఆరోగ్యం కూడా కుదుట పడింది. అతడు నెట్ ప్రాక్టీస్ కూడా చేశాడు. మ్యాచ్ వరకు అంతా సవ్యంగా ఉంటుంది అనుకుంటున్నాం’ అని డస్కటే పేర్కొన్నాడు. ఆ ఇద్దరి మధ్యే పోటీ భారత తుది జట్టులో చోటు కోసం ఇద్దరు ఆటగాళ్ల మధ్య పోటీ ఉందని డస్కటే అన్నాడు. తొలి టెస్టులో భారీ సెంచరీతో రాణించిన సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్ మధ్య పోటీ ఉందని అన్నాడు. ‘ఇందులో దాయడానికి ఏమీ లేదు. తుది జట్టులో ఓ బెర్త్ కోసం పోటీ ఉంది. బెంగళూరు టెస్టులో సర్ఫరాజ్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ కూడా సంసిద్ధంగా ఉన్నాడు. పిచ్, పరిస్థితులను బట్టి తుది జట్టు ఎంపిక ఉంటుంది. రాహుల్ ఆటతీరును కోచ్ గౌతమ్ గంభీర్ నిశితంగా పరిశీలిస్తున్నాడు. రాహుల్పై టీమ్ మేనేజ్మెంట్కు నమ్మకముంది. అదే సమయంలో దేశవాళీలతో పాటు అవకాశం వచ్చిన ప్రతిసారీ జాతీయ జట్టు తరఫున నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సర్ఫరాజ్ను కూడా పక్కన పెట్టలేం. అందుకే అందరు ఆటగాళ్లకు అండగా నిలుస్తాం. న్యూజిలాండ్ జట్టులో ఎక్కువ మంది ఎడంచేతి వాటం ఆటగాళ్లు ఉండటం వల్లే ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ను జట్టుకు ఎంపిక చేశారు. ఇటీవల రంజీ ట్రోఫీలో అతడి ప్రదర్శన బాగుంది. తమిళనాడు తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగి భారీ సెంచరీ బాదడంతో పాటు... బౌలింగ్లోనూ రాణించాడు’ అని డస్కటే గుర్తు చేశాడు. ఇక స్వదేశంలో జరిగిన టెస్టుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్న హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ను కూడా డస్కటే వెనకేసుకొచ్చాడు. ‘బెంగళూరు టెస్టు ఆఖరి రోజు తొలి గంటలో సిరాజ్ చక్కటి బౌలింగ్ చేశాడు. దురదృష్టవశాత్తు వికెట్ దక్కక పోయినా... అతడి బౌలింగ్లో ఎలాంటి లోపం లేదు. నాణ్యమైన బంతులతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. పుణేలో పరిస్థితులను బట్టే జట్టు ఎంపిక ఉంటుంది’ అని డస్కటే వివరించాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో రెండు ఓవర్లు మాత్రమే వేసిన సీనియర్ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు ఎలాంటి సమస్యలు లేవని అతడు అన్నాడు. మ్యాచ్ పరిస్థితులను బట్టే అతడు తక్కువ బౌలింగ్ చేశాడని తెలిపాడు. టీమిండియా ముమ్మర సాధన తొలి టెస్టులో పరాజయం పాలై సిరీస్లో వెనుకబడిన టీమిండియా... రెండో టెస్టు కోసం కసరత్తులు చేస్తోంది. మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో భారత ఆటగాళ్లు చెమటోడ్చారు. పంత్ గాయం నేపథ్యంలో మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్... కీపింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. కాసేపటికి మైదానంలోకి వచ్చిన పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడంతో పాటు చివర్లో కీపింగ్ సాధన కూడా చేయడంతో అతడి ఫిట్నెస్పై ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. మరోవైపు శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్ కూడా ప్రాక్టీస్లో పాల్గొన్నారు. ఇక కొత్తగా జట్టుతో కలిసి వాషింగ్టన్ సుందర్ నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ సాగించాడు. ఈ మ్యాచ్ కోసం రూపొందించిన పిచ్ను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెపె్టన్ రోహిత్ శర్మ, బౌలర్లు జడేజా తదితరులు నిశితంగా పరిశీలించారు. రెండో టెస్టు కోసం స్పిన్నర్లకు అనుకూలించే పిచ్ను తయారు చేసినట్లు సమాచారం. -
IND vs NZ 1st: పటిష్ట స్థితిలో న్యూజిలాండ్
IND vs NZ 1st Test Day 2 Updates And Highlights: టీమిండియాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ను 46 పరుగులకే ఆలౌట్ చేసిన కివీస్ జట్టు.. బ్యాటింగ్లోనూ అదరగొట్టింది. డెవాన్ కాన్వే అద్భుత ఇన్నింగ్స్ వల్ల.. రెండో రోజు ఆట ముగిసే సరికి 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. గురువారం నాటి ఆటలో ఓపెనర్, కెప్టెన్ టామ్ లాథమ్(15) విఫలం కాగా.. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 91 పరుగులతో దుమ్ములేపాడు. విల్ యంగ్ 33 పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర 22, డారిల్ మిచెల్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. 39.1: కాన్వే అవుట్టీమిండియాకు కీలక వికెట్ దక్కింది. సెంచరీకి చేరువగా వచ్చిన కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే అవుటయ్యాడు. 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. దీంతో కివీస్ మూడో వికెట్ కోల్పోయింది. రచిన్ 10 పరుగులతో ఆడుతుండగా.. డారిల్ మిచెల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 154/3 (39.1). 36.3: రెండో వికెట్ కోల్పోయిన కివీస్రవీంద్ర జడేజా బౌలింగ్లో విల్ యంగ్(33) కుల్దీప్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కాన్వే 89 పరుగులతో ఆడుతున్నాడు. రచిన్ రవీంద్ర క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 143-2(37 ఓవర్లలో)తొలి వికెట్ డౌన్కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో టామ్ లాథమ్(15) లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. కాన్వే 51 పరుగులతో ఆడుతున్నాడు. 17.1 ఓవర్లలో కివీస్ స్కోరు: 67-1. విల్ యంగ్ క్రీజులోకి వచ్చాడు.నిలకడగా ఆడుతున్న కివీస్ ఓపెనర్లు..న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది. 7 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు టామ్ లాథమ్(6), కాన్వే(21) ఉన్నారు.3 ఓవర్లకు కివీస్ స్కోర్: 10/03 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు టామ్ లాథమ్(6), కాన్వే(4) ఉన్నారు.46 పరుగులకే టీమిండియా ఆలౌట్..తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు ఘోర ప్రదర్శన కనబరిచారు. న్యూజిలాండ్ పేసర్ల దాటికి భారత్ కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ 5 వికెట్లతో నిప్పులు చేరిగాడు. అతడితో పాటు యువ పేసర్ విలియం ఓ రూర్క్ 4 వికెట్లు, సౌథీ తలా వికెట్తో భారత పతనాన్ని శాసించారు.టీమిండియా ఇన్నింగ్స్లో ఏకంగా ఐదుగురు బ్యాటర్లు డకౌట్గా వెనుదిరిగారు. విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ఖాన్, కేఎల్ రాహుల్, జడేజా, అశ్విన్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరారు. కెప్టెన్ రోహిత్ శర్మ(2), జైశ్వాల్(13) పరుగులు మాత్రమే చేశారు. కాగా భారత్కు ఇది టెస్టుల్లో మూడో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం.ఆలౌట్కు చేరువలో భారత్తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఆలౌట్కు చేరువైంది. 39 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. లంచ్ విరామం తర్వాత మాట్ హెన్రీ వరుస క్రమంలో అశ్విన్,పంత్ను పెవిలియన్కు పంపాడు.34 పరుగులకే 6 వికెట్లుబెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. మొదటి ఇన్నింగ్స్లో కేవలం 34 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఐదో వికెట్గా కేఎల్ రాహుల్(0), ఆరో వికెట్గా జడేజా ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు.భారత్ నాలుగో వికెట్ డౌన్..భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన జైశ్వాల్.. ఓ రూర్క్ బౌలింగ్లో ఔటయ్యాడు. కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్.. సంచలన క్యాచ్ను అందుకున్నాడు. క్రీజులోకి కేఎల్ రాహుల్ వచ్చాడు.వర్షం అంతరాయం..బెంగళూరు వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిపోయో సమయానికి భారత్ తమ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్లు కోల్పోయి కేవలం 13 పరుగులు మాత్రమే చేసింది.కష్టాల్లో భారత్..టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు కివీస్ పేసర్లు చుక్కలు చూపిస్తున్నారు. 12 పరుగులకే భారత్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్ శర్మ(2) సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితం కాగా.. విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో యశస్వీ జైశ్వాల్(8), రిషబ్(3) ఉన్నారు.భారత్ తొలి వికెట్ డౌన్..9 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. టిమ్ సౌథీ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి కోహ్లి వచ్చాడు.6 ఓవర్లకు భారత స్కోర్: 9/06 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(7), రోహిత్ శర్మ(2) పరుగులతో ఉన్నారు. తొలి సెషన్లో బంతి అద్భుతంగా స్వింగ్ అవుతోంది. దీంతో కివీస్ పేసర్లు భారత ఓపెనర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు.తొలుత బ్యాటింగ్ భారత్దే..బెంగళూరు వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. వర్షం కారణంగా తొలి రోజు ఆట మొత్తం తుడిచిపెట్టుకు పోయింది. దీంతో రెండో రోజు టాస్ వేశారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్కు భారత స్టార్ ప్లేయర్ శుబ్మన్ గిల్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో సర్ఫరాజ్ ఖాన్ తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లున్యూజిలాండ్: టామ్ లాథమ్(కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కేభారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్చదవండి: LLC 2024: యూసఫ్ పఠాన్ ఊచకోత.. అయినా పాపం?(వీడియో) -
శుభ్మన్ గిల్కు గాయం.. తొలి టెస్ట్కు అనుమానం..?
న్యూజిలాండ్తో రేపటి నుంచి ప్రారంభంకాబోయే తొలి టెస్ట్కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్ అందింది. గాయం బారిన పడిన స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ రెండో టెస్ట్ ఆడటం అనుమానంగా మారింది. గిల్కు మెడ పట్టేసినట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాంటి కామెంట్లు చేయలేదు. గిల్ విషయంలో భారత్ మేనేజ్మెంట్ చివరి నిమిషం వరకు వేచి చూడాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.మ్యాచ్ సమయానికి గిల్ పూర్తిగా కోలుకోకపోతే సర్ఫరాజ్ ఖాన్ అతని స్థానాన్ని భర్తీ చేయవచ్చు. సర్ఫరాజ్ ఇటీవల జరిగిన ఇరానీ కప్లో మ్యాచ్ విన్నింగ్ డబుల్ సెంచరీతో విరుచుకుపడిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రేపటి నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్కు (భారత్, న్యూజిలాండ్) వరుణ గండం పొంచి ఉన్నట్లు తెలుస్తుంది. మ్యాచ్ జరిగే ఐదు రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బెంగళూరులో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా ఇవాళ జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్ కూడా రద్దైంది. కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగనుంది. రెండో టెస్ట్ పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో.. మూడో మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనున్నాయి.న్యూజిలాండ్తో టెస్టులకు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.రిజర్వ్ ఆటగాళ్లు: హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.భారత్తో టెస్టు సిరీస్కు న్యూజిలాండ్ టీమ్డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, మార్క్ చాప్మన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్వెల్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, అజాజ్ పటేల్, బెన్ సియర్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, విలియం ఓ రూర్కే.చదవండి: షమీ ఫిట్గా ఉన్నా.. ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లం: రోహిత్ శర్మ -
Ind vs Ban: గిల్, జైస్వాల్లకు రెస్ట్.. వాళ్లిద్దరికి లక్కీ ఛాన్స్!
టెస్టు సిరీస్ అనంతరం టీమిండియా బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా వచ్చే నెల 6, 9, 12వ తేదీల్లో మూడు మ్యాచ్లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి త్వరలోనే జట్టును ప్రకటించనుంది.ఈ నేపథ్యంలో ఆసక్తికర వార్తలు తెరమీదకు వచ్చాయి. ఈ పొట్టి సిరీస్కు శుబ్మన్ గిల్తో పాటు యశస్వి జైస్వాల్కు విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. కాగా సొంతగడ్డపై నవంబరులో టీమిండియా న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే భారత్కు ఈ సిరీస్ కీలకం.గిల్, జైస్వాల్పై పనిభారం పడకుండాఈ నేపథ్యంలో గిల్, జైస్వాల్పై పనిభారం పడకుండా చూసుకునేందుకు.. మేనేజ్మెంట్ ఈ యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత.. గిల్- జైస్వాల్ పొట్టి ఫార్మాట్లో టీమిండియా ప్రధాన ఓపెనింగ్ జోడీగా మారారు.వాళ్లిద్దరికి లక్కీ ఛాన్స్!అయితే, కివీస్తో సిరీస్ కారణంగా వీరిద్దరు గనుక దూరమైతే.. రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మలకు లక్కీ ఛాన్స్ వచ్చినట్లే! వీరిద్దరు బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ ఆడేందుకు మార్గం సుగమమవుతుంది. అయితే, రుతురాజ్ ఇరానీ కప్-2024 మ్యాచ్ కారణంగా తొలి టీ20కి దూరం కానున్నాడని.. అందుకే జైస్వాల్ ఆ ఒక్కమ్యాచ్కి అందుబాటులో ఉంటాడనే మరో ప్రచారం కూడా జరుగుతోంది.కాగా ఇటీవల దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-‘సి’ కెప్టెన్గా ఉన్న రుతురాజ్.. ఇరానీ కప్లో రెస్టాఫ్ ఇండియా జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఈ మ్యాచ్ అక్టోబరు 1-5 వరకు జరుగనుంది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో సంజూ శాంసన్ ప్రధాన వికెట్ కీపర్గా ఎంపిక కానుండగా.. జితేశ్ శర్మను అతడికి బ్యాకప్గా సెలక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.విధ్వంసకర సెంచరీ హీరో అభిషేక్ శర్మటీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. శుబ్మన్ గిల్ సారథ్యంలోని ఈ జట్టులో స్థానం దక్కించుకున్న పంజాబీ బ్యాటర్ అభిషేక్ శర్మ.. తొలిటీ20 సందర్భంగా అరంగేట్రం చేశాడు.అయితే, తొలి మ్యాచ్లోనే డకౌట్ అయి విమర్శపాలైన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. రెండో టీ20లో శతకంతో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో వంద పరుగుల మార్కు అందుకుని.. ఆ తర్వాత అవుటయ్యాడు. ఇక అప్పటి నుంచి మళ్లీ ఇంత వరకు అతడికి టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు రాలేదు. ఇక టీమిండియా విషయానిస్తే.. బంగ్లాతో తొలి టెస్టు గెలిచి.. శుక్రవారం నుంచి ఆఖరిదైన రెండో టెస్టు ఆడనుంది.చదవండి: ICC CT 2025: పాకిస్తాన్ కాదు.. సెమీస్ చేరే జట్లు ఇవే: అఫ్గన్ కెప్టెన్ -
'గిల్, బుమ్రా, రాహుల్ కాదు.. అతడే టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్'
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన రీ ఎంట్రీలో సత్తాచాటుతున్నాడు. దాదాపు 600 రోజుల తర్వాత టెస్టు క్రికెట్లో పునరాగమనం చేసిన రిషబ్.. తన తొలి మ్యాచ్లోనే అదరగొట్టాడు. చెపాక్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీతో మెరిశాడు.టెస్టుల్లో 6వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా రిషబ్ పంత్ 2022 డిసెంబర్లో ఘోరమైన కారు ప్రమాదానికి గురయ్యాడు. దాదాపు ప్రాణాలు పోగొట్టుకునే స్థితి నుంచి అతను కోలుకున్న తీరు నమ్మలేనిది. కేవలం రెండేళ్లలోనే పూర్తి ఫిట్నెస్ సాధించి దుమ్ములేపుతున్న పంత్పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.వసీం అక్రమ్ వంటి దిగ్గజాలు సైతం ఈ ఢిల్లీ ఆటగాడిని పొగడ్తలతో ముంచెత్తాడు. పంత్ను మిరాకిల్ కిడ్ అని వసీం కొనియాడాడు. తాజాగా ఈ జాబితాలోకి మరో పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా చేరాడు. భారత జట్టులో వరల్డ్క్లాస్ ప్లేయర్లు ఉన్నారని, భవిష్యత్తులో భారత టెస్టు జట్టును పంత్ లీడ్ చేస్తాడని కనేరియా జోస్యం చెప్పాడు."ప్రస్తుత భారత జట్టును చూస్తుంటే ముచ్చటేస్తోంది. జట్టు విజయాల్లో ప్రతీ ప్లేయర్ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ వంటి అద్భతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. అందుకే భారత్ ప్రపంచ స్థాయి జట్టుగా నిలిచింది. రిషబ్ పంత్ భవిష్యత్తులో టెస్టుల్లో భారత జట్టుకు కచ్చితంగా సారథ్యం వహిస్తాడు. అతడు పునరాగమనం తర్వాత చాలా బాగా రాణిస్తున్నాడు. వికెట్ కీపర్గా అతడు ఎప్పుడూ బౌలర్లు, ఫీల్డర్లతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. అలా చేయడంతో మైదానంలో అందరూ చురుగ్గా ఉంటారు. నిజంగా భారత క్రికెట్ నుంచి బుల్లెట్ వంటి చురుకైన ఆటగాళ్లు పుట్టుకొస్తున్నారు" అని ఐఎఎన్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కనేరియా పేర్కొన్నాడు. -
India vs Bangladesh 1st Test: పంత్, గిల్ సెంచరీల మోత
దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడిన రిషభ్ పంత్ అంచనాలను అందుకుంటూ తనదైన శైలిలో సాధించిన శతకం... శుబ్మన్ గిల్ ఎప్పటిలాగే ప్రశాంతంగా ఆడుతూ పూర్తి చేసుకున్న సెంచరీ...ఆపై చెపాక్ బాయ్ అశి్వన్ మూడు కీలక వికెట్లతో ప్రత్యర్థి పని పట్టిన తీరు... చెన్నై టెస్టులో మూడో రోజు భారత్ హవానే కొనసాగింది. ముందుగా పంత్, గిల్ సెంచరీల తర్వాత తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి భారీ లక్ష్యంతో బంగ్లాదేశ్కు భారత్ సవాల్ విసరగా... తడబడుతూ ఆడిన బంగ్లా కుప్పకూలిపోకుండా కాస్త నిలవగలిగింది. వెలుతురులేమితో బంగ్లా ఓటమి ఆలస్యమైనట్లు కనిపించినా... ఆదివారం మిగిలిన ఆరు వికెట్లు తీయడం భారత్కు కష్టం కాకపోవచ్చు. చెన్నై: బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు విజయంపై గురి పెట్టింది. భారత్ విధించిన 515 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన బంగ్లా శనివారం ఆట ముగిసే సమయానికి 37.2 ఓవర్లలో 158 పరుగులు చేసింది. కెపె్టన్ నజ్ముల్ హసన్ (60 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్స్లు), షకీబ్ అల్ హసన్ (5 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో అశి్వన్కు మూడు వికెట్లు దక్కాయి. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా బంగ్లా మరో 357 పరుగులు చేయాల్సి ఉంది. వెలుతురులేమి కారణంగా ఆటను అంపైర్లు కాస్త ముందుగా నిలిపివేశారు. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 81/3తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్ను 64 ఓవర్లలో 4 వికెట్లకు 287 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. శుబ్మన్ గిల్ (176 బంతుల్లో 119 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్లు) కెరీర్లో ఐదో సెంచరీ... రిషభ్ పంత్ (128 బంతుల్లో 109; 13 ఫోర్లు, 4 సిక్స్లు) కెరీర్లో ఆరో సెంచరీ సాధించారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 167 పరుగులు జోడించారు. శనివారం భారత్ మొత్తం 41 ఓవర్లు ఆడి 206 పరుగులు జత చేసింది. శతకాల జోరు... మూడో రోజు ఆటలో పంత్, గిల్ను బంగ్లా బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ప్రత్యర్థి పేలవ బౌలింగ్ను సొమ్ము చేసుకున్న భారత బ్యాటర్లిద్దరూ దూకుడుగా ఆడారు. మిరాజ్ ఓవర్లో రెండు సిక్స్లు బాది గిల్ ముందుగా అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, ఆ తర్వాత పంత్ కూడా హాఫ్ సెంచరీని అందుకున్నాడు. 72 పరుగుల వద్ద పంత్ ఇచ్చిన క్యాచ్ను కెప్టెన్ నజ్ముల్ వదిలేశాడు. షకీబ్ ఓవర్లో పంత్ రెండు వరుస ఫోర్లు కొట్టడంతో తొలి సెషన్ ముగిసింది. లంచ్ తర్వాత కూడా షకీబ్ ఓవర్లో సిక్స్, ఫోర్ బాది పంత్ దూసుకుపోయాడు. ఎట్టకేలకు అభిమానులు ఎదురు చూసిన క్షణం వచి్చంది. షకీబ్ ఓవర్లో లాంగాఫ్ దిశగా దిశగా ఆడి రెండు పరుగులు తీయడంతో 124 బంతుల్లో పంత్ సెంచరీ పూర్తి కాగా...భారత శిబిరం మొత్తం తమ సహచరుడిని చప్పట్లతో అభినందించింది. తర్వాతి ఓవర్లోనే అతను వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే గిల్ కూడా 161 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. మరో నాలుగు ఓవర్లకు రోహిత్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. నజ్ముల్ హాఫ్ సెంచరీ... భారీ లక్ష్యం ముందుండగా బంగ్లా ఇన్నింగ్స్ను ఓపెనర్లు జాకీర్ హసన్ (47 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్), షాద్మన్ ఇస్లామ్ (68 బంతుల్లో 35; 3 ఫోర్లు) దూకుడుగా ఆరంభించారు. సిరాజ్ ఓవర్లో జాకీర్ 2 ఫోర్లు, సిక్స్తో 14 పరుగులు రాబట్టాడు. దాంతో స్కోరు 62/0కు చేరింది. అయితే టీ విరామం తర్వాత బుమ్రా చక్కటి బంతితో జాకీర్ను అవుట్ చేసి తొలి దెబ్బ కొట్టాడు. షాద్మన్ వికెట్ అశి్వన్ ఖాతాలో చేరింది. మరో వైపు నజు్మల్ ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో అశ్వి న్ కూడా నాలుగు సిక్స్లు సమరి్పంచుకున్నాడు. ఆ తర్వాత అశ్విన్ మరో రెండు వికెట్లు తీయడంతో స్కోరు 86/1 నుంచి 146/4కు చేరింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 376; బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 149; భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (సి) దాస్ (బి) నాహిద్ 10; రోహిత్ (సి) జాకీర్ (బి) తస్కీన్ 5; గిల్ (నాటౌట్) 119; కోహ్లి (ఎల్బీ) (బి) మిరాజ్ 17; పంత్ (సి) అండ్ (బి) మిరాజ్ 109; రాహుల్ (నాటౌట్) 22; ఎక్స్ట్రాలు 5; మొత్తం (64 ఓవర్లలో 4 వికెట్లకు డిక్లేర్డ్) 287. వికెట్ల పతనం: 1–15, 2–28, 3–67, 4–234.బౌలింగ్: తస్కీన్ 7–1–22–1, హసన్ మహమూద్ 11–1–43–0, నాహిద్ రాణా 6–0–21–1, షకీబ్ 13–0–79–0, మెహదీ హసన్ మిరాజ్ 25–3–10–3–2, మోమినుల్ 2–0–15–0. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: జాకీర్ (సి) యశస్వి (బి) బుమ్రా 33; షాద్మన్ (సి) గిల్ (బి) అశ్విన్ 35; నజు్మల్ (బ్యాటింగ్) 51; మోమినుల్ (బి) అశ్విన్ 13; ముషి్ఫకర్ (సి) రాహుల్ (బి) అశి్వన్ 13; షకీబ్ (బ్యాటింగ్) 5; ఎక్స్ట్రాలు 8; మొత్తం (37.2 ఓవర్లలో 4 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–62, 2–86, 3–124, 4–146.బౌలింగ్: బుమ్రా 7–2–18–1, సిరాజ్ 3.2–1–20–0, ఆకాశ్ దీప్ 6–0–20–0, అశ్విన్ 15–0–63–3, జడేజా 6–0–29–0. -
Ind vs Ban: టీమిండియాదే విజయం.. రికార్డులే సాక్ష్యం!
పాకిస్తాన్ను సొంతగడ్డపై మట్టికరిపించి 2-0తో టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన బంగ్లాదేశ్ జట్టు.. అదే జోరులో భారత్లో అడుగుపెట్టింది. పటిష్ట టీమిండియాను పడగొట్టడం తేలికేమీ కాదని తెలిసినా.. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొంది. అయితే, తొలి టెస్టు తొలి రోజు ఆరంభంలో కాస్త పైచేయి సాధించినా.. తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.భారీ లక్ష్యం.. బంగ్లాదేశ్ ఒక్కటీ గెలవలేదు!.గెలుపు సంగతి దేవుడెరుగు.. బంగ్లాదేశ్ ప్రస్తుతం భారీ ఓటమి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియని స్థితిలో నిలిచింది. అవును.. రెండు రోజుల ఆట మిగిలి ఉండవచ్చ. కానీ 515 పరుగులు సాధించడమైతే షాంటో బృందానికి అంత తేలికేమీ కాదు. గత రికార్డులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి.ఇప్పటి వరకు టెస్టుల్లో 400 పరుగులకు పైగా లక్ష్యాన్ని(ఫోర్త్ ఇన్నింగ్స్) బంగ్లాదేశ్ ఇప్పటి వరకు ఎప్పుడూ ఛేదించనే లేదు. 20 సార్లు ఇంతంటి భారీ లక్ష్యం ముందు నిలిచిన బంగ్లా.. ఒక్కసారి మాత్రం మ్యాచ్ను డ్రా చేసుకోగలిగింది. అయితే.. పందొమ్మిదిసార్లూ ఓటమినే చవిచూసింది. టీమిండియా బౌలర్ల జోరు చూస్తూ ఉంటే.. బంగ్లాదేశ్ ఖాతాలో 20వ పరాజయం కూడా చేరడం ఖాయంగా కనిపిస్తోంది.అప్పుడు అశ్విన్ సెంచరీ.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్ల సిరీస్ జరుగుతోంది. ఈ క్రమంలో చెన్నైలోని చెపాక్ వేదికగా గురువారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. అయితే, ఆరంభంలో బంగ్లా పేసర్ హసన్ మహమూద్ ధాటి(5/83)కి ఇబ్బంది పడ్డ టీమిండియా.. రవిచంద్రన్ అశ్విన్(113) సూపర్ సెంచరీతో కోలుకుంది.అశూతో పాటు ఓపెనర్ యశస్వి జైస్వాల్ 56, మరో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 86 పరుగులతో రాణించారు. ఫలితంగా టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో 376 పరుగులు స్కోరు చేసింది. అనంతరం.. బంగ్లాదేశ్ 149 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా 4, సిరాజ్ రెండు, ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీయగా.. స్పిన్నర్ జడ్డూ రెండు వికెట్లు పడగొట్టాడు.ఇపుడు గిల్, పంత్ శతకాలుఈ క్రమంలో 227 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియాను శుబ్మన్ గిల్, రిషభ్ పంత్ మరింత పటిష్ట స్థితిలో నిలిపారు. గిల్(119 నాటౌట్), పంత్(109) అద్భుత శతకాలతో దుమ్ములేపారు. ఈ క్రమంలో 64 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 287 పరుగుల వద్ద ఉండగా కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దీంతో ఓవరాల్గా 514 పరుగుల లీడ్లో ఉన్న భారత్.. బంగ్లాదేశ్కు 515 పరుగుల టార్గెట్ విధించింది. అయితే, ఇంతటి లక్ష్యాన్ని ఛేదించాలంటే బంగ్లాదేశ్కు ఈజీ కాదు. ఏమో గుర్రం ఎగరావచ్చు అంటారా?! చూద్దాం.. ఇప్పటికైతే టీమిండియా విజయం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు (సెప్టెంబరు 19- 23)టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 376బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 149టీమిండియా రెండో ఇన్నింగ్స్- 287/4 డిక్లేర్డ్బంగ్లాదేశ్ లక్ష్యం- 515 పరుగులుచదవండి: AFG vs SA: వన్డేల్లో అఫ్గన్ సంచలన విజయం.. సౌతాఫ్రికాపై సిరీస్ గెలుపు Aaj ka toh din hi 𝙎𝙝𝙪𝙗𝙝 hai! 🤌🏻Shubman Gill joins the centurion party with a stylish 💯#INDvBAN #IDFCFirstBankTestSeries #JioCinemaSports pic.twitter.com/ZpcuwZyjxQ— JioCinema (@JioCinema) September 21, 2024WELCOME BACK TO TEST CRICKET, RISHABH PANT! 🙌🏻💯#RishabhPant #INDvBAN #IDFCFirstBankTestSeries #JioCinemaSports pic.twitter.com/C4gJuv29Y1— JioCinema (@JioCinema) September 21, 2024 -
డకౌట్ని మరిపించి.. సెంచరీతో చెలరేగిన గిల్
బంగ్లాదేశ్తో తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్ శుబ్మన్ గిల్ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం దుమ్ములేపాడు. శనివారం నాటి మూడో రోజు ఆట భోజన విరామ సమయానికి 137 బంతులు ఎదుర్కొన్న గిల్.. 86 పరుగులు సాధించాడు.రెండో ఇన్నింగ్స్లోనే ఇలాబ్రేక్ తర్వాత తిరిగొచ్చి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా ఈ వన్డౌన్ బ్యాటర్ గత నాలుగు టెస్టుల్లో సెకండ్ ఇన్నింగ్స్లో మూడు అర్ధ శతకాలతో పాటు.. ఒక సెంచరీ సాధించాడు. తాజాగా మరోసారి రెండో ఇన్నింగ్స్లోనే శతకంతో సత్తా చాటడం విశేషం. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్లో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య చెన్నై వేదికగా గురువారం మొదటి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుని రోహిత్ సేనను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 376 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 149 పరుగులకే కుప్పకూలింది. పంత్ కూడా శతకం బాదాడుఈ క్రమంలో 83/3 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియాకు గిల్, పంత్ శుభారంభం అందించారు. వీరిద్దరి శతకాల కారణంగా టీమిండియాకు ఏకంగా 514 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో గిల్.. 119 పరుగుల వద్ద ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దీంతో బంగ్లాదేశ్కు భారత్ 515 పరుగుల లక్ష్యాన్ని విధించింది.టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు (సెప్టెంబరు 19- 23)టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 376బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 149టీమిండియా రెండో ఇన్నింగ్స్- 287/4 డిక్లేర్డ్బంగ్లాదేశ్ లక్ష్యం- 515 పరుగులుతుదిజట్లు:టీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.బంగ్లాదేశ్షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహీద్ రాణా.చదవండి: చరిత్ర సృష్టించిన జైస్వాల్.. గావస్కర్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్ -
Ind vs Ban: శతక్కొట్టిన పంత్.. రీఎంట్రీ అదుర్స్
బంగ్లాదేశ్తో తొలి టెస్టులో టీమిండియా స్టార్ రిషభ్ పంత్ శతక్కొట్టాడు. 631 రోజుల తర్వాత టెస్టు బరిలో దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 109 పరుగులు సాధించాడు. తన అద్భుత ఇన్నింగ్స్తో భారత్ బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యం విధించడంలో సహాయపడ్డాడు.88 బంతుల్లోనేకాగా తొలి ఇన్నింగ్స్లో పంత్ 39 పరుగులకే పరిమితమయ్యాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో ఆది నుంచే దూకుడుగా ఆడిన పంత్.. 88 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. ఆ తర్వాత శుబ్మన్ గిల్తో కలిసి స్కోరు బోర్డు పరిగెత్తించడమే పనిగా పెట్టుకున్నాడు. 13 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతోమొత్తంగా 128 బంతులు ఎదుర్కొని 109 పరుగులు చేశాడు. ఈ లెఫ్టాండర్ 13 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో ఈ మేర స్కోరు సాధించాడు. అయితే, సెంచరీ కొట్టిన కాసేపటికే పంత్ బౌల్డ్ కావడం గమనార్హం. మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో పంత్ వెనుదిరిగాడు. బంగ్లాదేశ్ ముందు కొండంత లక్ష్యంమరోవైపు శుబ్మన్ గిల్ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, అతడు 119 పరుగుల వద్ద ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ భారత్ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. పంత్, గిల్ సెంచరీల కారణంగా టీమిండియాకు 514 పరుగుల భారీ ఆధిక్యం లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఫలితంగా బంగ్లాదేశ్కు 515 పరుగుల రూపంలో కొండంత లక్ష్యం ముందుంది. చదవండి: DT 2024: ఆవేశ్ఖాన్ టీ20 తరహా బ్యాటింగ్.. రుతు, ఇషాన్ విఫలంWELCOME BACK TO TEST CRICKET, RISHABH PANT! 🙌🏻💯#RishabhPant #INDvBAN #IDFCFirstBankTestSeries #JioCinemaSports pic.twitter.com/C4gJuv29Y1— JioCinema (@JioCinema) September 21, 2024 -
Ind vs Ban: ముగిసిన మూడో రోజు ఆట.. బంగ్లా @158/4
India vs Bangladesh, 1st Test Chennai Day 3 Updates: వెలుతురులేమి కారణంగా శనివారం అరగంట ముందుగానే ఆటను ముగించారు. అప్పటికి 37.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసిన బంగ్లాదేశ్.. విజయానికి 357 పరుగుల దూరంలో ఉంది. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ షాంటో 51 పరుగులతో క్రీజులో ఉన్నాడు. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాకు ఒకటి, రవిచంద్రన్ అశ్విన్కు మూడు వికెట్లు దక్కాయి. అంతకు ముందు 287/4 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా.. బంగ్లాకు 515 పరుగుల టార్గెట్ విధించింది. శుబ్మన్ గిల్(119 నాటౌట్), రిషభ్ పంత్(109) శతకాలతో అదరగొట్టారు.టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు (సెప్టెంబరు 19- 23)టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 376బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 149టీమిండియా రెండో ఇన్నింగ్స్- 287/4 డిక్లేర్డ్బంగ్లాదేశ్ లక్ష్యం- 515 పరుగులు33.4:నాలుగో వికెట్ డౌన్ముష్ఫికర్ రహీం రూపంలో బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్లో 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ముష్ఫికర్ పెవిలియన్చేరాడు. బంగ్లా స్కోరు: 146/4 (33.4) . లక్ష్యానికి ఇంకా 369 పరుగుల దూరంలో ఉంది.29.6: మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్అశ్విన్ బౌలింగ్లో మూడో వికెట్గా మొమినుల్ హక్(13) వెనుదిరిగాడు. క్లీన్ బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ముష్ఫికర్ హీం క్రీజులోకి వచ్చాడు. షాంటో 36 పరుగులతో ఆడుతున్నాడు. రెండో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్అశ్విన్ బౌలింగ్లో షాద్మన్ ఇస్లాం(35) గిల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మొమినుల్ హక్ క్రీజులోకి వచ్చాడు. నజ్ముల్ షాంటో 14 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 86-2.16.2: తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్బుమ్రా బౌలింగ్లో జకీర్ హసన్ 33 పరుగుల వద్ద నిష్క్రమించాడు. షాద్మన్ ఇస్లాం 26 పరుగులతో ఆడుతున్నాడు. బంగ్లాదేశ్ స్కోరు: 62/1 (16.2) బంగ్లా స్కోరు @ టీ బ్రేక్ 56/0(13)భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్ టీ బ్రేక్ సమయానికి 13 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. ఓపెనర్లు షాద్మాన్ ఇస్లాం 21, జకీర్ హసన్ 32 పరుగులతో క్రీజులో ఉన్నారు.బంగ్లాదేశ్ లక్ష్యం 515భారీ ఆధిక్యంలో ఉన్న టీమిండియా 287/4 స్కోరు వద్ద తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మొత్తంగా 514 పరుగుల లీడ్లో ఉన్న భారత్.. బంగ్లాదేశ్కు 515 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది.భారత్కు 502 పరుగుల ఆధిక్యంగిల్, పంత్ సెంచరీల కారణంగా 63 ఓవర్లు ముగిసే సరికి భారత్ 506 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.గిల్ శతకం59.4: మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్న గిల్. తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన గిల్.. ఇప్పుడిలా శతక్కొట్టడం విశేషం. రాహుల్ 10, గిల్ 100 పరుగులతో క్రీజులో ఉన్నారు. సెంచరీ పూర్తి చేసుకున్న పంత్.. వికెట్ డౌన్54.4: గిల్తో కలిసి బజ్బాల్ తరహాలో దూకుడు పెంచిన రిషభ్పంత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంచ్ విరామం తర్వాత.. షకీబ్ అల్ హసన్ బౌలింగ్లో రెండు రన్స్ తీసి వంద పరుగుల మార్కు అందుకున్నాడు.అయితే ఆమరుసటి ఓవర్ మూడో బంతికే మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో పంత్ బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చాడు. టీమిండియా స్కోరు: 234-4(56). 461 పరుగుల ఆధిక్యం.లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 205/3 (51)శుబ్మన్ గిల్ 86, రిషభ్ పంత్ 82 పరుగులతో ఆడుతున్నారు. బంగ్లాదేశ్ కంటే టీమిండియా 432 పరుగుల ఆధిక్యం(తొలి ఇన్నింగ్స్ కలుపుకొని)లో ఉంది. సెంచరీకి చేరువైన గిల్శుబ్మన్ గిల్ శతకానికి చేరువయ్యాడు. 50 ఓవర్లు ముగిసే సరికి 136 బంతులు ఎదుర్కొన్న అతడు 85 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరోవైపు పంత్ 73 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా 422 పరుగుల ఆధిక్యంలో ఉంది.దంచి కొడుతున్న గిల్, పంత్గిల్ 75, పంత్ 72 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. 48 ఓవర్లలో టీమిండియా స్కోరు: 184/3.పంత్ హాఫ్ సెంచరీ43.3: మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో సింగిల్ తీసి పంత్ యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. గిల్, పంత్ నిలకడగా ఆడుతుండటంతో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. 44 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 151-3. బంగ్లాదేశ్పై 378 పరుగుల ఆధిక్యం.గిల్ హాఫ్ సెంచరీ29.5వ ఓవర్: మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో సిక్సర్ బాది శుబ్మన్ గిల్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్లో రెండో బంతికి సైతం గిల్ సిక్స్ కొట్టడం విశేషం. టీమిండియా స్కోరు: 114-3(30).సెంచరీ పూర్తి చేసుకున్న టీమిండియా28.5వ ఓవర్: బంగ్లా పేసర్ హసన్ మహమూద్ బౌలింగ్లో పంత్ ఫోర్ బాదడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్లో వంద పరుగుల మార్కు అందుకుంది. 29 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 100-3. పంత్ 25, గిల్ 39 పరుగులతో ఆడుతున్నారు.టీమిండియా రెండో ఇన్నింగ్స్- ఓవర్ నైట్ స్కోరుశుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి భారత జట్టు 23.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. 308 పరుగుల ఆధిక్యం సంపాదించింది. కాగా ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 10, రోహిత్ శర్మ 5 పరుగులతో నిరాశపరచగా.. విరాట్ కోహ్లి సైతం 17 పరుగులకే నిష్క్రమించాడు. శుబ్మన్ గిల్ 34, రిషభ్ పంత్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు సెప్టెంబరు 19- 23వేదిక: చెపాక్ స్టేడియం, చెన్నైటాస్: బంగ్లాదేశ్.. తొలుత బౌలింగ్టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 376బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 149తుదిజట్లు:టీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.బంగ్లాదేశ్షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహీద్ రాణా. -
శుబ్మన్ గిల్ అత్యంత చెత్త రికార్డు.. కోహ్లి సరసన?
చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ శుబ్మన్ గిల్ తీవ్ర నిరాశపరిచాడు. మొదటి ఇన్నింగ్స్లో గిల్ డకౌట్గా వెనుదిరిగాడు. 8 బంతులు ఎదుర్కొన్న గిల్.. ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు.క్రీజులోకి వచ్చినప్పటి నుంచే బంగ్లా పేసర్లు ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డ శుబ్మన్.. ఆఖరికి హసన్ మహమూద్ బౌలింగ్లో ఔటయ్యాడు. భారత ఇన్నింగ్స్ 8 ఓవర్ వేసిన మహ్మద్ బౌలింగ్లో ఫుల్ డెలివరీని డౌన్ది లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు.కానీ బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ లిట్టన్ దాస్ చేతికి వెళ్లింది. దీంతో గిల్ నిరాశతో పెవిలియన్కు చేరాడు.గిల్ చెత్త రికార్డు..ఇక ఈ మ్యాచ్లో డకౌటైన గిల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఈయర్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు డకౌటైన ఆరో భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో భారత మాజీ క్రికెటర్ మొహిందర్ అమర్నాథ్ ఉన్నాడు. 1983లో అమర్నాథ్ ఏకంగా 5 సార్లు డకౌటయ్యాడు. అతడి తర్వాత మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ (1969), దిలీప్ వెంగ్సర్కార్ (1979), వినోద్ కాంబ్లీ (1994), విరాట్ కోహ్లి(2021), గిల్(2024) ఉన్నారు. వీరిందరూ మూడు సార్లు ఓ క్యాలెండర్ ఈయర్లో డకౌటయ్యారు. ఇక తొలి ఇన్నింగ్స్లో మొదటి రోజు టీబ్రేక్ సమయానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్(56) హాఫ్ సెంచరీతో మెరిశాడు.చదవండి: 147 ఏళ్ల చరిత్రలో ఇది రెండోసారి.. గావస్కర్ను అధిగమించి.. -
భారత్ vs బంగ్లాదేశ్ తొలి టెస్టు మ్యాచ్ హైలైట్స్ (ఫోటోలు)
-
టీమిండియా భవిష్యత్తు సూపర్ స్టార్స్ ఆ ఇద్దరే: ఆసీస్ ఆటగాళ్లు
ఆస్ట్రేలియా ఆటగాళ్లకు టీమిండియా భవిష్యత్తు సూపర్ స్టార్స్ ఎవరనే ప్రశ్న ఎదురైనప్పుడు ఆసక్తికర సమాధానలు చెప్పారు. ఆసీస్ స్టార్ ప్లేయర్లంతా ముక్తకంఠంతో ఇద్దరు యువ ఆటగాళ్లకు ఓటు వేశారు. స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్, మార్నస్ లబూషేన్, నాథన్ లయోన్ యశస్వి జైస్వాల్కు ఓటు వేయగా.. కెమరూన్ గ్రీన్, ట్రవిస్ హెడ్ శుభ్మన్ గిల్వైపు మొగ్గు చూపారు.Australian players picking the future Superstars of Indian Cricket. 🇮🇳- Gill 🤝 Jaiswal...!!!!! pic.twitter.com/RSOzYQOA2k— Johns. (@CricCrazyJohns) September 16, 2024కాగా, టీమిండియా త్వరలో (నవంబర్ 22 నుంచి) బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో మొత్తం ఐదు మ్యాచ్లు జరుగనున్నాయి. టీమిండియా గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు ఆ జట్టును చిత్తుగా ఓడించింది. దీంతో ఈసారి ఎలాగైనా టీమిండియాకు ఓటమి రుచి చూపించాలని ఆసీస్ ఆటగాళ్లు పట్టుదలగా ఉన్నారు. మరోవైపు భారత్ జట్టు గతంలో కంటే ప్రస్తుతం చాలా పటిష్టంగా ఉంది. ఈసారి టీమిండియాను ఓడించడం అంత సులువైన పని కాదు. సీనియర్లు, జూనియర్లంతా సూపర్ ఫామ్లో ఉన్నారు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఆస్ట్రేలియా, టీమిండియా వేర్వేరు జట్లతో సిరీస్లలో బిజీగా ఉన్నాయి. త్వరలో భారత్.. బంగ్లాదేశ్ను ఎదుర్కోనుండగా.. ఆసీస్ ప్రస్తుతం ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడుతుంది. బంగ్లాదేశ్తో తొలి టెస్ట్ చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27న మొదలవుతుంది. మూడు టీ20లు గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో జరుగనున్నాయి.తొలి టెస్ట్కు భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్, యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: గిల్, పంత్, బుమ్రాలకు విశ్రాంతి..? -
గిల్ ప్లేస్లో ఎంట్రీ.. కట్ చేస్తే మెరుపు సెంచరీ?
దులీప్ ట్రోఫీ-2024ను ఇండియా-డి టీమ్ ఓపెనర్ ప్రథమ్ సింగ్ ఘనంగా ఆరంభించాడు. ఈ టోర్నీలో భాగంగా అనంతపూర్ వేదికగా ఇండియా-డితో జరుగుతున్న మ్యాచ్లో ప్రథమ్ సింగ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ శుబ్మన్ గిల్ స్ధానంలో భారత-ఎ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రథమ్.. ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. లెఫ్ట్హ్యాండర్ అయిన ప్రథమ్ సింగ్ తన క్లాసిక్ షాట్లతో ఆలరించాడు. హర్షిత్ రానా, అర్ష్దీప్ సింగ్ వంటి బౌలర్లను సైతం టార్గెట్ చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 189 బంతులు ఎదుర్కొన్న అతడు 12 ఫోర్లు, ఒక సిక్సర్తో 122 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో ఎవరీ ప్రథమ్ సింగ్ నెటిజన్లు తెగవెతికేస్తున్నారు.ఎవరీ ప్రథమ్ సింగ్?31 ఏళ్ల ప్రథమ్ సింగ్ ఆగస్టు 31, 1992లో ఢిల్లీలో జన్మించాడు. అతడు ఫస్ట్క్లాస్ క్రికెట్ రైల్వేస్కు ఆడుతున్నాడు. 2017లో మహారాష్ట్రపై ప్రథమ్ ఫస్ట్క్లాస్ అరంగేట్రం చేశాడు. సీనియర్ రైల్వేస్ జట్టు తరపున ఆడేమందు.. రైల్వేస్ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 29 మ్యాచ్లు ఆడిన ప్రథమ్ సింగ్.. 35.63 సగటుతో 169 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో ఇప్పటివరకు రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రథమ్ ఐపీఎల్లో కూడా భాగమయ్యాడు. 2017లో గుజరాత్ టైటాన్స్ తరపున క్యాష్రిచ్ లీగ్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఐపీఎల్-2022 మెగా వేలంలో రూ.20లక్షల కనీస ధరకు కోల్కతా నైట్రైడర్స్ కొనుగోలు చేసింది. 2024 సీజన్ ఛాంపియన్గా నిలిచిన కేకేఆర్ జట్టులో ప్రథమ్ సభ్యుడిగా ఉన్నాడు. కానీ అతడికి కేకేఆర్ తరపున ఒక్క మ్యాచ్ కూడా అవకాశం రాలేదు.చదవండి: భారత మాజీ క్రికెటర్కు షాక్.. నెల రోజులకే హెడ్కోచ్ పోస్ట్ ఊస్ట్?Century for Pratham Singh 💯6⃣, 4⃣, 4⃣What a way to get your maiden Duleep Trophy hundred 👏#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/EmmpwDJX1Q— BCCI Domestic (@BCCIdomestic) September 14, 2024 -
రింకూ, శ్రేయస్, సుందర్లపై దృష్టి
సాక్షి, అనంతపురం: దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీలో నేడు రెండో దశ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. అనంతపురం వేదికగా జరగనున్న ఈ మ్యచ్ల్లో భారత్ ‘ఎ’ జట్టుతో భారత్ ‘డి’... భారత్ ‘బి’ జట్టుతో భారత్ ‘సి’ తలపడనున్నాయి. తొలి రౌండ్ మ్యాచ్ల్లో భారత్ ‘బి’, ‘సి’ జట్లు విజయాలు సాధించాయి. ఈ నెల 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ మినహా టీమిండియా ప్లేయర్లెవరూ రెండో రౌండ్ దులీప్ ట్రోఫీ మ్యాచ్లో పాల్గొనడం లేదు. తొలి మ్యాచ్లో ఆడిన శుబ్మన్ గిల్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, యశ్ దయాళ్, అక్షర్ పటేల్... తమతమ జట్లను వీడి టీమిండియాతో జట్టు కట్టారు. దీంతో భారత్ ‘సి’ జట్టులో మినహా మిగిలిన టీమ్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. భారత ‘ఎ’ జట్టుకు మయాంక్ అగర్వాల్ సారథ్యం వహించనుండగా.. ‘బి’ టీమ్కు అభిమన్యు ఈశ్వరన్ కెపె్టన్గా వ్యవహరించనున్నాడు. ‘సి’ టీమ్కు రుతురాజ్ గైక్వాడ్, ‘డి’ జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనున్నారు. ప్రధాన ఆటగాళ్ల గైర్హాజరీలో దేశవాళీల్లో నిలకడ కొనసాగిస్తున్న యువ ఆటగాళ్లకు ఈ మ్యాచ్లు మంచి అవకాశం కానున్నాయి. రింకూ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్ వంటి వాళ్లు మెరుగైన ప్రదర్శన చేసి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని భావిస్తున్నారు. గత మ్యాచ్లో భారత్ ‘ఎ’ జట్టుకు సారథిగా వ్యవహరించిన శుబ్మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో మయాంక్కు జట్టు పగ్గాలు దక్కాయి. రెండేళ్ల క్రితం జాతీయ జట్టు తరఫున చివరి టెస్టు ఆడిన మయాంక్ తిరిగి సెలెక్టర్ల దృష్టిలో పడాలంటే భారీగా పరుగులు చేయాల్సిన అవసరముంది. బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్టు కోసమే భారత జట్టును ఎంపిక చేయగా... దులీప్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేస్తే బంగ్లాతో రెండో టెస్టు కోసం ప్రకటించనున్న జట్టులో చోటు దక్కించుకునే అవకాశం లేకపోలేదు.ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్తో తొలి టెస్టు కోసం ప్రకటించిన టీమిండియాలో సభ్యుడైన సర్ఫరాజ్... ఈ మ్యాచ్ అనంతరం నేరుగా చెన్నైలో జట్టుతో చేరనున్నాడు. భారత్ ‘బి’ జట్టు తరఫున బరిలోకి దిగనున్న సర్ఫరాజ్ ఖాన్... మరో మంచి ఇన్నింగ్స్తో రాణించి టీమిండియాలో చేరాలనుకుంటున్నాడు. ఇక గత మ్యాచ్లో భారీ సెంచరీతో చెలరేగిన సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ అదే జోరు కొనసాగించాలనుకుంటున్నాడు. అటు బ్యాట్తో ఇటు బంతితో సత్తాచాటగల స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ భారత్ ‘బి’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇంగ్లండ్తో సిరీస్లో ఆకట్టుకోలేకపోయిన రజత్ పాటిదార్తో పాటు శ్రేయస్ అయ్యర్ తిరిగి సత్తాచాటి సెలెక్టర్ల దృష్టిలో పడాలని చూస్తున్నారు. గత మ్యాచ్ ప్లెయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకోలేకపోయిన దేవదత్ పడిక్కల్, సంజూ సామ్సన్ భారత్ ‘డి’ జట్టు తరఫున ఈ మ్యాచ్లోనైనా అవకాశం దక్కించుకుంటారా చూడాలి. ఇక పేస్ బౌలర్లు ముఖేశ్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సుదీర్ఘ టెస్టు సీజన్కు ముందు లయ అందుకునేందుకు ఇది చక్కటి అవకాశం. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు ముందు భారత్ మొత్తం 10 టెస్టులు ఆడనుండగా... పేస్ బౌలర్లకు విరివిగా అవకాశాలు వచ్చే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో దులీప్ ట్రోఫీలో రాణించిన వారిపై సెలెక్టర్ల దృష్టి ఉండనుంది. ఇక గత మ్యాచ్లో ఎనిమిది వికెట్లతో సత్తాచాటిన లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు.దులీప్ ట్రోఫీలో తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లుతిలక్ వర్మ (భారత్ ‘ఎ’) షేక్ రషీద్ (భారత్ ‘ఎ’) నితీశ్ కుమార్ రెడ్డి (భారత్ ‘బి’) రికీ భుయ్ (భారత్ ‘డి’) శ్రీకర్ భరత్ (భారత్ ‘డి’) -
టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ బర్త్డే: ఆ ముగ్గురు హైలైట్ (ఫొటోలు)
-
DT 2024: గిల్ స్థానంలో కెప్టెన్గా కర్ణాటక బ్యాటర్
దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-‘ఎ’ జట్టు కెప్టెన్గా మయాంక్ అగర్వాల్గా ఎంపికయ్యాడు. శుబ్మన్ గిల్ స్థానంలో అతడికి ఈ జట్టు పగ్గాలు అప్పగించినట్లు బీసీసీఐ సోమవారం వెల్లడించింది. ఈ రెడ్బాల్ టోర్నీలో మిగిలిన మ్యాచ్లలో ఇండియా-‘ఎ’ జట్టుకు మయాంక్ సారథ్యం వహించనున్నట్లు తెలిపింది.కాగా బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్లంతా దులిప్ ట్రోఫీ బరిలో దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పంజాబీ బ్యాటర్ శుబ్మన్ గిల్ ఇండియా-‘ఎ’ జట్టుకు కెప్టెన్గా నియమితుడయ్యాడు. అయితే, ఇటు సారథిగా.. అటు బ్యాటర్గా అనుకున్న ఫలితం రాబట్టలేకపోయాడు.టీమిండియాలోకి గిల్బెంగళూరు వేదికగా ఇండియా-‘బి’తో జరిగిన తొలి మ్యాచ్లో కేవలం 46 పరుగులు చేసిన గిల్.. జట్టును విజేతగా నిలపడంలో విఫలమయ్యాడు. ఇండియా-‘బి’ చేతిలో ఇండియా-‘ఎ’ జట్టు 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్తో టీమిండియా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ మొదలుకానుంది.ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు సంబంధించిన జట్టును బీసీసీఐ ఆదివారమే ప్రకటించింది. ఇందులో గిల్కు చోటు దక్కింది. ఈ క్రమంలో అతడు ఇండియా-‘ఎ’ జట్టును వీడనున్నాడు. ఫలితంగా గిల్ స్థానంలో మయాంక్ కెప్టెన్గా బాధ్యతలు నెరవేర్చనున్నాడు.కాగా గిల్తో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్ సైతం బంగ్లాతో టెస్టుకు ఎంపికైన నేపథ్యంలో ఇండియా-‘ఎ’ జట్టు నుంచి వైదొలిగారు.ఇక అనంతపురంలోఇక ఇండియా-‘ఎ’ జట్టు తదుపరి అనంతపురం వేదికగా ఇండియా-‘డి’తో సెప్టెంబరు 12 నుంచి మ్యాచ్ ఆడనుంది. కాగా కర్ణాటక ఓపెనింగ్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ రంజీ ట్రోఫీ 2024లోనూ సారథిగా వ్యవహరించనున్నాడు. అంతకంటే ముందుగా ఇలా దులిప్ ట్రోఫీలోనూ కెప్టెన్గా పనిచేసే అవకాశం దక్కింది. ఇక ఇండియా-‘ఎ’ తొలి మ్యాచ్లో మయాంక్ వరుసగా 36, 3 పరుగులు చేశాడు.శుబ్మన్ గిల్ నిష్క్రమణ తర్వాత ఇండియా-‘ఎ’ జట్టు(అప్డేటెడ్):మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రియాన్ పరాగ్, అక్షయ్ నారంగ్, ఎస్కే రషీద్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కొటియన్, షామ్స్ ములానీ, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్. చదవండి: మహారాష్ట్ర శాంసన్లా అతడి పరిస్థితి.. బీసీసీఐపై ఫ్యాన్స్ ట్రోల్స్ -
మహారాష్ట్ర శాంసన్లా అతడి పరిస్థితి: బీసీసీఐపై ట్రోల్స్
రుతురాజ్ గైక్వాడ్.. దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్ర కెప్టెన్గా సత్తా చాటుతున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తొలుత అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన అతడు.. ఆ మరుసటి ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు మొత్తంగా ఆరు వన్డేలు, 23 టీ20లు ఆడాడు.వన్డేల్లో 73.25 స్టైక్రేటుతో 115 పరుగులు సాధించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. పొట్టి ఫార్మాట్లో 143.54 స్టైక్రేటుతో 633 రన్స్ చేశాడు. ఇక ఫస్ట్క్లాస్ క్రికెట్లో రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ సగటు 42.69. ఇప్పటి వరకు 29 ఇన్నింగ్స్ ఆడి 2092 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి.అయితే, రుతురాజ్ గైక్వాడ్కు మాత్రం ఇంతవరకు టెస్టుల్లో అవకాశం రాలేదు. ఇటీవల దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-సి జట్టుకు కెప్టెన్గా అతడి పేరును ప్రకటించగానే.. త్వరలోనే రుతు టెస్టు అరంగేట్రం ఖాయమని అభిమానులు సంతోషపడిపోయారు. బ్యాటర్గా ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న ఈ మహారాష్ట్ర ఆటగాడిని బంగ్లాదేశ్తో టెస్టులకు ఎంపిక చేస్తారని ఆశించారు.ఎందుకు అవకాశాలు ఇవ్వరు?కానీ.. తొలి టెస్టుకు ప్రకటించిన జట్టులో రుతుకు స్థానం దక్కలేదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలక్టర్లను ట్రోల్ చేస్తూ నెట్టింట విమర్శలకు దిగాను రుతు ఫ్యాన్స్. వన్డే, టీ20 వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్తో పోలుస్తూ రుతురాజ్కు తీరని అన్యాయం జరుగుతోందంటూ మండిపడుతున్నారు. ఇరవై ఐదేళ్ల గిల్కు లెక్కలేనన్ని అవకాశాలు ఇచ్చారని.. అదే 27 ఏళ్ల రుతు విషయంలో మాత్రం ఎందుకు వివక్ష చూపిస్తున్నారని మండిపడుతున్నారు. టెస్టుల్లో కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా యశస్వి జైస్వాల్ ఓపెనర్గా పాతుకుపోగా.. గిల్ను మూడో స్థానంలో ఆడిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.మహారాష్ట్ర శాంసన్లా అతడి పరిస్థితివన్డౌన్లో గిల్ విఫలమవుతున్నా అతడికి ఛాన్సులు ఇస్తున్న మేనేజ్మెంట్.. కనీసం బ్యాకప్ ఓపెనర్గా అయినా రుతురాజ్ను ఎందుకు ఎంపికచేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ మాదిరే.. రుతుపై వివక్ష చూపుతున్నారని.. మహారాష్ట్ర శాంసన్ అంటూ రుతు పేరును ట్రెండ్ చేస్తున్నారు. కాగా దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-సి కెప్టెన్గా వ్యవహరించిన రుతురాజ్ గైక్వాడ్ ఇండియా-డితో మ్యాచ్లో 5, 46 పరుగులు చేశాడు. మరోవైపు.. ఇండియా- ఎ కెప్టెన్ శుబ్మన్ గిల్ 25, 21 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. బంగ్లాతో తొలి టెస్టుకు 16 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ఆదివారం రాత్రి ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ టీమ్లో రుతురాజ్కు చోటు దక్కలేదు.చదవండి: Ind vs Ban: అందుకే వాళ్లిద్దరికి టీమిండియాలో చోటు దక్కలేదు!Squad is out. Shubman Gill makes the cut, but Ruturaj Gaikwad doesn't! Honestly, isn't this BCCI politics at play!? No matter how well guy performs and wins, he can never find a place in Rohit Sharma's team!What partiality, Mann.#INDvBAN #RuturajGaikwad #BCCI— Sharon Solomon (@BSharan_6) September 8, 2024 -
‘జఫ్పా’తో మాయచేసిన సైనీ.. గిల్ బౌల్డ్!.. స్కోరెంతంటే?
టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ దులిప్ ట్రోఫీ-2024లో శుభారంభం అందుకోలేకపోయాడు. ఇండియా-‘ఏ’ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఇండియా- ‘బి’తో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో తేలిపోయాడు. కేవలం 25 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.నిరాశపరిచిన గిల్క్రీజులో నిలదొక్కుకుని భారీ స్కోరు సాధిస్తాడనుకున్న అభిమానులను పూర్తిగా నిరాశపరిచాడు. ఇండియా-‘బి’ పేసర్ నవదీప్ సైనీ సంధించిన ‘జఫ్ఫా(పర్ఫెక్ట్ బాల్)’ ధాటికి బౌల్డ్ అయ్యాడు. దులిప్ ట్రోఫీ తొలి రౌండ్లో భాగంగా ఇండియా-ఏ, ఇండియా-బి జట్ల మధ్య గురువారం తొలి మ్యాచ్ ఆరంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన శుబ్మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.ముషీర్ ఖాన్ శతకం కారణంగా ఇండియా-బి మెరుగైన స్కోరుఈ క్రమంలో ఇండియా-బి తరఫున అరంగేట్ర బ్యాటర్ ముషీర్ ఖాన్ అద్భుత శతకం(181)తో ఆకట్టుకోగా.. పేసర్ నవదీప్ సైనీ సైతం సంచలన ఇన్నింగ్స్(56) ఆడాడు. వీరిద్దరు రాణించిన కారణంగా 321 పరుగుల వద్ద రెండోరోజు ఇండియా-బి తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇండియా-ఏ జట్టుకు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ శుభారంభం అందించాడు.సైనీ జఫ్ఫా.. గిల్ బౌల్డ్ఈ కర్ణాటక బ్యాటర్ 45 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 36 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. నఅయితే, మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ 43 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్ల సాయంతో 25 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్ 14వ ఓవర్లో నవదీస్ సైనీ అవుట్సైడ్ ఆఫ్ దిశగా వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. ఫలితంగా బంతి స్టంప్ను ఎగురగొట్టడంతో గిల్ తొలి వికెట్గా వెనుదిరిగాడు.వీడియో వైరల్అనంతరం నవదీప్ సైనీ బౌలింగ్లో వికెట్ కీపర్ రిషభ్ పంత్కు క్యాచ్ ఇవ్వడంతో మయాంక్ ఇన్నింగ్స్కు తెరపడింది. దీంతో రెండో రోజు ఆటలో ఇండియా-ఏ రెండో వికెట్ కోల్పోయింది. ఆట పూర్తయ్యే సరికి రియాన్ పరాగ్ 27, కేఎల్ రాహుల్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా గిల్ అవుటైన దృశ్యాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ వైస్ కెప్టెన్గా ఎంపికైన గిల్.. తదుపరి బంగ్లాదేశ్తో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. దులిప్ ట్రోఫీ ప్రదర్శన ఆధారంగా భారత జట్టు ఎంపిక నేపథ్యంలో గిల్ తనను తాను మరోసారి నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. చదవండి: బ్యాట్ ఝులిపించిన శ్రేయస్ అయ్యర్.. ఎట్టకేలకు..Terrific delivery 🔥Excellent catch 👌Navdeep Saini bowled a peach to dismiss Shubman Gill and Rishabh Pant pulled off a superb diving catch to remove Mayank Agarwal.#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/z1cCHONjCI— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2024 -
కుల్దీప్ భాయ్తో అంత ఈజీ కాదు.. వారిద్దరి వల్లే ఇదంతా: సెంచరీ హీరో
దేశీవాళీ క్రికెట్లో ముంబై యువ బ్యాటర్, భారత క్రికెటర్ సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. దులీప్ ట్రోఫీ-2024లో ఇండియా బి జట్టుకు ప్రాతనిథ్యం వహిస్తున్న ముషీర్.. భారత బి జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ ‘బి’ 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో ముషీర్ ఒంటరి పోరాటం చేశాడు. తన విరోచిత పోరాటంతో జట్టును అదుకున్నాడు. నవ్దీప్ సైనీ అండతో ముషీర్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. దీంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్లో భారత్ ‘బి’ జట్టు 79 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ (227 బంతుల్లో 105; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నాడు. అతడితో పాటు సైనీ (74 బంతుల్లో 29 ; 4 ఫోర్లు, ఒక సిక్సర్) నాటౌట్గా నిలిచాడు.ఇక తొలి రోజు ఆట తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన ముషీర్.. తన సెంచరీ క్రెడిట్ను భారత ఆటగాళ్లు రిషబ్ పంత్, శుబ్మన్ గిల్కు ఇచ్చాడు. "నేను కుల్దీప్ యాదవ్కు ప్రత్యర్ధిగా ఆడటం ఇదే రెండో సారి. అతడొక వరల్డ్క్లాస్ బౌలర్ అని మనకు తెలుసు. కుల్దీప్ భాయ్ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. కానీ మా జట్టులో రిషబ్ పంత్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. రిషబ్ భాయ్తో పాటు శుబ్మన్ గిల్ ఈ మ్యాచ్ కంటే ముందు నాకు కొన్ని సూచనలు చేశారు. కుల్దీప్ భాయ్ వేసిన బంతుల్లో ఏది అత్యంత ప్రభావవంతంగా ఉంటుందో వారు నాకు చెప్పారు. అతడి బౌలింగ్లో ఏ బంతులను ఎటాక్ చేయాలో నాకు వారిద్దరూ వివరించారు. దీంతో నేను క్రీజులో సెట్ అయ్యాక అతడిని సులభంగా ఎదుర్కొన్నాను" అని ముషీర్ ఖాన్ పేర్కొన్నాడు. -
శుభ్మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్.. పంత్కు ఫ్యూజులు ఔట్
దులీప్ ట్రోఫీ-2024లో భాగంగా బెంగళూరు వేదికగా ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా-ఏ ఆటగాడు శుభ్మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. లాంగ్ ఆఫ్ దిశగా ఇండియా-బి ఆటగాడు రిషబ్ పంత్ ఆడిన షాట్ను గిల్ పక్షిలా గాల్లోకి ఎగిరి ఒడిసిపట్టుకున్నాడు. గిల్ స్టన్నింగ్ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. ఈ మ్యాచ్లో పంత్ కేవలం ఏడు పరుగులు చేసి ఆకాశ్దీప్ బౌలింగ్లో శుభ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.SHUBMAN GILL - THE STAR. ⭐- What a brilliant catch by Shubman Gill. 🔥pic.twitter.com/cKHuLPvG0k— Tanuj Singh (@ImTanujSingh) September 5, 2024మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-బి 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా ముషీర్ ఖాన్ (97), నవ్దీప్ సైనీ (21) ఆదుకున్నారు. మూడో సెషన్ సమయానికి ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ సెంచరీకి చేరువయ్యాడు. నవ్దీప్.. ముషీర్కు సరైన సహకారం అందిస్తున్నాడు. వీరిద్దరూ ఈ రోజంతా ఆడగలిగితే ఇండియా-బి గౌరవప్రదమైన స్కోర్ చేయగలుగుతుంది.ఇండియా-బి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 30, అభిమన్యు ఈశ్వరన్ 13, సర్ఫరాజ్ ఖాన్ 9, రిషబ్ పంత్ 7, నితీశ్ రెడ్డి 0, వాషింగ్టన్ సుందర్ 0, సాయికిషోర్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఇండియా-ఏ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఆకాశ్దీప్, ఆవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు తీశారు.ఇవాళే మొదలైన మరో మ్యాచ్లో ఇండియా-సి, ఇండియా-డి జట్లు తలపడుతున్నాయి. ఇండియా-డి తొలి ఇన్నింగ్స్లో 164 పరుగులకే ఆలౌటైంది. అక్షర్ పటేల్ 86 పరుగులు చేసి ఇండియా-డిని ఆదుకున్నాడు. 76 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్.. అర్ష్దీప్ సింగ్తో (13) కలిసి తొమ్మిదో వికెట్కు 84 పరుగులు జోడించాడు.అక్షర్ మినహా ఇండియా-డిలో ఎవ్వరూ రాణించలేదు. అథర్వ తైడే 4, యశ్ దూబే 10, శ్రేయస్ అయ్యర్ 9, దేవ్దత్ పడిక్కల్ 0, రికీ భుయ్ 4, శ్రీకర్ భరత్ 13,సరాన్ష్ జైన్ 13, హర్షిత్ రాణా 0, అర్ష్దీప్ సింగ్ 13 పరుగులు చేశారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్కుమార్ వైశాఖ్ 3, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహన్ చెరో 2, మానవ్ సుతార్, హృతిక్ షొకీన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-సి 28 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (5), సాయి సుదర్శన్ (7), ఆర్యన్ జుయెల్ (12), రజత్ పాటిదార్ (13) ఔట్ కాగా.. బాబా ఇంద్రజిత్ (13), అభిషేక్ పోరెల్ (19) క్రీజ్లో ఉన్నారు. -
టెస్టుల్లో మెరుగ్గా రాణించలేకపోయా.. ఇకపై: గిల్
టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ తన కెప్టెన్సీ స్కిల్స్ను మెరుగుపరుచుకునేందుకు మరో అవకాశం దక్కింది. పరిమిత ఓవర్లలో భారత వైస్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన గిల్.. ఇప్పుడు రెడ్బాల్ క్రికెట్పై దృష్టి సారించాడు.బంగ్లాదేశ్తో టెస్టులకు టీమిండియా వైస్ కెప్టెన్గా గిల్ ఎంపికయ్యే అవకాశముంది. అంతకంటే ముందు దేశీవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ రూపంలో గిల్కు ఛాలెంజ్ ఎదురుకానుంది. దులీప్ ట్రోఫీ-2024 ఇండియా ‘ఎ’ జట్టుకు గిల్ సారథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీ తొలి రౌండ్లో భాగంగా బెంగళూరు వేదికగా ఇండియా-బితో భారత ఎ జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శుబ్మన్ గిల్.. బి జట్టును తొలుత బ్యాటింగ్ ఆహ్హనించాడు. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు కెప్టెన్ శుబ్మన్ గిల్ మీడియా సమావేశంలో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన ఆటకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. "డిఫెన్స్ను మరింత బలోపేతం చేసుకునేందుకు సాధన చేశా. ట్రాక్పై స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తా. టి20లు ఎక్కువ ఆడటం వల్ల బ్యాటింగ్ పిచ్లపై డిఫెన్స్లో కాస్త వెనుకబడతాం. ఇంగ్లండ్ సిరీస్కు ముందు దానిపైనే దృష్టి సారించా. టెస్టు క్రికెట్లో ఇప్పటి వరకు అనుకున్న స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయా. ఈ సీజన్లో 10 టెస్టు మ్యాచ్లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ఆటతీరు మరింత మెరుగు పరుచుకునేందుకు ప్రయత్నిస్తా" అని గిల్ పేర్కొన్నాడు. -
నేటి నుంచి భారత దేశవాళీ క్రికెట్ సీజన్ మొదలు
బెంగళూరు: భారత జట్టు అంతర్జాతీయ సీజన్ ప్రారంభానికి రెండు వారాల ముందుగానే 2024–2025 దేశవాళీ క్రికెట్ సీజన్కు తెర లేవనుంది. ఇందులో భాగంగా గురువారం దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్లు మొదలుకానున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్లో భారత్ ‘ఎ’ జట్టుతో భారత్ ‘బి’ జట్టు... అనంతపురంలో నిర్వహించనున్న మరో మ్యాచ్లో భారత్ ‘సి’ జట్టుతో భారత ‘డి’ జట్టు తలపడనున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు ముందు టీమిండియా మరో 10 టెస్టు మ్యాచ్లు ఆడాల్సి ఉండగా... ఈ టోరీ్నలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలున్నాయి. భారత కెపె్టన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాకు ఈ టోర్నీ నుంచి విశ్రాంతినివ్వగా... మిగిలిన యువ ఆటగాళ్లందరూ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. రిషభ్ పంత్... చాన్నాళ్ల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్ ఆడనున్నాడు. టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలనుకుంటున్న శుభ్మన్ గిల్ భారత ‘ఎ’ జట్టుకు సారథ్యం వహిస్తుండగా... మరో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ భారత్ ‘బి’ నుంచి బరిలోకి దిగనున్నాడు. ఈ టోర్నీని జాతీయ సెలెక్టర్లు నిశితంగా పరిశీలించనున్న నేపథ్యంలో ఆటగాళ్లంతా తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని ఉవి్వళ్లూరుతున్నారు. మిడిలార్డర్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్పై ప్రధానంగా దృష్టి ఉంటుంది. సీనియర్ పేసర్ షమీ శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటుండగా... సిరాజ్ అనారోగ్యంతో టోరీ్నకి దూరమయ్యాడు. బుమ్రా కూడా అందుబాటులో లేకపోవడంతో మెరుగైన ప్రదర్శన కనబర్చిన పేసర్లకు ప్రత్యేక గుర్తింపు దక్కడం ఖాయమే. దీంతో ముకేశ్ కుమార్, ఆకాశ్దీప్, అర్‡్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, విద్వత్ కావేరప్ప, విజయ్ కుమార్, హర్షిత్ రాణాలపై సెలెక్టర్లు దృష్టి సారించనున్నారు. స్పిన్ విభాగంలో సత్తా చాటేందుకు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సాయికిశోర్, సౌరభ్ కుమార్, మానవ్ సుతార్ సిద్ధంగా ఉన్నారు. ఇషాన్ కిషన్ అవుట్ దేశవాళీ టోర్నీల్లో ఆడని కారణంగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్... దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్ల్లో ఆడటం లేదు. కండరాల నొప్పితో బాధపడుతున్న ఇషాన్... భారత ‘డి’ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అనంతపురం వేదికగా జరగనున్న తొలి మ్యాచ్లో భారత్ ‘సి’తో భారత్ ‘డి’ ఆడుతుంది. దీంతో గురువారం ప్రారంభం కానున్న పోరులో భారత్ ‘డి’ తరఫున ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్ వికెట్ కీపర్గా వ్యవహరించే అవకాశాలున్నాయి. మరోవైపు భారత్ ‘ఎ’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పేసర్ ప్రసిధ్ కృష్ణ కూడా శస్త్ర చికిత్స నుంచి పూర్తిగా కోలుకోలేదు. దీంతో అతడు కూడా తొలి రౌండ్ మ్యాచ్కు అందుబాటులో లేకుండా పోయాడు. ఇషాన్ స్థానంలో సంజూ సామ్సన్ను జట్టులోకి తీసుకున్నారు.జట్లు భారత్ ‘ఎ’: శుబ్మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుశ్ కొటియాన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుశాగ్ర, శాశ్వత్. భారత్ ‘బి’: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ముషీర్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి (ఫిట్నెస్ సాధిస్తేనే), వాషింగ్టన్ సుందర్, నవ్దీప్ సైనీ, యశ్ దయాల్, ముకేశ్ కుమార్, రాహుల్ చహర్, సాయి కిశోర్, మోహిత్ అవస్తి, జగదీశన్. భారత్ ‘సి’: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటిదార్, అభిషేక్ పొరెల్, ఇంద్రజీత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, విజయ్కుమార్, అన్షుల్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, అర్యాన్ జుయల్, సందీప్ వారియర్. భారత్ ‘డి’: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ తైడె, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, సంజూ సామ్సన్, రికీ భుయ్, సారాంశ్ జైన్, అక్షర్ పటేల్, అర్షదీప్, ఆదిత్య థాక్రే, హర్షిత్ రాణా, తుషార్, ఆకాశ్ సేన్ గుప్తా, శ్రీకర్ భరత్, సౌరభ్ కుమార్. -
తారలు దిగివచ్చే వేళ.. అనంతపురంలో దులీప్ ట్రోఫీ
బ్యాటుతో రప్ఫాడేస్తారు. పరుగులతో హోరెత్తిస్తారు. కళ్లు చెదిరే సిక్సులు, ఫోర్లతో అలరించేస్తారు. ఎప్పుడూ టీవీలో కనిపించే అలాంటి తారలు మన నగరానికే వస్తున్నారు. వినోదం పంచనున్నారు. అనంతపురంలోని ఆర్డీటీ క్రీడా గ్రామం దేశవాళీ క్రీడా సంరంభానికి సిద్ధమవుతుండగా, తమ అభిమాన క్రికెటర్ల రాక కోసం క్రికెట్ ప్రేమి కులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.అనంతపురం: దేశవాళీ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దులీప్ ట్రోఫీ క్రికెట్ పోటీలు అనంతపురంలో జరగనున్నాయి. వచ్చే నెల 5న టోర్నీ ప్రారంభం కానుండగా, అనంతపురం ఆర్డీటీ క్రీడా గ్రామంలో ఐదు మ్యాచ్లు జరుగుతాయి. ఒక మ్యాచ్ నాలుగు రోజుల పాటు (మల్టీడే మ్యాచ్) నిర్వహిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో అయితే టెస్ట్ మ్యాచ్గా పరిగణిస్తారు. ఒక మ్యాచ్ ఐదు రోజుల పాటు సాగుతుంది. క్రీడా గ్రామం ఖ్యాతి.. దులీప్ ట్రోఫీ మ్యాచ్లు తొలిసారిగా అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో నిర్వహిస్తుండడంతో జిల్లా పేరు దేశస్థాయిలో మార్మోగనుంది. 2003లో ప్రారంభించిన ఆర్డీటీ క్రీడా గ్రామం అనతి కాలంలోనే తన కీర్తిని ఇనుమడింపజేసుకుంది. స్టేడియంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రమాణాలు పాటిస్తుండడంతో దులీప్ ట్రోఫీ నిర్వహణకు అవకాశం దక్కింది. పేద, మధ్య తరగతి క్రీడాకారులకు దన్నుగా నిలుస్తూ ఎంతో మంది ప్రతిభావంతులను క్రీడల వైపు ఆసక్తి పెరిగేలా కృషి చేసిన ఫాదర్ ఫెర్రర్ ఆశయం నెరవేరుతోందని క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులకు పండగే.. టోర్నీ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, పంత్ తదితర క్రికెట్ స్టార్లు నగరానికి రానున్నారు. తమ ఆటతో అభిమానులను మురిపించనున్నారు. భారత జట్టు క్రికెటర్లలో ముగ్గురు మినహా అందరూ దులీప్ ట్రోఫీలోని జట్లలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో తమ అభిమాన క్రికెటర్ల రాక కోసం యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నగరంలోని రెండు త్రీ స్టార్ హోటళ్లలో భారత క్రికెటర్లకు బస ఏర్పాట్లు చేస్తున్నారు.గర్వకారణం ఇలాంటి పెద్ద ఈవెంట్ జరగడం అనంతపురం జిల్లా చరిత్రలోనే తొలిసారి. ఇటువంటి మ్యాచ్లు జరుగుతాయని ఊహించలేదు. ఇంత మంది స్టార్ క్రికెటర్లు వస్తారని కలలో కూడా అనుకోలేదు. దులీప్ ట్రోఫీ వంటి వాటి నిర్వహణకు కేవలం గ్రౌండ్ ఒక్కటే సరిపోదు. క్రికెటర్లకు అధునాతన సౌకర్యాలు కల్పించాలి. ఇటువంటి టోర్నీల వల్ల జిల్లా క్రికెటర్లకు స్ఫూర్తి కలుగుతుంది. ఆర్డీటీ క్రీడా గ్రామంలో రెండు గ్రౌండ్లు ఉన్నాయి. ఒకే సమయంలో రెండు మ్యాచ్లు జరుగుతాయి. చాలా పెద్ద పని. చాలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అందరి సహకారంతో ఈ టోర్నమెంట్ను విజయవంతం చేస్తాం. సెపె్టంబర్ 5 నుంచి 22 వరకూ టోర్నీ జరుగుతుంది. భారత జట్టులోని ముగ్గురు క్రీడాకారులు మినహా తక్కిన వారందరూ ఈ టోర్నీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. – మాంఛో ఫెర్రర్, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ త్రీమెన్ కమిటీ మెంబర్ దులీప్ ట్రోఫీలో ప్రాతినిధ్యం వహించే జట్లు ఇవే..టీమ్–ఏ: శుభమన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ ధూబే, తనుస్ కోటియన్, కులదీప్ యాదవ్, ఆకాష్ దీప్, ప్రసిద్్ధకృష్ణ, ఖలీల్ అహమ్మద్, అవేశ్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుషగ్ర, షస్వత్ రావత్. టీమ్–బీ: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, సిరాజ్, యశ్ దయాల్, ముకేష్ కుమార్, రాహుల్ చహార్, ఆర్ సాయి కిశోర్, మోహిత్ అశ్విత్, ఎన్. జగదీషన్ (వికెట్ కీపర్) టీమ్–సీ: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటిదార్, అభిష్క్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి. ఇంద్రజిత్, హార్ధిక్ షోకీన్, మనవ్ సుతార్, ఉమ్రాన్ మాలిక్, వైశాఖ్ విజయ్కుమార్, అన్సుల్ కాంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్ఖండే, ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సందీప్ వారియర్ టీమ్ –డీ: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అతర్వ టైడ్, యష్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రికీ భూయి, షరాన్స్ జైన్, ఆక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, ఆదిత్య థాక్రే, హర్షిత్ రాణా, తుషార్దేశ్పాండే, ఆకాష్ సేన్గుప్తా, కేఎస్. భరత్ (వికెట్ కీపర్), సౌరభ్ కుమార్. -
టెస్టు కెప్టెన్గానూ అతడు పనికిరాడా?: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియాలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, కీలక ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వీడ్కోలు పలకగా.. హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ ప్రస్థానం కూడా ముగిసిపోయింది. ఈ క్రమంలో టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ నియమితుడు కాగా.. గౌతం గంభీర్ కోచ్గా ద్రవిడ్ బాధ్యతలను స్వీకరించాడు.భవిష్య కెప్టెన్గా శుబ్మన్ గిల్మరోవైపు.. 37 ఏళ్ల రోహిత్ శర్మకు డిప్యూటీగా స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్ను నియమించింది బీసీసీఐ. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఈ పంజాబీ బ్యాటర్కు వైస్ కెప్టెన్గా బాధ్యతలు అప్పగించింది. అంతేకాదు.. రోహిత్, సూర్య గైర్హాజరీలో జింబాబ్వే టీ20 సిరీస్కు కెప్టెన్గానూ ఎంపిక చేసింది. తద్వారా భవిష్య కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఉండబోతున్నాడని సంకేతాలు ఇచ్చింది.ఈ నేపథ్యంలో మరో స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ గురించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో అద్భుతమైన రికార్డు ఉన్న పంత్ను కెప్టెన్గా నియమిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అయితే, దులిప్ ట్రోఫీ-2024 జట్ల ప్రకటన తర్వాత ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్ పేరును బీసీసీఐ భవిష్య కెప్టెన్గా పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోందన్నాడు.ఆ నలుగురికి ఛాన్స్కాగా సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న ఈ రెడ్బాల్ టోర్నీకి సంబంధించిన నాలుగు జట్లను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. టీమిండియా స్టార్లు శుబ్మన్ గిల్(టీమ్-ఎ), రుతురాజ్ గైక్వాడ్(టీమ్-సి), శ్రేయస్ అయ్యర్(టీమ్-డి)లకు సారథులుగా అవకాశం ఇచ్చిన బీసీసీఐ.. టీమ్-బి కెప్టెన్గా బెంగాల్ స్టార్ అభిమన్యు ఈశ్వరన్ను నియమించింది. ఈ జట్టులోనే రిషభ్ పంత్కూ చోటిచ్చింది.ఈ విషయంపై స్పందించిన ఆకాశ్ చోప్రా.. ‘‘రిషభ్ పంత్ కెప్టెన్ కాదా!.. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలో అతడు ఆడాలా? మరేం పర్లేదు. అయితే, టీమిండియా భవిష్య కెప్టెన్గా భావిస్తున్న పంత్ను.. ఈ టోర్నీలో సారథిగా ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది.ఏకైక వికెట్ కీపర్ బ్యాటర్గా చరిత్రవ్యక్తిగతంగా నేనేమీ పంత్ను సమర్థించడం లేదు. టెస్టు క్రికెటర్గా అతడి గణాంకాల ఆధారంగానే మాట్లాడుతున్నా. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గడ్డపై శతకాలు బాదిన భారత ఏకైక వికెట్ కీపర్ బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు పంత్. కెప్టెన్గా తనకంటే గొప్ప ఆటగాడు మరెవరు ఉంటారు? అయినా.. సరే తనను పక్కనపెట్టారు. దీనిని బట్టి టీమిండియా పగ్గాలు అప్పజెప్పే సూచనలూ కనిపించడం లేదు’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా 2022 డిసెంబరులో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన పంత్.. దాదాపు ఏడాదిన్నరపాటు జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్-2024 ద్వారా పునరాగమనం చేసిన ఈ వికెట్ కీపర్.. టీ20 ప్రపంచకప్-2024లోనూ సత్తా చాటాడు.చదవండి: గంభీర్ ప్లాన్ అదుర్స్: బౌలింగ్ కోచ్గా మోర్కెల్ ఎంపికకు కారణం ఇదే! -
దులీప్ ట్రోఫీ జట్ల ప్రకటన.. కెప్టెన్లుగా గిల్, రుతురాజ్, శ్రేయస్.. సీనియర్లకు విశ్రాంతి
సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభంకాబోయే దులీప్ ట్రోఫీ కోసం నాలుగు జట్లను (టీమ్ ఏ, బి, సి, డి) ఇవాళ (ఆగస్ట్ 14) ప్రకటించారు. ఈ జట్లకు శుభ్మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నారు. ఈ టోర్నీలో చాలామంది టీమిండియా స్టార్లు పాల్గొననున్నారు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ మినహా టీమిండియా మొత్తం ఈ టోర్నీలో పాల్గొంటుంది. ఈ టోర్నీలో ప్రదర్శన ఆధారంగానే బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్కు జట్టు ఎంపిక ఉంటుందని తెలుస్తుంది.టీమ్ ఏ: శుభమన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కోటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుశాగ్రా , శాశ్వత్ రావత్.టీమ్ బి: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తి , ఎన్ జగదీసన్ (వికెట్కీపర్).టీమ్ సి: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్కీపర్), సూర్యకుమార్ యాదవ్, బాబా ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, ఉమ్రాన్ మాలిక్, వైషాక్ విజయ్కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మర్కండే, ఆర్యన్ జుయల్ (వికెట్కీపర్), సందీప్ వారియర్.టీమ్ డి: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ (వికెట్కీపర్), రికీ భుయ్, సరాంశ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, ఆదిత్య ఠాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్పాండే, ఆకాష్ సేన్ గుప్తా, కేఎస్ భరత్ (వికెట్కీపర్), సౌరభ్ కుమార్.షెడ్యూల్..సెప్టెంబర్ 5-8: తొలి మ్యాచ్- టీమ్ ఏ వర్సెస్ టీమ్ బిరెండో మ్యాచ్- టీమ్ సి వర్సెస్ టీమ్ డిసెప్టెంబర్ 12-15: మూడో మ్యాచ్- టీమ్ ఏ వర్సెస్ టీమ్ డినాలుగో మ్యాచ్- టీమ్ బి వర్సెస్ టీమ్ సిసెప్టెంబర్ 19-22: ఐదో మ్యాచ్- టీమ్ బి వర్సెస్ టీమ్ డిఆరో మ్యాచ్- టీమ్ ఏ వర్సెస్ టీమ్ సి -
'హార్దిక్, రాహుల్ కాదు.. రోహిత్ శర్మ తర్వాత అతడే టీమిండియా కెప్టెన్'
టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్పై భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ తర్వాత మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టు కెప్టెన్గా గిల్ బాధ్యతలు చేపడతాడని శ్రీధర్ జోస్యం చెప్పాడు. కాగా గిల్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.ఈ లంక టూర్ కోసం టీమిండియా వైస్ కెప్టెన్గా స్టార్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ను కాదని మరి గిల్ను బీసీసీఐ నియమించింది. అంతకుముందు జింబాబ్వే పర్యటనతో కెప్టెన్గా అరంగేట్రం చేసిన గిల్.. తన నాయకత్వ లక్షణాలతో అందరని ఆకట్టుకున్నాడు. జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1తో భారత్ సొంతం చేసుకుంది. టెస్టుల్లో కూడా రోహిత్ డిప్యూటీగా గిల్ను నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది."యశస్వీ జైశ్వాల్, శుబ్మన్ గిల్ ఇద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో కూడా వీరిద్దరూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. వన్డేల్లో కూడా అదరగొడుతున్నారు. ముఖ్యంగా శుబ్మన్ గిల్ ఎంత చెప్పుకున్న తక్కువే. అతడొక ఆల్ ఫార్మాట్ ప్లేయర్. అతడు ప్రస్తుతం రోహిత్ శర్మ వద్ద కెప్టెన్సీ పాఠాలు నేర్చుకుంటున్నాడు. గిల్లో కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. జింబాబ్వే టూర్లో కెప్టెన్గా గిల్ విజయవంతమయ్యాడు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత అన్ని ఫార్మాట్లలో భారత కెప్టెన్గా గిల్ ఎంపికవుతాడని" శ్రీధర్ పేర్కొన్నాడు.చదవండి: టీ20 వరల్డ్కప్-2024పై నీలినీడలు! భారత్ వేదికగా? -
‘వాళ్లు ఆడుతుంటే గంగూలీ- సచిన్ గుర్తుకువస్తారు’
టీమిండియా టీ20 కొత్త ఓపెనింగ్ జోడీపై మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ జంటను చూస్తుంటే తనకు సౌరవ్ గంగూలీ- సచిన్ టెండుల్కర్ గుర్తుకువస్తున్నారని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ టైటిల్ విజేతగా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ ఐసీసీ టోర్నీల్లో రోహిత్- విరాట్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఫలితంగా.. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ప్రపంచకప్ ప్రధాన జట్టుకు ఎంపికైనా బెంచ్కే పరిమితమయ్యాడు. మరోవైపు.. భవిష్య కెప్టెన్ శుబ్మన్ గిల్ రిజర్వ్ ప్లేయర్లలో ఒకడిగా జట్టుతో ప్రయాణించాడు. అయితే, దిగ్గజ బ్యాటర్లు కోహ్లి- రోహిత్ రిటైర్మెంట్ తర్వాత పొట్టి ఫార్మాట్లో యశస్వి- గిల్ జోడీ ఓపెనింగ్కు వస్తున్నారు.వరల్డ్కప్ టోర్నీ తర్వాత భారత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లగా.. శుబ్మన్ గిల్ తొలిసారిగా టీమిండియా కెప్టెన్గా పగ్గాలు చేపట్టాడు. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1తో గెలిచాడు. ఈ టూర్లో యశస్వి- గిల్ ఎక్కువసార్లు ఓపెనింగ్ చేశారు. తాజాగా శ్రీలంక పర్యటనలోనూ వీరే టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించారు.టీమిండియా లంకతో టీ20 సిరీస్ను 3-0తో వైట్వాష్ చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప సోనీ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. యశస్వి- గిల్ జోడీని గంగూలీ- సచిన్లతో పోల్చాడు.వాళ్లు ఆడుతుంటే గంగూలీ- సచిన్ గుర్తుకువస్తారు‘‘వీళ్లిద్దరిని చూస్తే నాకు సౌరవ్ గంగూలీ- సచిన్ టెండుల్కర్ గుర్తుకువస్తారు. వాళ్లిద్దరు ఎలా పరస్పరం అవగాహనతో ఆడేవారో.. వీరూ అలాగే చేస్తారు. తమవైన వ్యూహాలు అమలు చేస్తూనే.. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పుతారు. వీళ్లిద్దరు కలిసి బ్యాటింగ్ చేస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. ఇక జైస్వాల్ గురించి చెప్పాలంటే.. త్వరలోనే అతడు వన్డేల్లో కూడా ఓపెనర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలడు.టెస్టు, టీ20 క్రికెట్లో ఇప్పటికే టీమిండియా తరఫున తానేంటో నిరూపించుకున్నాడు. వన్డేల్లోనూ రాణించగలడు. పరుగులు చేయడమే పరమావధిగా ముందుకు సాగుతున్న అతడికి ఇదేమీ అసాధ్యం కాదు’’ అని రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. కాగా యశస్వి గంగూలీ మాదిరే ఎడమచేతి వాటం బ్యాటర్ కాగా.. గిల్ సచిన్లా రైట్హ్యాండ్ బ్యాటర్. -
IND vs SL 3rd T20: తడబడిన భారత బ్యాటర్లు.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే?
పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న ఆఖరి టీ20లో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమిత మైంది. లంక బౌలర్ల దాటికి భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. శ్రీలంక బౌలర్లలో మహేష్ థీక్షణ మూడు వికెట్లతో సత్తాచాటగా.. హసరంగా రెండు, విక్రమసింఘే, ఆసితా ఫెర్నాండో చెరో వికెట్ పడగొట్టారు.భారత బ్యాటర్లలో శుబ్మన్ గిల్(39) టాప్ స్కోరర్గా నిలవగా.. రియాన్ పరాగ్(26), వాషింగ్టన్ సుందర్(25) పరుగులతో పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ వరుసగా రెండో మ్యాచ్లోనూ డకౌట్గా వెనుదిరిగాడు.కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా ఈ మ్యాచ్లో తన మార్క్ను చూపించలేకపోయాడు. ఇక ఇప్పటికే సిరీస్ను 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
IND vs SL: శ్రీలంకతో మూడో టీ20.. గిల్ వచ్చేశాడు! ఆ నలుగురికి రెస్ట్
పల్లెకెలె వేదికగా మూడో టీ20లో భారత్-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆఖరి టీ20కు భారత జట్టు మెనెజ్మెంట్ ఏకంగా నలుగురు ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చింది. హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్ ఈ మ్యాచ్కు దూరమమయ్యారు. వారి స్ధానాల్లో శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ఖాలీల్ ఆహ్మద్, శుబ్మన్ గిల్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు శ్రీలంక కూడా తమ తుది జట్టులో ఓ మార్పు చేసింది. షనక స్థానంలో ఆల్రౌండర్ విక్రమసింఘే అరంగేట్రం చేశాడు. ఇక ఇప్పటికే సిరీస్ను 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది.తుది జట్లుభారత్: యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక(కెప్టెన్), చమిందు విక్రమసింఘే, వనిందు హసరంగా, రమేష్ మెండిస్, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, అసిత ఫెర్నాండో -
పదేళ్ల పాటు టీమిండియా కెప్టెన్ అతడే.. కానీ!
ముప్పై ఏళ్ల వయసులో టీమిండియాలో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్.. అనతికాలంలోనే ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్గా ఎదిగాడు. అంతేకాదు.. ఊహించని రీతిలో భారత టీ20 జట్టు కెప్టెన్గానూ నియమితుడయ్యాడు. రోహిత్ శర్మ వారసుడిగా.. పూర్తిస్థాయి కెప్టెన్గా తొలి సిరీస్లోనే విజయం అందుకున్నాడు ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్.గొప్ప ఆప్షన్లు లేవు కాబట్టేఅయితే, సూర్య పదవి తాత్కాలికమే అంటున్నాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా బీసీసీఐ అతడిని ఎంచుకోలేదని అభిప్రాయపడ్డాడు. కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్కు ఇప్పటికిప్పుడు గొప్ప ఆప్షన్లు లేవు కాబట్టే.. సూర్య వైపు మొగ్గుచూపారని పేర్కొన్నాడు. సీనియర్లు రిటైర్ కావడం, హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సమస్యలు సూర్యను కెప్టెన్గా నియమించడానికి దోహదం చేశాయని స్టైరిస్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.రెండేళ్లపాటు మాత్రమేఏడాది లేదంటే రెండేళ్లపాటు మాత్రమే సూర్యకుమార్ యాదవ్ టీమిండియా టీ20 కెప్టెన్గా ఉంటాడని స్టైరిస్ అంచనా వేశాడు. అతడి స్థానంలో యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ భారత జట్టు పగ్గాలు చేపడతాడని.. అతడిని పూర్తిస్థాయి సారథిగా తీర్చిదిద్దేందుకే సూర్య డిప్యూటీగా నియమించారని పేర్కొన్నాడు. గంభీర్కు- భవిష్య కెప్టెన్కు మధ్య సూర్య కేవలం ఓ వారథి లాంటివాడు మాత్రమే అని స్టైరిస్ చెప్పుకొచ్చాడు.పదేళ్ల పాటు అతడేటీమిండియా భవిష్య కెప్టెన్ శుబ్మన్ గిల్ మాత్రమే అని.. 24 ఏళ్ల ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతాడని స్కాట్ స్టైరిస్ అభిప్రాయపడ్డాడు. అయితే, ఇప్పుడే భారత జట్టు పగ్గాలు చేపట్టేందుకు తగిన అనుభవం అతడికి లేదని.. అందుకే సూర్య రూపంలో తాత్కాలిక ఏర్పాటు చేశారని పేర్కొన్నాడు. ఒకవేళ సూర్య ద్వైపాక్షిక సిరీస్లలో టీమిండియాను విజయవంతంగా ముందుకు నడిపిస్తే.. టీ20 ప్రపంచకప్-2026 వరకు అతడే సారథిగా కొనసాగుతాడని స్టైరిస్ అంచనా వేశాడు.భారత క్రికెట్ను ఏలుతాడుశుబ్మన్ గిల్ రోజురోజుకు తన ఆటను మెరుగుపరచుకుంటున్నాడని.. అయితే, మూడు ఫార్మాట్లలో నిలకడగా ఆడటం ముఖ్యమని స్టైరిస్ పేర్కొన్నాడు. అలా అయితేనే, వరుస అవకాశాలు దక్కించుకుని కెప్టెన్ రేసులో ముందుంటాడని అభిప్రాయపడ్డాడు. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరని.. అయితే, తన దృష్టిలో మాత్రం రానున్న దశాబ్దంలో గిల్ భారత క్రికెట్ను ఏలుతాడని స్కాట్ స్టైరిస్ పేర్కొన్నాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఇద్దరూ విజయవంతంగాకాగా రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో 33 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ తొలిసారిగా భారత టీ20 జట్టుకు సారథ్యం వహించాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై, సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియాను విజేతగా నిలిపాడు. తాజాగా రెగ్యులర్ కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే శ్రీలంక టూర్లో భారత్కు 2-0తో సిరీస్ను అందించాడు. మరోవైపు.. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన యువ భారత జట్టుకు శుబ్మన్ గిల్ సారథ్యం వహించాడు. 4-1తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ గెలిచాడు.చదవండి: ‘ద్రవిడ్ వల్లే కాలేదు.. ఇక్కడ నేనే బాస్ అంటే కుదరదు’ -
శ్రీలంకతో మూడో టీ20.. సంజూకు మరో ఛాన్స్! భారత తుది జట్టు ఇదే?
పల్లెకెలె వేదికగా శ్రీలంకతో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. మంగళవారం(జూలై 30) సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. క్లీన్ స్వీప్పై కన్నేసింది. మరోవైపు శ్రీలంక కనీసం ఆఖరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్లో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.ఈ మ్యాచ్కు కూడా టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. వెన్ను నొప్పితో బాధపడుతున్నగిల్కు విశ్రాంతిని పొడగించాలని జట్టు మెనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో సంజూ శాంసన్ కొనసాగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అదేవిధంగా స్టార్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, పేసర్ మహ్మద్ సిరాజ్కు కూడా ఆఖరి మ్యాచ్కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. వీరిముగ్గరి స్ధానంలో శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ఖాలీల్ ఆహ్మద్ తుది జట్టులో రానున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.భారత తుది జట్టు(అంచనా): యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఖలీల్ అహ్మద్, అర్ష్దీప్ సింగ్ -
గిల్ కంటే అతడే బెటర్.. ఇద్దరినీ ఆడిస్తే తప్పేంటి?
టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్కు వరుస అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత మేనేజ్మెంట్పై ఉందని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. శుబ్మన్ గిల్ జట్టులో ఉన్నాడనే కారణంతో రుతును పక్కనపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డాడు. గిల్తో పోలిస్తే రుతురాజ్ ఆటలో నిలకడ ఎక్కువని పేర్కొన్నాడు. కాబట్టి అతడిపై కూడా సెలక్టర్లు కాస్త దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికాడు.ఇద్దరికీ ఆ అర్హతస్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వారసులు కాగల అర్హత ఈ ఇద్దరికీ ఉందని ఊతప్ప పేర్కొన్నాడు. కాగా పంజాబీ బ్యాటర్ శుబ్మన్ గిల్ టీమిండియా టీ20, వన్డే జట్లకు వైస్ కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత.. జింబాబ్వే పర్యటనకు వెళ్లిన ద్వితీయ శ్రేణి జట్టుకు గిల్ సారథ్యం వహించాడు. కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే టీ20 సిరీస్ను 4-1తో గెలిచాడు.ఈ క్రమంలో టీమిండియా భవిష్య కెప్టెన్గా ప్రశంసలు అందుకుంటున్న గిల్కు శ్రీలంక పర్యటన సందర్భంగా బీసీసీఐ బంపరాఫర్ ఇచ్చింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో వైస్ కెప్టెన్గా అవకాశమిచ్చింది. టీ20లలో సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో రోహిత్ శర్మకు డిప్యూటీగా నియమించింది. ఇక టీ20లలో గిల్ యశస్వి జైస్వాల్తో పాటు ఓపెనింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.రోహిత్ శర్మ రిటైర్మెంట్ నేపథ్యంలో ఓపెనర్లుగా టీ20లలో ఈ జోడీ ఫిక్సయిపోయినట్లే!.. దీంతో రుతురాజ్ గైక్వాడ్ కెరీర్ ప్రమాదంలో పడింది. రుతు కూడా ఓపెనరే కావడంతో ఇప్పటికే జట్టులో పాతుకుపోయిన గిల్- యశస్వితో పోటీలో అతడు వెనుకబడ్డాడు. ఈ నేపథ్యంలో రాబిన్ ఊతప్ప సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ రుతురాజ్కు అవకాశాలు ఇవ్వాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశాడు.ఇద్దరూ మూడు ఫార్మాట్ల ఆటగాళ్లే‘‘గిల్, రుతు.. ఇద్దరూ మంచి ప్లేయర్లే. టీ20 క్రికెట్లో తమకు తామే సాటి. వారి బ్యాటింగ్ గణాంకాలే ఈ విషయాన్ని చెబుతున్నాయి. వీరిద్దరిలో ఒకరినే ఎంచుకోవాలంటే కష్టం. అయితే, ఆటలో నిలకడ పరంగా చూస్తే గిల్ కంటే రుతురాజే ముందున్నాడని చెప్పవచ్చు. ఇద్దరిలో ఒకరికే అవకాశం ఇచ్చే బదులు ఇద్దరినీ జట్టులో ఆడిస్తే తప్పేంటి. ఇద్దరూ మూడు ఫార్మాట్ల ఆటగాళ్లే. అలాంటపుడు ఇద్దరికీ సమాన అవకాశాలు ఇస్తే బాగుంటుంది’’ అని భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. అయితే, ఊతప్పతో పాటు ఈ షోలో పాల్గొన్న శ్రీలంక మాజీ క్రికెటర్ రసెల్ ఆర్నాల్డ్ మాత్రం.. తాను ఈ విషయంలో గిల్కే ఓటు వేస్తానని చెప్పడం విశేషం.గిల్, రుతు కెరీర్ ఇలాకాగా 2019లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన శుబ్మన్ గిల్.. ఇప్పటి వరకు 25 టెస్టులు, 44 వన్డేలు, 20 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 1492, 2271, 539 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో ఓ వన్డే డబుల్ సెంచరీ, ఒక టీ20 సెంచరీ ఉన్నాయి. ఇక మహారాష్ట్రకు చెందిన రుతురాజ్ గైక్వాడ్.. 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 6 వన్డే, 23 టీ20 మ్యాచ్లు ఆడి.. 115, 633 పరుగులు సాధించాడు. టీ20లలో రుతు కూడా శతకం బాదడం విశేషం. ఇక శ్రీలంక పర్యటనలో గిల్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా.. రుతును ఈ టూర్కు ఎంపిక చేయలేదు సెలక్టర్లు.చదవండి: భీకర ఫామ్ను కొనసాగిస్తున్న యశస్వి జైస్వాల్.. తొలి బ్యాటర్గా రికార్డుManu Bhaker: రూ. 2 కోట్లు ఖర్చు చేశాం.. -
అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన శాంసన్
టీమిండియాలో మోస్ట్ అన్ లక్కీ క్రికెటర్గా సంజూ శాంసన్కు పేరుంది. ఈ విషయాన్ని అతను మరోసారి నిరూపించాడు. శుభ్మన్ గిల్కు మెడ పట్టేయడంతో శ్రీలంకతో రెండో టీ20లో అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చిన సంజూ.. ఈ మ్యాచ్లో తానెదుర్కొన్న తొలి బంతికే క్లీన్ బౌల్డై అందరినీ నిరాశపరిచాడు. సంజూ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడంతో నెటిజన్లు అతన్ని ఘోరంగా ఆడుకుంటున్నారు. pic.twitter.com/t5KrrijCqt— hiri_azam (@HiriAzam) July 28, 2024అవకాశాలు రాకపోతే ఇవ్వలేదంటారు.. వస్తే ఇలా చేస్తాడంటూ కామెంట్లు చేస్తున్నారు. సంజూ గోల్డెన్ డకౌటైన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ మ్యాచ్లో సంజూ మహీశ్ తీక్షణ బౌలింగ్లో ఔటయ్యాడు.మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్లో శ్రీలంకపై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా (53) అర్ద సెంచరీతో రాణించగా.. పథుమ్ నిస్సంక (32), కమిందు మెండిస్ (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. శ్రీలంక చివరి ఏడు వికెట్లు 31 పరుగుల వ్యవధిలో కోల్పోయి భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. రవి బిష్ణోయ్ (4-0-26-3), అర్ష్దీప్ సింగ్ (3-0-24-2), అక్షర్ పటేల్ (4-0-30-2), హార్దిక్ పాండ్యా (2-0-23-2) లంకేయులను భారీగా దెబ్బేశారు.అనంతరం భారత్ ఛేదనకు దిగే సమయానికి వర్షం మొదలైంది. దీంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులకు కుదించారు. ఛేదనలో భారత్ ఆదిలోనే సంజూ శాంసన్ వికెట్ కోల్పోయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేసింది. యశస్వి జైస్వాల్ (15 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (12 బంతుల్లో 26; 4 ఫోర్లు, సిక్స్), హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపించారు. ఆఖర్లో హార్దిక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుస బౌండరీలు, సిక్సర్తో మ్యాచ్ను గెలిపించాడు. బంతితో రాణించిన హార్దిక్ బ్యాట్తోనూ చెలరేగాడు. ఫలితంగా భారత్ 6.3 ఓవరల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది (3 వికెట్ల నష్టానికి). ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో టీ20 రేపు (జులై 30) జరుగనుంది. -
లంకతో రెండో టీ20.. టాస్ గెలిచిన భారత్.. సంజూ శాంసన్ ఎంట్రీ
పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరగాల్సిన రెండో టీ20లో భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. వర్షం అంతరాయం కలిగించడంతో టాస్ 45 నిమిషాలు ఆలస్యమైంది. ఈ మ్యాచ్లో భారత్, శ్రీలంక చెరో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. లంక తరఫున దిల్షన్ మధుషంక స్థానంలో రమేశ్ మెండిస్.. భారత్ తరఫున శుభ్మన్ గిల్ స్థానంలో సంజూ శాంసన్ తుది జట్టులోకి వచ్చారు. గిల్ మెడ పట్టేయడంతో ఈ మ్యాచ్లో ఆడటం లేదని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. భారతకాలమానం ప్రకారం రాత్రి 7:45 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిన్న జరిగిన తొలి టీ20లో టీమిండియా 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో టీ20 ఇదే వేదికగా జులై 30న జరుగనుంది. తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్కీపర్), హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుసల్ మెండిస్(వికెట్కీపర్), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక(కెప్టెన్), దసున్ షనక, వనిందు హసరంగ, రమేష్ మెండిస్, మహేశ్ తీక్షణ, మతీష పతిరణ, అసిత ఫెర్నాండో -
శుబ్మన్ గిల్కు మళ్లీ ప్రమోషన్?.. బుమ్రాకు షాక్!
శ్రీలంక పర్యటన తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్కు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా టీమిండియా ఆతిథ్య బంగ్లాతో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్కు ముందు బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెట్లో టీమిండియా వైస్ కెప్టెన్గా స్టార్ బ్యాటర్ శుబ్మన్ను గిల్ను నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టీ20లు, వన్డేల్లో భారత జట్టు వైస్ కెప్టెన్సీ పగ్గాలను గిల్కు బీసీసీఐ అప్పగించిన సంగతి తెలిసిందే.అయితే ఆల్ఫార్మాట్లలో టీమిండియా వైస్ కెప్టెన్సీ బాధ్యతలను గిల్కు అప్పగించే దిశగా భారత క్రికెట్ బోర్డు అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టెస్టుల్లో భారత వైస్ కెప్టెన్గా ఉన్న స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా తప్పించి.. గిల్ను రోహిత్ శర్మ డిప్యూటీగా నియమించాలని బోర్డు యోచిస్తుందట.ఇక శ్రీలంకతో టీ20 సిరీస్ నుంచి భారత వైట్బాల్ వైస్ కెప్టెన్గా గిల్ ప్రయాణం ప్రారంభం కానుంది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై వేటు వేసి మరి వైస్ కెప్టెన్సీ బాధ్యతలను బీసీసీఐ గిల్కు అప్పగించింది.అదేవిధంగా కెప్టెన్గా కూడా గిల్ ఆకట్టుకున్నాడు. అతడి సారథ్యంలోనే జింబాంబ్వేతో టీ20 సిరీస్ను భారత్ 4-1తో సొంతం చేసుకుంది. కాగా శుబ్మన్ గిల్ ప్రస్తుతం ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు సారథ్యం వహిస్తున్నాడు. -
హార్దిక్, సూర్య కాదు.. ఫ్యూచర్ ఆల్ ఫార్మాట్ భారత కెప్టెన్ అతడే
తొలిసారిగా భారత జట్టుకు సారథ్యం వహించిన స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్ తన కెప్టెన్సీ స్కిల్స్తో అందరని అకట్టుకున్నాడు. జింబాబ్వేతో టీ20 సిరీస్ను అతడి నాయకత్వంలోని భారత జట్టు 4-1 తేడాతో సొంతం చేసుకుంది. ఈ క్రమంలో శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్లో భారత జట్టు వైస్ కెప్టెన్గా గిల్ను నియమించింది.స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై వేటు వేసి మరి టీమిండియా వైస్ కెప్టెన్సీ పగ్గాలను గిల్కు బీసీసీఐ అప్పగించింది. ఈ నేపథ్యంలో గిల్పై భారత మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ ప్రశంసల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో గిల్ కచ్చితంగా భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో నాయకత్వం వహిస్తాడని రాథోర్ జోస్యం చెప్పాడు."గిల్కు అద్బుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. ఇప్పటికే ఐపీఎల్, జింబాబ్వే సిరీస్లో అతడు కెప్టెన్గా విజయవంతమయ్యాడు. ముఖ్యంగా జింబాబ్వే పర్యటనలో గిల్ జట్టును నడిపించిన విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. తొలిసారి జాతీయ జట్టుకు నాయకత్వం వహించినప్పటకి అతడిలో కొంచెం కూడా ఒత్తడి కన్పించలేదు. తన వ్యూహాలతో ప్రత్యర్దిని కట్టడి చేశాడు. ఇవన్నీ ఒక కెప్టెన్కి ఉండాల్సిన లక్షణాలే. ఇప్పుడు బీసీసీఐ అతడికి వైస్ కెప్టెన్సీ ఇచ్చి అదనపు బాధ్యతలు అప్పగించింది. వైస్ కెప్టెన్గా కూడా గిల్ మెరుగ్గా రాణిస్తాడని నేను భావిస్తున్నాను. గిల్కు వైస్కెప్టెన్సీ బాధ్యతలు సెలక్టర్లు అప్పగించారంటే అతడు ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో ఉన్నట్లే. ఇప్పుడు గిల్కు సీనియర్ జట్టు వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం రావడంతో తన స్కిల్స్ను మరింత మెరుగుపరుచుకుంటాడని ఆశిస్తున్నాను. అతి చిన్న వయస్సులోనే గిల్ వైస్ కెప్టెన్గా ఎంపిక కావడం గొప్ప విషయం. అతడు ఏదో ఒక రోజు కచ్చితంగా అన్ని ఫార్మాట్లలో భారత జట్టుకు సారథ్యం వహిస్తాడని" ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాథోర్ పేర్కొన్నాడు. -
పంత్కు నో ఛాన్స్!.. టీమిండియా భవిష్య కెప్టెన్ అతడే
టీమిండియా భవిష్య కెప్టెన్ ఎవరన్న అంశంపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టతనిచ్చాడు. యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ను పూర్తిస్థాయి కెప్టెన్గా చూసే అవకాశం ఉందని పేర్కొన్నాడు.అయితే, ఏ విషయంలోనూ గ్యారెంటీ ఇవ్వలేమని.. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం గిల్కే తమ ఓటు అని అగార్కర్ పేర్కొన్నాడు. ఇందుకు గల కారణాలను కూడా వెల్లడించాడు.కెప్టెన్గా అలరించిన గిల్కాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరల్డ్కప్ జట్టు స్వదేశానికి తిరిగి రాగా.. శుబ్మన్ గిల్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది.తొలిసారిగా కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించిన గిల్.. జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియాను 4-1తో విజేతగా నిలిపాడు. ఈ క్రమంలో శ్రీలంక పర్యటన నేపథ్యంలో టీమిండియా వైస్ కెప్టెన్గా గిల్ పేరును ప్రకటించింది బీసీసీఐ.సీనియర్లను కాదనివన్డేల్లో రోహిత్ శర్మ సారథిగా కొనసాగనుండగా.. టీ20 రెగ్యులర్ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేసింది. వీళ్లిద్దరికి డిప్యూటీగా శుబ్మన్ గిల్కు అవకాశం ఇచ్చింది.అయితే, కెప్టెన్సీ రేసులో ఉన్న సీనియర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలను కాదని బీసీసీఐ గిల్ను వైస్ కెప్టెన్ చేయడం విశేషం.ఈ విషయంపై సోమవారం నాటి మీడియా సమావేశంలో ప్రస్తావనకు రాగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘‘రిషభ్ చాలా కాలంగా ఆటకు దూరమయ్యాడు. వికెట్ కీపర్గా అతడి సేవలు మాకు చాలా అవసరం.అందుకే పంత్కు నో ఛాన్స్దాదాపు ఏడాదిన్నర కాలం తర్వాత జట్టులో పునరాగమనం చేసిన ఆటగాడిపై భారం మోపాలని మేము భావించడం లేదు. ఇక కేఎల్ రాహుల్ చాలా కాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరంగానే ఉన్నాడు.ఆటగాళ్ల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు మేము సిద్ధమయ్యాం. టీ20 కెప్టెన్ విషయంలో గతంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం.రోహిత్ లేనపుడు హార్దిక్ పాండ్యా గాయపడితే పరిస్థితి గందరగోళంగా ఉండేది. అయితే, అదృష్టవశాత్తూ వరల్డ్కప్ నాటికి రోహిత్ తిరిగి రావడం మంచిదైంది. కానీ మరోసారి రిస్క్ చేసేందుకు సిద్ధంగా లేము.రిస్క్ చేయలేంశుబ్మన్ మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడు. ఏడాది కాలంగా అద్బుతంగా ఆడుతున్నాడు. సూర్య, రోహిత్ ఉన్నపుడే అతడిని నాయకుడిగా నైపుణ్యాలు మెరుగుపరచుకునేలా గిల్కు శిక్షణ ఇవ్వాల్సి ఉంది.అకస్మాత్తుగా కొత్త కెప్టెన్ను ట్రై చేయాలంటే రిస్కే. అందుకే ఇప్పటి నుంచే అతడిని భవిష్య కెప్టెన్గా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. కెప్టెన్గా తను అనుభవం గడిస్తే మాకు తలనొప్పులు తగ్గుతాయి.ఇప్పుడే కాదు అయితే, ఇందుకు చాలా సమయం ఉంది. ఇప్పుడే ఏదీ కచ్చితంగా చెప్పలేము. రెండేళ్లపాటు అతడిని గమనిస్తూనే ఉంటాం’’ అని అజిత్ అగార్కర్ చెప్పుకొచ్చాడు. కాగా జూలై 27 నుంచి టీమిండియా శ్రీలంకతో సిరీస్ మొదలుపెట్టనుండగా.. హెడ్ కోచ్గా గౌతం గంభీర్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ నేపథ్యంలో గౌతీతో కలిసి సోమవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫన్స్లో అగార్కర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.చదవండి: టీమిండియా స్టార్ వచ్చేస్తున్నాడు: అగార్కర్ -
భారీ జంప్ కొట్టిన శుభ్మన్.. ఆరో స్థానానికి ఎగబాకిన యశస్వి
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా ఆటగాడు శుభ్మన్ గిల్ భారీ జంప్ కొట్టాడు. ఈ వారం ర్యాంకింగ్స్లో గిల్ ఏకంగా 36 స్థానాలు మెరుగుపర్చుకుని 37వ స్థానానికి ఎగబాకాడు. తాజా ర్యాంకింగ్స్లో గిల్తో పాటు మరో టీమిండియా బ్యాటర్ భారీ లబ్ది పొందాడు. ఇదివరకే టాప్-10లో ఉండిన యశస్వి జైస్వాల్.. నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకాడు. గత నెలలో రెండో స్థానానికి పడిపోయిన సూర్యకుమార్.. ఇటీవల జింబాబ్వేతో సిరీస్ ఆడనప్పటికీ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు ఫిలిప్ సాల్ట్ ఓ స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరాడు. ట్రవిస్ హెడ్ టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. పాక్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లండ్ ఆటగాడు జోస్ బట్లర్ ఏడు, టీమిండియా ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ ఎనిమిది, విండీస్ ఓపెనర్లు బ్రాండన్ కింగ్, జాన్సన్ ఛార్లెస్ తొమ్మిది, పది స్థానాల్లో నిలిచారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగం టాప్-10లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. ఆదిల్ రషీద్, నోర్జే, హసరంగ, రషీద్ ఖాన్, హాజిల్వుడ్, అకీల్ హొస్సేన్, ఆడమ్ జంపా, ఫజల్ హక్ ఫారూఖీ, మహీశ్ తీక్షణ ఒకటి నుంచి తొమ్మిది స్థానాలను నిలుపుకున్నారు. అల్జరీ జోసఫ్, తబ్రేజ్ షంషి, గుడకేశ్ మోటీ తలో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 10, 11, 12 స్థానాలకు ఎగబాకారు. భారత బౌలర్లలో టాప్-10లో ఎవరూ లేకపోగా.. అక్షర్ పటేల్ నాలుగు స్థానాలు దిగజారి 13కు.. రవి బిష్ణోయ్ నాలుగు స్థానాలు దిగజారి 19కి, జస్ప్రీత్ బుమ్రా ఏడు స్థానాలు దిగజారి 21వ స్థానానికి పడిపోయారు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో హార్దిక్ పాండ్యా నాలుగు స్థానాలు దిగజారి ఆరో స్థానానికి పడిపోగా.. హసరంగ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. -
టీమిండియా కెప్టెన్గా అతడు పనికిరాడు: భారత క్రికెటర్
జింబాబ్వే పర్యటనను శబ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఘనంగా ముగించింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1తో తేడాతో భారత్ సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్లో ఓటమి తర్వాత టీమిండియా దెబ్బ తిన్న సింహంలా గర్జించింది. వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఆతిథ్య జట్టును భారత్ చిత్తు చేసింది. తొలిసారి భారత జట్టు పగ్గాలను చేపట్టిన శుబ్మన్ గిల్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సిరీస్లో గిల్ కెప్టెన్సీ, వ్యక్తిగత ప్రదర్శన పరంగా ఆకట్టుకున్నాడు. అయితే శుబ్మన్ గిల్ను అందరూ ప్రశంసిస్తుంటే.. భారత వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా మాత్రం ఘాటు వ్యాఖ్యలు చేశాడు.గిల్ కెప్టెన్గా పనికిరాడని, అస్సలు నాయకత్వ లక్షణాలు లేవని మిశ్రా తెలిపాడు. మిశ్రా తాజాగా శుభాంకర్ మిశ్రా అనే యూట్యూబర్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో టీమిండియాకు ఫ్యూచర్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ని ఎంపిక చేస్తారా అన్న ప్రశ్న మిశ్రాకు ఎదురైంది."భారత్ ఫ్యూచర్ కెప్టెన్గా గిల్ను అస్సలు నేను ఎంపిక చేయను. అతడికి అస్సలు కెప్టెన్సీ స్కిల్స్ లేవు. ఐపీఎల్లోనే అతడి నాయకత్వాన్ని చూశాను. అతనికి కెప్టెన్సీ ఎలా చేయాలో తెలియదని" మిశ్రా బదులిచ్చాడు. కాగా ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన గిల్.. తన జట్టును ప్లే ఆఫ్స్కు చేర్చడంలో విఫలమయ్యాడు. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన గుజరాత్ కేవలం ఐదింట మాత్రమే విజయం సాధించి లీగ్ స్టేజ్లోనే నిష్క్రమించింది. -
వారంతా ఒక అద్బుతం.. దెబ్బతిన్న పులిలా పంజా విసిరారు: గిల్
జింబాబ్వే పర్యటనను టీమిండియా ఘనంగా ముగించింది. హరారే వేదికగా జరిగిన ఆఖరి టీ20లో 42 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో 4-1 తేడాతో ఐదు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా సొంతం చేసుకుంది.168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే భారత బౌలర్ల దాటికి 125 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్ 4 వికెట్లతో ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. అతడితో పాటు శివమ్ దూబే రెండు, అభిషేక్, సుందర్, దేశ్పాండే తలా వికెట్ సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో డియాన్ మైర్స్(34) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. టీమిండియా ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్(58) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. జింబాబ్వే బౌలర్లలో ముజ్బారనీ రెండు, రజా, నగర్వా, మవుటా తలా వికెట్ పడగొట్టారు. ఇక ఈ విజయంపై భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందించాడు."ఇదొక అద్భుతమైన సిరీస్. తొలి మ్యాచ్లో ఓటమి తర్వాత మా బాయ్స్ దెబ్బతిన్న పులిలా పంజా విసిరారు. ఈ సిరీస్లో మా జట్టు ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే మా జట్టులో చాలా మంది ఆటగాళ్లకు విదేశీ పరిస్థితుల్లో ఆడిన అనుభవం లేదు.అయినప్పటకి వారు ఆడిన విధానం నిజంగా అద్భుతం. ఎంత చెప్పుకున్న తక్కువే. ఇక శ్రీలంక పర్యటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఇంతకుముందు ఆసియాకప్ కోసం శ్రీలంకకు వెళ్లాను" అని పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో గిల్ పేర్కొన్నాడు.చదవండి: 4–1తో ముగించారు -
చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్
జింబాబ్వేతో జరిగిన ఐదో టీ20లో టీమిండియా 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. సంజూ శాంసన్ (45 బంతుల్లో 58; ఫోర్, 4 సిక్సర్ల, రెండు క్యాచ్లు), ముకేశ్ కుమార్ (3.3-0-22-4), శివమ్ దూబే (12 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు, 4-0-25-2) అద్భుతంగా రాణించి టీమిండియాకు ఘన విజయాన్నందించారు. ఈ గెలుపుతో భారత్.. ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో జింబాబ్వే తొలి మ్యాచ్లో గెలవగా.. భారత్ వరుసగా నాలుగు మ్యాచ్ల్లో జయభేరి మోగించింది.చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్ఈ సిరీస్లో నాలుగు టీ20లు గెలవడంతో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. విదేశీ గడ్డపై ఓ ద్వైపాక్షిక సిరీస్లో నాలుగు టీ20లు గెలిచిన తొలి భారత కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. శుభ్మన్.. కెప్టెన్గా తన తొలి సిరీస్లో ఈ భారీ రికార్డు సాధించాడు. కెప్టెన్గా తొలి మ్యాచ్ కోల్పోయిన గిల్.. ఆతర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ల్లో జట్టును విజయపథాన నడిపించాడు.భారత టీ20 జట్టుకు 14వ కెప్టెన్ అయిన గిల్.. రోహిత్ శర్మ (50), ధోని (42), విరాట్ కోహ్లి (32), హార్దిక్ పాండ్యా (10), సూర్యకుమార్ యాదవ్ (5) తర్వాత అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్గా రికార్డుల్లోకెక్కాడు. -
చరిత్ర సృష్టించిన గిల్-జైశ్వాల్ జోడీ.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 3-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. 153 పరుగుల లక్ష్యాన్ని భారత ఓపెనర్లు శుబ్మన్ గిల్, యశస్వీ జైశ్వాల్ ఊదిపడేశారు.జింబాబ్వే బౌలర్లను చొతక్కొట్టారు. యశస్వీ 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లతో 93 పరుగులు చేయగా.. గిల్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 58 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 156 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పిన గిల్-జైశ్వాల్ జోడీ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.టీ20 క్రికెట్లో ఛేజింగ్లో భారత తరపున రెండు సార్లు 150 ప్లస్ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తొలి జోడీగా గిల్-జైశ్వాల్ నిలిచారు. వీరిద్దరూ టీ20ల్లో 150 పైగా భాగస్వామ్యం నెలకొల్పడం ఇదే రెండో సారి.ఇంతకుముందు 2023లో వెస్టిండీస్తో జరిగిన టీ20లో జైస్వాల్, గిల్ ఇద్దరూ 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ రెండు భాగస్వామ్యాలు కూడా ఛేజింగ్లో నెలకొల్పినివే కావడం విశేషం. ఈ క్రమంలోనే ఈ అరుదైన ఫీట్ను గిల్, జైశ్వాల్ తమ ఖాతాలో వేసుకున్నారు.టీ20 చరిత్రలో భారత్ తరఫున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాలు ఇవే..165 - రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్ వర్సెస్ శ్రీలంక, ఇండోర్, 2017165 - యశస్వి జైస్వాల్ అండ్ శుబ్మన్ గిల్ వర్సెస్ వెస్టిండీస్, లాడర్హిల్, 2023160 - రోహిత్ శర్మ అండ్ శిఖర్ ధావన్ వర్సెస్ ఐర్లాండ్, డబ్లిన్, 2018158 - రోహిత్ శర్మ అండ్ శిఖర్ ధావన్ వర్సెస్ న్యూజిలాండ్, ఢిల్లీ, 2017156* - యశస్వి జైస్వాల్ అండ్ శుబ్మన్ గిల్ వర్సెస్ జింబాబ్వే, హరారే, 2024 -
Weekly Round Up: భారత్ హెడ్ కోచ్గా గంభీర్.. జింబాబ్వేతో టీ20 సిరీస్ మనదే
భారత క్రికెట్లో నూతన శకానికి నాంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేకుండా టీ20ల్లో టీమిండియా. భారత హెడ్ కోచ్గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ నియామకం. శుబ్మన్ గిల్ కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు జింబాబ్వే టూర్.యూరో ఫుట్బాల్ కప్లో ఫైనల్కు చేరిన స్పెయిన్, ఇంగ్లండ్. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్కు చేరిన నొవాక్ జొకోవిచ్, కార్లోస్ అల్కరాజ్ వంటి ఈ వారంలో జరిగిన ముఖ్యమైన క్రీడా ఆంశాలపై ఓ లుక్కేద్దాం.భారత హెడ్ కోచ్గా గౌతం గంభీర్..భారత క్రికెట్లో నూతన శకానికి బీసీసీఐ నాంది పలికింది. టీమిండియా హెడ్ కోచ్గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ను బీసీసీఐ నియమించింది. 2007, 2011 వరల్డ్కప్ విన్నర్ గంభీర్.. ద్రవిడ్ వారసుడిగా బాధ్యతలు చేపట్టాడు. శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్ కోచ్గా గంభీర్కు తొలి పరీక్ష. టీ20 వరల్డ్కప్-2024తో హెడ్కోచ్గా ద్రవిడ్ పదవీ కాలం ముగిసింది.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేకుండానే భారత్..టీ20 వరల్డ్కప్ విజయం అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు విడ్కోలు పలికారు. దీంతో రోహిత్, విరాట్ లేకుండానే భారత్ టీ20ల్లో ఆడుతోంది. టీమిండియా ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉంది.శుబ్మన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా..యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ తొలిసారి భారత సీనియర్ జట్టు పగ్గాలు చేపట్టాడు. గిల్ సారథ్యంలోని భారత యువ జట్టు ఐదు మ్యాచ్ల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. సీనియర్ ఆటగాళ్లు ఈ టూర్కు దూరం కావడంతో ద్వితీయ శ్రేణి జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.అయితే జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టిన ఆదిలోనే భారత్కు బిగ్ షాక్ తగిలింది. తొలి టీ20లో ఆతిథ్య జట్టులో భారత్ ఘోర ఓటమి చవిచూసింది. ఆ తర్వాత దెబ్బతిన్న సింహంలా గర్జించిన భారత జట్టు.. వరుసగా మూడు మ్యాచ్ల్లో గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను 3-1 తేడాతో సొంతం చేసుకుంది.ఈ సిరీస్లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సంచలన సెంచరీతో మెరిశాడు. అతడికి ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ. కెప్టెన్ శుబమన్ గిల్ సైతం తన ఫామ్ను తిరిగి పొందాడు. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ ఆదివారం జరగనుంది.యూరో కప్ ఫైనల్కు చేరిన స్పెయిన్, ఇంగ్లండ్..యూరో ఫుట్బాల్ కప్-2024 ఫైనల్కు స్పెయిన్, ఇంగ్లండ్ జట్లు చేరాయి. తొలి సెమీఫైనల్లో 2-1 తేడాతో ఫ్రాన్స్ను ఓడించి స్పెయిన్ ఫైనల్లో అడుగుపెట్టగా.. రెండో సెమీస్లో నెదర్లాండ్స్ను ఓడించి ఇంగ్లండ్ తుది పోరుకు ఆర్హత సాధించింది. ఆదివారం(జూలై 14) జరగనున్న ఫైనల్ పోరులో స్పెయిన్, ఇంగ్లండ్ అమీతుమీ తెల్చుకోనున్నాయి.కోపా అమెరికా ఫుట్బాల్ కప్ ఫైనల్లో అర్జెంటీనా- కొలంబియాకోపా అమెరికా ఫుట్బాల్ కప్ ఫైనల్లో అర్జెంటీనా- కొలంబియా అడుగుపెట్టాయి. తొలి సెమీఫైనల్లో కెనడాపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి అర్జెంటీనా ఫైనల్కు చేరగా.. రెండో సెమీఫైనల్లో కెనడాపై 1–0 గోల్ తేడాతో విజయం సాధించి కొలంబియా ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. జూలై 15న జరగనున్న టైటిల్పోరులో అర్జెంటీనా- కొలంబియా తాడోపేడో తెల్చుకోనున్నాయి. కాగా కొలంబియా ఈ టోర్నీలో ఫైనల్ చేరడం 23 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. అదే విధంగా అర్జెంటీనా డిఫెండింగ్ హోదాలో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.సింగిల్స్ ఫైనల్లో జొకోవిచ్, అల్కరాజ్ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో కార్లోస్ అల్కరాజ్ ఫైనల్లో అడుగుపెట్టాడు. తొలి సెమీఫైనల్లో ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)ను 6–7 (1/7), 6–3, 6–4, 6–4తో తేడాతో ఓడించిన అల్కరాజ్ ఫైనల్కు అర్హత సాధించాడు. అదే విధంగా రెండో సెమీఫైనల్లో 6–4, 7–6 (7/2), 6–4తో 25వ సీడ్ లరెంజో ముసెట్టి (ఇటలీ)పై విజయం సాధించి రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్ కూడా ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకున్నాడు.సరికొత్త ఛాంపియన్గా క్రెజికోవా..ప్రతిష్టాత్మక గ్రాండ్స్లామ్ టోర్నీలో వింబుల్డన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త విజేత అవతరించింది. చెక్ రిపబ్లిక్కు చెందిన బార్బరా క్రెజికోవా తన తొలి వింబుల్డన్ టైటిల్ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో క్రెజికోవా 6–2, 2–6, 6–4 స్కోరుతో ఏడో సీడ్ జాస్మిన్ పావొలిని (ఇటలీ)పై విజయం సాధించింది.డబ్ల్యూసీఎల్ విజేతగా ఇండియా..వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీ విజేతగా ఇండియా ఛాంపియన్స్ నిలిచింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి భారత్ టైటిల్ను ముద్దాడింది.ఈ ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో షోయబ్ మాలిక్(41) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 157 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత విజయంలో రాయుడు( 50), యూసఫ్ పఠాన్(30) కీలక పాత్ర పోషించారు.జేమ్స్ ఆండర్సన్ రిటైర్మెంట్..ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్ జేమ్స్ ఆండర్సన్ తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్కు విడ్కోలు పలికాడు. వెస్టిండీస్ తొలి టెస్టు అనంతరం తన క్రికెట్ కెరీర్కు ముగింపు పలికాడు. -
జైస్వాల్, గిల్ ఘనంగా...
ఐపీఎల్లో సత్తా చాటిన కుర్రాళ్లు ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై కూడా తమకు లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. రెగ్యులర్ ఆటగాళ్లు లేకుండా వెళ్లిన యువ జట్టు అంచనాలకు అనుగుణంగా సత్తా చాటి జింబాబ్వేపై టి20 సిరీస్ విజయాన్ని అందుకుంది. తొలి మూడు మ్యాచ్లతో పోలిస్తే ఈ సారి సంపూర్ణ ఆధిపత్యంతో చెలరేగిన టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. నాలుగో మ్యాచ్లో యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్ దూకుడైన బ్యాటింగ్ ముందు జింబాబ్వే ఏమాత్రం పోటీనివ్వలేకపోవడంతో జట్టు అలవోకగా లక్ష్యం చేరింది.హరారే: టి20 వరల్డ్ కప్లో విజేతగా నిలిచిన తర్వాత జరిగిన తొలి సిరీస్ కూడా భారత్ ఖాతాలో చేరింది. జింబాబ్వే గడ్డపై జరిగిన ఈ ఐదు మ్యాచ్ల పోరులో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 3–1తో సిరీస్ సొంతం చేసుకుంది. శనివారం జరిగిన నాలుగో టి20లో భారత్ 10 వికెట్ల తేడాతో జింబాబ్వే ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్ సికందర్ రజా (28 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలవగా...మరుమని (31 బంతుల్లో 32; 3 ఫోర్లు), మదివెరె (24 బంతుల్లో 25; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం భారత్ 15.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 156 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యశస్వి జైస్వాల్ (53 బంతుల్లో 93 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ శుబ్మన్ గిల్ (39 బంతుల్లో 58 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయంగా జట్టును గెలిపించారు. సిరీస్లో చివరిదైన ఐదో మ్యాచ్ నేడు ఇక్కడే జరుగుతుంది. రజా రాణించినా... జింబాబ్వేకు ఓపెనర్లు మరుమని, మదివెరె కొన్ని చక్కటి షాట్లతో మెరుగైన ఆరంభాన్ని అందించారు. సిరీస్లో తొలిసారి ఆ జట్టు పవర్ప్లేలో ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. భారత పేసర్లు ఆరంభంలో కట్టు తప్పడం జింబాబ్వేకు కలిసొచ్చింది.తొలి వికెట్కు 52 బంతుల్లో 63 పరుగులు జోడించిన తర్వాత అభిషేక్ తన తొలి అంతర్జాతీయ వికెట్గా మరుమనిని వెనక్కి పంపించాడు. తర్వాతి ఓవర్లో మదివెరె కూడా అవుట్ కాగా...10 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 67/2కు చేరింది. ఈ దశలో భారత స్పిన్నర్లు ప్రత్యర్థిని కట్టి పడేశారు. నాలుగు పరుగుల వ్యవధిలో బెన్నెట్ (9), క్యాంప్బెల్ (3) అవుట్ కావడం జట్టును దెబ్బ తీసింది. అయితే రజా దూకుడుగా ఆడటంతో స్కోరు 150 పరుగులు దాటింది. ఆఖరి 5 ఓవర్లలో జింబాబ్వే 54 పరుగులు సాధించింది. దూబే, రుతురాజ్ ఒక్కో క్యాచ్ వదిలేసినా...భారత్కు వాటి వల్ల పెద్దగా నష్టం జరగలేదు. ఆడుతూ పాడుతూ... జింబాబ్వే ఇన్నింగ్స్ మొత్తంలో 10 ఫోర్లు ఉండగా...భారత ఓపెనర్లు తొలి 4 ఓవర్లలోనే 10 ఫోర్లు బాదారు. ఎన్గరవ వేసిన తొలి ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన జైస్వాల్...చటారా ఓవర్లో 4 ఫోర్లు బాదాడు. పవర్ప్లేలో భారత్ 61 పరుగులు చేసింది. ఆ తర్వాత 29 బంతుల్లో జైస్వాల్ అర్ధసెంచరీ పూర్తయింది. అక్రమ్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన గిల్ 35 బంతుల్లో సిరీస్లో వరుసగా రెండో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. బెన్నెట్ ఓవర్లో గిల్ 2 సిక్స్లు బాదడంతో మరో ఎండ్లో జైస్వాల్కు సెంచరీ అవకాశం దక్కలేదు. ఐపీఎల్లో చెన్నై జట్టు తరఫున రాణించి గుర్తింపు తెచ్చుకున్న పేసర్ తుషార్ దేశ్పాండే ఈ మ్యాచ్లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున టి20లు ఆడిన 115వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. స్కోరు వివరాలు: జింబాబ్వే ఇన్నింగ్స్: మదివెరె (సి) రింకూ సింగ్ (బి) దూబే 25; మరుమని (సి) రింకూ సింగ్ (బి) అభిõÙక్ 32; బెన్నెట్ (సి) జైస్వాల్ (బి) సుందర్ 9; రజా (సి) గిల్ (బి) దేశ్పాండే 46; క్యాంప్బెల్ (రనౌట్) 3; మయర్స్ (సి) అండ్ (బి) ఖలీల్ 12; మదాందె (సి) రింకూ సింగ్ (బి) ఖలీల్ 7; అక్రమ్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 152. వికెట్ల పతనం: 1–63, 2–67, 3–92, 4–96, 5–141, 6–147, 7–152. బౌలింగ్: ఖలీల్ 4–0–32–2, దేశ్పాండే 3–0–30–1, బిష్ణోయ్ 4–0–22–0, సుందర్ 4–0–32–1, అభిõÙక్ 3–0–20–1, దూబే 2–0–11–1. భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (నాటౌట్) 93; గిల్ (నాటౌట్) 58; ఎక్స్ట్రాలు 5; మొత్తం (15.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 156. బౌలింగ్: ఎన్గరవ 3–0–27–0, ముజరబాని 3.2–0–25–0, చటారా 2–0–23–0, అక్రమ్ 4–0–41–0, రజా 2–0–24–0, బెన్నెట్ 1–0–16–0. -
సంతోషం.. కానీ ఇంకో మ్యాచ్ మిగిలే ఉంది: గిల్
జింబాబ్వే పర్యటనలో యువ భారత జట్టు సత్తా చాటింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ తర్వాత ఆడిన తొలి టీ20 ద్వైపాక్షిక సిరీస్లోనే టీమిండియాకు ఘన విజయం అందించింది.టీ20 ప్రపంచకప్-2024 తర్వాత సీనియర్లు విశ్రాంతి తీసుకోవడంతో వచ్చిన అవకాశాన్ని యువ ఆటగాళ్లు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. తొలి టీ20లో పరాజయం పాలైనా.. పడిలేచిన కెరటంలా హ్యాట్రిక్ విజయాలతో జోరు ప్రదర్శించారు.హరారే వేదికగా శనివారం నాటి నాలుగో టీ20లో సమష్టిగా రాణించి జింబాబ్వేను పది వికెట్ల తేడాతో చిత్తు చేశారు. ఈ క్రమంలో కెప్టెన్గా తొలిసారి భారత జట్టు పగ్గాలు చేపట్టిన శుబ్మన్ గిల్ ఖాతాలో అరంగేట్రంలోనే సిరీస్ విజయం చేరింది.ఈ నేపథ్యంలో గిల్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ అనుభూతి ఎంతో గొప్పగా ఉందని పేర్కొన్నాడు. ‘‘మొదటి టీ20లో మేము లక్ష్య ఛేదనలో విఫలమయ్యాం.అయితే, ఈరోజు విజయవంతంగా టార్గెట్ పూర్తి చేశాం. ఈ ఫీలింగ్ అద్భుతంగా ఉంది. అయినా.. ఇప్పుడే ఇంకా పని పూర్తి కాలేదు. ఇంకొక మ్యాచ్ మిగిలే ఉంది’’ అని పేర్కొన్నాడు.ఇక ప్రస్తుతం ఆడుతున్న జట్టు గొప్పగా ఉందన్న గిల్... తదుపరి మ్యాచ్లో మార్పులు చేర్పుల గురించి కోచ్తో ఇంకా చర్చించలేదని తెలిపాడు. కాగా టీమిండియా- జింబాబ్వే మధ్య నామమాత్రపు ఐదో టీ20 హరారే వేదికగా ఆదివారం జరుగనుంది.టీమిండియా వర్సెస్ జింబాబ్వే నాలుగో టీ20 స్కోర్లు:👉వేదిక: హరారే స్పోర్ట్స్ క్లబ్👉టాస్: టీమిండియా.. బౌలింగ్👉జింబాబ్వే స్కోరు: 152/7 (20)👉టీమిండియా స్కోరు: 156/0 (15.2)👉ఫలితం: పది వికెట్ల తేడాతో జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. సిరీస్ సొంతం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యశస్వి జైస్వాల్ (53 బంతుల్లో 93 పరుగులు నాటౌట్, (13 ఫోర్లు, 2 సిక్సర్లు)).చదవండి: Ind vs Zim 4th T20: జైస్వాల్ విధ్వంసం.. గిల్ సూపర్ ఇన్నింగ్స్ -
Ind vs Zim: జైస్వాల్ విధ్వంసం.. గిల్ సూపర్ ఇన్నింగ్స్
జింబాబ్వేతో నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది.ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లిన యువ భారత జట్టుకు శుబ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్లో ఓడిన టీమిండియా.. ఆ తర్వాత వరుసగా రెండు విజయాలు సాధించింది.రాణించినా రజా ఈ క్రమంలో శనివారం నాలుగో టీ20లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగింది. హరారే వేదికగా టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు రాణించారు. జింబాబ్వేను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేశారు.ఆతిథ్య జట్టు ఓపెనర్లలో వెస్లీ మెదెవెరె(25), మరుమానీ(32) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ సికందర్ రజా 46 పరుగులు చేశాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టపోయి 152 పరుగులు చేసింది.అరంగేట్ర బౌలర్కు ఒక వికెట్ టీమిండియా బౌలర్లలో పేసర్లు ఖలీల్ అహ్మద్ రెండు, అరంగేట్ర ఆటగాడు తుషార్ దేశ్పాండే, శివం దూబే ఒక్కో వికెట్ పడగొట్టగా.. స్పిన్నర్లు రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలా ఒక వికెట్ తీశారు.ఆకాశమే హద్దుగా జైస్వాల్ఇక జింబాబ్వే విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్ అజేయ అద్బుత అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జైస్వాల్ 93 పరుగుల(13 ఫోర్లు, 2 సిక్సర్లు) తో దుమ్మలేపగా.. గిల్ 58 పరుగులు (ఆరు ఫోర్లు, రెండు సిక్స్లు) సాధించాడు.వీరిద్దరి విజృంభణ కారణంగా 15.2 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. ఏకంగా పది వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసి సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక కెప్టెన్గా శుబ్మన్ గిల్ తొలి సిరీస్లోనే ట్రోఫీ గెలవడం విశేషం.చదవండి: IND Vs ZIM 4th T20I: సికందర్ రజా వరల్డ్ రికార్డు -
టీమిండియా ఘన విజయం.. సిరీస్ మనదే
Zimbabwe vs India, 4th T20I Updates: జింబాబ్వే పర్యటనలో భాగంగా టీమిండియా నాలుగో టీ20 ఆడుతోంది. ఇప్పటికే ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1తో శుబ్మన్ గిల్ సేన ఆధిక్యంలో ఉంది. శనివారం టీ20లో టాస్ గెలిచిన భారత్.. జింబాబ్వేను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ విజృంభించింది. ఓపెర్లు యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్ దంచికొట్టారు. జైస్వాల్ 93 పరుగులతో దుమ్మలేపగా.. గిల్ 58 పరుగులు సాధించాడు.వీరిద్దరి విజృంభణ కారణంగా 15.2 ఓవర్లలోనే భారత్ టార్గెట్ను పూర్తి చేసింది. ఏకంగా పది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ను కైవసం చేసుకుంది.భారత తుదిజట్టు: యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్( వికెట్ కీపర్), రింకూ సింగ్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్పాండే, ఖలీల్ అహ్మద్.జింబాబ్వే తుదిజట్టు: వెస్లీ మెదెవెరె, తాడివానాషే మరుమానీ, బ్రియాన్ బెన్నెట్, డియాన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్ కీపర్), రిచర్డ్ నగరవా, బ్లెస్సింగ్ ముజరాబానీ, టెండాయ్ చటారా.అప్డేట్స్14.1: గిల్ అర్ధ శతకం12 ఓవర్లలో టీమిండియా స్కోరు: 118/0 (12)జింబాబ్వే బౌలింగ్ను చిత్తు చేస్తూ టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. 12వ ఓవర్ముగిసే సరికి జైస్వాల్ 75, గిల్ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు.పది ఓవర్లలోనే టీమిండియా స్కోరు: 106-0శుబ్మన్ గిల్ 37, యశస్వి జైస్వాల్ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు.6.3: 29 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకు న్న యశస్వి జైస్వాల్పవర్ ప్లేలో యశస్వి పరుగుల వరదఆరో ఓవర్ ముగిసే సరికి యశస్వి జైస్వాల్ 47(26), శుబ్మన్ గిల్ 13 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు: 61/0 (6)దంచికొడుతున్న యశస్విజింబాబ్వే విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఘనంగా తమ ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్ ఆది నుంచే జింబాబ్వే బౌలర్లపై అటాక్ చేస్తున్నారు.మూడు ఓవర్లు ముగిసే సరికి యశస్వి 13 బంతుల్లోనే 31 పరుగులు సాధించగా.. గిల్ ఐదు బంతుల్లో 11 రన్స్ చేశాడు. దీంతో టీమిండియా వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. టీమిండియా టార్గెట్ 153ఆతిథ్య జట్టు ఓపెనర్లు వెస్లీ మెదెవెరె(25), మరుమానీ(32) సహా కెప్టెన్ సికందర్ రజా(46) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.భారత బౌలర్లలో పేసర్లు ఖలీల్ అహ్మద్ రెండు, తుషార్ దేశ్పాండే, శివం దూబే ఒక్కో వికెట్ తీయగా.. స్పిన్నర్లు రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు.ఆఖరి ఓవర్లో రెండు వికెట్లుఆఖరి ఓవర్లో టీమిండియా పేసర్ ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు. తొలి బంతికి మేయర్స్(12), ఆఖరి బంతికి మందాడే(7)ను పెవిలియన్కు పంపాడు.18.3: రజా హాఫ్ సెంచరీ మిస్ధనాధన్ ఇన్నింగ్స్తో అలరించిన జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. తుషార్ దేశ్పాండే బౌలింగ్లో శుబ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరం(28 బంతుల్లో 46) నిలిచిపోయాడు. రజా రూపంలో జింబాబ్వే ఐదో వికెట్ కోల్పోయింది.జింబాబ్వే స్కోరు: 147/5 (19) పదిహేడు ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే స్కోరు: 129/4రజా 42, మేయర్స్ తొమ్మిది పరుగులతో ఆడుతున్నారు14.4: నాలుగో వికెట్ కోల్పోయిన జింబాబ్వేబ్యాటర్ల మధ్య సమన్వయ లోపం కారణంగా జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. రవి బిష్ణోయి బౌలింగ్లో సికందర్ రజా పరుగుకు యత్నించగా.. మరో ఎండ్లో ఉన్న క్యాంప్బెల్ వేగంగా కదలలేకపోయాడు.ఈ క్రమంలో బంతిని అందుకున్న బిష్ణోయి నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు విసరగా.. బాల్ వికెట్లను గిరాటేసింది. ఫలితంగా క్యాంప్బెల్(3) రనౌట్ అయ్యాడు. 13.4: మూడో వికెట్ డౌన్వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో బ్రియాన్ బెనెట్ యశస్వి జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్గా వెనుదిరిగాడు. పద్నాలుగు బంతులు ఎదుర్కొన్న ఈ వన్డౌన్ బ్యాటర్ తొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.జొనాథన్ క్యాంప్బెల్ క్రీజులోకి వచ్చాడు. సికందర్రజా 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు. జింబాబ్వే స్కోరు: 93/3 (14).9.6: రెండో వికెట్ కోల్పోయిన జింబాబ్వేపేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శివం దూబే బౌలింగ్లో జింబాబ్వే ఓపెనర్ వెస్లీ(25) పెవిలియన్ చేరాడు. బాల్ను తప్పుగా అంచనా వేసి గాల్లోకి లేపగా.. రింకూ సింగ్ క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో వెస్లీ ఇన్నింగ్స్కు తెరపడింది.సికందర్ రజా 0, బ్రియాన్ బెనెట్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. పది ఓవర్లలో జింబాబ్వే స్కోరు: 67-2.7.1: హాఫ్ సెంచరీ పూర్తి చేసుకు న్న జింబాబ్వేవాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో మరుమానీ రెండు పరుగులు తీయగా.. జింబాబ్వే యాభై పరుగుల మార్కు అందుకుంది.పవర్ ప్లేలో జింబాబ్వే స్కోరు: 44/0ఆరు ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. ఓపెనర్లు వెస్లీ 19, మరుమానీ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.కట్టుదిట్టంగా భారత్ బౌలింగ్బ్యాటింగ్కు దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు కట్టడి చేస్తున్నారు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్ అటాక్ ఆరంభించగా.. తన పేస్ పదనుతో జింబాబ్వేకు తొలి ఓవర్లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు.ఇక రెండో ఓవర్ వేసిన అరంగట్రే పేసర్ తుషార్ దేశ్పాండే 11 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలో రెండు ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 15 పరుగులు చేసింది. ఓపెనర్లు వెస్లీ 12, మరుమానీ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచిన భారత జట్టుశనివారం నాటి మ్యాచ్లో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. హరారే వేదికగా జరుగనున్న ఈ టీ20లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.తుషార్ దేశ్పాండే అరంగేట్రంఈ మ్యాచ్ ద్వారా పేస్ బౌలర్ తుషార్ దేశ్పాండే అరంగేట్రం చేస్తున్నట్లు గిల్ తెలిపాడు. ఆవేశ్ ఖాన్ స్థానంలో అతడిని తుదిజట్టుకు ఎంపిక చేసినట్లు వెల్లడించాడు.మరోవైపు.. తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా తెలిపాడు. వెల్లింగ్టన్ మసకజ్ద స్థానంలో ఫరాజ్ అక్రం జట్టులోకి వచ్చినట్లు పేర్కొన్నాడు. -
జింబాబ్వేతో మూడో టీ20.. గిల్పై అభిమానుల ఆగ్రహం
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ మెరుపు అర్దసెంచరీతో (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. గిల్ చాన్నాళ్ల తర్వాత ఈ మ్యాచ్తోనే ఫామ్లోకి వచ్చినా ఓ విషయంలో మాత్రం అభిమానుల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నాడు.విషయం ఏంటంటే.. శుభ్మన్ గిల్.. మూడో టీ20లో తాను ఓపెనర్గా బరిలోకి దిగడం కోసం రెండో టీ20లో ఓపెనర్గా వచ్చి సెంచరీ చేసిన అభిషేక్ శర్మను డిమోట్ చేశాడు. సూపర్ ఫామ్లో ఉన్న అభిషేక్ స్థానచలనం కలగడంతో ఈ మ్యాచ్లో కేవలం 10 పరుగులకే ఔటయ్యాడు. ఇదే అభిమానులకు గిల్పై ఆగ్రహం తెప్పించింది. గిల్ తన స్వార్దం కోసం జట్టు ప్రయోజనాలను గాలికి వదిలేయడంతో పాటు అభిషేక్ లయను దెబ్బ తీశాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ అనంతరం గిల్ ఈ విషయాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం (అభిషేక్ స్పిన్నర్లను బాగా ఎదుర్కొంటాడని చెప్పాడు) చేసినా అభిమానులు అతన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. గిల్ మరో కోహ్లిలా (వ్యక్తిగత రికార్డుల విషయంలో) ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి యశస్వి జైస్వాల్ రాకతో టీమిండియాకు కొత్త చిక్కే (ఓపెనర్ల విషయంలో) వచ్చి పడింది. టీ20 వరల్డ్కప్ విన్నింగ్ టీమ్లో సభ్యుడైన యశస్వి లేటుగా (మూడో టీ20) జట్టుతో జతకట్టిన విషయం తెలిసిందే.కాగా, బ్యాటింగ్లో గిల్, రుతురాజ్ (49).. బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్ (4-0-15-3), ఆవేశ్ ఖాన్ (4-0-39-2), ఖలీల్ అహ్మద్ (4-0-16-1) సత్తా చాటడంతో మూడో టీ20లో టీమిండియా జింబాబ్వేను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. ఛేదనలో పోటీపడలేకపోయిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమైంది. నాలుగో టీ20 జులై 13న జరుగనుంది. -
వాళ్లిద్దరికే ఆ రికార్డు బ్రేక్ చేసే సత్తా ఉంది: లారా
క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా. అద్భుత బ్యాటింగ్తో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. తన కెరీర్తో పాటు అంతర్జాతీయ క్రికెట్లోనూ చిరస్థాయిగా నిలిచిపోయే ఓ ఘనత మాత్రం అన్నింటికంటే ప్రత్యేకం.టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్లో ఇంత వరకు 400(నాటౌట్) పరుగులు సాధించిన ఒకే ఒక్క బ్యాటర్ లారా. ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా 2004లో లారా ఈ ఫీట్ నమోదు చేశాడు. అదే విధంగా.. ఫస్ట్క్లాస్ క్రికెట్ ఏకంగా 501(నాటౌట్) రన్స్ స్కోరు చేసిన ఘనత కూడా లారాకే దక్కింది. ఈ రెండు రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి.దూకుడైన ఆటగాళ్లు తక్కువేఈ నేపథ్యంలో బ్రియన్ లారాకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్లో 400 పరుగుల మార్కు అందుకోగల బ్యాటర్ ఎవరన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఇద్దరు టీమిండియా యువ ఆటగాళ్ల పేర్లు చెప్పాడు లారా.‘‘నేను క్రికెట్ ఆడే సమయంలో కనీసం మూడు వందల పరుగుల మార్కు దాటేందుకు వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, ఇంజమామ్ ఉల్ హక్, సనత్ జయసూర్య వంటి వాళ్లు ఎంతగానో ప్రయత్నించారు.ఇక ఇప్పుడు అలాంటి దూకుడైన ఆటగాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు. ఇంగ్లండ్ జట్టులో జాక్ క్రాలే, హ్యారీ బ్రూక్ అగ్రెసివ్గా ఆడుతున్నారు.వీరిద్దరికే ఆ సత్తా ఉందిఇక భారత జట్టులో..?!.. యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్ల పేర్లను చెప్పవచ్చు. వీరిద్దరు ఒక్కసారి క్రీజులో కుదురుకుని పరిస్థితులు గనుక అనుకూలిస్తే ఇలాంటి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టగలరు’’ అని బ్రియన్ లారా డైలీ మెయిల్తో వ్యాఖ్యానించాడు.కాగా టీమిండియా భవిష్య కెప్టెన్గా పేరొందిన ఓపెనర్ శుబ్మన్ గిల్కు టెస్టుల్లో ఇప్పటి వరకు అత్యధిక స్కోరు 128. ఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఖాతాలో మాత్రం ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. అరంగేట్రంలోనే ఈ లెఫ్టాండర్ 171 పరుగులు చేశాడు. అంతేకాదు ఇప్పటిదాకా మూడుసార్లు 150 ప్లస్ స్కోర్లు సాధించాడు. చదవండి: WCL 2024: యువరాజ్ మళ్లీ ఫెయిల్.. యూసఫ్, ఇర్ఫాన్ మెరుపులు! -
ఇది మాకు శుభసూచకం.. చాలా సంతోషంగా ఉంది: భారత కెప్టెన్
జింబాబ్వేతో టీ20 సిరీస్లో టీమిండియా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 23 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1ఆధిక్యంలో దూసుకెళ్లింది.ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్తో షో తో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్లో 182 పరుగులు చేసిన టీమిండియా.. అనంతరం బౌలింగ్లో ఆతిథ్య జట్టును 159 పరుగులకే కట్టడి చేసింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందించాడు. ఆల్రౌండ్షో కనబరిచిన భారత జట్టుపై గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు."సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లడం చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు చాలా కీలకమైన మ్యాచ్. ఈ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్లో అద్బుతంగా రాణించాము. ఈ వికెట్లో డబుల్ పేస్, బాల్ గ్రిప్పింగ్ ఎక్కువ ఉంది. ఇటువంటి పిచ్పై లెంగ్త్ బాల్స్ను హిట్ చేయడం అంత ఈజీకాదు.కానీ మా బ్యాటర్లు ఇక్కడ పరిస్థితులను బాగా ఆర్ధం చేసుకున్నారు. అందుకు తగ్గట్టే బ్యాటింగ్ చేశారు. ఇక బౌలర్లతో కూడా అదే విషయం చర్చించాము. ఇక్కడ బంతి ఎక్కువగా గ్రిప్ప్ అవుతుండడంతో ఏది చేయాలన్న కొత్త బంతితో చేయాలని మా బౌలర్లకు చెప్పాను.బంతి పాతదయ్యే కొద్దీ స్కోర్ చేయడం సులభం అని మాకు తెలుసు. అందుకు తగ్గట్టుగానే మా బౌలర్లు కొత్త బంతితో అద్బుతాలు సృష్టించారు. వరుస క్రమంలో వికెట్లు పడగొట్టి ఆదిలోనే ప్రత్యర్థిని కష్టాల్లో నెట్టారు.జట్టు విజయంలో ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. నిజంగా ఇది భారత క్రికెట్కు శుభసూచికమని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో గిల్ పేర్కొన్నాడు. -
సత్తా చాటిన శుభ్మన్, సుందర్.. మూడో టీ20లో టీమిండియా గెలుపు
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా జింబాబ్వేతో ఇవాళ (జులై 10) జరిగిన మూడో టీ20 టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శుభ్మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రెండో మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 10 పరుగులకే ఔటయ్యాడు. సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (1) అజేయంగా నిలిచారు. శుభ్మన్ గిల్ ఆరు ఇన్నింగ్స్ల తర్వాత టీ20ల్లో హాఫ్ సెంచరీ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. 39 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఘోర ఓటమి దిశగా సాగింది. అయితే డియాన్ మైర్స్ (65 నాటౌట్), మదండే (37) జింబాబ్వేను దారుణ పరాభవం బారిన పడకుండా తప్పించారు. వీరిద్దరు ఆరో వికెట్కు 77 పరుగులు జోడించారు. ఓ దశలో (మైర్స్, మదండే క్రీజ్లో ఉండగా) జింబాబ్వే టీమిండియాకు షాకిచ్చేలా కనిపించింది. అయితే ఇన్నింగ్స్ ఆఖర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ (4-0-15-3), ఆవేశ్ ఖాన్ (4-0-39-2), ఖలీల్ అహ్మద్ (4-0-15-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్లో గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టీ20 జులై 13న జరుగనుంది. కాగా, తొలి మ్యాచ్లో జింబాబ్వే, రెండో మ్యాచ్లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. -
ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చిన గిల్.. జింబాబ్వే టార్గెట్ 183
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓ మోస్తరు స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటారు. రెండో మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 10 పరుగులకే ఔటయ్యాడు. సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (1) అజేయంగా నిలిచారు. శుభ్మన్ గిల్ ఆరు ఇన్నింగ్స్ల తర్వాత టీ20ల్లో హాఫ్ సెంచరీ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా, ఈ సిరీస్లో తొలి టీ20 జింబాబ్వే.. రెండో మ్యాచ్ భారత్ గెలిచిన విషయం తెలిసిందే.తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుభమన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్(వికెట్కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్జింబాబ్వే: తాడివానాషే మారుమణి, వెస్లీ మాధేవేరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), జోనాథన్ కాంప్బెల్, క్లైవ్ మదాండే(వికెట్కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా -
Ind vs Zim: ఆ ముగ్గురిపై వేటు.. దూబేకూ చోటు
జింబాబ్వేతో మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హరారే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్తో ప్రపంచకప్-2024 విజేత జట్టులోని ముగ్గురు స్టార్లు పునరాగమనం చేశారు.ఓపెనర్ యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్, పవర్ హిట్టర్ శివం దూబే తుదిజట్టులో చోటు దక్కించుకున్నారు. వీరి రాకతో సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్లపై వేటు పడింది.అదే విధంగా.. పేసర్ ముకేశ్ కుమార్కు విశ్రాంతినిచ్చారు. ఈ నేపథ్యంలో టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ మాట్లాడుతూ.. వరల్డ్కప్ విన్నర్ల రాకతో తమ జట్టు మరింత పటిష్టమైందని పేర్కొన్నాడు.తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుభమన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్(వికెట్కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్జింబాబ్వే: తాడివానాషే మారుమణి, వెస్లీ మాధేవేరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), జోనాథన్ కాంప్బెల్, క్లైవ్ మదాండే(వికెట్కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా. -
Ind vs Zim: యశస్వి, సంజూ ఎంట్రీ.. వాళ్లిద్దరికి నో ఛాన్స్!
జింబాబ్వేతో కీలకమైన మూడో టీ20కి టీమిండియా సన్నద్ధమైంది. హరారే వేదికగా ఇరు జట్ల మధ్య బుధవారం ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, శివమ్ దూబే చేరికతో భారత జట్టు మరింత పటిష్టంగా మారింది.అయితే, అదే సమయంలో తుదిజట్టు కూర్పు కూడా తలనొప్పిగా మారింది. ఇప్పటికే కెప్టెన్ శుబ్మన్ గిల్కు ఓపెనింగ్ జోడీగా అభిషేక్ శర్మ కుదురుకున్నాడు. తొలి టీ20లో అభిషేక్ విఫలమైనా.. రెండో టీ20లో అద్భుత సెంచరీతో జట్టును గెలిపించాడు.కాబట్టి ఈ పంజాబీ బ్యాటర్ను తప్పించేందుకు మేనేజ్మెంట్ సుముఖత చూపకపోవచ్చు. ఈ నేపథ్యంలో మరో ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ను ఆడించే విషయంలో సందిగ్దం నెలకొంది. ఈ క్రమంలో అతడిని జట్టులో చేర్చాలంటే కెప్టెన్ శుబ్మన్ గిల్ వన్డౌన్లో ఆడే అవకాశం కనిపిస్తోంది.వికెట్ కీపర్గా అతడికే ఛాన్స్యశస్వి- అభిషేక్ భారత ఇన్నింగ్స్ ఆరంభించనున్నట్లు సమాచారం. దీంతో బ్యాటర్ సాయి సుదర్శన్పై వేటు పడే అవకాశం ఉంది. మరోవైపు.. సంజూ శాంసన్ రాకతో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ స్థానం ప్రశ్నార్థకమైంది.అనుభవజ్ఞుడైన సంజూ శాంసన్ వైపే మొగ్గుచూపిన యాజమాన్యం.. వికెట్ కీపర్గా అతడికే ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.కాగా టీ20 ప్రపంచకప్-2024 జట్టులో ఉన్నా ఆడే అవకాశం రాని యశస్వి, సంజూలను ఈ మ్యాచ్లో తప్పక ఆడించాలనే యోచనలో ఉన్న బీసీసీఐ.. శివం దూబేకు మాత్రం విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది.ఒకే ఒక్క మార్పుతోఇదిలా ఉంటే .. జింబాబ్వే ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగన్నుట్లు సమాచారం. లెఫ్టార్మ్ పేసర్ రిచర్డ్ ఎన్గరవా ఫిట్నెస్ సాధిస్తే.. ల్యూక్ జాంగ్వేకు ఉద్వాసన పలుకనున్నట్లు తెలుస్తోంది. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం 1-1తో ఇరు జట్లు సమంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక మూడో టీ20 బుధవారం సాయంత్రం గం. 4:30 నుంచి సోనీ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.పిచ్ స్వభావం, వాతావరణంహరారే పిచ్ బౌలర్లు, బ్యాటర్లకు సమంగా అనుకూలించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మ్యాచ్కు వర్ష సూచన లేదు.జింబాబ్వేతో మూడో టీ20కి భారత తుదిజట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకు సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ముకేష్ కుమార్.జింబాబ్వే తుదిజట్టు(అంచనా)వెస్లీ మెదవెరె, ఇన్నోసెంట్ కైయా, బ్రియాన్ బెన్నెట్, సికందర్ రజా (కెప్టెన్), డియాన్ మైయర్స్, జోనాథన్ క్యాంప్బెల్, క్లైవ్ మాండే (వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకజ్ద, ల్యూక్ జాంగ్వే/ రిచర్డ్ ఎన్గరవా, బ్లెస్సింగ్ ముజరాబానీ, టెండాయ్ చతారా. The #T20WorldCup-winning trio is in the house... 👏 👏... and they are 𝙍𝙖𝙧𝙞𝙣𝙜 𝙏𝙤 𝙂𝙤! 💪 💪#TeamIndia | #ZIMvIND | @IamSanjuSamson | @IamShivamDube | @ybj_19 pic.twitter.com/E0rNOkHmTz— BCCI (@BCCI) July 9, 2024 -
ఆరు ఇన్నింగ్స్ల్లో ఒక్క ఫిఫ్టి కూడా లేదు.. ఈ "గిల్" మనకు అవసరమా..?
టీ20 వరల్డ్కప్ విజయానంతరం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి శుభ్మన్ గిల్ నేతృత్వంలోని కుర్ర జట్టును జింబాబ్వే పర్యటనకు పంపారు. ఈ పర్యటనను భారత్ ఘోర ఓటమితో ప్రారంభించి, ఆతర్వాతి మ్యాచ్లో ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్లో సిరీస్లో సమంగా నిలిచింది.రెండో టీ20లో అంతా బాగుంది అనుకున్నా, ఒక్క విషయం మాత్రం టీమిండియాను తెగ కలవరపెడుతుంది. కెప్టెన్ గిల్ పేలవ ఫామ్ అభిమానులతో పాటు యాజమాన్యాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. గిల్ గత 10 టీ20 ఇన్నింగ్స్ల్లో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేసి తన టీ20 కెరీర్ను ఇబ్బందుల్లోకి నెట్టుకున్నాడు. గిల్ ఆడిన గత ఆరు ఇన్నింగ్స్ల్లో అయితే కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు.ఈ పేలవ ఫామ్ కారణంగానే అతను టీ20 వరల్డ్కప్ జట్టుకు కూడా ఎంపిక కాలేదు. గిల్.. జింబాబ్వే పర్యటనలో అయినా ఫామ్లో వస్తాడని యాజమాన్యం అతన్ని ఈ టూర్కు ఎంపిక చేసింది. గిల్ ఇదే పేలవ ఫామ్ను కొనసాగిస్తే భవిష్యత్తులో టీ20 జట్టు నుంచి కనుమరుగవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. జింబాబ్వే పర్యటనలో తదుపరి మ్యాచ్ల్లో రాణించకపోతే టీ20 జట్టు నుంచి శాశ్వతంగా తప్పించడం ఖాయమని వారు అభిప్రాయపడుతున్నారు. సోషల్మీడియాలో గిల్ విపరీతమైన ట్రోలింగ్ను ఎదుర్కొంటున్నాడు. ఈ గిల్ మనకు అవసరమా అని టీమిండియా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.రేసులో నిలబడగలడా..?రోహిత్, కోహ్లి టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినా ఓపెనింగ్ స్థానం కోసం చాలామంది రేసులో ఉన్నారు. రెండో టీ20లో సెంచరీతో విరుచుకుపడిన అభిషేక్ శర్మ కొత్తగా శుభ్మన్ గిల్కు పోటీగా వచ్చాడు. ఇప్పటికే యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ రేసులో ఉన్నారు. వీరందరి నుంచి పోటీని తట్టుకుని గిల్ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి.గత 10 టీ20 ఇన్నింగ్స్ల్లో గిల్ స్కోర్లు..జింబాబ్వేతో రెండో టీ20- 2 (4)జింబాబ్వేతో తొలి టీ20- 31 (29)ఆఫ్ఘనిస్తాన్తో తొలి టీ20- 23 (12)సౌతాఫ్రికాతో మూడో టీ20- 12 (6)సౌతాఫ్రికాతో రెండో టీ20- 0 (2)వెస్టిండీస్తో ఐదో టీ20- 9 (9)వెస్టిండీస్తో నాలుగో టీ20- 77 (47)వెస్టిండీస్తో మూడో టీ20- 6 (11)వెస్టిండీస్తో రెండో టీ20- 7 (9)వెస్టిండీస్తో తొలి టీ20- 3 (9) -
‘అడవి’లోకి అభిషేక్ శర్మ.. మృగరాజును చూశారా? (ఫొటోలు)
-
కోహ్లి, రోహిత్ లేని లోటు పూడ్చగలిగేది వాళ్దిద్దరే: మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచకప్-2024తో టీమిండియాలో ఒక శకం ముగిసింది. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్లో.. భారత జట్టులో ఈ ఇద్దరి మేటి ఆటగాళ్ల స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు ఎవరా అన్న చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో జింబాబ్వే మాజీ క్రికెటర్ హామిల్టన్ మసకజ్ద ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.టీ20లలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వారసులు వీరేనంటూ ఇద్దరు యువ తరంగాల పేర్లు చెప్పాడు. కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన వరల్డ్కప్-2024లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పదకొండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ రోహిత్ సేన ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది.ఐపీఎల్ వీరులకు లైన్ క్లియర్ఈ క్రమంలో సౌతాఫ్రికాతో ఫైనల్లో విజయానంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఐపీఎల్ వీరులకు జాతీయ జట్టులో ఎంట్రీకి మార్గం సుగమమైంది.ఇందుకు తగ్గట్లుగా మెగా టోర్నీ ముగిసిన వెంటనే జింబాబ్వేతో టీ20 సిరీస్కు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, సాయి సుదర్శన్ వంటి ఆటగాళ్లు తొలిసారిగా ఎంపికయ్యారు. అయితే, అనూహ్య రీతిలో జింబాబ్వేతో తొలి టీ20లో ఓటమి పాలైన యువ భారత జట్టు... రెండో టీ20లో మాత్రం సత్తా చాటింది.ఆతిథ్య జట్టును ఏకంగా వంద పరుగుల తేడాతో చిత్తు చేసి ఐదు మ్యాచ్ల సిరీస్ను ప్రస్తుతం 1-1తో సమం చేసింది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్గా తొలిసారి వ్యవహరిస్తున్న శుబ్మన్ గిల్ ఖాతాలో విజయం చేరింది.కోహ్లి, రోహిత్ లేని లోటు పూడ్చగలిగేది వాళ్లిద్దరేఈ నేపథ్యంలో హామిల్టన్ మసకజ్ద చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. భారత జట్టులో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు ప్రత్యామ్నాయం శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ అని ఈ జింబాబ్వే మాజీ ఆటగాడు పేర్కొనడం విశేషం.‘‘భారత క్రికెట్ జట్టు పరివర్తన దశలో ఉంది. అందరి కంటే ఎక్కువగా శుబ్మన్ గిల్ నా దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మూడు ఫార్మాట్లలో అతడు చాలా కాలంగా తనదైన శైలిలో రాణిస్తున్నాడు.మేటి ఆటగాళ్ల స్థానాన్ని భర్తీ చేయగల సత్తా అతడికి ఉంది.ఇక యశస్వి సైతం అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ను అద్భుతంగా సాగించలగలడనే నమ్మకం నాకు ఉంది. గిల్, యశస్వి.. వీళ్లిద్దరే వరల్డ్క్లాస్ క్రికెటర్ల నిష్క్రమణ వల్ల ఏర్పడిన శూన్యాన్ని పూడ్చగలరు’’ అని మసకజ్ద అభిప్రాయపడ్డాడు.చదవండి: BCCI: ద్రవిడ్కు రూ. 5 కోట్లు.. రోహిత్, కోహ్లి సహా వారందరికీ ఎంతంటే? -
నా సెంచరీ సీక్రెట్ ఇదే.. అతడికి థ్యాంక్స్ చెప్పాలి: అభిషేక్ శర్మ
అరంగేట్రంలోనే డకౌటై విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ.. 24 గంటల వ్యవధిలోనే సంచలనం సృష్టించాడు. ఎక్కడైతే డకౌటయ్యాడో అక్కడే సెంచరీతో సత్తా చాటి శెభాష్ అనిపించుకుంటున్నాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో అభిషేక్ శర్మ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. జింబాబ్వే బౌలర్లను అభిషేక్ ఊచకోత కోశాడు. కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్లతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. తద్వారా అతి తక్కువ ఇన్నింగ్స్లో తొలి టీ20 అంతర్జాతీయ సెంచరీ అందుకున్న భారత ప్లేయర్గా అభిషేక్ నిలిచాడు. ఇక మ్యాచ్ అనంతరం బీసీసీఐ టీవీతో మాట్లాడిన అభిషేక్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ తన బ్యాట్తో ఆడలేదంట. తన చిన్ననాటి స్నేహితుడు, ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాట్తో ఈ అద్భుత నాక్ ఆడినట్లు అభిషేక్ తెలిపాడు."ఓ విషయాన్ని అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఈ మ్యాచ్లో నేను శుబ్మన్ గిల్ బ్యాట్తో ఆడాడను. అతడి నుంచి బ్యాట్ను తీసుకుని ఆడటం చాలా కష్టం. అతడు తన బ్యాట్లను ఎవరికీ అంత ఈజీగా ఇవ్వడు. కానీ నేను మాత్రం మేము అండర్-14 క్రికెట్ ఆడే రోజుల నుంచి అతడి బ్యాట్ను ఉపయోగిస్తునే ఉన్నాను. నేను ఒత్తిడిలో ఉన్న ప్రతీ సారి గిల్ను తన బ్యాట్ ఇవ్వమని అడుగుతాను. నేను అతని బ్యాట్తో ఆడినప్పుడల్లా అద్భుతంగా రాణించాను . ఇప్పుడు కూడా అంతే. సరైన సమయంలో గిల్ తన బ్యాట్ను నాకు ఇచ్చాడు. నాతో పాటు జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది. థంక్యూ గిల్ అంటూ బీసీసీఐ టీవీతో అభిషేక్ పేర్కొన్నాడు. కాగా గిల్, అభిషేక్ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. వీరిద్దరూ పంజాబ్ నుంచి భారత్కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
వారిద్దరూ అద్భుతం.. ఎంతచెప్పుకున్న తక్కువే: టీమిండియా కెప్టెన్
జింబాబ్వేతో తొలి టీ20లో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. హరారే వేదికగా జరిగిన రెండో టీ20లో జింబాబ్వేపై 100 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ(46 బంతుల్లో 7 బౌండరీలు, 8 సిక్స్లతో 100) సెంచరీతో చెలరేగగా.. రుతురాజ్ గైక్వాడ్(47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 77 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆఖరిలో రింకూ సింగ్(22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 48 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ, వెల్లింగ్టన్ మసకడ్జా తలో వికెట్ వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో జింబాబ్వే భారత బౌలర్ల దాటికి 134 పరుగులకే కుప్పకూలింది. భారత పేసర్లు ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టి జింబాబ్వే పతనాన్ని శాసించగా.. రవి బిష్ణోయ్, సుందర్ చెరో రెండు వికెట్లు సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ వెస్లీ మధెవెరె(43) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందించాడు.ఈ మ్యాచ్లో సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. అభిషేక్ శర్మ, రుతురాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా పవర్ప్లేలో వారు ఆడిన విధానం గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. ఎందుకంటే పవర్ప్లేలో ఆ విధంగా బ్యాటింగ్ చేయడం అంత ఈజీకాదు. "పవర్ప్లేలో కొత్త బంతి కాస్త ఎక్కువగా స్వింగ్ అవ్వడంతో బ్యాటర్లు ఇబ్బంది పడుతుంటారు. కానీ అభి, రుతు మాత్రం చాలా పరిపక్వతతో ఆడారు. ఇన్నింగ్స్ను అద్భుతంగా ముందుకు నడిపించారు. ఇది యువ భారత జట్టు. ఈ జట్టులో చాలా మంది ఆటగాళ్లు ప్రొఫిషనల్ టీ20 క్రికెట్లో ఆడిండవచ్చు గానీ అంతర్జాతీయ అనుభవం పెద్దగా ఎవరికి లేదు. తొలి టీ20లో ఒత్తడిని తట్టుకోలేక వరుస క్రమంలో పెవిలియన్కు క్యూ కట్టారు. అందుకే స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించలేక ఓడిపోయాం. కానీ ఇప్పుడు రెండో మ్యాచ్లో తిరిగి పుంజుకుని సంచలన విజయం సాధించాము. ఈ సిరీస్లో మాకు ఇంకా మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. వాటిలో కూడా గెలిచి సిరీస్ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తామని" పోస్ట్మ్యాచ్ కాన్ఫరెన్స్లో గిల్ పేర్కొన్నాడు. -
దెబ్బకు దెబ్బ.. టీమిండియా చేతిలో జింబాబ్వే చిత్తు
జింబాబ్వేతో రెండో టీ20లో యువ టీమిండియా అదరగొట్టింది. ఆతిథ్య జట్టును వంద పరుగుల తేడాతో మట్టికరిపించి ఘన విజయం సాధించింది. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది.దెబ్బకు దెబ్బ కొట్టి ఐదు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇక ఈ గెలుపు ద్వారా టీమిండియా స్టార్ బ్యాటర్ శుబ్మన్ గిల్ ఖాతాలో కెప్టెన్గా తొలి విజయం నమోదైంది.దుమ్ములేపిన అభిషేక్.. రాణించిన రుతురాజ్హరారే వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ శుబ్మన్ గిల్ 2 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి జింబాబ్వే బౌలింగ్ను చీల్చి చెండాడాడు.తొలి టీ20లో విఫలమైన ఈ పంజాబీ బ్యాటర్ తాజా మ్యాచ్లో సెంచరీ చేసి తన విలువ చాటుకున్నాడు. మొత్తంగా 47 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సరిగ్గా 100 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.అభిషేక్ శర్మకు తోడుగా వన్డౌన్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అర్థశతకం (47 బంతుల్లో 77 పరుగులు) తో అజేయంగా నిలిచాడు. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన రింకూ సింగ్ (22 బంతుల్లో 48 పరుగులు నాటౌట్, ఫోర్లు 2, సిక్సర్లు 5) రుతురాజ్తో కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించాడు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో యువ భారత జట్టు కేవలం రెండు వికెట్లు నష్టపోయి ఏకంగా 234 పరుగులు సాధించింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వేకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు.జోరుగా హుషారుగా వికెట్లు...ఓపెనర్ ఇన్నోసెంట్ కయా (4)ను ముకేష్కుమార్ ఆదిలోనే వెనక్కి పంపించాడు. అయితే, రెండో వికెట్ తీయడానికి భారత బౌలర్లు కాస్త శ్రమించాల్సి వచ్చింది. మరో ఓపెనర్ వెస్లే మెదెవెరె(43), వన్డౌన్ బ్యాటర్ బ్రియాన్ బ్యానెట్ (26) తేలికగా తలొగ్గలేదు.బ్యానెట్ను ముకేష్కుమార్ ఔట్ చేయగా.. రవి బిష్ణోయ్ వెస్లే పని పట్టాడు. ఇదే జోరును భారత బౌలర్లు కొనసాగించడంతో జింబాబ్వే మిడిల్ ఆర్డర్ చేతులెత్తేసింది. ఈక్రమంలో లోయర్ ఆర్డర్లో వచ్చిన ల్యూక్ జాంగ్వే 33 పరుగులు చేసి కాసేపు పోరాడాడు. ముకేష్ దెబ్బకు అతడుకూడా పెవిలియన్ చేరక తప్పలేదు.ఈక్రమంలో 18.4 ఓవర్లలోనే జింబాబ్వే కథ ముగిసింది. కేవలం 134 పరుగులు మాత్రమే చేసి 100 పరుగుల భారీ తేడాతో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది.టీమిండియా బౌలర్లలో ముకేష్కుమార్, ఆవేశ్ఖాన్ చెరో మూడు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. రవి బిష్ణోయ్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశారు. భారత్ బ్యాటర్ అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య బుధవారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. -
జింబాబ్వే రెండో టీ20.. భారత జట్టులోకి యువ సంచలనం! తుది జట్లు ఇవే
జింబాబ్వేతో తొలి టీ20లో ఓటమి పాలైన టీమిండియా.. ఇప్పుడు రెండో టీ20కు సిద్దమైంది. హరారే వేదికగా భారత్-జింబాబ్వే జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఎక్స్ట్రా బ్యాటర్తో ఆడుతోంది. పేసర్ ఖాలీల్ అహ్మద్ స్ధానంలో యువ బ్యాటర్ సాయిసుదర్శన్ తుది జట్టులోకి వచ్చాడు. సాయిసుదర్శన్కు భారత్ తరపున ఇదే తొలి టీ20 మ్యాచ్ కావడం గమనార్హం. సాయిసుదర్శన్ ఐపీఎల్లో అద్బుతంగా రాణించాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు అతడికి పిలుపునిచ్చారు. కాగా సుదర్శన్ ఇప్పటికే భారత తరపున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇక ఈ మ్యాచ్లో ఆతిథ్య జింబాబ్వే మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.తుది జట్లుజింబాబ్వే: వెస్లీ మాధేవెరే, ఇన్నోసెంట్ కైయా, బ్రియాన్ బెన్నెట్, సికందర్ రజా(కెప్టెన్), డియోన్ మైయర్స్, జోనాథన్ కాంప్బెల్, క్లైవ్ మదాండే(వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, ల్యూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారాభారత్భారత్శుబ్మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ -
IND vs ZIM: చరిత్ర సృష్టించిన జింబాబ్వే.. తొలి జట్టుగా
పసికూన జింబాబ్వే సంచలనం సృష్టించింది. హరారే వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టీ20లో జింబాబ్వే అద్భుత విజయం సాధించింది. వరల్డ్ ఛాంపియన్ భారత్ను 13 పరుగుల తేడాతో జింబాబ్వే చిత్తు చేసింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జింబాబ్వే బౌలర్లు కాపాడుకున్నారు. జింబాబ్వే బౌలర్ల దాటికి భారత్ 102 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ సికిందర్ రజా, చతరా తలా మూడు వికెట్లతో టీమిండియాను దెబ్బతీయగా.. బెన్నట్, మసకద్జా, జాంగ్వే తలా వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్(31) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. వాషింగ్టన్ సుందర్(27) తన వంతు ప్రయత్నం చేశాడు.చరిత్ర సృష్టించిన జింబాబ్వే..ఇక ఈ మ్యాచ్లో అద్భుత విజయం సాధించిన జింబాబ్వే ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. టీ20ల్లో భారత్పై అత్యల్ప టోటల్ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా జింబాబ్వే నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2016లో నాగ్పూర్ వేదికగా భారత్తో జరిగిన టీ20 మ్యాచ్లో 127 పరుగుల టార్గెట్ను కివీస్ డిఫెండ్ చేసుకుంది. తాజా మ్యాచ్తో కివీస్ ఆల్టైమ్ రికార్డును జింబాబ్వే బ్రేక్ చేసింది. -
ఇది అస్సలు ఊహించలేదు.. అదే మా కొంపముంచింది: శుబ్మన్ గిల్
టీ20 వరల్డ్కప్ ఛాంపియన్స్ టీమిండియాకు జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. హరారే వేదికగా భారత్తో జరిగిన తొలి టీ20లో 13 పరుగుల తేడాతో జింబాబ్వే సంచలన విజయం సాధించింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో భారత్ చతికల పడింది.జింబాబ్వే బౌలర్ల దాటికి భారత్ 102 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ సికిందర్ రజా, చతరా తలా మూడు వికెట్లతో టీమిండియా నడ్డివిరచగా.. బెన్నట్, మసకద్జా, జాంగ్వే తలా వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్(31) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.కాగా టీ20ల్లో జింబాబ్వే చేతిలో భారత్ ఓటమి పాలవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందిచాడు. బ్యాటింగ్లో విఫలమవకావడంతోనే ఓటమిపాలైమని గిల్ తెలిపాడు."ఈ ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయమే. మేము తొలుత అద్భుతంగా బౌలింగ్ చేశాము. కానీ ఫీల్డింగ్లో మాత్రం మా మార్క్ చూపించలేకపోయాం. ఇక బ్యాటింగ్లో ప్రతీ ఒక్కరం పూర్తి స్వేఛ్చగా ఆడాలని నిర్ణయించుకున్నాము.కానీ అందుకు తగ్గ విధంగా ఆడలేకపోయాం. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డాం. మా ఇన్నింగ్స్ సగం ముగిసే సరికి మేము 5 వికెట్లు కోల్పాయం. కానీ నేను ఇంకా క్రీజులో ఉండడంతో గెలుస్తామన్న నమ్మకం ఉండేది. కానీ దురదృష్టవశాత్తూ నేను కూడా పెవిలియన్కు చేరాల్సి వచ్చింది. నేను ఔట్ కావడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అయితే లక్ష్యం 115 పరుగులే కావడంతో ఆఖరి వరకు మాకు గెలుపు పై ఆశలు ఉండేవి. కానీ మేము అనుకున్నది జరగలేదు.ఎక్కడ తప్పు జరిగిందో మేము సమీక్షించుకుంటాము. తర్వాతి మ్యాచ్ల్లో ఇటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రయత్నిస్తామని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో గిల్ పేర్కొన్నాడు. -
టీమిండియాకు ఘోర పరాభవం .. జింబాబ్వే చేతిలో ఓటమి
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో13 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. స్వల్ప లక్ష్య చేధనలో భారత్.. జింబాబ్వే బౌలర్ల దాటికి కేవలం 102 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ సికిందర్ రజా, చతరా తలా మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా.. బెన్నట్, మసకద్జా, జాంగ్వే తలా వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్(31) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు వాషింగ్టన్ సుందర్(27) పోరాడనప్పటకి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. వీరిద్దరూ మినహా మిగితా భారత బ్యాటర్లంతా విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన జింబాబ్వే భారత బౌలర్ల దాటికి 115 పరుగులకే జింబాబ్వే పరిమితమైంది. టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ 4 వికెట్లతో ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. బిష్ణోయ్తో పాటు మరో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు, అవేష్ ఖాన్,ముఖేష్ కుమార్ చెరో వికెట్ సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో మదండే(29), మైర్స్(23), బెన్నట్(23), పరుగులు చేశారు. కాగా టీ20ల్లో జింబాబ్వే చేతిలో భారత్ ఓటమి పాలవ్వడం 2016 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
IND vs ZIM 1st T20: భారత్కు బిగ్ షాక్.. జింబాబ్వే చేతిలో ఓటమి
India vs Zimbabwe, 1st T20 Live Updates and Highlights:భారత్కు బిగ్ షాక్.. జింబావ్వే చేతిలో ఓటమిటీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో13 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. స్వల్ప లక్ష్య చేధనలో భారత్.. జింబాబ్వే బౌలర్ల దాటికి కేవలం 102 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ సికిందర్ రజా, చతరా తలా మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా.. బెన్నట్, మసకద్జా, జాంగ్వే తలా వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్(31) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు వాషింగ్టన్ సుందర్(27) పోరాడనప్పటకి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. వీరిద్దరూ మినహా మిగితా భారత బ్యాటర్లంతా విఫలమయ్యారు.తొమ్మిదో వికెట్ డౌన్..టీమిండియా ఓటమికి చేరువైంది. ముఖేష్ కుమార్ రూపంలో భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. టీమిండియా ఎనిమిదో వికెట్ డౌన్..అవేష్ ఖాన్ రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన అవేష్ ఖాన్.. మజకజ్డా బౌలింగ్లో ఔటయ్యాడు. భారత్ విజయానికి 22 బంతుల్లో 31 పరుగులు కావాలి. క్రీజులో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు.టీమిండియా ఏడో వికెట్ డౌన్.. బిష్ణోయ్ ఔట్జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తోంది. రవి బిష్ణోయ్ రూపంలో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. భారత్ విజయానికి 39 బంతుల్లో 53 పరుగులు కావాలి. క్రీజులో వాషింగ్టన్ సుందర్(5) పరుగులతో ఉన్నారు.టీమిండియా ఆరో వికెట్ డౌన్.. శుబ్మన్ గిల్ ఔట్కెప్టెన్ శుబ్మన్ గిల్ రూపంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన గిల్.. సికిందర్ రజా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. భారత విజయానికి 53 బంతుల్లో 63 పరగులు కావాలి. క్రీజులో వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ ఉన్నారు.కష్టాల్లో టీమిండియా.. ఐదో వికెట్ డౌన్ధ్రువ్ జురెల్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన జురెల్.. మజకజ్డా బౌలింగ్లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు భారత్ స్కోర్: 43/5రింకూ సింగ్ ఔట్..టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. చతర బౌలింగ్లో రింకూ సింగ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. 4 ఓవర్లకు భారత్ స్కోర్: 28/4. క్రీజులో శుబ్మన్ గిల్(19) పరుగులతో ఉన్నారు.నిరాశపరిచిన పరాగ్..భారత అరంగేట్ర ఆటగాడు రియాన్ పరాగ్ తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 2 పరుగులు మాత్రమే చేసిన పరాగ్.. చతరా బౌలింగ్లో ఔటయ్యాడు.రెండో వికెట్ డౌన్..టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్.. ముజబారనీ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి రియాన్ పరాగ్ వచ్చాడు. 4 ఓవర్లకు భారత్ స్కోర్: 16/2తొలి వికెట్ డౌన్.. అభిషేక్ శర్మ ఔట్116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. రియన్ బెన్నట్ వేసిన తొలి ఓవర్లో నాలుగో బంతికి అభిషేక్ శర్మ డకౌటయ్యాడు. మసకజ్డాకు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి రుతురాజ్ గైక్వాడ్ వచ్చాడు.4 వికెట్లతో చెలరేగిన బిష్ణోయ్.. 115 పరుగులకే జింబాబ్వే పరిమితంహరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు చెలరేగారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే భారత బౌలర్ల దాటికి 115 పరుగులకే జింబాబ్వే పరిమితమైంది. ముఖ్యంగా టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ 4 వికెట్లతో ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. బిష్ణోయ్తో పాటు మరో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు, అవేష్ ఖాన్,ముఖేష్ కుమార్ చెరో వికెట్ సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో మదండే(29), మైర్స్(23), బెన్నట్(23), పరుగులు చేశారు.ఆలౌట్ దిశగా జింబాబ్వే.. 90 పరుగులకే 7 వికెట్లుటాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే 90 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 15వ ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో జింబాబ్వే వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 23 పరుగులు చేసిన డియాన్ మైర్స్ సుందర్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. ఆ తర్వాత బంతికే మస్కజ్డా స్టంపౌటయ్యాడు. 13 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 77/5జింబాబ్వే వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. 12 ఓవర్ వేసిన అవేష్ ఖాన్ బౌలింగ్లో ఐదో బంతికి సికిందర్ రజా ఔట్ కాగా.. ఆరో బంతికి క్యాంప్బెల్ రనౌటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే.. 5 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.మూడో వికెట్ డౌన్..జింబాబ్వే మూడో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన మాధవరే.. రవి బిష్ణోయ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి మైర్స్ వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 3 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.రెండో వికెట్ డౌన్.. 40 పరుగుల వద్ద జింబాబ్వే రెండో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన బెన్నట్.. రవి బిష్ణోయ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ సికిందర్ రజా, మాధవరే(17) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వే..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే తొలి వికెట్ కోల్పోయింది. ముఖేష్ కుమార్ బౌలింగ్లో కయా క్లీన్ బౌల్డయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. క్రీజులో బెన్నట్(8), మాధవరే(6) పరుగులతో ఉన్నారు.భారత్-జింబాబ్వే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. హరారే వేదికగా జరుగుతున్న తొలి టీ20లో భారత్-జింబాబ్వే జట్లు తలపడతున్నాయి.ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో భారత తరపున యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్జురెల్ టీ20ల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. కాగా సిరీస్కు సీనియర్ ఆటగాళ్లు దూరం కావడంతో యువ భారత జట్టుకు శుబ్మన్ గిల్ సారథ్యం వహిస్తున్నాడు.తుది జట్లుభారత్: శుభ్మన్ గిల్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్జింబాబ్వే: తడివానాషే మారుమణి, ఇన్నోసెంట్ కైయా, బ్రియాన్ బెన్నెట్, సికందర్ రజా (కెప్టెన్), డియోన్ మైయర్స్, జోనాథన్ కాంప్బెల్, క్లైవ్ మదాండే (వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, ల్యూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా -
Ind vs Zim: వికెట్ కీపర్గా అతడే.. భారత తుది జట్టు ఇదే!
దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత యువ టీమిండియా తొలిసారి టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ స్టార్ బ్యాటర్ల నిష్క్రమణ తర్వాత శుబ్మన్ గిల్ కెప్టెన్సీలో జింబాబ్వేతో తలపడేందుకు హరారేకు వెళ్లింది.ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం తొలి టీ20 ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన తుది జట్టును ఎంచుకున్నాడు.ఈ మేరకు యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘‘టాపార్డర్లో శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ ఉండాలి. పరిస్థితులకు అనుగుణంగా ఈ ముగ్గురి ఆర్డర్ మారొచ్చు కానీ.. టాప్-3లో మాత్రం వీరే ఉండాలి.ఆ తర్వాతి స్థానంలో రియాన్ పరాగ్ బ్యాటింగ్కు రావాలి. ఇక వికెట్ కీపర్గా ధ్రువ్ జురెల్ను ఆడించాలి. బ్యాటింగ్ ఆర్డర్లో ఐదో స్థానం అతడిదే.ఆరో బ్యాటర్గా రింకూ సింగ్ బరిలోకి దిగాలి. లేదంటే జురెల్ కంటే ముందుగానే వచ్చినా పర్లేదు. జురెల్ కీపింగ్ చేస్తాడు కాబట్టి ఈసారి జితేశ్ శర్మకు నేనైతే అవకాశం ఇవ్వను.ఇక ఏడో స్థానంలో వాషింగ్టన్ సుందర్ను ఆడించాలి. ఆల్రౌండర్గా జట్టుకు తన సేవలు అవసరం. నలుగురు బౌలర్లను తీసుకోవాలి కాబట్టి స్పిన్నర్ కోటాలో రవి బిష్ణోయితో పాటు.. వాషింగ్టన్ కూడా అందుబాటులో ఉండటం కలిసి వస్తుంది.అభిషేక్ శర్మ కూడా పార్ట్టైమ్ లెఫ్టార్మ్ స్పిన్నర్గా ప్రభావం చూపగలడు. ఇక పేస్ విభాగంలో ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్ తమ బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చగలరు.నిజానికి హర్షిత్ రాణాను చోటివ్వాల్సింది. అయితే, బెంగాల్ ప్రొ టీ20 లీగ్లో ముకేశ్ కుమార్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఇక ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ వరల్డ్కప్ ట్రావెలింగ్ టీమ్లో భాగం కాబట్టి.. ఈ ముగ్గురిని ఆడించవచ్చు. అందుకే హర్షిత్ రాణాకు ఈసారికి మొండిచేయి తప్పదు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. జింబాబ్వేతో టూర్కు ఎంపికైన సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, శివం దూబే తొలి రెండు మ్యాచ్లకు దూరం కానున్నారు. టీ20 ప్రపంచకప్-2024 విజయోత్సవాల్లో పాల్గొనేందుకు వీరు భారత్కు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.Watch out for those moves 🕺🏻 Wankhede was a vibe last night 🥳#T20WorldCup | #TeamIndia | #Champions pic.twitter.com/hRBTcu9bXc— BCCI (@BCCI) July 5, 2024 జింబాబ్వేతో టీ20 సిరీస్కు భారత జట్టు:శుబ్మన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్, రవి బిష్ణోయ్, సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, తుషార్ దేశ్పాండే, హర్షిత్ రాణా.తొలి టీ20కి ఆకాశ్ చోప్రా ఎంచుకున్న జట్టు:శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయి, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్. -
IND vs ZIM: టీమిండియా ఓపెనర్గా అభిషేక్ శర్మ.. కన్మాఫ్ చేసిన కెప్టెన్
భారత్-జింబాబ్వే మధ్య ఐదు మ్యాచ్ల టీ20ల సిరీస్లకు సర్వం సిద్దమైంది. జూలై 5న హరారే వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో ఆతిథ్య జింబాబ్వే పూర్తిస్ధాయి జట్టుతో బరిలోకి దిగుతుండగా.. భారత్ మాత్రం పూర్తిగా యువ జట్టుతో ఆడనుంది. ఈ పర్యటనకు టీ20 వరల్డ్కప్-2024లో భాగమైన భారత ఆటగాళ్లకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ విశ్రాంతి ఇచ్చింది. దీంతో ఓపెనర్ శుబ్మన్గిల్కు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా ఐపీఎల్-2024లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, తుషార్ దేశ్పాండే, హర్షిత్ రానాలకు భారత సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు.అభిషేక్ అరంగేట్రం..ఇక తొలిసారి భారత జట్టు ఎంపికైన అభిషేక్ శర్మ.. శనివారం జింబాబ్వేతో జరగనున్న తొలి టీ20తో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. ఈ విషయాన్ని భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ ధ్రువీకరించాడు. ఈ మ్యాచ్కు మీడియాతో మాట్లాడిన గిల్.. తనతో కలిసి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నాడని చెప్పుకొచ్చాడు. అదే విధంగా ఫస్ట్ డౌన్లో రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్కు రానున్నాడని గిల్ తెలిపాడు. కాగా ఐపీఎల్-2024లో ఎస్ఆర్హెచ్కు ప్రాతనిథ్యం వహించిన అభిషేక్ శర్మ సంచలన ప్రదర్శన కనబరిచాడు. అభిషేక్ ఓపెనర్గా ట్రావిస్ హెడ్తో కలిసి భీబత్సం సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే సన్రైజర్స్ భారీ స్కోర్ చేయడంలో అభిషేక్ది కీలక పాత్ర. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన అభిషేక్ 32.27 సగటుతో 484 పరుగులు చేశాడు. టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ గైడెన్స్లో రాటుదేలుతున్న అభిషేక్ శర్మ.. దేశీవాళీ క్రికెట్లో సైతం అదరగొడుతున్నాడు. -
జింబాబ్వే చేరుకున్న యువ భారత జట్టు.. వీడియో
టీ20 వరల్డ్కప్-2024లో గెలిచి మంచి జోష్లో ఉన్న టీమిండియా.. వారం రోజుల తిరగక ముందే మరో పోరుకు సిద్దమైంది. జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ తలపడనుంది. అయితే ఈ సిరీస్కు టీ20 వరల్డ్కప్లో భాగమైన భారత ఆటగాళ్లకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ విశ్రాంతి ఇచ్చింది. 15 మంది సభ్యులతో కూడిన యువ భారత జట్టను జింబాబ్వే పర్యటనకు బీసీసీఐ పంపించింది. ఈ జట్టుకు స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. జూలై 6న హరారే వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.జింబాబ్వేకు చేరుకున్న భారత జట్టు..ఇక ఈ సిరీస్ కోసం భారత జట్టు బుధవారం జింబాబ్వేలో అడుగుపెట్టింది. రాబర్ట్ గాబ్రియేల్ ముగాబే అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న భారత ఆటగాళ్లకు జింబాబ్వే క్రికెట్ ఘన స్వాగతం పలికింది. ఇందుకు సంబంధించిన వీడియోను జింబాబ్వే క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు జూలై 4న తమ తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది. ఇక కెప్టెన్ శుబ్మన్ గిల్ తన సహచర ఆటగాళ్ల కంటే ముందే న్యూయార్క్ నుంచి నేరుగా జింబాబ్వేకు చేరుకున్నాడు.జింబాబ్వే పర్యటనకు భారత జట్టు: శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్ పాండే.𝐖𝐞 𝐰𝐞𝐥𝐜𝐨𝐦𝐞 𝐓𝟐𝟎 𝐖𝐨𝐫𝐥𝐝 𝐂𝐮𝐩 𝐂𝐡𝐚𝐦𝐩𝐢𝐨𝐧𝐬 𝐈𝐧𝐝𝐢𝐚 🇮🇳 ! 🤗#ZIMvIND pic.twitter.com/Oiv5ZxgzaS— Zimbabwe Cricket (@ZimCricketv) July 2, 2024 -
"ఆల్ ద బెస్ట్ టీమిండియా".. జింబాబ్వే పర్యటనకు బయల్దేరిన శుభ్మన్ గిల్ సేన
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా జింబాబ్వే పర్యటనకు బయల్దేరింది. శుభ్మన్ గిల్ నేతృత్వంలోని యంగ్ ఇండియా నిన్న (జులై 1) సాయంత్రం ముంబై ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యింది. టీ20 వరల్డ్కప్ 2024 అనంతరం సీనియర్లు విశ్రాంతి కోరడంతో సెలెక్టర్లు జింబాబ్వే సిరీస్కు యువ జట్టును ఎంపిక చేశారు. హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ప్రపంచకప్తో ముగియడంతో ఈ పర్యటనకు తాత్కాలిక కోచ్గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ఎంపికయ్యాడు. ఈ సిరీస్ జులై 6 నుంచి ప్రారంభం కానుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్లు జరుగనున్నాయి.Team India off to Zimbabwe via Emirates flight from Mumbai. 🇮🇳- Good luck, boys! pic.twitter.com/0yJdocApUX— Mufaddal Vohra (@mufaddal_vohra) July 1, 2024సీనియర్లకు విశ్రాంతిఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లు హార్దిక్, సూర్యకుమార్, పంత్, అక్షర్ పటేల్కు విశ్రాంతి కల్పించారు. రోహిత్, కోహ్లి, జడేజా టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో వారిని పరిగణలోకి తీసుకోలేదు. సీనియర్ల గైర్హాజరీలో శుభ్మన్ గిల్ టీమిండియా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.TEAM INDIA HAS LEFT FOR ZIMBABWE FOR THE T20I SERIES.- Good luck, Team India. 🇮🇳 pic.twitter.com/iiQUVjlIKA— Tanuj Singh (@ImTanujSingh) July 2, 2024ఈ సిరీస్కు వరల్డ్కప్ ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లలోని రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ ఎంపికయ్యారు. వరల్డ్కప్ జట్టులోని సభ్యులు యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, సంజూ శాంసన్ కూడా జట్టులో చోటు దక్కించుకన్నారు. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, తుషార్ దేశ్పాండే కొత్తగా జట్టులోకి వచ్చారు. ఈ సిరీస్ సోనీ స్పోర్ట్స్ టెన్ 3 (హిందీ) SD & HD, సోనీ స్పోర్ట్స్ టెన్ 4 (తమిళం/తెలుగు), మరియు సోనీ స్పోర్ట్స్ టెన్ 5 SD & HD ఛానల్లలొ ప్రత్యక్ష ప్రసారం కానుంది.జింబాబ్వే సిరీస్కు భారత జట్టు..శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, దృవ్ జురెల్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్పాండే