breaking news
Shubman Gill
-
వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్.. టీమిండియా నుంచి ఆ ఇద్దరికే చోటు!
టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో టాప్ 5 ఆల్-ఫార్మాట్ ప్లేయర్లను ఎంచుకున్నాడు. ఈ జాబితాలో భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్కు అగ్రస్ధానం దక్కింది.ఆ తర్వాత రెండో స్ధానంలో ఆసీస్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్కు కార్తీక్ ఛాన్స్ ఇచ్చాడు. మూడు, నాలుగు స్దానాల్లో హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్), యశస్వి జైశ్వాల్(భారత్)కు చోటు దక్కింది. చివరగా ఐదో స్దానంలో న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్రకు డీకే అవకాశమిచ్చాడు.కాగా టాప్ ప్లేస్లో ఉన్న శుబ్మన్ గిల్ గత కొంత కాలంగా వన్డే, టెస్టుల్లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. భారత టీ20 జట్టుకు అతడు దూరంగా ఉన్నప్పటికి ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ లీగ్స్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ కారణంగానే గిల్ను ఆల్ఫార్మాట్ ప్లేయర్గా కార్తీక్ ఎంపిక చేశాడు. ట్రావిస్ హెడ్ కూడా మూడు ఫార్మాట్లలోనూ ఆసీస్కు కీలక ప్లేయర్గా మారాడు. తన దూకుడు బ్యాటింగ్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసే సత్తా అతడిది. ఇక ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా వన్డే, టీ20లతో పాటు టెస్టుల్లో కూడా మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడుతున్నాడు. ప్రస్తుతం పాక్తో జరుగుతున్న టెస్టు సిరీస్లోనూ దుమ్ములేపుతున్నాడు. అయితే యశస్వి జైశ్వాల్, రచిన్ రవీంద్రలు మాత్రం గత కొంతకాలంగా తమస్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. అయినప్పటికి డికే వారికి బెస్ట్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ల జాబితాలో అవకాశమిచ్చాడు. కాగా ఈ లిస్ట్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు ఇచ్చి ఉంటే బాగుండేది అని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే 15 ఏళ్ల వైభవ్ ఇప్పటికే టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో తన సత్తాను నిరూపించుకున్నాడు. అయితే వైభవ్ ఇంకా భారత జట్టు తరపున టెస్టు, వన్డే డెబ్యూ చేయనుందున కార్తీక్ ఈ లిస్ట్లో చోటు ఇవ్వలేదు.చదవండి: ‘బౌలింగ్ ఇవ్వమని పేచీ.. క్యాచ్ డ్రాప్.. కోపంతో ఊగిపోయా’ -
చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. 18 ఏళ్ల తర్వాత
కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు డ్రా ముగిసిన సంగతి తెలిసిందే. ఫాలో- ఆన్లో ఆతిథ్య జట్టును ఆలౌట్ చేసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికి.. యువ బ్యాటర్ సోనల్ దినుష అద్భుతంగా పోరాటం కారణంగా డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐదో రోజు ఆట ప్రారంభానికి శ్రీలంక చేతిలో కేవలం 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో శ్రీలంకను త్వరగా ఆలౌట్ చేసి భారత్ మ్యాచ్ను ముగిస్తుందని అంతా భావించారు. కానీ ఆఖరి రోజు ఆటలో కథ తారుమారైంది. దినుషతో పాటు టెయిలాండర్లు క్రీజులో పాతుకుపోయారు. భారత బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు.టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ ఎన్ని ప్రయోగాలు చేసినా ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ను ముగించలేకపోయాడు. ఆఖరికి గిల్ కూడా రంగంలోకి దిగి బౌలింగ్ చేశాడు. చివరి వికెట్ పడగొట్టేందుకు పార్ట్-టైమ్ స్పిన్నర్గా మారిన గిల్.. 2 ఓవర్లు బౌలింగ్ చేసి 8 పరుగులు ఇచ్చాడు. వికెట్ ఏమీ తీయనప్పటికీ గిల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.గత 18 ఏళ్లలో శ్రీలంక గడ్డపై బౌలింగ్ చేసిన తొలి భారత టెస్టు కెప్టెన్గా గిల్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు 2008 లంక టూర్లో అప్పటి భారత కెప్టెన్ అనిల్ కుంబ్లే బౌలింగ్ చేశాడు. తాజా మ్యాచ్తో కుంబ్లే సరసన శుబ్మన్ చేరాడు.చదవండి: ఇంగ్లండ్తో రెండో టెస్టు.. ఆట బాయ్కట్ చేస్తామంటూ పాక్ బెదరింపులు! -
250 ఓవర్లు ఫీల్డింగ్ చేశాం.. వారు నిజంగా అద్భుతం: గిల్
కొలంబో వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక జట్టు అద్భుతం చేసింది. ఓటమి ఖాయమనుకున్న వేళ లంక బ్యాటర్లు విరోచితంగా పోరాడి మ్యాచ్ను డ్రా ముగించారు. ముఖ్యంగా శ్రీలంక యువ బ్యాటర్ సోనల్ దినుష అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. నాలుగో రోజు ఆటలో బ్యాటింగ్కు వచ్చిన దినుష.. దాదాపు 100 ఓవర్ల పాటు క్రీజులో ఉండి తన జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. రెండు ఇన్నింగ్స్లలోనూ అతడు సెంచరీలతో సత్తాచాటాడు. ఇక ఈ కీలక మ్యాచ్ డ్రా కావడంపై భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందించాడు. "ఈ మ్యాచ్లో గెలిచేందుకు మేము మా శాయశక్తులా ప్రయత్నించాము. వరుసగా మూడు రోజుల పాటు దాదాపు 250 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేశాము. అయినప్పటికి వారు అద్భుతంగా ఆడారు. కచ్చితంగా శ్రీలంక బ్యాటర్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. అదేవిధంగా వారికి కొంచెం అదృష్టం కూడా కలిసి వచ్చింది. మేము అక్కడ ఇంకా కొత్త ప్రయోగించాల్సింది ఏమి లేదు. అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. ఈ సిరీస్లో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రత్యర్ధి జట్టు నుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఒత్తిడిలో శ్రీలంక పుంజుకున్న తీరు నిజంగా ఒక అద్భుతం. లంచ్, టీ విరామ సమయంలో కూడా మేము దీని గురించే చర్చించాం. ఇక దేవ్దత్త్ పడిక్కల్ అద్భుతంగా ఆడాడు.కేఎల్ రాహుల్ మరోసారి తన క్లాస్ చూపించాడు. మరోవైపు మానవ్ సుతార్ గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే. ప్రతీ మ్యాచ్లోనూ అతడు నిలకడగా రాణిస్తున్నాడు. బ్యాటర్ల మైండ్సెట్ను ముందుగానే పసిగట్టి అందుకు తగ్గట్టు బౌలింగ్ చేస్తున్నాడు. అతడు కచ్చితంగా సుదీర్ఘ కాలం పాటు భారత జట్టులో కొనసాగుతాడు. ఈ మ్యాచ్లో మా పేస్ బౌలర్లు కూడా తీవ్రంగా శ్రమించారు" అని గిల్ పేర్కొన్నాడు.అదేవిధంగా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు గురుంచి గిల్ మాట్లడుతూ.. "మేము నవంబర్లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తున్నాం. అక్కడ మ్యాచ్లను గెలిచేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాం. ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఆడనున్నాం. ఈ రెండు సిరీస్లలోనూ గెలిచి ఫైనల్స్కు చేరుకుంటామన్న నమ్మకం ఉందని" చెప్పుకొచ్చాడు.చదవండి: WTC 2025-27: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో టీమిండియాకు బిగ్ షాక్ -
IND vs SL: డ్రా ముగిసిన కొలంబో టెస్టు.. సిరీస్ భారత్దే
కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్ను 1-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ ఫాలో ఆన్లో శ్రీలంక బ్యాటర్లు అద్భుతం చేశారు. 229/6తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంకను భారత బౌలర్లు ఆలౌట్ చేయలేకపోయారు. నాలుగో రోజే శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు పడగొట్టిన మన బౌలర్లు.. చివరి రోజున మిగిలిన 4 వికెట్లు తీయలేకపోయారు.లంక బ్యాటర్ సోనల్ దినూష (133 నాటౌట్) అజేయ సెంచరీతో టీమిండియాకు గెలుపును దూరం చేశాడు. అసాధారణ బ్యాటింగ్తో క్రీజులో పాతుకుపోయిన అతడి వికెట్ కోసం భారత్ చేసిన ప్రయోగాలన్నీ విఫలమయ్యాయి. అతడితో పాటు టెయిలాండర్లు లహిరు కుమార (90 బంతుల్లో 12), కేశర నువాంత (150 బంతుల్లో 46), అషిథా ఫెర్నాండో (24 బంతుల్లో 0 నాటౌట్) వీరోచిత పోరాటం కనబరిచారు.తొమ్మిదో వికెట్గా కుమార అవుట్ కావడంతో శ్రీలంకను భారత్ త్వరగా ఆలౌట్ చేసి బ్యాటింగ్కు వస్తుందని అంతా భావించారు. కానీ పదకొండో నంబర్ బ్యాటర్ ఫెర్నాండో కూడా తన జిడ్డు బ్యాటింగ్తో విసుగు తెప్పించాడు. అతడి వికెట్ కోసం ఆఖరికి కెప్టెన్ శుబ్మన్ గిల్, యశస్వి జైశ్వాల్, ధ్రువ్ జురెల్ కూడా బౌలింగ్ చేశారు.అయినా చివరి వికెట్ను పడగొట్టలేకపోయారు. దీంతో మరో 18 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే ఇరు జట్లూ డ్రాకు అంగీకరించాయి. అప్పటికే శ్రీలంక 216 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఒకవేళ భారత్ బ్యాటింగ్కు దిగినా ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.బెడిసి కొట్టిన టీమిండియా ప్లాన్ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ను 503/9 వద్ద డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో దేవ్దత్త్ పడిక్కల్(117), ధ్రువ్ జురెల్(115) సెంచరీలతో సత్తాచాటగా.. గిల్(50), పంత్(63) అర్ధ శతకాలతో రాణించారు. అనంతరం శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్లో 290 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్లో కూడా సోనల్ దినుష(103) సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు పసిందు సూరియబండార(80) కూడా రాణించాడు.మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో 213 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో సునాయస విజయం సాధించవచ్చనే నమ్మకంతో భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ లంక జట్టుకు ఫాలో-ఆన్కు ఆహ్వానించాడు. గిల్ తీసుకున్న ఈ నిర్ణయం బెడిసికొట్టిందనే చెప్పాలి. ఫాలో ఆన్లో శ్రీలంక అద్భుతమైన పోరాటం కనబరిచి మ్యాచ్ను డ్రా ముగించింది.సంక్షిప్త స్కోర్లు..భారత తొలి ఇన్నింగ్స్ – 503/9 డిక్లేర్శ్రీలంక రెండో ఇన్నింగ్స్ – 290 ఆలౌట్శ్రీలంక రెండో ఇన్నింగ్స్ – 429/9 డిక్లేర్చదవండి: చరిత్ర సృష్టించిన వరుస సెంచరీల వీరుడు సొనాల్ దినుష -
అలా జరగొద్దు.. టీమిండియాకు పొంచి ఉన్న గండం!
కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో నాలుగో రోజు ఆట ముగిసేసరికి భారత్ పటిష్టమైన స్థితిలో నిలిచింది. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి శ్రీలంక 229/6 స్కోరుతో ఉండగా, ఆతిథ్య జట్టు కేవలం 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. గురువారం ఆటకు చివరి రోజు కావడంతో, భారత్ గెలుపు లాంచనమే అయినప్పటికీ, వర్షం ముప్పు కూడా పొంచి ఉంది. ఒకవేళ వర్షంతో ఐదో రోజు ఆటలో ఒక్క బంతి కూడా సాధ్యపడకపోతే అప్పుడు మ్యాచ్ డ్రా అవుతుంది. మరి మ్యాచ్ డ్రా అయితే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడంలో భారత్కు ఎదురయ్యే అడ్డంకులు ఏంటనేవి ఒకసారి పరిశీలిద్దాం. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం 53.33 శాతం పాయింట్లతో (PCT) ఐదవ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా చేతిలో బంగ్లాదేశ్ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో, శ్రీలంకపై గెలిస్తే భారత్ నాలుగో స్థానానికి చేరుకుంటుంది. అయితే, మ్యాచ్ డ్రా అయితే మాత్రం, భారత్ 51.52 శాతం పాయింట్ల తేడాతో ఐదవ స్థానంలోనే కొనసాగుతుంది. అయితే డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్కు మరో ఏడు టెస్టులు మిగిలి ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన 10 టెస్టుల్లో ఇప్పటికే నాలుగింటిలో ఓడిపోయిన శుభ్మన్ గిల్ నేతృత్వంలోని జట్టుకు, ఇక నుంచి ప్రతీ టెస్టు నాకౌట్ లాంటిదే. ఈ ఏడాది నవంబరులో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత్ న్యూజిలాండ్కు వెళ్లనుంది. ఆ తర్వాత ఐపీఎల్ 2027 సీజన్కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టును బంగ్లాదేశ్ నెగ్గడంతో, భారత్ తమకు మిగిలిన 8 టెస్టుల్లో ఏడు గెలవాల్సి ఉంటుంది. అయితే ఇప్పడు లంకతో రెండో టెస్టు వర్షం వల్ల డ్రా అయితే మాత్రం భారత్ కచ్చితంగా ఏడింటికి ఏడు టెస్టులు గెలవాల్సి ఉంటుంది. అప్పుడే టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్లు 68.52గా ఉండడంతో పాటు ఫైనల్ ఆడేందుకు చాన్స్ ఉంటుంది. అంతేకాదు భారత్కు రాబోయే ఏడు టెస్టుల్లో ఎలాంటి పెనాల్టీ పాయింట్లు లభించకపోతేనే ఈ పరిస్థితులు సాధ్యమవుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి.చదవండి: మాస్టర్ ప్లాన్ అదిరింది.. ధోనిని మించిపోయిన పంత్! -
వర్షం వల్ల ముందుగానే ముగిసిన నాలుగో రోజు ఆట
Sri Lanka Vs India 2nd Test Match, Day 4: కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య నాలుగో రోజు ఆట ముగిసింది. లంకను 290 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్లో 213 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఈ క్రమంలో లంకను ఫాలో ఆన్ ఆడిస్తోంది.ఈ క్రమంలో బుధవారం నాటి ఆట పూ ర్తయ్యే సరికి శ్రీలంక ఆరు వికెట్లు నష్టపోయి 229 పరుగులు చేసింది. తద్వారా 16 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. వాన వల్ల ముందుగానే ఆటను నిలిపివేశారు.ఆధిక్యంలోకి శ్రీలంకవర్షం వల్ల ఆట నిలిపివేసే సమయానికి శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసి.. 16 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. కేశారా నువాంత 3, సొనాల్ దినుష 7 పరుగులతో ఉన్నారు.డిక్వెల్లా (5) ఔట్నిరోషన్ డిక్వెల్లా (5) రూపంలో లంక ఆరో వికెట్ కోల్పోయింది. సోనల్ దినూష (2)క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం లంక ఐదు పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది.ఐదో వికెట్ డౌన్92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పసిందు సూరియబండారా ఔట్ కావడంతో లంక 212 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. మానవ్ సుతార్ బౌలింగ్లో పసిందు స్టంప్ ఔట్గా వెనుదిరిగాడు.నాలుగో వికెట్ డౌన్23 పరుగులు చేసిన కెప్టెన్ ధనంజయ మానవ్ సుతార్ బౌలింగ్లో వెనుదిరగడంతో లంక 209 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.టీ విరామం అనంతరం ఆట తిరిగి మొదలైంది. ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక 200 పరుగుల మార్క్ దాటింది. ప్రస్తుతం లంక 3 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. క్రీజులో సూరియబండారా (91), కెప్టెన్ ధనంజయ డిసిల్వా (17) పరుగులతో ఆడుతున్నారు.టీ విరామంఫాలోఆన్ ఆడుతున్న శ్రీలంక టీ విరామ సమయానికి 56 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. పసిందు సూరియబండారా (90), కెప్టెన్ ధనంజయ డిసిల్వా (14) పరుగులతో ఆడుతున్నారు. లంక మరో 14 పరుగుల వెనుకంజలో ఉంది. భారత బౌలర్లలో ప్రసిధ్, సిరాజ్, మానవ్ సుతార్ తలా ఒక వికెట్ తీశారు.మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక43.1వ ఓవర్: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో గిల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన కమిందు మెండిస్ (55). కెప్టెన్ ధనంజయ డి సిల్వ క్రీజులోకి రాగా.. పసిందు 83 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 178-3 (43.2). ఇంకా 35 పరుగులు వెనుకబడి ఉన్న లంక.కమిందు హాఫ్ సెంచరీప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో సిక్సర్ బాది కమిందు మెండిస్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం కమిందు 54, సూరియబండార 68 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. జట్టు స్కోర్ 162-2గా ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు శ్రీలంక ఇంకా 51 పరుగులు వెనుకపడి ఉంది. నిలకడగా ఆడుతున్న సూరియబండార, కమిందు63 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత శ్రీలంక ఇన్నింగ్స్ కోలుకుంది. పసిందు సూరియబండార (63), కమిందు మెండిస్ (43) నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం జట్టు స్కోర్ 150-2గా ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఆ జట్టు ఇంకా 63 పరుగులు వెనుకపడి ఉంది. రెండో ఇన్నింగ్స్లోనూ హాఫ్ సెంచరీ చేసిన సూరియబండారపసిందు సూరియబండార రెండో ఇన్నింగ్స్లోనూ హాఫ్ సెంచరీతో మెరిశాడు. రవీంద్ర జడేజా బౌలింగ్లో బౌండరీ బాది ఈ మార్కును దాటాడు. 31 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 112-2గా ఉంది. సూరియబండారకు జతగా కమిందు మెండిస్ (21) క్రీజ్లో ఉన్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు శ్రీలంక ఇంకా 101 పరుగులు వెనుకపడి ఉంది. లంచ్ బ్రేక్.. 130 పరుగుల వెనుకంజలో శ్రీలంకనాలుగో రోజు లంచ్ విరామం సమయానికి శ్రీలంక ఫాలో ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఆ జట్టు ఇంకా 130 పరుగులు వెనుకపడి ఉంది. కమిందు మెండిస్ (10), పసిందు సూరియబండార (35) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక14.5వ ఓవర్: రవీంద్ర జడేజా బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయిన కమిల్ మిశారా (32). అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఇవ్వగా కమిల్ రివ్యూకు వెళ్లాడు. అయితే, అక్కడా ప్రతికూల ఫలితమే రావడంతో అతడు నిరాశగా పెవిలియన్ చేరాడు. పసిందుతో కలిసి కమిల్ మిశారా 58 పరుగుల మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పాడు. మిశారా స్థానంలో కమిందు మెండిస్ క్రీజులోకి రాగా.. పసిందు 28 పరుగులతో ఉన్నాడు. లంక స్కోరు: 63-2.ఫాలో ఆన్.. తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంకఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్లో సరాన్ష్ జైన్కు క్యాచ్ ఇచ్చి ఉదారా (3) ఔటాయ్యడు. పసిందు క్రీజులోకి వచ్చాడు.ఫాలో ఆన్ ఆడనున్న శ్రీలంకదినుషా సెంచరీతో పోరాడినప్పటికీ శ్రీలంకను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించలేకపోయాడు. 213 పరుగులు వెనుకపడి ఉన్న శ్రీలంక రెండో ఇన్నింగ్స్ కొనసాగించనుంది. దినుషా సెంచరీ.. శ్రీలంక ఆలౌట్శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 290 పరుగుల వద్ద ముగిసింది. సెంచరీ హీరో దినుషా (103) చివరి వికెట్గా వెనుదిరిగాడు. దినుషా సరాన్ష్ జైన్ బౌలింగ్లో రాహుల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.తొమ్మిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక86.5వ ఓవర్- 288 పరుగుల వద్ద శ్రీలంక తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సరాన్ష్ జైన్ బౌలింగ్లో జురెల్కు క్యాచ్ ఇచ్చి లహీరు కుమార (12) ఔటయ్యాడు. సెంచరీ పూర్తి చేసిన దినుషాఓవర్నైట్ బ్యాటర్ సోనల్ దినుషా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో బౌండరీతో మూడంకెల మార్కును దాటాడు. దినుషాకు ఇది వరసగా రెండో సెంచరీ. ఈ సిరీస్ తొలి టెస్ట్లోనూ అతడు సెంచరీ చేశాడు. నాలుగో రోజు మొదలైన ఆటఓవర్నైట్ స్కోర్ (శ్రీలంక తొలి ఇన్నింగ్స్) 265-8 వద్ద నాలుగో రోజు ఆట మొదలైంది. దినుష (85), లహీరు కుమార (8) ఇన్నింగ్స్లు కొనసాగిస్తున్నారు.భారీ ఆధిక్యంలో భారత్మూడో రోజు నిలిచే సమయానికి శ్రీలంక 83.4 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు సాధించింది. సొనాల్ దినుష 85 పరుగులు, లాహిరు కుమార 8 పరుగులతో అజేయంగా నిలిచారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ కంటే శ్రీలంక ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది. లంక ఇన్నింగ్స్లో పసిందు సూరియబండార (80) అర్ద సెంచరీతో రాణించగా.. భారత్ తరఫున ప్రసిద్ద్, సుతార్ తలో 3 వికెట్లు తీశారు.పడిక్కల్, జురెల్ సెంచరీలుఅంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. పడిక్కల్ (117), ధ్రువ్ జురెల్ (115 నాటౌట్) శతకాలతో విజృంభించగా.. గిల్ (50), పంత్ (63) అర్ధసెంచరీలతో రాణించారు.చదవండి: శాసించేది మనమే! -
22లో 18 వృథా.. జడేజా చెత్త రికార్డు; గిల్ జాగ్రత్త!
భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. అశ్విన్తో కలిసి బౌలింగ్ను పంచుకున్న జడేజా టీమిండియా సాధించిన ఎన్నో విజయాల్లో భాగమయ్యాడు. వేగంగా ఓవర్లు పూర్తి చేయడంలో జడేజా సిద్ధహస్తుడు. ఇక వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడం జడ్డూ శైలి కావడంతో బ్యాటర్లు ఎక్కువగా ఎల్బీడబ్ల్యూగానే వికెట్ ఇచ్చుకుంటారు. కానీ ఇప్పుడు అదే ఎల్బీడబ్ల్యూలకు సంబంధించి డీఆర్ఎస్ తీసుకునే విషయంలో జడేజా చెత్త రికార్డు నెలకొల్పాడు. సుదీర్ఘ ఫార్మాట్లో గణాంకాల పరంగా మెరుగ్గానే ఉన్నప్పటికీ.. డీఆర్ఎస్(అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించడం)లో మాత్రం జడ్డూ వరుసగా ఫెయిలవుతూ వస్తున్నాడు. ఇప్పటివరకూ అతడు వరుసగా 22 రివ్యూలను కోల్పోయాడు. వీటిలో నాలుగు దఫాలు మాత్రమే అంపైర్ కాల్గా వెళ్లాయి. గత మూడేళ్ల కాలంలో జడేజా 22 సార్లు డీఆర్ఎస్లు తీసుకోగా.. అందులో 18 రివ్యూలు వృథా అయ్యాయి.దీంతో ఇన్ని రివ్యూలు కోల్పోయిన తొలి ఆల్రౌండర్గా జడేజా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. చివరిసారిగా 2023లో జడేజా తీసుకున్న రివ్యూ విజయవంతమైంది. ఆ ఏడాది జూలైలో డొమినికా టెస్టులో వెస్టిండీస్పై తొలి ఇన్నింగ్స్లో రివ్యూతో కీమర్ రోచ్ వికెట్ను దక్కించుకున్నాడు. అప్పటి నుంచి జడేజా మళ్లీ రివ్యూల్లో సక్సెస్ కాలేదు. అందుకే కెప్టెన్గా గిల్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. గతంలో ఆటగాళ్లు పట్టుబట్టినా రివ్యూలు తీసుకోని మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి గిల్ నేర్చుకోవాల్సిన అవసరముంది. ఇక జడేజా ఇప్పటివరకు 90 టెస్టుల్లో 4,117 పరుగులు చేయడంతో పాటు 352 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 15సార్లు ఐదు వికెట్లు, మూడు దఫాలు పది వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.Ravindra Jadeja has had his last 22 DRS reviews struck down as a bowler in Tests. Only four of them have turned out to be umpire's call 🤯His last successful review as a bowler came in the West Indies' first innings in the Dominica Test in July 2023, with the dismissal of Kemar… pic.twitter.com/H6uqCc0OCR— Cricinfo (@cricinfo) August 25, 2026చదవండి: జిడ్డులా తగులుకున్నాడు.. లంక బ్యాటర్ అరుదైన రికార్డు! -
SL Vs IND: ముగిసిన మూడో రోజు ఆట.. లంక స్కోరెంతంటే?
Sri Lanka Vs India 2nd Test Match, Day 3: కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. మంగళవారం ఆట పూర్తయ్యే సరికి దినుష 137 బంతుల్లో 85 పరుగులతో అజేయంగా నిలవగా.. అతడికి తోడుగా లాహిరు కుమార 8 పరుగులతో ఉన్నాడు. ఇక మరోసారి వర్షం వల్ల అంతరాయం కలగడంతో ముందుగానే ఆటను నిలిపివేశారు. అప్పటికి శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు సాధించింది. తద్వారా మొదటి ఇన్నింగ్స్లో భారత్ కంటే.. ఇంకా 238 పరుగులు వెనుబడే ఉంది.ముగిసిన ఆట.. భారీ ఆధిక్యంలో భారత్మరోసారి ఆటకు అంతరాయంవర్షం వల్ల ఆట నిలిచే సమయానికి శ్రీలంక 83.4 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు సాధించింది. సొనాల్ దినుష 85 పరుగులు, లాహిరు కుమార 8 పరుగులతో అజేయంగా నిలిచారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ కంటే శ్రీలంక ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది.దినూష దూకుడుసోనాల్ దినూష (80) సెంచరీ దిశగా సాగుతున్నాడు. ప్రస్తుతం లంక 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. కుమారా 7 పరుగులతో అతడికి సహకరిస్తున్నాడు. లంక మరో 245 పరుగులు వెనుకబడి ఉంది.ఎనిమిదో వికెట్ డౌన్18 పరుగులు చేసిన కెషారా నువంతా మానవ్ సుతార్ బౌలింగ్లో సారాంశ్ జైన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో లంక 230 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది. టీ విరామం తర్వాత మొదలైన ఆటటీ విరామం తర్వాత ఆట మొదలైంది. 66 ఓవర్లు ముగిసేసరికి లంక 7 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. దినూష (58), కెషారా (13) పరుగులతో ఆడుతున్నారు.టీ విరామం..టీ విరామ సమయానికి శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. సోనాల్ దినూష (52) అజేయ అర్ధసెంచరీ సాధించగా, కెషారా నువంతా 13 పరుగులతో అతడికి సహకరిస్తున్నాడు. లంక మరో 287 పరుగులు వెనుకబడి ఉంది. ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక45.3వ ఓవర్: సిరాజ్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చిన డిక్వెల్లా (0). లంక స్కోరు 173-7. దినుష 22 పరుగులతో ఉన్నాడు. భారత్ కంటే 330 పరుగుల వెనుకంజలో శ్రీలంక. ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక44.6వ ఓవర్: రవీంద్ర జడేజా బౌలింగ్లో పసిందు సూరియబండారా బౌల్డ్. 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆరో వికెట్గా వెనుదిరిగిన పసిందు. నిరోషన్ డిక్వెల్లా క్రీజులోకి రాగా.. దినుష 21 పరుగులతో ఉన్నాడు. లంక స్కోరు: 171-6 (45). టీమిండియా కంటే 332 పరుగుల వెనుకంజలో లంక.భారీ వెనుకంజలో శ్రీలంక137 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన శ్రీలంక భారీ వెనుకంజలో కొనసాగుతోంది. ఆ జట్టు ఇంకా భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు 340 పరుగులు వెనుకపడి ఉంది. రెండో సెషన్ సమయానికి (42 ఓవర్లు) శ్రీలంక స్కోర్ 163-5గా ఉంది. సోనల్ దినుషా (17), పసిందు సూరియబండార (77) క్రీజ్లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక34.5వ ఓవర్: మానవ్ సుతార్ బౌలింగ్లో రాహుల్కు క్యాచ్ ఇచ్చి అవుటైన ధనంజయ (8). లంక స్కోరు: 137/5 (34.5). సొనాల్ దినుష క్రీజులోకి రాగా.. పసిందు 68 పరుగులతో ఉన్నాడు.నిలకడగా ఆడుతున్న ధనంజయ, పసిందుధనంజయ 8, పసిందు 68 పరుగులతో ఉన్నారు.తిరిగి మొదలైన ఆట1.10 PM- 3.25 PM మధ్య రెండో సెషన్3.45 PM- 5.42 PM మధ్య మూడో సెషన్ నిర్వహణవర్షం వల్ల ఆటకు అంతరాయంవాన వల్ల లంచ్ బ్రేక్ తర్వాత ఆటకు కాసేపు అంతరాయం కలిగింది. అయితే, 12.30 తర్వాత వర్షం తగ్గుముఖం పట్టింది కానీ.. అవుట్ఫీల్డ్ చిత్తడిగా ఉండటం వల్ల ఆట సాగలేదు.లంచ్ విరామం సమయానికి శ్రీలంక స్కోర్ ఎంతంటే..?మూడో రోజు లంచ్ విరామం సమయానికి శ్రీలంక స్కోర్ నాలుగు వికెట్ల నష్టానికి 130 పరుగులుగా ఉంది. పసిందు సూరియబండార (65) అర్ద సెంచరీ పూర్తి చేసుకోగా.. కెప్టెన్ ధనంజయ డిసిల్వ (4) అతడికి జతగా క్రీజ్లో ఉన్నాడు. ప్రసిద్ద్ కృష్ణ 3 వికెట్లు తీయగా.. సుతార్కు ఓ వికెట్ దక్కింది. నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక122 పరుగుల వద్ద శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి కమిందు మెండిస్ (2) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక35 పరుగుల వద్ద శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో జురెల్కు క్యాచ్ ఇచ్చి కమిల్ మిషారా (19) ఔటయ్యాడు. మూడో రోజు మొదలైన ఆట8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన శ్రీలంక మూడో రోజు ఆటను దూకుడుగా ప్రారంభించింది. ఈ రోజు తొలి ఓవర్లోనే ఆ జట్టు రెండు బౌండరీలు సహా 12 పరుగులు రాబట్టింది. ప్రసిద్ద్ కృష్ణ వేసిన ఈ ఓవర్లో కమిల్ మిషారా రెండు బౌండరీలు బాదాడు.ప్రస్తుతం శ్రీలంక స్కోర్ 20-2గా ఉంది. మిషారా 14, పసిందు సూరియబండార 3 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. 495 పరుగుల వెనుకంజలో శ్రీలంకకొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. కమిల్ మిషారా 5 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మానవ్ సుతార్, ప్రసిధ్ క్రిష్ణలు చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం లంక 495 పరుగుల వెనుకబడి ఉంది.అంతకముందు మానవ్ సుతార్ బౌలింగ్లో ప్రబాత్ జయసూరియ (2) ఎల్బీగా వెనుదిరగడంతో లంక రెండో వికెట్ కోల్పోయింది. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ను 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పడిక్కల్, ధ్రువ్ జురెల్ శతకాలతో విజృంభించగా; గిల్, పంత్ అర్ధసెంచరీలతో రాణించారు. చదవండి: సిరాజ్ రెచ్చగొట్టాడు.. ప్రసిద్ద్ పని కానిచ్చేశాడు..! -
రెండో రోజు ముగిసిన ఆట.. రెండు వికెట్లు కోల్పోయిన లంక
Sri Lanka Vs India 2nd Test Match, Day 2: కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. కమిల్ మిషారా 5 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మానవ్ సుతార్, ప్రసిధ్ క్రిష్ణలు చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం లంక 495 పరుగుల వెనుకబడి ఉంది.అంతకముందు మానవ్ సుతార్ బౌలింగ్లో ప్రబాత్ జయసూరియ (2) ఎల్బీగా వెనుదిరగడంతో లంక రెండో వికెట్ కోల్పోయింది. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ను 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పడిక్కల్, ధ్రువ్ జురెల్ శతకాలతో విజృంభించగా; గిల్, పంత్ అర్ధసెంచరీలతో రాణించారు. లంకకు ఆదిలోనే షాక్రెండో ఇన్నింగ్ ఆరంభించిన శ్రీలంకకు ఆదిలోనే షాక్ తగిలింది. ప్రసిధ్ క్రిష్ణ బౌలింగ్లో లాహిరు కుమారా (1) వెనుదిరగడంతో లంక రెండు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం లంక వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది.భారత్ 503/9 డిక్లేర్కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్టులో రెండో రోజు ఆట మొదలైంది. కాగా 300/5 ఓవర్నైట్ స్కోరుతో ఆట మొదలుపెట్టిన భారత్.. తొమ్మిది వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండోరోజు ఆటలో భాగంగా రిషభ్ పంత్ అర్ధ శతకం (63)తో మెరవగా.. ధ్రువ్ జురెల్ శతక్కొట్టాడు. మొత్తంగా 177 బంతుల్లో 115 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఇక తొలిరోజు ఆటలో పడిక్కల్ శతకం (117) సాధించగా.. కెప్టెన్ శుబ్మన్ గిల్ హాఫ్ సెంచరీ (50) చేశాడు. కాగా శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. ప్రభాత్ జయసూర్య, కుశారా నువాంత చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లాహిరు కుమారకు ఒక వికెట్ దక్కింది. Updatesజురెల్ సెంచరీ.. భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్డ్తొమ్మిదో వికెట్ డౌన్136.1వ ఓవర్: ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయిన తొమ్మిదో వికెట్గా వెనుదిరిగిన సిరాజ్ (3). అతడి స్థానంలో ప్రసిద్ కృష్ణ క్రీజులోకి రాగా.. జురెల్ 106 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 489-8. ఆరు గంటల వరకు మ్యాచ్వాన తెరిపినివ్వడంతో.. తిరిగి సాయంత్రం 4.24 నిమిషాలకు మ్యాచ్ మొదలైంది. వర్షం వల్ల ఆటకు అంతరాయం కలగగా.. పరిస్థితిని బట్టి ఆరు గంటల వరకు మ్యాచ్ నిర్వహించనున్నారు.టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 475/8(131.2)వరుణుడు ఎంట్రీభారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వర్షం అంతరాయం కలిగింది. వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి భారత్ 8 వికెట్లు కోల్పోయి 475 పరుగులు చేసింది.ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్458 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో నిరోషన్ డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి మానవ్ సుతార్ (18) ఔటయ్యాడు. జురెల్ 79 పరుగుల వద్ద క్రీజ్లో ఉన్నాడు. ఏడో వికెట్ కోల్పోయిన భారత్112.1వ ఓవర్: భోజన విరామం తర్వాత తొలి బంతికే పంత్ అవుటయ్యాడు. కేశారా నువాంత బౌలింగ్లో లాహిరు కుమారకు క్యాచ్ ఇచ్చి 63 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. దీంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది.పంత్ స్థానంలో ఆల్రౌండర్ మానవ్ సుతార్ క్రీజులోకి రాగా.. జురెల్ 59 పరుగులతో ఉన్నాడు. భారత్ స్కోరు: 419-7. లంచ్ విరామం సమయానికి భారత్ స్కోర్ 419-6రెండో రోజు లంచ్ విరామం సమయానికి భారత్ స్కోర్ 419-6గా ఉంది. రిషబ్ పంత్ 63, ధ్రువ్ జురెల్ 59 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. జురెల్ ఫిఫ్టిజురెల్ 97 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్ స్కోర్ కూడా 400 మార్కు దాటింది. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పంత్రిషబ్ పంత్ 81 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో ధ్రువ్ జురెల్ (49) కూడా హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. 109 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 397-6గా ఉంది.డ్రింక్స్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 354-6 (97)పంత్ 30, జురెల్ 27 పరుగులతో ఉన్నారు.నిలకడగా ఆడుతున్న జురెల్, పంత్రెండో రోజు ఆట ప్రారంభమయ్యాక రెండో ఓవర్లోనే సరాన్ష్ వికెట్ కోల్పోయాక భారత బ్యాటర్లు రిషబ్ పంత్ (19), ధ్రువ్ జురెల్ (26) నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 342-6గా ఉంది. ఆరో వికెట్ కోల్పోయిన భారత్రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే భారత్కు షాక్ తగిలింది. ఓవర్నైట్ బ్యాటర్ సరాన్ష్ జైన్ (6) అసిత ఫెర్నాండో బౌలింగ్లో కమిల్ మిషారాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 307-6గా ఉంది. ధ్రువ్ జురెల్కు (11) జతగా తొలి రోజు రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన రిషబ్ పంత్ (3) క్రీజ్లోకి వచ్చాడు.రెండో రోజు మొదలైన ఆటభారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆట మొదలైంది. సరాన్ష్ జైన్ 4), ధ్రువ్ జురెల్ (7) క్రీజ్లోకి వచ్చారు. ఓవర్నైట్ స్కోర్ 300-5 వద్ద భారత్ ఆట మొదలుపెట్టింది. తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, సరాన్ష్ జైన్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణశ్రీలంక (ప్లేయింగ్ XI): లాహిరు ఉదార, కమిల్ మిషార, పసిందు సూర్యబండార, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా(కెప్టెన్), సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), కేషారా నువంత, ప్రబాత్ జయసూర్య, లహిరు కుమార, అసిత ఫెర్నాండో -
చరిత్ర సృష్టించిన గిల్.. దశాబ్దంలో తొలి ఆటగాడు
భారత టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మరో కీలక మైలురాయిని తాకాడు. టెస్ట్ క్రికెట్లో 3,000 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 28వ భారత బ్యాటర్గా నిలిచాడు. కొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో గిల్ ఈ ఘనత సాధించాడు.26 ఏళ్ల గిల్ తన 43వ మ్యాచ్ 77వ ఇన్నింగ్స్లో 3000 పరుగుల మార్కును తాకాడు. ఈ ఫార్మాట్లో గిల్ 43.53 సగటున, 8 సెంచరీలు, 11 అర్ద సెంచరీలు చేశాడు. అతడి అత్యుత్తమ స్కోర్ 269గా ఉంది.కపిల్ కంటే వారం ముందు..టెస్ట్ల్లో 3000 పరుగుల మైలురాయిని గిల్ 26 ఏళ్ల 349 రోజుల వయసులో అందుకున్నాడు. తద్వారా భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో ఈ మైలురాయిని తాకిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (23 ఏళ్ల 228 రోజుల) అగ్రస్థానంలో ఉండగా.. వీరేంద్ర సెహ్వాగ్ (26 ఏళ్ల 157 రోజులు), దిలీప్ వెంగ్సర్కార్ (26 ఏళ్ల 263 రోజులు) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. గిల్.. భారత దిగ్గజ ఆల్రౌండర్ కపిల్ దేవ్ (26 ఏళ్ల 356 రోజులు) కంటే వారం రోజుల ముందు ఈ మైలురాయిని తాకాడు.2020లో టెస్ట్ అరంగేట్రం చేసిన గిల్.. నాటి నుంచే నిలకడైన ప్రదర్శనలతో భారత టెస్ట్ జట్టులో కీలక బ్యాటర్గా ఎదిగాడు. ముఖ్యంగా 2025లో ఇంగ్లండ్ పర్యటనలో అతడి బ్యాటింగ్ అత్యంత ప్రభావవంతంగా నిలిచింది. ఆ సిరీస్లో గిల్ ఏకంగా 754 పరుగులు సాధించాడు. గిల్ వన్డేల్లోనూ ఇదివరకే 3000 పరుగులు పూర్తి చేశాడు.దశాబ్దంలో తొలి ఆటగాడుఈ మ్యాచ్లో గిల్ మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ దశాబ్దంలో టెస్టులు, వన్డేలు రెండింటిలో కనీసం 3,000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. గిల్ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లో 3,000 వన్డే పరుగులు పూర్తి చేశాడు. కేవలం 62 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని అందుకుని, వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 3,000 పరుగులు సాధించిన ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ తొలి రోజు లంచ్ విరామం సమయానికి 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(45), కేఎల్ రాహుల్ (18) ఔట్ కాగా.. పడిక్కల్ (13), గిల్ (11) క్రీజ్లో ఉన్నారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి మ్యాచ్లో గెలిచిన విషయం తెలిసిందే. -
SL Vs IND: ముగిసిన తొలి రోజు ఆట.. భారత్దే పైచేయి
Sri Lanka Vs India 2nd Test Match Updates: కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత బ్యాటర్లు సత్తాచాటారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. దేవ్దత్త్ పడిక్కల్(117) సెంచరీతో కదం తొక్కగా.. శుబ్మన్ గిల్(50), యశస్వి జైశ్వాల్(45), రవీంద్ర జడేజా(43) రాణించారు.టీమిండియా ఐదో వికెట్ డౌన్టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన జడేజా.. ఫెర్నాండో బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి డెబ్యూ ఆటగాడు సారాన్ష్ జైన్ వచ్చాడు. 85 ఓవర్లకు భారత్ స్కోర్: 300/5నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా117 పరుగుల వద్ద దేవదత్ పడిక్కల్ ఔటయ్యాడు. కేషర నువంత బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రవీంద్ర జడేజాకు (36) జతగా ధ్రువ్ జురెల్ (5) క్రీజ్లోకి వచ్చాడు. పడిక్కల్ సెంచరీకొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ టీమిండియా యువ బ్యాటర్ దేవ్దత్త్ పడిక్కల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 168 బంతుల్లో పడిక్కల్ తన రెండో సెంచరీ మార్క్ను అందుకున్నాడు.రిషబ్ పంత్ రిటైర్డ్ హర్ట్ కొలంబో టెస్టులో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్లో 3 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్దు చేతి గాయం కారణంగా పంత్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. అతడి స్ధానంలో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. 59.4 ఓవర్లకు భారత్ స్కోర్: 215-3టీ బ్రేక్కు టీమిండియా స్కోరెంతంటే?టీ బ్రేక్ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. క్రీజులో దేవ్దత్త్ పడిక్కల్(63), రిషబ్ పంత్(0) ఉన్నారు.శుబ్మన్ గిల్ అవుట్శుబ్మన్ గిల్ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన గిల్.. అషితా ఫెర్నాండో బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో రిషబ్ పంత్ వచ్చాడు.గిల్ ఫిప్టీభారత కెప్టెన్ శుబ్మన్ గిల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 50 ఓవర్లకు టీమిండియా స్కోర్: 184/2150 రన్స్ మార్క్ దాటిన భారత్పడిక్కల్ (50) అజేయ అర్ధసెంచరీకి తోడు గిల్ (40) నిలకడగా ఆడుతుండడంతో టీమిండియా 150 పరుగుల మార్క్ దాటింది. ఈ ఇద్దరు కలిసి మూడో వికెట్కు అజేయంగా 85 పరుగులు జోడించారు. ప్రస్తుతం భారత్ 42 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.సెంచరీ మార్క్ దాటిన టీమిండియాకొలంబో వేదికగా లంకతో రెండో టెస్టులో టీమిండియా సెంచరీ మార్క్ దాటింది. 30 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. గిల్ (25), పడిక్కల్ (18) పరుగులతో క్రీజులో ఉన్నారు. లంచ్ తర్వాత మొదలైన ఆటలంచ్ అనంతరం ఆట మొదలైంది. 27 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. పడిక్కల్ (15), గిల్ (12) పరుగులతో క్రీజులో ఉన్నారు.లంచ్ బ్రేక్లంచ్ విరామ సమయానికి టీమిండియా 25 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. పడిక్కల్ (13), శుబ్మన్ గిల్ (11) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు జైస్వాల్ (45) దూకుడు ఆటతీరును ప్రదర్శించగా, కేఎల్ రాహుల్ (18) ఆకట్టుకోలేకపోయాడు.రెండో వికెట్ డౌన్దూకుడుగా ఆడుతున్న భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ (45) అశితా ఫెర్నాండో బౌలింగ్లో క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 62 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. పడిక్కల్ 3 పరుగులతో ఆడుతున్నాడు.జైస్వాల్ దూకుడు.. టీమిండియా స్కోరెంతంటే?లంకతో రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ జోరు ప్రదర్శిస్తున్నాడు. వన్డే తరహాలో వేగంగా ఆడుతున్న జైస్వాల్ 51 బంతుల్లో 41 పరుగులతో ఆడుతున్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు ఉన్నాయి. ఇక పడిక్కల్ రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం భారత్ 17 ఓవర్లలో వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది.తొలి వికెట్ డౌన్18 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ లాహిరు కుమారా బౌలింగ్లో నిరోషన్ డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. జైస్వాల్ (19), పడిక్కల్ క్రీజులో ఉన్నారు.నిలకడగా భారత్ బ్యాటింగ్లంకతో మొదలైన రెండో టెస్టులో భారత్ నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. జైస్వాల్ 14, కేఎల్ రాహుల్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.టాస్ గెలిచిన టీమిండియాశ్రీలంక, భారత్ మధ్య కొలంబో వేదికగా రెండో టెస్టు మ్యాచ్ మొదలైంది. ఈ నేపథ్యంలో సారాంశ్ జైన్ టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. సీనియర్ ఆల్రౌండర్ జడేజా చేతుల మీదుగా సారాంశ్ క్యాప్ అందుకున్నాడు. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపించని కుల్డీప్ యాదవ్పై వేటు పడింది. అతడి స్థానంలోనే సారాంశ్ తుది జట్టులోకి వచ్చాడు. భారత జట్టు అదొక్కటే మార్పు. శ్రీలంక కూడా రెండు ఛేంజెస్ చేసింది. కమిల్ మిశ్రా అరంగేట్రం చేయగా.. చండిమాల్ స్థానంలో పసిందు సూరియబండారా వచ్చాడు.భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, శరన్ష్ జైన్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణశ్రీలంక (ప్లేయింగ్ XI): లాహిరు ఉదార, కమిల్ మిషార, పసిందు సూర్యబండార, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా(కెప్టెన్), సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), కేషారా నువంత, ప్రబాత్ జయసూర్య, లహిరు కుమార, అసిత ఫెర్నాండోA look at #TeamIndia's Playing XI for the 2nd #SLvIND Test 👌👌Saransh Jain makes his international debut 👏👏Updates ▶️ https://t.co/r9FgXSdsMf pic.twitter.com/WOCtWZ9YcP— BCCI (@BCCI) August 23, 2026Read: బీసీసీఐకి కొత్త తలనొప్పి! -
గిల్, జైస్వాల్ ఫామ్పై నజర్.. ఒక్క ఇన్నింగ్స్ చాలు!
కొలంబో వేదికగా ఆదివారం నుంచి భారత్, శ్రీలంక మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో విక్టరీ అందుకున్న టీమిండియా రెండో టెస్టులోనూ అదే జోరు ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే తొలి టెస్టులో కెప్టెన్ శుబ్మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్లు రాణించడంలో విఫలమయ్యారు. దీంతో ఈ ఇద్దరు భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరముంది. అయితే గిల్ మాత్రం మంచి ఫామ్లో ఉన్నాడు. గత ఆరు ఇన్నింగ్స్లో రెండు సెంచరీలు సాధించిన గిల్ తిరిగి ట్రాక్ ఎక్కేందుకు ఒక్క ఇన్నింగ్స్ చాలు. ఇప్పటికే కెప్టెన్గా గిల్ 10 టెస్టుల్లో 1100 పరుగులు సాధించాడు. ఇక ఓవరాల్గా 32 టెస్టుల్లో 1893 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్గా విదేశీ గడ్డపై తొలి టెస్టు సిరీస్ను గెలుచుకోవడానికి ఇదే మంచి అవకాశం. ఇటీవలే స్వదేశంలో ఆఫ్గన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ను గిల్ సారథ్యంలోనే టీమిండియా నెగ్గింది. ఇక జైస్వాల్ ఫామ్ మాత్రం కాస్త ఆందోళన కలిగిస్తోంది. గత 8 ఇన్నింగ్స్ల్లో కేవలం ఒక్క అర్ధసెంచరీ మాత్రమే సాధించాడు. ఆ ఒక్కటి కూడా గతేడాది న్యూఢిల్లీ వేదికగా వెస్టిండీస్పై సాధించాడు. తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్లో రాహుల్తో సమన్వయలోపంతో రనౌట్ అయిన జైస్వాల్ రెండో ఇన్నింగ్స్లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.కేఎల్ రాహుల్, కుల్దీప్ గైర్హాజరు తొలి టెస్టులో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్న సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ శుక్రవారం ప్రాక్టీస్కు దూరంగా ఉండిపోయాడు. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కండరాలు పట్టేసి ఇబ్బంది పడిన రాహుల్... రెండో టెస్టులో భారీ ఇన్నింగ్స్ ఆడాలని భావిస్తున్నాడు. లంకతో మొదటి టెస్టులో అతడు వరుసగా 82, 35 పరుగులు చేశాడు. గతంలోనే శ్రీలంకలో పర్యటించిన భారత జట్టులో సభ్యుడైన రాహుల్... తన అనుభవాన్నంతా రంగరించి స్పిన్ ఉచ్చును చేధించడంతోనే భారత్ తొలి మ్యాచ్లో సులువుగా గెలుపొందింది. అతడితో పాటు తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ప్రాక్టీస్ చేయలేదు. ఆటగాళ్లు కసరత్తులు చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న కుల్దీప్... అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయకుండానే మైదానాన్ని వీడాడు. సారాంశ్ జైన్ కొన్ని ఓవర్లు బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. అతడి బౌలింగ్లో పంత్, గిల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ‘రాహుల్, కుల్దీప్ విశ్రాంతి తీసుకుంటున్నారు’ అని బహుతులే పేర్కొన్నాడు. Read: లైవ్ మ్యాచ్.. ప్రత్యర్థి గూబ గుయ్మనిపించిన మెస్సీ! -
IND vs SL: శుబ్మన్ గిల్ కీలక నిర్ణయం
గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించినప్పటికి కెప్టెన్ శుబ్మన్ గిల్ మాత్రం పేలవ ఆట తీరుతో నిరాశపరిచాడు. గిల్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ (16, 8) శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్లోనే అవుటై నిరాశపరిచాడు. ఈ క్రమంలో లెఫ్టార్మ్ స్పిన్ వీక్నెస్ను అధిగమించేందుకు గిల్ నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. రెండో టెస్టు కోసం ఇప్పటికే కొలంబో చేరుకున్న భారత జట్టు తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టింది. రాహుల్, కుల్దీప్ వంటి సీనియర్ క్రికెటర్లు విశ్రాంతి తీసుకున్నప్పటికి గిల్ మాత్రం నెట్స్లో చెమట్చోడ్చాడు. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో మానవ్ సుతార్, రవీంద్ర జడేజాతో పాటు స్థానిక లెఫ్టార్మ్ స్పిన్నర్ల బౌలింగ్ను గిల్ సుదీర్ఘంగా ఎదుర్కొన్నాడు. గిల్ తాజా నెట్ సెషన్కు సంబంధించిన వివరాలను భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే ప్రెస్కాన్ఫరెన్స్లో వెల్లడించారు.భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే ఆ రోజు గిల్ నెట్ సెషన్కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ, ఆ కుడిచేతి వాటం బ్యాటర్ కొలంబో పరిస్థితులకు అనుగుణంగా మారడానికి ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు."గిల్ బ్యాటింగ్ శైలి గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు స్వేచ్ఛగా పరుగులు సాధించే బ్యాటర్. పిచ్ స్వభావం, బౌన్స్ అంచనా వేస్తూ కొలంబో పరిస్థితులకు అలవాటు పడేందుకే కాస్త ఎక్కవ సమయం నెట్స్లో గడిపాడు. ఇందులో ఎలాంటి ప్రత్యేకమైన ప్రణాళికలేమీ లేవు" అని బహుతులే పేర్కొన్నాడు. కాగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్.. కొలంబోలోనూ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. -
రిటైర్మెంట్ ప్రకటించిన గిల్ సహచరుడు
టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ సహచరుడు, పంజాబ్ జట్టు సీనియర్ వికెట్ కీపర్ గితాన్ష్ ఖేరా దేశవాళీ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2017లో గిల్ పంజాబ్ తరఫున లిస్ట్-ఏ క్రికెట్లో అరంగేట్రం చేసిన సమయంలో ఆ జట్టు వికెట్ కీపర్గా గితాన్ష్ ఖేరానే ఉన్నాడు. 14 ఏళ్ల పాటు డొమెస్టిక్ క్రికెట్ ఆడినప్పటికీ గితాన్ష్ ఖేరాకు జాతీయ జట్టుకు ఆడే అవకాశం రాలేదు. కాగా గితాన్ష్ ఖేరా గురువారం సాయంత్రం తన ఇన్స్టాగ్రామ్ వేదికగా దేశవాళీ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు భావోద్వేగ ప్రకటన చేశాడు. "అందరిలాగే క్రికెట్లో నేను జాతీయ జట్టుకు ఆడాలని కలలు కన్నా. కానీ మన జీవితం ప్లాన్ చేసినట్లుగా ఎప్పుడు ఉండదు. అంతర్జాతీయంగా దేశానికి ఆడాలన్న కల నెరవేరకపోయినప్పటికీ, డొమెస్టిక్ క్రికెట్ ద్వారా ఎంతో మంది స్నేహితులను, లెక్కలేనన్ని జ్ఞాపకాలను సంపాదించుకున్నందుకు గర్వపడుతున్నా. దేశవాళీ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్న తరుణంలో ఆటపై నా ప్రేమ మాత్రం మునుపెన్నడూ లేనంత బలంగా ఉంది" అని రాసుకొచ్చాడు.2004లో అండర్-15 విభాగంలో పంజాబ్కు ప్రాతినిధ్యం వహించిన గితాన్ష్ ఖేరా రెండు దశాబ్ధాల్లో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్తో పాటు శుబ్మన్ గిల్, అభిషేక్ శర్మలతో కలిసి ఆడడం గొప్ప విషయమని పేర్కొన్నాడు. ఇక పంజాబ్ జట్టు తరఫున అన్ని ఫార్మాట్లు కలిపి 100కు పైగా సీనియర్ మ్యాచ్లాడే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు.Photo Credit: Instagramజూనియర్ క్రికెటర్గా కెరీర్ ఆరంభించిన గితాన్ష్ ఖేరా 2010లో పంజాబ్ సీనియర్ జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. తనకెరీర్లో 56 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన గితాన్ష్ 34 సగటుతో 2,515 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక వికెట్ కీపర్గా 165 డిస్మిసల్స్ చేశాడు. ఇక లిస్ట్-ఏ క్రికెట్లో 40 మ్యాచ్లాడి 44 సగటుతో 1,017 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలు, మూడు ఫిఫ్టీలున్నాయి. ఇక 11 టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడిన గితాన్ష్ 96 పరుగులు చేశాడు. ఇక వైట్బాల్ క్రికెట్లో కీపర్గా 81 డిస్మిసల్స్ చేశాడు. గితాన్ష్ చివరిసారిగా జనవరి 2024లో పంజాబ్కు ప్రాతినిధ్యం వహించాడు.35 ఏళ్ల వయసున్న గితాన్ష్ ఖేరాకు రిటైర్మెంట్ తర్వాత చాలా మార్గాలు ఉన్నాయి. ప్రస్తుతానికి, అతను తన భవిష్యత్తు గురించి అధికారికంగా మాట్లాడకపోయినప్పటికీ, క్రికెట్లో సంబంధాలు కొనసాగించాలనుకుంటే కామెంటేటర్గా పనిచేయడం, అంపైర్ లేదా కోచ్గా మారడం వంటి అవకాశాలున్నాయి.Read: ‘తులసి వనంలో గంజాయి మొక్క’.. పోలికలు అవసరమా! -
కోహ్లి, రోహిత్ను వెనక్కి నెట్టిన గిల్
శ్రీలంకపై తొలి టెస్టులో భారత్కు 165 పరుగుల భారీ విజయాన్నందించిన కెప్టెన్ శుభ్మన్ గిల్ తన ఖాతాలో మరో అరుదైన రికార్డును వేసుకున్నాడు. తొలి 10 టెస్టుల్లో అత్యధిక విజయాలు (6) సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో విరాట్ కోహ్లి (5), రోహిత్ శర్మ (5)ను వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో ఎంఎస్ ధోని 7 విజయాలతో అగ్రస్థానంలో ఉండగా.. గిల్, సౌరవ్ గంగూలీ (6)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు.గిల్ కెప్టెన్సీ ప్రయాణంశుభ్మన్ గిల్ 2025లో ఇంగ్లండ్ టెస్టు సిరీస్తో భారత టెస్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. ఆ సిరీస్లో భారత్ రెండు టెస్టులు గెలిచింది. అనంతరం వెస్టిండీస్పై 2-0 సిరీస్ విజయం, ఆతర్వాత ఆఫ్ఘనిస్తాన్పై ఏకైక టెస్టులో విజయం సాధించాడు. తాజాగా శ్రీలంకపై గాలే టెస్టులో విజయం సాధించడంతో అతని ఖాతాలో ఆరో విజయం చేరింది.గిల్ తాజా విజయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. భారత్కు ఇది 600వ టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా గిల్ చరిత్రలో తన పేరును ప్రత్యేకంగా లిఖించుకున్నాడు.ఈ గెలుపుతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను కూడా మెరుగుపర్చుకుంది. తొలి టెస్టుకు ముందు భారత్ PCT 48.15%గా ఉండగా, శ్రీలంకపై విజయం తర్వాత అది 53.55%కి పెరిగింది. PCT శాతం పెరిగినప్పటికీ భారత్ ఐదో స్థానంలోనే కొనసాగుతోంది. నాలుగో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్తో భారత్కు ఇంకా గణనీయమైన తేడా ఉంది.ఈ సైకిల్లో భారత్ ఫైనల్ రేసులో నిలవాలంటే మిగిలిన 8 మ్యాచ్ల్లో భారీగా విజయాలు సాధించాల్సి ఉంటుంది. భారత్ తదుపరి శ్రీలంకతో మరో టెస్టు, న్యూజిలాండ్తో రెండు టెస్టులు, ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం 6 టెస్టులు గెలిస్తే భారత్కు ఫైనల్ చేరే అవకాశాలు బలపడతాయి.ఆధిక్యంలోకి వెళ్లిన భారత్రెండు మ్యాచ్ల సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న భారత్ తొలి టెస్ట్ విజయంతో సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగస్టు 23న కొలంబోలో ప్రారంభం కానుంది.చెలరేగిన పడిక్కల్, సుతార్లంకపై తొలి టెస్ట్ విజయంలో దేవదత్ పడిక్కల్, మానవ్ సుతార్ కీలకపాత్రలు పోషించారు. బ్యాటింగ్లో పడిక్కల్ (167, 44), బౌలింగ్లో సుతార్ (10 వికెట్లు) చెలరేగిపోయారు. సుతార్ రెండో ఇన్నింగ్స్లో (6-55) అద్భుతంగా బౌలింగ్ చేసి, 372 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకను 206 పరుగులకే ఆలౌట్ అయ్యేలా చేశాడు. -
అతడొక అద్భుతం.. భారత క్రికెట్ను ఏలుతాడు: గిల్
గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-0 ఆధిక్యంలో టీమిండియా వెళ్లింది. ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో భారత్ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్లో 462 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఫస్ట్ డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్(167 పరుగులు) అద్భుత సెంచరీతో కదం తొక్కాడు. అనంతరం బౌలింగ్లో భారత స్పిన్నర్లు మ్యాజిక్ చేశారు. ముఖ్యంగా యువ స్పిన్నర్ మానవ్ సుతార్ తన బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. 4 వికెట్ల తీసి లంక జట్టును దెబ్బ తీశాడు. ఫలితంగా ఆతిథ్య జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్కు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటైనప్పటికి.. తొలి ఇన్నింగ్స్ లభించిన ఆధిక్యాన్ని జోడించి శ్రీలంక ముందు 372 పరుగుల టార్గెట్ను ఉంచింది. ఈ లక్ష్యాన్ని చేధించలేక శ్రీలంక 206 పరుగులకు కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో మానవ్ సుతార్ తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. ఈ రాజస్తాన్ స్పిన్నర్ 6 వికెట్లు పడగొట్టి ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. ఈ నేపథ్యంలో మానవ్ సుతార్పై భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు."మానవ్ ఒక అద్భుతమైన స్పిన్నర్. భారత్ తరపున తొలి మ్యాచ్(అఫ్గానిస్తాన్)లోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఈ మ్యాచ్లో కూడా అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. అతడు కచ్చితంగా భారత జట్టుకు సుదీర్ఘకాలం ప్రాతినిథ్యం వహిస్తాడు. పడిక్కల్ గురుంచి ప్రత్యేకంగా చెప్పాలి. అతడు రెండు ఇన్నింగ్స్లలోనూ అత్యుత్తమంగా రాణించాడు. అతడి బ్యాటింగ్ చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది. తొలి ఇన్నింగ్స్లో కేవలం సెంచరీ చేయడమే కాకుండా, ఆ తర్వాత కూడా బాధ్యతాయుతంగా ఆడి జట్టును మంచి పొజిషేన్లో నిలిపాడు. రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్లను అతడు ఎదుర్కొన్న తీరు, ఆధిపత్యం చెలాయించిన విధానం మ్యాచ్ మొత్తానికే హైలైట్ అని గిల్ పేర్కొన్నాడు.అదేవిధంగా రెండో ఇన్నింగ్స్లో వరుసగా వికెట్లు కోల్పోవడంపై గిల్ స్పందించాడు. "వాతావరణ పరిస్థితుల వల్ల 4వ, 5వ రోజుల్లో ఎన్ని ఓవర్ల ఆట సాధ్యమవుతుందో తెలియదు. అందుకు దూకుడుగా ఆడి ప్రత్యర్ది ముందు 400కు పైగా లక్ష్యాన్ని ఉంచాలని భావించాం. ఈ క్రమంలోనే వరుసగా వికెట్లు కోల్పోయాం. దీని గురుంచి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేము అప్పటికే మ్యాచ్పై పట్టు సాధించాం. ఇక . 600వ చారిత్రక టెస్టులో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. డబ్ల్యూటీసీ రేసులో ప్రతీ గెలుపు మాకు కీలకమని" శుబ్మన్ వ్యాఖ్యనించాడు. -
లంకపై విజయం.. గంభీర్ ప్లాన్ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి సెషన్లో 20 ఓవర్ల పాటు ఒక్క వికెట్ కూడా పడకపోగా, లంక బ్యాటర్లు జిడ్డు ఆటను ప్రదర్శించారు. ముఖ్యంగా కెప్టెన్ ధనంజయ డిసిల్వా, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దినూషలు మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్కు 95 పరుగులు జోడించారు. ఈ నేపథ్యంలోనే డ్రెస్సింగ్ రూమ్ నుంచి టీమిండియా ఆటను గమనిస్తూ వచ్చిన గంభీర్ బౌలర్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. 30 ఓవర్ల పాటు భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంపై గంభీర్ ఆగ్రహించాడు. దీంతో లంక 112 పరుగుల వద్ద ఉన్నప్పుడు డ్రింక్స్ బ్రేక్ రాగా, ఆ సమయంలో గంభీర్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి డగౌట్కు వచ్చి మాస్టర్ ప్లాన్ వివరించాడు. గంభీర్ ఇచ్చిన ప్లాన్ ఆటను పూర్తిగా మార్చేయడంతో ఆటకు అదే టర్నింగ్ పాయింట్ అయింది.సిరాజ్ను పిలిచిన గంభీర్ బౌలింగ్ ప్లాన్ను వివరించాడు. పేస్ అటాకింగ్ను పక్కనబెట్టి, పూర్తిగా స్పిన్నర్లతో బౌలింగ్ చేయించమని సిరాజ్కు వివరించాడు. ఈ విషయాన్ని వెంటనే కెప్టెన్ గిల్కు చేరవేయాలని తెలిపాడు. గంభీర్ సలహాను పాటించిన మరుక్షణమే టీమిండియాకు ఫలితం రావడం విశేషం. 94 పరుగుల జోడించి బలపడుతున్న ధనంజయ, దినూష జోడిని జడేజా విడదీశాడు. అలా టీమిండియా మళ్లీ విజయం ట్రాక్ ఎక్కినట్లయింది. మరో ఎండ్ నుంచి మానవ్ సుతార్ కూడా తన బౌలింగ్తో ముప్పతిప్పలు పెట్టడంతో లంక కష్టాలు రెట్టింపు అయ్యాయి. చివరకు 206 పరుగుల వద్ద లంక తమ ఇన్నింగ్స్ను ముగించడంతో 165 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది.🚨Gautam Gambhir Gives Mohammed Siraj a Bowling Plan to Break Sri Lanka’s Partnership🚨Indian bowlers are struggling to take wickets on the morning of Day 5, as Sri Lankan batters Dhananjaya de Silva and Sonal Dinusha are batting strongly and building a solid partnership.… pic.twitter.com/Bu6YQa8DXD— Central Cricket (@arshdeep3444) August 19, 2026చదవండి: పాక్ జట్టును అవమానించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్! -
శ్రీలంకను మట్టికరిపించిన టీమిండియా.. ఘన విజయం
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును ఏకంగా 165 పరుగుల తేడాతో మట్టికరిపించింది. గాలెలో 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. 206 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకు భారీ విజయం సాధ్యమైంది. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ ఆరు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో టీమిండియా రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. అదే విధంగా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 ఫైనల్ రేసులో కీలక ముందడుగు వేసింది. కాగా రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గాలె స్టేడియంలో శనివారం తొలి టెస్టు మొదలైంది.పడిక్కల్ సెంచరీతో..టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వన్డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ భారీ శతకం (167)తో చెలరేగగా.. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంకను 284 పరుగులకే కట్టడి చేసింది.అయితే, రెండో ఇన్నింగ్స్లో రిషభ్ పంత్ హాఫ్ సెంచరీ (66)తో రాణించగా.. భారత్ 193 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో... తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం లభించిన కారణంగా శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.ధనంజయ, దినుష పోరాటంఈ నేపథ్యంలో మంగళవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. టాపార్డర్లో ఓపెనర్లు నిశాన్ మధుష్క (6), లాహిరు ఉదార (16)తో పాటు.. అనూహ్య రీతిలో అరంగేట్రం చేసిన వన్డౌన్ బ్యాటర్ పసిందు సూరియబండారా (0) పూర్తిగా విఫలమయ్యాడు.సీనియర్ బ్యాటర్ కమిందు మెండిస్ (2) కూడా చేతులెత్తేశాడు. ఇలాంటి తరుణంలో కెప్టెన్ ధనంజయ డి సిల్వ, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో సొనాల్ దినుష పట్టుదలగా నిలబడ్డారు. బుధవారం నాటి ఐదో రోజు ఆటలో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని భారత బౌలర్ల సహనాన్ని వీరిద్దరు పరీక్షించారు.జడ్డూ మ్యాజిక్ఈ క్రమంలో రవీంద్ర జడేజా ధనంజయ డి సిల్వ (59)ను అవుట్ చేసి బ్రేక్ ఇవ్వగా.. ప్రసిద్ కృష్ణ నిరోషన్ డిక్వెల్లా (10)ను అవుట్ చేశాడు. దీంతో భోజన విరామ సమయానికి శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.India needed a way through, and Ravindra Jadeja found it. 🤩 Watch #SLvIND, 1st Test | Day 5, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/tCm8qzqmBb— Sony Sports Network (@SonySportsNetwk) August 19, 2026ఆరేసిన మానవ్ సుతార్అయితే, లంచ్ తర్వాత కూడా సొనాల్ దినుష పట్టువీడకుండా క్రీజులో పాతుకుపోయాడు. సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ మానవ్ సుతార్ అతడికి ఊహించని షాకిచ్చాడు. 76వ ఓవర్లో తొలి బంతిని లెగ్ స్టంప్ అవుట్సైడ్ దిశగా సంధించగా.. షాట్ ఆడే క్రమంలో దినుష (84) విఫలమయ్యాడు. ఈ క్రమంలో ధ్రువ్ జురెల్ క్యాచ్ అందుకోగా.. టీమిండియా సంబరాలు అంబరాన్నంటాయి.Manav Suthar cleaned up the tail in a flash! ⚡Three wickets in one over to put the finishing touches on a sensational bowling effort. Watch #SLvIND, 1st Test | Day 5, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV… pic.twitter.com/LwSc4NGRW2— Sony Sports Network (@SonySportsNetwk) August 19, 2026ఇక ఆ తర్వాత మరుసటి బంతికే మానవ్ సుతార్ ప్రభాత్ జయసూర్య (0)ను బౌల్డ్ చేశాడు. తర్వాతి ఓవర్లో లాహిరు కుమార (0)ను కూడా పెవిలియన్కు పంపాడు. ఇక 78వ ఓవర్లో నాలుగో బంతికి కేశారా నువాంత (20)ను కూడా బౌల్డ్ చేసిన మానవ్ సుతార్ తన ఆరో వికెట్తో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.ఇక తొలి ఇన్నింగ్స్లో మానవ్ సుతార్ నాలుగు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. తద్వారా ఈ మ్యాచ్లో మొత్తంగా పది వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్. ఇదిలా ఉంటే.. టీమిండియా తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. కాగా టెస్టుక్రికెట్లో భారత్కు ఇది 600వ మ్యాచ్ కావడం విశేషం.శ్రీలంక వర్సెస్ భారత్ తొలి టెస్టు👉వేదిక: గాలె ఇంటర్నేషనల్ స్టేడియం, గాలె.👉టాస్: టీమిండియా.. బ్యాటింగ్సంక్షిప్త స్కోర్లు👉భారత్: 462 &193👉శ్రీలంక: 284 &206👉ఫలితం: శ్రీలంకపై 165 పరుగుల తేడాతో భారత్ జయభేరి👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: దేవదత్ పడిక్కల్ (167 & 44).చదవండి: వివాదంలో రింకూ సింగ్! -
తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం
గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 165 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 77.4 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. సోనాల్ దినూష (84) టాప్ స్కోరర్గా నిలవగా, ధనంజయ డిసిల్వా (59) అర్ధసెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ ఆరు వికెట్లతో చెలరేగగా, ప్రసిధ్ క్రిష్ణ రెండు, జడేజా, సిరాజ్లు చెరో వికెట్ పడగొట్టారు. టెస్టులో రెండు ఇన్నింగ్స్లు కలిపి మానవ్ సుతార్ పది వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ విజయంతో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుంది.సంక్షిప్త స్కోర్లుభారత్ 462 & 193 ఆలౌట్శ్రీలంక 284 & 206 ఆలౌట్తొమ్మిదో వికెట్ డౌన్అంకతముందు మానవ్ సుతార్ ఐదు వికెట్లతో చెలరేగడంతో లంక 199 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. విజయానికి భారత్ ఒక్క వికెట్ దూరంలో ఉంది.ఎనిమిదో వికెట్ డౌన్మానవ్ సుతార్ బౌలింగ్లో ప్రబాత్ జయసూరియా గోల్డెన్ డకౌట్ కావడంతో శ్రీలంక 199 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అంతకముందు ప్రసిధ్ క్రిష్ణ బౌలింగ్లో డిక్వెల్లా వెనుదిరిగాడు. భారత్ విజయానికి మరో 2 వికెట్లు అవసరం.లంచ్ తర్వాత మొదలైన ఆటశ్రీలంక స్కోరు: 196/6(74)దినుష 81, కేశారా 13 పరుగులతో ఉన్నారులంచ్ విరామంలంచ్ విరామ సమయానికి శ్రీలంక 67 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. సోనాల్ దినూష (65 బ్యాటింగ్) ఒంటరి పోరాటం చేస్తుండగా, కెషారా నువంతా 8 పరుగులతో ఆతడికి సహకరిస్తున్నాడు. ప్రసిధ్ క్రిష్ణ, మానవ్ సుతార్ రెండు వికెట్లు తీయగా, జడేజా ఒక వికెట్ పడగొట్టాడు. భారత్ విజయానికి మరో నాలుగు వికెట్ల దూరంలో ఉంది. ఇంకా రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉన్న లంక గెలుపుకు 197 పరుగులు అవసరం. ఆరో వికెట్ డౌన్10 పరుగులు చేసిన నిరోషన్ డిక్వెల్లా ప్రసిధ్ బౌలింగ్లో వెనుదిరగడంతో లంక 156 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. దినూష (54) ఒంటరిపోరాటం చేస్తున్నాడు. భారత్ విజయానికి నాలుగు వికెట్ల దూరంలో ఉంది.ఐదో వికెట్ డౌన్జడేజా బౌలింగ్లో ధనంజయ డిసిల్వా (59) ఔట్ కావడంతో శ్రీలంక 142 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. భారత్ విజయానికి ఐదు వికెట్లు అవసరం కాగా, గెలుపుకు లంక 230 పరుగుల దూరంలో ఉంది.లంక బ్యాటర్ల అర్ధశతకాలులంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దినూషలు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ప్రస్తుతం లంక 4 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. లంక విజయానికి మరో 231 పరుగులు అవసరం.వంద పరుగుల మార్క్ దాటిన లంక372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక వంద పరుగుల మార్క్ను దాటింది. 43 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ధనంజయ (40), దినూష (33) క్రీజులో ఉన్నారు.ఐదోరోజు ఆట మొదలుగాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. ఈ నేపథ్యంలో ఐదో రోజు ఆట ప్రారంభం కాగా, భారత్ గెలుపుకు ఆరు వికెట్లు అవసరం. 372 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన లంక ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. కెప్టెన్ ధనంజయ డి సిల్లా 39 పరుగులు, సోనాల్ దినూష 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: IND vs SL: నాలుగో రోజు ఆట సాగిందిలా! -
నీకసలు ఏమైంది?.. బలహీనత మరోసారి బయటపడింది!
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 16 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తాజాగా రెండో ఇన్నింగ్స్లోనూ నిరాశపరిచాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా గిల్ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గాలె వేదికగా ఇరుజట్ల మధ్య శనివారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. మొదటి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌట్ అయింది.ఆ ముగ్గురూ రాణించారుఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ఆరో నంబర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (51) అర్ధ శతకాలతో రాణించగా.. వన్డౌన్లో వచ్చిన దేవదత్ పడిక్కల్ భారీ సెంచరీ (167)తో ఆకట్టుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో గిల్.. 28 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో కేవలం 16 పరుగులు చేశాడు.రెండుసార్లూ అతడి చేతిలోనే అవుట్లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో లాహిరు ఉదారకు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో ఈ నాలుగో నంబర్ బ్యాటర్.. 20 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులే చేయగలిగాడు. ఈసారి కూడా ప్రభాత్ జయసూర్య బౌలింగ్లోనే అవుటయ్యాడు. వికెట్ల ముందు దొరికిపోయి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.ఇలా అయితే కష్టమేఈ నేపథ్యంలో గిల్ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. స్పిన్ బౌలింగ్లోనే రెండుసార్లు అతడు విఫలమయ్యాడని.. గిల్ బలహీనత మరోసారి బయటపడిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా గిల్ స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టకపోతే తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కాగా గిల్ చివరగా జూన్లో స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టులో సెంచరీ (126) బాదాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియాకు మంచి ఆధిక్యం లభించింది. మంగళవారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా లంచ్ బ్రేక్ సమయానికి భారత్.. నాలుగు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. -
IND vs SL: విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్
SL Vs IND 1st Test Day-4 Updates: గాలే వేదికగా శ్రీలంక, భారత్ మధ్య తొలి టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటైన టీమిండియా.. శ్రీలంకకు 372 పరుగుల టార్గెట్ విధించింది.గెలుపునకు 6 వికెట్ల దూరంలో భారత్శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్లో భారత్ గెలుపునకు 6 వికెట్ల దూరంలో ఉంది. 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో శ్రీలంక గెలవాలంటే చివరి రోజు 288 పరుగులు చేయాలి. ఇది అంతా సులువుగా జరిగే పని కాదు. భారత్ మాత్రం మరో 6 వికెట్లు తీస్తే విజయం సొంతం చేసుకుంటుంది. అయితే చివరి రోజు భారత గెలుపుకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో సోనల్ దినుష (25), కెప్టెన్ ధనంజయ డిసిల్వ (31) క్రీజ్లో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక21.4 ఓవర్: మానవ్ సుతార్ బౌలింగ్లో జురెల్కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్గా వెనుదిరిగిన లాహిరు ఉదార (16). శ్రీలంక స్కోరు: 47-4. సొనాల్ దినుష క్రీజులోకి రాగా.. ధనంజయ 19 పరుగులతో ఉన్నాడు.15 ఓవర్లలో శ్రీలంక స్కోరు: 33-3ఉదార 15, ధనంజయ 7 పరుగులతో ఉన్నారు. విజయానికి 339 పరుగుల దూరంలో శ్రీలంక.మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక10.4 ఓవర్: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించిన కమిందు మెండిస్. రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైన కమిందు. లంక స్కోరు: 21-3. ఉదార 11 పరుగులతో ఉండగా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ క్రీజులోకి వచ్చాడు.రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక7.2 ఓవర్: మానవ్ సుతార్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా పెవిలియన్ చేరిన పసిందు. అరంగేట్రంలోనే డకౌట్గా పసిందు. లంక స్కోరు 14-2. ఉదార 6 పరుగులతో ఉండగా.. కమిందు మెండిస్ క్రీజులోకి వచ్చాడు.తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక6.6: సిరాజ్ బౌలింగ్లో ప్రసిద్కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా వెనుదిరిగిన నిశాన్ మధుష్క (6). లంక స్కోరు 13-1 (7). విజయానికి ఇంకా 359 పరుగులు కావాలి. ఉదార 5 పరుగులతో ఉండగా.. పసిందు సూరియబండారా క్రీజులోకి వచ్చాడు.లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకఆరు ఓవర్లలో స్కోరు: 12-0ఉదార 4, నిశాన్ 6 పరుగులతో ఉన్నారు. విజయానికి ఇంకా 360 పరుగులు కావాలి.వర్షం వల్ల అంతరాయంశ్రీలంక లక్ష్య ఛేదనకు దిగాల్సి ఉండగా.. వాన వల్ల అంతరాయం కలిగింది193 పరుగులకు ఆలౌటైన టీమిండియాభారత్ రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటైంది. తద్వారా శ్రీలంక ముందు 372 పరుగుల టార్గెట్ను ఉంచింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్190 పరుగుల వద్ద భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో ధనంజయ డిసిల్వకు క్యాచ్ ఇచ్చి కుల్దీప్ యాదవ్ (5) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్188 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అశిత ఫెర్నాండో బౌలింగ్లో డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి మానవ్ సుతార్ (9) ఔటయ్యాడు.9 పరుగులు చేసిన జడేజాను లాహిరు కుమారా పెవిలియన్ చేర్చడంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 357 పరుగులుగా ఉంది.పంత్ (66) ఔట్66 పరుగులు చేసిన పంత్ కుమారా బౌలింగ్లో డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో టీమిండియా 174 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 352 పరుగులుగా ఉంది.సిక్సర్తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న పంత్లాహిరు కుమారా బౌలింగ్లో భారీ సిక్సర్ కొట్టిన పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 54 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న పంత్ ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. భారత్ ఆధిక్యం 336 పరుగులు.36 ఓవర్లలో టీమిండియా స్కోరు 151-5పంత్ 47, జడేజా 4 పరుగులతో ఉన్నారు. భారత్ ఆధిక్యం 329 పరుగులు.ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియాఅసితా ఫెర్నాండో బౌలింగ్లో నిరోషన్ డిక్విల్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ధ్రువ్ జురెల్ (7). క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా. టీమిండియా స్కోరు 120-5 (31). పంత్ 23 పరుగులతో ఉన్నాడు.లంచ్ తర్వాత మొదలైన ఆటలంచ్ విరామంగాలే టెస్టులో భాగంగా నాలుగో రోజు ఆటలో లంచ్ విరామ సమయానికి టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (21), ధ్రువ్ జురెల్ (5) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 294 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో రాణించిన పడిక్కల్ (44) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడగా, రాహుల్ (35) పర్వాలేదనిపించాడు. లంక బౌలర్లలో ప్రబాత్ జయసూరియా 2 వికెట్లు తీయగా, కెషారా, అశితా ఫెర్నాండో చెరో వికెట్ పడగొట్టారు.పడిక్కల్ ఔట్.. నాలుగో వికెట్ డౌన్టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్లో తడబడుతోంది. వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్లు చేజార్చుకుంటుంది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో పడిక్కల్ 44 పరుగుల వద్ద కెషారా నువంతా బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో భారత్ 111 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 289 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.మూడో వికెట్ కోల్పోయిన టీమిండియాఇన్నింగ్స్ 21వ ఓవర్లో శుబ్మన్ గిల్ (8) రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. పడిక్కల్ (35), పంత్ (1) పరుగుతో ఆడుతున్నారు.రెండో వికెట్ డౌన్65 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (35) రూపంలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రబాత్ జయసూరియా బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన రాహుల్ మిలన్ రత్ననాయకేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ 243 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.ఫిఫ్టీ మార్క్ దాటిన టీమిండియారెండో ఇన్నింగ్స్లో 14 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 30, పడిక్కల్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటివరకు భారత్ 237 పరుగుల ఆధిక్యంలో ఉంది.తొలి వికెట్ డౌన్గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో 178 పరుగుల ఆధిక్యంతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. అశితా ఫెర్నాండో బౌలింగ్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (1), పడిక్కల్ (10) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకు ఆలౌటైంది. దినూష (100) శతకంతో రాణించగా, నిరోషన్ డిక్వెల్లా (80) అర్ధసెంచరీ చేశాడు. ఒకదశలో లంక 90/5 వద్ద కష్టాల్లో ఉండగా వీరిద్దరు ఆరో వికెట్కు 36.1 ఓవర్లలో 146 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్కు 4, జడేజాకు 3 వికెట్లు దక్కాయి. భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 13 ఓవర్లు ఆడాల్సి ఉన్నా... వెలుతురులేమి వల్ల ఆట సాధ్యం కాలేదు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 460/9తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ మరో 4 బంతులాడి తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. -
‘వర్షం ముప్పు.. భారత్ గెలవాలంటే అదొక్కటే దారి’
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ 178 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి పట్టు బిగించింది. కానీ ఆటకు మరో రెండు రోజులు మాత్రమే ఉండడం, వర్షం అంతరాయం కలిగిస్తుండడంతో టీమిండియా మ్యాచ్ గెలుస్తుందా లేక డ్రాగా ముగుస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. అయితే భారత్ ఈ మ్యాచ్ గెలవాలంటే నాలుగో రోజు ఆటలో వీలైనంత వేగంగా ఆడాల్సి ఉంటుందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు. గాలేలో వాతావరణ పరిస్థితులు మారుతున్న తరుణంలో భారత్ 40 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి లంక ఎదుట సుమారు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే బాగుంటుందని తెలిపాడు. ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. "తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 178 పరుగులకు మరో 172 పరుగులు జోడిస్తే 350 పరుగుల దాకా వస్తాయి. మ్యాచ్కు వర్షం అంతరాయం ఉంటుంది కాబట్టి 40 ఓవర్లలో సాధ్యమైనంత ఎక్కువ పరుగులు ఓవర్కు ఐదు రన్స్ చొప్పున (దాదాపు 200 పరుగులు) చేస్తే బాగుంటుంది. ఆడుతున్నది టెస్టు మ్యాచ్ అయినప్పటికీ, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మన బ్యాటర్లు ఆటను టెస్టు నుంచి వన్డే గేర్కు మార్చుకోవాలి. ఓపెనర్లుగా వచ్చే జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్లో దూకుడు ప్రదర్శించాలి. టీ20 క్రికెట్ కాకపోయినా, కనీసం వన్డే తరహాలో కాస్త ఫాస్ట్గా ఆడేందుకు ప్రయత్నించాలి. నాలుగో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించకపోతే సమస్య లేదు. కానీ వర్షం పడితే మాత్రం భారత్కు దెబ్బ పడుతుంది. కాబట్టి వీలైనంత మేర ఫాస్ట్గా ఆడేందుకు యత్నించాలి. వర్షం పడే అవకాశం ఉండడంతో నేనైతే భారత్కు రెండో ఇన్నింగ్స్లో 40 ఓవర్లు ఇస్తాను. 150 నుంచి 175 పరుగులు చేశాకే ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయాలి. ఒకవేళ వర్షం పడకపోతే నాలుగో రోజు మిగిలిన 50 ఓవర్లు, చివరి రోజు 90 ఓవర్ల ఆట ఉంటుంది కాబట్టి టీమిండియా ఫలితం అనుకూలంగా లేదా ప్రతికూలంగా వచ్చేందుకు కూడా అవకాశముంది." అని ఆకాశ్ చోప్రా వెల్లడించాడు.Read: Virat Kohli: 18 ఏళ్ల ప్రయాణంలో 18 అద్భుత క్షణాలు -
IND vs SL: రెండంటే రెండే పరుగులు.. ఇదేం వ్యూహం?
గాలె వేదికగా శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. ఆట మొదలైన తొలి రోజు నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరిచారు. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్లో భారత్ 462 పరుగులు చేయగలిగింది.పడిక్కల్ భారీ శతకంఇందులో వన్డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ది కీలక పాత్ర. ఈ కర్ణాటక స్టార్ మొత్తంగా 230 బంతులు ఎదుర్కొని 167 పరుగులు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇక పడిక్కల్ భారీ శతకానికి తోడు.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ఆరో నంబర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీ (51)లతో ఆకట్టుకున్నారు.వాన వల్ల అంతరాయంమిగిలిన వారిలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 32, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 39, ఆల్రౌండర్ మానవ్ సుతార్ 24 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఇదిలా ఉంటే.. ఆదివారం నాటి రెండో రోజు ఆటకు పదే పదే వర్షం అంతరాయం కలిగించింది. ఈ క్రమంలో కేవలం 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా.. రెండో రోజు ఆట పూర్తయ్యే సమయానికి భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది.ఇక సోమవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా ఓవర్నైట్ స్కోరుకు కేవలం మరో రెండు పరుగులు జతచేసి.. 462 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ టీమిండియా నాయకత్వ బృందం నిర్ణయాన్ని తప్పుబట్టాడు.ఎందుకిలా చేశారు?‘‘మూడో రోజు ఉదయం ఇద్దరు టెయిలెండర్లను బ్యాటింగ్కు పంపాల్సిన అవసరం ఏముంది? మీరు ఎందుకిలా చేశారు?’’ అని హెడ్కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శుబ్మన్ గిల్లను ఎక్స్ వేదికగా దొడ్డ గణేశ్ ప్రశ్నించాడు. కాగా రెండో రోజు పటిష్ట స్థితిలో నిలిచిన టీమిండియా ఆట ముగిసే సమయానికి ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తుందని అంతా భావించారు.అయితే, మూడోరోజు ఆట ఆరంభంలో భారత టెయిలెండర్లు కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ బ్యాటింగ్కు వచ్చి.. తమ ఓవర్నైట్ స్కోరుకు తలా ఒక పరుగు చేశారు. కుల్దీప్ 13 పరుగులతో అజేయంగా నిలవగా.. ప్రసిద్ రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పదో వికెట్గా వెనుదిరిగాడు.బౌలర్లకు మరింత ఉపయోగకరంగా ఉండేదినిజానికి రెండో రోజే టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఉంటే.. సోమవారం ఉదయమే లంక బ్యాటింగ్కు దిగేది. అప్పుడు పిచ్ పరిస్థితులను భారత బౌలర్లు మరింత సద్వినియోగం చేసుకునే వారని.. దొడ్డ గణేశ్ అభిప్రాయపడ్డాడు. టెయిలెండర్లతో సమయం వృథా చేయకుండా.. ముందుగానే డిక్లేర్ చేసి బాగుండేదని పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే.. భోజన విరామ సమయానికి శ్రీలంక 28 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 99 పరుగులే చేసింది. భారత బౌలర్లలో సిరాజ్ ఒకటి.. మానవ్ సుతార్ రెండు, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: పంత్ చేయలేనిది.. బట్లర్ చేశాడు.. సంతోషం -
'నమ్మినందుకు ఇరగదీస్తున్నాడు.. గిల్కు క్రెడిట్ ఇవ్వాల్సిందే'
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత స్పిన్నర్ మానవ్ సుతార్ తనకు అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టాడు. మ్యాచ్లో ఇప్పటికే మానవ్ సుతార్ రెండు కీలక వికెట్లు తీశాడు. 27 పరుగులతో నిలకడగా ఆడుతున్న లాహిరు ఉడారాను బోల్తా కొట్టించిన మానవ్ సుతార్ ఆ వెంటనే ఇన్ఫామ్ బ్యాటర్ దినేశ్ చందిమల్ను తెలివిగా బుట్టలో వేసుకున్నాడు. ‘బిగ్ స్పిన్నర్ అవుతాడు’ఈ నేపథ్యంలో మానవ్ సుతార్పై టీమిండియా మాజీ క్రికెటర్లు అజయ్ జడేజా, అజింక్య రహానేలు ప్రశంసల జల్లు కురిపించారు. తొలి టెస్టుకు ఈ ఇద్దరు కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్నారు. చందిమల్ను ఔట్ చేసిన తర్వాత అజయ్ జడేజా మాట్లాడుతూ.. "టీమిండియా బిగ్ స్పిన్నర్ అయ్యేందుకు మానవ్ సుతార్కు అన్ని అర్హతలు ఉన్నాయి. బంతిని టర్న్ చేయడంలో అతడి సామర్థ్యం అసాధారణమైనది. దీంతో లంక బ్యాటర్లు అతడిని ఎదుర్కోవడానికి తెగ ఇబ్బంది పడుతున్నారు. మానవ్ సుతార్పై నమ్మకముంచి అతడికి అవకాశం కల్పించిన కెప్టెన్ శుబ్మన్ గిల్కు క్రెడిట్ ఇవ్వాల్సిందే" అని చెప్పుకొచ్చాడు. అజయ్ జడేజా వ్యాఖ్యలను రహానే సమర్ధించాడు. ఆ ఇద్దరిని కలగలిపి.."జడేజా భాయ్, నేను మీ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. టెస్టు క్రికెట్లో టీమిండియాకు మ్యాచ్ విన్నర్గా మారే సత్తా మానవ్ సుతార్కు ఉంది. లంక పిచ్లపై అతడు అద్భుతమైన టర్న్ను రాబడుతున్నాడు. అతడి బౌలింగ్లో జడేజాలో ఉండే కచ్చితత్వం, అశ్విన్ లాగా బంతిని టర్న్ చేయడం లాంటి రెండు సామర్థ్యాలు ఒకేసారి ఉండడం సానుకూలాంశం. భవిష్యత్తులో భారత క్రికెట్లో మానవ్ సుతార్ కీలక పాత్ర పోషించనున్నాడు" అని రహానే పేర్కొన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌటైంది. 460 పరుగుల ఓవర్నైట్ స్కోరుకు మరో రెండు పరుగులు జోడించిన అనంతరం చివరి వికెట్ కోల్పోయింది. దేవదత్ పడిక్కల్ (167) సెంచరీతో రాణించగా, ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) అర్ధశతకాలతో మెరిశారు. లంక బౌలర్లలో ప్రబాత్ జయసూరియా 4 వికెట్లు తీయగా, కేషారా నువంతా 3, అశితా ఫెర్నాండో 2 వికెట్లు పడగొట్టాడు.ఇక మూడో రోజు ఆటలో లంచ్ విరామ సమయానికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. సోనాల్ దినుష (14), నిరోషన్ డిక్వెల్లా (8) పరుగులతో క్రీజులో ఉన్నారు. మానవ్ సుతార్ రెండు, కుల్దీప్, జడేజా, సిరాజ్ తలా ఒక వికెట్ తీశారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండడంతో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. 🚨 Ajay Jadeja & Ajinkya Rahane Praise Manav Suthar During IND vs SL Live Match 🚨Ajay Jadeja 🗣️: Manav Suthar has the potential to become India’s next big Test spinner. His ability to turn the ball is exceptional, and the Sri Lankan batters are struggling against him. Credit… pic.twitter.com/BcZjpmepqy— Central Cricket (@arshdeep3444) August 17, 2026 Manav Suthar gets his second of the innings as Sri Lanka slip to three down on Day 3! 💥 Watch #SLvIND, 1st Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/FANRuZ6FDO— Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026Manav Suthar lures Chandimal into the edge, and Rishabh Pant makes no mistake behind the stumps! 🧤 Watch #SLvIND, 1st Test | Day 3, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #SLvIND #BeautifulGameOfTestCricket pic.twitter.com/Dsy7xz9Ciw— Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026Read: తప్పించాలని డిమాండ్లు; బ్యాట్తోనే జవాబు.. ఆ ఇద్దరి వల్లే! -
ఒంటిచేత్తో గిల్ స్టన్నింగ్ క్యాచ్.. షాకైన ఫ్యాన్స్!
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ అద్భుత క్యాచ్తో మెరిశాడు. గాలె వేదికగా సోమవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా.. ఒంటిచేత్తో గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసిపట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.462 ఆలౌట్ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా భారత్- శ్రీలంక మధ్య శనివారం తొలి టెస్టు మొదలైన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో 462 పరుగులు చేసింది. మూడో రోజు 460/9 ఓవర్నైట్ స్కోరుతో ఆట మొదలుపెట్టిన భారత్.. మరో రెండు పరుగులు జతచేసి ఆలౌట్ అయింది.అనంతరం శ్రీలంక బ్యాటింగ్కు దిగగా.. భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఓపెనర్లలో నిశాన్ ఫెర్నాండోను మహ్మద్ సిరాజ్ డకౌట్ చేయగా.. లాహిరు ఉదార (27)నున మానవ్ సుతార్ పెవిలియన్కు పంపాడు. వన్డౌన్లో వచ్చిన దినేశ్ చండిమాల్ (4) వికెట్ను కూడా మానవ్ తన ఖాతాలో వేసుకున్నాడు.Left hand, full stretch, absolute stunner from Shubman Gill! 🥵 Watch #SLvIND, 1st Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/xe2ldGxkpJ— Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ఇక కమిందు మెండిస్ నిలకడగా ఆడే ప్రయత్నం చేయగా.. గిల్ ఊహించని రీతిలో అతడిని పెవిలియన్కు పంపాడు. లంక ఇన్నింగ్స్లో 17వ ఓవర్లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బంతితో రంగంలోకి దిగాడు. కుల్దీప్ వేసిన ఫుల్ లెంగ్త్ డెలివరీని మెండిస్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా ఎక్స్ ట్రా కవర్ మీదుగా షాట్ బాదాడు. ఇంతలో తన ఫీల్డింగ్ పొజిషన్ నుంచి ఎడమవైపునకు డైవ్ చేసిన గిల్.. ఒంటిచేత్తో బంతిని అందుకున్నాడు.షాక్లో మెండిస్, అభిమానులుఈ క్రమంలో అదుపు తప్పి నేల మీద పడిపోయినప్పటికీ బంతిని మాత్రం చేజారనివ్వలేదు గిల్. దీంతో కమిందు మెండిస్తో పాటు..స్టేడియంలో ఉన్న శ్రీలంక అభిమానులు సైతం నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు. ఇదిలా ఉంటే.. సోమవారం నాటి మూడో రోజు ఆటలో భోజన విరామ సమయానికి శ్రీలంక.. 28 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది.లంక ఓపెనర్లలో నిశాన్ ఫెర్నాండో డకౌట్ కాగా.. లాహిరు ఉదార 27 పరుగులు చేశాడు. దినేశ్ చండిమాల్ (4) నిరాశపరచగా.. కమిందు మెండిస్ 14, కెప్టెన్ ధనంజయ డి సిల్వ 21 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో పేసర్ మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీయగా.. స్పిన్నర్లలో మానవ్ సుతార్ రెండు, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు.చదవండి: పంత్ చేయలేనిది.. బట్లర్ సాధించాడు.. సంతోషంThat was a blinder from Shubman Gill to dismiss Kamindu Mendis.. 👏👏 #SLVIND pic.twitter.com/Dl9BrLSpJQ— Nibraz Ramzan (@nibraz88cricket) August 17, 2026 -
SL Vs IND: శ్రీలంక ఆలౌట్.. మూడో రోజు ముగిసిన ఆట
గాలే వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. సోమవారం బ్యాటింగ్ మొదలుపెట్టిన శ్రీలంక 284 పరుగులకు ఆలౌట్ అయింది. దినుష సెంచరీ (100), నిరోషన్ డిక్విల్లా 80 పరుగులతో అదరగొట్టారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. అంతకు ముందు భారత్ 462 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇక లంక 284 పరుగులకు ఆలౌట్ కావడంతో.. భారత్కు 178 పరుగుల మేర భారీ ఆధిక్యం లభించింది. కాగా ముగిసిన మూడో రోజు ఆటలంక ఇన్నింగ్స్ తర్వాత ఆకాశం నల్లని మబ్బులతో నిండిపోయింది. దీంతోగ్రౌండ్ సిబ్బంది వచ్చి కవర్లతో పిచ్ను కప్పివేశారు. భారీ వర్షం పడే సూచనలు ఉండటంతో మూడో రోజు ఆటను అంతటితో ముగించేశారు.UPDATESసొనాల్ దినుష అవుట్సెంచరీ పూర్తి చేసుకున్న సొనాల్ జడ్డూ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో శ్రీలంక తొమ్మిదో వికెట్ కోల్పోగా.. అసిత ఫెర్నాండో క్రీజులోకి వచ్చాడు. లాహిరు కుమార 0 పరుగులతో ఉన్నాడు. లంక స్కోరు: 274-9.ఎనిమిదో వికెట్ డౌన్మానవ్ సుతార్ బౌలింగ్లో జురెల్కు క్యాచ్ ఇచ్చి ఎనిమిదో వికెట్గా వెనుదిరిగిన ప్రభాత్ జయసూర్య (10). లంక స్కోరు 274-8 (78). లాహిరు కుమార క్రీజులోకి రాగా.. దినుష 100 పరుగులతో ఉన్నాడు.శతక్కొట్టిన దినుష167 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్న దినుష. మానవ్ సుతార్ బౌలింగ్లో సింగిల్ తీసి టెస్టుల్లో తొలి శతకం నమోదు చేసిన దినుష.ఏడో వికెట్ డౌన్66.4: జడేజా బౌలింగ్లో గిల్కు క్యాచ్ ఇచ్చి ఏడో వికెట్గా పెవిలియన్ చేరిన కేశారా (2). లంక స్కోరు: 243-7. ప్రభాత్ జయసూర్య క్రీజులోకి రాగా.. దినుష 79 పరుగులతో ఆడుతున్నాడు.ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంకక్రీజులో పాతుకుపోయిన నిరోషన్ డిక్వెల్లా- సొనాల్ దినుష జోడీని ప్రసిద్ కృష్ణ విడదీశాడు. ప్రసిద్ బౌలింగ్లో రిషభ్ పంత్కు క్యాచ్ ఇచ్చిన డిక్వెల్లా ఆరో వికెట్గా పెవిలియన్ చేరాడు. 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అతడి స్థానంలో కేశారా నువాంత క్రీజులోకి రాగా.. దినుష 74 పరుగులతో ఆడుతున్నాడు. లంక స్కోరు: 236-6 (61.5). కాగా దినుషతో కలిసి డిక్విల్లా ఆరో వికెట్కు 146 పరుగులు జోడించాడు.టీ విరామానికి శ్రీలంక స్కోర్: 214/5టీ విరామ సమయానికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్రీజులో సోనల్(62), డిక్వెల్లా(71) ఉన్నారు. లంక ఇంకా తొలి ఇన్నింగ్స్లో భారత్ కంటే 248 పరుగులు వెనకబడి ఉంది.సొనాల్ అర్ధ శతకంకుల్దీప్ బౌలింగ్లో సింగిల్ తీసి సొనాల్ దినుష.. 92 బంతులలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంకస్కోరు: 184-5 (49)ఫిఫ్టీ బాదిన డిక్వెల్లానిరోషన్ డిక్వెల్లా 68 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 5 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం లంక 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దినూష (39) అతడికి సహకరిస్తున్నాడు.దినూష, డిక్వెల్లా నిలకడలంచ్ విరామం అనంతరం లంక ఆట తిరిగి గాడిన పడింది. మిడిలార్డర్లో దినూష (34), డిక్వెల్లా (38) నిలకడగా ఆడుతుండడంతో లంక జట్టు 150 పరుగుల మార్క్ను దాటింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్కు లంక మరో 311 పరుగులు వెనుకబడి ఉంది.👉 లంచ్ విరామం అనంతరం ఆట తిరిగి ప్రారంభమైంది. 30 ఓవర్లు ముగిసేసరికి లంక ఐదు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. దినుష (20), నిరోషన్ డిక్వెల్లా (12) పరుగులతో క్రీజులో ఉన్నారు.లంచ్ విరామంలంచ్ విరామ సమయానికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. సోనాల్ దినుష (14), నిరోషన్ డిక్వెల్లా (8) పరుగులతో క్రీజులో ఉన్నారు. మానవ్ సుతార్ రెండు, కుల్దీప్, జడేజా, సిరాజ్ తలా ఒక వికెట్ తీశారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండడంతో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. లంక కోల్పోయిన ఐదు వికెట్లలో నాలుగు స్పిన్నర్లకే దక్కడం విశేషం. శ్రీలంక మరో 363 పరుగులు వెనుకబడి ఉంది.ఐదో వికెట్ డౌన్26.1: రవీంద్ర జడేజా బౌలింగ్లో కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ధనంజయ డి సిల్వ (21). లంక స్కోరు 90-5 (26.1). సొనాల్ 13 పరుగులతో ఉండగా.. నిరోషన్ డెక్విల్లా క్రీజులోకి వచ్చాడు.నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక16.1: కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో శుబ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్గా వెనుదిరిగిన కమిందు మెండిస్ (14). క్రీజులోకి వచ్చిన సొనాల్ దినుష. 17 ఓవర్లలో లంక స్కోరు: 62-4. మూడో వికెట్ డౌన్53 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక కష్టాల్లో పడింది. 27 పరుగులు చేసిన లాహిరు ఉదారా మానవ్ సుతార్ బౌలింగ్లో జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫిఫ్టీ మార్క్ దాటిన లంకశ్రీలంక 50 పరుగుల మార్క్ను దాటింది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ, లాహిరు ఉదారా (27 బ్యాటింగ్), కమిందు మెండిస్ (12 బ్యాటింగ్) ఆడుతుండడంతో లంక కుదురుకుంది. ప్రస్తుతం 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది.రెండో వికెట్ డౌన్తొలి టెస్టులో శ్రీలంక 27 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. మానవ్ సుతార్ బౌలింగ్లో 4 పరుగులు చేసిన దినేశ్ చందిమల్ కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లంక 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది.👉6 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. లాహిరు ఉడారా (10), చందిమల్ (4) క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన లంకతమ ఇన్నింగ్స్ ఆరంభంలోనే శ్రీలంకకు షాక్ తగిలింది. సిరాజ్ బౌలింగ్లో ఓపెనర్ నిశాన్ ఫెర్నాండో డకౌట్ అయ్యాడు. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌటైంది. 460 పరుగుల ఓవర్నైట్ స్కోరుకు మరో రెండు పరుగులు జోడించిన అనంతరం చివరి వికెట్ కోల్పోయింది. దేవదత్ పడిక్కల్ (167) సెంచరీతో రాణించగా, ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) అర్ధశతకాలతో మెరిశారు. లంక బౌలర్లలో ప్రబాత్ జయసూరియా 4 వికెట్లు తీయగా, కేషారా నువంతా 3, అశితా ఫెర్నాండో 2 వికెట్లు పడగొట్టాడు.👉అయితే రెండో రోజు ఆటలో దాదాపు సగం వర్షార్పణమయింది. దీంతో 47 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అయితే మూడో రోజు మాత్రం ఉదయం నుంచి ఎండ కాస్తుండడం శుభ పరిణామం. అయితే మూడో రోజు నుంచి పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తే మాత్రం బ్యాటింగ్ కష్టంగా మారనుంది.👉ఇక తొలి రోజు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని మంచి పునాది వేసుకున్న టీమిండియా... రెండో రోజు దాన్ని మరింత బలపరుచుకుంది. ఓవర్నైట్ స్కోరు 288/2తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్... రెండో రోజు ఆట ముగిసే సమయానికి 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. వర్షం కారణంగా రెండో రోజు 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది.👉 సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్ (230 బంతుల్లో 167; 15 ఫోర్లు, 1 సిక్స్) క్రితం రోజు స్కోరుకు మరో 36 పరుగులు జోడించి అవుట్ కాగా... ధ్రువ్ జురేల్ (68 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. గాయం నుంచి కోలుకొని బ్యాటింగ్కు వచ్చిన కేఎల్ రాహుల్ (175 బంతుల్లో 82; 10 ఫోర్లు, 1 సిక్స్) మరో ఐదు పరుగులే చేశాడు.Innings Break!#TeamIndia post 4⃣6⃣2⃣ in the first innings 👏👏Devdutt Padikkal top-scores with 1⃣6⃣7⃣ 🫡Fifties from KL Rahul & Dhruv Jurel 👌Over to our bowlers 💪Scorecard ▶️ https://t.co/M9LVyCAp8y#SLvIND pic.twitter.com/cdMA1JyumY— BCCI (@BCCI) August 17, 2026 -
ముగిసిన రెండో రోజు ఆట.. భారత స్కోరెంతంటే?
Sri Lanka Vs India 1st Test Day-2 Live Updates: గాలే వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 460 పరుగుల చేసింది. క్రీజులో ప్రసిద్ద్ కృష్ణ(1), కుల్దీప్ యాదవ్(12) ఉన్నారు. వర్షం కారణంగా రెండో రోజు కేవలం 47 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. భారత బ్యాటర్లలో దేవ్దత్త్ పడిక్కల్(167) టాప్ స్కోరర్గా నిలవగా.. కేఎల్ రాహుల్(82), ధ్రువ్ జురెల్(51) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన టీమిండియాటీమిండియా వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. 447 పరుగుల వద్ద తొలుత సిరాజ్ (11) ఆతర్వాత సుతార్ (24) ఔటయ్యారు. ప్రస్తుతం భారత్ 9 వికెట్లు కోల్పోయింది.ఏడో వికెట్ కోల్పోయిన భారత్432 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో ధనంజయకు క్యాచ్ ఇచ్చి ధృవ్ జురెల్ (51) ఔటయ్యాడు. మానవ్ సుతార్ (21)కు జతగా సిరాజ్ క్రీజ్లోకి వచ్చాడు. టీమిండియా ఆరో వికెట్ డౌన్టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన రవీంద్ర జడేజా.. కేశర నువంత బౌలింగ్లో ఔటయ్యాడు. 101 ఓవర్లు ముగిసే సరికి భారత్ 6 వికెట్ల నష్టానికి 388 పరుగులు చేసింది.టీ బ్రేక్కు భారత్ స్కోరెంతంటే?రెండో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 364 పరుగుల స్కోర్ సాధించింది. క్రీజులో రవీంద్ర జడేజా(4), ధ్రువ్ జురెల్(19) ఉన్నారు.పడిక్కల్ అవుట్పడిక్కల్ రూపంలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 167 పరుగులు చేసిన పడిక్కల్.. ప్రభాత్ జైసూర్య బౌలింగ్లో స్టంపౌట్గా వెనుదిరిగాడు. 93 ఓవర్లకు భారత్ స్కోర్: 361/5. క్రీజులో జురెల్(19), జడేజా(1) ఉన్నారుభారత్ నాలుగో వికెట్ డౌన్భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 82 పరుగులు చేసిన రాహుల్.. నువాంత బౌలింగ్లో ఔటయ్యాడు. 87 ఓవర్లకు భారత్ స్కోర్: 335/4భారత్ మూడో వికెట్ డౌన్భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన పంత్.. కేశర నువాంత బౌలింగ్లో ఔటయ్యాడు. తొలి రోజు ఆటలో గాయపడిన కేఎల్ రాహుల్ తిరిగి బ్యాటింగ్కు వచ్చాడు. 81 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఆట తిరిగి ప్రారంభంఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. దీంతో రెండో రోజు ఆట తిరిగి ప్రారంభమైంది. 75 ఓవర్లకు టీమిండియా స్కోర్: 296/2. క్రీజులో పడిక్కల్(133), రిషబ్ పంత్(32) ఉన్నారు.మళ్లీ మొదలైన వర్షంమధ్యాహ్నం 2:11 గంటలు- రెండు గంటల విరామం తర్వాత వర్షం మళ్లీ మొదలైంది. ఆట దాదాపుగా ప్రారంభం కావాల్సిన సమయంలో వరుణుడు మరోసారి పలకరించాడు. దంచుతున్న వానలంచ్ విరామం అనంతరం కాసేపు ఎండ పలకరించినప్పటికీ, వరుణుడు మరోసారి విజృంభించాడు. దీంతో స్టేడియంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రెండో రోజు ఆట ప్రారంభమవుతుందా? లేదా అన్నది ఆసక్తిగా మారిపోయింది.శాంతించిన వరుణుడు..గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట మొదటి సెషన్ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. అయితే లంచ్ విరామ సమయానికి వర్షం ఆగిపోయింది. దీంతో లంచ్ బ్రేక్ అనంతరం మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. పిచ్పై కవర్లను తొలగించిన సిబ్బంది గ్రౌండ్ను సాపింగ్ చేశారు.👉గాలే వేదికగా శ్రీలంక, భారత్ మధ్య మొదలైన తొలి టెస్టు రెండో రోజు ఆటకు వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో పిచ్పై కవర్లను కప్పి ఉంచారు. 👉రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. శనివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 73 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (178 బంతుల్లో 131 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో తొలి సెంచరీతో అదరగొట్టాడు. పంత్ (36 బంతుల్లో 27 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నాడు.👉 అంతకముందు సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (162 బంతుల్లో 77; 9 ఫోర్లు, 1 సిక్స్) కూడా హాఫ్ సెంచరీతో మెరవడంతో టీమిండియా ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. అర్ధశతకం అనంతరం రాహుల్ గాయంతో మైదానాన్ని వీడగా... పడిక్కల్తో కలిసి యశస్వి జైస్వాల్ (37 బంతుల్లో 32; 5 ఫోర్లు) రనౌట్గా వెనుదిరగగా... కెప్టెన్ శుబ్మన్ గిల్ (16) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య ఏకైక వికెట్ పడగొట్టాడు. -
మూడో స్థానంపై బేఫికర్.. గిల్ నమ్మినబంటు పడిక్కల్
దేశవాళీల్లో దుమ్మురేపి భారత జట్టుకు ఎంపికైన దేవదత్ పడిక్కల్ అంతర్జాతీయ స్థాయిలోనూ అదే జోరు కనబరిచాడు. ప్రాక్టీస్ మ్యాచ్లో ప్రత్యర్థి బౌలర్లతో చెడుగుడు ఆడుకున్న పడిక్కల్ శ్రీలంకతో తొలి టెస్టులో అజేయ సెంచరీతో కదం తొక్కాడు. ఫలితంగా టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ నమ్మకాన్ని ఒక్క శతకంతో పడిక్కల్ నిలబెట్టుకున్నాడు. 'లంకతో టెస్టు సిరీస్కు ముందు టీమిండియాలో మూడో స్థానంలో బ్యాటింగ్కు ఎవరు వస్తున్నారు?' అనే ప్రశ్న గిల్కు ఎదురైంది. కానీ గిల్ ఏమాత్రం తడబడకుండా దేవదత్ పడిక్కల్ పేరును బయటికి చెప్పాడు. మూడో స్థానంలో అంతకంటే మంచి బ్యాటర్ను తాను చూడలేదని, ఈ సిరీస్లో పడిక్కల్ బ్యాటింగ్కు వెన్నుముకలా మారుతాడని గిల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. తాజాగా తొలి టెస్టులో సూపర్ సెంచరీతో గిల్కు నమ్మిన బంటు అయ్యాడు పడిక్కల్.2024లో అనూహ్య పిలుపు..2024లో ఆ్రస్టేలియాపై చివరి టెస్టు మ్యాచ్ ఆడిన దేవదత్ పడిక్కల్ శ్రీలంక పర్యటనకు ఎంపికైనా... అతడికి తుది జట్టులో చోటు దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. అయితే గాయం కారణంగా సాయి సుదర్శన్ సిరీస్కు దూరం కావడం... అదే సమయంలో శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో భారీ సెంచరీ చేయడంతో పడిక్కల్కు ఆ అవకాశం వచ్చింది. రెండేళ్ల తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్న పడిక్కల్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. గత 20 టెస్టుల్లో భారత జట్టు తరఫున మూడో స్థానంలో బరిలోకి దిగిన ప్లేయర్ ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోగా... ఆ లోటును పడిక్కల్ భర్తీ చేశాడు. ఆరంభంలో వన్డే తరహాలో బంతికో పరుగు చొప్పున రాబట్టిన అతడు... ఆ తర్వాత మంచి బంతులను గౌరవిస్తూ ముందుకు సాగాడు. స్పిన్నర్లను ఎదుర్కొనే క్రమంలో చక్కటి స్వీప్ షాట్లు ఆడిన పడిక్కల్... పేసర్లకు ‘నటరాజ్’ షాట్లతో బదులిచ్చాడు. స్క్వేర్ లెగ్ దిశగా సులువుగా పరుగులు రాబట్టిన అతడు... తన ట్రేడ్మార్క్ పంచ్ షాట్లతో అలరించాడు. కర్ణాటక తరఫున దేశవాళీల్లో రాహుల్తో కలిసి ఎన్నో మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండర్... అంతర్జాతీయ స్థాయిలోనూ అదే దూకుడు కనబర్చాడు. సెంచరీ అనంతరం కూడా అలసత్వానికి తావివ్వకుండా పూర్తి నియంత్రణతో బ్యాటింగ్ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్నాడు. రెండో రోజు కూడా అతడు ఇదే జోరు కొనసాగిస్తూ క్రీజులో పాతుకుపోతే భారత్ భారీ స్కోరు చేయడం ఖాయం. అంతేకాదు పుజారా రిటైర్మెంట్ తర్వాత తన స్థానాన్ని భర్తీ చేసేందుకు పడిక్కల్కు ఇంతకంటే మంచి అవకాశం మళ్లీ రాదు. ఈ సిరీస్లో విశేషంగా రాణిస్తే మాత్రం పడిక్కల్ స్థానానికి ఢోకా ఉండదు.MAIDEN TEST HUNDRED! 💯A special moment on a special day for Devdutt Padikkal in Galle 🥳Updates ▶️ https://t.co/M9LVyCAp8y#TeamIndia | #SLvIND pic.twitter.com/8x1HcYeFbA— BCCI (@BCCI) August 15, 2026Read: నడవలేని స్థితిలో కేఎల్ రాహుల్.. గాయంపై బిగ్ అప్డేట్! -
IND vs SL: తొలి రోజు భారత్దే
Sri Lanka Vs India 1st Test Live Updates: గాలే వేదికగా శ్రీలంకతో ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజు ఆటలో భారత బ్యాటర్లు అదరగొట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. క్రీజులో పడిక్కల్(131), రిషబ్ పంత్(27) ఉన్నారు.శుబ్మన్ గిల్ అవుట్61.5: ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో లాహిరు ఉదారకు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్గా వెనుదిరిగిన గిల్ (16). స్కోరు 236-2. పడిక్కల్ 107 పరుగులతో ఉన్నాడు. పంత్ క్రీజులోకి వచ్చాడు.పడిక్కల్ సెంచరీటీమిండియా వన్డౌన్బ్యాటర్ దేవదత్ పడిక్కల్ శతక్కొట్టాడు. 134 బంతులలో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. టీమిండియా స్కోరు: 235/1(61). పడిక్కల్ 106, గిల్ 16 పరుగులతో ఉన్నారు.కేఎల్ రాహుల్కు గాయంటీమిండియాకు భారీ షాక్ తగిలింది. సెంచరీ దిశగా దూసుకుపోతున్న కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. దీంతో అతడు రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. అతడిస్థానంలో కెప్టెన్ గిల్ వచ్చాడు. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీటీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీ మార్క్ను పూర్తి చేసుకున్నాడు. 46 ఓవర్లకు భారత్ స్కోర్: 166/1. క్రీజులో రాహుల్(53), పడిక్కల్(78) ఉన్నారు.పడిక్కల్ హాఫ్ సెంచరీదేవ్దత్త్ పడిక్కల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 81 బంతుల్లో తన రెండో ఆర్ధ శతకాన్ని అతడు అందుకున్నాడు. 37 ఓవర్లకు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో పడిక్కల్తో పాటు రాహుల్(41) ఉన్నాడు.తిరిగి మొదలైన ఆట2 PM: వాన తెరిపినివ్వడంతో ఆట మళ్లీ మొదలైంది.మొదలైన జల్లులు!12.38 PM: గాలెలో చిరుజల్లులు మొదలయ్యాయి. ఆకాశం నల్లని మేఘాలతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో గ్రౌండ్ సిబ్బంది వచ్చి పిచ్ను కవర్లతో కప్పుతున్నట్లు సమాచారం. వాన వల్ల ఆటకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.లంచ్ బ్రేక్: టీమిండియా స్కోరు 101/1లంకతో జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు లంచ్ సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. పడిక్కల్ (35), కేఎల్ రాహుల్ (32) పరుగులతో ఆడుతున్నారు. తొలి సెషన్లో జైస్వాల్ రనౌట్ మినహా భారత బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. Lunch on Day 1 of the First #SLvIND Test.A solid morning session as #TeamIndia move to 101/1 👌👌Stay tuned for the second session of the day. Scorecard ▶️ https://t.co/M9LVyCAp8y pic.twitter.com/ru1NamfAn4— BCCI (@BCCI) August 15, 2026జైసూ స్థానంలోక్రీజులోకి పడిక్కల్👉18 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (22), పడిక్కల్ (20) పరుగులతో ఆడుతున్నారు.👉 లంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్తో జరిగిన సమన్వయ లోపంతో ఇద్దరు ఒకే ఎండ్కు రావడంతో జైస్వాల్ (32) రనౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా 47 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.👉 8 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. జైస్వాల్ (23), కేఎల్ రాహుల్ (10) పరుగులతో ఆడుతున్నారు.రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గాలే వేదికగా శనివారం శ్రీలంక, భారత్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. సర్ఫరాజ్ ఖాన్ ఆడుతాడని అంతా భావించినప్పటికీ గిల్ మాత్రం ధ్రువ్ జురెల్వైపే మొగ్గుచూపాడు. ఇక ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల కాంబినేషన్తో బరిలోకి దిగింది.తుది జట్లు:టీమిండియా : యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.శ్రీలంక: లాహిరు ఉదార, నిషాన్ మదుష్క, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా(కెప్టెన్), సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), కేశర నువంత, ప్రబాత్ జయసూర్య, లాహిరు కుమార, అసిత ఫెర్నాండో.1932లో తొలి టెస్టు ఆడిన టీమిండియాకు ఇది 600వ మ్యాచ్ కానుండగా... మైలురాయి మ్యాచ్లో విజయం సాధించాలని శుబ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు పట్టుదలగా ఉంది. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు ముందు టీమిండియా 9 టెస్టులు ఆడనుంది. ఇందులో ఏడింట గెలిస్తే భారత్ నేరుగా తుదిపోరుకు అర్హత సాధించనుంది. దీంతో విజయమే లక్ష్యంగా గిల్ సేన బరిలోకి దిగనుంది. గౌతమ్ గంభీర్ కోచింగ్లో టి20 ప్రపంచకప్, ఆసియాకప్, చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమిండియా... సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. దీంతో గంభీర్పై కూడా అదనపు ఒత్తిడి ఉంది. 2017లో విరాట్ కోహ్లి సారథ్యంలో లంకలో పర్యటించిన భారత జట్టు మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 3–0తో ‘క్లీన్ స్వీప్’ చేసింది. ఆ సమయంలో టీమిండియా స్టార్ బ్యాటర్లతో దట్టంగా ఉండగా... ఇప్పుడు అలాంటి అనుభవజ్ఞులు కరువయ్యారు. Captain Shubman Gill wins the toss and elects to bat first at Galle.A look at our Playing XI for the game.Live - https://t.co/bg2q0J2x1f #SLvIND pic.twitter.com/ll2Xa9sTm3— BCCI (@BCCI) August 15, 2026 టీమిండియా పంద్రాగష్టు సంబరాలు హెడ్కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. On the occasion of Independence Day, #TeamIndia gathered at Galle to hoist the Tricolour 🇮🇳 ahead of the First #SLvIND Test.#IndependenceDay pic.twitter.com/tHKIggV6AU— BCCI (@BCCI) August 15, 2026 -
‘సారథ్యం భారం కాదు.. ఈ టెస్టు మ్యాచ్ నాకు ప్రత్యేకం’
గాలె: భారత క్రికెట్ జట్టు సరైన దిశలోనే ప్రయాణిస్తోందని టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ వెల్లడించాడు. సారథ్య బాధ్యతలు తనపై ఎలాంటి అదనపు భారం వేయడం లేదన్న గిల్... భవిష్యత్తులో జట్టు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఖాయమని ఆశాభావం వ్యక్తంచేశాడు. గతేడాది కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇంగ్లండ్ పర్యటనలో అదరగొట్టిన గిల్... టీమిండియా 2–2తో సిరీస్ ‘డ్రా’ చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆ తర్వాత అతడి కెప్టెన్సీలో స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు సిరీస్ పరాజయాలు ఎదుర్కొంది. 2027లో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు ముందు భారత జట్టు ఇంకా 9 టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో సింహభాగం విజయాలు సాధిస్తేనే తుదిపోరుకు చేరనుంది. ఈ క్రమంలో నేటి నుంచి శ్రీలంకతో భారత జట్టు రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు, ప్లేయర్ల దృక్పథం, కీలక ఆటగాళ్ల గాయాలపై గిల్ చెప్పిన వివరాలు అతడి మాటల్లోనే... అదే ప్రధాన లక్ష్యం... కెప్టెన్సీతో నాకెలాంటి ఇబ్బంది లేదు. గతేడాది కాలంగా నా ప్రదర్శనను గమనిస్తే ఆ విషయం ఎవరికైనా అర్థమైపోతుంది. నా దృష్టిలో సారథ్య బాధ్యతలు చేపట్టిన అనంతరం నా ఆటతీరు మరింత మెరుగైందనిపిస్తుంది. ప్రస్తుతం జట్టు సరైన దిశలోనే సాగుతోంది. ఇప్పుడు మా ముందున్న ప్రధాన లక్ష్యం వచ్చే ఏడాది డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించడమే. రానున్న ఆరు, ఏడు మ్యాచ్ల్లో విజయాలు సాధిస్తే అది సాధ్యమవుతుంది. శ్రీలంక పర్యటనతోనే ఆ దిశగా ముందడుగు వేయాలనుకుంటున్నాం. అందుకోసం బాగా సన్నద్ధమయ్యాం. నెట్స్లో తీవ్రంగా శ్రమించడంతో పాటు... ప్రాక్టీస్ మ్యాచ్లో సైతం మెరుగైన ప్రదర్శన చేశాం. అరుదైన 600వ టెస్టు దేశానికి ప్రాతినిధ్యం వహించడమే గొప్ప అవకాశం. అందులో సారథ్యం వహించడం మరింత గర్వకారణం. అలాంటిది టీమిండియా మైలురాయి టెస్టు మ్యాచ్లో జట్టును నడిపించనుండటం ఆ ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. భారత్ ఆడిన 100వ టెస్టు మ్యాచ్కు మన్సూర్ అలీఖాన్ పటౌడీ సారథ్యం వహించగా... 500వ మ్యాచ్కు విరాట్ కోహ్లి కెప్టెన్గా ఉన్నాడు. ఇప్పుడు 600వ మ్యాచ్కు నేను కెప్టెన్ కావడం... అది కూడా దేశ 80వ స్వాతంత్ర దినోత్సవం నాడు కావడం మరింత ప్రత్యేకం. శ్రీలంక పిచ్లు స్పిన్కు అనుకూలించడం పరిపాటి కాగా... పరిస్థితులను అర్థం చేసుకొని ఆడితేనే మెరుగైన ఫలితాలు సాధించగలం. ప్రసిధ్కే మొగ్గు... ఫాస్ట్ బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. గుర్నూర్ బ్రార్, ఆఖిబ్ నబీలో ఎంతో నైపుణ్యం ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్లో గుర్నూర్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. బంతి పాతబడ్డ తర్వాత అతడు మరింత ప్రమాదకరం. అదనపు బౌన్స్, అదనపు వేగంతో ప్రత్యరి్థని సులువుగా బోల్తా కొట్టించగలడు. అదే సమయంలో ప్రసిధ్ కృష్ణ నిలకడ కనబరుస్తున్నాడు. అతడికి అనుభవం కూడా ఉంది. దీంతో తుది జట్టు ఎంపిక మరింత కష్టమవుతుంది. స్టార్ పేసర్ బుమ్రా గైర్హాజరీలో ఇతర బౌలర్లు సత్తాచాటేందుకు ఇది సరైన సమయం. పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా... లైన్ అండ్ లెంగ్త్కు కట్టుబడి వికెట్లు రాబడితేనే జట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. నైపుణ్యానికి కొదవలేదు... జట్టులో నైపుణ్యం గల ఆటగాళ్లకు కొదవలేదు. ఏ స్థానానికైనా తగిన రిప్లేస్మెంట్ సిద్ధంగా ఉంది. సాయి సుదర్శన్ గాయంతో సిరీస్కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఎవరికి అవకాశం ఇచ్చినా వారు సత్తా చాటగలరు. సుదీర్ఘ ఫార్మాట్లో పరుగులు సాధించడం అంత సులువు కాదు. జట్టులోకి వచ్చిన వెంటనే పరుగుల వరద పారించడం ఎవరికీ సాధ్యం కాదు. కొంతమంది ఆటగాళ్లు త్వరగా లయ అందుకుంటారు. మరికొంతమందికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అది ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. పడిక్కల్ చాలా మంచి ప్లేయర్. గతంలోనూ అతడు చక్కటి ఇన్నింగ్స్లు ఆడాడు. ఈ ఫార్మాట్లో విజయవంతం అయ్యేందుకు అవసరమైన సత్తా అతడిలో పుష్కలంగా ఉంది. 2017లో శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడిన రాహుల్, రవీంద్ర జడేజా అనుభవం మాకు ఎంతగానో ఉపయోగపడుతోంది. రిస్క్ తీసుకోలేం... ప్లేయర్ల జీవితంలో గాయాలు సహజం. ఈ సిరీస్కు మొదట ఎంపిక చేసిన బుమ్రా, సాయి సుదర్శన్ గాయాలతోనే దూరమయ్యారు. దీంతో ఒకింత ఇబ్బందికి గురయ్యాం. అయితే వారితో నిరంతరం టచ్లో ఉంటూ పురోగతి తెలుసుకుంటున్నాం. సుదీర్ఘ ఫార్మాట్లో రిస్క్ తీసుకోలేం. ఐదు రోజుల పాటు మైదానంలో గడపాలంటే మెరుగైన ఫిట్నెస్ తప్పనిసరి. టి20, వన్డేలతో పోల్చుకుంటే... ప్లేయర్లు తమ ప్రతిభను చాటుకునేందుకు టెస్టుల్లో ఎక్కువ అవకాశాలుంటాయి. తొలి రోజు మెరుగ్గా ఆడలేకపోతే... రెండో రోజు దాన్ని మరిపించే ప్రదర్శనతో మన్ననలు అందుకునే చాన్స్ టెస్టుల్లోనే ఉంటుంది. మానవ్ సుతార్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు. దీంతో జట్టులో ఎనిమిదో స్థానం వరకు బ్యాటర్లు ఉన్నట్లే. -
సుదీర్ఘ సమరానికి సై
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధించడమే లక్ష్యంగా భారత జట్టు... శ్రీలంకతో టెస్టు సిరీస్కు సిద్ధమైంది. సొంతగడ్డపై వరుస సిరీస్ పరాజయాల నుంచి కోలుకొని టీమిండియా సత్తా చాటాలని భావిస్తుంటే... శ్రీలంక స్పిన్తో ప్రత్యరి్థని దెబ్బతీయాలని ప్రణాళికలు రచిస్తోంది. భారత జట్టుకు ఇది 600వ టెస్టు మ్యాచ్ కావడం మరో విశేషం. గాలె: సుదీర్ఘ విరామం అనంతరం భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడనుంది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం తొలి టెస్టు ప్రారంభం కానుంది. 1932లో తొలి టెస్టు ఆడిన టీమిండియాకు ఇది 600వ మ్యాచ్ కానుండగా... మైలురాయి మ్యాచ్లో విజయం సాధించాలని శుబ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు పట్టుదలగా ఉంది. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు ముందు టీమిండియా 9 టెస్టులు ఆడనుంది. ఇందులో ఏడింట గెలిస్తే భారత్ నేరుగా తుదిపోరుకు అర్హత సాధించనుంది. దీంతో విజయమే లక్ష్యంగా గిల్ సేన బరిలోకి దిగనుంది. గౌతమ్ గంభీర్ కోచింగ్లో టి20 ప్రపంచకప్, ఆసియాకప్, చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమిండియా... సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. దీంతో గంభీర్పై కూడా అదనపు ఒత్తిడి ఉంది. స్పిన్కు ఎదురొడ్డితేనే... 2017లో విరాట్ కోహ్లి సారథ్యంలో లంకలో పర్యటించిన భారత జట్టు మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 3–0తో ‘క్లీన్ స్వీప్’ చేసింది. ఆ సమయంలో టీమిండియా స్టార్ బ్యాటర్లతో దట్టంగా ఉండగా... ఇప్పుడు అలాంటి అనుభవజు్ఞలు కరువయ్యారు. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా... దేవదత్ పడిక్కల్ వన్డౌన్లో బ్యాటింగ్కు రానున్నాడు. కెపె్టన్ గిల్ నాలుగో స్థానంలో బరిలోకి దిగనుండగా... ఆ తర్వాత పంత్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తారు. సర్ఫరాజ్ ఖాన్కు తుది జట్టులో చోటు కష్టమే. ఒకప్పుడు స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కొంటారనే పేరున్న భారత ప్లేయర్లు... ఇటీవలి కాలంలో ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. లంక జట్టులో ప్రభాత్ జయసూర్య, రమేశ్ మెండిస్ వంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతో బరిలోకి దిగడం ఖాయమే కాగా... సిరాజ్తో పాటు ప్రసిధ్ కొత్త బంతిని పంచుకోనున్నాడు. జడేజా, కుల్దీప్, మానవ్ స్పిన్ భారం మోస్తారు. తుది జట్లు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్), రాహుల్, జైస్వాల్, పడిక్కల్, పంత్, జురేల్, జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్, సిరాజ్, ప్రసిధ్. శ్రీలంక: ధనంజయ డిసిల్వా (కెపె్టన్), లహిరు, నిషాన్, దినేశ్, కమిందు, డిక్వెల్లా, సోనల్, ప్రభాత్, రమేశ్, అషిత ఫెర్నాండో, లహిరు కుమార.పిచ్, వాతావరణం గాలె పిచ్ గతంలో మాదిరిగా పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలించకపోవచ్చని శ్రీలంక కెప్టెన్ ధనంజయ్ పేర్కన్నాడు. పిచ్పై తేమ ఎక్కువగా ఉండటంతో బ్యాటర్లకు లబ్ది చేకూరే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్కే మొగ్గుచూపనుంది. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి. -
తుది జట్టులో అతడికి నో ఛాన్స్! బిగ్ హింట్ ఇచ్చిన గిల్
భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్ట్ ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు భారత ప్లేయింగ్ ఎలెవన్కు సంబంధించి కెప్టెన్ శుభ్మన్ గిల్ బిగ్ హింట్ ఇచ్చాడు. తొలి టెస్ట్లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో పాటు ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగే అవకాశముంది.రవీంద్ర జడేజా, మానవ్ సుత్తార్, కుల్దీప్ యాదవ్ పేర్లు స్పిన్నర్లగా ఖారారైనట్లు సమాచారం. అదేవిధంగా పేస్ బౌలింగ్ విభాగంలో సీనియర్ బౌలర్ మహ్మద్ సిరాజ్తో కర్ణాటక స్పీడ్ స్టార్ ప్రసిద్ద్ కృష్ణ బంతిని పంచుకోనున్నట్లు గిల్ సంకేతాలు ఇచ్చాడు. దీంతో గుర్నూర్ బ్రార్, జమ్మూ కాశ్మీర్ స్పీడ్ స్టార్ అకిబ్ నబీలు బెంచ్కే పరిమితమయ్యే అవకాశముంది."గుర్నూర్ బ్రార్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. పాత బంతితో కూడా అతడు బౌన్స్ రాబట్టగలడు. అయితే మరోవైపు ప్రసిద్ద్ కృష్ణ కూడా గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రసిద్ధ్ ఇటీవల జరిగిన వార్మప్ మ్యాచ్లో సత్తాచాటాడు. అందుకే వీరిద్దరిలో ఒకరిని ఎంచుకోవడం నిజంగా కష్టమైన నిర్ణయమే. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో ప్రసిద్ద్, బ్రార్ వంటి పేస్ బౌలర్లకు తమ సత్తా చాటుకునేందుకు ఈ సిరీస్ ఒక మంచి అవకాశం" అని గిల్ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. కాగా వన్డేల్లో తన టాలెంట్ను నిరూపించుకోవడంతో గుర్నూర్ బ్రార్ను శ్రీలంకతో టెస్ట్ సిరీస్కు కూడా ఎంపిక చేశారు. కానీ శ్రీలంక కండీషన్స్ కారణంగా అతడికి తుది జట్టులో చోటు దక్కే సూచనలు కనిపించడం లేదు. లంక పిచ్లు ఎక్కువగా స్పిన్నర్లకు అనుకూలిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ ముగ్గురు ఫుల్ టైమ్ స్పిన్నర్లతో బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది.భారత తుది జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవద్ పడిక్కల్, గిల్ (కెప్టెన్), పంత్ ( వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ -
కెప్టెన్గా నేను ఓకే.. WTC ఫైనల్ చేరతాం: శుబ్మన్ గిల్
శ్రీలంకతో కీలక టెస్టు సిరీస్కు టీమిండియా సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ ఈ సిరీస్లో ఆతిథ్య జట్టును 2-0తో వైట్వాష్ చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తొలి టెస్టు ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందించాడు.కెప్టెన్గా నేను ఓకే.. WTC ఫైనల్ చేరతాం‘‘కెప్టెన్గా నా పాత్రలో నేను ఎంతో సౌకర్యవంతంగానే ఉన్నాను. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవడమే మా లక్ష్యం. అందుకోసం మేము ఆరు నుంచి ఏడు టెస్టులు గెలవాల్సి ఉంది. కాబట్టి శ్రీలంక నుంచే ఆ పని మొదలుపెడతాము’’ అని గిల్ పేర్కొన్నాడు.నాకు దక్కిన గొప్ప గౌరవంఅదే విధంగా.. ‘‘చారిత్రక 600వ టెస్టులో నాయకుడిగా టీమిండియాను ముందుకు నడిపించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. అది కూడా స్వాతంత్ర్య దినోత్సవం రోజు కావడం మరింత విశేషం’’ అని గిల్ హర్షం వ్యక్తం చేశాడు. కాగా భారత్- శ్రీలంక మధ్య ఆగష్టు 15న తొలి టెస్టు మొదలుకానుంది. ఇందుకు గాలె వేదిక.మా జట్టుతో సంతృప్తిగానే ఉన్నాంకాగా శ్రీలంకతో టెస్టు సిరీస్కు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాటర్ సాయి సుదర్శన్, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)పై వస్తున్న విమర్శలపై గిల్ స్పందించాడు.‘‘మేము CoEతో తరచూ చర్చలు జరుపుతూనే ఉన్నాము. ఆటగాళ్ల గాయాల గురించి అప్డేట్లు తెలుసుకుంటున్నాం. దురదృష్టవశాత్తూ సాయి సుదర్శన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కాబట్టి అతడిని టెస్టు మ్యాచ్లో ఆడించి రిస్క్ తీసుకోలేము. మా జట్టులో ఉన్న పదిహేను మంది సభ్యులతో ప్రస్తుతం సంతృప్తిగానే ఉన్నాము’’ అని గిల్ పేర్కొన్నాడు.డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..ఇదిలా ఉంటే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. తాజా సీజన్లో మిగిలిన తొమ్మిది మ్యాచ్లలో కనీసం ఆరు మ్యాచ్లు తప్పక గెలవాల్సిందే. ఇందులో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కాస్త ఈజీ టార్గెట్. ఆ తర్వాత, న్యూజిలాండ్తో రెండు, ఆస్ట్రేలియా గడ్డ మీద ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది.వీటిలో కనీసం ఆరు గెలవడంతో పాటు రెండు డ్రా చేసుకోవాలి. లేదంటే కచ్చితంగా ఏడు టెస్టులు గెలవాలి. ఇక ఈ సీజన్లో ఇప్పటికి టీమిండియా తొమ్మిది టెస్టులు పూర్తి చేసుకుని.. నాలుగు గెలిచి.. నాలుగు ఓడిపోయి.. ఒకటి డ్రా చేసుకుంది. తద్వారా పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. -
లంకతో తొలి టెస్టు.. రికార్డుల వేటకు టీమిండియా సిద్ధం!
శ్రీలంక, భారత్ మధ్య శనివారం నుంచి గాలే వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే లంక తొలి టెస్టు కోసం తమ తుది జట్టును ప్రకటించగా, భారత్ తుది జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. తుది జట్టుపై ఒక అంచనా ఉన్నప్పటికీ, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో గాలేలో టీమిండియా ఆటగాళ్లు పలు రికార్డులపై కన్నేశారు.👉భారత వికెట్కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ టెస్టుల్లో 100 సిక్సర్లు పూర్తి చేయడానికి మరో మూడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ఈ ఘనత సాధిస్తే టెస్ట్ క్రికెట్లో వంద సిక్సర్లు బాదిన తొలి భారతీయ క్రికెటర్గా చరిత్ర సృష్టిస్తాడు. అలాగే డబ్ల్యూటీసీ చరిత్రలో మూడువేల పరుగులు పూర్తి చేసిన మొదటి వికెట్ కీపర్గా నిలవడానికి పంత్కు మరో 220 పరుగులు కావాలి. శ్రీలంకలో ఇప్పటివరకు ఏ భారతీయ వికెట్ కీపర్ కూడా టెస్ట్ సెంచరీ చేయలేదు, ఈసారి పంత్ ఆ రికార్డును అందుకుంటాడా అన్నది చూడాలి.👉యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టుల్లో 50 సిక్సర్ల మైలురాయిని చేరుకోవడానికి కేవలం 5 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారతీయ ఓపెనర్గా జైస్వాల్ నిలవనున్నాడు. 24 ఏళ్ల వయసులోనే 5 వేర్వేరు దేశాల్లో టెస్ట్ సెంచరీలు సాధించిన రెండో భారతీయ బ్యాటర్ గా సచిన్ టెండూల్కర్ సరసన చేరేందుకు జైస్వాల్కు ఒక్క శతకం అవసరం.👉అంతర్జాతీయ క్రికెట్లో 10వేల పరుగులు (అన్ని ఫార్మాట్లు) పూర్తి చేసుకోవడానికి కేఎల్ రాహుల్ మరో 170 పరుగుల దూరంలో ఉన్నాడు. సునీల్ గవాస్కర్ తర్వాత విదేశాల్లో 10 టెస్ట్ సెంచరీలు చేసిన రెండో ఆసియా ఓపెనర్ నిలిచేందుకు రాహుల్ కు రెండు సెంచరీలు దూరంలో నిలిచాడు.👉ఇక టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ టెస్ట్ క్రికెట్లో మూడువేల పరుగులు పూర్తి చేసుకోవడానికి మరో 31 పరుగులు అవసరం. కెప్టెన్గా 2వేల పరుగులు సాధించడానికి అతడికి 150 పరుగులు కావాలి. ఇక సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిల తర్వాత శ్రీలంకలో టెస్ట్ సెంచరీ చేసిన మూడో భారత కెప్టెన్గా నిలిచేందుకు గిల్ ఎదుట సువర్ణావకాశం ఉంది.👉లంకతో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ను గెలుచుకుని, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరచుకోవాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న భారత్, 2017 తర్వాత తొలిసారిగా శ్రీలంక గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. -
మాదే పైచేయి: టీమిండియాకు శ్రీలంక కెప్టెన్ వార్నింగ్
టెస్టు సిరీస్ నేపథ్యంలో శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వ టీమిండియాకు హెచ్చరికలు జారీ చేశాడు. సాధారణంగా లంకలో స్పిన్నింగ్ వికెట్లు ఉంటాయని.. కానీ ఈసారి వర్షాల వల్ల పరిస్థితిలో కాస్త మార్పు ఉంటుందని పేర్కొన్నాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా భారత్- శ్రీలంక మధ్య రెండు టెస్టులకు షెడ్యూల్ ఖరారైంది.పిచ్లు అంత పొడిగా ఉండవుగాలె వేదికగా ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు మొదలుకానున్న నేపథ్యంలో లంక సారథి ధనంజయ డి సిల్వ మీడియాతో మాట్లాడాడు. ‘‘సాధారణంగా శ్రీలంకలో టర్నింగ్ వికెట్లు ఉంటాయి. అయితే, ప్రస్తుతం వాతావరణం వేరుగా ఉంది. వర్షాలు పడుతున్నాయి కాబట్టి పిచ్లు అంత పొడిగా ఉండవు.ఆట స్వరూపాన్నే మార్చివేయగలరుఇక మా బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. పిచ్లు కాస్త అనుకూలంగా ఉన్నా.. ఆట మొదలైన 2-3 రోజులు ఉపయోగకరంగా ఉంటాయి. ఆతర్వాత పిచ్ టర్న్ కావడం మొదలవుతుంది. స్పిన్నర్లే మా ప్రధాన ఆయుధం అయినప్పటికీ.. మా జట్టులో కొంతమంది నైపుణ్యాలున్న సీమర్లు కూడా ఉన్నారు.కివీస్, సౌతాఫ్రికా చేతిలో వైట్వాష్లుఆట స్వరూపాన్నే వారు మార్చివేయగలరు’’ అని ధనంజయ డి సిల్వ గిల్ సేనకు హెచ్చరికలు జారీ చేశాడు. అదే విధంగా.. ‘‘ఇండియాలోనూ టర్నింగ్ వికెట్లు ఉంటాయి. అయితే, స్వదేశంలో టీమిండియా న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల చేతుల్లో వైట్వాష్ అయింది.మాదే పైచేయి.. అతడే మా బలంఈ సిరీస్లలో వాళ్లు విఫలమైనప్పటికీ పూర్తిగా టర్నింగ్ వికెట్ల మీద పట్టు కోల్పోయారని కాదు. తిరిగి పుంజుకునేందుకు వాళ్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, గణాంకాల పరంగా చూస్తే మాదే పైచేయి. ముఖ్యంగా ఇరుజట్లలోనూ గాలెలో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా ప్రభాత్ జయసూర్య ఉన్నాడు.అతడి అనుభవం మాకు తప్పక ఉపయోగపడుతుంది. శ్రీలంకలో పర్యటిస్తున్న జట్ల బ్యాటర్లపై చాలా ఏళ్లుగా అతడు ఆధిపత్యం కనబరుస్తున్నాడు. ఈ స్పిన్ బౌలర్ మా ప్రధానం బలం.బుమ్రా లేకున్నా..ఇక టీమిండియా తమ ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలు కోల్పోయింది. వారికి అది అతిపెద్ద లోటు. అయితే, మిగతా బౌలర్లను ఎదుర్కొనేందుకు కూడా మేము బాగా హోంవర్క్ చేసి.. పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాము.ఏదేమైనా అంతర్జాతీయ మ్యాచ్లలో ఆడటం అంత తేలిక కాదు. నాలుగు, ఐదో రోజు కూడా ఆట పూర్తిగా మారిపోతుంది. టీమిండియాను ఓడించడానికి గొప్ప అవకాశం మా ముందుంది. మేము ఇది సాధిస్తామనే నమ్మకం నాకు ఉంది’’ అని ధనంజయ డి సిల్వ పేర్కొన్నాడు. కాగా 2017 తర్వాత టీమిండియా తొలిసారి శ్రీలంక గడ్డ మీద టెస్టు సిరీస్ ఆడుతోంది. కెప్టెన్ శుబ్మన్ గిల్ సహా జట్టులోని మెజారిటీ మంది ఆటగాళ్లకు లంకలో టెస్టులు ఆడటం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. తొలి టెస్టుకు ముందు శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో జరిగిన మ్యాచ్లో భారత్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆరంభంలో పేసర్లు వికెట్లు తీసేందుకు ఇబ్బంది పడ్డా ఆ తర్వాత ప్రభావం చూపగలిగారు. కొలంబో వికెట్ పాతబడే కొద్ది బ్యాటర్లకు కాస్త అనుకూలించింది. చదవండి: ఆసీస్ గడ్డ మీద చరిత్ర సృష్టించిన బంగ్లా పేసర్ -
'అతడొక అద్భుతం.. కచ్చితంగా లెజెండ్ అవుతాడు'
భారత్-శ్రీలంక మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సమయం దగ్గరపడుతోంది. ఇందులో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి కీలకమైన డబ్ల్యూటీసీ పాయింట్లు సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియాపై శ్రీలంక బౌలింగ్ దిగ్గజం చమింద వాస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి భారత జట్టు పటిష్టంగా ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ను సైతం వాస్ పొగడ్తలతో ముంచెత్తాడు. కాగా ఈ సిరీస్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా జరుగుతోంది."రోహిత్, విరాట్ లేకపోయినా భారత జట్టు ఏ మాత్రం బలహీనపడలేదు. శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ రూపంలో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. టీమిండియాలో ప్రతిభకు కొదవలేదు,ఎంతోమంది యువ ఆటగాళ్లు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ గిల్ గురుంచి ఎంత పొగిడినా తక్కువే. అతడొక అద్భుతం. గిల్కు అత్యుత్తమ బ్యాటింగ్ స్కిల్స్తో పాటు మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఎంతటి ఒత్తిడిలోనైనా చాలా ప్రశాంతంగా ఉంటాడు. టెస్ట్ క్రికెట్లో కచ్చితంగా ఒక లెజెండ్ అవుతాడు. గాలేలో జరగనున్న తొలి టెస్ట్లో మా జట్టుకు కచ్చితంగా అతడి నుంచి ముప్పు పొంచి ఉంది. శుబ్మన్ క్రీజులో సెటిల్ అయ్యాక అవుట్ చేయడం చాలా కష్టం. మా బౌలర్లు అతడిని ఎలా అడ్డుకుంటారో చూడాలి మరి" అని వాస్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: IND vs SL: గంభీర్తో శ్రీలంక మైండ్ గేమ్స్.. ఏమి జరిగిందంటే? -
తొలి టెస్టుకు వర్షం ముప్పు.. గాలే చేరుకున్న టీమిండియా
శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఆగస్టు 5న లంక గడ్డపై అడుగుపెట్టింది. ఆగస్టు 7 నుంచి మూడు రోజుల పాటు కొలంబో వేదికగా లంక ఎలెవెన్తో వార్మప్ మ్యాచ్ ఆడిన టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. వార్మప్ మ్యాచ్ ఇచ్చిన విజయం జోష్తో టీమిండియా తొలి టెస్టు ఆడేందుకు గాలేలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా గాలే ఎయిర్పోర్టు నుంచి టీమిండియా ఆటగాళ్లు బయటికి వస్తున్న ఫొటోలను బీసీసీఐ బుధవారం ఎక్స్ వేదికగా పంచుకుంది. జడేజా, పంత్, జైస్వాల్, సిరాజ్, సర్ఫరాజ్ ఖాన్ సహా ఇతర ఆటగాళ్లు, కోచ్ గంభీర్ కనిపించారు. ఆ తర్వాత ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక బస్సులో గాలే స్టేడియం సమీపంలోని హోటల్కు చేరుకున్నారు. బుధవారం విశ్రాంతి తీసుకోనున్న గిల్ సేన గురువారం ప్రాక్టీస్ చేయనుంది. శనివారం ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది.దంచికొట్టిన వాన..అయితే గాలేలో వాతావరణం రెండు రోజుల నుంచి చల్లగానే ఉంది. సోమవారం నుంచి మేఘావృతమై ఉన్న గాలేలో మంగళవారం వాన దంచికొట్టింది. రాబోయే రెండు, మూడు రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉండడంతో తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు లేకపోలేదు. ఇక ఈ టెస్టు సిరీస్ రెండు జట్లకు కీలకమే. 2027లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్లో విజయం తప్పనిసరి. ఒక్క మ్యాచ్ రద్దయినా అవకాశాలు సంక్లిష్టం కానున్నాయి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక ఆరో స్థానంలో కొనసాగుతోంది.కోహ్లి కెప్టెన్సీలో ఘన విజయంగాలేలో గతంలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. 2017లో కోహ్లి కెప్టెన్సీలో గాలే వేదికగా శ్రీలంకతో ఆడిన టెస్టులో ఇన్నింగ్స్ 304 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 600 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ (190), పుజారా (153) సెంచరీలతో చెలరేగారు. లంక తమ తొలి ఇన్నింగ్స్లో 291 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో కోహ్లి సెంచరీ, అభినవ్ ముకుంద్ 81 పరుగులు చేయడంతో టీమిండియా 241 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. దీంతో లంక ముంగిట 550 పరుగుల భారీ టార్గెట్ను ఉంచగా, భారత బౌలర్ల ధాటికి లంక 245 పరుగులకే కుప్పకూలింది. దీంతో గాలే టెస్టులో టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. జడేజా ఒక్కడే..కాగా అప్పటి జట్టులో సభ్యుడిగా ఉన్న జడేజాకు మాత్రమే గాలేలో ఆడిన అనుభవముంది. పడిక్కల్, గుర్నూర్ బ్రార్, సారాంశ్ జైన్, అకిబ్ నబీలు ఇటీవలే ఇదే గాలే వేదికగా లంక-ఏ జట్టుతో అనధికారిక టెస్టు ఆడిన సంగతి తెలిసిందే. ఇక తొలి టెస్టు శనివారం నుంచి జరగనుండగా, రెండో టెస్టు కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి 27 వరకు జరగనుంది.Colombo 🚌 Galle#TeamIndia have arrived for the #SLvIND Test series opener 🙌 pic.twitter.com/UXoo0gTzCv— BCCI (@BCCI) August 12, 2026Read: బంగ్లాను తేలిగ్గా తీసుకోం.. బలమైన జట్టుతోనే బరిలోకి! -
పెళ్లి అంటూ చేసుకుంటే అతడినే. సారా షాకింగ్ కామెంట్స్
-
చరిత్ర సృష్టించనున్న టీమిండియా
భారత క్రికెట్ చరిత్రలో మరో అరుదైన అధ్యాయం ఆవిష్కృతం కానుంది. 2026 ఆగస్టు 15న, దేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ టీమిండియా చారిత్రక 600వ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. శ్రీలంకతో గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్తో భారత టెస్ట్ క్రికెట్లో సరికొత్త మైలురాయిని చేరుకోనుంది. శుభ్మన్ గిల్ నాయకత్వంలో భారత్ ఈ చారిత్రక టెస్ట్ బరిలో దిగనుంది.ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తర్వాత భారత్600 టెస్టులు ఆడిన జట్ల జాబితాలో ఇప్పటివరకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు భారత్ ఈ ప్రత్యేక జాబితాలో చేరనుంది. అలాగే 600 టెస్టుల మైలురాయిని తాకిన తొలి ఆసియా దేశంగానూ భారత్ చరిత్ర సృష్టించనుంది.టెస్ట్ క్రికెట్లో భారత ప్రస్థానం 1932లో ప్రారంభమైంది. అప్పటి నుంచి 94 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో భారత క్రికెట్ ఎన్నో మలుపులు, మరపురాని విజయాలు, దిగ్గజ ఆటగాళ్లను చూసింది.1932లో మొదలైన ప్రయాణంభారత్ తొలి టెస్ట్ మ్యాచ్ను 1932 జూన్ 25న ఇంగ్లండ్తో లార్డ్స్లో ఆడింది. సీకే నాయుడు నాయకత్వంలో ప్రారంభమైన ఆ ప్రయాణం ఇప్పుడు 600వ మ్యాచ్కు చేరుకుంది.భారత్ టెస్ట్ ప్రస్థానంలోని ముఖ్యమైన మైలురాళ్లు ఇవే:1వ టెస్ట్: 1932, ఇంగ్లండ్తో లార్డ్స్లో కెప్టెన్: సీకే నాయుడు100వ టెస్ట్: 1967, ఆస్ట్రేలియాతో కెప్టెన్: మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ200వ టెస్ట్: 1982, పాకిస్థాన్తో కెప్టెన్: సునీల్ గవాస్కర్500వ టెస్ట్: 2016, న్యూజిలాండ్తో కెప్టెన్: విరాట్ కోహ్లీ600వ టెస్ట్: 2026, శ్రీలంకతో కెప్టెన్: శుభ్మన్ గిల్స్వాతంత్ర్య దినోత్సవం రోజున చారిత్రక ఘట్టంఆగస్టు 15.. భారతీయులకు ఎంతో ప్రత్యేకమైన రోజు. అదే రోజున టీమిండియా తన 600వ టెస్ట్ మ్యాచ్ ఆడటం ఈ ఘట్టానికి మరింత ప్రత్యేకతను తీసుకొస్తోంది.1932లో సీకే నాయుడు నాయకత్వంలో మొదలైన భారత టెస్ట్ ప్రయాణం.. పటౌడీ, గవాస్కర్, కపిల్ దేవ్, అజారుద్దీన్, సచిన్, గంగూలీ, ద్రవిడ్, ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజ తరాలను దాటి ఇప్పుడు గిల్ తరం వరకు వచ్చింది.ఇదిలా ఉంటే, టీమిండియా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ ఆగస్ట్ 15న ప్రారంభం కానుండగా.. రెండో టెస్ట్ కొలొంబో వేదికగా ఆగస్ట్ 23న మొదలవుతుంది. -
గిల్, అభిషేక్ కాదు.. అత్యధిక ధరకు అమ్ముడుపోయింది ఇతడే
టీమిండియా స్టార్లు శుబ్మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్ షేర్- ఈ- పంజాబ్ టీ20 కప్ 2026 టోర్నీలో భాగం కానున్నారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టీ20 లీగ్కు సంబంధించి ఆదివారం ఆటగాళ్ల వేలం జరిగింది.ప్రత్యేక ఆకర్షణగా అభిషేక్ శర్మఇందులో టీమిండియా టీ20 సూపర్స్టార్ అభిషేక్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అమృత్సర్ సుర్మాస్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ఆ ఫ్రాంఛైజీ అధికారులతో కలిసి వేలంలో పాల్గొన్నాడు. ఆటగాళ్ల కొనుగోలు విషయంలో సూచనలు, సలహాలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆరు ఫ్రాంఛైజీలుకాగా ఈ లీగ్లో ఆరు ఫ్రాంఛైజీలు ఫజిల్క ఫాల్కన్స్, అమృత్సర్ సుర్మాస్, లుథియానా లయన్స్, భటిండా రాయల్స్, జలంధర్ వారియర్స్, మొహాలీ కింగ్స్ టైటిల్ కోసం రంగంలోకి దిగనున్నాయి.అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్ ఇతడేఇదిలా ఉంటే.. షేర్-ఈ-పంజాబ్ టీ20 కప్ లీగ్ 2026 సీజన్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా సన్వీర్ సింగ్ నిలిచాడు. ఫజిల్క ఫాల్కన్స్ రూ. 13.02 లక్షలకు అతడిని కొనుగోలు చేసింది. ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ గతంలో ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ (2023, 2024)కు ఆడాడు. ఐపీఎల్లో మొత్తంగా ఆరు మ్యాచ్లు ఆడిన 29 ఏళ్ల సన్వీర్ 25 పరుగులు చేశాడు. టీమిండియా ప్లేయర్ల ధర ఎంతంటే?టీమిండియా స్టార్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ను ఫజిల్క ఫాల్కన్స్, అభిషేక్ శర్మను అమృత్సర్ సుర్మాస్, అర్ష్దీప్ సింగ్ను లుథియానా లయన్స్, గుర్నూర్ బ్రార్ను భటిండా రాయల్స్ సొంతం చేసుకున్నాయి.ఇక ప్రభ్సిమ్రన్ సింగ్ను జలంధర్ వారియర్స్, రమణ్దీప్ సింగ్ను మొహాలీ కింగ్స్ కొనుక్కున్నాయి. వీరందరిని ఆయా ఫ్రాంఛైజీలు రూ. 10 లక్షల ధరకు రిజర్వు చేసుకున్నాయి.షేర్-ఈ-పంజాబ్ టీ20 కప్ వేలం-2026లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే1. సన్వీర్ సింగ్ (ఫజిల్క ఫాల్కన్స్)- రూ. 13.02 లక్షలు2. నమన్ ధిర్ (అమృత్సర్ సుర్మాస్)- రూ. 10.80 లక్షలు3. రాహుల్ కుమార్ (అమృత్సర్ సుర్మాస్)- రూ. 8.40 లక్షలు4. అన్మోల్ప్రీత్ సింగ్ (మొహాలీ కింగ్స్)- రూ. 8.20 లక్షలు5. సలీల్ అరోరా (లుథియానా లయన్స్)- రూ. 8 లక్షలు6. హర్నూర్ సింగ్ (భటిండా రాయల్స్)- రూ. 7 లక్షలు7. అశ్వనీ కుమార్ (భటిండా రాయల్స్)- రూ. 7 లక్షలు8. అన్మోల్ మల్హోత్రా (జలంధర్ వారియర్స్)- రూ. 6.20 లక్షలు9. సుఖ్దీప్ బజ్వా (జలంధర్ వారియర్స్)- రూ. 6 లక్షలు10. ఆయుశ్ గోయల్ (మొహాలీ కింగ్స్)- రూ. 4.60 లక్షలు. చదవండి: సిరాజ్ సిక్సర్ల జోరు.. భారత్ గెలుపు View this post on Instagram A post shared by Sher-E-Punjab T20 League (@sherepunjabt20) -
భయపెడుతున్న గాయాలు.. గిల్ ఫిట్నెస్పై కీలక అప్డేట్!
శ్రీలంకతో తొలి టెస్టుకు ముందు భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ ఫిట్నెస్పై జట్టు మేనేజ్మెంట్ కీలక అప్డేట్ ఇచ్చింది. తొలి టెస్టుకు ముందు లంకతో ఆడిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో బరిలోకి దిగిన గిల్ చేతి వేలికి చిన్న గాయమైన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దూరంగా ఉన్న గిల్.. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చి 44 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే బ్యాటింగ్ చేసే సమయంలో గిల్ చేతి వేలి గాయంతో ఏమైనా బాధపడ్డాడా లేక బాగానే ఉన్నాడా అన్నదానిపై భారత బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే స్పందించాడు. 'నెట్ ప్రాక్టీస్ సందర్భంగా స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న గిల్ చేతి వేలికి చిన్న గాయమైంది. అయితే అతడికి అయిన గాయం మైనర్దే అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగానే వార్మప్ మ్యాచ్లో తొలి రెండు రోజులు ఆటకు దూరంగానే ఉన్నాడు. అయితే రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగిన గిల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా కనిపించాడు. దీంతో అతడి చేతివేలి గాయం పూర్తిగా తగ్గిపోయినట్లే. తన బ్యాటింగ్తో తొలి టెస్టుకు దూరమవుతాడన్న సందేహాలను కూడా గిల్ పటాపంచలు చేశాడు. ఇది చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇప్పటికే టీమిండియాకు ఎంపికైన 13 మంది ఆటగాళ్లు ప్రస్తుతం గాయాల బారిన పడి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లో పునరావాస కేంద్రంలో గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో మరే ఆటగాడు గాయపడ్డా టీమిండియాకు ఎదురుదెబ్బ అవుతుందని భయపడుతున్నాం. అందుకే గిల్కు చిన్న గాయమే అయినప్పటికీ, పూర్తిగా కోలుకోవాలనే వార్మప్ మ్యాచ్లో తొలి రెండు రోజులు ఆడించలేదు. చేతి వేలి గాయం మానడంతో చివరి రోజు బ్యాటింగ్కు దిగిన గిల్ మంచి ఈజ్తో బ్యాటింగ్ చేసి తొలి టెస్టుకు పూర్తి స్థాయిలో సిద్ధమైనట్లు పరోక్షంగా సంకేతాలిచ్చాడు.' అని చెప్పుకొచ్చాడు. లంకతో జరిగిన వార్మప్ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చిన గిల్ 55 బంతుల్లో 44 పరుగులు చేశాడు. 21వ ఓవర్లో కేషారా నువంతా బౌలింగ్లో గిల్ వెనుదిరిగాడు. ఇక గిల్ గాయం మొదట మేనేజ్మెంట్ను భయపెట్టినప్పటికీ, అతడు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించడంతో ఊపిరి పీల్చుకుంది. ఇక 2025 నుంచి గిల్ టెస్టుల్లో నాలుగో స్థానంలో వస్తున్నాడు. అంతకముందు 2020 నుంచి 2023 వరకు గిల్ టెస్టుల్లో ఓపెనర్గా ఆడాడు. అయితే జైస్వాల్కు జతగా కేఎల్ రాహుల్ ఓపెనర్గా అదరగొట్టడంతో వీరి జోడినే శ్రీలంక టెస్టు సిరీస్లోనూ కంటిన్యూ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ లెక్కన గిల్ మరోసారి నాలుగో స్థానంలోనే బ్యాటింగ్కు రానున్నాడు. ఇక టెస్టుల్లో గిల్కు నాలుగో స్థానంలో మంచి రికార్డు ఉంది. 14 ఇన్నింగ్స్ల్లో 88.75 సగటుతో గిల్ ఆరు సెంచరీలు సాధించడం విశేషం. లంకతో జరిగిన వార్మప్ మ్యాచ్లో ఘన విజయం సాధించిన టీమిండియా తొలి టెస్టును ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ఆడనుంది.Read: ఐదేళ్ల వయసులోనే MMA చాంపియన్.. ఎవరీ బుడ్డోడు! -
టీమిండియాకు గ్రేట్ న్యూస్.. టచ్లోకి వచ్చిన జైస్వాల్, గిల్
శ్రీలంక క్రికెట్ ఎలెవెన్తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ భారత బ్యాటింగ్ విభాగానికి బాగా ఉపయోగపడింది. ప్రతి బ్యాటర్ ఏదో ఒక ఇన్నింగ్స్లో మంచి ప్రాక్టీస్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో దేవదత్ పడిక్కల్ (142 నాటౌట్), రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ హర్ట్), కేఎల్ రాహుల్ (40).. రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (61 రిటైర్డ్ హర్ట్), శుభ్మన్ గిల్ (44) పరుగులు రాబట్టారు. ఆగస్ట్ 15 నుంచి శ్రీలంకతో జరుగబోయే తొలి టెస్ట్కు ముందు ఇది శుభపరిణామం. ఇదే జోరును బ్యాటర్లు తొలి టెస్ట్లోనూ కొనసాగిస్తే టీమిండియా గెలుపు తథ్యం.టచ్లోకి వచ్చిన జైస్వాల్, గిల్తొలి ఇన్నింగ్స్లో డకౌటై నిరాశపర్చిన యశస్వి జైస్వాల్, రెండో ఇన్నింగ్స్లో పుంజుకొని మెరుపు అర్ద సెంచరీతో చెలరేగాడు. గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దూరంగా ఉన్న కెప్టెన్ శుభ్మన్ గిల్.. రెండో ఇన్నింగ్స్లో గాయాన్ని అధిగమించడంతో పాటు ఫామ్ను కూడా చాటుకున్నాడు. జైస్వాల్, గిల్ టచ్లోకి రావడం టీమిండియాకు శుభసూచకం. వీరికి పడిక్కల్, రాహుల్ కూడా తోడైతే తొలి టెస్ట్లో టీమిండియా గెలుపును లంక బౌలర్లు అడ్డుకోలేరు.విజయం దిశగా భారత్207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ గెలుపు దిశగా సాగుతోంది. ఆట చివరి రోజు కావడం, అందులోనూ సమయం కూడా కొద్దిగానే ఉండటంతో భారత బ్యాటర్లు వేగంగా ఆడుతున్నారు. ముఖ్యంగా జైస్వాల్ పరిమిత ఓవర్ల తరహాలో బ్యాటింగ్ చేసి భారత గెలుపుకు పునాది వేశాడు. 30 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 152-2గా ఉంది. పంత్ (28), జడేజా (0) క్రీజ్లో ఉన్నారు. మరో 55 పరుగులు చేస్తే ఈ మ్యాచ్లో టీమిండియా గెలుస్తుంది. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన పంత్ ఈ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూనే భారత్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. జురెల్ (17) ఒక్కడే కాస్త నిరుత్సాహపరిచాడు.టార్గెట్ 207లంక ఎలెవెన్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, టీమిండియా ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిషాన్ మధుష్క (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. అంజల బండార (35), నిపున్ ధనంజయ (46) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ చెరో వికెట్ దక్కించుకున్నారు.పడిక్కల్ అజేయ శతకంభారత్ తొలి ఇన్నింగ్స్ను 357 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (142 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తా చాటాడు. రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్ (40), మానవ్ సుతార్ (41), గుర్నూర్ బ్రార్ (36 నాటౌట్), సరాన్ష్ జైన్ (22 రిటైర్డ్ హర్ట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో అసంక మనోజ్, రమేశ్ మెండిస్ తలో 2 వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, కేశర నువంత చెరో వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. నిషాన్ మధుష్క (66), రవిందు రషాంత (71), సోనల్ దినుష (52) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలో 2 వికెట్లు తీయగా.. బ్రార్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
శ్రీలంకతో తొలి టెస్ట్.. టీమిండియాకు గుడ్ న్యూస్
శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకు గుడ్ న్యూస్. ప్రాక్టీస్ సెషన్లో కుడి చేతి వేలికి గాయం కావడంతో తొలి టెస్టుకు కెప్టెన్ శుబ్మన్ గిల్ అందుబాటులో ఉంటాడా?లేదా? ఆందోళన అందరిలోనూ నెలకొంది.అయితే ఇప్పుడు గిల్ పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అతడు తిరిగి నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ క్రమంలో కొలంబో వేదికగా శ్రీలంక ఎలెవన్తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్లో గిల్ సెకెండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చే అవకాశముంది.ఈ చేతి వేలి గాయం కారణంగానే తొలి రెండు రోజుల ఆటకు మాత్రం అతడు దూరంగా ఉన్నాడు. మూడో రోజు ఫీల్డింగ్ రానప్పటికి బ్యాటింగ్ మాత్రం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. గిల్ గైర్హజరీలో భారత కెప్టెన్గా రాహుల్ వ్యహరిస్తున్నాడు.ఇప్పటికే శ్రీలంకతో సిరీస్కు ఇన్ఫామ్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, సాయిసుదర్శన్లు గాయం కారణంగా దూరమయ్యారు. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా తొలి టెస్ట్లో ఆడేది అనుమానమే. ఇక ఈ ప్రాక్టీస్ మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంక జట్టు తమ తొలి ఇన్నింగ్స్ను 363/8 డిక్లేర్ చేసింది.మొదటి ఇన్నింగ్స్లో భారత పేసర్లు ఆకట్టుకోలేకపోయారు. కుల్దీప్ యాదవ్, జడేజా, మానవ్ సుతార్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 357/6 వద్ద డిక్లేర్ చేసింది. దేవ్దత్ పడిక్కల్ (164 బంతుల్లో18 ఫోర్లతో 142 ) భారీ సెంచరీతో కదం తొక్కాడు. నాలుగో స్థానంలో వచ్చిన రవీంద్ర జడేజా 63 పరుగులు సాధించాడు. ఇక మూడో రోజు లంచ్ సమయానికి శ్రీలంక 24 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. -
అతడికి అసలైన పరీక్ష ఇక్కడే: శ్రీలంక మాజీ క్రికెటర్
శ్రీలంక మాజీ క్రికెటర్ హషాన్ తిలకరత్నె టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్పై ప్రశంసలు కురిపించాడు. గిల్ బ్యాటింగ్ టెక్నిక్ అద్భుతమని కొనియాడాడు. అయితే, శ్రీలంక గడ్డపై మాత్రం అతడికి కఠిన సవాలు తప్పదని పేర్కొన్నాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా రెండు మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లింది. 2017 తర్వాత లంక గడ్డ మీద భారత్ టెస్టు సిరీస్ ఆడటం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం భారత టెస్టు జట్టులో శుబ్మన్ గిల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఆరు శతకాలుటెస్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొమ్మిది మ్యాచ్లలో కలిపి ఏకంగా ఆరు శతకాలు బాదాడు. సగటు 82కు పైగా ఉండటం విశేషం. ఇంగ్లండ్లో అత్యుత్తమంగా రాణించాడు.అయితే, శ్రీలంకలో గిల్ రెడ్బాల్ మ్యాచ్ ఆడటం మాత్రం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో లంక మాజీ బ్యాటర్ హషాన్ తిలకరత్నె రెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘గిల్ బ్యాటింగ్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అతడి బ్యాటింగ్ టెక్నిక్ అద్భుతంగా ఉంటుంది.ఇక్కడే అసలైన పరీక్షబ్యాటింగ్ పిచ్ల మీద అందమైన షాట్లు ఆడటం అతడికే చెల్లింది. అయితే, శ్రీలంకలో టర్నింగ్ పిచ్ల మీద అతడు ఎలా ఆడతాడన్నదే ఇప్పుడు ఆసక్తికర విషయం. ఈ సిరీస్ అతడికి నిజమైన పరీక్ష. ఇక్కడ అతడికి కఠిన సవాలు ఎదురవుతుంది. శ్రీలంక వికెట్ల మీద గిల్ ఎలా ఆడతాడో చూద్దాం’’ అని పేర్కొన్నాడు.కాగా శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే గిల్ గాయపడిన సంగతి తెలిసిందే. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి కుడిచేతి వేలికి గాయమైంది. ఇందుకు సంబందించి బీసీసీఐ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇక గాయం కారణంగా శ్రీలంక ఎలెవన్తో శుక్రవారం మొదలైన మూడు రోజుల వార్మప్ మ్యాచ్కు గిల్ దూరమయ్యాడు. అతడి గైర్హాజరీలో సీనియర్ బ్యాటర్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సారథిగా బాధ్యతలు చేపట్టాడు. కాగా భారత్-శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలుకానున్నాయి. ఇందుకు గాలె, కొలంబో వేదికలు.చదవండి: భారత్ తోమ్యాచ్.. వన్డే తరహాలో లంక ఓపెనర్ దూకుడు -
గిల్కు గాయం.. బీసీసీఐ అధికారిక ప్రకటన
టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ గాయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక అప్డేట్ అందించింది. ప్రస్తుతం అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. కాగా గిల్ ఇటీవల తరచూ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఇంగ్లండ్తో వన్డే సిరీస్ సందర్భంగా కండరాల నొప్పితో గిల్ ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న గిల్.. శ్రీలంకతో టెస్టు సిరీస్కు సిద్ధమయ్యాడు. అతడి సారథ్యంలో టీమిండియా లంకతో రెండు మ్యాచ్లు ఆడనుంది.ఫైనల్ రేసులో ఉండాలంటే గాలె, కొలంబో వేదికలుగా భారత్- శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలు కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్ ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ ఈ సిరీస్లో ఆతిథ్య శ్రీలంకను 2-0తో వైట్వాష్ చేయాల్సిందే.గిల్కు గాయంకాగా టీమిండియా శ్రీలంక గడ్డ మీద చివరగా 2017లో టెస్టు సిరీస్ ఆడింది. ఈ నేపథ్యంలో స్థానిక పిచ్ పరిస్థితులకు అలవాటు పడే క్రమంలో టీమిండియా శ్రీలంక ఎలెవన్తో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. అయితే, గురువారం నెట్స్లో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే క్రమంలో గిల్ కుడిచేతి వేలికి గాయమైంది.ఈ క్రమంలో టీమ్ డాక్టర్ వచ్చి పరిశీలించి బాండ్ఎయిడ్ వేయగా.. గిల్ తిరిగి బ్యాటింగ్ చేశాడు. అయితే, శ్రీలంక ఎలెవన్తో టాస్ సందర్భంగా గిల్ మైదానంలోకి రాలేదు. అతడికి బదులు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్కు వచ్చాడు.బీసీసీఐ అధికారిక ప్రకటనఈ నేపథ్యంలో బీసీసీఐ గిల్ గాయం నుంచి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘కెప్టెన్ శుబ్మన్ గిల్ గాయపడ్డాడు. గురువారం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి కుడిచేతి ఉంగరం వేలుకు గాయమైంది.ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శ్రీలంక ఎలెవన్తో వామప్ మ్యాచ్లో తొలిరోజు గిల్ మైదానంలోకి రాడు. బీసీసీఐ వైద్యబృందం అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. గిల్ గైర్హాజరీలో ఈ మ్యాచ్లో కేఎల్ జట్టును ముందుకు నడిపిస్తాడు’’ అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.శ్రీలంకతో టెస్టు సిరీస్కు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్.చదవండి: వాళ్లిద్దరికి కంగ్రాట్స్.. ప్రతీ ప్రశ్నకు సమాధానమిస్తాం: గంభీర్ -
IND vs SL: టాస్ గెలిచిన శ్రీలంక.. భారత కెప్టెన్గా కేఎల్ రాహుల్
శ్రీలంకతో టెస్టు సిరీస్కు టీమిండియా సన్నాహకాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి శ్రీలంక ఎలెవన్ జట్టుతో మూడు రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. కొలంబోలోని నాండెస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్ ఇందుకు వేదిక. ప్రాక్టీస్ మ్యాచ్లో భాగంగా టాస్ గెలిచిన శ్రీలంక ఎలెవన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. భారత్ను బౌలింగ్కు ఆహ్వానించింది.గిల్కు గాయం.. సారథిగా రాహుల్ఇదిలా ఉంటే.. టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్కు బదులు.. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వచ్చాడు. నెట్స్లో గురువారం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గిల్ కుడిచేతి వేలికి గాయమైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో శ్రీలంక ఎలెవన్తో ప్రాక్టీస్ మ్యాచ్లో శుక్రవారం నాటి తొలి రోజు ఆటలో గిల్కు విశ్రాంతినిచ్చారు. ఇందుకు సంబంధించి బీసీసీఐ అధికారిక అప్డేట్ అందించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గిల్ తొలి రోజు వామప్ మ్యాచ్కు అందుబాటులో ఉండడని తెలిపింది. భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్.శ్రీలంక ఎలెవన్ జట్టునిశాన్ మధుష్క (వికెట్ కీపర్), నిపుణ్ ధనంజయ, రవిందు రశాంత, పవన్ రత్ననాయకె, అహాన్ విక్రమసింఘే, సోనాల్ దినుష (కెప్టెన్), రమేశ్ మెండిస్, దిలుమ్ సుదీర, విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమార, పసిందు సూరియబండారా, ఇసిత విజేసుందెర, అసంక మనోజ్, అంజలా బండారా, కేశరా నువాంత.చదవండి: వాళ్లిద్దరికి కంగ్రాట్స్.. ప్రతీ ప్రశ్నకు సమాధానమిస్తాం: గంభీర్ -
IND vs SL: శుబ్మన్ గిల్కు గాయం!
శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు సమచారం. కెప్టెన్ శుబ్మన్ గిల్ వేలికి గాయమైనట్లు తెలుస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా రెండు మ్యాచ్లు ఆడేందుకు భారత క్రికెట్ జట్టు శ్రీలంకకు వెళ్లింది. గాలె, కొలంబో వేదికలుగా ఇరుజట్ల మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది.బలంగా తాకిన బంతిఅయితే, అంతకంటే ముందు భారత్.. శ్రీలంక ఎలెవన్ జట్టుతో శుక్రవారం నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో తలపడనుంది. ఈ నేపథ్యంలో నెట్స్లో ప్రాక్టీస్ చేస్తుండగా గిల్ గాయపడినట్లు రెవ్స్పోర్ట్స్ వెల్లడించింది. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే క్రమంలో గిల్ కుడిచేతి బొటనవేలికి బంతి బలంగా తాకిందని పేర్కొంది.ఈ క్రమంలో టీమ్ డాక్టర్ వచ్చి గిల్ గాయాన్ని పరిశీలించాడు. ట్రీట్మెంట్ తీసుకున్న గిల్.. కాసేపటి తర్వాత బ్యాటింగ్ సెషన్ కొనసాగించినట్లు పేర్కొంది. కాగా భారత్- శ్రీలంక ఎలెవన్ మధ్య ప్రాక్టీస్ మ్యాచ్కు కొలంబోలోని నోండెస్ప్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ (NCC) వేదిక.ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 ఫైనల్ రేసులో ఉండాలంటే టీమిండియా శ్రీలంకలో సత్తా చాటాల్సిందే. ఆతిథ్య జట్టును 2-0తో వైట్వాష్ చేస్తేనే గిల్ సేన అవకాశాలు మెరుగుపడతాయి. చివరగా వైట్వాష్డబ్ల్యూటీసీలో భాగంగా చివరగా స్వదేశంలో సౌతాఫ్రికాతో తలపడ్డ టీమిండియా ప్రత్యర్థి చేతిలో 2-0తో క్లీన్స్వీప్ అయింది. అనంతరం.. అఫ్గానిస్తాన్తో ఇటీవల నామమాత్రపు టెస్టులో మాత్రం విజయం సాధించింది. అయితే, ఇది డబ్ల్యూటీసీలో భాగం కాదు.ఇక ఇప్పటికే టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా శ్రీలంకతో సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో బారాముల్లా ఎక్స్ప్రెస్ ఆకిబ్ నబీ తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చాడు. అంతకుముందు ఇంగ్లండ్ పర్యటన సందర్భంగానే బుమ్రాతో పాటు గాయపడ్డ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఈ టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. అతడి స్థానంలో సెలక్టర్లు 33 ఏళ్ల సారాంశ్ జైన్ను తొలిసారి టీమిండియాకు ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గిల్ కండరాల నొప్పితో బాధపడిన సంగతి తెలిసిందే.శ్రీలంకతో టెస్టు సిరీస్కు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (ఫిట్నెస్ ఆధారంగా), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ.చదవండి: రూ. కోటిన్నర నజరానా!.. అస్మితకు భారీ షాక్! -
భారత్తో మ్యాచ్.. శ్రీలంక జట్టు ప్రకటన! కెప్టెన్ ఎవరంటే?
భారత్-శ్రీలంక మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియా ఆగస్టు 7 నుంచి కొలంబో వేదికగా శ్రీలంక-ఎతో మూడు రోజుల వార్మాప్ మ్యాచ్లో తలపడనుంది. ఈ క్రమంలో వార్మప్ మ్యాచ్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా సోనాల్ దినుషాను నియమించారు.ఈ జట్టులో రమేష్ మెండిస్, లహిరు కుమార వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. అదేవిధంగా దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న నిషాన్ మదుష్క, పసిందు సూరియబండార వంటి యువ ఆటగాళ్లను లంక సెలక్టర్లు 'ఎ' జట్టుకు ఎంపిక చేశారు.కాగా శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే శ్రీలంక గడ్డపై అడుగు పెట్టింది. అయితే ఈ టూర్కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. అతడి స్దానంలో జమ్మూ కాశ్మీర్ స్పీడ్ స్టార్ ఆకిబ్ నబీకి సెలక్టర్లు అవకాశమిచ్చారు.భారత్తో ప్రాక్టీస్ మ్యాచ్ కోసం లంక-ఎ జట్టునిషాన్ మదుష్క, రవిందు రశాంత, పసిందు సూరియబండార, పవన్ రత్నాయకే, అహన్ విక్రమసింఘే, సోనాల్ దినుషా(కెప్టెన్), అంజల బండార(వికెట్ కీపర్), నిపున్ దనంజయ, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, అసంక మనోజ్, ఇసిత విజేసుందర, దిలుమ్ రమేష్ మెండిస్చదవండి: DPL 2026: పప్పూ యాదవ్ తనయుడి విధ్వంసం.. 7 ఫోర్లు, 8 సిక్స్లతో -
వన్డే వరల్డ్కప్ కోసం భారత జట్టు ఇదే.. గంభీర్ ఫేవరేట్కు ఛాన్స్!?
వన్డే ప్రపంచకప్-2027కు ఆతిథ్యమిచ్చేందుకు సౌతాఫ్రికా, నమీబియా, జింబాబ్వే వంటి ఆఫ్రికా దేశాలు సిద్దమవుతున్నాయి. వచ్చే ఏడాది ఆక్టోబర్లో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే వేదికలను సైతం ఐసీసీ ఖారారు చేసింది. మొత్తం మూడు దేశాల్లోని 12 నగరాల్లో ఈ ఈవెంట్ జరగనుంది. అయితే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్కు ఇంకా 14 నెలల సమయం ఉన్నప్పటికి ఇప్పటి నుంచే భారత జట్టు ఎంపికపై అంచనాలు మొదలయ్యాయి. 2011 తర్వాత ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్ గెలవని టీమిండియా.. వచ్చే ఏడాది జరిగే మెగా టోర్నీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మెగా టోర్నీ కోసం పటిష్టమైన జట్టును ఆఫ్రికాకు పంపాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో వరల్డ్కప్ కోసం భారత జట్టును దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అంచనా వేశారు. కెప్టెన్ శుబ్మన్ గిల్తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి స్టార్ బ్యాటర్లకు గవాస్కర్ టాప్-5లో చోటిచ్చారు. అదేవిధంగా వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ను ఆయన ఎంపిక చేశారు. ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డికి, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా గవాస్కర్ ఛాన్స్ ఇచ్చారు. అయితే రవీంద్ర జడేజా భారత వన్డే ప్రపంచకప్ లేనిట్లు తెలుస్తోంది. అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లకు జడేజాను సెలక్టర్లు ఎంపిక చేయలేదు.అయినప్పటికి జడేజా లాంటి సీనియర్ ఆల్రౌండర్ను వరల్డ్కప్కు ఎంపిక చేయాలని సెలక్టర్లు సన్నీ సూచించారు. ఇక బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్లకు గవాస్కర్ అవకాశమిచ్చారు. కాగా హర్షిత్ రాణాను భారత జట్టుకు ఎంపిక చేయడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. గంభీర్ సపోర్ట్తోనే అతడికి జట్టులో చోటు దక్కుతుందని చాలా మంది మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో గవాస్కర్ వంటి లెజెండరీ క్రికెటర్ హర్షిత్ను వరల్డ్కప్కు ఎంపిక చేయమని సూచించడం గమనార్హం.గవాస్కర్ ఎంపిక చేసిన భారత జట్టు ఇదేశుబ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా , జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్ -
తీవ్ర అసంతృప్తిలో గిల్, గంభీర్.. వాళ్లపై బీసీసీఐ వేటు!
ఇటీవలి కాలంలో టీమిండియాకు గాయాల బెడద ఎక్కువైంది. కీలక ఆటగాళ్లంతా జట్టుకు అవసరమైన సమయంలో అందుబాటులో లేకుండా పోతున్నారు. జట్టు విజయావకాశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది.పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్-2026 తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికయ్యాడు, అయితే, గాయం వల్ల టూర్ మొత్తానికి అతడు దూరమయ్యాడు. పాండ్యా మాదిరే అరుదైన నైపుణ్యాలున్న నితీశ్ కుమార్ రెడ్డి కూడా గాయపడ్డాడు.యువ పేసర్ హర్షిత్ రాణాతో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ పేస్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ ఇటీవలే ఈ గాయాల జాబితాలో చేరారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.ఫిజియోథెరపీ టీమ్లో సమూలంగా మార్పులు చేపట్టేందుకు బోర్డు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇంజూరీ మేనేజ్మెంట్, ఫిట్నెస్ క్లియరెన్స్ల విషయంలో స్పష్టత లేదని.. ఇందుకు హెడ్ ఫిజియోథెరపిస్ట్ నిర్లక్ష్యమే కారణమని యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లు క్లియరెన్స్ సర్టిఫికెట్తో తిరిగి వచ్చిన తర్వాత.. ఆ వెంటనే మళ్లీ గాయాల బారిన పడటాన్ని ఇందుకు నిదర్శనంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హెడ్ ఫిజియోథెరపిస్ట్ కమలేశ్ జైన్, టీమ్ డాక్టర్ రిజ్వాన్ ఖాన్లపై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం.ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘కమలేశ్ జైన్ విషయంలో మేనేజ్మెంట్ అసంతృప్తితో ఉంది. ఆటగాళ్లు తరచూ గాయాలబారిన పడటం వల్ల కెప్టెన్ శుబ్మన్ గిల్, హెడ్కోచ్ గౌతం గంభీర్ తమ తుదిజట్టు కూర్పులో ఇబ్బంది పడుతున్నారు.పదిహేను మంది సభ్యులు ఉన్నప్పటికీ సరైన కాంబినేషన్ని సెట్ చేయలేక తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గాయాల విషయంలో సిబ్బంది పూర్తి అవగాహన, స్పష్టతతో ఉండాలి. ఆటగాళ్లను తిరిగి మైదానంలోకి పంపేందుకు తొందరపడకూడదు.వారు పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాతే సర్టిఫికెట్ జారీచేయాలి. హడావుడిగా రంగంలోకి దించడం వల్ల పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది. నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా విషయంలో ఇదే జరిగింది. ఇలాంటి తొందరపాటు చర్యలు కీలక సమయంలో జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తాయి. అందుకు సదరు బృందం కచ్చితంగా జవాబుదారీగా ఉండాల్సిందే. వారి నుంచి సరైన వివరణ లభించకపోతే వేటు తప్పకపోవచ్చు’’ అని పేర్కొన్నాయి.కాగా ఆటగాళ్లు తరచూ గాయపడటం పట్ల టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుబ్మన్ గిల్ బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఒకటి, రెండు మ్యాచ్ల తర్వాత ఆటగాళ్లు గాయపడితే.. వన్డే వరల్డ్కప్-2027 వంటి మేజర్ టోర్నీలో తమకు ఇబ్బందులు తప్పవన్నాడు. ఫిట్నెస్ సమస్యలు మెరుగుపరచుకుంటేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలమని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే అతడు బీసీసీఐ వైద్య బృందాన్ని కాదని.. చికిత్స కోసం బయటి డాక్టర్లను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. కాగా గిల్ తరచూ మెడనొప్పి, కండరాల నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.చదవండి: బుమ్రా అవుట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ -
శుబ్మన్ గిల్, అభిషేక్ శర్మ కీలక నిర్ణయం!
టీమిండియా టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుబ్మన్ గిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ స్థానిక టీ20 లీగ్లో ఆడేందుకు అతడు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. గిల్తో పాటు టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రభ్సిమ్రన్ సింగ్.. అదే విధంగా రమణ్దీప్ సింగ్ ఈ లీగ్లో భాగం కానున్నట్లు తెలుస్తోంది.పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) ... షేర్-ఈ-పంజాబ్ పేరిట తమ సొంత టీ20 లీగ్ను నిర్వహించనున్నట్లు ఆదివారం ప్రకటించింది. స్థానిక ఆటగాళ్లను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. చండీగఢ్లో జరిగిన ఈ కార్యక్రమంలో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ పాల్గొన్నాడు.ఇదొక చక్కటి ప్లాట్ఫామ్ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘యువ ఆటగాళ్లను తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇదొక చక్కటి ప్లాట్ఫామ్. క్రమంగా పంజాబ్ జట్టు, టీమిండియా స్థాయికి ఎదిగేందుకు షేర్-ఈ-పంజాబ్ దోహదం చేస్తుంది. పంజాబ్ ఎల్లప్పుడూ టీమిండియాకు అత్యుత్తమ క్రికెటర్లను అందించింది.ఈ లీగ్ ద్వారా కూడా మరెంతో మంది వెలుగులోకి వస్తారని నమ్ముతున్నాను. మా గ్రామంలో నాన్న క్రికెట్ అకాడమీ నిర్వహించేవారు. అక్కడ ఉచితంగానే కోచింగ్ ఇచ్చేవాళ్లము. ఇప్పటికీ మా నాన్నకి కాస్త సమయం దొరికితే అక్కడికి వెళ్లి పిల్లల ఆటను గమనిస్తారు. క్రికెట్ పట్ల ఆయనకు ఉన్న అంకితభావం అలాంటిది’’ అని శుబ్మన్ గిల్ పేర్కొన్నాడు.గిల్, బ్రార్ ఆలస్యంగానైనా..కాగా ఆగష్టు 30 నుంచి సెప్టెంబరు 13 మధ్య షేర్-ఈ-పంజాబ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్ తదితరులు ఈ లీగ్కు అందుబాటులో ఉన్నప్పటికీ.. శుబ్మన్ గిల్, గుర్నూర్ బ్రార్ మాత్రం కాస్త ఆలస్యంగా తమ జట్లతో చేరే అవకాశం ఉంది. వీరిద్దరు ఆగష్టు 15- 28 వరకు శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్తో బిజీగా ఉండనున్నారు. ఇదిలా ఉంటే.. షేర్-ఈ-పంజాబ్ లీగ్ ఆరంభ ఎడిషన్లో ఆరుజట్లు పాల్గొననున్నాయి. అమృత్సర్, ఫజిల్క, జలంధర్, లుథియానా, మొహాలీ, భటిండా టైటిల్ కోసం పోటీపడనున్నాయి.చదవండి: అభిషేక్ శర్మ విధ్వంసం... 91 బంతుల్లో 233 పరుగులు -
శుబ్మన్ గిల్ సంచలన నిర్ణయం!
టీమిండియా టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుబ్మన్ గిల్ గత కొంతకాలంగా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ఎక్కువసేపు బ్యాటింగ్ చేస్తే అతడి కండరాలు పట్టేస్తున్నాయి. తరచూ మెడ నొప్పి కారణంగానూ అతడు ఇబ్బంది పడుతున్నాడు.ఇటీవల ఇంగ్లండ్తో వన్డే సిరీస్ సందర్భంగానూ గిల్ అసౌకర్యానికి గురైన సంగతి తెలిసిందే. ఎడ్జ్బాస్టన్లో తొలి వన్డేలో బ్యాటింగ్ చేస్తున్న వేళ కండరాల నొప్పితో గిల్ 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. అంతకుముందు స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు, ఐపీఎల్ సందర్భంగా మెడ నొప్పితో మ్యాచ్లు మిస్సయ్యాడు.అక్కడ ఎలా ఆడగలరు?విరామం లేని షెడ్యూల్, ఒత్తిడి ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. ఇక రానున్న ఏడాది కాలంలో టీమిండియా మరింత బిజీ కానుంది. ముఖ్యంగా వన్డే వరల్డ్కప్-2027 వంటి మేజర్ ఐసీసీ టోర్నీలో తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫిట్నెస్ సమస్యల గురించి గిల్ మాట్లాడిన సంగతి తెలిసిందే.ఒకటి, రెండు మ్యాచ్లు ఆడిన తర్వాత గాయపడి.. జట్టుకు దూరమయ్యే వాళ్లు వరల్డ్కప్లో వరుసగా ఏడు- ఎనిమిది మ్యాచ్లు ఎలా ఆడగలరని ప్రశ్నించాడు. జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకొని ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి తర్వాత ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.శుబ్మన్ గిల్ సంచలన నిర్ణయంఅయితే, స్వయంగా గిల్ సైతం గాయాల బారిన పడటాన్ని ఇంగ్లండ్ దిగ్గజం స్టువర్ట్ బ్రాడ్ ప్రశ్నించాడు. డెబ్బై పరుగులు చేయగానే కండరాలు పట్టేయడం.. మైదానం నుంచి నిష్క్రమించడం గిల్కు అలవాటైపోయిందని విమర్శించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో శుబ్మన్ గిల్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.బీసీసీఐ వైద్య బృందాన్ని కాదని.. ఫిట్నెస్ సమస్యలకు పరిష్కారం కనుగొనే క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వైద్య బృందాన్ని కాదని.. బయటి డాక్టర్ల వద్ద గిల్ చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ..‘‘చాన్నాళ్లుగా గిల్ మెడ నొప్పితో బాధపడుతున్నాడు. రోజురోజుకీ పరిస్థితి దిగజారిపోతోందని భావించాడు. అందుకే బీసీసీఐ వైద్యబృందాన్ని కాదని.. బయటి డాక్టర్ల దగ్గర చికిత్స తీసుకున్నాడు. పరిస్థితి ఇప్పుడు చాలా వరకు మెరుగుపడింది. అయితే ఇది నిరంతర ప్రక్రియ’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.చదవండి: 30 ఏళ్లు దాటినా తగ్గేదేలే!.. టీమిండియాలో రీఎంట్రీకి సై! -
అగ్రపీఠంపై గిల్.. వైభవ్ భారీ జంప్
తాజా ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత క్రికెటర్ల హవా కొనసాగింది. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఏకంగా 230 స్థానాలు ఎగబాకి కెరీర్లోనే అత్యుత్తమమైన 48వ ర్యాంక్కు చేరుకోగా, వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ మళ్లీ ప్రపంచ నంబర్-1 బ్యాటర్గా నిలిచాడు.జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తాజా ర్యాంకింగ్స్లో భారీగా లాభపడ్డాడు. ప్రస్తుతం అతను 536 రేటింగ్ పాయింట్లతో 48వ స్థానంలో కొనసాగుతున్నాడు.అదే సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన ఇషాన్ కిషన్ 916 రేటింగ్ పాయింట్లతో టీ20 బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (912 కెరీర్ బెస్ట్), విరాట్ కోహ్లీ (909 కెరీర్ బెస్ట్) వంటి భారత దిగ్గజాల కెరీర్ రేటింగ్లను కూడా అధిగమించాడు. టీ20 చరిత్రలో అత్యధిక బ్యాటింగ్ రేటింగ్ల జాబితాలో అభిషేక్ శర్మ (931), డేవిడ్ మలాన్ (919) తర్వాత ఇషాన్ కిషన్ (916 కెరీర్ బెస్ట్) మూడో స్థానంలో ఉన్నాడు.ఇతర భారత ఆటగాళ్లలో తిలక్ వర్మ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఆరో ర్యాంక్కు చేరుకోగా, శ్రేయస్ అయ్యర్ ఏడు స్థానాలు ఎగబాకి 24వ స్థానంలో నిలిచాడు. బౌలర్ల జాబితాలో రవి బిష్ణోయ్ 31 స్థానాలు ఎగబాకి 41వ ర్యాంక్ను దక్కించుకున్నాడు.మరోవైపు, వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో డారిల్ మిచెల్ అగ్రస్థానాన్ని కోల్పోవడంతో శుభ్మన్ గిల్ తిరిగి ప్రపంచ నంబర్-1 బ్యాటర్గా అవతరించాడు. ఈ ఏడాది జనవరి నుంచి అగ్రస్థానంలో కొనసాగిన మిచెల్ను వెనక్కి నెట్టి గిల్ మళ్లీ అగ్రపీఠాన్ని అధిరోహించాడు. -
శ్రీలంకతో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన
శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు బీసీసీఐ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మంగళవారం 15 మందితో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. లంకతో జరగనున్న టెస్టు సిరీస్కు శుబ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, కేఎల్ రాహుల్ అతడికి డిప్యుటీగా ఉండనున్నాడు. ఇక ఏడాది తర్వాత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వనుండగా, సారాన్ష్ జైన్ తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక బుమ్రా, సాయి సుదర్శన్లను ఎంపిక చేసినప్పటికీ సిరీస్ మొదలయ్యే సమయానికి ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 మధ్య గాలే వేదికగా, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా రెండో టెస్టు జరగనుంది. అయితే టెస్టు సిరీస్కు ముందు టీమిండియా ఆగస్టు 7 నుంచి కొలంబో వేదికగా నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగా గాయానికి గురైన ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ లంకతో టెస్టు సిరీస్కు ఎంపికవుతాడని భావించినప్పటికీ, అతడి పేరును పరిగణలోకి తీసుకోలేదు. మరో ఆల్రౌండర్ నితీశ్ రానాతో పాటు పేసర్ హర్షిత్ రానాలు కూడా గాయాల నుంచి ఇంకా కోలుకోకపోవడంతో లంక టూర్కు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది.టెస్టు మ్యాచ్ సిరీస్:ఆగస్టు 15-19 వరకు: తొలి టెస్టు, గాలేఆగస్టు 23-27 వరకు: రెండో టెస్టు, కొలంబోభారత జట్టు: శుభమన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్కీపర్), సాయి సుదర్శన్*, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా*, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాన్ష్ జైన్. 🚨 News 🚨#TeamIndia's squad for the 2⃣-match Test Series against Sri Lanka announced Note: Washington Sundar was not available for selection for the first Test. More Details ▶️ https://t.co/Vk0Xd8Axmq #SLvIND pic.twitter.com/NuCcKBohMj— BCCI (@BCCI) July 28, 2026చదవండి: టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి.. విండీస్ బౌలర్ ప్రపంచ రికార్డు -
‘అగార్కర్ వింటున్నావా? వైభవ్ను రోహిత్కు జతగా పంపాలి’
వన్డే ప్రపంచకప్ 2027 దృష్ట్యా టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని వన్డేల్లో కూడా ఆడిస్తే బాగుంటుందని మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్ అభిప్రాయపడ్డాడు. ఓపెనింగ్లో రోహిత్కు జతగా వైభవ్ను పంపించి కెప్టెన్ శుబ్మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్కు ట్యాగ్ చేస్తూ తన సందేశాన్ని వెల్లడించాడు. దీనివల్ల మిడిలార్డర్ కూడా బలంగా మారుతుందని ఫరూఖ్ వెల్లడించాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫరూఖ్ ఇంజినీర్ మాట్లాడుతూ.. 'గిల్ క్లాస్ ప్లేయర్. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సత్తా అతడికి ఉంది. అయితే ఆరంభంలోనే దూకుడుగా ఆడే స్వభావం గిల్కు లేదు. అయితే వైభవ్ సూర్యవంశీ లెఫ్ట్ హ్యాండర్ కావడంతో పాటు రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించగలడు. వైభవ్ ధాటిగా ఆడుతున్నాడంటే ఒక ఎండ్లో రోహిత్ క్రీజులో నిలబడేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. వైభవ్ ఉన్నంతసేపు రోహిత్ తన బ్యాట్కు పని చెప్పాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. ఇక క్లాస్ బ్యాటర్ అయిన గిల్కు నాలుగో స్థానం సరైనది. కోహ్లి ఎలాగూ మూడో స్థానంలో వస్తాడు. ఐదు, ఆరు స్థానాల్లో శ్రేయస్, రాహుల్ వస్తారు. అయితే వైభవ్ను వయసుతో ముడిపెడుతూ వన్డేల్లో అవకాశాలు ఇవ్వడం లేదు. నా వరకు 15 ఏళ్ల వయసు అనేది వన్డే క్రికెట్లో ఎంట్రీకి అర్హతే. అయితే కొందరు మాత్రం వైభవ్ను టీ20ల్లోనే ఆడించాలని, వన్డేల్లో ఇప్పుడే అవసరం లేదని అంటున్నారు. కానీ ఒక బ్యాటర్కు ఏ ఫార్మాట్ అయినా పరుగులు చేయడమే ప్రధానం. ఆరంభంలో ఒకటి రెండు మ్యాచ్లు విఫలమైనప్పటికీ, కుదురుకుంటే ఎంత ప్రమాదకారో ఇప్పటికే వైభవ్ రుచి చూపించాడు. అతడు ఆడితే ఓడినవాటి కంటే గెలిచే మ్యాచ్లే ఎక్కువగా ఉంటాయి. నా దృష్టిలో సర్ వీవీ రిచర్డ్స్ గొప్ప బ్యాటర్. అతడంత గొప్ప బ్యాటర్ను నేను చూడలేదు. ఇప్పుడు సూర్యవంశీ కూడా అలానే కనిపిస్తున్నాడు. రాబోయే కాలంలో వైభవ్ కచ్చితంగా భారతదేశ భవిష్యత్తు ఆశాకిరణంగా మారనున్నాడు.'అని ఫరూఖ్ ఇంజినీర్ చెప్పుకొచ్చాడు.ఐర్లాండ్, ఇంగ్లండ్తో సిరీస్ల్లో అంతగా ఆకట్టుకోని వైభవ్ సూర్యవంశీ జింబాబ్వేతో టీ20 సిరీస్లో మాత్రం అదరగొట్టాడు. మూడు మ్యాచ్లు కలిపి 151 పరుగులు సాధించిన వైభవ్ ఖాతాలో రెండు అర్ధసెంచరీలున్నాయి. తన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా సొంతం చేసుకున్నాడు.Read: కసి మీదున్న సూర్యకుమార్.. 3 గంటల్లో వెయ్యి బంతులా! -
అరుదైన ఘనత సాధించిన గిల్, రూట్
టీమిండియా టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ శుభ్మన్ గిల్, ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించారు. ఈ ఇద్దరూ ఇవాళ (జులై 22) ప్రకటించిన ఐసీసీ టెస్ట్, వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో టాప్-10లో నిలిచారు. తద్వారా ఈ వారాంత టెస్ట్, వన్డే ర్యాంకింగ్స్లో టాప్-10లో నిలిచిన ఇద్దరే ఇద్దరు బ్యాటర్లుగా రికార్డుల్లోకెక్కారు.టెస్టు ర్యాంకింగ్స్లో జో రూట్ మూడో స్థానంలో ఉండగా, గిల్ ఏడో స్థానంలో ఉన్నాడు. వన్డే ర్యాంకింగ్స్లో గిల్ రెండో స్థానంలో ఉండగా.. రూట్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఈ ఇద్దరు బ్యాటర్లు టెస్ట్, వన్డే ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తూ.. అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు. టెస్ట్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే, టీమిండియా కెప్టెన్ ఓ స్థానం కోల్పోయి ఆరు నుంచి ఏడుకు పడిపోగా.. రూట్ మూడో స్థానాన్ని కాపాడుకున్నాడు. ఈ ఫార్మాట్ ర్యాంకింగ్స్లో ట్రవిస్ హెడ్, బ్రూక్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు.వన్డే ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. గిల్ గత వారం లాగే రెండో స్థానంలోనే ఉన్నప్పటికీ, రేటింగ్ పాయింట్ల సంఖ్యను 800 దాటించాడు. తాజాగా భారత్తో జరిగిన సిరీస్లో విశేషంగా రాణించడంతో రూట్ ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 8వ స్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ టాప్లో కొనసాగుతుండగా.. భారత దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నారు. -
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో శుబ్మన్ గిల్
టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ వన్డేల్లో వరల్డ్నంబర్ వన్ బ్యాటర్గా నిలిచేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించిన తాజా వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్ధానానికి గిల్ మరింత చేరవయ్యాడు. ప్రస్తుతం అగ్రస్ధానంలో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డారిల్ మిచెల్ 802 రేటింగ్ పాయింట్లతో నంబర్ 1 స్థానంలో ఉండగా.. గిల్ (801) కేవలం ఒక్క పాయింట్ తేడాతో రెండో స్థానంలో నిలిచాడు. తదుపరి ఐసీసీ ర్యాంకింగ్స్ అప్డేట్లో గిల్ అగ్రస్థానానికి చేరుకుంటే.. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అగ్రపీఠాన్ని అదరోహించిన అత్యంత పిన్న వయస్కుడైన భారత కెప్టెన్గా చరిత్ర సృష్టిస్తాడు. గతంలో భారత్ తరపున వన్డేల్లో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజ క్రికెటర్లు టాప్ ర్యాంక్ను సొంతం చేసుకున్నారు. కాగా ఇంగ్లండ్తో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్లో గిల్ అదరగొట్టాడు. మూడు మ్యాచ్లలో 94.00 అద్భుత సగటుతో 188 పరుగులు సాధించి, భారత్ తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ ప్రదర్శ కారణంగానే అతడిని నంబర్-1 ర్యాంక్ రేసులో ఉన్నాడు.కాగా ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్ల హవా కొనసాగుతోంది. గిల్తో పాటు విరాట్ కోహ్లి 767 పాయింట్లతో మూడో స్థానంలో, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 758 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ సిరీస్లో రోహిత్, కోహ్లి కూడా మెరుగైన ప్రదర్శన చేశారు. ఇక ఇదే సిరీస్లో దుమ్ములేపిన ఇంగ్లండ్ వెటరన్ జో రూట్ నాలుగు స్ధానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంక్కు చేరుకున్నాడు. -
డెబ్బై పరుగులు చేస్తాడు.. కండరాలు పట్టేస్తాయి: ఇంగ్లండ్ దిగ్గజం
టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ ఫిట్నెస్పై ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ప్రశ్నలు సంధించాడు. కాస్త ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసిన ప్రతీసారీ అతడి కండరాలు పట్టేయడం శుభసూచకం కాదన్నాడు. ఇంగ్లండ్తో మొదటి, మూడో వన్డేలో 70 పరుగులు చేసిన తర్వాత గిల్ ఇబ్బంది పడ్డ తీరు జట్టుకు ఎంతమాత్రం మంచిది కాదని బ్రాడ్ పేర్కొన్నాడు.అసహనం వ్యక్తం చేసిన గిల్కాగా టీమిండియా ఆటగాళ్లు తరచూ గాయాల పాలవుతుండటంపై శుబ్మన్ గిల్ ఇటీవల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రెండు, మూడు మ్యాచ్లకు ఒకసారి గాయాలతో అందుబాటులో లేకుండా పోతే... వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్లో ఎలా ఆడతారని ప్రశ్నించాడు. ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆడిన మూడు సిరీస్ల్లోనూ భారత జట్టు ఓటమి పాలైన సంగతి తెలిసిందే ఇంగ్లండ్తో ఆదివారం లార్డ్స్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో గిల్ సారథ్యంలోని టీమిండియా 27 పరుగుల తేడాతో ఓడింది.మోకాలి గాయం కారణంగా ఆఖరి వన్డేకు పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోగా... పెద్దగా అనుభవం లేని భారత బౌలింగ్ను ఇంగ్లండ్ బ్యాటర్లు ఓ ఆటాడుకున్నారు. దీంతో టీమిండియా ముందు రికార్డు లక్ష్యం నిలిచింది. ఛేదనలో ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ సూపర్ సెంచరీకి గిల్, కోహ్లి అర్ధశతకాలు తోడవడంతో ఒక దశలో భారత్ గెలుస్తుందనిపించినా... మిగిలిన ప్లేయర్లు చేతులెత్తేయడంతో పరాజయం తప్పలేదు.గాయాల బెడదఈ సిరీస్ ప్రారంభానికి ముందే పేస్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి గాయాలతో జట్టుకు దూరం కాగా... హర్షిత్ రాణా టీ20 సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. ఇక స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ రెండో మ్యాచ్లో గాయపడగా... మోకాలి గాయంతో బుమ్రా మూడో మ్యాచ్ ఆడలేదు. ఈ నేపథ్యంలో లార్డ్స్లో ఓటమి అనంతరం గిల్ మాట్లాడుతూ... ‘ముందు ప్రకటించిన జట్టులోని ఐదుగురు ఆటగాళ్లు చివరి మ్యాచ్ ఆడలేదు. ఒక ఆటగాడు గాయపడితే... ప్రత్యామ్నాయ వ్యూహాన్ని అనుసరించవచ్చు. ఇద్దరు అందుబాటులో లేకపోతే జట్టు కూర్పును మార్చుకోవచ్చు.దీనికి మందు కనిపెట్టాలికానీ ప్రతి మ్యాచ్ తర్వాత ఎవరో ఒకరు గాయపడుతుంటే... జట్టు సమతుల్యత దెబ్బతింటుంది. దీనికి మందు కనిపెట్టాలి. ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుంటే... అక్కడి వరుసగా పది, పదకొండు మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రెండు మ్యాచ్లకు గాయపడితే... మెగా టోర్నీలో ఎలా ఆడగలం. మ్యాచ్ రోజు ఉదయం వచ్చి నేను ఆడలేను అని అంటే వ్యూహాలు ఎలా అమలు చేయగలం’ అని అన్నాడు.వ్యక్తిగతంగా ఎవరి పేరు ప్రస్తావించకపోయినా... ఇటీవలి కాలంలో తరచూ గాయపడుతున్న ప్లేయర్లను ఉద్దేశించే గిల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవతుంది. ఇదిలా ఉంటే... ఇటీవలి కాలంలో గిల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తరచూ కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.డెబ్బై పరుగులు చేస్తాడు.. కండరాలు పట్టేస్తాయిఈ నేపథ్యంలోనే స్టువర్ట్ బ్రాడ్ గిల్ ఫిట్నెస్ సమస్యల గురించి తాజాగా విమర్శించాడు. ‘‘ప్రతిసారీ అతడు 70 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత.. కండరాల నొప్పితో విలవిల్లాడుతున్నాడు. ఇంగ్లండ్తో తొలి, మూడో వన్డేలో అతడు ఇలాగే రిథమ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు’’ అని పేర్కొన్నాడు. కాగా తొలి వన్డేలో 80 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన శుబ్మన్ గిల్.. మూడో వన్డేలో 77 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత ఆదిల్ రషీద్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు.చదవండి: వైఫల్యాలపై స్పందించిన వైభవ్ సూర్యవంశీ -
వరల్డ్లోనే బెస్ట్.. ఎందుకు ఆడించలేదు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం వైఖరిపై ఇంగ్లండ్ మాజీ ఆల్రౌండర్ మొయిన్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ని తుదిజట్టులోకి తీసుకోకుండా పక్కనపెట్టడం ఏమిటని ప్రశ్నించాడు. కాగా ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.లార్డ్స్ వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డేకు ముందు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడగా.. ఈసారి కుల్దీప్ను ఆడిస్తారని అంతా అనుకున్నారు. కానీ టీమిండియా మేనేజ్మెంట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కుల్దీప్ను కాదని.. పేస్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ను ఆడించింది. మొత్తంగా నలుగురు సీమర్లతో బరిలోకి దిగి మూల్యం చెల్లించింది.బౌలర్లంతా విఫలంగుర్నూర్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా తేలిపోయాడు. ఫలితంగా ఇంగ్లండ్ 50 ఓవర్లలో కేవలం మూడే వికెట్లు నష్టపోయి 387 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది.ఈ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడిన టీమిండియా.. 27 పరుగుల తేడాతో ఓటమిపాలై.. సిరీస్నూ 1-2తో చేజార్చుకుంది. ఇంగ్లండ్ తమ పార్ట్టైమ్ స్పిన్నర్ల సేవలను కూడా ఉపయోగించుకుని గిల్ సేనను దెబ్బకొట్టింది. ఈ నేపథ్యంలో మొయిన్ అలీ టీమిండియా వ్యూహాన్ని తప్పుబట్టాడు.వరల్డ్లోనే బెస్ట్.. ఎందుకు ఆడించలేదుయూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘అసలు కుల్దీప్ యాదవ్ను ఎందుకు ఆడించలేదో నాకింకా అర్థం కావడం లేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో అతడూ ఒకడు. ఇంగ్లండ్కు ఆదిల్ రషీద్ మాదిరే.. టీమిండియాకు కుల్దీప్ కూడా!.. భాగస్వామ్యాలను విడదీస్తూ వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టడంలో అతడు దిట్ట. కానీ టీమిండియా మాత్రం వాళ్ల బ్యాటింగ్ లైనప్ను పటిష్టం చేసుకోవడానికి కుల్దీప్ను పక్కనపెట్టింది.భారత బౌలర్లకు బ్యాటింగ్ చేతకాదు. వాళ్ల జట్టులో ఉన్న అతిపెద్ద సమస్య ఇదే’’ అని మొయిన్ అలీ విమర్శించాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుంటే టీమిండియా బౌలింగ్ విభాగం యావరేజ్గా ఉంటుందని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. కుల్దీప్ యాదవ్కు తుది జట్టులో తీసుకోకపోవడాన్ని టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ సమర్థించుకున్నాడు. తుది జట్టు కూర్పులో భాగంగా తీసుకున్న నిర్ణయమే అని వెల్లడించాడు. చదవండి: శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు -
ODI WC: భారత జట్టు ఇదే.. వాళ్లకు నో ఛాన్స్!
ఇంగ్లండ్తో వన్డే సిరీస్లోనూ టీమిండియాకు భంగపాటే ఎదురైంది. తొలుత టీ20 సిరీస్లో ఆతిథ్య జట్టు చేతిలో 4-0 క్లీన్స్వీప్ అయిన భారత జట్టు.. ఆ తర్వాత వన్డే సిరీస్లో 2-1తో ఓడిపోయింది. తొలి వన్డేలో గెలిచిన గిల్ సేన.. ఆ తర్వాత రెండు వన్డేల్లోనూ ఓడిపోయింది.ఫిట్నెస్లేని ఆటగాళ్లకు గిల్ వార్నింగ్ముఖ్యంగా లార్డ్స్లో భారత బౌలర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. ఇక జస్ప్రీత్ బుమ్రా గాయం వల్ల ఈ మ్యాచ్కు అందుబాటులో లేకుండా పోయాడు. అంతకుముందే ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా గాయపడి జట్టుకు దూరమయ్యాడు.ఇక ఈ సిరీస్ కంటే ముందే ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి కూడా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తరచూ గాయపడే ఆటగాళ్ల వల్ల తుదిజట్టు కూర్పు దెబ్బతింటోందని కెప్టెన్ శుబ్మన్ గిల్ అన్నాడు. వన్డే వరల్డ్కప్-2027లో వరుసగా ఏడు మ్యాచ్ల దాకా ఆడాల్సి ఉంటుందని.. అలాంటి కీలక సమయంలో వీరితో కష్టమేనంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.తమ ఫిట్నెస్ ప్రమాణాలు మెరుగుపడితేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలమని గిల్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. ఇలాంటి తరుణంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ బ్యాటర్ అభినవ్ ముకుంద్ వరల్డ్కప్ జట్టును ఎంచుకున్నాడు.వారికే పెద్దపీటటాపార్డర్లో ఎలాంటి మార్పులు చేయని అభినవ్.. ఓపెనర్లుగా రోహిత్ శర్మ- కెప్టెన్ శుబ్మన్ గిల్ జోడీని వన్డౌన్లో విరాట్ కోహ్లిని కొనసాగించాడు. అయితే బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్కు మాత్రం చోటివ్వలేదు. ఇక వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్లను ఎంచుకున్న అభినవ్.. మిడిలార్డర్లో వీరితో పాటు శ్రేయస్ అయ్యర్కు చోటిచ్చాడు.ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లను ఎంచుకున్న అభినవ్ ముకుంద్.. రవీంద్ర జడేజాను పక్కనపెట్టాడు. స్పెషలిస్టు స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్కు స్థానమిచ్చిన అతడు.. వరుణ్ చక్రవర్తికి చోటివ్వలేదు.ఇక పేస్ విభాగంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, గుర్నూర్ బ్రార్లకు చోటు ఇచ్చాడు. ప్రిన్స్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్ పేర్లను అభినవ్ ముకుంద్ పరిగణనలోకి తీసుకోలేదు. వీళ్లు కూడా ఉండవచ్చుఅయితే, వరల్డ్కప్ టోర్నీకి ఇంకా సమయం ఉంది కాబట్టి.. నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, అర్ష్దీప్ సింగ్ ఆఖరి నిమిషంలో జట్టులోకి వచ్చినా అభినవ్ ఆశ్చర్యం లేదన్నాడు. కాగా వచ్చే ఏడాది సౌతాఫ్రికా- జింబాబ్వే- నమీబియా వేదికలుగా అక్టోబరు- నవంబరు మధ్య వన్డే వరల్డ్కప్ జరుగనుంది.వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి అభినవ్ ముకుంద్ ఎంచుకున్న భారత జట్టురోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్.చదవండి: ఐపీఎల్ టూ ఇంగ్లండ్.. ఢిల్లీ ఆటగాడికి లక్కీ ఛాన్స్! -
రోహిత్ శర్మ రిటైర్మెంట్ ? రోహిత్ లేకపొతే కష్టం.. SHUBMAN GILL షాకింగ్ కామెంట్స్
-
మెరుగుపడాల్సిందే: బుమ్రాతో పాటు వాళ్లకు గిల్ వార్నింగ్!
ఇంగ్లండ్తో నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. లార్డ్స్లో ఆదివారం నాటి మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్ దారుణంగా విఫలమైంది. టీమిండియా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడంతో ఇంగ్లండ్ రికార్డు స్థాయిలో 387 పరుగులు చేసింది.గాయాల వల్ల ఇద్దరూ దూరంలక్ష్య ఛేదనలో భారత్ 360 పరుగులకే పరిమితమై.. 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా సిరీస్ 2-1తో ఇంగ్లండ్ సొంతమైంది. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్కు దూరం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక గాయం కారణంగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా మ్యాచ్ ఆడలేకపోయాడు.గిల్ కీలక వ్యాఖ్యలుబుమ్రా, వాషీ స్థానాల్లో అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ మూడో వన్డే ఆడారు. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తరచూ గాయపడే ఆటగాళ్ల వల్ల తుదిజట్టు కూర్పు దెబ్బతింటోందన్నాడు. ఈ మేరకు.. ‘‘ఒక ఆటగాడు గాయపడితే కూర్పు ఒకలా ఉంటుంది.ఒకరి కంటే ఎక్కువ మంది గాయపడితే జట్టు కాంబినేషన్లో మరిన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రతీ మ్యాచ్ తర్వాత ఒక ఆటగాడు గాయపడతున్నాడంటే మేము ఎక్కడో ట్రిక్ మిస్ అవుతున్నామని అనిపిస్తోంది.ఎక్కడో చోట తేడా కొడుతుందిప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని మేము 11 మ్యాచ్లు వరుసగా ఆడాల్సి ఉంది. అయితే, తరచూ గాయాల బారిన పడే ఆటగాళ్లు ఈ సిరీస్లో రెండు లేదంటే మూడు మ్యాచ్లు మిస్ కావొచ్చు. ఇలా ఎక్కడో చోట తేడా కొడుతుంది. తరచూ గాయపడే ప్లేయర్ ఒకటి లేదా రెండు మ్యాచ్లు ఆడతాడు.ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యల వల్ల దూరమవుతాడు. అలాంటి సమయంలో కొత్త ప్లేయర్ను ఆడించాల్సి ఉంటుంది. నిజానికి తుదిజట్టును తరచూ మార్చాలనే ఆలోచన మాకు లేదు. కానీ గాయాల వల్ల తప్పక ఇలా చేయాల్సి వస్తోంది.ఎప్పుడు ఎవరు గాయపడతారో తెలియదు. కొంతమంది 80 శాతం ఫిట్గా ఉన్నా సరే ఆడటానికి ముందుకు వస్తారు. అయితే, మేము ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగితే.. అందులో ఒకరు కేవలం ఐదు ఓవర్లు మాత్రమే బౌల్ చేస్తామంటే కుదరదు కదా!మెరుగుపడాల్సిందేపూర్తి ఫిట్గా ఉంటేనే వారు పది ఓవర్లు బౌల్ చేయగలరు. కాబట్టి మేము రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. ఏదేమైనా జట్టుగా మేము ఫిట్నెస్ ప్రమాణాలను మరింతగా మెరుగపరచుకోవాల్సి ఉంది’’ అని శుబ్మన్ గిల్ పేర్కొన్నాడు. తరచూ గాయాలుకాగా పేస్ దళ నాయకుడు బుమ్రా తరచూ గాయపడుతున్న సంగతి తెలిసిందే. చాలా నెలల తర్వాత ఇంగ్లండ్తో తొలి వన్డే సందర్భంగా ఇటీవలే అతడు యాభై ఓవర్ల ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చాడు. రెండు మ్యాచ్లు ఆడగానే.. మోకాలి గాయంతో కీలకమైన మూడో వన్డేకు దూరమయ్యాడు.అంతేకాదు బుమ్రాపై పనిభారం తగ్గించే క్రమంలో మేనేజ్మెంట్ అతడికి తరచూ విశ్రాంతినిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో గిల్ ఒక రకంగా బుమ్రా ఫిట్నెస్ ప్రమాణాల పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ ప్రస్తావన తేవడం ద్వారా ఈ పేస్ గుర్రానికి గిల్ పరోక్షంగా హెచ్చరిక జారీ చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా యూకే పర్యటనలో భాగంగా తొలుత ఐర్లాండ్తో టీ20 సిరీస్లో 2-0తో వైట్వాష్ అయిన టీమిండియా.. ఇంగ్లండ్ చేతిలో 4-0తో క్లీన్స్వీప్ అయింది. తాజాగా వన్డే సిరీస్నూ కోల్పోయి ఓటమితో నిష్క్రమించింది.చదవండి: వారి వల్లే ఓడిపోయాం.. అతడు అద్భుతం: గిల్ -
IND vs ENG: అందుకే అతడు బెంచ్కే పరిమితం: గిల్
ఇంగ్లండ్తో మూడో వన్డేలో భారత్ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది. ఈ నిర్ణయాత్మక మ్యాచ్కు పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది. రెండో వన్డే సందర్భంగా ఎడమ మోకాలు ఉబ్బిపోవడం వల్ల అతడు లార్డ్స్ మ్యాచ్కు దూరమయ్యాడని ప్రకటన విడుదల చేసింది.కుల్దీప్ను ఆడిస్తారనుకుంటే..ఇక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా రెండో వన్డే సందర్భంగానే గాయపడ్డాడు. దీంతో అతడి స్థానాన్ని బీసీసీఐ హర్ష్ దూబేతో భర్తీ చేసింది. అయితే, తుదిజట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. ఇదిలా ఉంటే.. వాషీ దూరం కావడంతో.. అతడి స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడో వన్డే ఆడతాడని అంతా భావించారు.కానీ యాజమాన్యం మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషీకి బదులు.. పేస్ బౌలర్ ప్రిన్స్ యాదవ్కు తుదిజట్టులో చోటు ఇచ్చింది. దీంతో కుల్దీప్ యాదవ్కు మరోసారి అన్యాయం చేశారంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే, టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ ఈ విషయం గురించి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాడు. ‘‘బుమ్రా మోకాలి గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. వాషింగ్టన్ సుందర్ కూడా గాయపడ్డాడు. శివం దూబే కూడా ఈ మ్యాచ్ ఆడటం లేదు.అందుకే అతడు బెంచ్కు పరిమితంఈ ముగ్గురి స్థానాల్లో కేఎల్ రాహుల్, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్ తుదిజట్టులోకి వచ్చారు. మేము లార్డ్స్ మైదానంలో నలుగురు సీమర్లను ఆడించాలని నిర్ణయించుకున్నాము. ఫాస్ట్ బౌలర్లతో పోలిస్తే స్పిన్నర్లు ఇక్కడ మధ్య ఓవర్లలో పెద్దగా ప్రభావం చూపరు అనిపించింది’’ అని గిల్ పేర్కొన్నాడు. తద్వారా కుల్దీప్ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని పరోక్షంగా వెల్లడించాడు.వైట్వాష్ల తర్వాత..కాగా యూకే పర్యటనలో భాగంగా టీమిండియా తొలుత ఐర్లాండ్తో టీ20 సిరీస్లో తలపడి.. ఆతిథ్య జట్టు చేతిలో కనీవినీ ఎరుగని రీతిలో 2-0తో క్లీన్స్వీప్ అయింది. అనంతరం ఇంగ్లండ్ చేతిలో టీ20 సిరీస్లో 4-0తో వైట్వాష్ అయింది. ఈ క్రమంలో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటికి భారత్- ఇంగ్లండ్ చెరో వన్డే గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి నిర్ణయాత్మక మూడో వన్డేకు లార్డ్స్ మైదానం ఆతిథ్యమిస్తుండగా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్కు దిగింది. ఈ మ్యాచ్లో భారత్ నలుగురు పేసర్లు గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణను ఆడిస్తోంది.ఇంగ్లండ్తో మూడో వన్డేకు భారత తుదిజట్టురోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ.చదవండి: టీమిండియాకు భారీ షాక్! -
మూడో వన్డేలో భారత్ ఓటమి.. సిరీస్ ఇంగ్లండ్దే
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో 27 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కోల్పోయింది. 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 360 రన్స్ చేసింది. రోహిత్ శర్మ(138), శుబ్మన్ గిల్(77), విరాట్ కోహ్లి వంటి టాపార్డర్ బ్యాటర్లు రాణించినప్పటికి, మిడిలార్డర్ విఫలం కావడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కుర్రాన్ 4 వికెట్లు పడగొట్టగా.. రషీద్, జాకబ్ బెతల్, ఆర్చర్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఏకంగా 387 పరుగులు సాధించింది. ఓపెనర్లు బెన్ డకెట్ (141), జేకబ్ బెతెల్ (91) దుమ్ములేపగా.. జో రూట్ (48 బంతుల్లో 74), జోస్ బట్లర్ (13 బంతుల్లో 41) మెరుపు ఇన్నింగ్స్తో అజేయంగా నిలిచారు. ఓటమి దిశగా భారత్భారత్ వరుస ఓవర్లలో కేఎల్ రాహుల్(12), అక్షర్ పటేల్(2) వికెట్లను కోల్పోయింది. టీమిండియా విజయానికి 10 బంతుల్లో 47 పరుగులు కావాలి.విరాట్ కోహ్లి అవుట్టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 74 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. సామ్ కుర్రాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. భారత విజయానికి 28 బంతుల్లో 73 పరుగులు కావాలి. క్రీజులో రాహుల్, అక్షర్ పటేల్ ఉన్నారు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్ఇషాన్ కిషన్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన కిషన్.. సామ్ కుర్రాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. అదే ఓవర్లో శ్రేయస్ అయ్యర్(0) డకౌటయ్యాడు. క్రీజులో కోహ్లి(65) ఉన్నారు. భారత విజయానికి 82 పరుగులు కావాలి.టీమిండియా ట్రిపుల్ సెంచరీటీమిండియా స్కోర్ 300 పరుగులు దాటింది. భారత విజయానికి 39 బంతుల్లో ఇంకా 84 పరుగులు కావాలి.రోహిత్ అవుట్రోహిత్ శర్మ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. భారీ సెంచరీతో సత్తాచాటిన రోహిత్.. బెతల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్లతో 138 పరుగులు చేశాడు. 39 ఓవర్లకు భారత్ స్కోర్: 262/2రోహిత్ సెంచరీలార్డ్స్ వన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. కేవలం 84 బంతుల్లో తన 34వ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 33 ఓవర్లకు భారత్ స్కోర్: 218/1సెంచరీకి చేరువలో రోహిత్రోహిత్ శర్మ 92 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్నాడు. 29 ఓవర్లకు భారత్ స్కోర్: 187/1భారత్ తొలి వికెట్ డౌన్147 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 77 పరుగులు చేసిన కెప్టెన్ శబ్మన్ గిల్.. అదిల్ రషీద్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.రోహిత్ హాఫ్ సెంచరీరోహిత్ శర్మ కూడా తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 21 ఓవర్లకు భారత్ స్కోర్: 117/0ఇరవై ఓవర్లలో భారత్ స్కోరు: 109-0రోహిత్ 42, గిల్ 65 పరుగులతో ఉన్నారు. భారత్ విజయానికి 279 పరుగులు కావాలి. సెంచరీ కొట్టిన టీమిండియా18.3: ఆదిల్ రషీద్ బౌలింగ్లో రోహిత్ సింగిల్ తీయడంతో.. టీమిండియా వంద పరుగుల మార్కును చేరుకుంది. భారత్ స్కోరు: 103-0 (19). గిల్ 60, రోహిత్ 41 పరుగులతో ఉన్నారు. విజయానికి 285 పరుగులు కావాలి.గిల్ అర్ధ శతకం14.3వ ఓవర్: ఆదిల్ రషీద్ బౌలింగ్లో రెండు పరుగులు తీసి యాభై పరుగుల మార్కు అందుకున్న గిల్. 54 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి. భారత్ స్కోరు: 89-0 (15). గిల్ 52, రోహిత్ 36 పరుగులతో ఉన్నారు.14 ఓవర్లలో టీమిండియా స్కోరు: 81-0గిల్ 49, రోహిత్ 36 పరుగులతో ఉన్నారు.టీమిండియా హాఫ్ సెంచరీ10.2: సామ్ కరన్ బౌలింగ్లో గిల్ సింగిల్ తీయగా.. టీమిండియా యాభై పరుగుల మార్కు పూర్తి చేసుకుంది. స్కోరు: 60-0(11). రోహిత్ 34, గిల్ 26 పరుగులతో ఉన్నారు.పవర్ ప్లేలో భారత్ స్కోరు: 49-0 (10)కట్టుదిట్టమైన బంతులతో పదో ఓవర్ను మెయిడెన్ చేసిన టంగ్.రోహిత్ శర్మ 24, గిల్ 25 పరుగులతో ఉన్నారు. విజయానికి ఇంకా 40 ఓవర్లలో 339 పరుగులు కావాలి.గేరు మార్చిన రోహిత్ఎనిమిదో ఓవర్లో జోష్ టంగ్ బౌలింగ్లో తొలి రెండు బంతుల్లో ఫోర్లు బాదిన రోహిత్ శర్మ. పుల్ షాట్తో ఐదో బంతిని సిక్సర్గా మలిచిన హిట్మ్యాన్. భారత్ స్కోరు: 43-0 (8). రోహిత్ 23, గిల్ 20 పరుగులతో ఉన్నారు.ఐదు ఓవర్లలో భారత్ స్కోరు: 17-0రోహిత్ మూడు, గిల్ 14 పరుగులతో ఉన్నారు.టార్గెట్ 388.. లక్ష్య ఛేదనకు దిగిన భారత్మూడు ఓవర్లలో భారత్ స్కోరు: 9-0ఓపెనర్లు రోహిత్ ఒకటి , గిల్ ఎనిమిది పరుగులతో ఉన్నారు.ఇంగ్లండ్ భారీ స్కోరుఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 387 పరుగులు చేసింది. టీమిండియాకు 388 పరుగుల లక్ష్యాన్ని విధించింది. కాగా వన్డే ఫార్మాట్లో భారత్పై ఇంగ్లండ్కు ఇదే అత్యధిక స్కోరు. బట్లర్ మెరుపులు49 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు 371-3బట్లర్ 10 బంతుల్లోనే 34 పరుగులు చేయగా.. రూట్ 65 పరుగులతో ఉన్నాడు.బ్రూక్ అవుట్46.5వ ఓవర్: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి హ్యారీ బ్రూక్ (14) మూడో వికెట్గా వెనుదిరిగాడు. స్కోరు: 324-3. రూట్ 55 పరుగులతో ఉన్నాడు. జోస్ బట్లర్ క్రీజులోకి వచ్చాడు.రూట్ హాఫ్ సెంచరీ45.3వ ఓవర్: గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న రూట్. 39 బంతుల్లోనే యాభై పరుగులు సాధించిన రూట్. వన్డేల్లో అతడికి ఇది వరుసగా ఆరో హాఫ్ సెంచరీ. ఇంగ్లండ్ స్కోరు 315-2 (46). రూట్ 50, బ్రూక్ పది పరుగులతో ఉన్నారు.45 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 305-2హ్యారీ బ్రూక్ 5, రూట్ 45 పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్43.3వ ఓవర్: ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ శతక వీరుడు బెన్ డకెట్ రెండో వికెట్గా వెనుదిరిగాడు. మొత్తంగా 135 బంతులు ఎదుర్కొన్న డకెట్ 18 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 141 పరుగులు చేశాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ క్రీజులోకి వచ్చాడు. నలభై ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 261-1డకెట్ 125 బంతుల్లో 127, రూట్ 22 బంతుల్లో 23 పరుగులతో ఉన్నారు.డకెట్ సెంచరీ35.2వ ఓవర్: గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో ఫోర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్న ఇంగ్లండ్ ఓపెనర్ డకెట్. 108 బంతుల్లో శతక మార్కు అందుకున్న డకెట్. 36 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ స్కోరు: 226-1(36). డకెట్ 102, రూట్ 13 పరుగులతో ఉన్నారు.200 పరుగులు పూర్తి చేసుకున్న ఇంగ్లండ్33 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 206-1.డకెట్ 90, రూట్ ఐదు పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ డౌన్.. సెంచరీ మిస్30.1వ ఓవర్: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో రోహిత్కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా వెనుదిరిగిన బెతెల్ (93 బంతుల్లో 91). ఆద్యంతం నిలకడగా ఆడి సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. జో రూట్ క్రీజులోకి వచ్చాడు.ఇంగ్లండ్ ఓపెనర్ల రికార్డు భాగస్వామ్యంముప్పై ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 192-0. టీమిండియాపై ఇంగ్లండ్కు ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. బెతెల్ 91, డకెట్ 81 పరుగులతో ఉన్నారు. ఇద్దరూ కలిసి 180 బంతుల్లో 192 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.25 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 163-0బెతెల్ 79, డకెట్ 65 పరుగులతో ఉన్నారు. లార్డ్స్ మైదానంలో వన్డేల్లో తొలి వికెట్కు ఇదే అత్యధిక భాగస్వామ్యం (163).డకెట్ ఫిఫ్టీ21.3: గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో రెండు పరుగులు తీసి.. యాభై పరుగుల మార్కు అందుకున్న డకెట్. 64 బంతుల్లో ఫిఫ్టీ కొట్టిన డకెట్. ఇంగ్లండ్ స్కోరు: 136- 0 (21.5)20 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 125-0బెతెల్ 61, డకెట్ 46 పరుగులతో ఉన్నారు.బెతెల్ అర్ధ శతకం15.4వ ఓవర్: అర్ష్దీప్ బౌలింగ్లో ఫోర్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఇంగ్లండ్ ఓపెనర్ బెతెల్. ఇంగ్లండ్ స్కోరు: 101-0(16). బెతెల్ 53, డకెట్ 34 పరుగులతో ఉన్నారు.పదిహేను ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 96-0(15)బెతెల్ 48, డకెట్ 34 పరుగులతో ఆడుతున్నారు.పవర్ ప్లేలో ఇంగ్లండ్ స్కోరు: 58-0(10)బెతెల్ 25, డకెట్ 22 పరుగులతో ఉన్నారు.హాఫ్ సెంచరీ కొట్టిన ఇంగ్లండ్బెతెల్ 23, డకెట్ 18 పరుగులతో ఉన్నారు. ఇంగ్లండ్ స్కోరు: 51-0 (8.1).నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్ ఓపెనర్లుఅర్ష్దీప్ సింగ్ టీమిండియా బౌలింగ్ అటాక్ ఆరంభించగా.. ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జేకబ్ బెతెల్ నిలకడగా ఆడుతున్నారు. నాలుగు ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 31-0. డకెట్ 15, బెతెల్ 14 పరుగులతో ఉన్నారు.భారత్కు ఎదురుదెబ్బభారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. టాస్ సమయంలో కెప్టెన్ శుబ్మన్ గిల్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇక ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా గాయం వల్ల దూరం కాగా.. భారత్ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది.కేఎల్ రాహుల్ తిరిగి రాగా శివం దూబే బెంచ్కే పరిమితం కాగా.. బుమ్రా స్థానంలో అర్ష్దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. వాషీకి బదులు ప్రిన్స్ యాదవ్ చోటు దక్కించుకున్నాడు.దిగ్గజానికి నివాళిగ్యారీ సోబర్స్కు నివాళిగా ఇరుజట్ల ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్ బ్యాండ్లతో బరిలోకి దిగారు.గంట మోగించిన యువీలార్డ్స్ మ్యాచ్కు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన టీమిండియా దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ గంట మోగించి మ్యాచ్ను ఆరంభించాడు.Yuvraj Singh rings the iconic Lord's Bell to signal the start of the series decider. 🔔 Watch #ENGvIND, LIVE NOW on Sony Sports Network TV channels.#SonySportsNetwork #MamlaPersonalHai #ExtraaaInnings pic.twitter.com/OcQ6C2e7du— Sony Sports Network (@SonySportsNetwk) July 19, 2026తుదిజట్లుభారత్రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణఇంగ్లండ్బెన్ డకెట్, జేకబ్ బెతెల్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కర్రాన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్. -
రోహిత్ వివాదం.. టీమిండియాకు బీసీసీఐ కీలక ఆదేశాలు!
రోహిత్ శర్మ రిటైర్మెంట్పై సోషల్ మీడియాలో ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మ్యాచ్లు ఉన్న సమయంలో వీలైనంత మేర సోషల్ మీడియాకు దూరంగా ఉండడం మంచిదని ఆటగాళ్లకు బీసీసీఐ సూచించింది. శనివారం లండన్లోని భారత హైకమిషన్ నిర్వహించిన ప్రవాస భారతీయుల సన్మాన కార్యక్రమంలో భాగంగా టీమిండియాతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్, హెడ్ కోచ్ గంభీర్ సహా ఆటగాళ్లంతా హాజరయ్యారు.99 శాతం అదే ధోరణిలో: రాజీవ్ శుక్లారాజీవ్ శుక్లా మాట్లాడుతూ..'భారతదేశంలో 99 శాతం మంది ప్రజలు తమను తాము క్రికెట్ నిపుణులుగా భావిస్తుంటారని, అందుకే మ్యాచ్లకు ముందు ఆటగాళ్లు సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండడం మంచిదని నా అభిప్రాయం. మన జట్టులో ప్రతిభకు కొదవలేదని, కేవలం ఆటపై దృష్టి పెట్టడమే ఆటగాళ్లు ముందున్న కర్తవ్యం. అనవసర విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం ఆటగాళ్లకు లేదు.' అని చెప్పుకొచ్చారు.బయటి విషయాలు పట్టించుకోను: గిల్టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ మాట్లాడుతూ.. తన చేతిలో లేని బయటి అంశాల గురించి ఆలోచించకుండా, కేవలం తన ఆటపైనే దృష్టి పెట్టడం వల్ల ఎలాంటి ఒత్తిడినైనా సులభంగా అధిగమించగలనని ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికే టీమిండియాలో క్యాంప్లో రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి పుకార్లు షికార్లు చేస్తున్న వేళ గిల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఇక గాయాల నుంచి కోలుకొని టీ20 కెప్టెన్గా ప్రమోషన్ పొందిన శ్రేయస్ అయ్యర్ తన పునరాగమన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు. తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు సహచర ఆటగాళ్లు చేసిన ఫోన్ కాల్స్, వారు ఇచ్చిన మద్దతు తనలో ఎంతో స్ఫూర్తిని నింపాయని, అందుకే మరింత బలంగా జట్టులోకి తిరిగి రాగలిగానని అయ్యర్ భావోద్వేగంతో పేర్కొన్నాడు. చారిత్రక బంధం: గంభీర్ఇక టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ భారత్-బ్రిటన్ మధ్య ఉన్న చారిత్రక సంబంధాల వల్ల యూకే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ప్రదేశమేనని అన్నారు. భారత క్రికెట్ అనేది కేవలం డ్రెస్సింగ్ రూమ్కే పరిమితం కాదని, జట్టును బేషరతుగా ప్రేమించే ప్రతి ఒక్క నిజాయితీ గల అభిమానికి చెందుతుందని గంభీర్ స్పష్టం చేశాడు. ఇక ఈ వేడుకకు ఆతిథ్యమిచ్చిన యూకేలోని భారత హైకమిషనర్ పి. కుమారన్, డిప్యూటీ హైకమిషనర్ కార్తీక్ పాండేలు టీమిండియాకు ఘన స్వాగతం పలికారు. ఇదే వారంలో అమల్లోకి వచ్చిన భారత్-యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం (CETA) వ్యాపారంతో పాటు క్రీడారంగానికి కూడా ఎన్నో కొత్త అవకాశాలను తెరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ టీమిండియా సాధించిన విజయాలు దేశానికి ఎంతో గర్వకారణమని వారు కొనియాడారు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇవాళ చివరి వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరీస్లో 1-1తో సమంగా ఉన్న ఇరుజట్లు ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. -
సిరీస్ విజయంపై గురి.. లార్డ్స్లో టీమిండియాకు ఘన చరిత్ర!
ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో భాగంగా టీమిండియా తమ చివరి వన్డేను ఆదివారం ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా ఆడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను 2-1తో కైవసం చేసుకోవాలని గిల్ సేన భావిస్తోంది. మరి లార్డ్స్ గడ్డపై టీమిండియా రికార్డు ఎలా ఉంది, ఎన్ని మ్యాచ్లు ఆడింది? గెలిచినవెన్నీ, ఓడినవెన్ని అనేది ఇప్పుడు పరిశీలిద్దాం. లార్డ్స్లో భారత జట్టు అంతర్జాతీయంగా 31 మ్యాచ్లు (అన్ని ఫార్మాట్లు) ఆడితే ఏడు గెలిచి 19 ఓడింది. ఒక మ్యాచ్ టై కాగా, 14 డ్రాగా ముగిశాయి. లార్డ్స్ వేదికలో భారత్ ఓవరాల్ విన్నింగ్ శాతం 22.58 పర్సంటైల్గా ఉంది. వన్డేల్లో మాత్రం టీమిండియాకు లార్డ్స్ వేదికలో మంచి రికార్డే ఉంది. ఓవరాల్గా లార్డ్స్లో ఏడు గెలిస్తే అందులో మూడు వన్డేల నుంచే రావడం విశేషం. మొత్తంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య 8 వన్డేలు జరిగితే టీమిండియా మూడు, ఇంగ్లండ్ నాలుగు చొప్పున గెలిచాయి. ఒక మ్యాచ్ టై అయింది. వన్డేల్లో లార్డ్స్ వేదికలో భారత విజయాల శాతం 37.5 పర్సంటైల్గా ఉంది. ఈ వేదికలో 2022, జూలై 14న భారత్, ఇంగ్లండ్ చివరిసారిగా వన్డే ఆడాయి.ఈ వన్డేలో టీమిండియా 100 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. మోయిన్ అలీ 47 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, డేవిడ్ విల్లే 41 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 4 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో పూర్తిగా తడబడిన టీమిండియా 38.5 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. పాండ్యా, జడేజా చెరో 29 పరుగులు చేశారు. మ్యాచ్లో రీస్ టోప్లే ఆరు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాసించాడు.లార్డ్స్ వేదికపై జరిగిన వన్డేలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో సౌరవ్ గంగూలీ (208 పరుగులు) తొలి స్థానంలో ఉండగా, యువరాజ్ సింగ్ (170) రెండు, ఎంఎస్ ధోని (165) మూడు, రాహుల్ ద్రవిడ్ (149), సురేశ్ రైనా (130)లు వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే చాహల్, ఆర్పీ సింగ్ ఐదేసి వికెట్లతో తొలి స్థానంలో ఉండగా, మొహిందర్ అమర్నాథ్, జహీర్ ఖాన్, మదన్లాల్లు తలా 4 వికెట్లు పడగొట్టారు.చదవండి: ఫిఫా ఫైనల్ ఆఖరిదా?.. రిటైర్మెంట్పై మెస్సీ స్పందన! -
విశ్రాంతి వద్దన్న రోహిత్.. అతడి కోసం గిల్ అనూహ్య నిర్ణయం!
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగే మూడో వన్డే హిట్మ్యాన్ కెరీర్లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ వార్తల్ని కొట్టిపారేశాడు. లార్డ్స్ వన్డే రోహిత్కు చివరి మ్యాచ్ కాదని స్పష్టం చేశాడు.సెలక్టర్లపై బీసీసీఐ ఆగ్రహం!అదే విధంగా ఈ విషయంలో లీకులు ఇచ్చారని సెలక్టర్లపై బీసీసీఐ ఆగ్రహం చేసినట్లు సమాచారం. ఇలాంటి తరుణంలో మరో ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. నిజానికి అఫ్గానిస్తాన్తో ఇటీవల స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ నుంచే రోహిత్ శర్మను పక్కనపెట్టాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం.అప్పుడే డిసైడ్ అయ్యారువిశ్రాంతి పేరిట రోహిత్ను పక్కనపెట్టి.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను అఫ్గాన్తో సిరీస్లో ఆడించాలనే యోచనలో ఉన్నారట. అయితే, ఇందుకు రోహిత్ ససేమిరా అనడంతో.. కెప్టెన్ శుబ్మన్ గిల్ స్వయంగా తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘గత నెలలో స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్ నుంచి రోహిత్ శర్మను తప్పించాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నారు. కానీ అతడు ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఆఖరిదైన మూడో వన్డేలోనైనా విశ్రాంతి తీసుకోవాలని కోరారు.విశ్రాంతి వద్దన్న రోహిత్.. గిల్ అనూహ్య నిర్ణయం!అతడి స్థానంలో జైస్వాల్ను ఆడించాలనుకున్నారు. కానీ రోహిత్ రెస్ట్ తీసుకునేందుకు నిరాకరించాడు. దీంతో జైస్వాల్ను ఎలాగైనా ఆడించాలనే ఉద్దేశంతోనే కెప్టెన్ శుబ్మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగాడు’’ అని పేర్కొన్నాయి. అదే విధంగా.. ‘‘అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిన తర్వాత రోహిత్కు అసలైన సవాలు ఎదురైంది.అతడు దేశవాళీ క్రికెట్లోనూ కేవలం రెండు మ్యాచ్లే ఆడాడు. కానీ ఆశించిన స్థాయిలో లయను అందుకోలేకపోయాడు. ఇటీవల కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఫామ్ కోల్పోయిన రోహిత్ విషయంలో సెలక్టర్లు అయితే ఇప్పటికే తమ నిర్ణయం గురించి చెప్పేశారు. రోహిత్ శర్మ, బోర్డు తీసుకునే నిర్ణయం ఆధారంగానే అతడు వన్డే వరల్డ్కప్ టోర్నీ-2027 ఆడతాడా? లేదా? అన్నది తేలుతుంది’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.తొలుత విఫలమైనా..కాగా అఫ్గాన్తో వన్డే సిరీస్లో రోహిత్ శర్మ 16, 48, 79 పరుగులు సాధించాడు. ఇక రెండో వన్డేతో తుదిజట్టులోకి వచ్చిన జైస్వాల్ నిరాశపరిచినా (4).. మూడో వన్డేలో అజేయ శతకం (110*)తో ఆకట్టుకున్నాడు. మరోవైపు.. తొలి వన్డేలో ఓపెనర్గా దిగి 84 పరుగులతో అజేయంగా నిలిచిన గిల్.. తర్వాత రెండు వన్డేలో మూడో నంబర్ బ్యాటర్గా వచ్చి భారీ శతకం (154)తో దుమ్ములేపాడు.ఇదిలా ఉంటే.. రెగ్యులర్ వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల వల్ల ఈ సిరీస్కు దూరం కావడంతో.. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్కు జట్టులో చోటు దక్కింది. ఈ వన్డే సిరీస్లో భారత్ అఫ్గాన్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఇక తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో రోహిత్ శర్మ ఇప్పటికి రెండు వన్డేలలో వరుసగా 11, 26 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ వార్తలు తెరమీదకు రావడం గమనార్హం.చదవండి: అదే మా కొంప ముంచింది: శుబ్మన్ గిల్ -
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. శుభ్మన్ గిల్ సహచరుడు అరెస్ట్
లంక ప్రీమియర్ లీగ్ (LPL) 2026 ప్రారంభానికి కొద్ది గంటల ముందు సంచలన పరిణామం చోటు చేసుకుంది. డిఫెండింగ్ చాంపియన్ జాఫ్నా కింగ్స్ ఫ్రాంచైజీ సహ యజమాని మంజోత్ కల్రాను శ్రీలంక పోలీసుల ప్రత్యేక దర్యాప్తు విభాగం మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్ట్ చేసింది. ఈ విషయాన్ని స్థానిక అధికారులు ధృవీకరించారు.టోర్నీ ప్రారంభానికి ముందే ఓ ఆటగాడిని మ్యాచ్ ఫిక్సింగ్కు ప్రేరేపించే ప్రయత్నం చేశారనే ఆరోపణల నేపథ్యంలో మంజోత్ కల్రాపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని శ్రీలంక పోలీసులు వెల్లడించారు. క్రీడల్లో అవినీతి నిరోధానికి శ్రీలంకలో కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయి.టీమిండియా కెప్టెన్ సహచరుడుమంజోత్ కల్రా భారత అండర్-19 జట్టు మాజీ క్రికెటర్ 2018 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై అజేయ శతకం బాది భారత్కు టైటిల్ అందించడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఆ జట్టులో పృథ్వీ షా, శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ వంటి ఆటగాళ్లు కూడా ఉన్నారు.డిఫెండింగ్ చాంపియన్గా జాఫ్నామైదానం వెలుపల వివాదం నెలకొన్నప్పటికీ, జాఫ్నా కింగ్స్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఎల్పీఎల్ 2026 బరిలోకి దిగుతోంది. భానుక రాజపక్స కెప్టెన్సీలో బరిలోకి దిగనున్న ఈ జట్టులో షకీబ్ అల్ హసన్, తస్కిన్ అహ్మద్, సందీప్ లామిచానే, అవిష్క ఫెర్నాండో, దిల్షాన్ మధుశంక, ఇబ్రహీం జద్రాన్, డేవిడ్ వీజ్ వంటి ప్రముఖ ఆటగాళ్లు ఉన్నారు. టోర్నీ తొలి మ్యాచ్లో జాఫ్నా కింగ్స్ గాలే జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఇవాళ (జులై 17) రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. -
అదే మా కొంపముంచింది.. చాలా బాధగా ఉంది: శుబ్మన్ గిల్
యూకే పర్యటనలో భారత్కు మరో ఓటమి ఎదురైంది. కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో భారత బౌలింగ్ పరంగా రాణించినప్పటికి బ్యాటింగ్లో మాత్రం విఫలమైంది. ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 44 ఓవర్లలో కేవలం 233 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 234 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి 44.1 ఓవర్లలో చేధించింది. లక్ష్య చేధనలో ఇంగ్లండ్ కూడా కాస్త తడబడినప్పటికి, సీనియర్ బ్యాటర్ జోరూట్(99) అజేయంగా నిలిచి మ్యాచ్ను ముగించాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ 1-1 సమమైంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందించాడు. బ్యాటింగ్లో మిడిలార్డర్ వైఫల్యమే తమ కొంపముంచిందని గిల్ అంగీకరించాడు.ఈ ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. 25 ఓవర్లు ముగిసేసరికి మేము మంచి పొజిషన్లో ఉన్నాం. కనీసం 300 నుంచి 310 పరుగులు చేస్తామని ఆశించాం. కానీ ఒక్కసారిగా పరిస్థితి తారుమారు అయిపోయింది. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయాం. మా టెయిలెండర్లు గొప్ప బ్యాటర్లు కారని మాకు తెలుసు. కానీ లోయర్ మిడిలార్డర్ నుంచి మేము మరింత మెరుగైన ప్రదర్శనను ఆశించాం. ఈ మ్యాచ్లో మాకు లభించిన ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం. వచ్చే మ్యాచ్లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే చిన్న చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పి, ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తున్నాను అని గిల్ పేర్కొన్నాడు.తన వికెట్ కోల్పోవడంపై గిల్ స్పందిస్తూ.. మంచి షాట్ ఆడినప్పుడు బంతి నేరుగా కవర్ ఫీల్డర్ చేతికి వెళ్తే ఎవరికైనా బాధగా అనిపిస్తుంది. నాకు కూడా అలానే అనిపించింది. వాషింగ్టన్ సుందర్ గాయం జట్టు వ్యూహాలను దెబ్బతీసింది. వాషీ మా జట్టులో కీలక ఆటగాడు. అతడు బ్యాటింగ్ చేస్తూ మిడ్-ఆఫ్ వైపు సింగిల్ తీసే క్రమంలో గాయపడ్డాడు.దీంతో మేము ఇన్నింగ్స్ మొత్తం మా ప్రధాన బౌలర్లతోనే బౌలింగ్ చేయించాల్సి వచ్చింది. జో రూట్ అద్బుతంగా ఆడాడు. ఒకవేళ స్కోరు 300 ఉండి ఉంటే, అప్పుడు రూట్పై ఒత్తిడి ఉండేది. కానీ ఇలాంటి చిన్న స్కోర్లు చేధించడంలో అతడు దిట్ట అని చెప్పుకొచ్చాడు. -
సిరీస్ సమం
కార్డిఫ్: ఇంగ్లండ్తో తొలి వన్డేలో చక్కటి విజయం సాధించిన భారత జట్టు... రెండో మ్యాచ్లో పరాజయం పాలైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన రెండో పోరులో ఆతిథ్య ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. ఫలితంగా సిరీస్ 1–1తో సమమైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (66 బంతుల్లో 65; 8 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (71 బంతుల్లో 66; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. గిల్ (31; 6 ఫోర్లు), రోహిత్ శర్మ (26; 1 ఫోర్, 1 సిక్స్) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. గత మ్యాచ్ అర్ధశతక వీరులు వాషింగ్టన్ సుందర్ (2), అక్షర్ పటేల్ (1)తో పాటు ఇషాన్ కిషన్ (1), శివమ్ దూబే (0) సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఆఖర్లో బుమ్రా (13 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక పరుగులు జోడించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్, ఆట్కిన్సన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ జో రూట్ (133 బంతుల్లో 99 నాటౌట్; 9 ఫోర్లు) సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అజేయంగా నిలిచాడు. డకెట్ (0), బెథెల్ (4), కెప్టెన్ బ్రూక్ (16), సామ్కరన్ (26), బట్లర్ (17) విఫలమ య్యారు. ఒక దశలో 125 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ జట్టును రూట్ ఆదుకున్నాడు. విల్ జాక్స్ (30; 2 ఫోర్లు)తో కలిసి 86 బంతుల్లో 72 పరుగులు జోడించాడు. దీంతో విజయ సమీకరణం ఇంగ్లండ్కు అనుకూలంగా మారింది.ఆరంభంలో ప్రభావవంతంగా కనిపించిన భారత బౌలర్లు ఆ తర్వాత అదే జోరు కనబర్చడంలో విఫలమయ్యారు. గుర్నూర్ బ్రార్ రెండు వికెట్లు పడగొట్టగా... బుమ్రా, ప్రసిధ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఆదివారం లార్డ్స్లో నిర్ణయాత్మక మూడో వన్డే జరగనుంది. -
రెండో వన్డేలో భారత్ ఓటమి
కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. టీమిండియా నిర్ధేశించిన 254 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో ఇంగ్లండ్ ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయినప్పటికి, సీనియర్ బ్యాటర్ జోరూట్(133 బంతుల్లో 99 నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు.ఇంగ్లండ్ ఆరో వికెట్ డౌన్ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన విల్ జాక్స్.. గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో ఔటయ్యాడు.విజయం దిశగా ఇంగ్లండ్కార్డిఫ్ వన్డేలో ఇంగ్లండ్ విజయం దిశగా దూసుకుపోతుంది. 39 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 191-5. జోట్ రూట్ 87 పరుగులతో బ్యాటింగ్ కొనసాగుతున్నాడు.ఇంగ్లండ్ ఐదో వికెట్ డౌన్జోస్ బట్లర్(17) రూపంలో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో బట్లర్ క్లీన్ బౌల్డయ్యాడు. 30 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 148/5. క్రీజులో జో రూట్(69), విల్ జాక్స్(4) ఉన్నారు.ఇంగ్లండ్ నాలుగో వికెట్ డౌన్సామ్ కుర్రాన్(26) రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. శివమ్ దూబే బౌలింగ్లో కుర్రాన్ ఔటయ్యాడు. ఇంగ్లండ్ విజయానికి 140 పరుగులు కావాలి. క్రీజులో జో రూట్(40), జోస్ బట్లర్(0) ఉన్నారు.ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్53 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన కెప్టెన్ హ్యారీ బ్రూక్.. గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో ఔటయ్యాడు.కష్టాల్లో ఇంగ్లండ్234 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. 8 పరుగులకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. డకెట్ డకౌట్ కాగా.. బేతెల్ 4 పరుగులకు ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరారు.తొలి బంతికే వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్234 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చి డకెట్ ఔటయ్యాడు. 233 పరుగులకు ఆలౌటైన భారత్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లి (65), శ్రేయస్ అయ్యర్ (66) రాణించడంతో భారత్ ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖర్లో బుమ్రా (20 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో భారత్ 230 పరుగుల మార్కును తాకగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, అట్కిన్సన్ తలో 3 వికెట్లతో సత్తా చాటగా.. సాకిబ్ మహమూద్ 2, సామ్ కర్రన్, విల్ జాక్స్ చెరో వికెట్ తీశారు.వరుస బంతుల్లో అక్షర్, దూబే ఔట్36వ ఓవర్లో భారత్ వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయింది. ఆర్చర్ వేసిన ఈ ఓవర్ నాలుగో బంతికి అక్షర్ పటేల్ (1), దూబే (0) ఔటయ్యారు. దీంతో భారత్ 193 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.5 వికెట్లు కోల్పోయిన టీమిండియా32.4వ ఓవర్- 181 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. సాకిబ్ మహమూద్ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి సుందర్ (2) ఔటయ్యాడు. కోహ్లి (65) ఔట్31.4వ ఓవర్- 178 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఆదిల్ రషీద్కు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (65) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన భారత్20.3వ ఓవర్- 111 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. సామ్ కర్రన్ బౌలింగ్లో అతడికే క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ (1) ఔటయ్యాడు. రోహిత్ ఔట్17.5వ ఓవర్- 104 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. విల్ జాక్స్ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ (26) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన భారత్7.4వ ఓవర్- 44 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అట్కిన్సన్ బౌలింగ్లో డకెట్కు క్యాచ్ ఇచ్చి శుభ్మన్ గిల్ (31) ఔటయ్యాడు. ఆచితూచి ఆడుతున్న రోహిత్, గిల్భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ (9), శుభ్మన్ గిల్ (19) ఆచితూచి ఆడుతున్నారు. 5 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 30-0గా ఉంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్కార్డిఫ్ వేదికగా భారత్తో జరుగనున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. కేఎల్ రాహుల్ స్వల్ప అస్వస్థతకు లోను కావడంతో, అతడి స్థానంలో ఇషాన్ కిషన్ను బరిలోకి దించారు. ఇంగ్లండ్ విషయానికొస్తే.. ఆ జట్టు రెండు మార్పులు చేసింది. టంగ్, డాసన్ స్థానాల్లో సాకిబ్ మహమూద్, అట్కిన్సన్ జట్టులోకి వచ్చారు. కాగా, 3 మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి మ్యాచ్లో గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.తుది జట్టు..భారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణఇంగ్లండ్: బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్ -
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. రెండో వన్డే నుంచి గిల్ ఔట్?
-
మిచెల్కు గిల్ గట్టి సవాల్
భారత్-ఇంగ్లండ్ తొలి వన్డే అనంతరం ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ రేటింగ్ పాయింట్లు పెంచుకుని ప్రపంచ నంబర్-1 బ్యాటర్ స్థానానికి మరింత చేరువయ్యాడు.ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 80 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించిన గిల్కు 12 రేటింగ్ పాయింట్లు లభించాయి. ప్రస్తుతం అతను ప్రపంచ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అగ్రస్థానంలో ఉన్న డారిల్ మిచెల్ను (814) అధిగమించేందుకు గిల్కు (803) ఇంకా 12 రేటింగ్ పాయింట్లు మాత్రమే అవసరం. మరో మంచి ఇన్నింగ్స్ గిల్ను అగ్రపీఠంపై కూర్చోబెట్టడం ఖాయం.తొలి వన్డేలో విఫలమైనప్పటికీ భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి (3వ స్థానం), రోహిత్ శర్మ (4వ స్థానం) తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.భారత ఆటగాళ్లకు భారీ లబ్దిదీర్ఘ విరామం తర్వాత వన్డే ఆడిన జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్పై కట్టుదిట్టమైన బౌలింగ్తో ర్యాంకింగ్స్లో 24వ స్థానానికి చేరుకున్నాడు.అలాగే తొలి వన్డేలో అద్భుత ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన అక్షర్ పటేల్ ఆల్రౌండర్ల జాబితాలో టాప్-10లోకి ప్రవేశించాడు. బ్యాట్తో అజేయ అర్ధశతకం సాధించిన వాషింగ్టన్ సుందర్ బ్యాటర్ల ర్యాంకింగ్స్లో ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 73వ స్థానానికి చేరుకున్నాడు.ఇంగ్లండ్ ఆటగాళ్లకు కూడా మెరుగైన ర్యాంకులుఇంగ్లండ్ తరఫున తొలి వన్డేలో 76 పరుగులు చేసిన జో రూట్ 12వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే అర్ధశతకంతో ఆకట్టుకున్న లియామ్ డాసన్ బ్యాటర్ల జాబితాలో 81 స్థానాలు ఎగబాకి 262వ స్థానంలో నిలిచాడు.ఇతర దేశాల ఆటగాళ్లలో న్యూజిలాండ్ స్పిన్నర్ జేడెన్ లెనాక్స్, వెస్టిండీస్ బ్యాటర్ కీసీ కార్టీ, జింబాబ్వే ఆటగాళ్లు బెన్ కర్రన్, బ్రాడ్ ఇవాన్స్ కూడా తాజా ఐసీసీ ర్యాంకింగ్స్లో గణనీయమైన పురోగతి సాధించారు. -
రెండో వన్డేలో రోహిత్, కోహ్లికి విశ్రాంతి..?
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్లో రెండో వన్డే కార్డిప్ వేదికగా 16వ తేదీ జరుగనుంది.ఈ మ్యాచ్కు ముందు భారత జట్టు రోటేషన్ విధానంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని జట్టులో పలు కాంబినేషన్లను పరీక్షిస్తున్నట్లు కెప్టెన్ శుభ్మన్ గిల్ వెల్లడించాడు.తొలి వన్డే అనంతరం మాట్లాడిన అతడు.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సరైన సమతుల్యత కలిగిన జట్టును ఎంపిక చేసేందుకు విభిన్న కాంబినేషన్లను పరిశీలిస్తున్నామని తెలిపాడు.ప్రపంచకప్ దక్షిణాఫ్రికాలో జరుగనుండగా, అక్కడి పరిస్థితులకు ఇంగ్లండ్ పిచ్లు కొంతవరకు సమానంగా ఉంటాయని.. అందుకే ఈ సిరీస్ను ప్రయోగాలకు ఉపయోగించుకుంటున్నామని వివరించాడు.ఈ వ్యాఖ్యలతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు విశ్రాంతి ఇవ్వొచ్చనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన అయితే లేదు.ఒకవేళ వీరిలో ఎవరికైనా విశ్రాంతినిస్తే, వికెట్కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్కు తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది. అవసరానికి అనుగుణంగా బ్యాటింగ్ క్రమంలో మార్పులు చేసి జట్టు సమతుల్యతను కొనసాగించే అవకాశం ఉంది. కాగా, తొలి వన్డేలో రోహిత్ శర్మ 11, విరాట్ కోహ్లి 5 పరుగులకు ఔటై నిరాశపరిచారు. -
అతడిని ఆరో స్థానంలో ఆడిస్తారా?: మాజీ కెప్టెన్ ఫైర్
ఇంగ్లండ్ తాజా పర్యటనలో టీమిండియా ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. టీ20 సిరీస్లో ఆతిథ్య జట్టు చేతిలో 4-0తో క్లీన్స్వీప్ అయిన భారత్.. వన్డే సిరీస్లో మాత్రం శుభారంభం అందుకుంది. బర్మింగ్హామ్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో శుబ్మన్ గిల్ సేన.. ఇంగ్లండ్పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.ముగ్గురూ అదరగొట్టారుఇంగ్లండ్ విధించిన 259 పరుగుల లక్ష్యాన్ని 45.2 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనింగ్ బ్యాటర్, కెప్టెన్ గిల్ 80 పరుగులతో అదరగొట్టగా.. ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్ (52), అక్షర్ పటేల్ (57) అజేయ అర్ధ శతకాలతో రాణించి జట్టును గెలిపించారు.A Sundar finish to a near-perfect chase. 💙Washington Sundar seals the win with a towering hit as India take a 1-0 lead in the ODI series. Watch the #ENGvIND 2nd ODI on 16th July, 4:30 PM onwards, LIVE on Sony Sports Network TV channels #SonySportsNetwork #MamlaPersonalHai pic.twitter.com/CXC40cayCn— Sony Sports Network (@SonySportsNetwk) July 14, 2026రాహుల్ విఫలంఇక ఈ మ్యాచ్లో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ రెగ్యులర్గా వచ్చే ఐదో స్థానంలో కాకుండా.. ఆరో నంబర్ బ్యాటర్గా బరిలోకి దిగాడు. అతడి స్థానంలో వాషీ ఐదో స్థానానికి ప్రమోట్ అయి సక్సెస్ కాగా.. రాహుల్ మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి జోష్ టంగ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు.ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే బ్యాటర్ ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా యాజమాన్యంపై మండిపడ్డాడు. రాహుల్కు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి రాహుల్కు కూడా ఇలా డిమోట్ అవ్వడం నచ్చి ఉండదు.ఇలాగే బలి చేస్తారా?ఏదేమైనా ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే బ్యాటర్ సేవలను మీరు సరిగ్గా ఉపయోగించుకోకుండా.. అతడి ప్రతిభను వృథా చేస్తున్నారు. ఇకముందు కూడా వరల్డ్ బెస్ట్ బ్యాటర్ను ఇలాగే బలి చేస్తారా?లెఫ్ట్- రైట్ కాంబినేషన్ గురించి మీరు ఆలోచించి ఉండవచ్చు. కానీ దీని వల్ల కేఎల్ రాహుల్ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అతడు మ్యాచ్ విన్నర్. ఒంటిచేత్తో జట్టును గెలిపించగలడు. అలాంటి ఆటగాడి పట్ల ఇలాంటి వైఖరి ఎంతమాత్రం సరికాదు.ఇలా చేస్తే మున్ముందు కష్టమేరాహుల్ను ఆరు లేదంటే ఏడో స్థానంలో ఎలా పంపగలరు?.. భారత క్రికెట్కు ఇది మంచిదికాదు. ముఖ్యంగా వన్డే వరల్డ్కప్-2027కు ముందు రాహుల్ విషయంలో ఇలాంటి ఆటలు వద్దు. సౌతాఫ్రికాలో పిచ్లు ఇంతకంటే బౌన్సీగా ఉంటాయి. కాబట్టి రాహుల్ కంటే ముందు వాషీని బ్యాటింగ్కు పంపడం సరికాదు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్ తన వన్డే కెరీర్లో ఇప్పటికి బ్యాటింగ్ ఆర్డర్లో తొలి ఏడు స్థానాల్లోనూ ఆడాడు. సగటు 50తో పరుగులు రాబట్టాడు. ఎనిమిది సెంచరీలు కూడా చేశాడు. ఇక ఐదో నంబర్ బ్యాటర్గా 35 ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ అత్యుత్తమంగా 63.20 సగటుతో పరుగులు చేశాడు. ఇక ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 14 ఇన్నింగ్స్లో ఆరో స్థానంలో బరిలోకి దిగినపుడు అతడి సగటు కేవలం 37 మాత్రమే కావడం గమనార్హం.చదవండి: గిల్ గాయంపై అప్డేట్ -
తొలి వన్డేలో రిటైర్డ్ హర్ట్.. గిల్ గాయంపై కీలక అప్డేట్
ఇంగ్లండ్ ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ శుబ్మన్ గిల్ 80 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. సెంచరీ దిశగా సాగుతున్న గిల్కు కుడి కండరాలు పట్టేయడంతో అసౌకర్యంగా ఫీలయ్యాడు. వెంటనే భారత జట్టు ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స అందించినప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో గిల్ రిటైర్డ్ హర్ట్ అయ్యి పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో అతడు నడుస్తున్నంత సేపు నొప్పితో ఇబ్బంది పడినట్లుగా కనిపించింది. నొప్పితో బాధపడుతున్న గిల్ రెండో వన్డే ఆడుతాడా లేదా అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. తాజాగా గిల్ గాయానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. గాయం తీవ్రతపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ కేవలం కండరాలు పట్టేయడంతోనే నొప్పి వచ్చినట్లు భారత మెడికల్ బృందం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికైతే గిల్ బాగానే ఉన్నాడని, రెండో వన్డేలో ఆడుతాడని టీమిండియా మేనేజ్మెంట్ తెలిపింది. రెండో వన్డేకు ఒకరోజు గ్యాప్ ఉండడంతో పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని పేర్కొంది. గిల్ కూడా తన గాయంపై స్పందించాడు. ‘నేను బాగానే ఉన్నాను. కండరాల నొప్పితో కాస్త బాధపడ్డాను. ఒకరోజు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. రెండో వన్డేకు నేను ఫిట్గానే ఉంటాను’ అని చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్లో కోహ్లి, రోహిత్లు వెనువెంటనే ఔటైన తర్వాత గిల్, అయ్యర్తో కలిసి బాధ్యతగా ఆడాడు. ఇద్దరు కలిసి మూడో వికెట్కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే గిల్ రిటైర్డ్ హర్ట్ వెళ్లిన కొద్దిసేపటికే శ్రేయస్ అయ్యర్ 35 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ కూడా కేవలం ఒక్క పరుగుకే ఔటవడంతో భారత్పై మరోసారి ఒత్తిడి పెరిగింది. ఆ సమయంలో క్రీజ్ లోకి వచ్చిన ఆల్ రౌండర్స్ వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ లు బాధ్యతాయుతంగా ఆడుతూ ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేసి ఇంగ్లాండ్ ను మట్టికరిపించారు.అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఒక దశలో 107/6తో కష్టాల్లో పడింది. అయితే జో రూట్, లియామ్ డాసన్ అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకుని 258 పరుగుల గౌరవప్రదమైన స్కోరు అందించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లతో రాణించి ఇంగ్లండ్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. తొలి వన్డేలో గెలిచి మూడు వన్డేల సిరీస్లో 1-0తో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే గురువారం కార్డిఫ్ వేదికగా జరగనుంది.చదవండి: ఇంగ్లండ్ కంచుకోట బద్దలు.. గిల్ అరుదైన ఫీట్ -
ఇంగ్లండ్ కంచుకోట బద్దలు.. గిల్ అరుదైన ఫీట్
ఇంగ్లండ్తో తొలి వన్డేలో విజయం ద్వారా టీమిండియా అనేక రికార్డులు బద్దలు కొట్టింది. ఇంగ్లండ్ గడ్డపై తొలి విజయంతో కెప్టెన్ శుబ్మన్ గిల్ చరిత్ర సృష్టించగా, ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లండ్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుబ్మన్ గిల్ ఒక అరుదైన రికార్డు సాధించాడు. గత 12 ఏళ్లలో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన వన్డేలో ఇంగ్లండ్ను ఓడించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. ఎడ్జ్బాస్టన్లో 2015 నుంచి తాము ఆడిన ఏడు వన్డేల్లో ఇంగ్లండ్ ఒక్కటి కూడా ఓడిపోలేదు. 2014లో ఇదే ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లండ్ను చిత్తు చేసింది కూడా టీమిండియానే. మళ్లీ 12 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ కంచుకోటను మరోమారు గిల్ కెప్టెన్సీలోని టీమిండియానే బద్దలు కొట్టడం విశేషం.👉మరో రికార్డు ఏంటంటే.. ఇంగ్లండ్పై వన్డేల్లో టీమిండియాకు ఇది వరుసగా ఆరో విజయం. తన లాంగ్ స్ట్రీక్ను భారత జట్టు విజయవంతంగా కొనసాగిస్తోంది. గతంలో మూడు వివిధ సందర్భాల్లో ఇంగ్లండ్పై వన్డేల్లో వరుసగా ఐదేసి విజయాలు నమోదు చేసింది.👉 కోహ్లి, రోహిత్ విఫలమైన వేళ టీమిండియా వన్డేల్లో 250 ప్లస్ స్కోరును ఛేదించడం 2016 నుంచి ఇది రెండోసారి మాత్రమే. 2022లో ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన వన్డేలో 260 పరుగుల టార్గెట్ను టీమిండియా ఛేదించింది. ఈ మ్యాచ్లో కోహ్లి, రోహిత్లు 17 పరుగులు చేసి ఔటయ్యారు.చదవండి: తొలి వన్డేలో రిటైర్డ్ హర్ట్.. గిల్ గాయంపై కీలక అప్డేట్ -
‘ఇది మంచి ఆరంభం.. అతడొక అద్భుతం’
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా తొలి విజయాన్ని అందుకుంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బౌలింగ్తో, ఆపై బ్యాటింగ్ ఇలా సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్ శుబ్మన్ గిల్ మాట్లాడాడు. ఇది తమకు మంచి ఆరంభమని, దీనిని తర్వాతి మ్యాచ్ల్లోనూ కొనసాగిస్తామని గిల్ తెలిపాడు. ‘నిజానికి నేను టాస్ గెలిచినా బౌలింగ్ ఎంచుకునేవాడినేమో. ఎందుకంటే బౌలింగ్తో పోలిస్తే బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్లో బుమ్రా మినహా మిగతావారికి ఇంగ్లండ్ గడ్డపై పెద్దగా అనుభవం లేదు. మా ముందు ఎంత పెద్ద లక్ష్యం ఉన్నా దానిని ఛేదించేందుకు మా దగ్గర బ్యాటింగ్ అస్త్రాలు నిండుగా ఉన్నాయి. కానీ మా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. తొలి 10 ఓవర్లలో ఇంగ్లండ్ 50కి పైగా పరుగులు చేసినప్పటికీ ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టం చేయడంతో వారికి పరుగులు రావడం కష్టమైపోయింది. చివరి పవర్ ప్లేలో ఇంగ్లండ్ కాస్త దూకుడుగా ఆడడంతో 250 ప్లస్ స్కోరును దాటగలిగారు లేదంటే 220 నుంచి 230కి పరిమితమయ్యేవాళ్లేమో. 2027 వన్డే ప్రపంచకప్కు ఇంకా సమయం ఉండడంతో ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. బ్యాటింగ్, బౌలింగ్ సమపాళ్లలో ఉండేలా వర్కౌట్ చేస్తున్నాం. ఇంగ్లండ్ గడ్డపై ఉండే వికెట్ పరిస్థితులు దక్షిణాఫ్రికాలోని పరిస్థితులకు కొంత సారూప్యత ఉంటుందని భావిస్తున్నా. అక్షర్ పటేల్ తన ఆల్రౌండ్ పాత్రకు న్యాయం చేశాడు. రాబోయే రోజుల్లో ఈ విజయాలను కంటిన్యూ చేస్తాం’ అని చెప్పుకొచ్చాడు.ఇంగ్లండ్తో మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌటైంది. జో రూట్ (76 బంతుల్లో 76 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), లియామ్ డాసన్ (83 బంతుల్లో 68; 6 ఫోర్లు 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. ఇంగ్లండ్ 107/6తో ఇబ్బందుల్లో ఉన్న దశలో రూట్, డాసన్ కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్కు 22.2 ఓవర్లలో 121 పరుగులు జోడించారు. అనంతరం భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లకు 262 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (75 బంతుల్లో 80 రిటైర్ట్హర్ట్; 11 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (52 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (63 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. అక్షర్, సుందర్ ఐదో వికెట్కు 105 బంతుల్లో అభేద్యంగా 102 పరుగులు జత చేశారు. సిరీస్లో భారత్ 1–0తో పైచేయి సాధించగా... కార్డిఫ్లో రేపు రెండో వన్డే జరుగుతుంది. -
ఎట్టకేలకు ఒక విజయం
బర్మింగ్హామ్: ఫార్మాట్ మారింది... ఫలితం మారింది... ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనలో ఒక్క గెలుపు కోసం ఎదురు చూస్తున్న భారత అభిమానులకు ఎట్టకేలకు ఊరట దక్కింది. టి20ల్లో ఆరు పరాజయాల తర్వాత వన్డేల్లో సరైన ఆరంభం లభించింది. ఇంగ్లండ్తో మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌటైంది. జో రూట్ (76 బంతుల్లో 76 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), లియామ్ డాసన్ (83 బంతుల్లో 68; 6 ఫోర్లు 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. ఇంగ్లండ్ 107/6తో ఇబ్బందుల్లో ఉన్న దశలో రూట్, డాసన్ కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్కు 22.2 ఓవర్లలో 121 పరుగులు జోడించారు. అనంతరం భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లకు 262 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (75 బంతుల్లో 80 రిటైర్ట్హర్ట్; 11 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (52 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (63 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. అక్షర్, సుందర్ ఐదో వికెట్కు 105 బంతుల్లో అభేద్యంగా 102 పరుగులు జత చేశారు. సిరీస్లో భారత్ 1–0తో పైచేయి సాధించగా... కార్డిఫ్లో రేపు రెండో వన్డే జరుగుతుంది. కీలక భాగస్వామ్యం... భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంలో ఆరంభంలో స్కోరు చేయడానికి ఇంగ్లండ్ బాగా ఇబ్బంది పడింది. 13వ బంతికి గానీ బెతెల్ (14) తొలి పరుగు తీయలేకపోగా, 7 ఓవర్లలో జట్టు 20 పరుగులే చేసింది. బుమ్రా తన తొలి స్పెల్ను 4–0–8–0తో ముగించాడు. ఈ దశలో గుర్నూర్ తొలి ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్ బాది దూకుడు ప్రదర్శించిన బెన్ డకెట్ (45 బంతుల్లో 43; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అతని రెండో ఓవర్లో మరో 2 ఫోర్లు కొట్టాడు. అయితే గుర్నూర్ తన తర్వాతి ఓవర్లో ప్రతీకారం తీర్చుకున్నాడు. ఒకే ఓవర్లో అతను బెతెల్, డకెట్లను వెనక్కి పంపించాడు. బుమ్రా చక్కటి బంతితో బ్రూక్ (1) పని పట్టగా... ఒకే ఓవర్లో బట్లర్ (5), స్యామ్ కరన్ (0)లను ప్రసిధ్ అవుట్ చేశాడు. 27 బంతుల వ్యవధిలో 19 పరుగులు మాత్రమే చేసి ఇంగ్లండ్ 5 వికెట్లు చేజార్చుకుంది. ఆపై విల్ జాక్స్ (20) కొద్దిసేపు వికెట్ల పతనాన్ని నిలువరించాడు. అతనూ పెవిలియన్ చేరిన తర్వాత రూట్, డాసన్ భాగస్వామ్యంతో జట్టు కోలుకుంది.7 పరుగుల వద్ద రూట్ ఇచ్చిన సులువైన రిటర్న్ క్యాచ్ను దూబే వదిలేయడం ఇంగ్లండ్కు కాస్త కలిసొచ్చింది! ఈ క్రమంలో డాసన్ 65 బంతుల్లో వన్డేల్లో తన తొలి అర్ధసెంచరీ సాధించగా, రూట్ 57 బంతుల్లో కెరీర్లో 46వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. శతక భాగస్వామ్యం తర్వాత డాసన్ను అవుట్ చేసి అక్షర్ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత మరో 30 పరుగులకు ఇంగ్లండ్ చివరి 3 వికెట్లు కోల్పోగా, రూట్ అజేయంగా నిలిచాడు. రోహిత్, కోహ్లి విఫలం... ఛేదనలో భారత్కు సరైన ఆరంభం లభించలేదు. తడబడుతూనే ఆడిన రోహిత్ శర్మ (21 బంతుల్లో 11; 1 ఫోర్) భారీ షాట్కు ప్రయత్నించి వెనుదిరగ్గా, ఆర్చర్ చక్కటి బంతితో కోహ్లి (5)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కెపె్టన్ గిల్కు మరో ఎండ్ నుంచి శ్రేయస్ అయ్యర్ (35; 2 ఫోర్లు) సహకరించాడు. వీరిద్దరు 101 పరుగులు జత చేశారు. ఈ దశలో తొడ కండరాలు పట్టేయడంతో గిల్ మైదానం వీడగా... మూడు పరుగుల వ్యవధిలో అయ్యర్, రాహుల్ (1) వెనుదిరిగాడు. ఈ దశలో భారత్పై కొంత ఒత్తిడి కనిపించింది. అయితే సుందర్, అక్షర్ చక్కటి ప్రదర్శనతో జట్టును గెలుపు దిశగా నడిపించారు. 39 బంతుల్లోనే అక్షర్ నాలుగో అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత కూడా ఈ ఇద్దరు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గెలుపు ఖాయం చేశారు. రషీద్ బౌలింగ్లో భారీ సిక్స్తో సుందర్ 63 బంతుల్లో తన రెండో హాఫ్ సెంచరీని చేరుకోవడంతో పాటు మ్యాచ్ను ముగించాడు.స్కోరు వివరాలుఇంగ్లండ్ ఇన్నింగ్స్: డకెట్ (సి) బుమ్రా (బి) బ్రార్ 43; బెతెల్ (సి) సుందర్ (బి) బ్రార్ 14; రూట్ (నాటౌట్) 76; బ్రూక్ (సి) రోహిత్ (బి) బుమ్రా 1; బట్లర్ (సి) బ్రార్ (బి) ప్రసిధ్ 5; కరన్ (సి) రాహుల్ (బి) ప్రసిధ్ 0; జాక్స్ (సి) రాహుల్ (బి) దూబే 20; డాసన్ (సి) రోహిత్ (బి) అక్షర్ 68; ఆర్చర్ (సి) సుందర్ (బి) అక్షర్ 12; రషీద్ (స్టంప్డ్) రాహుల్ (బి) అక్షర్ 1; టంగ్ (బి) అక్షర్ 0; ఎక్స్ట్రాలు 18; మొత్తం (47.5 ఓవర్లలో ఆలౌట్) 258. వికెట్ల పతనం: 1–61, 2–63, 3–64, 4–80, 5–80, 6–107, 7–228, 8–250, 9–258, 10–258. బౌలింగ్: బుమ్రా 9–0–31–1, ప్రసిధ్ 10–2–50–2, గుర్నూర్ బ్రార్ 9–0–61–2, శివమ్ దూబే 6–0–27–1, సుందర్ 4–0–13–0, అక్షర్ పటేల్ 9.5–0–62–4.భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) బ్రూక్ (బి) కరన్ 11; గిల్ (రిటైర్డ్హర్ట్) 80; కోహ్లి (ఎల్బీ) (బి) ఆర్చర్ 5; అయ్యర్ (రనౌట్) 35; సుందర్ (నాటౌట్) 52; రాహుల్ (బి) టంగ్ 1; అక్షర్ (నాటౌట్) 57; ఎక్స్ట్రాలు 21; మొత్తం (45.2 ఓవర్లలో 4 వికెట్లకు) 262. వికెట్ల పతనం: 1–43, 2–48, 3–157, 4–160.బౌలింగ్: ఆర్చర్ 10–0–60–1, టంగ్ 10–0–50–1, స్యామ్ కరన్ 10–0–55–1, రషీద్ 5.2–0–34–0, బెతెల్ 1–0–10–0, డాసన్ 2–0–10–0, జాక్స్ 7–0–43–0. -
గుర్నూర్ దెబ్బకు కిందపడ్డ గిల్.. కోహ్లి రియాక్షన్ వైరల్
ఇంగ్లండ్తో తొలి వన్డేలో భారత పేసర్ గుర్నూర్ బ్రార్ అదరగొట్టాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మంగళవారం నాటి తొలి వన్డేకు బర్మింగ్హామ్ వేదిక. ఎడ్జ్బాస్టన్ మైదానంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఒకే ఓవర్లో రెండు వికెట్లుఈ క్రమంలో 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఇంగ్లండ్ 61 పరుగులు చేసింది. అయితే, ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో 13వ ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన బ్రార్ రెండో బాల్కు జేకబ్ బెతెల్ (14), నాలుగో బంతికి బెన్ డకెట్ (43)ను అవుట్ చేశాడు. తద్వారా ఒకే ఓవర్లో ఓపెనర్లు ఇద్దరినీ అవుట్ చేసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు.ఘోరంగా ఢీకొట్టుకున్నారుఇదిలా ఉంటే.. పదహారో ఓవర్లో ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో జోస్ బట్లర్ బంతిని గాల్లోకి లేపాడు. ఈ క్యాచ్ను అందుకునేందుకు బ్రార్, కెప్టెన్ శుబ్మన్ గిల్ ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరూ ఘోరంగా ఢీకొట్టుకున్నారు. అయితే, బ్రార్ సురక్షితంగా క్యాచ్ పట్టడంతో బట్లర్ (5) వెనుదిరిగాడు.ఇక కిందపడ్డ గిల్ను చేయిచ్చి పైకి లేపిన బ్రార్.. అతడిని ఆలింగనం చేసుకున్నాడు. ఇంతలో ప్రసిద్ కృష్ణతో కలిసి వికెట్ను సెలబ్రేట్ చేసుకున్న టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి.. బ్రార్ వైపుగా వచ్చి డాన్స్ చేస్తూ అతడిని టీజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Gurnoor Brar completes the catch to send Jos Buttler back 🚶➡️ Watch the 1st ODI of #ENGvIND, LIVE NOW on Sony Sports Network TV channels.#SonySportsNetwork #MamlaPersonalHai #ExtraaaInnings pic.twitter.com/W2lmSrbZE4— Sony Sports Network (@SonySportsNetwk) July 14, 2026258 పరుగులకు ఆలౌట్కాగా ఇంగ్లండ్తో తొలి వన్డేలో భారత బౌలర్లు మెరుగ్గా రాణించారు. ప్రత్యర్థిని 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ చేశారు. అక్షర్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ తలా రెండు.. జస్ప్రీత్ బుమ్రా, శివం దూబే తలా ఒక వికెట్ తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ టాప్ రన్ స్కోరర్ (76 నాటౌట్)గా నిలవగా.. లియామ్ డాసన్ (68) కూడా అర్ధ శతకం చేశాడు. మిగిలిన వారిలో బెన్ డకెట్ (43), విల్ జాక్స్ (20) రాణించారు. చదవండి: వాళ్లిద్దరికి అస్సలు పడటం లేదు.. డీకే సంచలన వ్యాఖ్యలు -
IND vs ENG: ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
భారత్ ఘన విజయంఎడ్జ్బాస్టన్ వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్ధేశించిన 259 పరుగుల లక్ష్యాన్ని భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్(85) టాప్ స్కోరర్గా నిలిచాడు. నిలకడగా ఆడిన గిల్ గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. గిల్తో పాటు అక్షర్ పటేల్(55 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(52 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(35) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.విజయం దిశగా భారత్ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. 66 బంతుల్లో 43 పరుగులు కావాలి. క్రీజులో అక్షర్ పటేల్(35), వాషింగ్టన్ సుందర్(29) ఉన్నారు.గిల్ రిటైర్డ్ హర్ట్80 పరుగుల వద్ద గిల్ రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్కు చేరాడు. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ క్రీజ్లోకి వచ్చాడు. 34 పరుగులతో శ్రేయస్ అప్పటిక క్రీజ్లో ఉన్నాడు. 26.1 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 151-2గా ఉంది. ఈ మ్యాచ్లో గెలవాలంటే భారత్ మరో 108 పరుగులు చేయాలి. నిలకడగా ఆడుతున్న గిల్, శ్రేయస్గిల్ (74), శ్రేయస్ అయ్యర్ (32) నిలకడగా ఆడుతున్నారు. 24 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 141-2గా ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 118 పరుగులు చేయాలి. రోహిత్, కోహ్లి ఔట్ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లి (5) ఘోరంగా విఫలమయ్యారు. సామ్ కర్రన్ బౌలింగ్లో రోహిత్ ఔట్ కాగా.. ఆర్చర్ బౌలింగ్లో విరాట్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 8.3 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 48-2గా ఉంది. రోహిత్ ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన భారత్7.3వ ఓవర్- 259 పరుగుల ఛేదనలో టీమిండియా 43 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 21 బంతుల్లో ఫోర్ సాయంతో 11 పరుగులు చేసిన రోహిత్ సామ్ కర్రన్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. గిల్కు (26) జతగా విరాట్ కోహ్లి క్రీజ్లోకి వచ్చాడు. బర్మింగ్హామ్ వేదికగా టీమిండియాతో తొలి వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఎడ్జ్బాస్టన్లో 47.5 ఓవర్లలో 258 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ బెన్ డకెట్ (43) రాణించగా.. జో రూట్ (76 నాటౌట్), లియామ్ డాసన్ (68) అర్ధ శతకాలతో అదరగొట్టారు. మిగిలిన వారిలో విల్ జాక్స్ (20) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.భారత బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ తలా రెండు.. బుమ్రా, శివం దూబే చెరో వికెట్ దక్కించుకున్నారు. 259 పరుగుల లక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్కు దిగింది. అప్డేట్స్..ఇంగ్లండ్ ఆలౌట్47.5: అక్షర్ బౌలింగ్లో జోష్ టంగ్ బౌల్డ్ (0)తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్47.3:అక్షర్ బౌలింగ్లో ఆదిల్ రషీద్ స్టంపౌట్ (1)ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్45.6: అక్షర్ పటేల్ బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్కు క్యాచ్ ఇచ్చి ఎనిమిదో వికెట్గా వెనుదిరిగిన జోఫ్రా ఆర్చర్ (12). స్కోరు 250-8 (46). క్రీజులోకి ఆదిల్ రషీద్ రాగా.. రూట్ 69 పరుగులతో ఉన్నాడు.ఏడో వికెట్ డౌన్43.6: అక్షర్ పటేల్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చిన డాసన్. 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్. క్రీజులోకి జోఫ్రా ఆర్చర్. రూట్ 59 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 228-7 (44).డాసన్, రూట్ హాఫ్ సెంచరీలు42 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 214-6రూట్ 51, డాసన్ 63 పరుగులతో ఉన్నారు.కుదురుగా ఆడుతున్న రూట్, డాసన్జో రూట్ (30), లియామ్ డాసన్ (34) కుదురుగా ఆడుతున్నారు. 32 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 160-6గా ఉంది. 27 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 128-627 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 128-6గా ఉంది. రూట్ 21, లియామ్ డాసన్ 11 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్21.4వ ఓవర్- 107 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. శివమ్ దూబే బౌలింగ్లో రాహుల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో విల్ జాక్స్ (20) ఔటయ్యాడు. 100 దాటిన ఇంగ్లండ్ స్కోర్21 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోర్ 104-5గా ఉంది. జో రూట్ (9), విల్ జాక్స్ (19) క్రీజ్లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్16.4: ప్రసిద్ బౌలింగ్లో సామ్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి డకౌట్గా వెనుదిరిగాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్16.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో బ్రార్కు క్యాచ్ ఇచ్చి బట్లర్ అవుట్ (5). కేవలం 19 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్. సామ్ కర్రాన్ క్రీజులోకి రాగా.. రూట్ 6 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 80-4.మూడో వికెట్ డౌన్13.1: బుమ్రా బౌలింగ్లో మూడో వికెట్గా వెనుదిరిగిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (1). క్రీజులోకి జోస్ బట్లర్. రూట్ సున్నా పరుగులతో ఉన్నాడు. స్కోరు: 64-3.రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్12.4: గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చిన డకెట్. హాఫ్ సెంచరీకి ఏడు పరుగులదూరంలో నిలిచిన డకెట్ (43).తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్12.2: గుర్నూర్ బ్రార్ బౌలింగ్ వాషింగ్టన్ సుందర్కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా వెనుదిరిగిన జేకబ్ బెతెల్ (14).పవర్ ప్లేలో ఇంగ్లండ్ స్కోరు: 51-0 (10)ఓపెనర్లు బెన్ డకెట్ 41, జేకబ్ బెతెల్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు.రో-కో రాకఇక ఈ సిరీస్ సందర్భంగా భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ చాలాకాలం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెడుతున్నారు. ఏడు మ్యాచ్లలో ఇంగ్లండ్దే గెలుపు! 👉ఈ ఇద్దరు చివరగా సొంతగడ్డపై న్యూజిలాండ్తో జనవరిలో జరిగిన వన్డే సిరీస్లో పాల్గొన్నారు. ఇక ఎడ్జ్బాస్టన్లో జరిగిన గత ఏడు వన్డేల్లోనూ ఇంగ్లండ్ గెలుపొందడం విశేషం. అయితే, చివరగా 2014లో టీమిండియా చేతిలో ఇంగ్లండ్ ఓడింది. బట్లర్ @ 200👉మరోవైపు.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ కెరీర్లో ఇది 200వ వన్డే. తద్వారా ఇంగ్లండ్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఇయాన్ మోర్గాన్ (225 వన్డేలు) తర్వాతి స్థానాన్ని బట్లర్ ఆక్రమించాడు. ఇదిలా ఉంటే.. ముందుగా టీ20 సిరీస్ జరగగా ఆతిథ్య ఇంగ్లండ్ టీమిండియాను 4-0తో వైట్వాష్ చేసింది. తుదిజట్లుఇంగ్లండ్జాకబ్ బెథెల్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్ఇండియారోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ. -
వరల్డ్కప్ ప్రణాళికలు వేరు.. కోహ్లితో ఏం మాట్లాడానంటే?: గిల్
ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో క్లీన్స్వీప్నకు గురైన టీమిండియా వన్డే సిరీస్కు సన్నద్ధమైంది. ఇరుజట్ల మధ్య బర్మింగ్హామ్ వేదికగా తొలి వన్డేకు రంగం సిద్ధమైంది. ఈ సిరీస్తో భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తిరిగి మైదానంలో అడుగుపెడుతున్నారు.ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదుఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. శిక్షణ సందర్భంగా కోహ్లితో జరిగిన సంభాషణ గురించి వివరించాడు. ‘‘అత్యుత్తమ కాంబినేషన్తో ముందుకు వెళ్లడమే మా ప్రధాన ప్రణాళిక. దీని గురించే మేము మాట్లాడుకున్నాము.కొంతమంది ప్రస్తుతం జట్టులో లేకపోవచ్చు. వీరిలో పేస్ బౌలర్లు, ఆల్రౌండర్లు, స్పిన్నర్లు.. ఇలా ఎవరైనా సరే ఆయా విభాగం నుంచి భవిష్యత్తులో సేవలు అందించేందుకు జట్టులోకి రావొచ్చు. ఇక విరాట్ భాయ్, రోహిత్ భాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు.గత దశాబ్ద కాలంగా వారిద్దరు టీమిండియా బ్యాటింగ్ లైనప్ వెన్నెముకగా ఉన్నారు. వారు జట్టులో అంతర్భాగం. వారి అనుభవం, నైపుణ్యం మా జట్టు విలువను పెంచుతాయి. అయితే, వన్డే ప్రపంచకప్ ప్రణాళికలు కాస్త భిన్నంగా ఉంటాయి.ఇక్కడి వికెట్ల మాదిరే వీలైనన్ని వైవిధ్యమైన కాంబినేషన్లు ప్రయత్నించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వరల్డ్కప్ వేదికైన సౌతాఫ్రికాలోని పిచ్లు.. ఇక్కడి (ఇంగ్లండ్) వికెట్ల మాదిరే ఉంటాయి. కాబట్టి మా బలాన్ని పరీక్షించుకునే క్రమంలో ఇది అత్యంత కీలకమైన సిరీస్గా మారింది. కొత్త వాళ్లకు అవకాశం నిజానికి మా తుదిజట్టులో ఎప్పుడూ పెద్దగా మార్పులు జరగలేదు. అయితే, కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చే క్రమంలో స్వల్ప మార్పులు చోటుచేసుకోవచ్చు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం ద్వారా.. ఒత్తిడిలో వారు ఏమేరకు రాణించగలరో తెలుసుకోవచ్చు. తద్వారా ప్రపంచకప్ టోర్నీకి ముందే జట్టు కూర్పు గురించి మాకు ఒక అవగాహన వస్తుంది’’ అని శుబ్మన్ గిల్ తెలిపాడు.ఇక టీ20 సిరీస్లో ఇంగ్లండ్ చేతిలో 4-0తో వైట్వాష్ కావడం తమపై ఎలాంటి ప్రభావం చూపబోదని గిల్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ‘‘ఈ రెండూ వేర్వేరు ఫార్మాట్లు. వేర్వేరు జట్లు. వేర్వేరు లక్ష్యాలు. కాబట్టి ఈ సిరీస్పై గత టీ20 సిరీస్ ప్రభావం ఉంటుందని నేను అనుకోవడం లేదు’’ అని గిల్ అన్నాడు.చదవండి: టీమిండియాలోకి సూర్యకుమార్ యాదవ్! -
జై షాకు శుభ్మన్ గిల్ ప్రత్యేక విజ్ఞప్తి
భారత టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ శుభ్మన్ గిల్, ఐసీసీ ఛైర్మన్ జై షాకు ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. వన్డే క్రికెట్కు మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలంటే ముక్కోణపు సిరీస్లు, నాలుగు దేశాల టోర్నీలను పునరుద్ధరించాలని కోరాడు.ఇంగ్లండ్తో తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడిన గిల్, ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్ల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో 50 ఓవర్ల క్రికెట్ను మరింత ఆకర్షణీయంగా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు."ముక్కోణపు సిరీస్లు, నాలుగు దేశాల టోర్నీలను మళ్లీ ప్రారంభించాలి. జట్లు కొత్త పరిస్థితుల్లో ఆడే అవకాశం లభిస్తుంది. నేను చిన్నప్పటి నుంచి 50 ఓవర్ల క్రికెట్ చూస్తూ పెరిగాను. వన్డేలను 40 ఓవర్లకు కుదించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం" అని అన్నాడు.ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ట్రై-సిరీస్లు, నాలుగు దేశాల టోర్నీలు ఎంతో ఆదరణ పొందేవి. ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్రతి ఏడాది నిర్వహించే ట్రై-సిరీస్ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అయితే టీ20 క్రికెట్ విస్తరణతో అలాంటి టోర్నీలు క్రమంగా అంతరించిపోయాయి.కాగా, ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది.తాజాగా భారత్ ఇంగ్లండ్, ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్లు కోల్పోవడంతో ఈ సిరీస్ను ప్రాధాన్యత మరింత పెరిగింది. శుభ్మన్ గిల్ అయినా టీమిండియాను తిరిగి విజయాల బాట పట్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించగా.. భారత జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. -
తిరిగొచ్చిన రో-కో ద్వయం.. తొలి వన్డేకు భారత జట్టు ఇదే!
ఇంగ్లండ్ గడ్డపై టీ20 సిరీస్లో దారుణ పరాజయం తర్వాత శుబ్మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా వన్డే సిరీస్ ఆడేందుకు సమాయత్తమవుతోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా మంగళవారం (జూలై 14న) ఇరుజట్లు తొలి వన్డే మ్యాచ్ ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే టెస్టులు, టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వన్డే జట్టుతో కలిశారు. ఇక తొలి వన్డేకు తుది జట్టు అంచనా ఒకసారి పరిశీలించి చూద్దాం.వీరితో పాటు సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా జాయిన్ కావడంతో టీమిండియా బలం పెరిగింది. 20 ఓవర్ల ఫార్మాట్ నుంచి 50 ఓవర్ల ఫార్మాట్కు ఆట మారడానికి తోడు, సీనియర్లు అంతా జట్టులోకి రావడంతో టీమిండియా ఇప్పుడు పేపర్పై దుర్భేద్యంగా కనిపిస్తోంది. 39 ఏళ్ల రోహిత్, 38 ఏళ్ల కోహ్లికి 2027 వన్డే ప్రపంచకప్ ఆఖరిది కానుండడంతో వీరిద్దరు రాణించాలని ఉవ్విళ్లూరుతున్నారు. టీ20 సిరీస్లో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్లు తమ బౌలింగ్తో టీమిండియా బ్యాటర్లను బెంబెలెత్తించారు. కానీ వన్డే ఫార్మాట్లో కోహ్లి, రోహిత్ వంటి అనుభవజ్ఞులు రావడంతో ఈ ఇద్దరు బౌలర్ల ఆటలు సాగకపోవచ్చని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాటింగ్లో గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్తో పాటు కేఎల్ రాహుల్ కీలకంగా మారనున్నారు.ఆల్రౌండ్ విభాగంలో అక్షర్పటేల్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్లు ఉన్నప్పటికీ వీరిలో ఇద్దరికి మాత్రమే అవకాశం రానుంది. ఇక బౌలింగ్ విభాగాన్ని జస్ప్రీత్ బుమ్రా నడిపించనుండగా.. టీ20 సిరీస్లో విఫలమైనప్పటికీ అర్ష్దీప్కు మరో చాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరో స్పిన్నర్ అవసరమనుకుంటే కుల్దీప్ యాదవ్ తుదిజట్టులో చోటు దక్కించుకుంటాడు. లేదంటే ప్రసిధ్ క్రిష్ణ, గుర్నూర్ బ్రార్లలో ఒకరికి అవకాశం కల్పించవచ్చు. మొత్తానికి టీ20 సిరీస్లో ఓటమి పాలైనప్పటికీ వన్డే సిరీస్కు మాత్రం సీనియర్ల రాకతో టీమిండియా కొత్తగా కనిపిస్తోంది. మ్యాచ్ సమయం: భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎడ్జ్బాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది.తుదిజట్టు అంచనా: శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ క్రిష్ణ/ గుర్నూర్ బ్రార్ -
శ్రేయస్ అయ్యర్ను తొలగించండి.. ఈజీ ఆప్షన్ అదే!
సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్-2026 విజేతగా నిలిచిన టీమిండియాకు.. విదేశీ గడ్డ మీద ఘోర పరాభవం ఎదురైంది. మెగా టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత తొలి ప్రయత్నంగా ఐర్లాండ్తో తలపడ్డ భారత్ ఊహించని రీతిలో.. ఆతిథ్య జట్టు చేతిలో 2-0తో క్లీన్స్వీప్నకు గురైంది.శ్రేయస్ అయ్యర్కు చేదు అనుభవంఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలో 4-0తో వైట్వాష్ అయింది. దీంతో టీమిండియా టీ20 కెప్టెన్గా ప్రయాణం మొదలుపెట్టిన శ్రేయస్ అయ్యర్కు తొలి ప్రయత్నంలోనే అత్యంత చేదు అనుభవం మిగిలింది. ఈ రెండు టీ20 సిరీస్లలో భారత్ క్లీన్స్వీప్ కావడంతో అతడి కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈజీ ఆప్షన్ అదే!అదే సమయంలో హెడ్కోచ్ గౌతం గంభీర్పైనా మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ రెండు సిరీస్లలో టీమిండియా ఘోర ఓటమి నేపథ్యంలో గౌతం గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను తొలగించడమనేది అత్యంత సులువైన ఆప్షన్.అయితే, ఆ విషయం పక్కనపెట్టి భారత జట్టు ఓటమికి అసలు కారణాలు ఏమిటో ముందు విశ్లేషించండి. నిజానికి ఐర్లాండ్, ఇంగ్లండ్.. అంటే విదేశీ గడ్డ మీద ఈ మ్యాచ్లు జరగడమే భారత్ ఓటమికి ప్రధాన కారణం.వికెట్ ఇలా ఉంది కాబట్టే మన బ్యాటర్లు విదేశీ పిచ్ల మీద ఆడేందుకు ఏమాత్రం సన్నద్ధం కాలేదు. ఎందుకంటే.. మన సెలక్టర్లు కేవలం ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా వీరిని విదేశీ టూర్కు ఎంపిక చేశారు. ఐపీఎల్ మన బ్యాటర్లకు ఓ కవచం వంటిది. ఇక్కడ రాణిస్తే చాలు జాతీయ జట్టులోకి వచ్చేస్తామనే నమ్మకం కుదిరింది.అయితే, ఐపీఎల్ రూపొందించినటువంటి ఫ్లాట్ పిచ్లను నేను జీవితంలో ఇంత వరకు చూడనేలేదు. వికెట్ ఇలా ఉంది కాబట్టే మన బ్యాటర్లు.. ముఖ్యంగా టాపార్డర్లో వచ్చిన వాళ్లు మంచినీళ్ల ప్రాయంగా పరుగులు రాబడుతున్నారు.మరి విదేశాల్లో వికెట్లు ఇలా ఉండవు కదా. అక్కడ మార్బుల్ షీట్పై బ్యాటింగ్ చేయడం కుదరదు. ఇలాంటపుడే సెలక్టర్లు మరింత తెలివిగా ఆలోచించాల్సింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ గడ్డ మీద రాణించిన శుబ్మన్ గిల్ వంటి ఆటగాళ్లను సెలక్ట్ చేయాల్సింది.దిక్కుమాలిన ఐడియా ఇచ్చిన వారిపైనే వేటుఈ పరాజయాల నేపథ్యంలో లోతుగా విచారణ, విశ్లేషణ జరపాలి. బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్లు రూపొందించమని బీసీసీఐకి సలహా ఇచ్చిన వారిని ముందుగా తొలగించాలి. ఐపీఎల్ను మరింత పాపులర్ చేయాలని.. వాణిజ్యపరంగా లాభాలు పొందాలని చూస్తే పరిస్థితులు ఇలాగే దిగజారిపోతాయి’’ అని సంజయ్ మంజ్రేకర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా వరుస సిరీస్లలో వైట్వాష్ నేపథ్యంలో టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని ఇంగ్లండ్కు కోల్పోయింది.చదవండి: ఇంగ్లండ్ టెస్టు జట్టు హెడ్కోచ్గా ద్రవిడ్? -
భారత టీ20 జట్టులోకి ఊహించని ప్లేయర్!
ఇంగ్లండ్ చేతిలో క్లీన్స్వీప్ గండం నుంచి తప్పించుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. సౌతాంప్టన్ వేదికగా ఆతిథ్య జట్టుతో ఆఖరి టీ20 మ్యాచ్లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. కాగా విదేశీ గడ్డ మీద టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే.తొలుత పసికూన చేతిలోటీ20 ప్రపంచకప్-2026 చాంపియన్గా ఐర్లాండ్లో అడుగుపెట్టిన భారత జట్టు.. అనూహ్య రీతిలో పసికూన చేతిలో 2-0తో వైట్వాష్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్లలో భారత్ ఓటమిపాలైంది.ఫలితంగా ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ను 3-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం మూడో టీ20 జరుగనున్న నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.అనుచిత నిర్ణయాల వల్లే సెలక్షన్ విషయంలో అనుచిత నిర్ణయాల వల్లే టీమిండియాకు ఈ గతి పట్టిందని చిక్కా మండిపడ్డాడు. ఈ క్రమంలో టెస్టు జట్టులో రెగ్యులర్ సభ్యుడైన కేఎల్ రాహుల్ను తిరిగి టీ20 జట్టులోకి తీసుకోవాలని యాజమాన్యానికి సూచించాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..గిల్కు ఛాన్స్ ఇచ్చారు..‘‘ప్రస్తుత పరిస్థితుల్లో కేఎల్ రాహుల్ను భారత టీ20 జట్టులోకి తిరిగి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నిజానికి శుబ్మన్ గిల్కు ఓ అవకాశం దక్కింది. వన్డే, టెస్టు కెప్టెన్ అయిన అతడిని నేరుగా టీ20 జట్టు వైస్ కెప్టెన్గా నియమించారు.అతడిని టీ20 ఫార్మాట్లోనూ ఆడించండికానీ అతడు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కాబట్టి ఆ తర్వాత గిల్ను పక్కనపెట్టేశారు. అయితే, కేఎల్ రాహుల్కు కనీసం అలాంటి ఒక్క అవకాశం కూడూ దక్కలేదు. రాహుల్ను కేవలం టెస్టు, వన్డేలకే పరిమితం చేయాలని యాజమాన్యం భావిస్తోంది.ఫ్లాట్ పిచ్ల మీదే మనోళ్ల ప్రతాపంనిజానికి అతడి టీ20 రికార్డు అద్భుతంగా ఉంది. ఎలాంటి పిచ్ మీద అయినా రాహుల్ ఆడగలడు. ప్రస్తుత టీమిండియా బ్యాటింగ్ లైనప్ కేవలం ఫ్లాట్ పిచ్ల మీద మాత్రమే పరుగుల వరద పారిస్తోంది. సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ టోర్నీలో సౌతాఫ్రికా భయపెట్టగానే.. వెంటనే పిచ్లు మార్చమని మనోళ్లు అడిగారు. ఇక ఐపీఎల్లో లక్నో పిచ్ మీద భారత బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డారు. మన బ్యాటర్లు తడి టెన్నిస్ బాల్తో ప్రాక్టీస్ చేస్తూ పేస్, బౌన్సీ కండిషన్లకు మరింతగా అలవాటు పడాల్సిన ఆవశ్యకత ఉంది’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా పొట్టి ఫార్మాట్లో కేఎల్ రాహుల్ చివరగా 2022 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ సందర్భంగా టీమిండియాకు ఆడాడు. ఇప్పటికి మొత్తంగా 72 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 2265 పరుగులు సాధించాడు. సగటు 37.7 కాగా స్ట్రైక్రేటు 139.13. రాహుల్ ఖాతాలో 22 టీ20 అర్ధ శతకాలు, రెండు సెంచరీలు ఉన్నాయి.చదవండి: అతడు భయపడుతున్నాడు.. జట్టు నుంచి తీసేయండి -
వింబుల్డన్లో దిగ్గజాల సందడి (ఫొటోలు)
-
సచిన్, కోహ్లి సరసన గిల్.. టీమిండియా కెప్టెన్గా రికార్డు
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ అరుదైన ఫీట్ సాధించాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీని రాయల్ బాక్స్ నుంచి వీక్షించిన నాలుగో భారత కెప్టెన్గా గిల్ నిలిచాడు. గతంలో భారత్ నుంచి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు కెప్టెన్ హోదాలో రాయల్ బాక్స్ నుంచి వింబుల్డన్ టోర్నీ మ్యాచ్లను వీక్షించారు. తాజాగా గిల్ వీరి సరసన చేరాడు. శుక్రవారం లండన్లోని ఆల్ ఇంగ్లండ్ టెన్నిస్ క్లబ్లో జకోవిచ్, సినర్ మ్యాచ్ను గిల్ ప్రత్యక్షంగా వీక్షించాడు. మరో విశేషమేమిటంటే గిల్ పక్కనే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో పాటు అతడి భార్య అంజలి కూడా ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి వింబుల్డన్ మ్యాచ్ వీక్షిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక వీరితో పాటు విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా, నెదర్లాండ్స్ స్టార్ ఫుట్బాల్ ఆటగాడు వర్గిల్ వాన్ డిక్, బ్రిటన్ యాక్టర్ బెనెడిక్ట్ కంబర్బాచ్, హ్యూగ్ లారి, డామియన్ లూయిస్లు కూడా రాయల్ బాక్స్ నుంచి మ్యాచ్ను వీక్షించారు. ఇక గిల్ ఇటీవలే సిల్వర్స్టోన్ సర్క్యూట్ వేదికగా జరిగిన బ్రిటీష్ గ్రాండ్ప్రిక్స్ టోర్నీకి కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.ఇక ప్రస్తుతం టీమిండియా జట్టు ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 0-3తో ఇంగ్లండ్కు సిరీస్ కోల్పోయిన టీమిండియా ఇవాళ చివరి మ్యాచ్ను సౌతాంప్టన్ వేదికగా ఆడుతోంది. టీ20 సిరీస్ ముగిసిన వెంటనే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ మొదలుకానుంది. వన్డే సిరీస్కు గిల్తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి జాయిన్ కానుండడంతో జట్టు పరిపూర్ణం కానుంది. 2027 వన్డే ప్రపంచ కప్ సన్నాహకంగా ఈ వన్డే సిరీస్ను ఉపయోగించుకుంటామని, దక్షిణాఫ్రికా పరిస్థితులకు ఇక్కడి వాతావరణం సరితూగుతుందని గిల్ వెల్లడించాడు. Shubman Gill with Sachin Tendulkar and Anjali Tendulkar at Wimbledon ❤️ pic.twitter.com/mLkqV9Tjfg— Shubman Gill Fc (@ShubmanGill7fc) July 10, 2026Read: ఒళ్లు మండిన గాఫ్.. బదులు తీర్చుకుంటానని హెచ్చరిక! -
ఇంగ్లీష్ జట్టులో గిల్ సహచరుడు
భారత ఎడమచేతి స్పిన్నర్, గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి కిషోర్ మరోసారి ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. 29 ఏళ్ల ఈ తమిళనాడు బౌలర్తో గ్లోస్టర్షైర్ కౌంటీ క్లబ్ 2026 కౌంటీ ఛాంపియన్షిప్లోని మిగిలిన ఆరు మ్యాచ్ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది.గ్లోస్టర్షైర్ తరఫున సాయి కిషోర్ వోర్సెస్టర్షైర్, డర్హమ్, డెర్బీషైర్, లాంకషైర్, మిడిల్సెక్స్, కెంట్లతో జరిగే మ్యాచ్ల్లో బరిలోకి దిగనున్నాడు. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన గ్లోస్టర్షైర్ కేవలం ఒక విజయమే నమోదు చేసి 38 పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో సాయి రాకతో జట్టు స్పిన్ విభాగం బలోపేతం అవుతుందని యాజమాన్యం భావిస్తోంది.గతేడాది సర్రే తరఫున కౌంటీ క్రికెట్ ఆడిన సాయి కిషోర్ రెండు మ్యాచ్ల్లో 11 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా డర్హమ్పై రెండో ఇన్నింగ్స్లో 72 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసి తన ప్రతిభను చాటుకున్నాడు. ఆ అనుభవంతో ఇప్పుడు రెండోసారి ఇంగ్లండ్లో ఆడే అవకాశాన్ని అందుకున్నాడు.ఫస్ట్క్లాస్ క్రికెట్లో సాయి కిషోర్ అద్భుత రికార్డు ఉంది. 54 మ్యాచ్ల్లో 223 వికెట్లు పడగొట్టిన అతడు సగటున 24.21 పరుగులకు ఓ వికెట్ పడగొట్టాడు. ఇందులో 14 సార్లు ఐదు వికెట్ల ఘనత నమోదు చేశాడు. 2025-26 రంజీ ట్రోఫీ సీజన్లోనూ అతడు నిలకడైన ప్రదర్శన కనబర్చాడు.అయితే ఐపీఎల్ 2026లో శుభ్మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టులో సాయి కిషోర్కు పెద్దగా అవకాశాలు లభించలేదు. కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే ఆడిన అతడు ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. -
శ్రేయస్కు అండగా నిలబడ్డ సోదరి
భారత టీ20 జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు వరుస పరాజయాలు ఎదురవుతుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడి సోదరి శ్రేష్ఠ అయ్యర్ తన సోదరుడికి అండగా నిలుస్తూ, భారత దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్లను ఉదాహరణగా చూపించి విమర్శలకు సమాధానం ఇచ్చింది.సూర్యకుమార్ యాదవ్ స్థానంలో యూరప్ పర్యటనకు శ్రేయస్ అయ్యర్ను టీ20 కెప్టెన్గా ఎంపిక చేసిన భారత జట్టు యాజమాన్యం అతడిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్కు విజయవంతంగా నడిపించిన శ్రేయస్, ఐర్లాండ్తో జరిగిన సిరీస్లో 0-2తో ఓడిపోగా, ఇంగ్లండ్తో తొలి టీ20 వర్షం కారణంగా రద్దైంది. అనంతరం జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ భారత్ పరాజయం పాలవడంతో కెప్టెన్గా ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయాడు.ఈ నేపథ్యంలో ఓ పోడ్కాస్ట్లో మాట్లాడిన శ్రేష్ఠ అయ్యర్, "విరాట్ కోహ్లీ ఒక లెజెండ్, రోహిత్ శర్మ ఒక లెజెండ్, సచిన్ టెండూల్కర్ ఒక లెజెండ్. వాళ్లు కూడా తమ కెరీర్లో ఎన్నో మ్యాచ్లు ఓడిపోయారు. కానీ ప్రతిసారీ శ్రేయస్నే విమర్శిస్తే సమస్య అతనిలో కాకుండా విమర్శించే వారిలోనే ఉండొచ్చు" అని వ్యాఖ్యానించింది.అయితే శ్రేష్ఠ చేసిన ఈ పోలికలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సచిన్ టెండూల్కర్ 1996లో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి నాలుగు వన్డేల్లో రెండింట్లో జట్టుకు విజయాలు అందించాడు. విరాట్ కోహ్లీ కూడా కెప్టెన్సీ ఆరంభంలో తొలి ఓటమి తర్వాత వరుస విజయాలు సాధించాడు. రోహిత్ శర్మ తన తొలి వన్డే సిరీస్లో శ్రీలంకపై 2-1తో విజయం అందించగా, శుభ్మన్ గిల్ కూడా కెప్టెన్గా తన తొలి టీ20 సిరీస్లో ఐదు మ్యాచ్ల్లో నాలుగు విజయాలు నమోదు చేశాడు. ఈ గణాంకాలను ప్రస్తావిస్తూ శ్రేయస్ను దిగ్గజాలతో పోల్చడం సరైంది కాదని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.నెటిజన్లు శ్రేయస్ను దిగ్గజాలతో పోల్చొద్దని చెప్పినప్పటికీ.. శ్రేష్ఠ మాత్రం తన సోదరుడిపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. "శ్రేయస్ గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఆటగాడు. అతడిలో చాలా సామర్థ్యం ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు అతడే భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు పొందుతాడని నేను బలంగా నమ్ముతున్నాను" అని పేర్కొంది.ఇదిలా ఉండగా, ప్రారంభ వైఫల్యాలు ఎదురైనా శ్రేయస్ అయ్యర్పై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు జట్టు యాజమాన్యం విశ్వాసం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. 2028 టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని యువ జట్టుతో కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్న నేపథ్యంలో శ్రేయస్కు మరిన్ని అవకాశాలు లభించే అవకాశం కనిపిస్తోంది. -
IND vs SL: టెస్టు సిరీస్ నుంచి కీలక ప్లేయర్ అవుట్!
టీమిండియాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ పాతుమ్ నిసాంక ఈ సిరీస్కు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కాగా టీమిండియా వచ్చే నెల (ఆగష్టు)లో శ్రీలంకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో భారత్ రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుండగా... 23 నుంచి కొలంబోలో రెండో మ్యాచ్ జరుగుతుంది.ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శ్రీలంక వెస్టిండీస్ పర్యటనలో ఉంది. తొలి టెస్టులో ఆతిథ్య జట్టు చేతిలో 217 పరుగులతో ఓటమిపాలైన లంక.. ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని పట్టుదలగా ఉంది. రెండో టెస్టులో గెలిచి సిరీస్ 1-1తో సమం చేయాలని ఉవ్విళ్లూరుతోంది.లంక ప్రీమియర్ లీగ్ నుంచి అవుట్అయితే, ఓపెనర్ పాతుమ్ నిసాంక మణికట్టు గాయంతో ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. శస్త్ర చికిత్స కోసం అతడు యూకేకు వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జూలై 17 నుంచి మొదలుకానున్న లంక ప్రీమియర్ లీగ్-2026 నుంచి నిసాంక వైదొలిగాడు. ఈ లీగ్ తర్వాత వారం రోజుల వ్యవధిలోనే భారత్- శ్రీలంక టెస్టు సిరీస్ మొదలుకానుంది.నిలకడగా ఆడుతూ..కాబట్టి పాతుమ్ నిసాంక టీమిండియాతో సిరీస్కు కూడా దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. గతేడాది కాలంగా నిసాంక టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. 2025లో అతడు సగటు 56తో 393 పరుగులు రాబట్టాడు.ఇప్పటికి మొత్తంగా 33 ఇన్నింగ్స్లో కలిపి 1310 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఏడు అర్ధ శతకాలు ఉన్నాయి. సొంతగడ్డపై ఆడిన 18 ఇన్నింగ్స్లో అతడు రెండు శతకాల సాయంతో 725 పరుగులు చేయడం విశేషం. ఇలా నిలకడగా ఆడుతూ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్న నిసాంక.. టీమిండియాతో సిరీస్కు దూరం కావడం ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బలాంటిదే. కాగా విండీస్తో తొలి టెస్టులో గాయం కారణంగా ఇబ్బంది పడిన నిసాంక రెండు ఇన్నింగ్స్లో కలిపి కేవలం ఐదు పరుగులే చేసి నిష్క్రమించాడు.చివరిసారి వైట్వాష్ఇదిలా ఉంటే..టీమిండియా చివరిసారి 2017లో శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడింది. అప్పుడు మూడు మ్యాచ్ల సిరీస్ను భారత్ 3–0తో వైట్వాష్ చేసింది. ఇక 2008 నుంచి లంక గడ్డపై టెస్టు సిరీస్ ఓడని టీమిండియా... అదే ఆధిపత్యం కొనసాగిస్తుందా చూడాలి.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025–27లో భాగంగా ఇప్పటి వరకు 9 టెస్టులు ఆడిన శుబ్మన్ గిల్ సేన... 4 విజయాలు, 4 పరాజయాలు, ఒక ‘డ్రా’తో ప్రస్తుతం పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: చరిత్ర సృష్టించిన రొనాల్డో! -
నా సేవల్ని సరిగ్గా వాడుకోలేదు.. అందుకే: టీమిండియా స్టార్
టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ పర్యటనలో యాజమాన్యం తన సేవలను సరిగ్గా వాడుకోలేదని ఆరోపించాడు. కాగా గతేడాది టీమిండియా ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే.ఈ సిరీస్తోనే భారత జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన ప్రయాణం ఆరంభించాడు. గౌతం గంభీర్ మార్గదర్శనంలో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీని టీమిండియా 2-2తో సమం చేసింది. ఇక ఈ సిరీస్లో భాగంగా ముంబైకర్ శార్దూల్ ఠాకూర్ రెండు టెస్టులు ఆడాడు. మొత్తంగా 27 ఓవర్లు బౌలింగ్ చేసి 144 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. లీడ్స్ వేదికగా తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో ఆరు ఓవర్లు వేసిన శార్దూల్.. 38 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్లో 10 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది.అదే విధంగా మాంచెస్టర్లో నాలుగో టెస్టులో పదకొండు ఓవర్లు వేసిన శార్దూల్ ఠాకూర్ 55 పరుగులు ఇచ్చి వికెట్లు తీయలేకపోయాడు. ఈ మ్యాచ్ డ్రా అయింది. అయితే, ఈ మూడు ఇన్నింగ్స్లోనూ శార్దూల్ కంటే మిగతా బౌలర్లు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేశారు.ఈ విషయాన్ని శార్దూల్ ఠాకూర్ తాజాగా గుర్తుచేసుకున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ 2026-27 సీజన్ లాంచ్లో భాగంగా మాట్లాడుతూ.. ‘‘2024-25 సీజన్లో నేను అద్భుతంగా ఆడాను (తొమ్మిది మ్యాచ్లలో కలిపి 35 వికెట్లు). కానీ తగినన్ని మ్యాచ్లు ఆడే అవకాశాలు మాత్రం రాలేదు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నపుడు నా సేవల్ని యాజమాన్యం సరిగ్గా ఉపయోగించుకోలేదు.ఇందులో నా తప్పు కూడా ఉంది. లీడ్స్ టెస్టులో నేను సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. ఒక్క పరుగుకే అవుటయ్యాను. మాంచెస్టర్లో మాత్రం నేను అద్భుతంగా బ్యాటింగ్ చేశాను. తొలి ఇన్నింగ్స్లో 41 పరుగులు చేశాను. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 358 పరుగులు చేయగలిగింది. అందులో నా పాత్ర కూడా ఉంది. అయితే, నేను రెండో ఇన్నింగ్స్లో సరిగ్గా ఆడలేదు. ఒకవేళ బాగా ఆడి ఉంటే ఫలితం వేరుగా ఉండేదేమో’’ అని శార్దూల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు. -
రెండో స్థానానికి గిల్
దుబాయ్: ఇటీవల అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్లో సత్తా చాటిన భారత కెప్టెన్ శుబ్మన్ గిల్... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి ఎగబాకాడు. అఫ్గాన్తో రెండు మ్యాచ్ల్లో బ్యాటింగ్కు దిగిన గిల్ 238 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో మూడు స్థానాలు మెరుగుపరుచుకున్న గిల్ 791 పాయింట్లతో రెండో ర్యాంక్కు చేరుకున్నాడు. విరాట్ కోహ్లి (768 పాయింట్లు), రోహిత్ శర్మ (754 పాయింట్లు) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉండగా... న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ (815 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా నుంచి కేఎల్ రాహుల్ (651 పాయింట్లు) 11వ స్థానానికి చేరగా... శ్రేయస్ అయ్యర్ (638 పాయింట్లు) 14వ ర్యాంక్లో ఉన్నాడు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో రషీద్ ఖాన్ (682 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా... భారత్ నుంచి అత్యుత్తమంగా కుల్దీప్ యాదవ్ (614 పాయింట్లు) ఏడో ర్యాంక్లో కొనసాగుతున్నాడు. రూట్ 12వ సారి... ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో మరోసారి నంబర్వన్ స్థానానికి చేరాడు. సుదీర్ఘ కెరీర్లో రూట్ ‘టాప్’ ర్యాంక్కు చేరడం ఇది పన్నెండోసారి కావడం విశేషం. తాజాగా న్యూజిలాండ్తో రెండో టెస్టులో బెన్ స్టోక్స్ స్థానంలో ఇంగ్లండ్ జట్టుకు తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించిన రూట్... ఈ సిరీస్లో బ్యాట్తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా రెండు స్థానాలు పురోగతి సాధించిన అతడు... 871 పాయింట్లతో అగ్రస్థానానికి ఎగబాకాడు. ఇంగ్లండ్కే చెందిన హ్యారీ బ్రూక్ (866 పాయింట్లు) రెండో స్థానంలో ఉండగా... టీమిండియా నుంచి గిల్ (743 పాయింట్లు), యశస్వి జైస్వాల్ (733 పాయింట్లు) వరుసగా ఏడు, ఎనిమిది ర్యాంక్ల్లో ఉన్నారు. ఇంగ్లండ్తో రెండో టెస్టులో 11 వికెట్లతో విజృంభించిన న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ (870 పాయింట్లు), భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానానికి చేరాడు. తద్వారా 36 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో ‘టాప్’ ర్యాంక్ దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ నుంచి గతంలో జాక్ కొవీ (1947), రిచర్డ్ హాడ్లీ (1984–1990) మాత్రమే ఈ ఘనత సాధించారు. -
IND vs AFG: శతక్కొట్టిన జైసూ.. సిరీస్ క్లీన్స్వీప్
చెన్నై వేదికగా అఫ్గానిస్తాన్తో మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి విధించిన 219 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 28.4 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది.భారత ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ శతకం (86 బంతుల్లో 110 నాటౌట్)తో చెలరేగగా.. రోహిత్ శర్మ 79 పరుగులు సాధించాడు. వన్డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ 19 బంతుల్లో 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. అంతకుముందు ధర్మశాలలో ఏడు వికెట్ల తేడాతో అఫ్గాన్ను ఓడించిన గిల్ సేన.. లక్నో మ్యాచ్లో 170 పరుగుల తేడాతో పర్యాటక జట్టును చిత్తు చేసింది.Updates: చెన్నై వేదికగా టాస్ గెలిచిన అఫ్గాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి 44.2 ఓవర్లలో కేవలం 218 చేసి ఆలౌట్ అయింది. ఇక టీమిండియా 219 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగింది. హష్మతుల్లా పిచ్ ఏరియాలో పరిగెత్తిన కారణంగా అఫ్గాన్కు ఐదు పరుగుల పెనాల్టీ పడగా.. టీమిండియా.. 5/0తో తమ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.25 ఓవర్లలో టీమిండియా స్కోరు: 1771-1జైసూ 81, అయ్యర్ 4 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన భారత్22.5: నబీ బౌలింగ్లో సెదీకుల్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన రోహిత్ శర్మ (69 బంతుల్లో 79). శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 171-1. జైసూ 78 పరుగులతో ఉన్నాడు.21 ఓవర్లలో టీమిండియా స్కోరు: 153-0రోహిత్ శర్మ 65, యశస్వి జైస్వాల్ 75 పరుగులతో ఉన్నారు.రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ15.2: రషీద్ ఖాన్ బౌలింగ్లో ఫోర్ బాది.. అర్ధ శతకం పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ. 47 బంతుల్లో హాఫ్ సెంచరీ. స్కోరు: 123-0(15.3). జైసూ 58 పరుగులతో ఉన్నాడు.జైస్వాల్ అర్ద శతకం11.3: రషీద్ ఖాన్ బౌలింగ్లో సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న జైస్వాల్పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 86-0యశస్వి జైస్వాల్ 46, రోహిత్ 27 పరుగులతో ఉన్నారు.తొలి ఓవర్లోనే 23 పరుగులు5/0తో లక్ష్య ఛేదన మొదలుపెట్టిన టీమిండియా.. తొలి ఓవర్లో మొత్తంగా 23 పరుగులు ఖాతాలో వేసుకుంది. జైస్వాల్ 14 పరుగులు చేయగా.. మిగతావి ఎక్స్ట్రా రూపంలో వచ్చాయి. చెలరేగిన ప్రసిద్.. అఫ్గాన్ ఆలౌట్భారత పేసర్ ప్రసిద్ కృష్ణ అఫ్గాన్ టాపార్డర్ను కుదేలు చేశాడు. అతడి దెబ్బకు రహ్మానుల్లా గుర్బాజ్ (5), రహ్మత్ షా (5), ఇబ్రహీం జద్రాన్ (11) పెవిలియన్కు వరుస కట్టారు. ఇలాంటి దశలో హష్మతుల్లా షాహిది కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 131 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 102 పరుగులు చేశాడు. అయితే, ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో ఆఖరి వికెట్గా వెనుదిరగడంతో హష్మతుల్లా శతక ఇన్నింగ్స్కు తెరపడింది. మిగతా వారిలో అజ్మతుల్లా అర్ధ శతకం (50) చేయగా.. మహ్మద్ నబీ 21 పరుగులు చేశాడు. ఫలితంగా 44.2 ఓవర్లలో 218 పరుగులు చేసి అఫ్గాన్ ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ ఐదు వికెట్లతో చెలరేగగా.. గుర్నూర్, ప్రిన్స్, హర్ష్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.అఫ్గాన్ కెప్టెన్ సెంచరీఅఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది సెంచరీ సాధించాడు. 126 బంతుల్లో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. స్కోరు: 217-9(44).తొమ్మిదో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్41.1: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో హష్మతుల్లా సింగిల్కు వెళ్లగా ఫరీద్ రనౌట్ (0). స్కోరు: 206-9(41.2).ఎనిమిదో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్40.6: హర్ష్ దూబే బౌలింగ్లో.. హష్మతుల్లా షాహిది సింగిల్కు వెళ్లగా.. ఘజన్ఫర్ (1) రనౌట్ అయ్యాడు. స్కోరు: 206-8(41). ఫరీద్ మాలిక్ క్రీజులోకి వచ్చాడు.ఏడో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్40.3: హర్ష్ దూబే బౌలింగ్లో ప్రిన్స్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన రషీద్ ఖాన్ (5). స్కోరు: 206-7(40.3). హష్మతుల్లా 91 పరుగులతో ఆడుతున్నాడు.ఆరో వికెట్ డౌన్37.1: గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో మహ్మద్ నబీ (21) బౌల్డ్. స్కోరు: 200-6(37.2). రషీద్ ఖాన్ క్రీజులోకి రాగా.. హష్మతుల్లా 89 పరుగులతో ఉన్నాడు.ఐదో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్28.2: ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో ప్రసిద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన అజ్మతుల్లా (50). అజ్మతుల్లా అర్ధ శతకం27.3: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో సింగిల్ తీసి అజ్ముతుల్లా ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ (55 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. స్కోరు: 140-4(28). హష్ముతుల్లా 54 పరుగులతో ఆడుతున్నాడు. హష్మతుల్లా హాఫ్ సెంచరీ15.5: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో సింగిల్ తీసి అర్ధ శతకం పూర్తి చేసుకున్న హష్మతుల్లా షాహిది. 64 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్న కెప్టెన్. స్కోరు: 133-4(26). అజ్మతుల్లా 47 పరుగులతో ఆడుతున్నాడు.22 ఓవర్లకు అఫ్గాన్ స్కోర్: 108/422 ఓవర్లు ముగిసే సరికి అఫ్గానిస్తాన్ నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ హస్మతుల్లా షాహిది(36), అజ్మతుల్లా ఓమర్జాయ్(36) ఉన్నారు.పదిహేను ఓవర్లలో అఫ్గానిస్తాన్ స్కోరు: 69-4(15)హష్మతుల్లా 17, అజ్మతుల్లా 18 పరుగులతో ఆడుతున్నారు.పవర్ ప్లేలో అఫ్గానిస్తాన్ స్కోరు: 37-4 (10)హష్మతుల్లా నాలుగు పరుగులతో ఉండగా.. అజ్మతుల్లా సున్నా పరుగుల వద్ద ఉన్నాడు.నాలుగో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్9.2: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి అవుటైన డార్విష్ రసూలీ (1). అజ్మతుల్లా ఒమర్జాయ్ క్రీజులోకి రాగా.. హష్మతుల్లా షాహిది నాలుగు పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 36-4(9.3)మూడో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్7.2: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ఇబ్రహీం జద్రాన్ (11). స్కోరు: 28-3(7.2). డార్విష్ రసూలీ క్రీజులోకి రాగా.. హష్మతుల్లా ఇంకా పరుగుల ఖాతా తెరవనే లేదు.రెండో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్5.6: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి రహ్మత్ షా (15 బంతుల్లో 5) రెండో వికెట్గా వెనుదిరిగాడు. స్కోరు: 26-2. జద్రాన్ 10 పరుగులతో ఉండగా.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది క్రీజులోకి వచ్చాడు. ఐదు ఓవర్లలో అఫ్గాన్ స్కోరు: 22-1(5)రహ్మత్ ఒకటి, జద్రాన్ పది పరుగులతో క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్1.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో తొలి వికెట్గా వెనుదిరిగిన రహ్మానుల్లా గుర్బాజ్ (5). క్రీజులోకి రహ్మత్ షా. స్కోరు: 5-1(1.2). ఇబ్రహీం జద్రాన్ ఇంకా పరుగుల ఖాతా తెరవలేదు.తుదిజట్లలో మార్పులుఈ సందర్భంగా కెప్టెన్ హష్మతుల్లా షాహిది మాట్లాడుతూ.. మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, జియా ఉర్ రహ్మాన్లు తిరిగి రాగా.. ఫరీద్ మాలిక్కు కూడా తుదిజట్టులో చోటు ఇచ్చినట్లు తెలిపాడు. రాహుల్పై వేటు!ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో భారత్ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది. కుల్దీప్ యాదవ్కు బదులు హర్ష్ దూబే రాగా.. అర్ష్దీప్ సింగ్, కేఎల్ రాహుల్ స్థానాల్లో ప్రసిద్ కృష్ణ, నితీశ్ కుమార్ రెడ్డి చోటు దక్కించుకున్నారు.సిరీస్ భారత్ కైవసంకాగా మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలుత ధర్మశాలలో అఫ్గాన్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన భారత్.. లక్నో మ్యాచ్లో 170 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. భారత వన్డే జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్కు ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్.అఫ్గానిస్తాన్రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), డార్విష్ రసూలీ, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ఏఎమ్ ఘజన్ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్. -
మీ వల్ల గందరగోళంలో శుబ్మన్ గిల్: మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం తీరును భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి విమర్శించాడు. అఫ్గానిస్తాన్తో రెండో వన్డేలో టాపార్డర్లో మార్పులు చేయడాన్ని తప్పుబట్టాడు. కాగా స్వదేశంలో అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.తొలుత ధర్మశాలలో అఫ్గాన్ను చిత్తు చేసిన భారత జట్టు.. లక్నో వేదికగా బుధవారం రెండో వన్డేలో అఫ్గాన్ను 170 పరుగుల తేడాతో చిత్తు చేసి ఈ ఘనత సాధించింది. తద్వారా వన్డే కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఖాతాలో తొలి సిరీస్ విజయం చేరింది.ఇదిలా ఉంటే.. అఫ్గాన్తో రెండో వన్డేలో టీమిండియా తమ ఓపెనింగ్ జోడీని మార్చింది. కెప్టెన్ శుబ్మన్ గిల్కు బదులు.. యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మతో పాటు ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే, చాన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన జైసూ పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం నాలుగు పరుగులు చేసి నిష్క్రమించాడు.మరోవైపు.. రోహిత్ 48 పరుగులు చేయగా.. వన్డౌన్లో వచ్చిన గిల్ భారీ శతకం (154)తో దుమ్ములేపాడు. ఇక గత మ్యాచ్లో మూడో స్థానంలో ఆడిన ఇషాన్ కిషన్.. ఈసారి నాలుగో నంబర్ బ్యాటర్గా బరిలోకి దిగి మెరుపు సెంచరీ (79 బంతుల్లో 125)తో అదరగొట్టాడు. అయితే, ఈ మార్పులతో జట్టు భారీ విజయం సాధించినప్పటికీ మనోజ్ తివారీ మాత్రం నాయకత్వ బృందాన్ని విమర్శించాడు.క్రిక్బజ్తో మాట్లాడుతూ.. ‘‘భవిష్యత్తులో తలనొప్పిగా మారడం తప్ప ఈ ప్రయోగంతో ఎలాంటి ప్రయోజనం లేదు. రోహిత్ శర్మతో యశస్వి జైస్వాల్ను ఓపెనింగ్ చేయించి శుబ్మన్ గిల్ను వన్డౌన్కి డిమోట్ చేశారు. ఆ స్థానంలో గిల్ భారీగా పరుగులు రాబట్టాడు.ఇప్పుడా విషయం గందరగోళానికి కారణం కావొచ్చు. నేను మళ్లీ ఓపెనర్గా వెళ్లాలా? లేదంటే వన్డౌన్లోనే ఆడాలా అని గిల్ కన్ఫ్యూజ్ అవుతాడు. అసలు యాజమాన్యం ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదు. ఇక్కడ స్పష్టత లోపించింది.ఏదేమైనా జైస్వాల్ను ఆడించడం మంచి విషయం. ఎందుకంటే అతడు అన్ని ఫార్మాట్లలో ఆడగల సమర్థుడు. అతడికి మళ్లీ అవకాశం రావడం హర్షణీయం. ఇక రోహిత్ శర్మ అఫ్గన్తో రెండో వన్డేలో పెద్దగా దూకుడు ప్రదర్శించలేదు. అతడిపై బయటి నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది’’ అని మనోజ్ తివారి చెప్పుకొచ్చాడు. -
డబుల్ సెంచరీ చేసేవాడినే... కానీ
అఫ్గానిస్తాన్తో రెండో వన్డేలో టీమిండియా అదరగొట్టింది. లక్నో వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో ప్రత్యర్థిని ఏకంగా 170 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను సొంతం చేసుకుంది.ఆత్మవిశ్వాసంతోఈ క్రమంలో టీమిండియా వన్డే కెప్టెన్గా శుబ్మన్ గిల్ (Shubman Gill) తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నాడు. ఈ మ్యాచ్లో అతడు 154 పరుగులతో బ్యాటర్గానూ సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘మొదటి బంతి నుంచే నేను ఆత్మవిశ్వాసంతో బాదడం మొదలుపెట్టాను. నా ప్రణాళికలకు తగ్గట్లుగానే ఫలితం రావడం చూశాను.40- 45 ఓవర్ల పాటు ఈ సిరీస్లో నాకు నేనే ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. నేనే మ్యాచ్లు ఫినిష్ చేయాలని భావించాను. 40- 45 ఓవర్ల పాటు క్రీజులో ఉండాలని టార్గెట్ పెట్టుకున్నాను. శుభారంభం అందుకుంటే దానిని భారీ స్కోరుగా మలచాలని నిర్ణయించుకున్నా.డబుల్ సెంచరీ చేసేవాడినే... కానీఈరోజు డబుల్ సెంచరీ పూర్తి చేయాలనే అనుకున్నా. కానీ జట్టు స్కోరు 430, 440, 450 రేంజ్లో ఉండాలంటే నేను హిట్టింగ్ ఆపకూడదు. నా మనసులో అదొక్కటే ఉండిపోయింది. టాస్ ఓడినంత మాత్రాన పెద్దగా తేడా ఏమీ కనబడలేదు. ఈ పిచ్ మీద 310- 320 మాత్రమే స్కోరు చేసి ఉంటే.. అది ఛేదించదగ్గ టార్గెటే.అయితే, మేము ముందు నుంచే ప్రణాళికతో ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాము. మా బౌలర్లు కూడా తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారు’’ అని శుబ్మన్ గిల్ తన వ్యక్తిగత ప్రదర్శన పట్ల.. అదే విధంగా జట్టు ప్రదర్శన పట్ల హర్షం వ్యక్తం చేశాడు.ఆల్రౌండ్ ప్రదర్శనతో..ఏకనా స్టేడియంలో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్కు దిగింది. 49.5 ఓవర్లలో 402 పరుగులు చేసి ఆలౌట్ అయింది. గిల్ (154)తో పాటు ఇషాన్ కిషన్ (125) మెరుపు సెంచరీ సాధించడం వల్ల ఈ స్కోరు సాధ్యమైంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో కేవలం 232 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత పేసర్లు అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ చెరో మూడు వికెట్లతో సత్తా చాటగా.. ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. చదవండి: వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ షాక్ The in-form #RahmanullahGurbaz is sent packing as #GurnoorBrar delivers the breakthrough.#INDvAFG | 2nd ODI | LIVE NOW 👉https://t.co/YiwP9pOAPC pic.twitter.com/6JvreD78S0— Star Sports (@StarSportsIndia) June 17, 2026 -
గిల్, ఇషాన్ శతకాల మోత
లక్నో: భారత జట్టు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటింది. బలహీన జట్టు అఫ్గానిస్తాన్తో రెండో వన్డేలోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి సిరీస్ను 2–0తో సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్మన్ గిల్ (110 బంతుల్లో 154; 22 ఫోర్లు, 2 సిక్స్లు) తొమ్మిదో సెంచరీ సాధించగా... ఇషాన్ కిషన్ (79 బంతుల్లో 125; 14 ఫోర్లు, 7 సిక్స్లు) కెరీర్లో రెండో శతకంతో చెలరేగాడు. వీరిద్దరు మూడో వికెట్కు 23.3 ఓవర్లలో 224 పరుగులు జోడించారు. వన్డేల్లో భారత్ 400కు పైగా స్కోరు చేయడం ఇది 8వసారి కావడం విశేషం. అనంతరం అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులకే ఆలౌటైంది. రహ్మత్ షా (89 బంతుల్లో 79; 8 ఫోర్లు) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలిచాడు. నామమాత్రమైన చివరి వన్డే శనివారం చెన్నైలో జరుగుతుంది. డబుల్ సెంచరీ భాగస్వామ్యం... ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) రెండో ఓవర్లోనే వెనుదిరిగినా... రోహిత్ శర్మ (39 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్స్లు) తనదైన శైలిలో కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. ఘజన్ఫర్ ఓవర్లో 3 ఫోర్లతో గిల్ కూడా ధాటిని పెంచాడు. అయితే రోహిత్ను రషీద్ బౌల్డ్ చేయడంతో 87 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఈ దశలో జత కలిసిన గిల్, ఇషాన్ వేగంగా దూసుకుపోయారు. 38 బంతుల్లో గిల్ హాఫ్ సెంచరీ పూర్తి కాగా, 52 బంతుల్లో ఇషాన్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ప్రతీ బౌలర్పై చెలరేగిన వీరిద్దరిని నిలువరించడం అఫ్గాన్ వల్ల కాలేదు. సమీ వేసిన ఇన్నింగ్స్ 33వ ఓవర్లో 5 బౌండరీలతో 21 పరుగులు రాబట్టిన భారత్ 250 పరుగుల స్కోరును దాటింది. ఇదే ఓవర్ తొలి బంతికి గిల్ సెంచరీ (77 బంతుల్లో) పూర్తి కాగా, చివరి బంతికి ఇషాన్ (71 బంతుల్లో) శతకాన్ని అందుకోవడం విశేషం. ఈ దశలో గిల్ 16 బంతుల వ్యవధిలో 7 ఫోర్లు బాదడం అతని జోరును చూపించింది. ఖరోటే ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు బాదిన ఇషాన్ తర్వాతి బంతికి వెనుదిరిగాడు. గిల్, ఇషాన్ ఏకంగా 9.6 రన్రేట్తో పరుగులు జోడించడం విశేషం. గిల్ పెవిలియన్ చేరాక భారత్ ఇన్నింగ్స్ ఆశించిన వేగంతో సాగలేదు. గిల్, రాహుల్ (0) వరుస బంతుల్లో అవుట్ కాగా, శ్రేయస్ (26) పెద్దగా ప్రభావం చూపలేదు. 40 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 340/3 కాగా... చివరి 10 ఓవర్లలో భారత్ 62 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయింది. టపటపా... భారీ ఛేదనలో ఊహించినట్లే అఫ్గాన్ చేతులెత్తేసింది. గుర్బాజ్ (33 బంతుల్లో 41; 7 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించినా... ఆపై ఇతర బ్యాటర్లు నిలవలేకపోయారు. రహ్మత్, సాదిఖుల్లా (50 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్కు 57 పరుగులు జత చేసిన తర్వాత జట్టు పూర్తిగా కుప్పకూలింది. బుధవారం లక్నోలో తీవ్రమైన ఎండ కారణంగా ఇరు జట్ల ఆటగాళ్లంతా బాగా ఇబ్బంది పడ్డారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ప్లేయర్లు పదే పదే విరామాలు తీసుకున్నారు. గిల్, ఇషాన్ ఎంతో అలసిపోగా, రషీద్ ఖాన్ మధ్యలోనే మైదానం వీడాడు. కెరీర్లో తొలి వన్డే ఆడిన దార్విష్ రెండు సార్లు బయటకు వెళ్లాడు. బ్యాటింగ్ సమయంలో కండరాలు పట్టేయడంతో పెవిలియన్కు వెళ్లిన అతను మళ్లీ రాలేదు.ప్రిన్స్ యాదవ్ @263 ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో మూడు మార్పులు జరిగాయి. తొడ కండరాల గాయంతో నితీశ్ కుమార్ రెడ్డి మ్యాచ్కు దూరం కాగా... అతని స్థానంలో జైస్వాల్కు చోటు లభించింది. ప్రసిధ్, హర్ష్ దూబే స్థానాల్లో ప్రిన్స్ యాదవ్, కుల్దీప్లకు అవకాశం దక్కింది. ఈ మ్యాచ్తో ప్రిన్స్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. భారత్ తరఫున వన్డేలు ఆడిన 263వ ఆటగాడిగా అతను గుర్తింపు పొందాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) ఖరోటే (బి) సలీమ్ 4; రోహిత్ (బి) రషీద్ 48; గిల్ (సి) దార్విష్ (బి) ఖరోటే 154; ఇషాన్ కిషన్ (సి) (సబ్) ఇక్రామ్ (బి) ఖరోటే 125; శ్రేయస్ (సి) ఇబ్రహీం (బి)ఖరోటే 26; రాహుల్ (సి) ఇబ్రహీం (బి) ఖరోటే 0; సుందర్ (సి) గుర్బాజ్ (బి) రషీద్ 19; గుర్నూర్ (సి) ఇబ్రహీం (బి) రషీద్ 3; అర్ష్ దీప్ (సి) రషీద్ (బి) ఘజన్ఫర్ 3; కుల్దీప్ (నాటౌట్) 3; ప్రిన్స్ (రనౌట్) 5; ఎక్స్ట్రాలు 12; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 402. వికెట్ల పతనం: 1–9, 2–96, 3–320, 4–360, 5–360, 6–371, 7–387, 8–392, 9–396, 10–402. బౌలింగ్: ఘజన్ఫర్ 10–1–69–1, సలీమ్ 8–0–75–1, సమీ 8.5–0–90–0, ఖరోటే 10–0–76–4, రషీద్ 8–0–48–3, హష్మతుల్లా 5–0–36–0. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) రాహుల్ (బి) గుర్నూర్ 41; ఇబ్రహీమ్ (సి) ప్రిన్స్ (బి) అర్ష్ దీప్ 21; సాదిఖుల్లా (ఎల్బీ) (బి) సుందర్ 42; రహ్మత్ (సి) గుర్నూర్ (బి) ప్రిన్స్ 79; దార్విష్ (రిటైర్డ్హర్ట్) 6; హష్మతుల్లా (బి) గుర్నూర్ 4; ఖరోటే (బి) ప్రిన్స్ 6; రషీద్ (సి) రోహిత్ (బి) అర్ష్ దీప్ 12; ఘజన్ఫర్ (సి) శ్రేయస్ (బి) అర్ష్ దీప్ 1; సలీమ్ (బి) గుర్నూర్ 9; సమీ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 9; మొత్తం (44.3 ఓవర్లలో ఆలౌట్) 232. వికెట్ల పతనం: 1–52, 2–71, 3–128, 4–140, 5–170, 6–188, 7–190, 8–220, 9–232. బౌలింగ్: అర్ష్ దీప్ 9–0–45–3, ప్రిన్స్ 7.3–0–56–2, గుర్నూర్ 10–0–60–3, కుల్దీప్ 10–0–42–0, సుందర్ 7–0–24–1, జైస్వాల్ 1–0–3–0. -
రెండో వన్డేలో అఫ్గాన్ చిత్తు.. సిరీస్ భారత్ సొంతం
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన రెండో వన్డేలో 170 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది.భారత్ నిర్ధేశించిన 403 పరుగుల టార్గెట్ను చేధించలేక అఫ్గాన్ చతికల పడింది. పర్యాటక జట్టు లక్ష్య చేధనలో భారత బౌలర్ల ధాటికి 44.3 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో రెహమత్ షా(79) టాప్ స్కోరర్గా నిలవగా.. గుర్బాజ్(41), అటల్(42) పర్వాలేదన్పించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ తలా మూడు వికెట్లు సాధించారు.వీరిద్దరితో పాటు అరంగేట్ర ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించి టీమిండియా ఆలౌట్ అయింది. శుబ్మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) సెంచరీలతో కదం తొక్కారు. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే జూన్ 20న చెన్నై వేదికగా జరగనుంది. -
శుబ్మన్ సరికొత్త చరిత్ర.. తొలి భారత క్రికెటర్గా
టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్-2026లో దుమ్ములేపిన గిల్.. ఇప్పుడు అదే జోరును అఫ్గానిస్తాన్ సిరీస్లో కనబరుస్తున్నాడు. లక్నో వేదికగా అఫ్గాన్తో రెండో వన్డేలో గిల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 77 బంతుల్లోనే తన 9వ వన్డే సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 110 బంతులు ఎదుర్కొన్న గిల్.. 22 ఫోర్లు, 2 సిక్స్లతో 154 పరుగులు చేశాడు. ఈ అద్భుత శతకంతో వన్డే క్రికెట్లో 3000 పరుగుల మైలురాయిని దాటాడు.తద్వారా వన్డేల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ ఫీట్ను గిల్ కేవలం 62 ఇన్నింగ్స్లలో అందుకున్నాడు. గతంలో ఈ రికార్డు శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్(72 ఇన్నింగ్స్లు) పేరిట సంయుక్తంగా ఉండేది.తాజా నాక్తో వారిద్దరిని శుబ్మన్ అధిగమించాడు. బంతులు పరంగా ఈ ఫీట్ సాధించిన జాబితాలో మాజీ కెప్టెన్ కపిల్దేవ్(2995) అగ్రస్ధానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్ధానంలో గిల్(3016) ఉన్నాడు. అదేవిధంగా వన్డేల్లో ఫాస్టెస్ట్ 150 చేసిన మూడో ప్లేయర్గా వీరేంద్ర సెహ్వాగ్ను గిల్ అధిగమించాడు.సెహ్వాగ్ 2011లో వెస్టిండీస్పై 112 బంతుల్లో ఈ ఫీట్ సాధించగా.. అఫ్గాన్తో మ్యాచ్లో గిల్ కేవలం 108 బంతుల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో ఇషాన్ కిషన్(103) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది.చదవండి: వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ భారీ షాక్ -
గిల్, కిషన్ సెంచరీలు.. భారత్ స్కోర్ 402 పరుగులు
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు విజృంభించారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గాన్ కెప్టెన్ తొలుత టీమిండియాను బ్యాటింగ్కు అహ్హానించాడు. అయితే మొదట బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ నిలకడగా ఆడి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు.గిల్, ఇషాన్ మెరుపు సెంచరీలు..మంచి టచ్లో కన్పించిన రోహిత్ శర్మ(48) హాఫ్ సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్తో కలిసి కెప్టెన్ గిల్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. టీ20 మ్యాచ్ను తలపించేలా వీరిద్దరూ బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో గిల్ 77 బంతుల్లో తన సెంచరీ మార్క్ను అందుకోగా.. కిషన్ 71 బంతుల్లోనే శతక్కొట్టాడు.వీరిద్దరూ మూడో వికెట్కు ఏకంగా 224 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్ ఓవరాల్గా 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 154 పరుగులు చేయగా.. కిషన్ 79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్లతో 125 రన్స్ చేసి ఔటయ్యాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల వద్ద ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ బౌలర్లలో స్పిన్నర్లు నంగ్యాలియా ఖరోటి నాలుగు, రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు ఘజన్ఫర్, మహ్మద్ సలీమ్ తలా వికెట్ సాధించారు. -
IND vs AFG: ఇషాన్ కిషన్ ‘ఫాస్టెస్ట్’ సెంచరీ
అఫ్గనిస్తాన్తో రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ శతక్కొట్టాడు. లక్నో వేదికగా కేవలం 71 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్ మీద వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్గా ఇషాన్ కిషన్ నిలిచాడు.టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ధర్మశాల వేదికగా తొలి మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది భారత జట్టు. ఇక లక్నోలోని ఏకనా స్టేడియంలో బుధవారం నాటి రెండో వన్డేలో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది.జైసూ విఫలం.. పాపం రోహిత్ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (4) విఫలం కాగా.. రోహిత్ శర్మ అర్ద శతకానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రషీద్ ఖాన్ బౌలింగ్లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు.ఇలాంటి తరుణంలో వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ శుబ్మన్ గిల్, నాలుగో నంబర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. గిల్ 77 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. ఇషాన్ 71 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఇషాన్ సెంచరీ ఇన్నింగ్స్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. 𝐓𝐡𝐞 𝐈𝐬𝐡𝐚𝐧-𝐝𝐚𝐚𝐫 𝐊𝐢𝐬𝐡𝐚𝐧 𝐬𝐡𝐨𝐰 𝐢𝐧 𝐋𝐮𝐜𝐤𝐧𝐨𝐰! 🤩He switched gears seamlessly, completely taking the game away with a magnificent ton! 🔥#INDvAFG | 2nd ODI | LIVE NOW 👉https://t.co/YiwP9pOAPC pic.twitter.com/sMtq9hV2z8— Star Sports (@StarSportsIndia) June 17, 2026వీరిద్దరి విజృంభణ కారణంగా టీమిండియా 34 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 276 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఇక ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ మొత్తంగా 79 బంతుల్లో 14 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేసి.. నంగేయాలియా బౌలింగ్లో ఇక్రామ్ అలిఖిల్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.అఫ్గనిస్తాన్పై వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన క్రికెటర్లు1.ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్)- 2019లో 57 బంతుల్లో శతకం2. రోహిత్ శర్మ (ఇండియా)- 2023లో 63 బంతుల్లో శతకం3. ఇషాన్ కిషన్ (ఇండియా)- 2026లో 71 బంతుల్లో శతకం4. గ్లెన్ మాక్స్వెల్ (ఆస్ట్రేలియా)- 2023లో 76 బంతుల్లో శతకం5. శుబ్మన్ గిల్ (ఇండియా)- 2026లో 77 బంతుల్లో శతకం.చదవండి: చెలరేగిన బ్యాటర్లు.. అఫ్గన్పై భారత్ భారీ స్కోరు -
శుబ్మన్ గిల్ సూపర్ సెంచరీ
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ సూపర్ సెంచరీతో కదం తొక్కాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేసిన గిల్.. కేవలం 77 బంతుల్లో తన 9వ వన్డే సెంచరీ మార్క్ను అందుకున్నాడు. యశస్వి జైశ్వాల్ తుది జట్టులో చోటు దక్కడంతో గిల్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చాడు. అయితే జైశ్వాల్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు. కేవలం 4 పరుగులు చేసి ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఔటయ్యాడు.ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన గిల్, తన రెగ్యులర్ ఓపెనర్ పార్టనర్ రోహిత్ శర్మతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ దూకుడుగా ఆడడంతో భారత స్కోర్ పవర్ప్లేలో 80 పరుగుల మార్క్ దాటింది. అనంతరం రోహిత్ ఔటైనప్పటికి శుబ్మన్ మాత్రం వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. రోహిత్ ఔటయ్యక క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ సైతం అఫ్గాన్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కిషన్ కూడా కేవలం 71 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్లతో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. గిల్(86 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్స్లతో 121), కిషన్(111) అజేయంగా తమ బ్యాటింగ్ను కొనసాగిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత భారత్ను బ్యాటింగ్కు అహ్హానించింది. లక్నో పేసర్ ప్రిన్స్ యాదవ్ ఈ మ్యాచ్తో భారత్ తరపున అరంగేట్రం చేశాడు.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్అఫ్గనిస్తాన్రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), డార్విష్ రసూలీ, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటీ, ఏఎమ్ ఘజన్ఫర్, మహ్మద్ సలీమ్ సఫీ, బిలాల్ సమీ.చదవండి: IND vs AFG: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ𝘼 𝙘𝙖𝙥𝙩𝙖𝙞𝙣'𝙨 𝙢𝙖𝙞𝙙𝙚𝙣 𝙩𝙤𝙣!💯👏#ShubmanGill puts on a masterclass, bringing up his FIRST-EVER ODI century as captain for Team India! 🫡#INDvAFG | 2nd ODI | LIVE NOW 👉https://t.co/YiwP9pOAPC pic.twitter.com/KxFphH6k5t— Star Sports (@StarSportsIndia) June 17, 2026 -
చరిత్రకు అడుగుదూరంలో గిల్.. రోహిత్ను ఊరిస్తున్న రికార్డు!
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్లో ఇప్పటికే తొలి వన్డే గెలిచిన టీమిండియా రెండో విజయంతో పాటు సిరీస్ గెలుపుపై కూడా కన్నేసింది. ఈ నేపథ్యంలో లక్నో వేదికగా ఇవాళ రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో గిల్ తప్పిదంతో రనౌట్ అయిన సీనియర్ క్రికెటర్, ఓపెనర్ రోహిత్ శర్మను ఒక అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఆఫ్గన్తో రెండో వన్డేలో రోహిత్ శర్మ మరో 10 పరుగులు చేస్తే లిస్ట్-ఏ క్రికెట్లో 14వేల పరుగులు మైలురాయిని అందుకోనున్నాడు. ఇక కెప్టెన్గా శుబ్మన్ గిల్ కూడా ఒక అరుదైన ఫీట్కు అడుగు దూరంలో ఉన్నాడు. వన్డే కెప్టెన్గా గిల్కు ఇదే మొదటి సిరీస్. ఇప్పటికే టీమిండియా తొలి వన్డే గెలిచింది. రెండో వన్డేలోనూ గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ భారత్ వశం కానుంది. ఈ క్రమంలో స్వదేశంలో తొలి వన్డే సిరీస్ గెలిచిన కెప్టెన్గా గిల్ నిలవనున్నాడు. ఇక రెండో వన్డేకు కుల్దీప్ యాదవ్, జైస్వాల్కు చోటు దక్కే అవకాశముందని ఇప్పటికే గిల్ ప్రకటించాడు. ఇక తొలి వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గిల్ అజేయ ఇన్నింగ్స్కు తోడు కేఎల్ రాహుల్ దనాధన్ ఇన్నింగ్స్తో టీమిండియా సులువుగానే గెలిచింది. అయితే బౌలింగ్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ విజయంతో ఆ అంశం పెద్దగా ప్రభావం చూపలేదు. రెండో వన్డేలో అన్ని విభాగాల్లో రాణించి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. తొలి వన్డేకు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. రహ్మనుల్లా గుర్బాజ్ (102) సెంచరీ సాధించాడు. అనంతరం టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. గిల్ (84 నాటౌట్), కేఎల్ రాహుల్ (39 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.Read: కాన్వేకు ప్రమోషన్.. కివీస్ ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితా ఇదే! -
IND vs AFG: రెండో వన్డేలో భారత్ ఘన విజయం
భారత్ గ్రాండ్ విక్టరీలక్నో వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన రెండో వన్డేలో భారత్ 170 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. 403 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులకే ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో రెహమత్ షా(79) టాప్ స్కోరర్గా నిలవగా.. గుర్బాజ్(41), అటల్(42) పర్వాలేదన్పించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ తలా మూడు వికెట్లు సాధించారు. వీరిద్దరితో పాటు అరంగేట్ర ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించి టీమిండియా ఆలౌట్ అయింది. శుబ్మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) సెంచరీలతో కదం తొక్కారు.అఫ్గాన్ ఎనిమిదో వికెట్ డౌన్అఫ్గానిస్తాన్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన సలీమ్ సఫీ.. గుర్నూర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.అఫ్గాన్ ఏడో వికెట్అఫ్గాన్ ఏడో వికెట్ కోల్పోయింది. ఘజన్ఫర్ అర్ష్ దీప్ బౌలింగ్లో ఔటయ్యాడు.అఫ్గాన్ ఆరో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన రషీద్ ఖాన్.. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఔటయ్యాడు. అఫ్గాన్ స్కోర్: 190/6అఫ్గానిస్తాన్ ఐదో వికెట్అఫ్గానిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన ఖరోటి.. ప్రిన్స్ యాదవ్ క్లీన్ బౌల్డయ్యాడు. అఫ్గాన్ 31 ఓవర్లకు స్కోర్: 182/5అఫ్గాన్ నాలుగో వికెట్ డౌన్అఫ్గాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కెప్టెన్ షాహిది.. గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో ఔటయ్యాడు.మూడో వికెట్ డౌన్అఫ్గానిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. సెదీఖుల్లా(42).. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.20 ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 105-2సెదీఖుల్లా 28, రహ్మత్ షా 14 పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ డౌన్13.1: అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ప్రిన్స్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ఇబ్రహీం జద్రాన్ (21). రహ్మత్ షా క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 76-2(13.4).పవర్ ప్లేలో అఫ్గనిస్తాన్ స్కోరు: 62-1 (10)సెదీఖుల్లా 5, ఇబ్రహీం జద్రాన్ 15 పరుగులతో ఉన్నారు.అఫ్గానిస్తాన్ తొలి వికెట్ డౌన్52 పరుగుల వద్ద అఫ్గానిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన గుర్బాజ్.. గుర్నూర్ బౌలింగ్లో ఔటయ్యాడు.403 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ఐదు ఓవర్లలో అఫ్గానిస్తాన్ స్కోరు: 32-0రహ్మానుల్లా గుర్బాజ్ 26, ఇబ్రహీం జద్రాన్ 6 పరుగులతో ఉన్నారు.టీమిండియా భారీ స్కోరుకెప్టెన్ శుబ్మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) సెంచరీలతో కదం తొక్కగా.. రోహిత్ శర్మ 48 పరుగులతో రాణించాడు. మిగతా వారిలో శ్రేయస్ అయ్యర్ (26) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించిన టీమిండియా ఆలౌట్ అయింది.తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా48.5: రషీద్ ఖాన్ బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్ అవుట్ (19).ఎనిమిదో వికెట్ డౌన్47.6: ఘజన్ఫర్ బౌలింగ్లో రషీద్కు క్యాచ్ ఇచ్చి అర్ష్దీప్ సింగ్ (3) అవుట్. క్రీజులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్. స్కోరు: 392-8.టీమిండియా ఏడో వికెట్ డౌన్టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన గుర్నూర్ బ్రార్.. రషీద్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. స్కోరు: 387-7 (47).ఆరో వికెట్ డౌన్44.3: ఖరోటి బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ (26) ఆరో వికెట్గా వెనుదిరిగాడు. గుర్నూర్ బ్రార్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 373-6 (45).43 ఓవర్లలో టీమిండియా స్కోరు: 361-5ఐదో వికెట్ డౌన్42.3: ఖరోటి బౌలింగ్లో ఐదో వికెట్గా వెనుదిరిగిన కేఎల్ రాహుల్. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్గిల్ అవుట్42.3: ఖరోటి బౌలింగ్లో 154 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఘజన్ఫర్కు క్యాచ్ ఇచ్చి అవుటైన శుబ్మన్ గిల్. క్రీజులోకి కేఎల్ రాహుల్.40 ఓవర్లలో టీమిండియా స్కోరు: 340-3శ్రేయస్ అయ్యర్ 7, గిల్ 146 పరుగులతో ఉన్నారు.భారత్ మూడో వికెట్ డౌన్ఇషాన్ కిషన్ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్లతో 125 పరుగులు చేసిన కిషన్.. ఖరోటి బౌలింగ్లో ఔటయ్యాడు. 37 ఓవర్లలో టీమిండియా స్కోరు 322-3. శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు.ఇషాన్ మెరుపు సెంచరీలక్నో వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. కేవలం 71 బంతుల్లోనే తన రెండో వన్డే సెంచరీ మార్క్ను ఇషాన్ అందుకున్నాడు.శతక్కొట్టిన గిల్32.1: 77 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో శుబ్మన్ గిల్ సెంచరీ. 32 ఓవర్లలో టీమిండియా స్కోరు 245-2. ఇషాన్ 91 పరుగులతో ఉన్నాడు.30 ఓవర్లలో టీమిండియా స్కోరు: 220-2ఇషాన్ 70, గిల్ 96 పరుగులతో ఉన్నారు.ఇషాన్ అర్ధ శతకం27.5: హష్మతుల్లా బౌలింగ్ ఫోర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్. స్కోరు: 193-2.20 ఓవర్లలో టీమిండియా స్కోరు: 136-2గిల్ 71, ఇషాన్ కిషన్ 11 పరుగులతో ఉన్నారు.గిల్ హాఫ్ సెంచరీ16.1: ఖరోటి బౌలింగ్లో సిక్సర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.రోహిత్ శర్మ అవుట్13.1: అర్ధ శతకానికి చేరువైన ఓపెనర్ రోహిత్ శర్మ రషీద్ ఖాన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు బాది 48 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఈ మ్యాచ్సందర్భంగా రోహిత్ లిస్ట్-ఎ క్రికెట్లో 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. గిల్ 42 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 96-2(13.1)పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 80-1గిల్ 31, రోహిత్ 43 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా హాఫ్ సెంచరీ.. స్కోరు: 50-1(6.1)గిల్ 22, రోహిత్ 21 పరుగులతో ఉన్నారు.ఐదు ఓవర్లలో టీమిండియా స్కోరు: 42-1(5)గిల్ 18, రోహిత్ 18 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా1.6: సలీమ్ సఫీ బౌలింగ్లో ఖరోటికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన యశస్వి జైస్వాల్. చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులోకి వచ్చి నిరాశపరిచిన జైసూ. 9 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులే చేసి అవుట్. సలీమ్ ఖాతాలో తొలి వన్డే వికెట్గా జైసూ. గిల్ క్రీజులోకి రాగా.. రోహిత్ శర్మ 4 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 9-1 (2).ప్రిన్స్ యాదవ్ అరంగేట్రంఊహించిందే నిజమైంది. అఫ్గనిస్తాన్తో రెండో వన్డే సందర్భంగా యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం చేశాడు. తొలి వన్డేలో ఆడిన ప్రసిద్ కృష్ణను తప్పించిన యాజమాన్యం.. అతడి స్థానంలో యార్కర్ల స్పెషలిస్టు ప్రిన్స్కు తుదిజట్టులో చోటు ఇచ్చింది.ఇక ప్లేయింగ్ ఎలెవన్లో మొత్తంగా మూడు మార్పులు చేసినట్లు కెప్టెన్ శుబ్మన్ గిల్ వెల్లడించాడు. ప్రిన్స్ యాదవ్తో పాటు కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్ను ఆడిస్తున్నట్లు తెలిపాడు. కాగా తొలి వన్డేలో ఆడిన ప్రసిద్ కృష్ణతో పాటు అరంగేట్ర స్పిన్నర్ హర్ష్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డిలను ఈ మ్యాచ్ నుంచి తప్పించారు.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్అఫ్గనిస్తాన్రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), డార్విష్ రసూలీ, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటీ, ఏఎమ్ ఘజన్ఫర్, మహ్మద్ సలీమ్ సఫీ, బిలాల్ సమీ. -
IND vs AFG: రెండో వన్డే.. భారత తుదిజట్టు ఇదే
టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్తో బిజీగా ఉంది. ఇరుజట్ల మధ్య ధర్మశాలలో శనివారం తొలి వన్డే జరిగింది. వర్షం ఆటంకం కలిగించగా ఈ మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు.గుర్బాజ్ ఫాస్టెస్ట్ సెంచరీఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అఫ్గనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ విధ్వంసకర సెంచరీ (51 బంతుల్లో 102) కారణంగా ఈ మేరకు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. భారత బౌలర్లలో అరంగేట్ర కుర్రాళ్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే తలా మూడు వికెట్లు పడగొట్టారు.గిల్ అజేయ అర్ధ శతకంమిగిలిన వారిలో అర్ష్దీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు కూల్చారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 22.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ అజేయ అర్ధ శతకం (84)తో రాణించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.లక్నో వేదికగా..ఇక టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు లక్నో ఆతిథ్యం ఇస్తుండగా.. గిల్ సేన ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా భారత తుదిజట్టులో ఒక మార్పు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రసిద్ కృష్ణను తప్పించి మరో బౌలర్ను అరంగేట్రం చేయించనున్నట్లు సమాచారం.యార్కర్ల స్పెషలిస్టు అరంగేట్రంఅఫ్గన్తో తొలి వన్డేలో ప్రసిద్ ఐదు ఓవర్ల కోటా పూర్తి చేసి 35 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో అతడిపై వేటు వేసి.. పేస్ దళంలోకి యార్కర్ల స్పెషలిస్టు ప్రిన్స్ యాదవ్ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా 24 ఏళ్ల ప్రిన్స్ యాదవ్ అఫ్గన్తో సిరీస్ సందర్భంగా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.గత మ్యాచ్లో డెబ్యుడెంట్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే రాణించగా.. ఈసారి ప్రిన్స్కు కూడా వన్డే క్యాప్ ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన ప్రిన్స్ యాదవ్ ఇప్పటికి 20 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 19 వికెట్లు కూల్చాడు.అఫ్గనిస్తాన్తో రెండో వన్డేకు భారత తుదిజట్టు (అంచనా)శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.చదవండి: వైభవ్ వివాదం.. స్పందించిన బీసీసీఐ -
బాబర్ ఆజం రికార్డును బద్దలు కొట్టిన గిల్
ఆఫ్ఘనిస్తాన్తో నిన్న (జూన్ 13) జరిగిన తొలి వన్డేలో అజేయమైన 84 పరుగులు చేసి టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించిన కెప్టెన్ శుభ్మన్ గిల్.. ఈ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్తో పలు అరుదైన రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు.ఈ ఇన్నింగ్స్తో వన్డేల్లో 3000 పరుగుల మైలురాయిని చేరుకున్న అతడు.. ఈ ఘనత (కనీసం 3000 పరుగులు) సాధించిన బ్యాటర్లలో అత్యధిక సగటు కలిగిన ఆటగాళ్ల జాబితాలో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం (53.43), ఏబీ డివిలియర్స్ (53.50), మైఖేల్ బెవాన్ (53.58) లాంటి హేమాహేమీలను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరాడు. ప్రస్తుతం టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి (58.71) మాత్రమే గిల్ (57.30) కంటే ముందున్నాడు.ఈ ఇన్నింగ్స్తో గిల్ మరో భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అత్యంత వేగంగా (62 ఇన్నింగ్స్లు) 3000 పరుగులు చేసిన భారత బ్యాటర్గా అవతరించాడు. గతంలో ఈ రికార్డు శిఖర్ ధవన్ (72 ఇన్నింగ్స్లు) పేరిట ఉండేది. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (75 ఇన్నింగ్స్లు) మూడో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్గా చూస్తే, ఈ రికార్డు సౌతాఫ్రికా బ్యాటర్ హషిమ్ ఆమ్లా పేరిట ఉంది. ఆమ్లా కేవలం 57 ఇన్నింగ్స్ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. రహ్మానుల్లా గుర్బాజ్ (102) మెరుపు శతకంతో చెలరేగాడు. అతడు మినహా ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో ఎవరూ రాణించలేదు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (27), అజ్మతుల్లా ఒమర్జాయ్ (26) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే తలో 3 వికెట్లు తీయగా.. అర్షదీప్ సింగ్, నితీశ్ రెడ్డి చెరో 2 వికెట్లు పడగొట్టాడు.అనంతరం 195 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. గిల్ (84 నాటౌట్) సత్తా చాటడంతో 22.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా విజయతీరాలకు చేరింది. గిల్కు ఇషాన్ కిషన్ (34), కేఎల్ రాహుల్ (39 నాటౌట్) సహకరించగా.. రోహిత్ శర్మ (16), శ్రేయస్ అయ్యర్ (12) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే జూన్ 17న లక్నోలో జరగనుంది. -
మెరిసిన గిల్, రాహుల్ అఫ్గాన్ పై భారత్ విక్టరీ..
-
శుబ్మన్ గిల్ గెలిపించగా...
అఫ్గాన్తో ఏకైక టెస్టులో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ రికార్డు విజయం సాధించిన భారత జట్టు... వన్డే సిరీస్లోనూ అదే ఆటతీరుతో బోణీ కొట్టింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో గుర్బాజ్ సెంచరీతో అఫ్గాన్ ఓ మాదిరి స్కోరుకు పరిమితం కాగా... అరంగేట్ర బౌలర్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే చెరో మూడు వికెట్లతో సత్తా చాటారు. అనంతరం ఛేదనలో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్కు రాహుల్, ఇషాన్ మెరుపులు తోడవడంతో టీమిండియా ముందంజ వేసింది.ధర్మశాల: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత జట్టు... అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్లో శుభారంభం చేసింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన తొలి పోరులో శుబ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ నిర్ణీత సమయంకంటే నాలుగున్నర గంటలు ఆలస్యంగా ప్రారంభం కాగా... ఆటను 25 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ (51 బంతుల్లో 102; 8 ఫోర్లు, 8 సిక్స్లు) సెంచరీతో కదం తొక్కాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (27; 3 ఫోర్లు), అజ్మతుల్లా (26; 3 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. ఆడిన తొలి వన్డేలోనే గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే చెరో 3 వికెట్లు పడగొట్టగా... అర్ష్ దీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 22.5 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (66 బంతుల్లో 84 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో అలరించగా... కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు), ఇషాన్ కిషన్ (22 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించారు. రోహిత్ శర్మ (16; 2 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (12; 1 ఫోర్) భారీ స్కోరు చేయలేకపోయారు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్, జియాఉర్ రహమాన్ చెరో వికెట్ పడగొట్టారు. గుర్బాజ్ సెంచరీ... భారీ వర్షం కారణంగా మ్యాచ్ను కుదించడంతో... మొదట బ్యాటింగ్కు దిగిన అఫ్గాన్ టి20 తరహా దూకుడు కనబర్చింది. గుర్నూర్ బ్రార్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఇబ్రహీం జద్రాన్ (1) అవుట్ కాగా... అర్ష్ దీప్ సింగ్ వరుస ఓవర్లలో సాధిఖుల్లా (0), రహమత్ షా (3)ను పెవిలియన్కు పంపాడు. దీంతో అఫ్గాన్ జట్టు 26/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ హష్మతుల్లా అండతో గుర్బాజ్ రెచ్చిపోయాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిధ్యం వహించిన గుర్బాజ్... ఎడాపెడా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. బౌలర్తో సంబంధం లేకుండా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 25 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న అతడు... 48 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. వన్డేల్లో అతడికిది తొమ్మిదో శతకం. ‘టెస్టు మ్యాచ్ అనంతరం నా బ్యాటింగ్కు సంబంధించి గౌతమ్ గంభీర్ సర్తో చర్చించా. షాట్ సెలక్షన్ విషయంలో గంభీర్ సలహాలు పాటించడంతోనే సెంచరీ చేయగలిగా’ అని మ్యాచ్ అనంతరం గుర్బాజ్ అన్నాడు. నాలుగో వికెట్కు 66 బంతుల్లోనే 116 పరుగులు జోడించిన అనంతరం గుర్బాజ్ అవుట్ కాగా... ఆ తర్వాత మిగిలినవారు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో అఫ్గాన్ ఆశించిన స్కోరు చేయలేకపోయింది. హర్ష్ దూబే, గుర్నూర్ అరంగేట్రం...గత కొంతకాలంగా టీమిండియా నెట్ బౌలర్గా కొనసాగుతున్న గుర్నూర్ బ్రార్... ఈ మ్యాచ్తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.మ్యాచ్ ఆరంభానికి ముందు అతడికి జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ భారత క్యాప్ అందించాడు. దేశవాళీల్లో సత్తాచాటిన స్పిన్నర్ హర్ష్ దూబేకు సైతం ఇదే తొలి వన్డే కాగా... అతడికి కేఎల్ రాహుల్ క్యాప్ అందజేశాడు.1 టీమిండియా తరఫున వన్డే మ్యాచ్ ఆడిన అతి పెద్ద (39 సంవత్సరాల 44 రోజులు) వయసు్కడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు.మొహిందర్ అమర్నాథ్ (39 సంవత్సరాల36 రోజులు) రెండో స్థానానికి చేరాడు.స్కోరు వివరాలుఅఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (బి) నితీశ్ రెడ్డి 102; ఇబ్రహీం (సి) గిల్ (బి) గుర్నూర్ 1; సాదిఖుల్లా (ఎల్బీ) (బి) అర్ష్ దీప్ 0; రహమత్ షా (సి) హర్ష్ దూబే (బి) అర్ష్ దీప్ 3; హష్మతుల్లా (సి) రాహుల్ (బి) హర్ష్ దూబే 27; అజ్మతుల్లా (స్టంప్డ్) ఇషాన్ (బి) హర్ష్ దూబే 26; నబీ (సి) అర్ష్ దీప్ (బి) నితీశ్ రెడ్డి 9; రషీద్ (బి) గుర్నూర్ 9; ఘజన్ఫర్ (సి) గిల్ (బి) హర్ష్ దూబే 0; జియాఉర్ (సి) అర్ష్ దీప్ (బి) గుర్నూర్ 4; సలీమ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 12; మొత్తం (24.5 ఓవర్లలో ఆలౌట్) 194. వికెట్ల పతనం: 1–13, 2–16, 3–26, 4–142, 5–144, 6–172, 7–182, 8–182, 9–193, 10–194. బౌలింగ్: అర్ష్ దీప్ 5–0–27–2; గుర్నూర్ బ్రార్ 4.5–0–27–3; ప్రసిధ్ 5–0–35–0; హర్ష్ దూబే 5–0–47–3; సుందర్ 1–0–19–0; నితీశ్ రెడ్డి 4–0–31–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (రనౌట్) 16; గిల్ (నాటౌట్) 84; ఇషాన్ (బి) రషీద్ 34; శ్రేయస్ (సి) సలీమ్ (బి) జియాఉర్ 12; రాహుల్ (నాటౌట్) 39; ఎక్స్ట్రాలు 10; మొత్తం (22.5 ఓవర్లలో 3 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–46, 2–116, 3–142. బౌలింగ్: అజ్మతుల్లా 3–0–28–0; జియా ఉర్ 4–0–39–1; ఘజన్ఫర్ 5–0–28–0; సలీమ్ 3.5–0–36–0; రషీద్ ఖాన్ 5–0–37–1; నబీ 2–0–26–0. -
ఆఫ్గన్తో తొలి వన్డే.. భారత ఓపెనర్ల అరుదైన రికార్డు!
ధర్మశాల వేదికగా అఫ్గానిస్తాన్తో తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కెప్టెన్ శుబ్మన్ గిల్ వేర్వేరుగా అరుదైన రికార్డులు సాధించారు. రోహిత్ శర్మ విషయానికొస్తే మ్యాచ్లో రోహిత్ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఓపెనర్గా అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లు కలిపి 16 వేల పరుగుల మార్క్ను దాటడం విశేషం. అయితే మంచి ఈజ్తో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గిల్తో సమన్వయం లోపం వల్ల రనౌట్గా వెనుదిరిగాడు. మరోవైపు ఇదే మ్యాచ్లో ఓపెనర్ గిల్ కూడా వన్డేల్లో 3వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా 3వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్గా గిల్ నిలిచాడు. గిల్ 67 ఇన్నింగ్స్లో 3వేల పరుగుల మార్క్ను అందుకొని రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా (57 ఇన్నింగ్స్లు) తొలి స్థానంలో ఉన్నాడు. ఇక షై హోప్, ఇమామ్ ఉల్ హక్, ఫఖర్ జమాన్లు 67 ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ సాధించారు.Scaling Mt. 16,000 🗻A monumental milestone unlocked by Rohit Sharma as an opener in international cricket 👏🫡Updates ▶️ https://t.co/lCuohEZYAl #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/vyC4C0oPvg— BCCI (@BCCI) June 13, 2026 Major Milestone for our Captain 🫡Shubman Gill becomes the fastest Indian and 2⃣nd fastest player overall to amass 3⃣0⃣0⃣0⃣ ODI runs 🙌🔝He also brings up his fifty!Updates ▶️ https://t.co/lCuohEZYAl#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/tdxL7cvo7X— BCCI (@BCCI) June 13, 2026 -
గిల్, రాహుల్ విధ్వంసం.. టీమిండియా ఘన విజయం
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో ఆఫ్గన్ విధించిన 195 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత బ్యాటింగ్లో కెప్టెన్ శుబ్మన్ గిల్ (66 బంతుల్లో 84 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్తో యాంకర్ రోల్ పోషించాడు. చివర్లో కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 39 నాటౌట్) ధనాదన్ ఇన్నింగ్స్తో తనదైన శైలిలో టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఆఫ్గన్ బౌలర్లలో రషీద్ఖాన్, రెహమాన్ షరిఫీ చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది.ఆఫ్గన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. హస్మతుల్లా (26), భారత బౌలర్లలో హర్ష్దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్లు 2 వికెట్లు పడగొట్టారు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే బుధవారం లక్నో వేదికగా జరగనుంది.Picture-Perfect 🙌#TeamIndia wrap a comprehensive victory by 7️⃣ wickets in Dharamshala ✅They lead the #INDvAFG ODI series by 1️⃣-0️⃣ 👌Scorecard ▶️ https://t.co/lCuohEZYAl @IDFCFIRSTBank pic.twitter.com/RNy13a0PHX— BCCI (@BCCI) June 13, 2026 -
గిల్ స్టన్నింగ్ క్యాచ్కు నోరెళ్లబెట్టాల్సిందే!
అఫ్గానిస్తాన్తో జరిగిన తొలి వన్డేలో శుబ్మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్తో మెరిశాడు. హర్ష్ దూబే వేసిన ఇన్నింగ్స్ 22వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. హర్ష్దూబే వేసిన బంతిని అల్లా గజన్ఫర్ ఆఫ్ స్టంప్ ఔట్సైడ్ దిశగా ఆడాడు. అయితే స్లిప్లో ఉన్న గిల్ ఒక్క ఉదుటున డైవ్ చేసి సెకన్ల వ్యవధిలో ఒంటిచేత్తో క్యాచ్ అందుకోవడం విశేషం. ఇక గిల్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్కు గజన్ఫర్ నోరెళ్లబెట్టాడు.అయితే గిల్ పట్టిన క్యాచ్ను చాలా మంది టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో పోలుస్తున్నారు. ధోని తన ప్రైమ్టైమ్లో సెకన్ల వ్యవధిలోనే స్టంపింగ్లు చేసిన మ్యాచ్లు ఎన్నో ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది . ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో హర్ష్దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్లు 2 వికెట్లు పడగొట్టారు. 🔹 1st ODI | IND 🇮🇳 vs AFG 🇦🇫 🔹IND 🇮🇳 : 4️⃣0️⃣-0️⃣ (5 Overs)Rohit* : 1️⃣5️⃣¹⁴Gill* : 1️⃣7️⃣¹⁷INDIA 🇮🇳 NEED 1️⃣5️⃣5️⃣ RUNS MORE TO WIN#INDvAFG #TeamIndia #INDvsAFG #ODI #Cricketpic.twitter.com/z9dUJRGKlK https://t.co/oL8hQj02gs— Cricket Lover 🏏 (@Crick97924Lover) June 13, 2026 What. A. Catch 🤯Captain Shubman Gill with an absolute stunner of a grab 🫡Updates ▶️ https://t.co/lCuohEZYAl #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/jX2rAfSbtq— BCCI (@BCCI) June 13, 2026 -
భారత్ తరఫున అరంగేట్రం.. అతడి ఎంపిక వెనుక గిల్ హస్తం!
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న తొలి వన్డేతో టీమిండియా తరఫున గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేలు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు. హర్ష్దూబేకు కేఎల్ రాహుల్ డెబ్యూ క్యాప్ అందించగా, గుర్నూర్ బ్రార్కు కెప్టెన్ శుబ్మన్ గిల్ క్యాప్ అందించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ ఇద్దరు క్రికెటర్లపై ఒక లుక్కేద్దాం. వీరిద్దరు అరంగేట్రం చేసినప్పటికీ గుర్నూర్ ఎంపిక వెనుక మాత్రం కెప్టెన్ శుబ్మన్ గిల్ కీలకపాత్ర పోషించాడు.గిల్ మెచ్చిన క్రికెటర్..పంజాబ్కు చెందిన గుర్నూర్ బ్రార్కు సౌతాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ ఆరాధ్య క్రికెటర్. అతడి బౌలింగ్ యాక్షన్ను అచ్చుగుద్దినట్లు అనుకరించడంలో గుర్నూర్ బ్రార్ సుప్రసిద్ధుడు. అయితే గుర్నూర్ చిన్న వయసులో క్రికెట్ కంటే ఫుట్బాల్, టెన్నిస్ ఆటను ఎక్కువగా ఇష్టపడేవాడు. అయితే హైట్ అడ్వాంటేజ్ కారణంగా క్రికెట్లోకి వెళితే బాగా రాణిస్తావు అని స్నేహితులు ఇచ్చిన సలహాతో గుర్నూర్ బ్రార్ తననుత తాను పరీక్షించుకోవడానికి క్రికెట్ ట్రయల్స్కు వెళ్లాడు. ఆ తర్వాత రెండేళ్లలోనే ఇండియా అండర్-19 టీమ్కు బౌలింగ్ చేసే స్థాయికి వెళ్లాడు. అక్కడే గుర్నూర్ బ్రార్కు ప్రస్తుత టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ పరిచయమయ్యాడు. అతడి టాలెంట్ను గమనించిన గిల్ కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చాడు. అలా పంజాబ్ అండర్-23 జట్టులో చోటు దక్కించుకున్న గుర్నూర్ బ్రార్ 2021లో లిస్ట్-ఏతో పాటు ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 2023లో పంజాబ్ కింగ్స్కు నెట్బౌలర్గా వచ్చిన గుర్నూర్ బ్రార్కు అనుకోకుండా జట్టుకు ఆడే అవకాశం వచ్చింది. అప్పటి పంజాబ్ కింగ్స్ జట్టులో శిఖర్ ధావన్ గాయంతో టోర్నీకి దూరమవ్వడంతో అతడి స్థానంలో ఎంపికయిన గుర్నూర్ బ్రార్ లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్ ద్వారా ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత గిల్ మరోసారి గుర్నూర్కు అండగా నిలబడి నెట్బౌలర్గా తీసుకోవాలని గుజరాత్ టైటాన్స్కు సూచించాడు. ఈ సమయంలోనే హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, స్టార్ బౌలర్ రబాడ ఇచ్చిన సలహాలు గుర్నూర్కు చాలా ఉపయోగపడ్డాయి. అలా ఐపీఎల్ 2025 సీజన్కు ముందు జరిగిన వేలంలో గుర్నూర్ బ్రార్ను గుజరాత్ టైటాన్స్ రూ.30 లక్షలకు రిటైన్ చేసుకుంది. అయితే ఐపీఎల్ అంత మంచి ప్రదర్శన చేయనప్పటికీ విజయ్ హజారే ట్రోఫీలో సెమీస్లో అతడి ప్రదర్శన గుర్తింపు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో సెలెక్టర్ల దృష్టిలో పడిన గుర్నూర్ బ్రార్ను గతేడాది ఇండియా-ఏ జట్టుకు ఎంపిక చేయడంతో అతడి కెరీర్ మలుపు తిరిగింది.నిఖార్సైన ఆల్రౌండర్విదర్భకు చెందిన హర్ష్ దూబే నిఖార్సైన ఆల్రౌండర్, 2024-25 రంజీ సీజన్లో విదర్భ టైటిల్ గెలవడంలో హర్ష్ దూబేది కీలకపాత్ర. ఆ సీజన్లో హర్ష్దూబే మొత్తం 69 వికెట్లు పడగొట్టాడు. అతడి ప్రదర్శనకు మెచ్చిన బీసీసీఐ తర్వాతి ఏడాది ఇండియా-ఏ జట్టులోకి ఎంపిక చేసింది. రంజీ ట్రోఫీలో ప్రదర్శనకు గానూ హర్ష్దూబే బెస్ట్ ఆల్రౌండర్ (లాలా అమర్నాథ్) అవార్డు గెలుచుకున్నాడు. ఇక విజయ్ హజారే ట్రోఫీలో కెప్టెన్గా విదర్భను నడిపించిన హర్ష్దూబే ఆ జట్టుకు తొలి టైటిల్ అందించాడు. దేశవాలీ క్రికెట్లో ప్రదర్శనతో హర్ష్ దూబేను ఐపీఎల్ 2025 సీజన్కు ముందు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్తో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన హర్ష్దూబే ఆ సీజన్లో మూడు మ్యాచ్ల్లో ఐదు వికెట్లు తీశాడు. 2026 సీజన్కు ఎస్ఆర్హెచ్ అతడిని రిటైన్ చేసుకుంది.ఈ సీజన్లో 8 మ్యాచ్లాడిన హర్ష్దూబే 8 వికెట్లు తీశాడు.నిజానికి ఆఫ్గన్తో జరిగిన ఏకైక టెస్టు ద్వారానే హర్ష్దూబే అరంగేట్రం చేయాల్సింది. రవీంద్ర జడేజాకు విశ్రాంతి కల్పించడంతో మానవ్ సుతార్, హర్ష్దూబే పేర్లు వినిపించినప్పటికీ మానవ్ సుతార్ను తుదిజట్టులోకి ఎంపిక చేసింది. ఆడిన తొలి మ్యాచ్లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన మానవ్ సుతార్ అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. 𝗗𝗿𝗲𝗮𝗺 𝗰𝗼𝗺𝗲 𝘁𝗿𝘂𝗲 🧢🇮🇳Congratulations to Harsh Dubey and Gurnoor Brar on receiving their ODI debut caps from KL Rahul and Shubman Gill respectively 👏Updates ▶️ https://t.co/lCuohEZYAl #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/GoZSxHSHVf— BCCI (@BCCI) June 13, 2026చదవండి: ‘అతడు వంద టెస్టుల గురించి ఆలోచించలేదు’ -
అఫ్గన్తో వన్డే.. ఆ ఇద్దరి అరంగేట్రం.. జైసూకు నో ఛాన్స్
ఊగిసలాటల నడుమ టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య తొలి వన్డే నిర్వహణకు మార్గం సుగమమైంది. ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. ధర్మశాలలో వర్షం కారణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు పడాల్సిన టాస్ ఆలస్యమైంది. వర్షం కారణంగా దాదాపు నాలుగు గంటలపాటు ఇటు ఆటగాళ్లు.. ఇటు ప్రేక్షకులు వేచి చూడాల్సిన పరిస్థితి.అయితే, సాయంత్రం ఐదు గంటల తర్వాత వాన తగ్గడంతో మైదానంలో కప్పిన కవర్లు తీసేసిన సిబ్బంది.. మ్యాచ్కు గ్రౌండ్ను సిద్ధం చేసింది. ఈ క్రమంలో 5.15 నిమిషాలకు టాస్ పడింది. టీమిండియా కెప్టెన్ శుబ్మన్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.ఆ ఇద్దరి అరంగేట్రంఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికెట్ పాత బడే కొద్ది బ్యాటింగ్కు కాస్త అనుకూలంగా మారుతుందని భావిస్తున్నట్లు గిల్ తెలిపాడు. అదే విధంగా హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ ఈ మ్యాచ్తో టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తున్నట్లు తెలిపాడు. కాగా విరాట్ కోహ్లి స్థానంలో వన్డే జట్టులోకి వచ్చిన యశస్వి జైస్వాల్కు తుదిజట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఓపెనింగ్ జోడీగా గిల్- రోహిత్ శర్మ కొనసాతుండగా.. వన్డౌన్లో కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతున్నాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్గా ఇషాన్ కిషన్ సేవలు అందించనున్నాడు. మరోవైపు.. హార్దిక్ పాండ్యా మరోసారి గాయపడి సిరీస్కు దూరం కాగా.. ఆంధ్ర సీమ్బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చాడు. ఇక సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను పక్కనపెట్టిన యాజమాన్యం.. హర్ష్ దూబేకు తొలి అవకాశం ఇచ్చింది. పేస్ దళంలో అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణతో కలిసి గుర్నూర్ బ్రార్ బరిలోకి దిగుతున్నాడు.భారత తుదిజట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.అఫ్గనిస్తాన్ తుదిజట్టుఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదికుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, మహ్మద్ సలీమ్ సఫీ, ఏఎమ్ ఘజన్ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ. -
IND vs AFG: తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో ఆఫ్గన్ విధించిన 195 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.15 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. గిల్ (67), శ్రేయస్ (6) పరుగులతో ఆడుతున్నారు.👉ఇషాన్ కిషన్ (34) రూపంలో టీమిండియా 116 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ బాదిన గిల్అఫ్గాన్తో మ్యాచ్లో కెప్టెన్ గిల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 37 బంతుల్లో గిల్ ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది.👉10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (30), గిల్ (29) పరుగులతో ఆడుతున్నారు.రోహిత్ శర్మ రనౌట్.. తొలి వికెట్ డౌన్రోహిత్ శర్మ రనౌట్ కావడంతో టీమిండియా 46 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న టీమిండియా195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 5 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (15), శుబ్మన్ గిల్ (17) పరుగులతో ఆడుతున్నారు.ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ భారీ స్కోరు చేసింది. వర్షం అంతరాయంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది . ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో హర్ష్దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్లు 2 వికెట్లు పడగొట్టారు.ఐదో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్16.3: హర్ష్ దూబే బౌలింగ్లో హష్మతుల్లా (27) రాహుల్కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్గా వెనుదిరిగాడు. హర్ష్కు వన్డేల్లో ఇదే తొలి వికెట్. నబీ క్రీజులోకి రాగా.. అజ్మతుల్లా రెండు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 144-5(16.5).నాలుగో వికెట్ డౌన్15.3: నితీశ్ రెడ్డి బౌలింగ్లో బౌల్డ్ అయిన రహ్మానుల్లా గుర్బాజ్. 51 బంతుల్లో 102 పరుగులు చేసి నిష్క్రమణ. స్కోరు: 143-4(16). హష్మతుల్లా 27, అజ్మతుల్లా ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.శతక్కొట్టిన రహ్మానుల్లా గుర్బాజ్48 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న అఫ్గనిస్తాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 👉14 ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 130-3 సెంచరీకి చేరువైన రహ్మానుల్లా గుర్బాజ్సెంచరీ కొట్టిన అఫ్గనిస్తాన్.. స్కోరు: 110-3(12)హష్మతుల్లా 17, రహ్మానుల్లా గుర్బాజ్ 86 పరుగులతో ఉన్నారు.రహ్మానుల్లాగుర్బాజ్ హాఫ్ సెంచరీ👉10 ఓవర్లు ముగిసేసరికి అఫ్గానిస్తాన్ 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. రహమనుల్లా గుర్బాజ్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 25 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకుని.. అఫ్గన్ తరఫున రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు.ఆరు ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 35-3 (6)రహ్మానుల్లా 25 పరుగులతో ఉండగా.. హష్మతుల్లా 8 పరుగులతో క్రీజులో ఉన్నాడు.మూడో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్4.3: అర్ష్దీప్ బౌలింగ్లో హర్ష్ దూబేకు క్యాచ్ ఇచ్చి అవుటైన రహ్మత్ షా (3). క్రీజులోకి హష్మతుల్లా షాహిది. రహ్మానుల్లా 20 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 26-3(4.4).రెండో వికెట్ డౌన్2.3: అర్ష్దీప్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయిన సెదీకుల్లా (0). అంపైర్ అవుట్ ఇవ్వగా.. అఫ్గన్ రివ్యూకు వెళ్లింది. అయితే, ఎల్బీడబ్ల్యూగా తేలడంతో సెదీకుల్లా మైదానం వీడాడు. రహ్మత్ షా క్రీజులోకి రాగా.. రహ్మానుల్లా 14 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 17-2(2.4)తొలి వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో గిల్కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా వెనుదిరిగిన ఇబ్రహీం జద్రాన్ (1). స్కోరు: 13-1(1.5). క్రీజులోకి సెదీకుల్లా రాగా.. రహ్మానుల్లా 11 పరుగులతో ఉన్నాడు.👉టాస్ గెలిచిన టీమిండియా.. తొలుత బౌలింగ్👉టీమిండియా తరఫున హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ అరంగేట్రంతుదిజట్లుభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.అఫ్గనిస్తాన్ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదికుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, మహ్మద్ సలీమ్ సఫీ, ఏఎమ్ ఘజన్ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ.శుభవార్తవర్షం తగ్గుముఖం పట్టింది. సూర్యుడు మేఘాల మాటు నుంచి బయటకు వచ్చాడు. గ్రౌండ్ సిబ్బంది కవర్లు తీసేసి మాప్ చేస్తున్నారు. 5.45 నిమిషాలకు మ్యాచ్ మొదలుకానుంది. ఈ వన్డే మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. బ్యాటింగ్ పవర్ప్లే ఐదు ఓవర్లు ఉంటుంది. ఐదుగురు బౌలర్లు తలా ఐదు ఓవర్లు బౌల్ చేస్తారు. 👉4.45PM: తగ్గుముఖం పట్టిన వాన.. మైదానంలోకి వచ్చిన గ్రౌండ్ సిబ్బంది.👉కొనసాగుతున్న చిరుజల్లులు👉మరోసారి భారీగా కురుస్తున్న వర్షం. 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహణకు కటాఫ్ టైమ్ సాయంత్రం 6.32 గంటలు.మ్యాచ్ జరిగేనా?👉తగ్గుముఖం పట్టిన వానవరుణుడు కరుణిస్తాడా?👉కొనసాగుతున్న జల్లులు👉మైదానంలోకి వచ్చి పరిశీలించిన హెడ్ క్యూరేటర్.. వాన తెరిపినిస్తేనే కవర్లు ఎత్తివేసే అవకాశంవాన మొదలు👉🌧️ధర్మశాలలో మొదలైన వాన👉రన్-అప్ ఏరియాపై కవర్లు కప్పిన సిబ్బందిటాస్ ఆలస్యంక్రికెట్ అభిమానులకు చేదు వార్త. టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య తొలి వన్డేకు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ధర్మశాలలో వాతావరణం మేఘావృతం కావడంతో టాస్ ఆలస్యం కానుంది. తాజా సమాచారం ప్రకారం.. ధర్మశాలలో వాన పడేందుకు 60- 70 శాతం అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తుదిజట్ల అంచనాభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్/యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్/ప్రిన్స్ యాదవ్.అఫ్గనిస్తాన్రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, సెదీకుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇక్రమ్ అలికిల్ (వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఏఎమ్ ఘజన్ఫర్, బిలామ్ సమీ/మహ్మద్ సలీం. -
టెస్ట్ల్లో సరికొత్త 'నంబర్ వన్'
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సరికొత్త నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్గా అవతరించాడు. సహచరుడు జో రూట్ను వెనక్కు నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. తాజాగా లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్లో అర్ద సెంచరీ సాధించి నంబర్ వన్ స్థానానికి చేరాడు. ఇదే మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో ఘోరంగా విఫలమైన రూట్ రెండు స్థానాలు దిగజారి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ మధ్యలో ఆసీస్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ ఓ స్థానం మెరుగుపర్చుకొని రెండో స్థానానికి ఎగబాకాడు.తాజాగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్లో సూపర్ సెంచరీతో సత్తా చాటిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరాడు. 743 రేటింగ్ పాయింట్లు కలిగిన గిల్.. ప్రస్తుతం భారత్ తరఫున అత్యధిక రేటింగ్ కలిగిన బ్యాటర్గా నిలిచాడు.ఇదే మ్యాచ్లో సెంచరీ చేసిన మరో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ ర్యాంక్లో (34) ఎలాంటి మార్పు లేదు. గిల్తో పాటు టాప్-10లో ఉన్న మరో టీమిండియా బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓ స్థానంలో కోల్పోయి తొమ్మిదో స్థానానికి చేరాడు. ఓవరాల్గా తాజా ర్యాంకింగ్స్లో అత్యధిక లబ్ది పొందిన బ్యాటర్గా గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. ఫిలిప్స్ తాజాగా ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్లో ఓ మోస్తరు ప్రదర్శన చేసినప్పటికీ.. 15 స్థానాలు మెరుగుపర్చుకొని 40వ స్థానానికి ఎగబాకాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. న్యూజిలాండ్ టెస్ట్లో కళ్లు చెదిరే ప్రదర్శన ఇచ్చిన ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ 7 స్థానాలు మెరుగుపర్చుకొని పదో స్థానానికి ఎగబాకాడు. ఆఫ్ఘన్ టెస్ట్లో సంచలన ప్రదర్శన ఇచ్చిన టీమిండియా అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్ తొలిసారి టాప్-100లోకి ప్రవేశించాడు. ఆ మ్యాచ్లో 7 వికెట్లు తీసిన సుతార్ 272 రేటింగ్ పాయింట్లు సాధించి 72వ స్థానంలో నిలిచాడు.మిగతా భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఓ స్థానం మెరుగుపర్చుకొని 14వ స్థానానికి చేరగా.. సిరాజ్ ఓ స్థానం కోల్పోయి 15వ స్థానానికి పడిపోయాడు. ఆల్రౌండర్ల విషయానికొస్తే.. టీమిండియా వెటరన్ ఆటగాడు రవీంద్ర జడేజా టాప్ ప్లేస్ను నిలుపుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 2 స్థానాలు మెరుగుపర్చుకొని తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. -
IND vs AFG: తొలి వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
అఫ్గనిస్తాన్తో సిరీస్ను ఘనంగా ఆరంభించింది టీమిండియా. ముల్లన్పూర్ వేదికగా ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ మీద 300 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అయితే, ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో ఈ మ్యాచ్ భాగం కాదు.కాబట్టి అఫ్గన్తో టెస్టు, విజయంతో టీమిండియాకు పెద్దగా చేకూరే ప్రయోజనం ఏమీ లేదు. అయితే, కావాల్సినంత ప్రాక్టీస్ మాత్రం దొరికింది. మానవ్ సుతార్ (లెఫ్టార్మ్ స్పిన్నర్) వంటి కొత్త ఆటగాడు తనను తాను నిరూపించుకునే ఓ వేదిక దొరికింది.మూడు వన్డేలుఇదిలా ఉంటే.. జూన్ 13, 17, 20 తేదీల్లో టీమిండియా అఫ్గనిస్తాన్తో మూడు వన్డేలు ఆడనుంది. అయితే, గాయం వల్ల విరాట్ కోహ్లి అనూహ్య రీతిలో ఈ సిరీస్కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో యశస్వి జైస్వాల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు.మరోవైపు.. ఇషాన్ కిషన్ సైతం చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక గాయాల నుంచి కోలుకుని ఓపెనర్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సాధించారు. దీంతో అఫ్గన్తో తొలి వన్డేకు భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ మొదలైంది.ఇషాన్ వద్దు.. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్కు బదులు యశస్వి జైస్వాల్కు పెద్ద పీట వేయాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. ఓపెనర్గా కాకుండా మూడో స్థానంలోనూ జైసూ రాణించగలడని అభిప్రాయపడ్డాడు.స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘అఫ్గన్తో వన్డేలో కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తాడు. యశస్వి జైస్వాల్ను వన్డౌన్లో ఆడించాలి. శ్రేయస్ అయ్యర్ నాలుగు, కేఎల్ రాహుల్ ఐదు, హార్దిక్ పాండ్యా ఆరు, వాషింగ్టన్ సుందర్ ఏడు, హర్ష్ దూబే ఎనిమిదో స్థానంలో ఆడాలి.పేస్ దళంలో అర్ష్దీప్ సింగ్తో పాటు గుర్నూర్ బ్రార్ను ఆడించాలి. స్పెషలిస్టు స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఉండనే ఉన్నాడు’’ అని అభిషేక్ నాయర్ పేర్కొన్నాడు. తాను ఎంపిక చేసిన తుదిజట్టులో ఇషాన్ కిషన్కు చోటు ఇవ్వలేదు.జైసూను ఆడిస్తారా?ఐపీఎల్-2026 సందర్భంగా బరిలో దిగిన యశస్వి జైస్వాల్ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా.. 16 మ్యాచ్లు ఆడి 427 పరుగులు సాధించాడు. మరోవైపు.. సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించిన ఇషాన్ కిషన్ 602 పరుగులతో దుమ్ములేపాడు.అంతేకాదు సీజన్ ఆరంభంలో ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో సన్రైజర్స్ కెప్టెన్గా వ్యవహరించి జట్టును గెలిపించాడు ఇషాన్. అంతకుముందు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలోనూ సత్తా చాటాడు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఇషాన్ను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉండగా.. అభిషేక్ నాయర్ మాత్రం జైసూకు ఓటేయడం విశేషం.అఫ్గనిస్తాన్తో తొలి వన్డేకు అభిషేక్ నాయర్ ఎంచుకున్న జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్.చదవండి: సిరాజ్ను తప్పించిన బీసీసీఐ -
‘కొడితే సెంచరీ.. లేదంటే వస్తాడు.. అవుటై వెళ్లిపోతాడు’
స్వదేశంలో టీమిండియా అదరగొట్టింది. అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ మీద 300 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయం సాధించింది. ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (126), ఓపెనర్ కేఎల్ రాహుల్ (100) శతక్కొట్టిన సంగతి తెలిసిందే. మిగిలిన వారిలో వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (81), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (81) అర్ద శతకాలతో మెరిశారు. కాగా ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) గతేడాది కాలంగా టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. గతేడాది ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 800కు పైగా పరుగులు సాధించాడు. ఇక అఫ్గన్తో మ్యాచ్ సందర్భంగా 165 బంతుల్లో 100 రన్స్ చేసిన రాహుల్.. టెస్టు కెరీర్లో 12వ సెంచరీ నమోదు చేశాడు.అశ్విన్ సంచలన వ్యాఖ్యలుమొత్తంగా ఇప్పటికి టీమిండియా తరఫున 68 టెస్టులు ఆడిన రాహుల్ 4153 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సగటు 36.43. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కేఎల్ రాహుల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫామ్లో లేకుంటే ఈ కర్ణాటక బ్యాటర్ నుంచి ఒక్క పరుగు కూడా ఆశించలేమన్నాడు.పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా లేకుంటే..తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ... ‘‘విదేశాల్లో కఠినమైన పిచ్ల మీద ఆడటం వల్ల అతడి బ్యాటింగ్ సగటు తక్కువగా ఉందని చాలా మంది కేఎల్ రాహుల్ను వెనకేసుకువస్తారు. కానీ అతడిలో నేను ఒక విషయం స్పష్టంగా గమనించాను.పిచ్ గనుక బ్యాటింగ్కు అనుకూలంగా లేకుంటే.. అతడు ఒక్క పరుగు కూడా చేయడు. ఇలా బ్యాటింగ్కు వెళ్తాడు. అలా అవుటై పెవిలియన్కు చేరతాడు. ఒకవేళ అదే స్థానంలో విరాట్ కోహ్లి ఉంటే.. అప్పుడతడు ఫామ్లో లేకపోయినా కనీసం 30, 33, 43.. లేదంటే 28 పరుగులైనా చేస్తాడు.కొడితే సెంచరీ.. లేదంటేకానీ కేఎల్ రాహుల్ మాత్రం 0- 10 మధ్య కూడా పరుగులు రాబట్టలేడు. ఫామ్లో ఉన్నాడంటే సెంచరీ అయినా చేస్తాడు. అది వేరే సంగతి. ఒకవేళ ఫామ్లో లేడంటే మాత్రం మనం అతడి నుంచి పరుగులు ఆశించకూడదు.కొడితే సెంచరీ.. లేదంటే ఇలా వెళ్లి అలా వచ్చేయడం.. కేఎల్ రాహుల్లో నేను ఈ రెండు మాత్రమే చూశాను. అతడు మధ్యస్థంగా ఆడటం ఎప్పుడూ చూడలేదు. అయితే, గత రెండేళ్లుగా అతడి ఆట తీరులో పరిణతి కనిపిస్తోంది. పరిస్థితులను అర్థం చేసుకుని మెరుగ్గా ఆడుతున్నాడు’’ అని అశ్విన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇప్పటికి 119 టెస్టు ఇన్నింగ్స్ ఆడిన 34 ఏళ్ల కేఎల్ రాహుల్ ఖాతాలో తొమ్మిది డకౌట్లు, 31 సింగిల్ డిజిట్ స్కోర్లు ఉండటం గమనార్హం.చదవండి: పాకిస్తాన్ కంటే ప్రమాదకరమా? అని అడిగాను -
చరిత్ర సృష్టించిన టీమిండియా
తమ 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత జట్టు అతి భారీ విజయం సాధించింది. ముల్లాన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్లో ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో గెలవడంతో ఈ ఘనత సాధించింది. ఇన్నింగ్స్ తేడా పరంగా భారత్కు ఇదే అతి పెద్ద విజయం. 1932లో తొలి టెస్ట్ ఆడిన భారత్.. ఇప్పటివరకు ఇన్నింగ్స్ పరంగా ఇంత భారీ విజయం సాధించలేదు.2018లో రాజ్కోట్ వేదికగా వెస్టిండీస్పై సాధించిన ఇన్నింగ్స్ 272 పరుగుల విజయం ఈ మ్యాచ్కు ముందువరకు వరకు భారత జట్టు అతి పెద్ద విజయంగా ఉండింది. ఇన్నింగ్స్ తేడా పరంగా భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో టాప్-5 అతి పెద్ద విజయాలు ఇలా ఉన్నాయి.ఆఫ్ఘనిస్తాన్పై, ముల్లాన్పూర్ (2026) – ఇన్నింగ్స్ & 300 పరుగులువెస్టిండీస్పై, రాజ్కోట్ (2018) – ఇన్నింగ్స్ & 272 పరుగులుఆఫ్ఘనిస్తాన్పై, బెంగళూరు (2018) – ఇన్నింగ్స్ & 262 పరుగులుబంగ్లాదేశ్పై, మీర్పూర్ (2007) – ఇన్నింగ్స్ & 239 పరుగులుశ్రీలంకపై, నాగ్పూర్ (2017) – ఇన్నింగ్స్ & 239 పరుగులుభారత గడ్డపై ఇన్నింగ్స్ తేడాతో నమోదైన అతిపెద్ద విజయాల్లో ఇది రెండో స్థానంలో నిలిచింది. 1958లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్పై వెస్టిండీస్ సాధించిన ఇన్నింగ్స్ మరియు 336 పరుగుల విజయం ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది.ఆసియా జట్ల పరంగా చూస్తే, 2002లో లాహోర్లో పాక్ న్యూజిలాండ్పై సాధించిన ఇన్నింగ్స్ మరియు 324 పరుగుల విజయం తర్వాత, భారత్ తాజా విజయం రెండో అతిపెద్ద ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం.కాగా, ముల్లాన్పూర్ టెస్ట్లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చలాయించి, ఏకపక్ష విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్లో కేఎల్ రాహుల్ (100), కెప్టెన్ శుభ్మన్ గిల్ (126) సెంచరీలతో.. సాయి సుదర్శన్ (81), రిషబ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) అర్ద సెంచరీలతో చెలరేగడంతో భారత్ 564-8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.అనంతరం భారత బౌలర్లు, ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగి ఆఫ్ఘనిస్తాన్ను రెండు ఇన్నింగ్స్ల్లో (152, 112) అతి స్వల్ప స్కోర్లకే కుప్పకూల్చారు. ఫలితంగా ఆ జట్టు ఘోర ఇన్నింగ్స్ పరాభవాన్ని మూటగట్టుకుంది.అరంగేట్రం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ (తొలి ఇన్నింగ్స్లో 6, రెండో ఇన్నింగ్స్లో 1), వాషింగ్టన్ సుందర్ (1, 4) ఆఫ్ఘన్ల భరతం పట్టారు. వీరికి కుల్దీప్ (3), ప్రసిద్ద్ కృష్ణ (3) జత కలిశారు. తొలి టెస్ట్లోనే 7 వికెట్ల ప్రదర్శనతో మెరిసిన మానవ్ సుతార్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
టీమిండియాకు షాక్.. ఆఫ్గన్పై గెలిచినా దండగే!
అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముల్లన్పూర్ వేదికగా జరిగిన టెస్టును టీమిండియా మూడు రోజుల్లోనే ముగించింది. ఒక ఇన్నింగ్స్ మాత్రమే ఆడిన టీమిండియా భారీ స్కోరు చేయడమే గాక అఫ్గానిస్తాన్ను రెండుసార్లు ఆలౌట్ చేసింది. అయితే ఆఫ్గన్పై భారీ విజయం సాధించినప్పటికీ వరల్డ్ టెస్టు చాంపియన్షిఫ్ (డబ్ల్యూటీసీ) పట్టికలో భారత్ స్థానం మాత్రం మారకపోవచ్చు. ప్రస్తుతం గిల్ సేన 48.15 పర్సంటేజ్ పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతుంది. మరి ఆఫ్గన్పై టెస్టు విజయం సాధించినా డబ్ల్యూటీసీ పట్టికలో టీమిండియా స్థానం మారకపోవడానికి కారణమేంటనేది తెలుసుకుందాం. అఫ్గానిస్తాన్తో టెస్టు మ్యాచ్ డబ్ల్యూటీసీ చాంపియన్షిప్ సైకిల్లో లేదు. అందుకే ఈ మ్యాచ్లో భారీ విజయం సాధించినా ఎలాంటి పాయింట్లు రావు. అందుకే డబ్ల్యూటీసీ పట్టికలో టీమిండియా స్థానం మారదు. 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్లో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 9 టెస్టుల్లో నాలుగింట గెలిచింది. భారత్ తన డబ్ల్యూటీసీ సైకిల్ను ఇంగ్లండ్ టూర్తో మొదలుపెట్టింది. ఇంగ్లండ్తో సిరీస్ను డ్రా చేసుకున్న టీమిండియా సౌతాఫ్రికా చేతిలో మాత్రం క్లీన్స్వీప్కు గురైంది.అయితే వెస్టిండీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసిన టీమిండియా డబ్ల్యూటీసీ పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (8 టెస్టుల్లో 7 విజయాలు) 87.50 పర్సంటైల్తో తొలి స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా (75 పర్సంటైల్తో) రెండో స్థానంలో, శ్రీలంక (66.67 పర్సంటైల్తో) మూడో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ (58.33), బంగ్లాదేశ్ (58.33) పర్సంటైల్తో వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇంగ్లండ్ (37.88) ఏడో స్థానంలో ఉండగా.. పాకిస్తాన్ (8.33), వెస్టిండీస్ (4.13) పర్సంటైల్ పాయింట్లతో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి.Leaving New Chandigarh with a massive win under the belt 🇮🇳A complete team performance from #TeamIndia 🤍Scorecard ▶️ https://t.co/Au50EfVM30#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/MxUFJHvoq4— BCCI (@BCCI) June 8, 2026చదవండి: ‘నన్ను రిటైర్ అవ్వమంటున్నారా?’.. భారత కెప్టెన్ అసహనం! -
చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. తొలి భారత కెప్టెన్గా
ముల్లాన్పూర్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ను 564/8 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన భారత్.. అనంతరం బౌలింగ్లో పర్యాటక జట్టుకు చుక్కలు చూపిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ 39.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. అఫ్గాన్ ఇంకా 451 పరుగుల భారీ వెనుకంజలో ఉంది.అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో అదరగొట్టిన గిల్.. అదే జోరును అఫ్గాన్ మ్యాచ్లో కూడా కొనసాగించాడు. 177 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్తో 126 పరుగులు చేశాడు.ఈ ఇన్నింగ్స్తో కెప్టెన్గా 1000 పరుగుల మైలురాయిని కూడా గిల్ అధిగమించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన 101వ కెప్టెన్గా శుబ్మన్ నిలిచాడు. అయితే ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో గిల్ అత్యుత్తమ సగటు కలిగిన రెండో కెప్టెన్గా రికార్డులకెక్కాడు. ఈ మైలురాయిని అతడు ఏకంగా 82.76 సగటుతో అందుకోవడం విశేషం. ఆస్ట్రేలియా దిగ్గజం సర్ డాన్ బ్రాడ్మన్(101.51) మాత్రమే గిల్ కంటే మెరుగైన సగటును కలిగి ఉన్నాడు. ఈ జాబితాలో శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కర 69.6 సగటుతో మూడో స్థానంలో ఉన్నాడు. భారత క్రికెట్ నుంచి మాత్రం గిల్ కంటే ముందు ఏ కెప్టెన్ కూడా ఈ ఫీట్ సాధించలేదు.అదేవిధంగా కెప్టెన్గా అత్యంత వేగంగా 1000 టెస్ట్ పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాళ్లలో గిల్ రెండో స్థానానికి చేరుకున్నాడు. గిల్ కేవలం 15 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు. తొలి స్ధానంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(14 ఇన్నింగ్స్లు) ఉన్నారు. -
తప్పు మీద తప్పు.. ఆఫ్గన్ కొంపముంచిన కెప్టెన్!
టీమిండియాతో జరుగుతున్న ఏకైక టెస్టులో అఫ్గానిస్తాన్ తప్పు మీద తప్పులు చేస్తోంది. తొలిరోజు కేఎల్ రాహుల్ ఔట్ విషయంలో రివ్యూలు తీసుకోవడంలో తడబడ్డ అఫ్గానిస్తాన్ రెండో రోజు ఆటలోనూ అదే తప్పును పునరావృతం చేసింది. ఫలితంగా టీమిండియా భారీ స్కోరు చేయడమే గాక మ్యాచ్పై పట్టు సాధించేలా చేసింది. తొలిరోజు ఆటలో కేఎల్ రాహుల్ 16 పరుగుల వద్ద ఉన్నప్పుడు అజ్మతుల్లా ఒమర్జయ్ వేసిన బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో రాహుల్ మిస్ అయ్యాడు. దీంతో బంతి అతడి బ్యాట్ను ముద్దాడుతూ కీపర్ చేతుల్లో పడింది. కీపర్ అఫ్సర్ జజయ్ ఔట్ అప్పీల్ చేసినప్పటికీ, అంపైర్ ఔటివ్వలేదు. అయితే కెప్టెన్ హస్మతుల్లా షాహిది కీపర్ను అడిగినప్పటికీ అతడు క్లారిటీతో లేకపోవడం వల్ల రివ్యూ వెళ్లలేదు.ఆ తర్వాత రిప్లేలో రాహుల్ బ్యాట్కు బంతి తాకినట్లు స్పైక్ రావడం కనిపించింది. దీంతో 16 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ రాహుల్ ఆ తర్వాత శతకం బాదాడు. తొలిరోజు చేసిన తప్పు నుంచి పాఠాలు నేర్వని అఫ్గానిస్తాన్ రెండోరోజు ఆటలోనూ అదే తప్పిదం చేసింది. ఈసారి గిల్ విషయంలో రివ్యూకు తీసుకోవడంలో విఫలమైంది. ఇన్నింగ్స్ 89వ ఓవర్లో ఒమర్జయ్ వేసిన బంతి గిల్ ప్యాడ్లను తాకింది. అయితే ఆఫ్గన్ ఆటగాళ్లు అప్పీల్ చేసినప్పటికీ ఫీల్డ్ అంపైర్ ఔటివ్వలేదు. అయితే ఒమర్జయ్ రివ్యూ వెళ్లాలని కెప్టెన్ షాహిదిని కోరినప్పటికీ, అతడు బంతి ఇన్సైడ్ ఎడ్జ్ అవుతుందేమోనని భావించి రివ్యూ కోరలేదు. కానీ రిప్లేలో బ్యాట్కు బంతి ఎక్కడా తగలకుండా లెగ్ స్టంప్ను ఎగరేస్తున్నట్లు కనిపించింది. ఒకవేళ రివ్యూకు వెళ్లి ఉంటే గిల్ 109 పరుగుల వద్దే వెనుదిరిగేవాడు. ఈ రెండు తప్పుల తర్వాత కూడా ఆఫ్గన్ తమ లెక్కను సరిచేసుకోలేకపోయింది. ఆ మరుసటి బంతికే రిషబ్ పంత్ కూడా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఒమర్జయ్ వేసిన బంతిని పంత్ షాడ్ ఆడే ప్రయత్నంలో మిస్ చేశాడు. దీంతో బంతి కీపర్ అఫ్సర్ చేతిలో పడింది. అప్పీల్ చేసినప్పటికీ అంపైర్ ఔటివ్వలేదు.సెకండ్ స్లిప్లో ఉన్న రహమనుల్లా గుర్బాజ్ మాత్రం బంతి పంత్ బ్యాట్కు తగిలిందని, రివ్యూ వెళ్లాలని కెప్టెన్ షాహిదికి కాన్ఫిడెంట్గా చెప్పాడు. కానీ షాహిది మాత్రం రివ్యూకు వెళ్లడానికి ఇష్టపడలేదు. కానీ రిప్లేలో బంతి బ్యాట్ ఎడ్జ్ అయినట్లు స్పైక్ రావడంతో కెప్టెన్ ఆశ్చర్యపోయాడు. అలా 54 పరుగుల వద్ద ఔట్ ప్రమాదం నుంచి బయటపడిన పంత్ తన స్కోరుకు మరో 27 పరుగుల జత చేసుకున్నాడు. ఇలా మూడుసార్లు కీలక ఆటగాళ్లను ఔట్ చేసే విషయంలో ఆఫ్గన్ కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ రివ్యూ తీసుకోవడంలో విఫలమై ఆఫ్గన్ కొంపముంచాడు. అతడి తప్పుల వల్ల టీమిండియా 550 పరుగుల మార్క్ను అందుకోగలిగింది. ఒకవేళ సరైన సమయంలో రివ్యూలు తీసుకొని ఉంటే టీమిండియా ఆట నాలుగు వందల్లోపే ముగిసి ఉండేది. మ్యాచ్ విషయానికొస్తే భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ పూర్తవ్వగానే గిల్ డిక్లేర్కు పిలుపునిచ్చాడు. కేఎల్ రాహుల్, గిల్ సెంచరీలు చేయగా.. పంత్, సాయి సుదర్శన్, సుందర్లు అర్థసెంచరీలతో మెరిశారు. ఆఫ్గన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ సఫీ 6 వికెట్లతో మెరవగా, జియావుర్ రెహమాన్, హస్మతుల్లా చెరొక వికెట్ తీశారు.చదవండి: ఆత్రుత ఎందుకు పంత్.. ఓపిక వహించాల్సింది! -
కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్.. భువీ, షమీకి చోటు!
భారత టీ20 జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్ను తప్పించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. ఆ స్ధానంలో శ్రేయస్ అయ్యర్ను నూతన సారధిగా నియమించింది. సూర్యను కెప్టెన్గానే కాకుండా పూర్తిగా జట్టు నుంచే పక్కన పెట్టారు. అదేవిధంగా ఇటీవల పొట్టి ప్రపంచకప్ గెలిచిన జట్టులో భాగమైన హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్లను కూడా టీ20 జట్టు నుంచి తప్పించారు. ఐపీఎల్-2026లో దుమ్ములేపిన వెటరన్ భువనేశ్వర్ కుమార్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, రజత్ పాటిదార్లను కూడా సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్కు ఎంపిక కాని భారత స్టార్ ఆటగాళ్లతో కూడా ప్రత్యామ్నాయ జట్టును ఎక్స్లో షేర్ చేశారు. ఈ జట్టు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్కు అవకాశమిచ్చారు. అదేవిధంగా గిల్,రాహుల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ వంటి సీనియర్ ప్లేయర్లు కూడా ఉన్నాడు.అన్సెలక్టెడ్ ఆటగాళ్లతో కూడిన భారత టీ20 జట్టుశుబ్మన్ గిల్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ -
ముగిసిన రెండో రోజు ఆట.. భారత్దే ఆధిపత్యం
India vs Afghanistan test Day 2 updates and Highlights: ముల్లాన్పూర్ వేదికగా భారత్-అఫ్గానిస్తాన్ మధ్య రెండో రోజు ఆట ప్రారంభమైంది.రెండో రోజూ భారత్దేముల్లాన్పూర్ టెస్టులో అఫ్గాన్పై భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అఫ్గానిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. పర్యాటక జట్టు భారత్ కంటే తొలి ఇన్నింగ్స్లో ఇంకా 451 పరుగులు వెనకబడి ఉంది. క్రీజులో రెహమత్ షా(43) ఉన్నాడు.కాగా భారత అరంగేట్ర ఆటగాడు మానవ్ సుతార్ బౌలింగ్, బ్యాటింగ్తో అదరగొట్టాడు. బ్యాటింగ్లో 28 పరుగులు చేసిన సుతార్, బౌలింగ్లో 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు ప్రసిద్ద్ కృష్ణ రెండు వికెట్లు సాధించారు. తొలి ఇన్నింగ్స్ను భారత్ 564/8 వద్ద డిక్లేర్ చేసింది.భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్(100), శుభ్మన్ గిల్(126) సెంచరీలతో చెలరేగగా.. రిషబ్ పంత్(81), సాయిసుదర్శన్(81), వాషింగ్టన్ సుందర్(52 నాటౌట్) అర్ధ శతకాలతో సత్తాచాటారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ 6 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు జియూర్, షాహిది తలా వికెట్ సాధించారు.అఫ్గాన్ నాలుగో వికెట్ డౌన్హాస్మతుల్లా షాహిదీ(20) రూపంలో అఫ్గానిస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో వికెట్లు ముందు షాహిదీ దొరికిపోయాడు.అఫ్గాన్ మూడో వికెట్ డౌన్గుర్భాజ్ రూపంలో అఫ్గానిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన గుర్బాజ్.. సుతార్ బౌలింగ్లో ఔటయ్యాడు.రెండో వికెట్ డౌన్అఫ్గానిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన అటల్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు అఫ్గాన్ స్కోర్: 49/2తొలి వికెట్ కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్28 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. మానవ్ సుతార్ బౌలింగ్లో మొహమ్మద్ సిరాజ్ క్యాచ్ పట్టడంతో అబ్దుల్ మాలిక్ (16) ఔటయ్యాడు. మానవ్ సుతార్కు టెస్ట్ల్లో ఇది తొలి వికెట్. ఈ వికెట్ను అతడు తన తొలి ఓవర్లోనే తీయడం విశేషం. మాలిక్ ఔటయ్యాక అంపైర్లు టీ బ్రేక్కు పిలుపిచ్చారు.భారత్ భారీ స్కోర్అప్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్లో తమ తొలి ఇన్నింగ్స్ను భారత్ 564/8 వద్ద డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్(100), శుభ్మన్ గిల్(126) సెంచరీలతో చెలరేగగా.. రిషబ్ పంత్(81), సాయిసుదర్శన్(81), వాషింగ్టన్ సుందర్(52 నాటౌట్) అర్ధ శతకాలతో సత్తాచాటారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ 6 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు జియూర్, షాహిది తలా వికెట్ సాధించారు.సిరాజ్ అవుట్టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 12 బంతుల్లో 22 పరుగులు చేసిన సిరాజ్.. సలీమ్ బౌలింగ్లో ఔటయ్యాడు. భారత్ స్కోర్: 543/8భారీ స్కోర్ దిశగా భారత్రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్(14), మానవ్ సుతార్(9) ఉన్నారు. రెండో రోజు ఆటలో భారత్.. గిల్(100), రిషబ్ పంత్(81), జురెల్(19) వికెట్లు కోల్పోయింది.పంత్ అవుట్రిషబ్ పంత్(81) రూపంలో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. షాహిది బౌలింగ్లో ఔటయ్యాడు.ధ్రువ్ జురెల్ అవుట్19 పరుగులు చేసిన ధ్రువ్ జురెల్.. సలీమ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు . 102 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్: 456-5భారత్ నాలుగో వికెట్ డౌన్416 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 126 రన్స్ చేసిన గిల్..సలీమ్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో ధ్రువ్ జురెల్ వచ్చాడు.రెండో రోజు ఆట ఆరంభంముల్లాన్పూర్ వేదికగా భారత్-అఫ్గానిస్తాన్ మధ్య రెండో రోజు ఆట ప్రారంభమైంది. క్రీజులో రిషబ్ పంత్(50), శుబ్మన్ గిల్(106) ఉన్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 371 పరుగులు చేసింది. మొదటి రోజు ఆటలో కేఎల్ రాహుల్ శతక్కొట్టగా.. సాయిసుదర్శన్(81) హాఫ్ సెంచరీతో రాణించారు. అఫ్దాన్ బౌలర్లలో సలీమ్ రెండు వికెట్లు పడగొట్టగా.. జియావుర్ రెహమాన్ ఓ వికెట్ సాధించాడు.తుది జట్లుఆఫ్ఘనిస్తాన్ : సెడిఖుల్లా అటల్, రహ్మానుల్లా గుర్బాజ్, అబ్దుల్ మాలిక్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అఫ్సర్ జజాయ్(వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేలియా ఖరోటే, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేయాలియా ఖరోటే, జియావుర్ రెహమాన్ షరీఫీ, మహ్మద్ సలీమ్ సఫీభారత్ : కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ -
గిల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్
ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (జూన్ 6) ప్రారంభమైన ఏకైక టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ పరుగుల వరద పారిస్తుంది. ఈ ఇన్నింగ్స్లో ఇప్పటికే ఓపెనర్ కేఎల్ రాహుల్ (100) శతక్కొట్టగా.. తాజాగా కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. గిల్ 138 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్ సాయంతో మూండకెల మార్కును తాకాడు. ఈ సెంచరీ గిల్కు 11వ టెస్ట్ సెంచరీ. ఓవరాల్గా 20వ అంతర్జాతీయ సెంచరీ. కేవలం 26 ఏళ్ల వయసులోనే గిల్ ఇన్ని సెంచరీలు చేయడం విశేషం.అరుదైన ఫీట్టీమిండియా కెప్టెన్గా గిల్ టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్క్ను అందుకున్నాడు. 15 ఇన్నింగ్స్ల్లో గిల్ ఈ ఫీట్ సాధించాడు. తద్వారా భారత్ తరఫున కెప్టెన్గా తక్కువ ఇన్నింగ్స్లో వెయ్యి పరుగుల మార్క్ దాటిన రెండో క్రికెటర్గా నిలిచాడు. మొదటి స్థానంలో సునీల్ గావస్కర్ (14 ఇన్నింగ్స్లు) ఉన్నాడు.అంతేకాదు కెప్టెన్ అయిన అతి తక్కువ రోజుల్లోనే టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గానూ నిలిచాడు. ఇక ఓవరాల్గా భారత్ తరఫున కెప్టెన్గా వెయ్యి పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో 11వ స్థానంలో నిలిచాడు.అలాగే అత్యధిక టెస్ట్ శతకాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో టాప్-5లోకి చేరాడు. గిల్ భారత టెస్ట్ జట్టు కెప్టెన్గా 6 శతకాలు సాధించాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (20) టాప్ ప్లేస్లో ఉండగా.. సునీల్ గవాస్కర్ (11), మొహమ్మద్ అజహారుద్దీన్ (9), సచిన్ టెండూల్కర్ (7) గిల్కు ముందున్నారు. గిల్ 6 టెస్ట్ శతకాలను కేవలం 15 ఇన్నింగ్స్లోనే సాధించడం మరో విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. ముల్లాన్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో భారత్ అతి భారీ స్కోర్ దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి జట్టు స్కోర్ 368-3గా ఉంది. రాహుల్ (100), యశస్వి జైస్వాల్ (24), సాయి సుదర్శన్ (81) ఔట్ కాగా.. గిల్ (103), వికెట్కీపర్ రిషబ్ పంత్ (50) క్రీజ్లో ఉన్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో సలీం సాఫి 2, జియా ఉర్ షరిఫీ ఓ వికెట్ పడగొట్టారు. -
ఆఫ్గన్తో టెస్టు.. గిల్ అరుదైన ఫీట్!
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా బ్యాటర్లు రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నారు. ఇప్పటికే కేఎల్ రాహుల్ శతకంతో సరికొత్త రికార్డులు నెలకొల్పగా.. తాజాగా టీమిండియా సారథి శుబ్మన్ గిల్ అరుదైన ఫీట్ సాధించాడు. టీమిండియా కెప్టెన్గా గిల్ టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్క్ను అందుకున్నాడు. 15 ఇన్నింగ్స్లో గిల్ ఈ ఫీట్ సాధించాడు. తద్వారా భారత్ తరఫున కెప్టెన్గా తక్కువ ఇన్నింగ్స్లో వెయ్యి పరుగుల మార్క్ దాటిన రెండో క్రికెటర్గా గిల్ నిలిచాడు. మొదటి స్థానంలో సునీల్ గావస్కర్ (14 ఇన్నింగ్స్లు) ఉన్నాడు. అంతేకాదు కెప్టెన్ అయిన తక్కువ రోజుల్లోనే టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గానూ గిల్ నిలిచాడు. ఇక ఓవరాల్గా భారత్ తరఫున కెప్టెన్గా వెయ్యి పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో గిల్ 11వ స్థానంలో నిలిచాడు. ఆఫ్గన్పై సాధించిన అర్థసెంచరీ గిల్కు తొమ్మిదోది కావడం విశేషం.ఇక గిల్ ఇప్పటివరకు 40 టెస్టు మ్యాచ్లాడి 2,843 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 8 అర్థసెంచరీలున్నాయి. మ్యాచ్ విషయానికొస్తే టీమిండియా భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది. 68 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (65), రిషబ్ పంత్ (25) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు కేఎల్ రాహుల్ శతకం చేసిన వెంటనే ఔట్ అయ్యాడు. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam)చదవండి: తెలుగోడే అర్హుడు.. అందుకే అక్షర్ను తప్పించాం! -
రాహుల్, గిల్ సెంచరీలు.. టీమిండియా ఆధిపత్యం
అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో శనివారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 85 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 368 పరుగులు సాధించింది. గిల్ 103, పంత్ 50 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (24) నిరాశపరచగా.. కేఎల్ రాహుల్ (100) శతక్కొట్టాడు. మిగిలిన వారిలో వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ భారీ అర్ధ శతకం (81)తో అలరించాడు. అఫ్గన్ బౌలర్లలో మహ్మద్ సలీ సఫీ రెండు వికెట్లు తీయగా.. జియాఉర్ రహ్మాన్ ఒక వికెట్ పడగొట్టాడు.శుబ్మన్ గిల్ సెంచరీ82.5: సలీమ్ సఫీ బౌలింగ్లో సింగిల్ తీసి శతకం పూర్తి చేసుకున్న కెప్టెన్ గిల్. 138 బంతుల్లో సెంచరీ చేసిన గిల్. స్కోరు: 358/3 83).మూడు వందల మార్కు దాటిన టీమిండియా.. స్కోరు: 340/3(79)గిల్ 91, పంత్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు.మూడో వికెట్ డౌన్సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మరుసటి బంతికే రాహుల్ అవుట్. క్రీజులోకి రిషభ్ పంత్. స్కోరు: 249/3 (61). గిల్ 39 పరుగులతో ఉండగా.. పంత్ రెండు పరుగులతో ఉన్నాడు.కేఎల్ రాహుల్ సెంచరీ60.1: జియాఉర్ రహ్మాన్ బౌలింగ్లో రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్. కెరీర్లో 12వ టెస్టు సెంచరీ సాధించిన కర్ణాటక బ్యాటర్.45 ఓవర్లలో టీమిండియా స్కోరు: 191-2గిల్ 8, రాహుల్ 75 పరుగులతో ఉన్నారు.సాయి సుదర్శన్ అవుట్42.4: సలీమ్ సపీ బౌలింగ్లో రెండో వికెట్గా వెనుదిరిగిన సాయి సుదర్శన్ (81). సెంచరీకి పందొమ్మిది పరుగుల దూరంలో పెవిలియన్ చేరిన సాయి. క్రీజులోకి కెప్టెన్ శుబ్మన్ గిల్ రాగా.. రాహుల్ 72 పరుగులతో ఉన్నాడు.సాయి అర్ద శతకం31.3: నంగేయాలియా ఖరోటే బౌలింగ్లో ఫోర్ బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్న సాయి సుదర్శన్. స్కోరు: 133/1 (31.4)కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ29.3: నంగేయాలియా ఖరోటే బౌలింగ్లో సింగిల్ తీసి అర్ధ శతకం పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్. టెస్టు కెరీర్లో అతడికి ఇది 21వ హాఫ్ సెంచరీ. 31 ఓవర్లలో టీమిండియా స్కోరు: 121-1.లంచ్ బ్రేక్కు భారత్ స్కోరెంతంటే?లంచ్ బ్రేక్ సమయానికి భారత్ వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(37), సాయిసుదర్శన్(32) ఉన్నారు.నిలకడగా ఆడుతున్న సుదర్శన్, రాహుల్21 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(32), సాయిసుదర్శన్(26) ఉన్నారు.తొలి వికెట్ డౌన్టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన జైశ్వాల్.. సలీం బౌలింగ్లో ఔటయ్యాడు.నిలకడగా ఆడుతున్న భారత్భారత ఓపెనర్లు రాహుల్(16), యశస్వి జైశ్వాల్(20) నిలకడగా ఆడుతున్నారు. 10 ఓవర్లకు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. 16 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.బ్యాటింగ్ భారత్దేముల్లాన్పూర్ వేదికగా భారత్-అఫ్గానిస్తాన్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్తో రాజస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుత్తార్ భారత తరపున అరంగేట్రం చేశాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో అతడికి టీమిండియా తరపున ఆడే అవకాశం లభించింది.అదేవిధంగా సాయిసుదర్శన్కు కూడా తుది జట్టులో చోటు దక్కింది. ఈ తమిళనాడు ఆటగాడు ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ రానున్నాడు. ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కలేదు. అతడి స్ధానంలో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్కు ఛాన్స్ ఇచ్చారు.తుది జట్లుఆఫ్ఘనిస్తాన్ : సెడిఖుల్లా అటల్, రహ్మానుల్లా గుర్బాజ్, అబ్దుల్ మాలిక్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అఫ్సర్ జజాయ్(వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేలియా ఖరోటే, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేయాలియా ఖరోటే, జియావుర్ రెహమాన్ షరీఫీ, మహ్మద్ సలీమ్ సఫీభారత్ : కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ -
‘సొంతగడ్డపై టీమిండియా పటిష్టంగా కనిపించట్లేదు’
గత కొంతకాలంగా టెస్టుల్లో టీమిండియా స్థాయికి తగ్గట్లు రాణించడం లేదు. ముఖ్యంగా గౌతం గంభీర్ హెడ్కోచ్గా వచ్చిన తర్వాత భారత్కు ఘోర పరాజయాలు ఎదురయ్యాయి. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఏకంగా 3-0తో వైట్వాష్కు గురైంది టీమిండియా.ఇక ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 3-2తో కోల్పోయింది. దాదాపుగా దశాబ్దకాలం తర్వాత టీమిండియా ఈ సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి. అనంతరం ఇంగ్లండ్ పర్యటనలో 2-2తో డ్రా చేసుకోవడంతో జట్టుపై విమర్శల జడి కాస్త తగ్గింది.ఇదిలా ఉంటే.. చాన్నాళ్ల తర్వాత టీమిండియా టెస్టు బరిలో దిగనుంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టు ఆడనుంది. జూన్ 6 నుంచి ముల్లన్పూర్లో ఈ మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, ఈ మ్యాచ్ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగం కాదు.భారత్కు అత్యంత ముఖ్యంఅయినప్పటికీ ఈ మ్యాచ్ భారత్కు అత్యంత ముఖ్యమని అంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ సబా కరీం. జియోస్టార్తో మాట్లాడుతూ.. ‘‘ఈ టెస్టు మ్యాచ్ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగం కాదు. అయినప్పటికీ ఈ మ్యాచ్ను తేలికగా తీసుకోకూడదు.టీమిండియాకు ఇది అతి ముఖ్యమైన మ్యాచ్. ఈ మ్యాచ్ ద్వారా తమ లోపాల్ని సరిచేసుకుని.. జట్టును పరీక్షించుకునే వీలు కలిగింది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటిని అధిగమించాల్సి ఉంది.టెస్టు క్రికెట్పై భారత జట్టు మరింత దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా సొంతగడ్డపై గతంలో మాదిరి టీమిండియా పటిష్టంగా కనిపించడం లేదు’’ అని సబా కరీం అభిప్రాయపడ్డాడు.యువ ఆటగాళ్లను పరీక్షించే అవకాశంఅదే విధంగా.. ‘‘అఫ్గన్తో టెస్టు రూపంలో యువ ఆటగాళ్లను కూడా పరీక్షించే అవకాశం వచ్చింది. కొత్త కొత్త కాంబినేషన్లు ప్రయత్నించండి. ఒకవేళ వాళ్లు బాగా ఆడితే తదుపరి సిరీస్లకు కూడా ఎంపిక చేయండిజఇది ఇప్పటికప్పుడు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. అయితే, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొన్నిసార్లు ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. ఇది గెలుపోటముల గురించి ఆలోచించే సమయం కాదు. భవిష్యత్తును తప్పక దృష్టిలో పెట్టుకోండి’’ అని సబా కరీం సెలక్టర్లకు సూచించాడు.అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టుకు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవ్దత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, ధ్రువ్ జురెల్.చదవండి: కావ్యా మారన్పై SRH ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు -
అత్యుత్తమ టెస్టు జట్టు ఇదే.. జైసూకు దక్కని చోటు!
సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ బరిలో దిగేందుకు సిద్ధమైంది. దాదాపు రెండు నెలల పాటు ఐపీఎల్-2026 టోర్నీతో బిజీగా గడిపిన భారత ఆటగాళ్లు.. జూన్ 6 నుంచి జాతీయ జట్టు తరఫున విధుల్లో చేరనున్నారు.స్వదేశంలో అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టు ఆడే క్రమంలో ముల్లన్పూర్లో ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టిన ప్లేయర్లు.. నెట్స్లో చెమటోడుస్తున్నారు. శుబ్మన్ గిల్ కెప్టెన్సీలో భారత్ అఫ్గన్తో టెస్టుతో పాటు.. మూడు వన్డేలు ఆడనుంది.ప్రస్తుత అత్యుత్తమ జట్టు ఇదేఇలాంటి తరుణంలో టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ జట్టు ఇదేనంటూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇందులో నలుగురు భారత క్రికెటర్లకు మాత్రమే చోటు దక్కింది.తన జట్టులో కేఎల్ రాహుల్కు ఓపెనర్గా స్థానమిచ్చిన సంజయ్ బంగర్.. యశస్వి జైస్వాల్ను మాత్రం విస్మరించాడు. అతడికి బదులు ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్ను రాహుల్కు జోడీగా ఎంపిక చేశాడు.ఆసీస్, ఇంగ్లండ్ దిగ్గజాలకు చోటుకాగా గతేడాది జైసూ ఏకంగా మూడు సెంచరీల సాయంతో 700కు పైగా పరుగులు చేశాడు. మరోవైపు.. హెడ్ 817, రాహుల్ 813 పరుగులు సాధించారు. ఇక వన్డౌన్లో ఇంగ్లండ్ లెజెండ్ జో రూట్ను ఎంపిక చేసిన సంజయ్ బంగర్.. నాలుగో స్థానానికి టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ను ఎంచుకున్నాడు. ఐదో స్థానంలో ఆసీస్ దిగ్గజం స్టీవ్ స్మిత్కు చోటు ఇచ్చాడు.గతేడాది రూట్ 805 పరుగులతో సత్తా చాటగా.. స్మిత్ 651 రన్స్ రాబట్టాడు. వీరిద్దరి కంటే మెరుగ్గా గిల్.. ఏకంగా 983 పరుగులతో దుమ్ములేపాడు. ఇక తన జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్గా బంగర్.. టీమిండియా స్టార్ రిషభ్ పంత్కు స్థానమిచ్చాడు. ఇక ఏడో స్థానానికి ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ను ఎంపిక చేశాడు.పేస్ దళంలో ఎవరంటేఅదే విధంగా స్పిన్నర్ల కోటాలో సౌతాఫ్రికా లెఫ్టార్మ్ బౌలర్ కేశవ్ మహరాజ్ను బంగర్ ఎంచుకున్నాడు. గతేడాది అతడు ఆరు మ్యాచ్లలో కలిపి ఏకంగా 25 వికెట్లు పడగొట్టాడు. పేస్ దళంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్లతో పాటు టీమిండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు బంగర్ చోటిచ్చాడు.ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ కంబైన్డ్ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్ (సంజయ్ బంగర్)కేఎల్ రాహుల్, ట్రవిస్ హెడ్, జో రూట్, శుబ్మన్ గిల్, స్టీవ్ స్మిత్, రిషభ్ పంత్, బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, కేశవ్ మహరాజ్, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: కావ్యా మారన్పై SRH ప్లేయర్ సంచలన ఆరోపణలు! -
‘నువ్వు కూర్చో.. అతడినే వన్డౌన్లో పంపుతాం అన్నాడు’
గత రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్ టాపార్డర్ అద్భుతంగా రాణిస్తోంది. ఐపీఎల్-2025లో గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ 15 మ్యాచ్లు ఆడి 759 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.పరుగుల వీరులుఇక మరో ఓపెనర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) కూడా 15 మ్యాచ్లలో కలిపి 650 పరుగులు రాబట్టి సత్తా చాటాడు. వీరికి తోడుగా వన్డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ 14 మ్యాచ్లు ఆడి 538 పరుగులు సాధించాడు. ఐపీఎల్-2026లోనూ ఈ ముగ్గురూ రాణించారు.గిల్ 732, సాయి సుదర్శన్ 722 పరుగులతో మరోసారి సత్తా చాటగా.. బట్లర్ 526 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో ఫైనల్లో గుజరాత్ యాజమాన్యం బట్లర్ను వన్డౌన్లో కాకుండా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు పంపింది.అనూహ్య నిర్ణయంమూడో స్థానంలో అన్క్యాప్డ్ ప్లేయర్ నిశాంత్ సింధు (20)ను పంపగా.. అతడు విఫలమయ్యాడు. ఇక నాలుగో స్థానంలో వెళ్లిన బట్లర్ సైతం 19 పరుగులే చేసి నిష్క్రమించాడు. ఇక గిల్, సాయి వరుసగా 10, 12 పరుగులే చేశారు. ఫలితంగా 155 పరుగులే చేసిన గుజరాత్.. ఐదు వికెట్ల తేడాతో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది.కాగా బట్లర్ను వన్డౌన్లో కాకుండా నాలుగో నంబర్ బ్యాటర్గా పంపడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఈ విషయంలో గుజరాత్ నాయకత్వ బృందాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. ఈ విషయంపై బట్లర్ తాజాగా స్పందించాడు.నువ్వు ఇక్కడే కూర్చో.. తనను నాలుగో స్థానంలో ఆడించాలన్న ఆలోచన హెడ్కోచ్ ఆశిష్ నెహ్రాదేనని బట్లర్ స్పష్టం చేశాడు. ‘ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్’తో మాట్లాడుతూ.. ‘‘తొలి వికెట్ (గిల్) పడగానే.. బ్యాటింగ్కు వెళ్లేందుకు హెల్మెట్ పెట్టుకుని సిద్ధమయ్యాను.ఇంతలో ఆశిష్ నెహ్రా.. ‘నువ్వు ఇక్కడే కూర్చో.. వన్డౌన్లో మేము నిశాంత్ను పంపాలని నిర్ణయించుకున్నాము’ అని చెప్పాడు. మ్యాచ్ తర్వాత ఈ విషయం గురించి నేను నెహ్రాను అడిగాను.అప్పుడు నిశాంత్ను పంపితే బాగుంటుందని.. టాపార్డర్లో ఆడేందుకు అతడికి ఇదే మంచి అవకాశం అని నెహ్రా నాతో అన్నాడు.వర్కౌట్ కాలేదుఅతడిని ఏడో స్థానంలో బ్యాటింగ్కు పంపలేము కదా.. అందుకే ఫైనల్లో ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు. కోల్కతా మ్యాచ్లో కూడా అతడు నాకంటే ముందే బ్యాటింగ్కు వెళ్లాడు. అది తప్పో.. ఒప్పో తెలియదు. ఫైనల్లో మాత్రం ఆ నిర్ణయం మాకు వర్కౌట్ కాలేదు’’ అని బట్లర్ పేర్కొన్నాడు.చదవండి: శ్రేయస్ అయ్యర్ విఫలం.. ఘోర పరాజయం -
టీమిండియా కెప్టెన్గా కేఎల్ రాహుల్?
అఫ్గానిస్తాన్తో ఈ నెల 6 నుంచి జరిగే ఏకైక టెస్టు మ్యాచ్ కోసం భారత జట్టు సన్నద్ధమవుతోంది. మంగళవారం ముల్లాన్పూర్కు చేరుకున్న టీమిండియా తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టింది. ఈ మ్యాచ్ కోసం రెగ్యులర్ టీమ్ సభ్యులతో పాటు అదనంగా నెట్ ప్రాక్టీస్ కోసం ఆరుగురు బౌలర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. పేసర్లు ఆఖిబ్ నబీ, ప్రిన్స్ యాదవ్, గుర్జప్నీత్ సింగ్ పేస్ బౌలింగ్ను నెట్స్లో భారత బ్యాటర్లు ఎదుర్కోనున్నారు.లెగ్ స్పిన్నర్ జీషాన్ అన్సారి, ఎడంచేతి వాటం మణికట్టు స్పిన్నర్ శివాంగ్ కుమార్, ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. టెస్టు జట్టులోని ప్రధాన పేసర్లు సిరాజ్, ప్రసిధ్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఐదు రోజుల వ్యవధిలో మూడు కీలక మ్యాచ్లు ఆడి తీవ్రంగా అలసిపోయారు.వేడి వాతావరణం నేపథ్యంలో వారికి తగినంత విశ్రాంతినిచ్చేందుకు నెట్ బౌలర్ల అవసరం ఏర్పడిందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. టెస్టుకు ముందు భారత బ్యాటర్లకు తగినంత ప్రాక్టీస్ అవసరమని, అందుకే అదనపు బౌలర్లను ఎంపిక చేశామని ఆయన అభిప్రాయపడ్డారు.కెప్టెన్గా రాహుల్!కాగా ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే ఆటగాళ్లు ముల్లన్పూర్ చేరుకోవాల్సి ఉన్నప్పటికీ, కొంతమంది కీలక ఆటగాళ్లు ఇంకా జట్టుతో కలవలేదు. ఈ జాబితాలో కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు తన సహచరులు సాయి సుదర్శన్, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్ ఉన్నారు. వీరంతా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడిన గుజరాత్ జట్టులో భాగంగా ఉన్నారు.అయితే ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రయాణిస్తున్న బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఊహించని ఘటన వల్ల గుజరాత్ ఆటగాళ్లు తొలి బృందంతో కలిసి చండీగడ్కు చేరుకోలేకపోయారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్కు గిల్తో పాటు పేసర్ మహ్మద్ సిరాజ్కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గిల్ స్ధానంలో కేఎల్ రాహుల్ జట్టును నడిపించనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అదేవిధంగా సిరాజ్ స్ధానంలో గుర్నూర్ బ్రార్ టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశముంది.ఆఫ్ఘనిస్తాన్ టెస్టుకు భారత జట్టుశుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, హర్ష్ దూబే, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్)నెట్ బౌలర్లు: గుర్జప్నీత్ సింగ్, అకిబ్ నబీ, ప్రిన్స్ యాదవ్, శరన్ష్ జైన్, జీషన్ అన్సారీ, శివంగ్ కుమార్ -
IPL 2026: టాప్-10 వివాదాలపై ఒక లుక్కేద్దామా!
ఐపీఎల్లో పరుగుల పండుగ అభిమానులకు ఎంత కిక్ ఇస్తుందో, వివాదాలు, గొడవలు కూడా అదే స్థాయిలో ఫ్యాన్స్ను అలరించాయి. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి తాజా 19వ సీజన్ దాకా ఎన్నో గొడవలు, వివాదాలు చోటు చేసుకున్నాయి. మరి ఈ సీజన్లో అభిమానులకు కిక్ ఇచ్చిన టాప్-10 వివాదాలు ఏంటనేవి ఇప్పుడు తెలుసుకుందాం.1) కోహ్లి-గిల్ క్యాచ్ వివాదంఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లి క్యాచ్ ఔట్పై ఎంత రగడ జరిగిందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 63 పరుగులతో కోహ్లి ఆర్సీబీని విజయం వైపు నడిపిస్తున్న సమయంలో ఈ వివాదం చోటుచేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి అర్షద్ ఖాన్ వేసిన బంతిని కోహ్లి మిడాఫ్ మీదుగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ గిల్ డైవ్ చేసి మరీ క్యాచ్ అందుకున్నాడు. అయితే, ఆ క్యాచ్ను గిల్ సరిగ్గా పట్టలేదని, చేతుల్లోకి వెళ్లడానికి ముందు బంతి నేలను తాకిందని కోహ్లీ భావించాడు. A chat between Virat Kohli and Shubman Gill on the catch. - The celebration by Kohli after winning the argument. 😄 pic.twitter.com/9yVbseOqGy— Mufaddal Vohra (@mufaddal_vohra) May 31, 2026అయితే అంపైర్ నితిన్ మీనన్ ఔట్ ఇవ్వడంతో షాక్ తిన్న కోహ్లీ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. తాను ఔట్ కాదని, క్రీజు వదలి వెళ్లనని, థర్డ్ అంపైర్ రివ్యూకు చాన్స్ ఇవ్వాలిని మొండిపట్టు పట్టాడు. చేసేదేం లేక అంపైర్ తన నిర్ణయాన్ని థర్డ్ అంపైర్కు నివేదించాడు. రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్కు కూడా అది స్పష్టంగా కనిపించకపోయినా.. బంతిలో కొంత భాగం నేలను తాకినట్లు గుర్తించి ఔట్ నిర్ణయాన్ని రద్దు చేసి నాటౌట్గా ప్రకటించాడు. కోహ్లీ సంబరాలు చేసుకోగా, గిల్ మాత్రం నిరాశతో చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత 75 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో కోహ్లీ ఆర్సీబీకి రెండో టైటిల్ అందించాడు.2) షేక్హ్యాండ్ వివాదం..ఈ సీజన్లో అభిమానులకు మరింత కిక్ ఇచ్చిన ఎపిసోడ్ అంటే కోహ్లీ, హెడ్ మధ్య జరిగిన షేక్ హ్యాండ్ వివాదమే అని చెప్పొచ్చు. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీతో హెడ్ వ్యంగ్యంగా మాట్లాడడం, దానికి కోహ్లీ ధీటుగా బదులివ్వడం జరిగిపోయాయి. అయితే ఈ గొడవ ఇక్కడితో సద్దుమణగలేదు. Look behind the whole SRH coaching staff, including Daniel Vettori and Muttiah Muralitharan, were watching Virat Kohli and Travis Head, expecting some drama and ready to stop a fight. But Kohli didn’t shake hands, and everyone started laughing. 😂Kohli you character 🔥 pic.twitter.com/W9CS6KM52t— Avénue.1 (@Avnueone8) May 23, 2026మ్యాచ్ పూర్తైన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో హెడ్ తన వద్దకు వచ్చినా కోహ్లీ అతడిని పట్టించుకోకుండా పక్కకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఈ వివాదం హెడ్ భార్యను కూడా తాకింది. ఆమెపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు పెడుతూ కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. మరి ఈ వివాదానికి ఈ సీజన్తో ముగింపు పడిందా అంటే చెప్పలేని పరిస్థితి.3) టిమ్ డేవిడ్ అనైతిక చర్యమే 11న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ విజయం తర్వాత ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ చేతి వేళ్లతో అసభ్య సంజ్ఞలు చేయడం వివాదాస్పదమైంది. సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన మెగా వేలంలో ముంబై ఇండియన్స్ తనను విడుదల చేయడంపై వ్యంగ్యంగా ఈ సైగలు చేసినట్లు తేలింది. దీంతో బీసీసీఐ టిమ్ డేవిడ్ చర్యను తప్పుబడుతూ అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించడంతో పాటు రెండు డీ మెరిట్ పాయింట్లు కేటాయించింది.4) టాస్ వివాదం..ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్-2 పోరు సందర్భంగా టాస్ సమయంలో నెలకొన్న గందరగోళం వివాదంగా మారింది. మొదట టాస్ వేసినప్పుడు పరాగ్ హెడ్ అని చెప్పాడు. అయితే మ్యాచ్ రిఫరీ ప్రకాశ్ భట్ మాత్రం పరాగ్ చెప్పింది అర్థం కాలేదంటూ టాస్ మళ్లీ వేయించాడు. రెండో ప్రయత్నంలో రాజస్తాన్ రాయల్స్కు టాస్ అనుకూలించడంతో బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలి ప్రయత్నంలో గుజరాత్కు టాస్ అనుకూలంగా వచ్చినట్లు తర్వాత తేలింది. ఈ సమయంలో గుజరాత్ కెప్టెన్ గిల్ కాస్త అయోమయానికి గురయ్యాడు. కానీ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించడంతో ఈ వివాదంపై పెద్దగా చర్చ జరగలేదు.5) అంపైరింగ్పై ఎస్ఆర్హెచ్ ఫిర్యాదు ఈ సీజన్లో వరుస వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయాలు తమను తీవ్ర ప్రభావితం చేశాయంటూ ఎస్ఆర్హెచ్ బీసీసీఐని ఆశ్రయించడం హైలైట్గా నిలిచింది. ఆర్సీబీతో మ్యాచ్లో క్లాసెన్ వివాదాస్పద క్యాచ్, కేకేఆర్తో మ్యాచ్లో అభిషేక్ శర్మ క్యాచ్పై, లక్నో ఆటగాడు అవేశ్ ఖాన్ బంతి బౌండరీ లైన్ను దాటకముందే, ఆ తాడును వెనక్కి నెట్టేయడంపై ఎస్ఆర్హెచ్ అసహనం వ్యక్తం చేసింది. ఎంసీసీ నిబంధనల ప్రకారం ఈ చర్యపై ఆటగాడికి భారీ జరిమానా విధించాలని బీసీసీఐ ఎదుట వాదించడం చర్చనీయాంశమైంది.6) పరాగ్ డ్రెస్సింగ్ రూమ్ ఘటనపంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ డ్రెస్సింగ్ రూమ్లో ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ వేపింగ్ (ఈ-సిగరేట్) చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. నిబంధనల ప్రకారం ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లో ఇలాంటి చర్యలకు పాల్పడడం నిషిద్ధం. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన బీసీసీఐ ఆట పరువుకు భంగం కలిగించినందుకు పరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు, ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది.Captain of Rajasthan Royals team Riyan Parag enjoying vape in the RR dressing room .Vaping is illegal in India . Hello @BCCI is this allowed? #PBKSvsRR pic.twitter.com/banIgJDO6u— Surbhi (@SurrbhiM) April 29, 20267) రాజస్తాన్ డగౌట్ మొబైల్ వివాదంఈ సీజన్లో వివాదాల్లో హైలైట్గా నిలిచిన వాటిలో రాజస్తాన్ రాయల్స్ డగౌట్లో మొబైల్ ఫోన్ కనిపించడమే. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా డగౌట్లో రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమి భిందర్ మొబైల్ ఫోన్ ఉపయోగిస్తుండడం కెమెరాల కంటికి చిక్కింది. ఈ చర్య పట్ల సీరియస్ అయిన బీసీసీఐ భిందర్ మొబైల్ అనుకోకుండా వాడానని, మెడికల్రిపోర్ట్స్ చూసుకునేందుకే ఫోన్ వాడినట్లు తెలిపాడు. తన చర్య పట్ల క్షమాపణ చెప్పినప్పటికీ, అతడి వివరణతో సంతృప్తి చెందని బీసీసీఐ రోమి భిందర్కు రూ.లక్ష జరిమానా విధించింది. రోమి భిందర్ చర్యను వ్యతిరేకిస్తూ బీసీసీఐ ఆటగాళ్లకు కఠిన ఆంక్షలు, నిబంధనలు జారీ చేసింది.8) అబ్స్ట్రకింగ్ ది ఫీల్డ్ఐపీఎల్ 2026 సీజన్లో లక్నోతో మ్యాచ్ సందర్భంగా కేకేఆర్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔటయ్యాడు. షాట్ ఆడిన అంగ్క్రిష్ సింగిల్ తీయడానికి ప్రయత్నించాడు. నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న గ్రీన్ వద్దని వారించడంతో వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ దశలో బంతిని అందుకున్న షమీ స్ట్రైకింగ్ ఎండ్ వికెట్ల వైపు విసిరాడు. The infamous Angkrish Raghuvanshi Run out today ! 😔What's your opinion on this decision 🤔 , my opinion is that it was not out, a blunder by 3rd umpire ! What was the hurry 😯?#LSGvsKKR #IPL2026pic.twitter.com/eJmxLm5Gwk— Cricket IQ (@S17Anurag) April 26, 2026ఈ నేపథ్యంలో తన రన్నింగ్ దిశను మార్చుకున్న రఘువంశీ షమీ వేసిన బంతికి అడ్డు రావడంతో అది అతడి ప్యాడ్లకు తగిలింది. దీంతో లక్నో ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో ఉద్దేశపూర్వకంగానే బంతిని అడ్డుకున్నందుకు అంపైర్ అంగ్క్రిష్ రఘువంశీని ఔట్గా ప్రకటించాడు.9) అర్ష్దీప్ ఇన్స్టా వివాదంపంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో దాదాపు 200 పైగా పోస్టులను తొలగించడం ఆసక్తిగా నిలిచింది. ఐపీఎల్ 2026 సీజన్లో పలు వివాదాల నేపథ్యంలో అర్ష్దీప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తేలింది. టోర్నీ జరుగుతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్ సహా జట్టు సమావేశాలకు సంబంధించి కంటెంట్ను సోషల్మీడియాలో షేర్ చేసుకోవద్దంటూ బీసీసీఐ ఆటగాళ్లను హెచ్చరించింది. అందుకే అర్ష్దీప్ తన ఇన్స్టాలో పోస్టులు తొలగించి ఉంటాడని అభిమానులు భావించారు.10) జాసన్ హోల్డర్ క్యాచ్ వివాదంగుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్లో రజత్ పాటీదార్ ఇచ్చిన క్యాచ్ హోల్డర్ డైవ్ చేసి పట్టినప్పటికీ ఆ క్యాచ్ పూర్తి వివాదాస్పదమయింది. పాటిదార్ ఇచ్చిన క్యాచ్ను అందుకునే క్రమంలో హోల్డర్ బంతిని తొలుత నేలకు ఆనించినట్లు కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, అంపైర్ ఔటివ్వడం ఆర్సీబీ డగౌట్లో ఆటగాళ్లకు ఆగ్రహం తెప్పించింది. They checked the runout for 1 min and there was indeed a check of that Patidar's catch by Jason Holder, just judged in 17 secsTruly disappointing to see umpiring at this level this season. New day, new lowpic.twitter.com/KGgbi2a7qb— Gautam (@indiantweetrian) April 30, 2026హోల్డర్ పట్టిన క్యాచ్పై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఔట్ కాదని తెలుస్తున్నప్పటికీ మూడో అంపైర్ పాటిదార్ను ఔట్ అని ప్రకటించడం అత్యంత వివాదాస్పదమయ్యింది.చదవండి: భారత్లో ఫిఫా ప్రసార హక్కులు ఆ సంస్థకే! -
అతడిని వన్డౌన్లో ఆడిస్తారా?: ఇంగ్లండ్ దిగ్గజం ఫైర్
ఐపీఎల్-2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ అనుసరించిన వ్యూహాలపై ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ మండిపడ్డాడు. అసలు గుజరాత్ నాయకత్వ బృందం ఆలోచన ఏమిటో తనకు అర్థం కాలేదన్నాడు.జోస్ బట్లర్ను కాదని నిశాంత్ సింధును వన్డౌన్లో ఎలా ఆడిస్తారని బ్రాడ్ ప్రశ్నించాడు. అహ్మదాబాద్లో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో గుజరాత్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.ఈ క్రమంలో బెంగళూరు వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడగా.. గుజరాత్ రన్నరప్తో సరిపెట్టుకుంది. కాగా ఆర్సీబీతో ఫైనల్ సందర్భంగా గుజరాత్ తమ టాపార్డర్ను మార్చిన సంగతి తెలిసిందే.ఆదిలోనే షాక్ఓపెనర్లుగా సాయి సుదర్శన్, కెప్టెన్ శుబ్మన్ గిల్ కొనసాగగా.. వన్డౌన్లో మాత్రం బట్లర్ను కాదని నిశాంత్ సింధును ఆడించారు. అయితే, సీజన్ ఆసాంతం ఆకట్టుకున్న సాయి ఫైనల్లో 12, గిల్ 10 పరుగులే చేయడంతో గుజరాత్కు ఆదిలోనే షాక్ తగిలింది.ఇలాంటి తరుణంలో అన్క్యాప్డ్ నిశాంత్ సింధు మూడో స్థానంలో వచ్చి 18 బంతుల్లో 20 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ నాలుగో నంబర్ బ్యాటర్గా బరిలోకి దిగి 23 బంతుల్లో 19 పరుగులే చేసి నిష్క్రమించాడు.ఈ నేపథ్యంలో స్టువర్ట్ బ్రాడ్ గుజరాత్ జట్టు యాజమాన్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ యూట్యూబ్ చానెల్తో మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీ ఆసాంత బట్లర్ మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. కానీ ఫైనల్లో అనూహ్య రీతిలో అతడిని నాలుగో స్థానానికి మార్చారు.నాకైతే అర్థం కావడం లేదుఅసలు ఫైనల్లో.. అది కూడా ముందుగా బ్యాటింగ్ చేస్తూ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఏబీ డివిలియర్స్ సైతం దీనిని ఆత్మరక్షణ ధోరణిగానే అభివర్ణించాడు.ఇక ఈ సీజన్లో ఓపెనర్లు గిల్, సాయి చెరో 700కు పైగా పరుగులు సాధించారు. ఓపెనర్లు ఇంత నిలకడగా రాణించడం మంచిదే. అదే సమయంలో ఇలాంటి ప్రదర్శనల వల్ల మిడిలార్డర్ను పరీక్షించేందుకు వీలుకాదు. ఇద్దరు ఓపెనర్లు విఫలం కాగానే..ఒత్తిడిలో వారు ఎలా రాణిస్తారో తెలియదు. టైటిల్ పోరులో ఇద్దరు ఓపెనర్లు విఫలం కాగానే.. మిగతా వాళ్లు కూడా పెవిలియన్కు క్యూ కట్టేశారు’’ అని స్టువర్ట్ బ్రాడ్ విమర్శించాడు.బహుశా అందుకేనేమో!ఇక ఇదే షోలో ఇంగ్లండ్ మరో మాజీ ఆటగాడు స్టీవెన్ ఫిన్స్పందిస్తూ.. ‘‘ఇంగ్లండ్ తరఫున చాలా ఏళ్ల పాటు ఓపెనర్గా ఆడిన అనుభవం బట్లర్కు ఉంది. అలాంటిది అతడిని డిమోట్ చేయడం ఆశ్చర్యకరంగా అనిపించింది.అయితే, పాత బడుతున్న కొద్దీ వికెట్ బ్యాటింగ్కు అనుకూలిస్తుందని గుజరాత్ నాయకత్వ బృందం భావించి ఉంటుంది. కాసేపు నిశాంత్ స్టాండింగ్ ఇస్తే బట్లర్ కుదురుకోగలడని అంచనా వేసి ఉంటుంది. కానీ అదేమీ జరుగలేదు’’ అని పేర్కొన్నాడు.కాగా గుజరాత్ టాపార్డర్ కుదేలు కాగా.. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అజేయ అర్ధ శతకం (50)తో రాణించాడు. ఫలితంగా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగలిగింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలో పూర్తి చేసి టైటిల్ విజేతగా నిలిచింది.చదవండి: ఈ ఐదుగురు తమ చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడేశారు?! -
ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా ఇవే తగ్గించుకో.. కోహ్లి
-
ఆ విషయంలో గిల్ తోపు.. రబాడ తక్కువేం కాదు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్లలో గుజరాత్ టైటాన్స్ ఒకటిగా నిలిచిపోనుంది. 2022 సీజన్ నుంచి స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆడిన నాలుగు సీజన్లలో మూడుసార్లు ఫైనల్ చేరడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. 2022లో చాంపియన్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ 2023లో రన్నరప్గా, 2024 సీజన్లో లీగ్ దశ, 2025 సీజన్లో ప్లేఆఫ్స్, తాజా సీజన్లో మరోసారి రన్నరప్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ను 5 వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్ అందుకుంది. అయితే రన్నరప్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్లో ఉత్తమ ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లకు రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ ఆడిన తుది జట్టు సహా మొత్తం 15 మందికి సంబంధించిన ఆటగాళ్ల రేటింగ్ను విడుదల చేశారు. 10 పాయింట్లతో కూడిన రేటింగ్లో జట్టును అంతా తానై నడిపించిన కెప్టెన్ శుబ్మన్ గిల్, బౌలర్ కగిసో రబాడ చెరో 9 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా, సాయి సుదర్శన్ (8 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. జాసన్ హోల్డర్, మహ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్లు ఏడేసి పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. ఇక వికెట్ కీపర్ జాస్ బట్లర్ 6.5 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా, వాషింగ్టన్ సుందర్, ప్రసిధ్ కృష్ణ చెరో 6 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. అశోక్ శర్మ, అర్షద్ ఖాన్లు చెరో 4 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా, 3 పాయింట్లతో రాహుల్ తెవాటియా ఏడో స్థానంలో నిలిచాడు.ఈ సీజన్లో ద్దగా ప్రభావం చూపని గ్లెన్ ఫిలిప్స్ (2 పాయింట్లు), షారుక్ ఖాన్, నిషాంత్ సింధూ ఒక్కో పాయింట్తో ఆఖరి స్థానాల్లో ఉన్నారు. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్ల్లో 9 విజయాలతో పట్టికలో రెండో స్థానంలో నిలిచిన గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది. అయితే క్వాలిఫయర్-2లో రాజస్తాన్ను చిత్తు చేసిన గుజరాత్ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే ఫైనల్లో ఆర్సీబీ చేతిలో చతికిలపడిన గుజరాత్ రన్నరప్కు పరిమితమైంది.చదవండి: 'కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ అయిపోలేదు!' -
ఫైనల్లో ఓటమి అనంతరం గిల్ విశ్లేషణ
నిన్న (మే 31) జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీ చేతిలో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో గుజరాత్ ఆర్సీబీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. తొలుత బ్యాటింగ్లో సాధారణ స్కోర్కు (155-8) పరిమితమై, ఆతర్వాత దాన్ని కాపాడుకోవడంలో దారుణంగా విఫలమైంది. విరాట్ కోహ్లి (75 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు.సీజన్ ఆధ్యాంతం గుజరాత్ విజయాల్లో ప్రధానపాత్ర పోషించిన బౌలర్లు తుది సమరంలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. 9వ ఓవర్లో రషీద్ ఖాన్ రెండు వికెట్లు (రజత్, కృనాల్) తీయడం మినహా, మిగతా బౌలర్లు చేసిందేమీ లేదు. కాస్త పొదుపుగా బౌలింగ్ చేయగలిగినా, స్కోర్ మరీ చిన్నది కావడంతో కాపాడుకోలేకపోయారు. మ్యాచ్ అనంతరం గుజరాత్ సారధి శుభ్మన్ గిల్ విశ్లేషణ ఇలా ఉంది. "180-190 పరుగులు చేసుంటే, మ్యాచ్ మరింత పోటీగా ఉండేది. పిచ్ పూర్తిగా స్లోగా లేదు. ఆరంభ ఓవర్లలో మాత్రం పేసర్లకు కొంత సహకారం లభించింది.ఆదిలోనే వికెట్లు కోల్పోవడం జట్టు మోమెంటంను దెబ్బతీసింది. మధ్య ఓవర్లలో వేగంగా పరుగులు చేయలేకపోవడం కష్టాలను అధికం చేసింది. ఫైనల్ మ్యాచ్ కావడంతో 150-160 పరుగులు చేసినా, పవర్ప్లేలో రెండు-మూడు వికెట్లు తీసుంటే పోటీలో ఉండేవాళ్లం.టార్గెట్ను కాపాడుకునే క్రమంలో పవర్ప్లేలో 15-20 పరుగులు ఎక్కువగా ఇచ్చేశాము. ఆ దశలో ప్రత్యర్థిని 50-55 పరుగులకు కట్టడి చేసి ఉంటే మ్యాచ్ మరోలా ఉండేది.సీజన్ మొత్తాన్ని పరిశీలిస్తే, మా బౌలింగ్ యూనిట్ అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచింది. తొలి రెండు మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత కూడా జట్టు వెనక్కి తగ్గకుండా, చిన్నచిన్న అంశాల్లో మెరుగుపడుతూ బలంగా తిరిగి వచ్చింది.తుది మెట్టుపై ట్రోఫీ చేజారినా ఈ సీజన్ చాలా సంతృప్తినిచ్చింది. గెలిచినా, ఓడినా మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు ఎప్పుడూ ఉంటాయి. జట్టుగా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అంశాలపై దృష్టి పెడతాము" -
కోహ్లీ వీరవిహారం.. చాంపియన్స్గా ఆర్సీబీ
ఐపీఎల్ 2026 చాంపియన్గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చేజింగ్ మాస్టర్గా పేరు పొందిన విరాట్ కోహ్లీ ఆఖరి దాకా నిలిచి ఆర్సీబీని గెలిపించాడు. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 75 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్ (16 బంతుల్లో 32), టిమ్ డేవిడ్ (17 బంతుల్లో 24 పరుగులు) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్, రబాడ, అర్షద్ ఖాన్ తలా వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (50 నాటౌట్), నిషాంత్ సిందూ (20 పరుగులు) ఆడుతున్నారు. రసిక్ సలామ్ 3 వికెట్లు తీయగా, హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ చెరో 2 వికెట్లు తీశాడు.కోహ్లీ కమాల్..156 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. వెంకటేశ్ అయ్యర్, కోహ్లీలు కలిసి తొలి వికెట్కు 4.3 ఓవర్లలో 62 పరుగులు జోడించి మంచి పునాది వేశారు. ఈ దశలో పడిక్కల్, పాటీదార్లు రషీద్ఖాన్ బౌలింగ్లో వెనువెంటనే ఔట్ కావడంతో ఆర్సీబీ శిబిరంలో ఆందోళన నెలకొన్నప్పటికీ కోహ్లీ నిలకడగా ఆడి జట్టును విజయం దిశగా నడిపించాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ ఔటైనప్పటికీ జితేశ్ శర్మ (11 నాటౌట్)తో కలిసి కోహ్లీ ఆర్సీబీని గెలిపించి వరుసగా రెండో కప్పును అందించాడు.ఆర్సీబీ అరుదైన ఫీట్ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఒక అరుదైన ఫీట్ సాధించింది. వరుసగా రెండు సీజన్లలో టైటిల్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ రికార్డులకెక్కింది. గతంలో చెన్నై సూపర్కింగ్స్ (2010, 2011), ముంబై ఇండియన్స్ (2019, 2020) ఈ ఫీట్ను సాధించాయి.Finishing off in style 🥳And it's none other than King Kohli 😎👑Scorecard ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/FZNGQ26gBs— IndianPremierLeague (@IPL) May 31, 2026 -
'కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ అయిపోలేదు!'
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఫైనల్లో ఇప్పటికైతే ఆర్సీబీదే పైచేయిగా ఉంది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతున్న గుజరాత్ టైటాన్స్ సాధారణ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. అయితే గుజరాత్ వికెట్లు పడిన ప్రతీసారి కోహ్లీ హైపర్ యాక్టివ్గా కనిపించాడు. ముఖ్యంగా గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ వికెట్లు పడ్డప్పుడు కోహ్లీ ఇచ్చిన రియాక్షన్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హాజిల్వుడ్ బౌలింగ్లో గిల్ ఔటైన వెంటనే పిచ్పైకి పరిగెత్తుకొచ్చిన కోహ్లి గిల్వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకోవడం కనిపించింది. అంతటితో ఆగకుండా సాయి సుదర్శన్ ఔట్ కావడానికి ముందు కోహ్లీ శ్రుతి మించిపోయాడు. హాజిల్వుడ్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లు ప్రతీ బంతికి ముందు కోహ్లీ సాయి సుదర్శన్ను టార్గెట్ చేస్తూ ఏదో ఒక మాట అనడం స్టంప్ మైక్లో రికార్డయింది. అదే ఓవర్ నాలుగో బంతికి సాయి సుదర్శన్ భారీ షాట్కు యత్నించి జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే కోహ్లీ చర్యలపై గుజరాత్ టైటాన్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ ఇంకా అయిపోలేదు. అని కామెంట్లు పెడుతున్నారు.మరో విషయమేంటంటే.. గత రెండు మ్యాచ్ల్లో హిట్ వికెట్గా వెనుదిరిగిన సాయి సుదర్శన్ ఈ మ్యాచ్లోనూ అలా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. హాజిల్వుడ్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్ రెండో బంతిని ఆడే క్రమంలో బ్యాట్ అతని చేతి నుంచి జారిపోయేలా కనిపించినప్పటికీ ఈసారి మాత్రం అలా జరగలేదు. ఇక మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాష్టింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. రసిక్ సలామ్ మూడు వికెట్లు తీయగా, హాజిల్వుడ్, భువనేశ్వర్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు.pic.twitter.com/E5HLX9ALPr— crictalk (@crictalk7) May 31, 2026చదవండి: అయ్యో గుజరాత్.. సీన్ రివర్స్ అయ్యేలా ఉందే! -
అయ్యో గుజరాత్.. సీన్ రివర్స్ అయ్యేలా ఉందే!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పూర్తిగా తడబడుతోంది. ఆదిలోనే ఓపెనర్లిద్దరి వికెట్లను కోల్పోయిన గుజరాత్ కష్టాల్లో పడింది. అయితే హోంగ్రౌండ్లో గుజరాత్ టైటాన్స్కు మంచి రికార్డే ఉంది. టాస్ ఓడినా, గెలిచినా 2025 నుంచి చూసుకుంటే అప్పటినుంచి గుజరాత్ టైటాన్స్ ఐదు మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ ఐదు మ్యాచ్ల్లోనూ గుజరాత్ విజయాలను సాధించింది. ఇందులో ముంబై ఇండియన్స్పై 36 పరుగులతో, రాజస్తాన్పై 58 పరుగులతో, ఎస్ఆర్హెచ్పై 38 పరుగులతో, ఎస్ఆర్హెచ్పై 82 పరుగులతో, సీఎస్కేపై 89 పరుగులతో విజయాలను అందుకుంది. అయితే ఈసారి జరుగుతున్న ఫైనల్లో మాత్రం గుజరాత్ టైటాన్స్కు సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తుంది. పైగా టాస్ సమయంలో గిల్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా అనిపించాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ పటీదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అహ్మదాబాద్ పిచ్పై చేజింగ్ చేసిన జట్టే ఎక్కువ విజయాలు అందుకుంది. అయితే గిల్ మాత్రం తాను టాస్ గెలిచి ఉంటే బ్యాటింగ్ ఎంచుకునేవాడినని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు తొలుత బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ గుజరాత్ ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కోలేకపోతుంది. 8 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 2 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. నిషాంత్ సిందూ (20), జాస్ బట్లర్ (10) పరుగులతో ఆడుతున్నారు.🚨 Toss Update from the FINAL 🚨@RCBTweets have won the toss & will bowl first against @gujarat_titans in Ahmedabad.Updates ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/kgrF0LJ0gQ— IndianPremierLeague (@IPL) May 31, 2026చదవండి: చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడీ -
‘అతడు మూడు ఓవర్లు వేశాడంటే ఆర్సీబీ ఓటమి ఖాయం’
డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈసారీ కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది. ఐపీఎల్-2026 సీజన్ ఆది నుంచి ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న పాటిదార్ సేన.. టేబుల్ టాపర్గా, తొలి ఫైనలిస్టుగా నిలిచింది.ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్తో ఆదివారం నాటి టైటిల్ పోరుకూ పూర్తిస్థాయిలో సన్నద్ధమైన ఆర్సీబీ.. ఆఖరి గండాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా తాజా ఎడిషన్లోనూ ఆర్సీబీ బౌలింగ్ దళం అదరగొడుతున్న సంగతి తెలిసిందే.పటిష్టంగా పేస్ దళంటీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇప్పటికి 26 వికెట్లతో సత్తా చాటగా.. యువ ఆటగాడు రసిఖ్ దర్ సైతం 16 వికెట్లు కూల్చాడు. మిగిలిన వారిలో కృనాల్ పాండ్యా, జట్టుతో ఆలస్యంగా చేరిన జోష్ హాజిల్వుడ్ చెరో 13 వికెట్లతో ఉన్నారు. వీరికి తోడుగా సూయశ్ శర్మ (9), జేకబ్ డఫీ (9) కూడా రాణిస్తున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ బెంగళూరు జట్టు నాయకత్వ బృందానికి కీలక సూచన చేశాడు. గుజరాత్తో ఫైనల్లో రొమారియో షెఫర్డ్ చేతికి మాత్రం బంతిని ఇవ్వొద్దని సూచించాడు. అదే విధంగా ఫిల్ సాల్ట్ తిరిగి వచ్చినా వెంకటేశ్ అయ్యర్నే ఓపెనర్గా కొనసాగించాలని చిక్కా పేర్కొన్నాడు.అతడినే ఓపెనర్గా కొనసాగించాలిఈ మేరకు.. ‘‘ఫిల్ సాల్ట్ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించాడా? లేదా? అన్న అంశంపై స్పష్టత లేదు. ఒకవేళ అతడు ఫిట్గా ఉన్నా వెంకటేశ్ అయ్యర్ బాగా ఆడుతున్నాడు కాబట్టి అతడినే ఓపెనర్గా కొనసాగిస్తే మంచిది.అతడు 3 ఓవర్లు వేశాంటే ఆర్సీబీ ఖేల్ ఖతమేఇక బౌలింగ్ విషయానికొస్తే... ఒకవేళ రొమారియో షెఫర్డ్తో కనీసం మూడు ఓవర్లు బౌలింగ్ చేయించినా సరే ఆర్సీబీ ఓడిపోవడం లాంఛనమే. అతడు కచ్చితంగా మూడు ఓవర్లు వేశాంటే ఆర్సీబీ ఖేల్ ఖతమే.PC: BCCIషెఫర్డ్ చేతికి అస్సలు బంతిని ఇవ్వకండి. నన్నడిగితే అతడికి తుదిజట్టులో కూడా చోటు ఇవ్వకండి’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. కాగా వెస్టిండీస్ ఆల్రౌండర్ రొమారియో షెఫర్డ్ గతేడాది కప్పు గెలిచిన ఆర్సీబీ జట్టులో సభ్యుడు.పేలవ ప్రదర్శనఈ క్రమంలో తాజా ఎడిషన్కు కూడా ఆర్సీబీ షెఫర్డ్ను అట్టిపెట్టుకుంది. ఇక ఈ సీజన్లో అతడు.. ఇప్పటికి 14 మ్యాచ్లలో కలిపి సగటు 42, ఎకానమీ 12తో చెత్తగా బౌలింగ్ చేసి.. ఏడు వికెట్లు తీయగలిగాడు. ఇక బ్యాటర్గా 14 మ్యాచ్లలో కలిపి కేవలం 83 పరుగులే రాబట్టాడు. చివరగా గుజరాత్తో క్వాలిఫయర్-1లో షెఫర్డ్ ఒక ఓవర్ వేసి 15 పరుగులు ఇచ్చుకున్నాడు.ఐపీఎల్-2026 ఫైనల్.. ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ తుది జట్లు (అంచనా) ఆర్సీబీ: రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్/ వెంకటేశ్ అయ్యర్, దేవ్దత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్, రసిఖ్ దర్, జేకబ్ డఫీ/ సుయశ్ శర్మ గుజరాత్: శుబ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సంధు, జేసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, సాయికిషోర్. చదవండి: కెప్టెన్ రేసు.. ఆ ముగ్గురిని ఎంపిక చేసిన బీసీసీఐ! -
సామ్రాజ్యాన్ని కూల్చేసిన గిల్-సుదర్శన్..!
-
గిల్ విశ్వరూపం... IPL 2026 ఫైనలు గుజరాత్
-
వైభవ్కు షాకిచ్చి.. రికార్డుల మోత మోగించిన గిల్
గుజరాత్ టైటాన్స్ ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ఫైనల్కు చేరింది. తమ అరంగేట్ర సీజన్ 2022లో ఏకంగా చాంపియన్గా నిలిచిన టైటాన్స్.. 2023లో రన్నరప్తో సరిపెట్టుకుంది. తాజాగా ఐపీఎల్-2026లో ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించిన గుజరాత్ జట్టు.. క్వాలిఫయర్-2లో జయభేరి మోగించింది.రాజస్తాన్ రాయల్స్తో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్కు దూసుకువెళ్లింది. ముల్లన్పూర్లో రాయల్స్ విధించిన 215 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే గుజరాత్ ఊదేసింది. తద్వారా ఆర్సీబీతో ఆదివారం నాటి టైటిల్ పోరుకు అర్హత సాదించింది. 47 బంతుల్లోనేఇక ఈ విజయంలో ఓపెనర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill)ది కీలక పాత్ర. రాజస్తాన్తో మ్యాచ్లో కేవలం 47 బంతుల్లోనే అతడు శతక్కొట్టాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 104 పరుగులు సాధించాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోవడంతో గిల్ మెరుపు ఇన్నింగ్స్కు తెరపడింది.ఏదేమైనా క్వాలిఫయర్-2లో అద్భుత శతకంతో రాణించి జట్టును గెలిపించిన గిల్.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. కాగా అతడికి ఐపీఎల్లో ఇది ఐదో సెంచరీ. ఈ మ్యాచ్ సందర్భంగా గిల్ సాధించిన రికార్డులు ఇవీ..A 1️⃣0️⃣0️⃣ of the highest quality! 🤩🔥👏GT skipper #ShubmanGill brings up a sensational century and what an occasion to deliver this masterclass! ❤️🙌#TATAIPL Qualifier 2 👉 #GTvRR | LIVE NOW 👉https://t.co/pv6LOaRl1f pic.twitter.com/wEbwNXzply— Star Sports (@StarSportsIndia) May 29, 2026ఐపీఎల్లో అత్యధిక శతకాల వీరుల జాబితాలో..👉విరాట్ కోహ్లి- 9 శతకాలు👉జోస్ బట్లర్- 7 శతకాలు👉క్రిస్ గేల్, కేఎల్ రాహుల్- 6 శతకాలు👉సంజూ శాంసన్, శుబ్మన్ గిల్- 5 శతకాలు👉డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్- 4 శతకాలుగుజరాత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలు👉శుబ్మన్ గిల్- 47 బంతుల్లో 2026లో రాజస్తాన్పై👉శుబ్మన్ గిల్- 49 బంతుల్లో 2023లో ముంబైపై👉శుబ్మన్ గిల్- 50 బంతుల్లో 2024లో చెన్నైపై👉సాయి సుదర్శన్- 50 బంతుల్లో 2024లో చెన్నైపైఐపీఎల్లో కెప్టెన్గా అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్లు👉విరాట్ కోహ్లి- 5👉కేఎల్ రాహుల్- 3👉శుబ్మన్ గిల్- 2.కాగా గుజరాత్తో మ్యాచ్లోనూ రాజస్తాన్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడాడు. 47 బంతులలో 96 పరుగులు చేశాడు. అయితే, గిల్ సెంచరీతో చెలరేగి అతడి ఇన్నింగ్స్కు విలువ లేకుండా చేసి పడేశాడు.చదవండి: మేము ఇక్కడిదాకా రావటమే గొప్ప: రియాన్ పరాగ్ -
గుజరాత్ ఘనంగా ఫైనల్కు
ఐపీఎల్లో ఫైనల్ చేరేందుకు రెండో క్వాలిఫయర్లో గుజరాత్ విజయలక్ష్యం 215 పరుగులు... కానీ నాకౌట్ మ్యాచ్లోనూ ఒత్తిడి లేకుండా శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్ జోడీ తమ ఆటతో దీనిని చాలా చిన్నదిగా మార్చేశారు. విధ్వంసక ప్రదర్శన లేకుండానే తమదైన శైలిలో ఓపెనర్లు 77 బంతుల్లోనే 167 పరుగులు జోడించడంతో టైటాన్స్ ఫైనల్ చేరడం లాంఛనంగా మారిపోయింది. కీలక పోరులో రాజస్తాన్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. అంతకుముందు మరోసారి సెంచరీ చేజారినా... వైభవ్ సూర్యవంశీ తుఫాన్ బ్యాటింగ్తోనే రాయల్స్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది. తమ సొంతగడ్డపై ఫైనల్ ఆడనున్న గుజరాత్... తుది పోరులో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించి రెండోసారి టైటిల్ సాధిస్తుందా చూడాలి. న్యూ చండీగఢ్: మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ మూడోసారి ఐపీఎల్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్–2లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ (47 బంతుల్లో 96; 8 ఫోర్లు, 7 సిక్స్లు) వరుసగా రెండో మ్యాచ్లోనూ సెంచరీ అవకాశం కోల్పోయాడు. రవీంద్ర జడేజా (35 బంతుల్లో 45 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, డొనొవాన్ ఫెరీరా (11 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్లు) చివర్లో చెలరేగాడు. అనంతరం గుజరాత్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 219 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’కెప్టెన్ శుబ్మన్ గిల్ (53 బంతుల్లో 104; 15 ఫోర్లు, 3 సిక్స్లు) ఐపీఎల్లో ఐదో సెంచరీతో చెలరేగగా... సాయి సుదర్శన్ (32 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. రేపు అహ్మదాబాద్లో జరిగే ఫైనల్లో బెంగళూరుతో గుజరాత్ తలపడుతుంది. వైభవ్ దూకుడు... గత మ్యాచ్లతో పోలిస్తే వైభవ్ ఈసారి కాస్త ఓపికను ప్రదర్శించాడు. తొలి ఓవర్లోనే జైస్వాల్ (1), తర్వాతి ఓవర్లో ధ్రువ్ జురేల్ (7) వెనుదిరగడం కూడా అందుకు కారణం. సిరాజ్ ఓవర్లో 3 ఫోర్లు బాదిన వైభవ్ 14వ బంతికిగానీ తన తొలి సిక్స్ కొట్టలేదు. అయితే నాలుగో స్థానంలో వచి్చన జడేజా చకచకా పరుగులు రాబట్టాడు. ప్రసిధ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను 19 బంతుల్లోనే 34 పరుగులకు చేరుకున్నాడు. అయితే మోచేతి గాయంతో రిటైర్డ్హర్ట్గా తప్పుకోగా, ఆ తర్వాత రాజస్తాన్ ఇన్నింగ్స్ తడబడింది. జడేజా మళ్లీ క్రీజ్లోకి వచి్చనా తర్వాతి 14 బంతుల్లో 11 పరుగులే చేయగలిగాడు. మరోవైపు 46 పరుగుల వద్ద సుదర్శన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన వైభవ్ 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని కెరీర్లో ఇదే అది నెమ్మదైన అర్ధ సెంచరీ! హాఫ్ సెంచరీ తర్వాత దూకుడు చూపించిన వైభవ్ తర్వాత ఆడిన 15 బంతుల్లో చెలరేగి 2 ఫోర్లు, 5 సిక్స్లతో 96కు చేరుకున్నాడు. ఈసారైనా సెంచరీ ఖాయం అనుకోగా... మళ్లీ సరిగ్గా గత మ్యాచ్ తరహాలోనే ర్యాంప్ షాట్ ఆడబోయి మరోసారి షార్ట్ థర్డ్మాన్లోకి క్యాచ్ ఇచ్చాడు. అయితే రషీద్ వేసిన చివరి ఓవర్లో రెచి్చపోయిన ఫెరీరా 4 సిక్స్లు బాదడంతో మొత్తం 27 పరుగులు లభించాయి. పరుగుల జుగల్బందీ... ఛేదనలో గుజరాత్ అలవోకగా దూసుకుపోయింది. రాయల్స్ పేలవ బౌలింగ్తో సుదర్శన్, గిల్ ఎలాంటి శ్రమ లేకుండా ఒకరితో మరొకరు పోటీ పడుతూ సునాయాసంగా పరుగులు రాబట్టారు. ఆర్చర్ వేసిన తొలి ఓవర్లో ఇద్దరూ చెరో 2 ఫోర్లతో మొదలు పెట్టగా, పవర్ప్లేలో జట్టు 10 ఫోర్లు సహా 69 పరుగులు రాబట్టింది. సుదర్శన్ 14 వద్ద ఉన్నప్పుడు ఫెరీరా, షనక సమన్వయ లోపంతో క్యాచ్ వదిలేయడం కూడా గుజరాత్కు కలిసొచి్చంది. ఆపై తుషార్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టి 30 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరిన గిల్... జడేజా ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్ కొట్టాడు. అనంతరం 26 బంతుల్లోనే సుదర్శన్ అర్ధ సెంచరీ కూడా పూర్తయింది. ఎట్టకేలకు 13వ ఓవర్లో సుదర్శన్ ‘హిట్ వికెట్’తో ఈ భారీ భాగస్వామ్యానికి తెర పడింది. సుదర్శన్ వరుసగా రెండో మ్యాచ్లోనూ అనూహ్యంగా ఒకే తరహాలో అవుట్ కావడం విశేషం. 47 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న గిల్, సుందర్ (16) తక్కువ వ్యవధిలో అవుటైనా... తెవాటియా (17 నాటౌట్), బట్లర్ (9 నాటౌట్) కలిసి ఆటను ముగించారు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) ప్రసిధ్ (బి) సిరాజ్ 1; వైభవ్ (సి) ప్రసిధ్ (బి) రబాడ 96; జురేల్ (సి) గిల్ (బి) రబాడ 7; జడేజా (నాటౌట్) 45; పరాగ్ (సి) రబాడ (బి) హోల్డర్ 11; షనక (సి) బట్లర్ (బి) హోల్డర్ 3; ఆర్చర్ (సి) బట్లర్ (బి) ప్రసిధ్ 7; ఫెరీరా (నాటౌట్) 38; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 214. వికెట్ల పతనం: 1–2, 2–9, 3–101, 4–109, 5–118, 6–172. బౌలింగ్: సిరాజ్ 4–0–42–1, రబాడ 4–0–35–2, ప్రసిధ్ 4–0–42–1, సుందర్ 2–0–23–0, హోల్డర్ 4–0–27–2, రషీద్ 2–0–45–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (హిట్ వికెట్) (బి) బ్రిజేశ్ 58; గిల్ (ఎల్బీ) (బి) ఆర్చర్ 104; బట్లర్ (నాటౌట్) 9; సుందర్ (సి) ఫెరీరా (బి) బర్గర్ 16; తెవాటియా (నాటౌట్) 17; ఎక్స్ట్రాలు 15; మొత్తం (18.4 ఓవర్లలో 3 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–167, 2–182, 3–201. బౌలింగ్: ఆర్చర్ 4–0–45–1, బర్గర్ 4–0–35–1, బ్రిజేశ్ 3.4–0–44–1, తుషార్ 3–0–34–0, యశ్రాజ్ 2–0–29–0, జడేజా 2–0–28–0. టాస్ గందరగోళం... మ్యాచ్కు ముందు టాస్ సమయంలో జరిగిన ఘటన తీవ్ర చర్చకు కారణమైంది. గిల్ నాణెం విసరగా, పరాగ్ ‘హెడ్స్’ చెప్పాడు. అయితే నాణెం కింద పడిన తర్వాత దానిని స్పష్టంగా చూపించకుండా రిఫరీ ప్రకాశ్ భట్ తాను ‘సరిగా వినలేదని’... టాస్ మళ్లీ వేయమని కోరాడు. దాంతో మళ్లీ నాణెం విసరగా, ఈసారి పరాగ్ టాస్ నెగ్గాడు. దాంతో గిల్ తన అసంతృప్తిని ప్రదర్శించాడు. గత మ్యాచ్లో వాడిన పిచ్ కాబట్టి తాను కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాడినని, అయితే దురదృష్టవశాత్తూ రిఫరీ సరిగా వినలేదని అతను వ్యాఖ్యానించాడు. మ్యాచ్లో టైటాన్స్ ఓడి ఉంటే ఇది కూడా పెద్ద వివాదానికి కారణమయ్యేదేమో. -
క్వాలిఫయర్ 2లో 'టాస్' డ్రామా.. పాపం శుబ్మన్ గిల్
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ క్వాలిఫయర్-2 మ్యాచ్ టాస్ సమయంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. టాస్ కోసం గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్, రాజస్తాన్ సారథి రియాన్ పరాగ్ మైదానంలోకి వచ్చారు. టాస్ ప్రెజెంటేర్ రవిశాస్త్రి వ్యవహరించగా.. మ్యాచ్ రిఫరీగా ప్రకాష్ భట్ ఉన్నారు. అయితే టాస్ టైమ్లో శుభ్మన్ గిల్ కాయిన్ గాల్లోకి విసిరాడు.రియాన్ పరాగ్ 'హెడ్స్' అని కాల్ చేశాడు. కానీ కాయిన్ కింద పడ్డాక 'టెయిల్స్' వచ్చింది. దీంతో టాస్ గెలిచానని గిల్ సంబరపడ్డాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. రియాన్ పరాగ్ చేసిన కాల్ తనకు సరిగ్గా వినపడలేదని మ్యాచ్ రిఫరీ ప్రకాష్ భట్ ప్రకటించారు. దీంతో మొదటి వేసిన టాస్ను రద్దు చేసి, రెండో సారి టాస్ వేయాల్సి వచ్చింది. రెండోసారి గిల్ కాయిన్ను విసరగా.. రియాన్ పరాగ్ గట్టిగా 'హెడ్స్' అని పిలిచాడు.ఈసారి కాయిన్ హెడ్స్ పడటంతో రాజస్తాన్ టాస్ గెలిచింది. పరాగ్ వెంటనే ఏమి ఆలోచించకుండా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఇక్కడ గిల్ కూడా టాస్ గెలిచి ఉంటే బ్యాటింగ్ ఎంచుకునేవాడని చెప్పడం కొసమెరుపు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కావాలనే గుజరాత్కు అన్యాయం చేశారని కామెంట్లు పెడుతున్నారు.చదవండి: రిషబ్ పంత్ సంచలన నిర్ణయంToss clip 🔥SCAM?? MISTAKE??FIXED??? OR WOTTT??? 🙊 #GTvsRR pic.twitter.com/atQe43C6Mm— CHICO (@CHICOx58) May 29, 2026 -
కోహ్లీకి షాక్.. వైభవ్ సూర్యవంశీకి చోటు!
ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరి దశకు చేరుకుంది. ఇవాళ్టి నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్లు జరగనున్నాయి. క్వాలిఫయర్-1 పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. అయితే సీజన్ ముగియకముందే మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ తన బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ జట్టును ప్రకటించాడు. అయితే ఈ జట్టులో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఊహించినట్లుగానే రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి స్థానం దక్కింది. ఓపెనింగ్లో వైభవ్కు జంటగా గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్ను ఎంపిక చేసిన బద్రీనాథ్ కీలకమైన మూడో స్థానానికి కోహ్లీని కాదని ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్కు చోటు కల్పించాడు.మిడిలార్డర్లో హెన్రిచ్ క్లాసెన్ (ఎస్ఆర్హెచ్), రజత్ పటీదార్ (ఆర్సీబీ), ఆల్రౌండర్ స్థానానికి కృనాల్ పాండ్యా (ఆర్సీబీ)ని ఎంపిక చేశాడు. జట్టులో ఏకైక స్పిన్నర్గా కేకేఆర్కు చెందిన సునీల్ నరైన్కు చోటు కల్పించిన బద్రీనాథ్ పేస్ బౌలింగ్ విభాగంలో ఏకంగా ఐదుగురిని ఎంపిక చేయడం విశేషం. పర్పుల్ క్యాప్ రేసులో ఉన్న భువనేశ్వర్ కుమార్ (ఆర్సీబీ)తో పాటు జోఫ్రా ఆర్చర్ (రాజస్తాన్), కగిసో రబాడ (గుజరాత్ టైటాన్స్)లను ఎంచుకున్నాడు. మరో పేసర్ స్థానానికి యువ బౌలర్లు ప్రిన్స్ యాదవ్, కార్తిక్ త్యాగిలను ఎంపిక చేశాడు. ఇక విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్లోనూ 500 పరుగుల మార్క్ను దాటాడు. కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్ కూడా స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ జట్టులో చోటు దక్కలేదు. ఇక ఓపెనర్లుగా ఎంపికైన వైభవ్ సూర్యవంశీ (14 మ్యాచ్ల్లో 583 పరుగులు), శుబ్మన్ గిల్ (14 మ్యాచ్ల్లో 616 పరుగులు) సాధించారు. ఇక ఆర్సీబీకి కీలక బౌలర్గా ఉన్న భువనేశ్వర్ కుమార్, గుజరాత్కు చెందిన రబాడ చెరో 24 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.ఇక బద్రీనాథ్ టీమిండియా తరఫున రెండు టెస్టులు, ఏడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్లో 95 మ్యాచ్లాడిన బద్రీనాథ్ 1441 పరుగులు సాధించాడు.బద్రీనాథ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్:వైభవ్ సూర్యవంశీ, శుబ్మాన్ గిల్, సాయి సుదర్శన్, హెన్రిచ్ క్లాసెన్, రజత్ పటీదార్, కృనాల్ పాండ్యా, సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్, జోఫ్రా ఆర్చర్, కగిసో రబాడ, ప్రిన్స్ యాదవ్/కార్తీక్ త్యాగి.చదవండి: విండీస్తో సిరీస్.. లంక జట్టుకు కొత్త కెప్టెన్! -
క్వాలిఫయర్-1 పోరు.. ఫైనల్ అడుగు ఎవరిది?
ఐపీఎల్లో అసలు సమరానికి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్, మాజీ చాంపియన్ జట్లు మరో టైటిల్ వేటలో ముందుగా ఫైనల్లోకి అడుగు పెట్టేందుకు సై అంటున్నాయి. చెరో 9 విజయాలతో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన బెంగళూరు, గుజరాత్ టీమ్ల మధ్య మ్యాచ్ తొలి క్వాలిఫయర్ విజేత నేరుగా తుది పోరుకు అర్హత సాధించే అవకాశం ఉండగా... ఓడిన జట్టు నిష్క్రమించకుండా రెండో క్వాలిఫయర్లో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ ఏడాది లీగ్ దశ రెండు ముఖాముఖి మ్యాచ్ల్లో ఇరు జట్లు చెరో విజయంతో సమంగా నిలిచాయి. ధర్మశాల: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి క్వాలిఫయర్–1 ద్వారా నేరుగా ఫైనల్కు చేరుతుందా? గత సీజన్లో ఎలిమినేటర్లో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న గుజరాత్ టైటాన్స్ మూడేళ్ల తర్వాత మరోసారి తుది పోరుకు అర్హత సాధిస్తుందా? ఈ రెండు మేటి జట్ల మధ్య మరికొన్ని గంటల్లో జరిగే సమరంలో పైచేయి ఎవరిదో తేలనుంది. టోర్నీ ఆసాంతం బెంగళూరు కీలక సమరాల్లో ఆధిక్యాన్ని అందుకొని ముందంజ వేయగా... రెండో అర్ధ భాగంలో అసాధారణంగా రాణించి గుజరాత్ దూసుకొచ్చింది. ఐపీఎల్లో ఇరు జట్లు ‘ప్లే ఆఫ్స్’లో తలపడటం ఇదే మొదటిసారి కావడం విశేషం కాగా... ఓవరాల్గా ముఖాముఖి పోరులో రెండు జట్లు 4–4తో సమానంగా ఉన్నాయి. ఆద్యంతం నిలకడగా..వరుసగా రెండో సీజన్లో టాప్–2తో ముగించడం బెంగళూరు నిలకడను చూపిస్తోంది. టోర్నీ తొలి అర్ధభాగంలో ఐదు మ్యాచ్లు గెలిచిన జట్టు రెండో అర్ధభాగంలో నాలుగు విజయాలు సాధించింది. ఈ సీజన్లో అతి తక్కువ మంది ఆటగాళ్లను ఉపయోగించిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. అంటే టీమ్ ఎంత స్థిరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లో కీలక ఆటగాళ్లంతా సత్తా చాటారు. వరుసగా నాలుగో సీజన్లో 500కు పైగా పరుగులు సాధించిన విరాట్ కోహ్లి (557) ముందుండి నడిపించగా... పడిక్కల్ (433), పాటీదార్ (393) తమ వంతు పాత్ర పోషించారు. ఒక సెంచరీ, 4 అర్ధసెంచరీలతో చెలరేగుతున్న కోహ్లిని తాజా ఫామ్లో నిలువరించడం అంత సులువు కాదు. బౌలింగ్లో భువనేశ్వర్ (24 వికెట్లు) టోరీ్నలో ఆర్సీబీకి విజయాలు అందిస్తూ అగ్ర స్థానంలో నిలిచాడు. హాజల్వుడ్, రసిఖ్ సలామ్లనుంచి అతనికి సరైన సహకారం లభించింది. ఇక ఆల్రౌండర్గా కృనాల్ పాండ్యా రాణిస్తున్నాడు. భిన్నమైన బౌలింగ్ శైలితో ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరిస్తున్న అతను... బ్యాటింగ్లో అవకాశం వచ్చిన ప్రతీసారి తన విలువను ప్రదర్శించాడు. టిమ్ డేవిడ్ కూడా కీలక ఇన్నింగ్స్లతో తన బాధ్యతను నెరవేర్చాడు. చివరి మ్యాచ్లో సన్రైజర్స్ చేతిలో దెబ్బతిన్నా... భువీ, హాజల్వుడ్ ఇచ్చే ఆరంభం మరోసారి ఆర్సీబీకి కీలకం కానుంది. స్వింగ్, సీమ్కు అనుకూలించే ధర్మశాల మైదానం వారి ప్రదర్శనకు సరైన వేదిక కాగలదు. పూర్తి ఫిట్గా ఉంటే కోహ్లికి తోడుగా ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ చేయడం ఖాయం. లేదంటే వెంకటేశ్ అయ్యర్నే కొనసాగిస్తారు. స్పిన్నర్ సుయాశ్ స్థానంలో పేసర్ డఫీని ఆడించే అంశాన్ని కూడా మేనేజ్మెంట్ పరిశీలిస్తోంది. టాప్–3 బ్యాటింగ్తోనే..గుజరాత్ జట్టు ధర్మశాలలో ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఇది కొంత ప్రతికూలమే అయినా... పదునైన పేస్ బౌలింగ్ బృందం ఆ లోటు కనపడనీయకుండా చేయగలదు. సిరాజ్, రబాడ అద్భుతంగా బౌలింగ్ చేస్తుండగా, అర్షద్ ఖాన్ కూడా నిలకడగా రాణించాడు. రబాడ కూడా 24 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, తక్కువ వికెట్లే (17) తీసినా... సిరాజ్ ఎంతో ప్రభావం చూపించాడు. ఆల్రౌండర్ హోల్డర్ పేస్ బౌలింగ్ కూడా జట్టుకు అదనపు బలంగా మారింది. రషీద్ ఖాన్ ఎప్పటిలాగే మరోసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తే బెంగళూరు మిడిలార్డర్ను కట్టడి చేయగలడు. గత మ్యాచ్లో ఆర్సీబీని గుజరాత్ ఓడించడంలో అతనిదే ప్రధాన (2/19) పాత్ర. పిచ్ పరిస్థితిని బట్టి ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిధ్ లేదా సాయికిషోర్లలో ఒకరికి చాన్స్ లభిస్తుంది. బ్యాటింగ్లో మరోసారి టైటాన్స్ టాప్–3పైనే ఆధారపడుతోంది. సాయిసుదర్శన్ (638), శుబ్మన్ గిల్ (616), జోస్ బట్లర్ (469) చెలరేగడంతోనే టైటాన్స్ ప్రస్థానం ప్లే ఆఫ్స్ వరకు చేరింది. వాషింగ్టన్ సుందర్ (303) కూడా నిలకడగా తన వంతు పాత్ర పోషించాడు.పిచ్, వాతావరణంభారీ స్కోర్లకు వేదిక ఇది. ఈ సీజన్లో ధర్మశాల మైదానంలో మూడు లీగ్ మ్యాచ్లు జరిగాయి. ఐదు ఇన్నింగ్స్లలో 200కు పైగా స్కోరు నమోదు కాగా, మరో ఇన్నింగ్స్లో 199 పరుగులు వచ్చాయి. డే మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ నెగ్గగా... సాయంత్రం జరిగిన రెండు మ్యాచ్లలో కూడా ఛేదన చేసిన టీమ్ విజయం సాధించింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ సమయంలో బ్యాట్ను తాకిన బంతి వాతావరణం కారణంగా చాలా వేగంగా దూసుకుపోవడం ఖాయం. పంజాబ్పై ముంబై గెలిచిన మ్యాచ్లో ఇది బాగా కనిపించింది. వర్షసూచన లేదు. The steepest climb of the season, but the view from the top is a spot in the Final! 🏔️Dharamshala is READY for the #Qualifier1 🏟️#TATAIPL | #TheFinalLeap | #RCBvGT | @RCBTweets | @gujarat_titans pic.twitter.com/sCdPkNMzyZ— IndianPremierLeague (@IPL) May 25, 2026 చదవండి: ఈ చిత్రం చూశారా.. వైభవ్ ఫ్యామిలీ మొత్తం ఒకేలా! -
BCCI: వరల్డ్కప్ ఓపెనర్ రేసులో ఊహించని పేరు!
భారత క్రికెట్లో సరికొత్త సంచలనం వైభవ్ సూర్యవంశీ. గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఈ బిహారీ పిల్లాడు.. ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో)తో దుమ్ములేపాడు. ఆ తర్వాత భారత అండర్-19 జట్టు తరఫున, వరల్డ్కప్-2025లో సత్తా చాటాడు.గాలివాటం కాదుప్రపంచకప్ ఫైనల్లో భారీ విధ్వంసకర శతకం (80 బంతుల్లో 175)తో రాణించిన వైభవ్.. భారత్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్-2026లోనూ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా దుమ్ములేపుతున్నాడు. పదమూడు మ్యాచ్లలో కలిపి 579 పరుగులు సాధించాడు. తద్వారా తన ప్రదర్శనలు గాలివాటం కాదని నిరూపించుకున్నాడు.భారత్-‘ఎ’ జట్టులో చోటుఈ నేపథ్యంలో పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే, బీసీసీఐ మాత్రం తొలుత అతడిని భారత్-‘ఎ’ జట్టులో ఆడించాలని నిర్ణయించింది. శ్రీలంకలో జరిగే ముక్కోణపు వన్డే సిరీస్కు అతడిని ఎంపిక చేసింది. లంక, అఫ్గన్ ‘ఎ’ జట్లతో తలపడే ఈ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్.రోహిత్కు గండంఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి ఇప్పటి నుంచే ఓపెనింగ్ జోడీపై టీమిండియా యాజమాన్యం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దిగ్గజ ఓపెనర్ రోహిత్ శర్మను ఫిట్నెస్ కారణాల దృష్ట్యా టోర్నీ నుంచి తప్పించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో కెప్టెన్ శుబ్మన్ గిల్కు జోడీగా ఇషాన్ కిషన్ను ఆడిస్తూ.. బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్ను ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇందుకు తగ్గట్లుగానే అఫ్గన్తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్కు ఇషాన్ ఎంపికయ్యాడు.జైసూ ఎదురుచూపులుఇక రోహిత్ శర్మ ఫిట్నెస్కు లోబడి.. ఈ సిరీస్లో ఆడతాడని బీసీసీఐ తెలిపింది. మరోవైపు.. అఫ్గన్తో ఏకైక టెస్టుకు ఎంపికైన యశస్వి జైస్వాల్ను వన్డేల నుంచి మాత్రం పక్కనపెట్టారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఓ వార్త సంచలనంగా మారింది.శ్రీలంకలో భారత్-‘ఎ’ జట్టు తరఫున గనుక నిలకడగా రాణిస్తే.. వన్డే వరల్డ్కప్-2027 నేపథ్యంలో వైభవ్ పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారన్నది దాని సారాంశం. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు క్రిక్బ్లాగర్తో మాట్లాడుతూ..ఫామ్ కొనసాగిస్తే వన్డే వరల్డ్కప్ జట్టులో చోటు‘‘వైభవ్ సూర్యవంశీ త్వరలోనే టీమిండియాకు ఆడబోతున్నాడు. భారత్-ఎ తరఫున అతడి ప్రదర్శనను బట్టి ఎంత త్వరగా జాతీయ జట్టులోకి వస్తాడన్నది తెలుస్తుంది. సెలక్టర్లు అతడి ఆట తీరును నిశితంగా గమనిస్తున్నారు. అతడు ఇలాగే నిలకడగా ఆడుతూ.. ఫామ్ కొనసాగిస్తే వన్డే వరల్డ్కప్-2027 ఆడే భారత జట్టులో చోటు దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అతడికి ఆకాశమే హద్దు’’ అని పేర్కొన్నాయి. కాగా ఒకవేళ 15 ఏళ్ల వైభవ్ గనుక ఊహించని రీతిలో ఈ జట్టులోకి వస్తే నిజంగా అదొక సంచలనమే అవుతుంది.చదవండి: ‘నేను పుట్టకముందు సచిన్ అరంగేట్రం.. ఆ రికార్డు బద్దలు కొడతా’ -
గుజరాత్ ఓపెనర్కు అశ్విన్ చురకలు!
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ నిలకడ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 14 మ్యాచ్లాడిన సాయి సుదర్శన్ 157 స్ట్రైక్రేట్తో 638 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో లీడింగ్లో కొనసాగుతున్నాడు. అయితే సాయి సుదర్శన్ ప్రదర్శన బాగానే ఉన్నప్పటికీ బ్యాటింగ్లో ఇంకా దూకుడు పెంచాల్సిన అవసరముందని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చురకలు అంటించాడు.ఐపీఎల్లో స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తున్నప్పటికీ ఆఖరి ఓవర్లలో వేగంగా పరుగులు రాబట్టడంలో సాయి సుదర్శన్ విఫలమవుతున్నాడని తెలిపాడు. అశ్విన్ మాట్లాడుతూ..'నేను శుబ్మన్ గిల్ బ్యాటింగ్ను ప్రశంసించాలనుకుంటున్నా. గుజరాత్ టైటా న్స్ను అటు కెప్టెన్గా సమర్థంగా నడిపిస్తూనే బ్యాటర్గా రాణిస్తున్నాడు. ముఖ్యంగా పవర్ప్లేలో గిల్ పట్టుదలతో భారీ ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. కానీ సాయి సుదర్శన్ ప్రదర్శన మెచ్చుకునే రీతిలో ఉన్నప్పటికీ మోడ్రన్ టీ20 క్రికెట్కు సరిపోయేలా అతడు ఆడడం లేదు. సాయి సుదర్శన్ ఎక్కువగా సంప్రదాయబద్ధంగానే క్రికెట్ ఆడతాడు, కానీ ఇన్నింగ్స్ చివర్లో వేగంగా ఆడలేకపోతున్నాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో బ్యాటింగ్లో వేగం పెంచితే మాత్రం సాయి సుదర్శన్కు తిరుగుండకపోవచ్చు. ఆరెంజ్ క్యాప్లో లీడింగ్లో ఉన్నప్పటికీ సాయి సుదర్శన్ తన ప్రదర్శనను చాలా మెరుగుపరుచుకోవాల్సి ఉంది. అతడు దీనిని చేయగలడని ఆశిస్తున్నా. ఇక గిల్ బాగా ఆడుతున్నప్పటికీ తనలోని పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీయలేదని నాకు అనిపిస్తోంది.' అంటూ చెప్పుకొచ్చాడు. గురువారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 89 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (84), కెప్టెన్ గిల్ (64) అర్థశతకాలతో రాణించారు. జాస్ బట్లర్ (57 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్కింగ్స్ 13.4 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. శివమ్ దూబే (47) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. మ్యాచ్లో ఓటమితో సీఎస్కే టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: ఆటగాళ్లకు అవమానం.. పాక్ జట్టులో సంక్షోభం! -
చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
ఐపీఎల్ 2026లో అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ సత్తాచాటాడు. ఈ మ్యాచ్లో గిల్ కేవలం 37 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్స్ర్లతో 64 పరుగులు చేశాడు. దీంతో ఈ ఏడాది సీజన్లో శుభ్మన్ 600 పరుగుల మైలు రాయిని దాటేశాడు. కెప్టెన్గా గిల్ ఒకే సీజన్లో 600 పరుగులను పూర్తి చేసుకోవడం ఇది రెండో సారి. ఈ క్రమంలో 26 ఏళ్ల గిల్ పలు అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గిల్ సాధించిన రికార్డులు ఇవే👉ఐపీఎల్ చరిత్రలో 27 ఏళ్ల వయస్సులోపు కెప్టెన్గా ఒకటి కంటే ఎక్కువ సీజన్లలో 600 ప్లస్ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా గిల్ నిలిచాడు. గతంలో ఆర్సీబీ కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లి 27 ఏళ్ల వయస్సు లోపు కేవలం ఒక్క సీజన్లో మాత్రం ఈ ఫీట్ సాధించాడు. తాజా మ్యాచ్తో కోహ్లిని గిల్ అధిగమించాడు.👉అదేవిధంగా వరుస సీజన్లలో కెప్టెన్గా 600కు పైగా పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడైన కెప్టెన్గా గిల్ నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ కేఎల్ రాహుల్( 29 ఏళ్ల వయసులో) పేరిట ఉండేది.👉27 ఏళ్లు నిండకముందే ఒక ఆటగాడిగా ఐపీఎల్లో మూడు వేర్వేరు సీజన్లలో 600 ప్లస్ పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్గా గిల్ రికార్డులకెక్కాడు.👉ఐపీఎల్ చరిత్రలో వరుస సీజన్లలో కెప్టెన్గా 600 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మూడో సారథిగా గిల్ నిలిచాడు. అంతకుముందు డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్ మాత్రమే ఈ ఘనత సాధించారు.ఇక మ్యాచ్లో సీఎస్కేపై 89 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్తో పాటు సాయి సుదర్శన్ (53 బంతుల్లో 84), జోస్ బట్లర్ (27 బంతుల్లో 57 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీలతో రాణించారు. సీఎస్కే బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్, అన్షుల్ కాంబోజ్, ముకేశ్ చౌదరి తలా వికెట్ సాధించారు. అనంతరం 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే.. 13.4 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ, రషీద్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టి సీఎస్కేను దెబ్బ తీశారు. -
గుజరాత్ ఓపెనర్ల ప్రపంచ రికార్డు
చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఐపీఎల్-2026లో భాగంగా గురువారం నాటి ఈ పోరులో వీరిద్దరు అర్ధ శతకాలతో రాణించారు.కెప్టెన్ గిల్ 37 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేయగా.. సాయి సుదర్శన్ 53 బంతులు ఎదుర్కొని 84 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.74 బంతుల్లో 125 పరుగులుఇక చెన్నైతో మ్యాచ్లో సాయి- గిల్ కలిసి తొలి వికెట్కు 74 బంతుల్లో 125 పరుగులు జోడించారు. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘనత సాధించారు. సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ- ట్రవిస్ హెడ్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టారు.ఐపీఎల్లో అత్యధికసార్లు వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్ జోడీగా సాయి సుదర్శన్- శుబ్మన్ గిల్ నిలిచారు. అంతేకాదు.. పాకిస్తాన్ బ్యాటర్లు బాబర్ ఆజం- మహ్మద్ రిజ్వాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు సమం చేశారు. టీ20 క్రికెట్లో అత్యధికసార్లు వందకు పైగా పరుగులు జోడీగా నిలిచారు.ఐపీఎల్లో అత్యధికసార్లు 100కు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్ జోడీలు👉సాయి సుదర్శన్- శుబ్మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్)- ఏడుసార్లు👉అభిషేక్ శర్మ- ట్రవిస్ హెడ్ (సన్రైజర్స్ హైదరాబాద్)- ఆరుసార్లు👉శిఖర్ ధావన్- డేవిడ్ వార్నర్ (సన్రైజర్స్ హైదరాబాద్)- ఆరుసార్లు👉జానీ బెయిర్ స్టో- డేవిడ్ వార్నర్ (సన్రైజర్స్ హైదరాబాద్)ఐదుసార్లు👉ఫాఫ్ డుప్లెసిస్- విరాట్ కోహ్లి (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) ఐదుసార్లుటీ20 క్రికెట్లో అత్యధికంగా పదిసార్లు 100కు పైగా పరుగులు జోడించిన జంటలు👉బాబర్ ఆజం- మహ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్- కరాచీ కింగ్స్)👉ఏబీ డివిల్లియర్స్- విరాట్ కోహ్లి (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)👉క్రిస్ గేల్- విరాట్ కోహ్లి (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)👉సాయి సుదర్శన్- శుబ్మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్)మ్యాచ్ విషయానికొస్తే.. చెన్నైతో మ్యాచ్లో గుజరాత్ ఓపెనర్లు కెప్టెన్ శుబ్మన్ గిల్ (37 బంతుల్లో 64), సాయి సుదర్శన్ (53 బంతుల్లో 84) అర్ధ శతకాలతో రాణించారు. వీరికి తోడు వన్డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ మెరుపు హాఫ్ సెంచరీ (27 బంతుల్లో 57 నాటౌట్)తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ నాలుగు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.చదవండి: మా చేతిలో పాక్ ఓటమి బాధించింది: బంగ్లాదేశ్ కోచ్6️⃣th fifty in TATA IPL 2026 for Shubman Gill! 👏GT skipper’s consistent run continues as he brings up his second-fastest fifty in the league! #TATAIPL Race to Playoffs 2026 👉 #GTvCSK | LIVE NOW https://t.co/BgI4AiRKkW pic.twitter.com/9aqFJiS8UL— Star Sports (@StarSportsIndia) May 21, 2026


