KKR
-
కేకేఆర్కు గుడ్ న్యూస్.. అరివీర భయంకరమైన ఫామ్లో రహానే
ఐపీఎల్ 2025 సీజన్కు ముందు కేకేఆర్కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు వెటరన్ ఆటగాడు అజింక్య రహానే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. తాజాగా బరోడాతో జరిగిన సెమీఫైనల్లో రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ టోర్నీలో రహానే గత ఆరు మ్యాచ్ల్లో ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు.మహారాష్ట్రతో జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్లో రహానే పరుగుల ప్రవాహం మొదలైంది. ఆ మ్యాచ్లో అతను 34 బంతుల్లో 52 పరుగుల చేశాడు. ఆతర్వాత కేరళతో జరిగిన మ్యాచ్లో 35 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అనంతరం సర్వీసెస్తో జరిగిన మ్యాచ్లో 18 బంతుల్లో 22 పరుగులు చేశాడు.రహానే విశ్వరూపం ఆంధ్రతో జరిగిన చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్తో మొదలైంది. ఈ మ్యాచ్లో రహానే 53 బంతుల్లో 95 పరుగులు చేశాడు. అనంతరం విదర్భతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో 45 బంతుల్లో 84 పరుగులు చేశాడు. తాజాగా బరోడాతో జరిగిన సెమీస్లో 57 బంతుల్లో 98 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.ప్రస్తుత సీజన్లో (సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ) రహానే లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో రహానే 8 మ్యాచ్లు ఆడి 172 స్ట్రయిక్ రేట్తో 366 పరుగులు చేశాడు. బరోడాతో జరిగిన సెమీస్లో రహానే రఫ్ఫాడించడంతో ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్కు చేరింది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. శాశ్వత్ రావత్ (33), కృనాల్ పాండ్యా (30), శివాలిక్ శర్మ (26 నాటౌట్), అథీత్ సేథ్ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హార్దిక్ పాండ్యా 5 పరుగులకే ఔటై నిరాశపరిచాడు.159 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రహానే మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. రహానేకు జతగా శ్రేయస్ అయ్యర్ (46) కూడా కాసేపు మెరుపు మెరిపించాడు. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీ, మధ్యప్రదేశ్ మధ్య రెండో సెమీఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు డిసెంబర్ 15న జరిగే అంతిమ పోరులో ముంబైతో తలపడనుంది. కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో అజింక్య రహానేను కోల్కతా నైట్రైడర్స్ జట్టు రూ.1.5 కోట్ల బేస్ ధరకు సొంతం చేసుకుంది. -
డాక్టర్ కానున్న కేకేఆర్ స్టార్ ప్లేయర్
కేకేఆర్ ప్రామిసింగ్ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ త్వరలోనే డాక్టర్ కానున్నాడు. 2018లో ఎంబీఏ పూర్తి చేసిన అయ్యర్.. త్వరలోనే ఫైనాన్స్లో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టర్ వెంకటేశ్ అయ్యర్గా పిలిపించుకుంటానంటున్నాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో అయ్యర్ ఈ విషయాన్ని వెల్లడించాడు.ఇంటర్వ్యూ సందర్భంగా అయ్యర్ మాట్లాడుతూ.. ఓ క్రికెటర్ 60 సంవత్సరాల వరకు క్రికెట్ ఆడలేడు. అయితే విద్య మాత్రం చనిపోయేంతవరకూ మనతోనే ఉంటుంది. బాగా చదువుకుంటే మైదానంలోనూ, నిజ జీవితంలోనూ సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. యువ క్రికెటర్లు చదువుకు కూడా సమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తానని అన్నాడు.కాగా, వెంకటేశ్ అయ్యర్కు ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత బెంగళూరులోని ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అయితే అయ్యర్ క్రికెట్ కోసం ఆ ఉద్యోగాన్ని తిరస్కరించాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో వెంకటేశ్ అయ్యర్ను డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ రూ.23.75 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.కెప్టెన్సీ రేసులో అయ్యర్ఐపీఎల్ 2024లో కేకేఆర్ను ఛాంపియన్గా నిలబెట్టడంలో వెంకటేశ్ అయ్యర్ కీలకపాత్ర పోషించాడు. అయినా మెగా వేలానికి ముందు కేకేఆర్ అతన్ని రిలీజ్ చేసింది. అయితే మెగా వేలంలో కేకేఆర్ ఊహించని విధంగా అయ్యర్పై భారీ మొత్తం వెచ్చింది తిరిగి సొంతం చేసుకుంది. శ్రేయస్ అయ్యర్ కేకేఆర్ను వీడటంతో ప్రస్తుతం ఆ ఫ్రాంచైజీ కెప్టెన్ పోస్ట్ ఖాళీగా ఉంది. వచ్చే సీజన్ కోసం కేకేఆర్ కెప్టెన్సీ రేసులో వెంకటేశ్ అయ్యర్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయ్యర్ నాలుగు సీజన్ల పాటు కేకేఆర్తో ఉన్నాడు.మరోవైపు కేకేఆర్ కెప్టెన్సీ కోసం అయ్యర్తో పాటు అజింక్య రహానే కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. మెగా వేలంలో కేకేఆర్ రహానేను 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. కెప్టెన్సీ కట్టబెట్టేందుకే కేకేఆర్ యాజమాన్యం రహానే తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రహానేకు కెప్టెన్గా మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రహానే టీమిండియాను విజయవంతంగా ముందుండి నడిపించాడు. దేశవాలీ క్రికెట్లోనూ రహానే ముంబై జట్టును విజయవంతంగా ముందుండి నడిపిస్తున్నాడు. -
కేకేఆర్ ఆటగాడి విధ్వంసం.. ధనాధన్ వీరుల జట్టు ఓటమి
అబుదాబీ టీ10 లీగ్లో కేకేఆర్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో యూపీ నవాబ్స్కు నాయకత్వం వహిస్తున్న గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్).. డెక్కన్ గ్లాడియేటర్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 21 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. ఫలితంగా యూపీ నవాబ్స్.. విధ్వంసకర వీరులతో నిండిన గ్లాడియేటర్స్పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ధనాధన్ వీరులు టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (22), రిలీ రొస్సో (10), నికోలస్ పూరన్ (8), జోస్ బట్లర్ (30), మార్కస్ స్టోయినిస్ (0), డేవిడ్ వీస్ (29), ఆజమ్ ఖాన్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. నవాబ్స్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 2 ఓవర్లలో కేవలం 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. బినుర ఫెర్నాండో 2 ఓవర్లలో 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తైమాల్ మిల్స్ 2, అఖిలేశ్ ఓ వికెట్ దక్కించుకున్నారు.113 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నవాబ్స్ 8.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (52), ఆవిష్క ఫెర్నాండో (34) నవాబ్స్ విజయానికి గట్టి పునాది వేశారు. ఆండ్రీ ఫ్లెచర్ 7, డేవిడ్ మలాన్ 6, ఓడియన్ స్మిత్ 8 పరుగులు చేశారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్, స్టోయినిస్, ఇబ్రార్ అహ్మద్లకు తలో వికెట్ దక్కింది. ప్రస్తుత ఎడిషన్లో నవాబ్స్కు ఇది రెండో విజయం. గ్లాడియేటర్స్కు తొలి ఓటమి. కాగా, రెండు రోజుల కిందట జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేకేఆర్ ఫ్రాంచైజీ గుర్బాజ్ను 2 కోట్ల బేస్ ధరకు తిరిగి సొంతం చేసుకుంది. -
కేకేఆర్ ఖరీదైన ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ అందమైన భార్య (ఫోటోలు)
-
IPL 2025: కేకేఆర్ విడిచిపెట్టింది.. సెంచరీలతో విరుచుకుపడ్డారు..!
ఐపీఎల్ ఫ్రాంచైజీలు అక్టోబర్ 31న తాము రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. ఈ జాబితాలో చాలామంది స్టార్ ఆటగాళ్ల పేర్లు మిస్ అయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ రింకూ సింగ్ (రూ. 13 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ. 12 కోట్లు), సునీల్ నరైన్ (రూ. 12 కోట్లు), ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు), హర్షిత్ రాణా (రూ. 4 కోట్లు), రమన్దీప్ సింగ్ను (రూ. 4 కోట్లు) అట్టిపెట్టుకుని.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా మిగతా ఆటగాళ్లనంతా వేలానికి వదిలేసింది.కేకేఆర్ రిటైన్ చేసుకున్న జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో మిచెల్ స్టార్క్, వెంకటేశ్ అయ్యర్ లాంటి ఆటగాళ్లు మనసు నొచ్చుకున్నారు. వెంకటేశ్ అయ్యర్ తన మనసులోని మాటను సోషల్మీడియాలో షేర్ చేసుకున్నాడు. కేకేఆర్ వదిలిపెట్టిన తర్వాత జరుగుతున్న తొలి రంజీ మ్యాచ్లో వెంకటేశ్ అయ్యర్ తన ప్రతాపాన్ని చూపాడు. రంజీల్లో మధ్యప్రదేశ్కు ఆడే వెంకటేశ్ అయ్యర్.. బీహార్తో జరుగుతున్న మ్యాచ్లో 113 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.కేకేఆర్ తనను వదిలేసిందన్న కోపమో ఏమో కానీ ఈ మ్యాచ్లో వెంకటేశ్ అయ్యర్ చాలా పట్టుదలగా ఆడి సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కూడా సవాలు విసిరాడు. తానెంత విలువైన ఆటగాడినో అన్న విషయాన్ని వెంకటేశ్ అయ్యర్ ఫ్రాంచైజీలకు తెలియజేశాడు.మరోవైపు కేకేఆర్ వదిలేసిన మరో అయ్యర్ కూడా ఇవాళ శతకొట్టాడు. కేకేఆర్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్లో 164 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ప్రస్తుత రంజీ సీజన్లో శ్రేయస్కు ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. తాజా ప్రదర్శనల నేపథ్యంలో ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్కు మాంచి గిరాకీ ఏర్పడే అవకాశం ఉంది. -
IPL 2025: శ్రేయస్తో కేకేఆర్ కటీఫ్..?
ఐపీఎల్-2025 సీజన్ కోసం ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాల సమర్పణకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. అక్టోబర్ 31లోగా ఫ్రాంచైజీలన్నీ తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలను సమర్పించాలి. అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్లపై ఓ క్లారిటీ కలిగి ఉన్నాయి.ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశం ఉంటుంది. రిటైన్ చేసుకునే క్యాప్డ్ ప్లేయర్లకు ఛాయిస్ ప్రకారం వరుసగా 18, 14, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. రిటైన్ చేసుకునే అన్క్యాప్డ్ ప్లేయర్కు 4 కోట్లు పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది. ఐపీఎల్-2025 వేలం నవంబర్ 25 లేదా 26 తేదీల్లో రియాద్లో జరగవచ్చు.శ్రేయస్తో కేకేఆర్ కటీఫ్..?కేకేఆర్ విషయానికొస్తే.. ఈ ఫ్రాంచైజీ కూడా తమ రిటెన్షన్ జాబితాను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే కేకేఆర్ ఈసారి కెప్టెన్ పేరు లేకుండానే ముందుకు సాగనున్నట్లు సమాచారం. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కేకేఆర్ గత సీజన్ టైటిల్ గెలిచినప్పటికీ.. ఈసారి అతన్ని రిటైన్ చేసుకునేందుకు ఫ్రాంచైజీ యాజమాన్యం ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తుంది. రిటెన్షన్ జాబితా సమర్పణకు మరికొద్ది గంటలు సమయమే ఉన్నా ఇప్పటికీ ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ శ్రేయస్ను సంప్రదించలేదట. దీన్ని బట్టి చూస్తే కేకేఆర్ శ్రేయస్కు కటీఫ్ చెప్పడం ఖాయమని తెలుస్తుంది.ఇదిలా ఉంటే, శ్రేయస్ కోసం సొంత ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చనప్పటికీ.. మిగతా ఫ్రాంచైజీలు ఎగబడుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ శ్రేయస్ వేలానికి వస్తే ఇతన్ని దక్కించుకోవడం కోసం మూడు, నాలుగు ఫ్రాంచైజీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయట. కెప్టెన్గా శ్రేయస్కు మంచి ట్రాక్ రికార్డు ఉండటంతో ఇతన్ని కెప్టెన్గా చేసేందుకు పలు ఫ్రాంచైజీలు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాయని సమాచారం.కేకేఆర్ రిటైన్ చేసుకునే అవకాశం ఉన్న ఆటగాళ్లు..సునీల్ నరైన్ఆండ్రీ రసెల్ఫిలిప్ సాల్ట్రింకూ సింగ్ -
కన్నీటిపర్యంతమైన బ్రావో
విండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరీబియన్ ప్రీమియర్ లీగ్-2024లో సెప్టెంబర్ 24న సెయింట్ లూసియా కింగ్స్తో జరిగిన మ్యాచ్ బ్రావో కెరీర్లో చివరి మ్యాచ్. ఈ మ్యాచ్లో బ్రావో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. మ్యాచ్ అనంతరం బ్రావో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఉబికి వస్తున్న బాధను ఆపుకోలేక కన్నీటిపర్యంతమయ్యాడు. బ్రావో కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. Champion Dwayne Bravo announces his retirement from all formats of cricket.Know more: https://t.co/ljuWjTsGQS— CricTracker (@Cricketracker) September 27, 20242021లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన బ్రావో.. వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ గెలిచిన రెండు సందర్భాల్లో (2012, 2016) ఆ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. బ్రావో పొట్టి క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కొనసాగుతున్నాడు. బ్రావో తన టీ20 కెరీర్లో 582 మ్యాచ్లు ఆడి 631 వికెట్లు పడగొట్టాడు. బ్రావో తాజాగా ఐపీఎల్లో కేకేఆర్ ఫ్రాంచైజీ మెంటార్గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2025 నుంచి బ్రావో కేకేఆర్ మెంటార్గా వ్యవహరిస్తాడు. కాగా, 40 ఏళ్ల బ్రావో 2004లో తన అంతర్జాతీయ కెరీర్ మొదలుపెట్టాడు. నాటి నుంచి 2021 వరకు అతను విండీస్ జాతీయ జట్టుకు సేవలందించాడు. ఈ మధ్యలో 40 టెస్ట్లు, 164 వన్డేలు, 91 టీ20లు ఆడాడు. బౌలింగ్ ఆల్రౌండర్ అయిన బ్రావో తన అంతర్జాతీయ కెరీర్లో 6300 పైచిలుకు పరుగులు సాధించి, 363 వికెట్లు పడగొట్టాడు. బ్రావో 2008 నుంచి 2022 వరకు వివిధ ఫ్రాంచైజీల తరఫున ఐపీఎల్లో ఆడాడు. క్యాష్ రిచ్ లీగ్లో బ్రావో 161 మ్యాచ్లు ఆడి 1560 పరుగులు చేసి 183 వికెట్లు తీశాడు. చదవండి: భారత్తో టెస్ట్ మ్యాచ్.. బంగ్లాదేశ్ వీరాభిమానిపై దాడి.. ఆసుపత్రికి తరలింపు -
IPL: కేకేఆర్ మెంటార్గా రాహుల్ ద్రవిడ్..?
టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైన నేపథ్యంలో ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్రైడర్స్ కొత్త మెంటార్ అన్వేషణలో పడింది. తమ జట్టుకు మెంటార్గా వ్యవహరించాలని కేకేఆర్ టీమిండియా తాజా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ను కోరినట్లు తెలుస్తుంది. ఇందుకు ద్రవిడ్ సైతం సుముఖత వ్యక్తం చేశాడని సమాచారం. ఒకవేళ ఈ డీల్ కుదిరితే ద్రవిడ్ వచ్చే సీజన్ (2025) నుంచి కేకేఆర్ మెంటార్గా వ్యవహరిస్తాడు.మరోవైపు టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు అధికారికంగా ప్రకటించడమే తరువాయి. హెడ్ కోచ్ పదవి విషయంలో గంభీర్-బీసీసీఐ మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని సమాచారం. గంభీర్ తన సహాయ సిబ్బందిని ఎంచుకునే విషయంలోనూ బీసీసీఐ పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తుంది. గంభీర్ సక్సెస్ఫుల్ బ్యాటర్ కావడంతో తనే బ్యాటింగ్ కోచ్గా కూడా వ్యవహరించే అవకాశం ఉంది. గంభీర్ తనకు ఇష్టం వచ్చిన వారికి బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్లుగా ఎంచుకోవచ్చు.టీమిండియా ఫీల్డింగ్ కోచ్ రేసులో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, దిగ్గజ ఫీల్డర్ జాంటీ రోడ్స్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. బౌలింగ్ కోచ్గా ఎవరుంటారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపడితే కేకేఆర్ మెంటార్షిప్ను వదులుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ద్రవిడ్ కేకేఆర్ మెంటార్గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కాగా, టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 వరల్డ్కప్ 2024తో ముగిసిన విషయం తెలిసిందే. -
IPL 2024: కేకేఆర్ స్టార్ పేసర్కు గ్రాండ్ వెల్కమ్
ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్ గెలిచాక సొంత పట్టణం అంబాలకు (హర్యానా) విచ్చేసిన కేకేఆర్ స్టార్ పేసర్ వైభవ్ అరోరాకు ఘన స్వాగతం లభించింది. వైభవ్ను అతని సన్నిహితులు, అభిమానులు, అంబాల వాసులు డప్పు వాయిద్యాల మధ్య పూల మాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వైభవ్తో ఫోటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు. అనంతరం వైభవ్ ఓపెన్ టాప్ జీపులో ర్యాలీగా వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఐపీఎల్ 2024 సీజన్ ముగిసి వారం రోజులు పూర్తయినా జనాలు ఇంకా అదే మూడ్లో ఉన్నారు. 27 ఏళ్ల వైభవ్ ఈ ఐపీఎల్ సీజన్లో అద్భుతమైన ప్రదర్శనలతో చెలరేగాడు. వైభవ్ ఈ సీజన్లో 10 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీసి కేకేఆర్ విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. Vaibhav Arora gets a hero's welcome to his hometown after IPL win. 🏆pic.twitter.com/PhWOMk76Y6— Mufaddal Vohra (@mufaddal_vohra) June 1, 2024రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన వైభవ్.. సహచరుడు హర్షిత్ రాణా, మిచెల్ స్టార్క్లతో కలిసి కేకేఆర్ పేస్ అటాక్ను లీడ్ చేశాడు. లోయర్ ఆర్డర్లో ఉపయోగకర బ్యాటర్ కూడా అయిన వైభవ్ను కేకేఆర్ ఈ సీజన్ వేలంలో 60 లక్షలకు సొంతం చేసుకుంది. వైభవ్ ఇప్పటివరకు 21 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. వైభవ్ దేశవాలీ క్రికెట్లో హిమాచల్ ప్రదేశ్కు ప్రాతినిథ్యం వహిస్తాడు. 2021లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన వైభవ్ ఆ సీజన్లో కేకేఆర్కు ఆడి ఆతర్వాతి సీజన్లో (2022) పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్లో వైభవ్ తిరిగి కేకేఆర్ పంచన చేరాడు. ఈ సీజన్లో వైభవ్కు చాలా పాపులారిటీ వచ్చింది. సన్రైజర్స్తో జరిగిన ఫైనల్లో వైభవ్ 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి అత్యంత కీలకమైన ట్రవిస్ హెడ్ వికెట్ తీశాడు. ఈ సీజన్ ప్రదర్శనల కారణంగా కేకేఆర్ తదుపరి సీజన్లోనూ ఇతన్ని రీటెయిన్ చేసుకునే అవకాశం ఉంది. -
IPL 2024: ఫైనల్లో ఎస్ఆర్హెచ్ చిత్తు.. చాంపియన్గా కేకేఆర్
-
సన్రైజర్స్ యజమానిని, కంటతడిపెట్టించిన కేకేఆర్..
-
IPL 2024: ఓ పక్క స్టార్క్.. మరోపక్క అయ్యర్..!
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ ఛాంపియన్గా అవతరించింది. నిన్న జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్రైజర్స్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మూడో ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. అంతిమ సమరంలో మిచెల్ స్టార్క్ (3-0-14-2), వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆరెంజ్ ఆర్మీని చెడుగుడు ఆడుకున్నారు. వీరికి రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1), రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా తోడవ్వడంతో కేకేఆర్ సునాయాస విజయం సాధించింది.క్వాలిఫయర్ మ్యాచ్లోనూ వీరిద్దరే.. నిన్నటి ఫైనల్లో సన్రైజర్స్ను డామేజ్ చేసిన స్టార్క్, వెంకటేశ్ అయ్యర్లు ఇదే సన్రైజర్స్ను క్వాలిఫయర్-1లోనూ ముప్పుతిప్పలు పెట్టారు. నాటి మ్యాచ్లోనూ స్టార్క్ అద్భుతమైన గణాంకాలు (4-0-34-3) నమోదు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపిక కాగా.. వెంకటేశ్ అయ్యర్ సైతం ఫైనల్లోలానే మెరుపు ఇన్నింగ్స్తో (28 బంతుల్లో 51 నాటౌట్) విరుచుకుపడ్డాడు. ఈ ఇద్దరు పోటీపడి మరీ సన్రైజర్స్పై దండయాత్ర చేసి వారికి టైటిల్ దక్కకుండా చేశారు.సీజన్ ఆరంభ మ్యాచ్ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన స్టార్క్ కీలకమైన ప్లే ఆఫ్స్లో ఫామ్లోని వచ్చి కేకేఆర్ పాలిట గెలుపు గుర్రంగా మారగా.. వెంకటేశ్ అయ్యర్ సీజన్ స్టార్టింగ్ నుంచి ఓ మోస్తరు ప్రదర్శనలతో అలరించాడు. ప్లే ఆఫ్స్లో తిరుగులేని అయ్యర్.. నిన్నటి ఫైనల్తో వెంకటేశ్ అయ్యర్ ప్లే ఆఫ్స్ హీరో అని మరోసారి నిరూపించుకున్నాడు. అయ్యర్కు ప్లే ఆఫ్స్లో ఇది వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ (55, 50, 51*, 52*). ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఘనత మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనాకు దక్కుతుంది. రైనా ప్లే ఆఫ్స్లో ఏడు 50కి పైగా స్కోర్లు సాధించాడు.ఫైనల్స్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మిచెల్ స్టార్క్ ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో కమిన్స్ (24) టాప్ స్కోరర్గా నిలువగా.. మెరుపు వీరులు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్లకు తలో వికెట్ దక్కింది. -
ఐపీఎల్ 2024 ప్రైజ్ మనీ ఎవరికి ఎన్ని కోట్లు ?
-
KKR Wins IPL ‘హ్యాపీ నా పప్పా’: అటు పెద్దోడు, ఇటు చిన్నోడు : తండ్రీ కూతుళ్ల ఎమోషనల్ వీడియో
ఐపీఎల్-2024 టైటిల్ను కోల్కతా నైట్ రైడర్స్ జట్టు చేజిక్కించుకుంది. 10 ఏళ్ల తర్వాత ట్రోఫీని గెల్చుకోడంతో కేకేఆర్ కో-ఫౌండర్ షారుఖ్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా మైదానంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన విజువల్స్నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.An emotional moment between #ShahRukhKhan and #SuhanaKhan after marvelous victory of #KKRpic.twitter.com/yO6nBBgvo1— Suhana Khan (@SuhanaKhanClub) May 26, 2024ఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించిన షారుఖ్ ప్యామిలీ, పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టైటిల్ను అందుకున్న ఆనంద క్షణాల్లో మునిగి తేలాయి. ఈ సందర్భంగా షారుఖ్ ముద్దుల తనయ సుహానా ఖాన్ పరుగున వచ్చి ‘‘మీరు సంతోషంగా ఉన్నారా’’అడిగింది. దీంతో సూపర్ స్టార్ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ తండ్రీ- కూతుళ్ల ఆనంద క్షణాలు అటు ఫ్యాన్స్ను, ఇటు నెటిజనులు సంతోషంలో ముంచేశాయి.Suhana asking Shah “Are you happy” and the way AbRam and Aryan came to hug their papa @iamsrk … I can’t help my tears 😭💜pic.twitter.com/VjCxU5Nwsz— Samina ✨ (@SRKsSamina_) May 26, 2024ఆ తరువాత కాసేపటికే షారుఖ్ చిన్న కుమారుడు అబ్రామ్, తండ్రీ-కూతురు ద్వయం పరస్వరం గట్టిగా కౌగిలించుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఇంతలోనే పెద్ద కుమారుడు ఆర్యన్, హగ్గింగ్ ఫెస్ట్లో చేరి పోవడం విశేషం. అంతేకాదు చివరి పరుగుతో వెంకేటేష్ అయ్యర్ విజయాన్ని అందించడంతో బాలీవుడ్ రొమాన్స్ కింగ్ తన భార్య గౌరీ నుదిటిపై ముద్దు పెట్టుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దీంతో ,ఇద్దరూ ఆనంద క్షణాల్లో మునిగి తేలిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. కాగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్స్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కేకేఆర్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ జట్టు కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కోల్కతా ఈ టార్గెట్ను కేవలం 10.3 ఓవర్లలోనే ముగించి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. వెంకటేష్ అయ్యర్ విన్నింగ్ షాట్తో 2012, 2014 తర్వాత ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత అత్యధిక సార్లు ట్రోఫీని గెలిచిన జట్టుగా కోల్కతా నిలిచింది. దీంతో షారుఖ్ ఖాన్ ఎమోషనల్ అయ్యాడు. -
IPL 2024: 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు
కేకేఆర్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ ఎవరికీ సాధ్యంకాని అత్యంత అరుదైన ఘనతను సాధించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మూడు సార్లు అత్యంత విలువైన ఆటగాడి అవార్డు (MVP) అందుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 2012.. తన డెబ్యూ సీజన్లో తొలిసారి ఈ అవార్డు అందుకున్న నరైన్.. 2018 సీజన్లో.. తాజాగా 2024 సీజన్లో అత్యంత విలువైన ఆటగాడి అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో 14 మ్యాచ్ల్లో 488 పరుగులు చేసి 17 వికెట్లు పడగొట్టిన నరైన్.. 2018 సీజన్లో 357 పరుగులు, 17 వికెట్లు.. 2012 సీజన్లో 24 వికెట్లు పడగొట్టాడు.ఈ సీజన్లో మెంటార్ గంభీర్ చొరవతో ఓపెనర్గా ప్రమోషన్ పొందిన నరైన్.. సుడిగాలి ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డాడు. ఈ సీజన్లో నరైన్ బ్యాట్ నుంచి సెంచరీ, 3 అర్దసెంచరీలు జాలువారాయి. సీజన్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నరైన్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో నరైన్ బౌలింగ్లోనూ సత్తా చాటాడు. 14 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీసి సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 11వ స్థానంలో నిలిచాడు.ఇదిలా ఉంటే, కేకేఆర్ ఐపీఎల్లో తమ మూడో టైటిల్ను సొంతం చేసుకుంది. నిన్న (మే 26) జరిగిన 2024 సీజన్ ఫైనల్లో ఈ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి పదేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్గా అవతరించింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మిచెల్ స్టార్క్ (3-0-14-2, 2 క్యాచ్లు) ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో కమిన్స్ (24) టాప్ స్కోరర్గా నిలువగా.. మెరుపు వీరులు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) దారుణంగా విఫలమయ్యారు. కమిన్స్ కాకుండా మార్క్రమ్ (20), నితీశ్ రెడ్డి (13), క్లాసెన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్తో పాటు రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్ అయ్యర్తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) అజేయంగా నిలిచి కేకేఆర్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్లకు తలో వికెట్ దక్కింది. -
IPL 2024: కేకేఆర్ వెనుక 'గంభీరం'
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది. నిన్న (మే 26) జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి మూడోసారి టైటిల్ను ఎగరేసుకుపోయింది. ఈ సీజన్లో ఆధ్యాంతం అద్భుత విజయాలు సాధించిన కేకేఆర్ ఫైనల్ మ్యాచ్లోనూ అన్ని రంగాల్లో సత్తా చాటి పదేళ్ల తర్వాత మరోసారి ఐపీఎల్ కిరీటాన్ని సొంతం చేసుకుంది.Shreyas Iyer handed the Trophy to Rinku Singh for celebration.- The Leader. 👌 pic.twitter.com/V8Pb55ZPQX— Johns. (@CricCrazyJohns) May 26, 2024ఆటగాళ్లతో సమానమైపాత్ర..ఈ సీజన్లో కేకేఆర్ విజయాల్లో ఆటగాళ్ల పాత్ర ఎంత ఉందో జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ పాత్ర కూడా అంతే ఉంది. ఈ సీజన్తోనే కేకేఆర్ మెంటార్గా బాధ్యతలు చేపట్టిన గంభీర్.. ఆ జట్టు సాధించిన ప్రతి విజయంలోనూ తనదైన ముద్ర వేశాడు.Third most successful IPL franchise in league history - KKR. pic.twitter.com/bYnKkbujXi— Johns. (@CricCrazyJohns) May 26, 2024పేరుకు తగ్గట్టుగానే గంభీరంగా..ఆన్ ఫీల్డ్ అయినా.. ఆఫ్ ద ఫీల్డ్ అయినా గంభీరంగా కనిపించే గంభీర్ పేరుకు తగ్గట్టుగానే కేకేఆర్ విజయాల్లో గంభీరమైన పాత్ర పోషించాడు. గంభీర్ తనకు మాత్రమే సాధ్యమైన సాహసోపేతమైన నిర్ణయాలతో కేకేఆర్ను గెలుపుబాట పట్టించాడు. గంభీర్ ఆధ్వర్యంలో కేకేఆర్ ఈ సీజన్లో కేవలం మూడు మ్యాచ్ల్లో మాత్రమే ఓడింది. Gautam Gambhir with IPL Trophy. ❤️ pic.twitter.com/LI2HLwEpiH— Johns. (@CricCrazyJohns) May 26, 2024నరైన్ సక్సెస్ వెనుక కూడా గంభీరుడే..సునీల్ నరైన్కు ఓపెనర్గా ప్రమోషన్ ఇచ్చి సత్ఫలితాలు రాబట్టిన ఘనత గంభీర్దే. అలాగే ఫైనల్స్ హీరో మిచెల్ స్టార్క్ను దక్కించుకోవడంలోనూ గంభీరే ప్రధానపాత్ర పోషించాడని అంతా అంటారు. యువ పేసర్లు హర్షిత్ రాణా, వైభవ్ అరోరాలను ప్రోత్సాహించడంలోనూ.. వెటరన్ ఆండ్రీ రసెల్ను వెనకేసుకురావడంలోనూ గంభీర్దే ప్రధానమైన పాత్ర. SUNIL NARINE - The MVP of IPL 2024. Greatest of KKR...!!!!! pic.twitter.com/1IBdxl1qRk— Johns. (@CricCrazyJohns) May 26, 2024శ్రేయస్ను వెన్నుతట్టి.. వెంకటేశ్పై విశ్వాసముంచి..శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్లపై విశ్వాసముంచి వారి నుంచి సత్ఫలితాలు రాబట్టిన ఘనత కూడా గంభీర్కే దక్కుతుంది. రింకూ సింగ్, రమన్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి లాంటి లోకల్ టాలెంట్లకు కూడా గంభీర్ అండగా నిలిచాడు. ఇలా ఏరకంగా చూసుకున్నా కేకేఆర్కు పూర్వవైభవం దక్కడంలో గంభీర్ పాత్ర ప్రధానమైందనడంలో ఎలాంటి సందేహాం లేదు.KKR players taking Gautam Gambhir in their shoulders. 👌 pic.twitter.com/XspysKKbiM— Johns. (@CricCrazyJohns) May 26, 2024సొంత అభిమానులచే ఛీత్కారాలు ఎదుర్కొన్న స్థాయి నుంచి..గడిచిన ఆరు సీజన్లలో పేలవ ప్రదర్శనతో సొంత అభిమానల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్న కేకేఆర్.. గంభీర్ రాకతో ఒక్కసారిగా నూతనోత్సాహాన్ని అందుకుని టైటిల్ ఎగరేసుకుపోయింది.షారుఖ్ పట్టుబట్టి మరీ..కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ ఈ సీజన్ కోసం గంభీర్ను పట్టుబట్టి మరీ ఒప్పించి లక్నో సూపర్ జెయింట్స్ నుంచి పిలిపించుకున్నాడు. మెంటార్గా గంభీర్కు కేకేఆర్ కొత్తేమో కానీ ఆటగాడిగా, కెప్టెన్గా గంభీర్ కేకేఆర్ అభిమానులకు సుపరిచితుడు. ఈ సీజన్లో మెంటార్గా కేకేఆర్ను ఛాంపియన్గా నిలిపిన గంభీర్.. 2012, 2014 సీజన్లలో కెప్టెన్గా కేకేఆర్కు టైటిల్స్ అందించాడు. Gautam Gambhir & King of Indian Cinema Shah Rukh Khan with IPL Trophy 💜- The Frame for KKR legacy. pic.twitter.com/pfrFw9prKe— Johns. (@CricCrazyJohns) May 27, 2024కేకేఆర్ కెప్టెన్గా గంభీర్ ప్రస్తానం దీనితోనే ఆగిపోలేదు. గంభీర్ నేతృత్వంలో కేకేఆర్ 2016, 2017 సీజన్లలోనే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. దీనికి ముందు 2011 సీజన్లోనూ గంభీర్ సారథ్యంలో కేకేఆర్ ప్లే ఆఫ్స్కు చేరింది. కేకేఆర్ కెప్టెన్గా ఏడు సీజన్ల పాటు కొనసాగిన గంభీర్ ఈ జట్టును రెండుసార్లు ఛాంపియన్గా.. మూడు సీజన్లలో ప్లే ఆఫ్స్కు.. రెండు సీజన్లలో (2013, 2015) లీగ్ దశ వరకు విజయవంతంగా నడిపించాడు. తాజాగా మెంటార్గా బాధ్యతలు చేపట్టి తన ఆధ్వర్యంలో మూడోసారి కేకేఆర్ను ఛాంపియన్గా నిలిపాడు. Shah Rukh Khan kissing Gautam Gambhir 💜- SRK brings back Gambhir again and he has written a great comeback story. pic.twitter.com/gcAjm1S2Bh— Johns. (@CricCrazyJohns) May 26, 2024షారుఖ్ విశ్వాసాన్ని నిలుపుకున్నాడు..కేకేఆర్ బాస్ షారుఖ్కు తనపై అపార విశ్వాసమున్నట్లు గంభీరే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పాడు. ఈ నమ్మకాన్ని నిలుపుకుంటూ గంభీర్ పదేళ్ల తర్వాత తిరిగొచ్చి కేకేఆర్కు టైటిల్ను అందించాడు. తాజాగా కేకేఆర్ టైటిల్ గెలిచిన అనంతరం షారుఖ్ ఖాన్ గంభీర్ నుదిటిపై ముద్దు పెట్టుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. దీనికి సంబంధించిన చిత్రాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. -
కేకేఆర్ విజయంతో బెంగాల్లో సంబరాలు మిన్నంటాయి: సీఎం మమత
కోల్కత్తా: ఐపీఎల్-17(2024)లో విజేతగా నిలిచిన కోల్కత్తా నైట్రైడర్ జట్టును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందించారు. ఈ ఐపీఎల్ సీజన్లో రికార్డులు బద్దలు కొట్టినందుకు ప్లేయర్స్కు వ్యక్తిగతంగా అభినందనలు తెలిపారు.కాగా, మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా..‘కోల్కతా నైట్ రైడర్స్ విజయంతో బెంగాల్ అంతటా సంబరాలు మిన్నంటాయి. ఈ ఐపీఎల్ సీజన్లో రికార్డు బద్దలు కొట్టినందుకు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ఫ్రాంచైజీని వ్యక్తిగతంగా అభినందించాలనుకుంటున్నాను. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. Kolkata Knight Riders' win has brought about an air of celebration all across Bengal.I would like to personally congratulate the players, the support staff and the franchise for their record breaking performance in this season of the IPL.Wishing for more such enchanting…— Mamata Banerjee (@MamataOfficial) May 26, 2024 ఇక, ఐపీఎల్-17 సీజన్లో కేకేఆర్ అద్భుత ఆటతీరును కనబరిచింది. సీజన్ ప్రారంభం నాటి నుంచి దూకుడుగా ఆడుతూ టేబుట్ టాపర్గా నిలిచింది. చివరగా ఫైనల్గా సన్రైజర్స్ హైదరాబాద్ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి 114 లక్ష్యాన్ని కేవలం పదో ఓవర్లోనే పూర్తి చేసింది. కాగా, ఈ సీజన్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా కేకేఆర్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ నిలిచాడు. ICYMI! That special run to glory 💫💜Recap the #Final on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvSRH | #TheFinalCall pic.twitter.com/qUDfUFHpka— IndianPremierLeague (@IPL) May 26, 2024 📽️ 𝗥𝗔𝗪 𝗥𝗘𝗔𝗖𝗧𝗜𝗢𝗡𝗦Moments of pure joy, happiness, jubilation, and happy tears 🥹 What it feels to win the #TATAIPL Final 💜Scorecard ▶️ https://t.co/lCK6AJCdH9#KKRvSRH | #Final | #TheFinalCall | @KKRiders pic.twitter.com/987TCaksZz— IndianPremierLeague (@IPL) May 26, 2024 -
IPL 2024 Final: కేకేఆర్కు అచ్చొచ్చిన 'M'
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది. నిన్న (మే 26) జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్రైజర్స్ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి మూడోసారి టైటిల్ను ఎగరేసుకుపోయింది.అంతిమ సమరంలో మిచెల్ స్టార్క్ అద్భుతంగా రాణించి కేకేఆర్ను పదేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్గా నిలబెట్టాడు. ఫైనల్లో స్టార్క్ 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు, రెండు క్యాచ్లు పట్టాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.ఐపీఎల్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్ల్లో ఒకటి కంటే ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. స్టార్క్ సన్రైజర్స్తోనే జరిగిన తొలి క్వాలిఫయర్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా (4-0-34-3) నిలిచాడు.సీజన్ ఆరంభంలో దారుణంగా విఫలమైన స్టార్క్ అత్యంత కీలకమైన నాకౌట్ మ్యాచ్ల్లో అద్భుతంగా రాణించి కేకేఆర్కు పదేళ్ల తర్వాత మరోసారి టైటిల్ను అందించాడు. ఓవరాల్గా చూస్తే ఈ సీజన్లో స్టార్క్ సన్రైజర్స్ పాలిట విలన్గా దాపురించాడు.మరోసారి కలిసొచ్చిన 'M'ఇదిలా ఉంటే, ఐపీఎల్ ఫైనల్స్లో కేకేఆర్కు 'M' అక్షరం మరోసారి కలిసొచ్చింది. కేకేఆర్ ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన మూడు సందర్భాల్లో ఈ అక్షరంతో పేరు మొదలయ్యే ఆటగాళ్లే ఆ జట్టు పాలిట గెలుపు గుర్రాలయ్యారు. MMM2012లో మన్విందర్ బిస్లా, 2014లో మనీశ్ పాండే, తాజాగా మిచెల్ స్టార్క్ ఫైనల్స్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్లుగా నిలిచి కేకేఆర్కు టైటిల్స్ అందించారు. దీన్ని బట్టి చూస్తే ఐపీఎల్ ఫైనల్స్లో కేకేఆర్కు M అక్షరం సెంటిమెంట్ బాగా అచ్చొచ్చిందని స్పష్టమవుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ మిచెల్ స్టార్క్ ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు ఇన్నింగ్స్లో కెప్టెన్ కమిన్స్ (24) టాప్ స్కోరర్గా నిలిచాడు. మెరుపు వీరులు, ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. కమిన్స్ కాకుండా మార్క్రమ్ (20), నితీశ్ రెడ్డి (13), క్లాసెన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్తో పాటు రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్ అయ్యర్తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) అజేయంగా నిలిచి కేకేఆర్కు పదేళ్ల తర్వాత మరో టైటిల్ను అందించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్లకు తలో వికెట్ దక్కింది. సిరీస్ ఆధ్యాంతం బ్యాట్తో (14 మ్యాచ్ల్లో 488 పరుగులు), బంతితో (17 వికెట్లు) మాయ చేసిన సునీల్ నరైన్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. -
IPL 2024 Final: సన్రైజర్స్కు గుండెకోత.. చరిత్ర సృష్టించిన స్టార్క్
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా నిన్న (మే 26) జరిగిన ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్లో కోల్కతా నైట్రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది. తుది సమరంలో కేకేఆర్.. సన్రైజర్స్ హైదరాబాద్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి మూడోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో సన్రైజర్స్ తమ ప్రధాన బలమైన బ్యాటింగ్లో దారుణంగా విఫలమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. నమ్మకాన్ని వమ్ము చేయని స్టార్క్కేకేఆర్ పేసర్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ తనపై యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తనకు లభించిన ధరకు న్యాయం చేశాడు. అంతిమ సమరంలో స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి సన్రైజర్స్కు గుండెకోత మిగిల్చాడు. అతను 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు, రెండు క్యాచ్లు పట్టాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి ఆటగాడుఐపీఎల్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్ల్లో ఒకటి కంటే ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. స్టార్క్ సన్రైజర్స్తోనే జరిగిన తొలి క్వాలిఫయర్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా (4-0-34-3) నిలిచాడు. సీజన్ ఆరంభంలో దారుణంగా విఫలమైన స్టార్క్ అత్యంత కీలకమైన నాకౌట్ మ్యాచ్ల్లో అద్భుతంగా రాణించి కేకేఆర్కు పదేళ్ల తర్వాత మరోసారి టైటిల్ను అందించాడు. ఓవరాల్గా చూస్తే ఈ సీజన్లో స్టార్క్ సన్రైజర్స్ పాలిట విలన్లా దాపురించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి అత్యుత్సాహంగా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ నిర్ణీత ఓవర్లైనా కూడా ఆడకుండానే (18.3 ఓవర్లు) 113 పరుగులకు చాపచుట్టేసింది. ఆ జట్టు ఇన్నింగ్స్లో కెప్టెన్ కమిన్స్ (24) టాప్ స్కోరర్గా నిలిచాడు. మెరుపు వీరులు, ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) దారుణంగా నిరాశపరిచారు. కమిన్స్ కాకుండా మార్క్రమ్ (20), నితీశ్ రెడ్డి (13), క్లాసెన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్తో పాటు రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.The winning by Celebration by Kolkata Knight Riders after winning the third IPL title. 🏆 pic.twitter.com/OgQBi87Kzt— Johns. (@CricCrazyJohns) May 26, 2024ఆడుతూ పాడుతూ..అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్ అయ్యర్తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) అజేయంగా నిలిచి కేకేఆర్కు పదేళ్ల తర్వాత మరో టైటిల్ను అందించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్లకు తలో వికెట్ దక్కింది. గత సీజన్లో టేబుల్ చివర్లో ఉండిన సన్రైజర్స్ ఈ సీజన్లో రన్నరప్గా నిలవడం ఆ జట్టు అభిమానులకు ఊరట కలిగించే అంశం. సిరీస్ ఆధ్యాంతం బ్యాట్తో (14 మ్యాచ్ల్లో 488 పరుగులు) ఇరగదీసి, బంతితో (17 వికెట్లు) మాయ చేసిన సునీల్ నరైన్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. -
IPL 2024 Final: వార్న్, రోహిత్, హార్దిక్ సరసన కమిన్స్ చేరేనా..?
ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ ఇవాళ (మే 26) రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా కేకేఆర్.. సన్రైజర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో పలు ఆసక్తికర అంశాలు తెరపైకి వస్తున్నాయి. అందులో తొలి సీజన్లోనే టైటిల్ కైవసం చేసుకున్న కెప్టెన్ల విషయం అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. కేవలం ముగ్గురు మాత్రమే..16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకే కేవలం ముగ్గురు కెప్టెన్లు మాత్రమే తొలి సీజన్లోనే టైటిల్ గెలిచారు. తొట్ట తొలి సీజన్లో (2008) షేన్ వార్న్ (రాజస్థాన్ రాయల్స్), 2013 సీజన్లో రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్), 2022 సీజన్లో హార్దిక్ పాండ్యా (గుజరాత్ టైటాన్స్) ఐపీఎల్ టైటిల్ గెలిచారు. ప్రస్తుత సీజన్ ఫైనల్లో తలపడుతున్న పాట్ కమిన్స్ కూడా కెప్టెన్ ఇదే తొలి సీజన్ కావడంతో అతనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కెప్టెన్గా పాట్ ట్రాక్ రికార్డు చూస్తే వార్న్, రోహిత్, హార్దిక్ సరసన చేరడం ఖాయంగా కనిపిస్తుంది. మరి నేటి ఫైనల్లో కమిన్స్ ఏం చేస్తాడో వేచి చూడాలి. కేవలం బ్యాటింగ్ను నమ్ముకున్న సన్రైజర్స్.. అన్ని విభాగాల్లో సత్తా చాటుతున్న కేకేఆర్ను ఏమేరకు నిలువరిస్తుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. అలా చూస్తే కేకేఆర్దే టైటిల్..గత ఆరు సీజన్లలో క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టే టైటిల్ గెలుస్తుంది. ఈ సెంటిమెంట్నే కేకేఆర్ కొనసాగిస్తుందో లేక సన్రైజర్స్ సెంటిమెంట్ను బ్రేక్ చేస్తుందో చూడాలి. ఈ ఏడాది సన్రైజర్స్ మరో టైటిల్ గెలుస్తుందా..?మరోవైపు సన్రైజర్స్కు ఈ ఏడాది బాగా కలిసొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ ఫ్రాంచైజీ ఈ ఏడాది సౌతాఫ్రికా టీ20 లీగ్ గెలిచి అదే జోరును ఐపీఎల్లోనూ కొనసాగిస్తుంది. ఫైనల్లో హాట్ ఫేవరెట్ కేకేఆరే అయినప్పటికీ.. కమిన్స్ కెప్టెన్సీ సామర్థ్యం, బ్యాటర్ల విధ్వంసంపై ఆరెంజ్ ఆర్మీ అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఎస్ఆర్హెచ్ అభిమానులు అంచనాలు నిజమైతే ఐపీఎల్ టైటిల్ గెలిచిన నాలుగో ఆసీస్ ఆటగాడిగా కమిన్స్ రికార్డు బుక్కుల్లోకెక్కుతాడు. కేకేఆర్కు చెపాక్ స్పెషల్..మరోవైపు చెపాక్ మైదానంతో కేకేఆర్కు ప్రత్యేక అనుబంధం ఉంది. 12 ఏళ్ల క్రితం కేకేఆర్ ఇక్కడే తమ తొలి ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. కేకేఆర్ చెపాక్ సెంటిమెంట్ కూడా తమకు వర్కౌట్ అవుతుందని అశిస్తుంది. ఈ సీజన్లో సన్రైజర్స్తో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం తమనే వరించడంపై కూడా కేకేఆర్ ధీమాగా ఉంది. ఫైనల్లో మరోసారి ఎస్ఆర్హెచ్ను మట్టికరిపించి ఈ సీజన్లో హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేస్తామని కేకేఆర్ ధీమాగా ఉంది. -
IPL 2024 KKR vs SRH: ఐపీఎల్ విన్నర్లు, రన్నరప్స్ వీరే..!
ఐపీఎల్ 2024 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. కేకేఆర్, సన్రైజర్స్ మధ్య నేడు (మే 26) జరుగబోయే ఫైనల్తో ఐపీఎల్ 17వ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది. ఈ సీజన్ గత సీజన్లకు భిన్నంగా సాగింది. బ్యాటింగ్కు సంబంధించి ఆల్టైమ్ రికార్డులు బద్దలుకావడంతో పాటు పలు సంచలన బౌలింగ్ ప్రదర్శనలు నమోదయ్యాయి. చెరి ఐదసార్లు ఛాంపియన్లైన ముంబై, సీఎస్కే ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు కూడా చేరకుండానే నిష్క్రమించాయి. దిగ్గజ కెప్టెన్లు రోహిత్, ధోని లేకుండా జరుగుతున్న ఐదో ఐపీఎల్ ఫైనల్ ఇది.ఐపీఎల్ 2024 ఫైనల్ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన 16 సీజన్లలో విజేతలు, రన్నరప్లపై ఓ లుక్కేద్దాం. ఇప్పటివరకు జరిగిన 16 ఫైనల్స్లో సీఎస్కే (2010, 2011, 2018, 2021, 2023), ముంబై (2013, 2015, 2017, 2019, 2020) చెరి ఐదుసార్లు టైటిల్ కైవసం చేసుకోగా.. కేకేఆర్ రెండు (2012, 2014), సన్రైజర్స్ (2016), రాజస్థాన్ రాయల్స్ (2008), గుజరాత్ టైటాన్స్ (2022), డెక్కన్ ఛార్జర్స్ (2009) తలో సారి టైటిల్ నెగ్గాయి. అత్యధికసార్లు రన్నరప్గా నిలిచిన ఘనత సీఎస్కేకు దక్కింది. సీఎస్కే ఐదుసార్లు (2008, 2012, 2013, 2015, 2019) ఫైనల్లో ఓటమిపాలైంది.ఆతర్వాత ఆర్సీబీ మూడు సార్లు (2009, 2011, 2016).. ముంబై ఇండియన్స్ (2010), కేకేఆర్ (2021), సన్రైజర్స్ (2018), రాజస్థాన్ రాయల్స్ (2022), గుజరాత్ టైటాన్స్ (2023), పంజాబ్ కింగ్స్ (2014), ఢిల్లీ క్యాపిటల్స్ (2020), రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ (2017) తలో సారి రన్నరప్గా నిలిచాయి.సీజన్ల వారీగా విజేతలు, రన్నరప్స్..2008- రాజస్థాన్ రాయల్స్ (విజేత), సీఎస్కే (రన్నరప్)2009- డెక్కన్ ఛార్జర్స్ (విజేత), ఆర్సీబీ (రన్నరప్)2010- సీఎస్కే (విజేత), ముంబై ఇండియన్స్ (రన్నరప్)2011- సీఎస్కే (విజేత), ఆర్సీబీ (రన్నరప్)2012- కేకేఆర్ (విజేత), సీఎస్కే (రన్నరప్)2013- ముంబై (విజేత), సీఎస్కే (రన్నరప్)2014- కేకేఆర్ (విజేత), పంజాబ్ (రన్నరప్)2015- ముంబై (విజేత), సీఎస్కే (రన్నరప్)2016- సన్రైజర్స్ (విజేత), ఆర్సీబీ (రన్నరప్)2017- ముంబై (విజేత), పూణే (రన్నరప్)2018- సీఎస్కే (విజేత), సన్రైజర్స్ (రన్నరప్)2019- ముంబై (విజేత), సీఎస్కే (రన్నరప్)2020- ముంబై (విజేత), ఢిల్లీ (రన్నరప్)2021- సీఎస్కే (విజేత), కేకేఆర్ (రన్నరప్)2022- గుజరాత్ (విజేత), రాజస్థాన్ (రన్నరప్)2023- సీఎస్కే (విజేత), గుజరాత్ (రన్నరప్) -
IPL 2024 ఫైనల్ జోరుగా బెట్టింగ్..
-
ఫైనల్లో తలపడనున్న SRH, KKR జట్లు
-
SRH Vs KKR IPL 2024 Final: జై జై రైజర్స్
ఐపీఎల్– 2024లో తుది సమరానికి రంగం సిద్ధమైంది. 65 రోజులు, 73 మ్యాచ్ల తర్వాత ఐపీఎల్–17 విజేతను తేల్చే మ్యాచ్కు ఆదివారం చెన్నై వేదికవుతోంది. హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్కు ఆనందాన్ని పంచుతూ ఫైనల్ చేరిన సన్రైజర్స్ టీమ్ ఆఖరి పంచ్ ఇవ్వాలని పట్టుదలగా ఉంది. తొలి క్వాలిఫయర్లో తమను దెబ్బ తీసిన కోల్కతా నైట్రైడర్స్ ఇప్పుడు మళ్లీ ప్రత్యర్థి రూపంలో ఎదురుగా ఉంది. గత మ్యాచ్కు ప్రతీకారం తీర్చుకుంటూ రైజర్స్ చెలరేగితే రెండోసారి లీగ్ చాంపియన్గా సగర్వంగా నిలవవచ్చు. 2016లో ఆఖరిసారిగా టైటిల్ సాధించిన హైదరాబాద్ 2018లో ఫైనల్ చేరి తుది మెట్టుపై తడబడింది. 2012, 2014లలో ఐపీఎల్ గెలుచుకున్న కోల్కతా ఇప్పుడు మూడోసారి ట్రోఫీపై గురి పెట్టింది. మ్యాచ్ చెన్నైలో జరుగుతుండడంతో మన నగర అభిమానుల మనసంతా అక్కడే ఉందనేది వాస్తవం. హైదరాబాద్ గెలిస్తే సారథిగా మన నగరానికి టైటిల్ అందించిన మూడో ఆస్ట్రేలియన్గా కమిన్స్ నిలుస్తాడు. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ ఫైనల్ ఆదివారం చెన్నైలో జరుగుతున్నప్పటికీ మన నగరంలోనే జరుగుతున్నంత కోలాహలం నెలకొంది. దీని కోసం నగరంలోని రెస్టారెంట్లు లైవ్ స్క్రీనింగ్ ప్రత్యేక వంటకాల ద్వారా ఈ మెగా ఈవెంట్కు సిద్ధమవుతున్నాయి. పలు పబ్స్, లాంజ్లు.. క్రికెట్ థీమ్ అలంకరణతో ఆకట్టుకుంటున్నాయి. మన సొంత జట్టు ఫైనల్కు చేరడంతో మరింత ఆసక్తికరంగా మారిన ఈ మ్యాచ్ నగరవాసులను ఉర్రూతలూగించనుంది. దీంతో ఎంట్రీ ఫీజు కనీసం రూ.500 నుంచి ప్రారంభించి ఆపై ధరలో విభిన్న రకాల ఆకర్షణలతో క్రికెట్ అభిమానుల్ని లైవ్ ఏర్పాట్లతో ఆహా్వనిస్తున్నారు. గచ్చిబౌలిలోని ముస్టాంగ్ టెర్రస్ లాంజ్లో ఏకంగా 3 స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్లోని ఎయిర్లైవ్లో 2 స్క్రీన్స్, మాదాపూర్లోని రష్ స్పోర్ట్స్ బార్ అండ్ బౌలింగ్ సెంటర్లో పెద్ద స్క్రీన్, కార్ఖానాలోని ద బార్ నెక్ట్స్ డోర్లో 2 బిగ్ స్క్రీన్స్తోపాటు చిన్నపాటి టీవీలు కూడా పూర్తిగా ఐపీఎల్ సందడికి సిద్ధమయ్యాయి. నగరంలోని పబ్స్, బార్స్, రెస్టారెంట్స్తో పాటు సికింద్రాబాద్ క్లబ్, జింఖానా క్లబ్, ఫిలింనగర్ క్లబ్.. వంటి సంపన్నులకు చెందిన క్లబ్స్ కూడా ప్రత్యేక ఏర్పాట్లతో సభ్యులను ఆహా్వనిస్తున్నాయి. మాల్స్, మలీ్టఫ్లెక్స్లూ, కెఫెలు సైతం స్క్రీన్స్ ఏర్పాటులో పోటీ పడుతున్నాయి. పలు గేటెడ్ కమ్యూనిటీల్లోనూ ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు. -
Qualifier 1: సన్రైజర్స్ విఫలం.. ఫైనల్ చేరిన కేకేఆర్
-
అదరగొట్టిన అయ్యర్ బ్రదర్స్.. ఫైనల్లో KKR
-
KKR vs RR: రాయల్స్ జట్టును ముంచేసిన వర్షం
-
ముంబై ని ఓడించి play offs లోకి కేకేఆర్
-
ముంబై ని ఓడించి play offs లోకి కేకేఆర్
-
ముంబై గెలిస్తే.. కేకేఆర్ కేకే! ప్లే ఆఫ్స్ బెర్తు కన్ఫామ్!?
-
IPL 2024: కేకేఆర్ బృందానికి చేదు అనుభవం
కేకేఆర్ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. ఎల్ఎస్జీతో మ్యాచ్ ముగించుకుని కోల్కతాకు బయల్దేరిన వీరికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి.Travel update: KKR's charter flight from Lucknow to Kolkata diverted to Guwahati due to bad weather ⛈️Flight currently standing at the Guwahati Airport tarmac. More updates soon pic.twitter.com/XFPTHgM2FJ— KolkataKnightRiders (@KKRiders) May 6, 2024రెండు సార్లు వీరు ప్రయాణిస్తున్న చార్టర్ విమానం దారి మళ్లింపునకు గురైంది. నిన్న సాయంత్రం నుంచి కేకేఆర్ బృందం గాల్లో అటూ ఇటూ చక్కర్లు కొడుతుంది. పలు ట్విస్ట్ల అనంతరం ఇవాళ (మే 7) తెల్లవారుజామున కేకేఆర్ టీమ్ వారణాసిలో ల్యాండైంది.Update at 1:20 AM: Flight diverted to Varanasi after another failed attempt at landing in Kolkata due to bad weather. Current status: At the Lal Bahadur Shastri International airport tarmac— KolkataKnightRiders (@KKRiders) May 6, 2024పూర్తి వివరాల్లోకి వెళితే.. కేకేఆర్ టీమ్ మే 5న ఎల్ఎస్జీతో మ్యాచ్ ముగించుకుని నిన్న (మే 6) సాయంత్రం 5:45కు లక్నో నుంచి కోల్కతాకు బయల్దేరింది. వీరు రాత్రి 7:25 గంటలకంతా కోల్కతాలో ల్యాండ్ కావాల్సి ఉండింది.అయితే నిన్న సాయంత్రం నుంచి కోల్కతాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కేకేఆర్ బృందం సేఫ్గా ల్యాండింగ్ కావడానికి కుదర్లేదు. రాత్రి 8:45 వరకు వీరు గాల్లోనే చక్కర్లు కొట్టారు. 8:46కు వీరి విమానం గౌహతికి డైవర్ట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. 9:30 ఆ మధ్యలో వీరు గౌహతిలో ల్యాండ్ అయ్యారు.ఎయిర్పోర్ట్లోనే ఉన్న కేకేఆర్ బృందానికి రాత్రి 9:43 గంటలకు మరో మెసేజ్ వచ్చింది. కోల్కతాలో ల్యాండ్ అవ్వడానికి క్లియరెన్స్ వచ్చింది. రాత్రి 11 గంటల్లోపు అక్కడ ల్యాండవుతామన్నది ఆ మెసేజ్ సారాంశం.అయితే కేకేఆర్ బృందానికి ఈసారి కూడా చుక్కెదురైంది. కోల్కతాలో మరోసారి వాతావరణం అనుకూలించకపోవడంతో అక్కడ ల్యాండింగ్ కుదర్లేదు. దీంతో వీరు గాల్లోనే యూ టర్న్ తీసుకుని ఇవాళ తెల్లవారుజామున వారణాసికి చేరుకున్నారు. ఉదయం 3 గంటల ప్రాంతలో కేకేఆర్ టీమ్ వారణాసిలోని తాజ్ హోటల్లో దిగినట్లు కేకేఆర్ యాజమాన్యం ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఇవాళ (మే 8) మధ్యాహ్నం 1:15 గంటలకు వీరు మరోసారి కోల్కతాలో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తారు. మరి ఈసారైనా విజయవంతంగా ల్యాండ్ అవుతారో లేదో వేచి చూడాలి.ఇదిలా ఉంటే, కేకేఆర్ టీమ్ మొన్న లక్నోతో జరిగిన మ్యాచ్లో 98 పరుగుల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ సీజన్లో ఈ జట్టు ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. మే 11న ముంబైతో.. 13న గుజరాత్.. 19న రాజస్థాన్ రాయల్స్తో తలపడాల్సి ఉంది. కేకేఆర్ టీమ్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్పై కర్చీఫ్ వేసుకుని కూర్చుంది. ఈ జట్టుతో పాటు రాయల్స్కు కూడా ప్లే ఆఫ్స్కు క్లియరెన్స్ సాధించింది. -
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. నంబర్ వన్గా..
-
ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
ఐపీఎల్ చరిత్రలోనే అత్యద్భుతమైన క్యాచ్కు నిన్నటి (మే 5) కేకేఆర్-లక్నో మ్యాచ్ వేదికైంది. ఈ మ్యాచ్లో కేకేఆర్ ఆటగాడు రమన్దీప్ సింగ్ నమ్మశక్యంకాని రీతిలో అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అర్శిన్ కులకర్ణి ఆడిన షాట్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని గాల్లో చాలాసేపు ప్రయాణించగా.. ఈ క్యాచ్ను అందుకునేందుకు రమన్దీప్ సింగ్ పెద్ద విన్యాసమే చేశాడు. తాను ఫీల్డింగ్ చేసే డైరెక్షన్ నుంచి వెనక్కు పరిగెడుతూ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టాడు. నమ్మశక్యం కాని ఈ విన్యాసానికి ప్రతి ఒక్కరు ముగ్దులైపోయారు. బ్యాటర్ అర్శిన్ చాలాసేపు ఈ విషయాన్ని నమ్మలేకపోయాడు. క్యాచ్ అనంతరం రమన్దీప్ను సహచరులు అభినందనలతో ముంచెత్తారు. బౌలర్ స్టార్క్, పక్కనే ఫీల్డింగ్ చేస్తున్న రసెల్ రమన్దీప్పై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తుంది.RAMANDEEP SINGH WITH ONE OF THE GREATEST CATCHES OF IPL HISTORY. 🤯🔥pic.twitter.com/xFiqHssmzV— Mufaddal Vohra (@mufaddal_vohra) May 5, 2024 ఈ మ్యాచ్లో రమన్దీప్ బ్యాటింగ్లోనూ సత్తా చాటాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో వచ్చి సుడిగాలి ఇన్నింగ్స్ (6 బంతుల్లో 25 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) ఆడి ఆకట్టుకున్నాడు. రమన్దీప్తో పాటు సునీల్ నరైన్ (39 బంతుల్లో 81; 6 ఫోర్లు, 7 సిక్సర్లు; 4-0-22-1), హర్షిత్ రాణా (3.1-0-24-3), వరుణ్ చక్రవర్తి (3-0-30-3), రసెల్ (2-0-17-2) చెలరేగడంతో ఈ మ్యాచ్లో కేకేఆర్ లక్నోను 98 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ గెలుపుతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో రాజస్థాన్ను కిందకు నెట్టి అగ్రస్థానానికి ఎగబాకింది.కేకేఆర్ ఇన్నింగ్స్లో నరైన్, రమన్దీప్లతో పాటు ఫిలిప్ సాల్ట్ (14 బంతుల్లో 32; 5 ఫోర్లు, సిక్స్), రఘువంశీ (32), శ్రేయస్ అయ్యర్ (23) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుద్వీర్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో.. కేకేఆర్ బౌలర్ల ధాటికి 16.1 ఓవర్లలో 137 పరుగులకే చాపచుట్టేసింది. లక్నో ఇన్నింగ్స్లో స్టోయినిస్ (36) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
KKR vs LSG: విజయం ఎవరిని వరిస్తుంది?
-
ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
ఐపీఎల్లో ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్లో పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్.. రాత్రి మ్యాచ్లో లక్నో, కేకేఆర్ తలపడనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్కు ధర్మశాల మైదానం వేదిక కానుండగా.. రాత్రి మ్యాచ్ లక్నో హోం గ్రౌండ్ అటల్ బిహారీ స్టేడియంలో జరుగనుంది.పంజాబ్, సీఎస్కే మ్యాచ్ విషయానికొస్తే.. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే సీఎస్కే ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. చెన్నై ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో ఐదు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్తో కలిపి చెన్నై మరో నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇతర జట్లతో పోటీ లేకుండా ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే చెన్నై ఇకపై ఆడబోయే అన్ని మ్యాచ్ల్లో గెలవాల్సి ఉంటుంది. చెన్నై మే 10న గుజరాత్, 12న రాజస్థాన్ రాయల్స్, 18న ఆర్సీబీతో తలపడాల్సి ఉంది.పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్ ఈ మ్యాచ్తో పాటు తదుపరి ఆడబోయే మూడు మ్యాచ్ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుందని చెప్పలేని పరిస్థితి ఉంది. టెక్నికల్గా పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నప్పటికీ అనధికారికంగా కష్టమే అని చెప్పాలి. తదుపరి మ్యాచ్ల్లో పంజాబ్.. ఆర్సీబీ (మే 9), రాజస్థాన్ రాయల్స్ (మే 15), సన్రైజర్స్ (మే 19) జట్లను ఢీకొట్టాల్సి ఉంది.హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు 29 మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. సీఎస్కే 15, పంజాబ్ 14 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు ఇదే సీజన్లో చివరిసారిగా తలపడ్డాయి. మే 1న జరిగిన ఆ మ్యాచ్లో పంజాబ్ సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.తుది జట్లు (అంచనా)..పంజాబ్: జానీ బెయిర్స్టో, ప్రభ్సిమ్రన్ సింగ్, రిలీ రోసోవ్, సామ్ కర్రన్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్కీపర్), శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్. [ఇంపాక్ట్ ప్లేయర్: అర్ష్దీప్ సింగ్].సీఎస్కే: అజింక్య రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, సమీర్ రిజ్వీ, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశ్పాండే. [ఇంపాక్ట్ సబ్: మతీష పతిరణ]లక్నో-కేకేఆర్ మ్యాచ్ విషచయానికొస్తే.. ఇరు జట్లు ప్లే ఆఫ్స్ రేసులో దూసుకుపోతున్నాయి. కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో ఏడింట గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. లక్నో 10లో 6 మ్యాచ్లు గెలిచి మూడో స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్ తదుపరి ఆడబోయే నాలుగు మ్యాచ్ల్లో మరో రెండు మ్యాచ్లు గెలిచినా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించనుండగా.. లక్నో నాలుగులో కనీసం మూడు మ్యాచ్లైనా గెలిస్తే ఫ్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. లక్నో నాలుగులో మూడింట గెలిస్తే ఇతర జట్ల జయాపజయాలతో పని లేకుండా సేఫ్గా ఫైనల్ ఫోర్కు చేరుకుంటుంది.కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ (మే 11), గుజరాత్ (మే 13), రాజస్థాన్ రాయల్స్తో (మే 19) తలపడాల్సి ఉండగా.. లక్నో సన్రైజర్స్ (మే 8), ఢిల్లీ (మే 14), ముంబై ఇండియన్స్ (మే 17) జట్లను ఢీకొట్టాల్సి ఉంది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. లక్నోపై కేకేఆర్ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించినట్లు తెలుస్తుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 4 మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. కేకేఆర్ 3, లక్నో ఒక మ్యాచ్లో గెలుపొందాయి. ఇరు జట్ల మధ్య చివరసారిగా జరిగిన మ్యాచ్లో కూడా కేకేఆరే పైచేయి సాధించింది. ఏప్రిల్ 14న జరిగిన ఆ మ్యాచ్లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో లక్నోను చిత్తు చేసింది.తుది జట్లు (అంచనా)..లక్నో: కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్కేకేఆర్: ఫిలిప్ సాల్ట్ (వికెట్కీపర్), సునీల్ నరైన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి -
ముంబైని ముంచేసిన కేకేఆర్
-
కేకేఆర్ను ఢీకొట్టనున్న ముంబై
-
Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
-
Anchor Sreemukhi: ఉప్పల్ స్టేడియంలో యాంకర్ శ్రీముఖి సందడి (ఫోటోలు)
-
IPL 2024: కేకేఆర్ స్టార్ ప్లేయర్కు భారీ షాక్.. జరిమానాతో పాటు నిషేధం
కేకేఆర్ స్టార్ బౌలర్ హర్షిత్ రాణాకు భారీ షాక్ తగిలింది. నిన్న (ఏప్రిల్ 29) ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ సందర్భంగా కోడ్ ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను అతని మ్యాచ్ ఫీజ్లో 100 శాతం కోత విధించబడింది. ప్రస్తుత సీజన్లో రాణా రెండోసారి కోడ్ ఉల్లంఘనకు పాల్పడటంతో అతనిపై ఓ మ్యాచ్ నిషేధం కూడా పడింది. ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు బ్యాటర్ అభిషేక్ పోరెల్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు రాణాపై కఠిన చర్యలు తీసుకున్నారు. అభిషేక్ ఔటైన తర్వాత రాణా శృతిమించిన సంబురాలు (అభిషేక్ను డగౌట్ వైపు వెళ్లాలని కోపంగా ఆదేశించాడు) చేసుకుని తగిన మూల్యం చెల్లించుకున్నాడు. రాణా కొద్ది రోజుల కిందట కూడా ఇలాగే ప్రవర్తించి జరిమానాను ఎదుర్కొన్నాడు. సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ను ఔట్ చేశాక ఓవరాక్షన్ (ఫ్లయింగ్ కిస్ ఇస్తూ కోపంగా చూశాడు) చేశాడు. అందుకు మ్యాచ్ ఫీజ్లో 60 శాతం జరిమానాను ఎదుర్కొన్నాడు. ఢిల్లీతో మ్యాచ్లో రాణా అతి చేసినా బౌలింగ్లో ఆట్టున్నాడు. 4 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో కేకేఆర్ ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగా.. కేకేఆర్ 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, ఈ సీజన్లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. ఫిలిప్ సాల్ట్ (68) మెరుపు ఇన్నింగ్స్ ఆడి కేకేఆర్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు కేకేఆర్ బౌలర్లు చెలరేగడంతో ఢిల్లీ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. కుల్దీప్ యాదవ్ (35 నాటౌట్) ఆ జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా, వైభవ్ అరోరా తలో 2 వికెట్లు, స్టార్క్, నరైన్ చెరో వికెట్ పడగొట్టారు. -
ఐపీఎల్లో నేటి (Apr 29) మ్యాచ్.. కేకేఆర్ను ఢీకొట్టనున్న ఢిల్లీ
ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 29) జరుగబోయే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్ను ఢీకొట్టనుంది. కేకేఆర్ హోం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్లో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సీజన్లో కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఇప్పుడిప్పుడే విజయాల బాటపట్టిన ఢిల్లీ 10 మ్యాచ్ల్లో 5 విజయాలతో ఆరో స్థానంలో నిలిచింది. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. కేకేఆర్ 17, ఢిల్లీ 15 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ప్లే ఆఫ్స్కు చేరాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. కేకేఆర్ గత మ్యాచ్లో అతి భారీ స్కోర్ (261/6) చేసి కూడా పంజాబ్ చేతిలో భంగపడగా.. ఢిల్లీ తమ చివరి మ్యాచ్ల్లో నాలుగింట గెలిచి కేకేఆర్ కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంది. ఇరు జట్లు ఇదే సీజన్లో తలపడిన సందర్భంలో కేకేఆర్ ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ఏప్రిల్3న విశాఖ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ 166 పరుగులకే కుప్పకూలి 106 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో విధ్వంసకర ఆటగాడు, ఢిల్లీ ఓపెనర్ జేక్ ఫ్రేసర్పై అందరి కళ్లు ఉన్నాయి. ఫ్రేసర్ ముంబైతో ఆడిన గత మ్యాచ్లో మ్యాడ్ మ్యాన్లా రెచ్చిపోయి 27 బంతుల్లో 84 పరుగులు చేశాడు.తుది జట్లు (అంచనా)..కోల్కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, దుష్మంత చమీర, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా (ఇంపాక్ట్ ప్లేయర్)ఢిల్లీ: జేక్ ఫ్రేసర్-మెక్గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కుషాగ్రా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, రసిఖ్ సలాం (ఇంపాక్ట్ ప్లేయర్) -
సాహో పంజాబ్.. ఈడెన్ గార్డెన్స్లో పరుగుల వరద
-
IPL 2024: వరుసగా ఓడిపోతున్నా పంజాబ్ బౌలర్లను మించిన తోపులు లేరు..!
బ్యాటర్ల హవా కొనసాగుతున్న ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పంజాబ్ బౌలర్లు ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు (41 మ్యాచ్లు) జరిగిన మ్యాచ్ల్లో పంజాబ్ ఒక్కటే ఒక్కసారి కూడా ప్రత్యర్దిని 200 పరుగులు చేయనీయలేదు. ఈ సీజన్లో పంజాబ్ బౌలింగ్ యావరేజ్ 24.94గా ఉంది. ఏ జట్టుకు ఈ సీజన్లో ఇంత తక్కువ బౌలింగ్ సగటు లేదు. పంజాబ్ తర్వాత కేకేఆర్కు అత్యల్ప బౌలింగ్ సగటు (25.47) ఉంది. పంజాబ్ ఈ సీజన్లో అత్యధికంగా 199 పరుగులు ప్రత్యర్దికి సమర్పించుకుంది. ఇలా రెండు సందర్భాల్లో జరిగింది. ఇదిలా ఉంటే, పంజాబ్ ఇవాళ (ఏప్రిల్ 26) పటిష్టమైన కేకేఆర్ను వారి సొంత మైదానంలో ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ పంజాబ్కు చాలా కీలకంగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే పంజాబ్ ప్లే ఆఫ్స్ లెక్కల్లో ఉంటుంది. లేకపోతే మరో సీజన్లో ఈ జట్టు టైటిల్ లేకుండా రిక్త హస్తాలతో వైదొలగాల్సి ఉంటుంది. పంజాబ్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. మరోవైపు కేకేఆర్ ఏడింట ఐదు మ్యాచ్లు గెలిచి రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్లో కేకేఆర్ అంచనాలకు తగ్గట్టు రాణిస్తూ మూడో టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది.ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. పంజాబ్పై కేకేఆర్కు స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్ల్లో తలపడగా.. కేకేఆర్ 21, పంజాబ్ 11 మ్యాచ్ల్లో గెలుపొందాయి.తుది జట్లు..కోల్కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, దుష్మంత చమీర, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణాపంజాబ్ కింగ్స్: జానీ బెయిర్స్టో, సామ్ కర్రన్(కెప్టెన్), రిలీ రోసోవ్, జితేష్ శర్మ(వికెట్కీపర్), శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్ -
IPL 2024: కేకేఆర్ను ఢీకొట్టనున్న పంజాబ్.. స్టార్క్ ఔట్, ధవన్ ఇన్..?
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 26) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్.. టేబుల్ సెకెండ్ టాపర్ అయిన కేకేఆర్ను వారి సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్లో ఢీకొట్టనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ పంజాబ్కు చాలా కీలకం కానుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే పంజాబ్ ప్లే ఆఫ్స్ లెక్కల్లో ఉంటుంది.లేకపోతే మరో సీజన్లో టైటిల్ లేకుండా రిక్త హస్తాలతో వైదొలగాల్సి ఉంటుంది. పంజాబ్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. మరోవైపు కేకేఆర్ ఏడింట ఐదు మ్యాచ్లు గెలిచి రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్లో కేకేఆర్ అంచనాలకు తగ్గట్టు రాణిస్తూ మూడో టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది.హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. పంజాబ్పై కేకేఆర్ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్ల్లో తలపడగా.. కేకేఆర్ 21, పంజాబ్ 11 మ్యాచ్ల్లో గెలుపొందాయి.బలాబలాల విషయానికొస్తే.. పంజాబ్తో పోలిస్తే కేకేఆర్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పెట్టి సొంతం చేసుకున్న మిచెల్ స్టార్క్ మినహా కేకేఆర్కు పెద్ద సమస్యలేమీ లేవు. స్టార్క్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్ల్లో తేలిపోయాడు. వికెట్లు తీయకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. నరైన్, రసెల్తో పాటు కుర్ర బౌలర్లు రాణిస్తుండటంతో స్టార్క్ వైఫల్యాలు హైలైట్ కావడం లేదు.పంజాబ్తో నేటి మ్యాచ్లో స్టార్క్ పక్కకు కూర్చోవాల్సి రావచ్చు. అతను ఆర్సీబీ గత మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు (వేలికి). స్టార్క్ గత రెండు రోజులుగా ప్రాక్టీస్ సెషన్స్లోనూ కనబడలేదు. దీన్ని బట్టి చూస్తే.. పంజాబ్తో మ్యాచ్లో అతను ఆడకపోవచ్చని తెలుస్తుంది.పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు మిడిలార్డర్ బ్యాటర్లు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మపై అందరి చూపు ఉంది. ఈ సీజన్లో ఈ ఇద్దరు అద్భుతమైన పోరాటాలతో పంజాబ్ ఆడిన ప్రతి మ్యాచ్ను రక్తి కట్టించారు. వీరిద్దరి నుంచి అభిమానులు మరోసారి సంచలన ఇన్నింగ్స్లు ఆశిస్తున్నారు. వీరిద్దరు మినహా ఈ సీజన్లో పంజాబ్కు చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు. ఈ మ్యాచ్లో పంజాబ్ రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధవన్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్లకు దూరంగా శిఖర్ తాజాగా జరిగిన ప్రాక్టీస్ సెషన్స్లో యాక్టివ్గా కనిపించాడు. దీన్ని బట్టి అతని రీఎంట్రీ ఖాయమని తేలిపోయింది. నేటి మ్యాచ్లో స్టార్క్ ఆడకపోతే అతడి స్థానంలో దుష్మంత చమీర ఆడే అవకాశం ఉంది. తుది జట్లు (అంచనా)..కేకేఆర్: ఫిల్ సాల్ట్ (వికెట్కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్/దుష్మంత చమీర, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ. [ఇంపాక్ట్ ప్లేయర్: వెంకటేష్ అయ్యర్]పంజాబ్: శిఖర్ ధవన్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, ప్రభ్సిమ్రన్ సింగ్, సామ్ కర్రన్, జితేష్ శర్మ (వికెట్కీపర్), లియామ్ లివింగ్స్టోన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, హర్షల్ పటేల్. [ఇంపాక్ట్ ప్లేయర్: అర్ష్దీప్ సింగ్] -
టీ20 వరల్డ్కప్లో రీఎంట్రీపై విండీస్ వీరుడి స్పందన ఇదే..!
విండీస్ వెటరన్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ టీ20 వరల్డ్కప్తో అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తాడని గతకొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై నరైన్ తాజాగా స్పందించాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావడం అసాధ్యమని స్పష్టం చేశాడు. రీఎంట్రీకి డోర్లు మూసుకుపోయాయని అన్నాడు. ఇటీవలికాలంలో తన ప్రదర్శనలు సంతృప్తినిచ్చాయని తెలిపాడు. టీ20 వరల్డ్కప్ ఆడాలనే అభిమానుల ప్రతిపాదనను గౌరవిస్తానని అన్నాడు. అయితే అందుకు ఓకే మాత్రం చెప్పలేనని వివరించాడు. వరల్డ్కప్ ఆడే విండీస్ జట్టుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని.. విండీస్ వీరులు మరో టైటిల్కు అర్హులేనంటూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. నరైన్ టీ20 వరల్డ్కప్లో ఆడటంపై బహిరంగ ప్రకటన చేయడంతో విండీస్ క్రికెట్ బోర్డు ఓ అంచనాకు వచ్చింది. నరైన్ను టీ20 వరల్డ్కప్లో ఆడాలని ఒప్పించేందుకు తాను గతకొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని విండీస్ టీ20 జట్టు కెప్టెన్ రోవ్మన్ పావెల్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, నరైన్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో బంతితో పాటు బ్యాట్తోనూ అదరగొడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో నరైన్ మెరపు శతకంతో (56 బంతుల్లో 109) విరుచుకుపడ్డాడు. ఈ సీజన్లో నరైన్ 7 మ్యాచ్ల్లో సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 286 పరుగులు చేశాడు. 9 వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ సీజన్లో కేకేఆర్ సాధించిన విజయాల్లో నరైన్ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించాడు. నరైన్ ఈ సీజన్లోనే రెండు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. నరైన్ ఓపెనర్గా బరిలోకి దిగుతున్నప్పటి నుంచి అతని ఫేట్ మారిపోయింది. ఓపెనర్గా అతను స్వేచ్ఛగా షాట్లు ఆడుతూ భారీ స్కోర్లు చేస్తున్నాడు. నరైన్ను ఓపెనర్గా పంపడం కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ ప్రతిపాదన. గతంలోనూ గంభీర్ నరైన్ను ఓపెనర్గా పంపి సత్ఫలితాలు సాధించాడు. 35 ఏళ్ల నరైన్ 2019లో చివరిసారిగా వెస్టిండీస్కు ఆడాడు. అతను 2023లో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. తాజా బ్యాటింగ్ ఫామ్ నేపథ్యంలో నరైన్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ ఏడాది టీ20 వరల్డ్కప్ కోసం చాలామంది వెటరన్ క్రికెటర్లు రిటైర్మెంట్ నిర్ణయాలను వెనక్కు తీసుకున్నారు. పాక్ ఆటగాళ్లు ఇమాద్ వసీం, మొహహ్మద్ ఆమిర్ టీ20 వరల్డ్కప్ కోసం యూ టర్న్ తీసుకున్నారు. -
IPL 2024 KKR Vs RCB: ఫేవరేట్ కేకేఆర్
-
ఐపీఎల్కు 17 ఏళ్లు.. తొలి మ్యాచ్ ఆడిన వాళ్లు ఇప్పుడు ఎంత మంది ఉన్నారు..?
క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్కు నేటితో 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఇవాళ (ఏప్రిల్ 18) క్యాష్ రిచ్ లీగ్ 17వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఐపీఎల్ మేనేజ్మెంట్ ఓ పోస్టర్ను రిలీజ్ చేసి గతాన్ని గుర్తు చేసుకుంది. మీ ఫేవరెట్ ఐపీఎల్ జ్ఞాపకాన్ని కూడా షేర్ చేసుకోండని క్యాప్షన్ జోడించింది. దీంతో చాలామంది ఐపీఎల్ అభిమానులు తమ తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. IPL's poster on Completed "17 Years of IPL". - The Biggest Cricket Event...!!!! ⭐ pic.twitter.com/oXgkvRf0dP — CricketMAN2 (@ImTanujSingh) April 18, 2024 ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ఓ ఆసక్తికర ప్రశ్నను సంధించాడు. ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్లో ఆడిన వారు ప్రస్తుతం ఎంత మంది ఇప్పటికీ ఆడుతున్నారని అడిగాడు. దీనికి చాలామంది తమకు తెలిసిన సమాధానాలు చెప్పారు. సమాధానం రివీల్ చేయకముందు మీకు తెలిసిన సమాధాన్ని మీరు కూడా షేర్ చేయండి. 17 YEARS OF THE IPL...!!! 💥 The greatest league in the world started on this day in 2008. 🇮🇳 pic.twitter.com/BPApcjBkOL — Mufaddal Vohra (@mufaddal_vohra) April 18, 2024 సమాధానం విషయానికొస్తే.. ఐపీఎల్ తొలి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, కేకేఆర్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో కేకేఆర్ తరఫున ఆడిన వృద్దిమాన్ సాహా, ఇషాంత్ శర్మ ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మ్యాచ్లో ఆర్సీబీకి ఆడిన విరాట్ కోహ్లి ఇప్పుడు కూడా అదే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆడిన ఈ ముగ్గురు మాత్రమే ఐపీఎల్లో ఇంకా కొనసాగుతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే.. ఐపీఎల్ చరిత్రలో విరాట్ ఒక్కడే నాటి నుంచి నేటి వరకు ఒకే జట్టుకు ఆడుతూ ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నాడు. నాటి మ్యాచ్ విషయానికొస్తే.. బ్రెండన్ మెక్కల్లమ్ శివాలెత్తిపోవడంతో (73 బంతుల్లో 158; 10 ఫోర్లు, 13 సిక్సర్లు) కేకేఆర్ 140 పరుగల భారీ తేడాతో ఆర్సీబీపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత ఓవరల్లో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కేకేఆర్ ఇన్నింగ్స్లో మెక్కల్లమ్ ఒక్కడే సింహ భాగం స్కోర్ చేశాడు. సౌరవ్ గంగూలీ 10, రికీ పాంటింగ్ 20, డేవిడ్ హస్సీ 12, మొహమ్మద్ హఫీజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఆర్సీబీ బౌలర్లలో జహీర్ ఖాన్, ఆష్లే నోఫ్కే, జాక్ కలిస్ తలో వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఆశోక్ దిండా (3-0-9-2), ఇషాంత్ శర్మ (3-0-7-1), అజిత్ అగార్కర్ (4-0-25-3), సౌరవ్ గంగూలీ (4-0-21-2), లక్ష్మీ రతన్ శుక్లా (1.1-0-12-1) ధాటికి 15.1 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో ఒకే ఒక్కరు (ప్రవీణ్ కుమార్ (18 నాటౌట్)) రెండంకెల స్కోర్ చేశారు. ద్రవిడ్ 2, వసీం జాఫర్ 6, విరాట్ కోహ్లి 1, జాక్ కలిస్ 8, కెమరూన్ వైట్ 6, మార్క్ బౌచర్ 7, బాసిల్ థంపి 0, నోఫ్కే 9, జహీర్ ఖాన్ 3, సునీల్ జోషి 3 పరుగులు చేసి ఔటయ్యారు. వికెట్ కీపర్గా వృద్దిమాన్ సాహా కలిస్ క్యాచ్ అందుకున్నాడు. -
రోలర్ కోస్టర్: ఆఖరి బంతికి కేకేఆర్పై రాజస్తాన్ గెలుపు
-
T20 WC: బతిమిలాడుతున్నా వినడం లేదు.. ఇక వాళ్లదే భారం!
ఐపీఎల్ 2024.. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో చేసిన పరుగులు 276.. పడగొట్టిన వికెట్లు ఏడు(7/165).. కోల్కతా నైట్ రైడర్స్ స్పిన్ ఆల్రౌండర్ సునిల్ నరైన్ నమోదు చేసిన గణాంకాలివి. రాజస్తాన్ రాయల్స్తో మంగళవారం నాటి మ్యాచ్లో 35 ఏళ్ల ఈ వెస్టిండీస్ ఆటగాడు కుర్రాళ్ల కళ్లు చెదిరే రీతిలో అద్బుతమైన షాట్లతో అలరించాడు. మొత్తంగా 56 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో 109 పరుగులు చేశాడు. ఓపెనర్గా ఇరగదీస్తున్నాడు విధ్వంసకర శతకంతో విరుచుకుపడి తన ఆటలో పస తగ్గలేదని మరోసారి నిరూపించాడు. కేకేఆర్కు దొరికిన విలువైన ఆస్తి అంటూ నీరాజనాలు అందుకుంటున్నాడు ఈ లెఫ్టాండ్ బ్యాటర్. 𝐍𝐚𝐫𝐢𝐧𝐞, naam toh suna hi hoga 😉 He scores his maiden 💯 in T20s at the iconic Eden Gardens 🏟️#KKRvRR #TATAIPL #IPLonJioCinema #SunilNarine | @KKRiders pic.twitter.com/TKFSFsc3Lp — JioCinema (@JioCinema) April 16, 2024 కేవలం పరుగుల తీయడానికే పరిమితం కాని ఈ రైటార్మ్ స్పిన్నర్.. రెండు వికెట్లు పడగొట్టాడు. అలాగే ఓ క్యాచ్ కూడా అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్ మ్యాచ్లో సెంచరీ చేయడంతో పాటు క్యాచ్, వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 12 నెలలుగా ప్రయత్నిస్తూనే ఉన్నా ఇక ఈ వెటరన్ ఆల్రౌండర్ ప్రతిభకు వెస్టిండీస్ కెప్టెన్, రాజస్తాన్ రాయల్స్ హిట్టర్ రోవ్మన్ పావెల్ కూడా ఫిదా అయ్యాడు. నరైన్ను ఎలాగైనా ఒప్పించి ఈసారి వరల్డ్కప్లో ఆడించే ప్రయత్నం చేస్తామంటున్నాడు. కేకేఆర్పై రాజస్తాన్ విజయంలో తన వంతు పాత్ర పోషించిన పావెల్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘గత 12 నెలలుగా నేను నరైన్ చెవిలో జోరీగలా మొత్తుకుంటూనే ఉన్నాను. రిటైర్మెంట్ వెనక్కి తీసుకోమని అడుగుతున్నాను. కానీ అతడు ఏదో దాస్తున్నాడు. ఎవరితోనూ తన మనసులోని భావాలు పంచుకోవడం లేదు. ఈ విషయం గురించి ఇప్పటికే కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్లతో చర్చించాను.ప్రపంచకప్ జట్టు ఎంపిక కంటే ముందే వీళ్లు అతడి మనసులో ఏముందో కనిపెట్టగలరనే అనుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. విండీస్లో ఈసారి వరల్డ్కప్ జూన్ 1 నుంచి వెస్టిండీస్- అమెరికా వేదికగా మొదలుకానున్న టీ20 ప్రపంచకప్-2024లో సునిల్ నరైన్ ఆడించడమే తన లక్ష్యమని రోవ్మన్ పావెల్ ఈ సందర్భంగా ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో చెప్పుకొచ్చాడు. ఇక కేకేఆర్తో మ్యాచ్లో పావెల్ 13 బంతుల్లో 26 పరుగులు చేసి నరైన్ బౌలింగ్లో బౌల్డ్ కావడం విశేషం. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో 29 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న నరైన్.. మరో 20 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. 2023లో రిటైర్ అయిన నరైన్ 2012, 2014 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో వెస్టిండీస్ తరఫున బరిలోకి దిగిన సునిల్ నరైన్.. 2019 నుంచి జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో.. 2023లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అయితే ఫ్రాంఛైజీ క్రికెట్లో మాత్రం ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. చదవండి: #T20WorldCup2024: రోహిత్తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
KKR Vs RR: ఐపీఎల్లో ఇవాళ మరో బిగ్ ఫైట్.. పరుగుల వరద ఖాయం..!
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 16) మరో బిగ్ ఫైట్ జరుగనుంది. పటిష్టమైన, పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న రాజస్థాన్, కేకేఆర్ జట్లు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కత్తులు దూసుకోనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో పరుగుల వరద పారడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటర్లకు అనుకూలించనుండటంతో నేటి మ్యాచ్లో బ్యాటర్లు చెలరేగే అవకాశం ఉందని అంచనా. ఈ సీజన్లో ఆరు మ్యాచ్లో ఐదింట గెలిచిన రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఐదింట నాలుగు మ్యాచ్ల్లో గెలిచిన కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు గతంలో 27 సార్లు ఎదురెదురుపడగా కేకేఆర్ 14, రాయల్స్ 13 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది. ఈడెన్ గార్డెన్స్ విషయానికొస్తే.. ఈ మైదానంలో రాయల్స్పై కేకేఆర్దే పైచేయిగా ఉంది. ఇక్కడ ఇరు జట్లు 9 మ్యాచ్ల్లో తలపడగా.. కేకేఆర్ 6, రాయల్స్ 3 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ప్రస్తుత సీజన్లో ఇరు జట్ల బలాబలాలపై లుక్కేస్తే.. రెండు జట్లు అన్ని విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్లలో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని అంచనా వేయడానికి వీల్లేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇరు జట్లు. కేకేఆర్ బ్యాటింగ్లో ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్, రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, రసెల్ లాంటి విధ్వంసకర వీరులు ఉండగా.. రాయల్స్ బ్యాటింగ్ లైనప్లో యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, హెట్మైర్, రోవ్మన్ పావెల్ లాంటి మెరుపు వీరులు ఉన్నారు. బౌలింగ్ విభాగం విషయానికొస్తే.. కేకేఆర్లో స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా లాంటి స్టార్ పేసర్లు ఉండగా.. రాయల్స్లో ట్రెంట్ బౌల్ట్, చహల్, అశ్విన్ లాంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా ఉండటంతో నేటి మ్యాచ్లో పైచేయి ఎవరిదని చెప్పడం చాలా కష్టం. -
కేకేఆర్ చేతిలో లక్నో చిత్తు
-
IPL 2024 KKR VS LSG: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన రమణ్దీప్ సింగ్
లక్నో సూపర్ జెయింట్స్తో ఇవాళ (ఏప్రిల్ 14) జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ ఆటగాడు రమణ్దీప్ సింగ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో దీపక్ హుడా (8) కొట్టిన షాట్ను రమణ్దీప్ డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. Ramandeep Singh. 🦅pic.twitter.com/3mhPdFNAJc — Mufaddal Vohra (@mufaddal_vohra) April 14, 2024 కాగా, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఆచితూచి ఇన్నింగ్స్ ప్రారంభించిన లక్నో 13 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. డికాక్ (10), కేఎల్ రాహుల్ (39), దీపక్ హుడా (8), స్టోయినిస్ (10) ఔట్ కాగా.. బదోని (27), పూరన్ (2) క్రీజ్లో ఉన్నారు. స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసెల్ తలో వికెట్ పడగొట్టారు. ప్రస్తుత సీజన్లో లక్నో హ్యాట్రిక్ విజయాలు సాధించి (5 మ్యాచ్ల్లో 3 విజయాలు) పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. హ్యాట్రిక్ విజయాల అనంతరం కేకేఆర్, లక్నో ఇటీవలే ఓ ఓటమిని ఎదుర్కొన్నాయి. కేకేఆర్ తమ చివరి మ్యాచ్లో సీఎస్కే చేతిలో ఓడగా.. లక్నో తాజాగా ఢిల్లీ చేతిలో పరాభవం ఎదుర్కొంది. హెడ్ టు హెడ్ ఫైట్ల విషయానికొస్తే.. ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 3 మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. మూడు సందర్భాల్లో లక్నోనే విజయం వరించింది. -
IPL 2024, KKR VS LSG Updates: సాల్ట్ ఊచకోత.. లక్నోపై కేకేఆర్ విజయం
సాల్ట్ ఊచకోత.. లక్నోపై కేకేఆర్ విజయం ఐపీఎల్-2024లో కోల్కతా నైట్రైడర్స్ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. 162 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్.. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 15.4 ఓవర్లలో చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ విధ్వంసం సృష్టించాడు. 47 బంతులు ఎదుర్కొన్న సాల్ట్.. 14 ఫోర్లు, 3 సిక్స్లతో 89 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 38 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. లక్నో బౌలర్లలో మొహ్షిన్ ఖాన్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. 12 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 113/2 12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. క్రీజులో సాల్ట్(57), శ్రేయస్ అయ్యర్(25) పరుగులతో ఉన్నారు. 8 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 80/2 8 ఓవర్లు ముగిసే సరికి కోల్కతా 2 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(11), ఫిల్ సాల్ట్(42) పరుగులతో ఉన్నారు. కేకేఆర్ రెండో వికెట్ డౌన్.. 44 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రఘువంశీ.. మోహ్షిన్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు కోల్కతా స్కోర్: 58/2. క్రీజులో ఫిల్ సాల్ట్(30), శ్రేయస్ అయ్యర్(5) పరుగులతో ఉన్నారు. కేకేఆర్ తొలి వికెట్ డౌన్.. నరైన్ ఔట్ 22 పరుగుల వద్ద కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన సునీల్ నరైన్.. మోహ్షిన్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు కోల్కతా స్కోర్: 42/1. క్రీజులో ఫిల్ సాల్ట్(19), రఘు వంశీ(7) పరుగులతో ఉన్నారు. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఆఖర్లో పూరన్ (45 నాటౌట్) బ్యాట్ను ఝులిపించడంతో లక్నో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రాహుల్ (39), బదోని (29) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. డికాక్ (10), స్టోయినిస్ (10), దీపక్ హుడా (8) తక్కువ స్కోర్కే ఔటయ్యారు. స్టార్క్ 3 వికెట్లతో చెలరేగగా.. వైభవ్ అరోరా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, రసెల్ తలో వికెట్ తీశారు. ఐదో వికెట్ కోల్పోయిన లక్నో 14.4వ ఓవర్: 111 పరుగుల వద్ద లక్నో ఐదో వికెట్ కోల్పోయింది. సునీల్ నరైన్ బౌలింగ్లో రఘువంశీకి క్యాచ్ ఇచ్చి ఆయుశ్ బదోని (29) ఔటయ్యాడు. పూరన్ (10), కృనాల్ పాండ్యా క్రీజ్లో ఉన్నారు. డేంజరస్ స్టోయినిస్ ఔట్ 11.4వ ఓవర్: 95 పరుగుల వద్ద లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో వికెట్కీపర్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి స్టోయినిస్ (10) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన లక్నో.. రాహుల్ ఔట్ 10.2వ ఓవర్: 78 పరుగుల వద్ద లక్నో మూడో వికెట్ కోల్పోయింది. రసెల్ బౌలింగ్లో సిక్సర్ బాదిన తర్వాతి బంతికే కేఎల్ రాహుల్ (39) ఔటయ్యాడు. రమన్దీప్కు క్యాచ్ ఇచ్చి రాహుల్ పెవిలియన్కు చేరాడు.బదోని (18), స్టోయినిస్ (8) క్రీజ్లో ఉన్నారు. రమణ్దీప్ సూపర్ క్యాచ్.. హుడా ఔట్ 4.4వ ఓవర్: 39 పరుగుల వద్ద మిచెల్ స్టార్క్ బౌలింగ్లో రమణ్దీప్ సింగ్ సూపర్ క్యాచ్ పట్టడంతో దీపక్ హుడా (8) పెవిలియన్కు చేరాడు. 5 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 39/2గా ఉంది. రాహుల్ (18), బదోని క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన లక్నో 1.5వ ఓవర్: 19 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది.వైభవ్ అరోరా బౌలింగ్లో సునీల్ నరైన్కు క్యాచ్ ఇచ్చి క్వింటన్ డికాక్ (10) ఔటయ్యాడు. రాహుల్కు (7) జతగా దీపక్ హుడా క్రీజ్లోకి వచ్చాడు. ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 14) రెండు ఆసక్తికర సమరాలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో కేకేఆర్తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుండగా.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో సీఎస్కే, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్కు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుండగా.. రాత్రి మ్యాచ్ ముంబైలోని వాంఖడేలో జరుగనుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్.. లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న లక్నో.. 5 మ్యాచ్ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. హ్యాట్రిక్ విజయాల అనంతరం కేకేఆర్ ఇటీవలే ఒక్క ఓటమిని ఎదుర్కొంది. కేకేఆర్ తమ చివరి మ్యాచ్లో సీఎస్కే చేతిలో ఓటమిపాలై సీజన్ తొలి ఓటమిని చవిచూసింది. హెడ్ టు హెడ్ ఫైట్ల విషయానికొస్తే.. ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 3 మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. మూడు సందర్భాల్లో లక్నోనే విజయం వరించింది. తుది జట్లు.. లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్కీపర్), దీపక్ హుడా, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహిసిన్ ఖాన్, షమార్ జోసఫ్, యశ్ ఠాకూర్ లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ సబ్స్: అర్షద్ ఖాన్, ప్రేరక్ మన్కడ్, ఎం సిద్ధార్థ్, అమిత్ మిశ్రా, కె గౌతమ్ కోల్కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్(వికెట్కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి కోల్కతా నైట్ రైడర్స్ సబ్లు: సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, మనీష్ పాండే, రహ్మానుల్లా గుర్బాజ్, రింకూ సింగ్ -
ఐపీఎల్లో నేడు రెండు బిగ్ ఫైట్స్
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 14) రెండు ఆసక్తికర సమరాలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో కేకేఆర్తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుండగా.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో సీఎస్కే, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్కు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుండగా.. రాత్రి మ్యాచ్ ముంబైలోని వాంఖడేలో జరుగనుంది. మధ్యాహ్నం మ్యాచ్ విషయానికొస్తే.. హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న లక్నో.. పటిష్టమైన కేకేఆర్ను వారి సొంత మైదానంలో ఢీకొట్టబోతుంది. ప్రస్తుతం లక్నో 5 మ్యాచ్ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. హ్యాట్రిక్ విజయాల అనంతరం కేకేఆర్ ఇటీవలే ఓ ఓటమిని ఎదుర్కొంది. కేకేఆర్ తమ చివరి మ్యాచ్లో సీఎస్కే చేతిలో పరాజయంపాలైంది. హెడ్ టు హెడ్ ఫైట్ల విషయానికొస్తే.. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 3 మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. మూడు సందర్భాల్లో లక్నోనే విజయం వరించింది. ముంబై, సీఎస్కే మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ను అభిమానులు క్రికెట్ ఎల్ క్లాసికోగా (సమవుజ్జీల సమరం) పిలుస్తారు. ప్రస్తుత సీజన్లో ముంబై ఇండియన్స్ రెండు వరుస విజయాలతో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రెడీ తమ జైత్రయాత్రను స్టార్ట్ చేసింది. 5 మ్యాచ్ల్లో 3 విజయాలతో సీఎస్కే పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. ముంబై 5 మ్యాచ్ల్లో 2 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. హెడ్ టు హెడ్ ఫైట్స్ విషయానికొస్తే.. ఇరు జట్లు మధ్య ఇప్పటివరకు 36 మ్యాచ్లు జరగగా ముంబై 20, సీఎస్కే 16 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. -
సన్రైజర్స్తో మ్యాచ్లో దుమ్ములేపాడు.. 27 ఏళ్ల ఈ క్రికెటర్ ఎవరో తెలుసా?
-
సొంతగడ్డపై చెలరేగిన సీఎస్కే.. కేకేఆర్ చిత్తు
-
ఆ అమ్మాయి కోసం చాలా ఎదురుచూశాను.. శ్రేయస్ అయ్యర్
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేసిన ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో హిట్మ్యాన్, శ్రేయస్ అభిమానులకు తెలియని చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. కపిల్ శర్మ ప్రశ్నలు అడుగుండగా.. వీరిద్దరు తమదైన శైలిలో సమాధానాలు చెబుతూ నవ్వులు పూయించారు. ఆధ్యాంతం ఉల్లాసభరింతగా సాగిన ఈ షో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఆ అమ్మాయి మెసేజ్ కోసం ఎదురుచూశాను.. స్టేడియంలో మహిళా అభిమానులపై కెమెరామెన్ల ఫోకస్ అనే అంశంపై చర్చ జరుగుతుండగా శ్రేయస్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. నా తొలి ఐపీఎల్ సీజన్లో ఓ అందమైన అమ్మాయిని చూశాను. స్టాండ్స్లో కూర్చుకున్న ఆ అమ్మాయివైపు చేయి ఊపుతూ హలో చెప్పాను. ఆ సమయంలో ఫేస్బుక్ చాలా పాపులర్గా ఉండేది. అందులో ఆ అమ్మాయి రిప్లై ఇస్తుందేమో అని చాలా ఎదురుచూశానని శ్రేయస్ తన తొలి క్రష్ గురించి చెప్పుకొచ్చాడు. శ్రేయస్ ఈ విషయం గురించి చెప్పగానే షోకు హాజరైన వారంతా ఓకొడుతూ సౌండ్లు చేశారు. ఇదే షోలో శ్రేయస్ మరిన్ని విషయాలు కూడా పంచుకున్నాడు. తన ఆరాధ్య క్రికెటర్ రోహిత్ శర్మ అని, అతను టీమిండియా కెప్టెన్ అయినందుకు ఈ మాట చెప్పడం లేదని అన్నాడు. సహచరులతో రోహిత్ చాలా నాటు స్టయిల్లో మాట్లాడతాడని శ్రేయస్ చెప్పగా.. రోహిత్ కూడా శ్రేయస్పై ఇదే కంప్లైంట్ చేశాడు. ఇదిలా ఉంటే రోహిత్, శ్రేయస్ ప్రస్తుతం ఐపీఎల్ 2024తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో రోహిత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ నాలుగు మ్యాచ్ల్లో ఒకే ఒక విజయంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉండగా.. శ్రేయస్ నాయకత్వంలోని కేకేఆర్ 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. -
IPL 2024: చరిత్రలో ఒకే ఒక్కడు.. రవీంద్ర జడేజా
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఎవరికీ సాధ్యం కాని ఘనతను సీఎస్కే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సాధించాడు. 17 ఏళ్ల క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో 1000 పరుగులు సాధించి, 100 వికెట్లు పడగొట్టి, 100 క్యాచ్లు పట్టుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2024లో భాగంగా కేకేఆర్తో నిన్న (ఏప్రిల్ 8) జరిగిన మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టడం ద్వారా జడ్డూ క్యాష్ రిచ్ లీగ్లో 100 క్యాచ్ల మైలురాయిని తాకాడు. 231 మ్యాచ్ల ఐపీఎల్ కెరీర్లో జడేజా 2776 పరుగులు చేసి 156 వికెట్లు పడగొట్టాడు. జడ్డూ ఖాతాలో రెండు అర్దసెంచరీలు, ఓ ఐదు వికెట్ల ఘనత ఉంది. కేకేఆర్తో మ్యాచ్లో శ్రేయస్ క్యాచ్తో పాటు ఫిలిప్ సాల్ట్ క్యాచ్ కూడా పట్టుకున్న జడేజా.. బౌలింగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగి 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్లో, ఫీల్డింగ్లో అద్భుత ప్రదర్శనలకు గాను జడేజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్లో సీఎస్కే తరఫున జడేజాకు ఇది 15వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఈ అవార్డుతో జడ్డూ సీఎస్కే తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా ధోని సరసన చేరాడు. ఐపీఎల్లో ధోని సైతం సీఎస్కే తరఫున 15 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. కాగా, నిన్నటి మ్యాచ్లో కేకేఆర్పై సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. రవీంద్ర జడేజా (4-0-18-3), తుషార్ దేశ్పాండే (4-0-33-3), ముస్తాఫిజుర్ (4-0-22-2), తీక్షణ (4-0-28-1) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. విధ్వంసకర వీరులున్న కేకేఆర్ ఈ మ్యాచ్లో తేలిపోయింది. సాల్ట్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రింకూ సింగ్ (9), రసెల్ (10) తస్సుమనిపించారు. నరైన్ (27), రఘువంశీ (24), శ్రేయస్ అయ్యర్ (34) నామమాత్రపు స్కోర్లు చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కేను రుతురాజ్ (67 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. రచిన్ రవీంద్ర 15, డారిల్ మిచెల్ 25, శివమ్ దూబే 28 పరుగులు (18 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లు) చేసి ఔట్ కాగా.. ధోని ఒక్క పరుగు చేసి నాటౌట్గా మిగిలాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు పడగొట్టగా.. నరైన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో సీఎస్కే మరో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. సీజన్ తొలి ఓటమిని మూటగట్టుకున్న కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. -
IPL 2024: సొంత అభిమానులనే ఆట పట్టించిన జడ్డూ.. వైరల్ వీడియో
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కేకేఆర్తో నిన్న (ఏప్రిల్ 8) జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సీఎస్కే స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సొంత అభిమానులనే ఆటపట్టించాడు. సీఎస్కే లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. జడ్డూ ధోని కంటే ముందే బ్యాటింగ్కు దిగుతున్నట్లు ప్రాంక్ చేసి ఫ్యాన్స్ను టీజ్ చేశాడు. సీఎస్కే గెలుపు ఖరారైన దశలో శివమ్ దూబే ఔట్ కాగా.. ఆ దశలో ధోని బ్యాటింగ్కు దిగాల్సి ఉంది. అయితే జడ్డూ ధోని కంటే ముందే బరిలోకి దిగుతున్నట్లు నటించి అభిమానులను టీజ్ చేశాడు. కొంత దూరం వెళ్లి అభిమానులు కేకలు పెట్టడంతో జడ్డూ తిరిగి వెనక్కు వెళ్లిపోయాడు. అనంతరం ధోని బరిలోకి దిగి జట్టును విజయతీరాలకు చేర్చడంలో భాగమయ్యాడు. జడ్డూ సరదాగా చేసిన ఈ పని నవ్వులు పూయించింది. స్టేడియంలో ఉన్నవారంతా కాసేపు తనివితీరా నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. Ravindra Jadeja teased the Chepauk crowd by coming ahead of MS Dhoni then going back. 🤣 - This is amazing!! ❤️👌 pic.twitter.com/KPp4FewM17 — Mufaddal Vohra (@mufaddal_vohra) April 9, 2024 ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో కేకేఆర్పై సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. రవీంద్ర జడేజా (4-0-18-3), తుషార్ దేశ్పాండే (4-0-33-3), ముస్తాఫిజుర్ (4-0-22-2), తీక్షణ (4-0-28-1) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. విధ్వంసకర వీరులున్న కేకేఆర్ ఈ మ్యాచ్లో తేలిపోయింది. సాల్ట్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రింకూ సింగ్ (9), రసెల్ (10) తస్సుమనిపించారు. నరైన్ (27), రఘువంశీ (24), శ్రేయస్ అయ్యర్ (34) నామమాత్రపు స్కోర్లు చేశారు. We thought it was a Prank by Jadeja but it was a Prank from Thala to Fans. Look How all Teammates enjoying it 😂💛 pic.twitter.com/YrzQbP7WNV — 🎰 (@StanMSD) April 9, 2024 స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కేను రుతురాజ్ (67 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. రచిన్ రవీంద్ర 15, డారిల్ మిచెల్ 25, శివమ్ దూబే 28 పరుగులు (18 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లు) చేసి ఔట్ కాగా.. ధోని ఒక్క పరుగు చేసి నాటౌట్గా మిగిలాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు పడగొట్టగా.. నరైన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
భారీ షాట్లతో విరుచుకుపడ్డ ధోని.. వీడియో వైరల్
ఐపీఎల్-2024లో తొలి రెండు మ్యాచ్లలో గెలుపొందిన డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఆ తర్వాత రెండు మ్యాచ్లలో ఓటమిపాలైంది. విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్, హైదరాబాద్లో సన్రైజర్స్ చేతిలో పరాజయాలు చవిచూసింది. ఫలితంగా నాలుగు పాయింట్ల వద్ద నిలిచిపోయి పట్టికలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం నాటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై గెలుపొంది తిరిగి విజయాల బాట పట్టాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం సీఎస్కే ఆటగాళ్లు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులకు కనువిందు చేసే ఓ వీడియోను షేర్ చేసింది చెన్నై ఫ్రాంఛైజీ. ఇందులో మహేంద్ర సింగ్ ధోని సిక్సర్ల వర్షం కురిపించడం చూడవచ్చు. నెట్ ప్రాక్టీస్లో భాగంగా బ్యాటింగ్ చేసిన ధోని ఫుల్ జోష్లో కనిపించాడు. ఉత్సాహంగా బంతులు ఎదుర్కొంటూ భారీ షాట్లు బాదాడు. ఈ నేపథ్యంలో సొంత మైదానంలో తలా కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయమని అభిమానులు ఫిక్సయిపోతున్నారు. కాగా చెన్నైలోని చెపాక్ వేదికగా సీఎస్కే- కేకేఆర్ మధ్య రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇక ఇప్పటి వరకు ఇరు జట్లు ఇరవై ఎనిమిదిసార్లు ముఖాముఖి పోటీపడగా.. చెన్నై 18సార్లు గెలుపొందింది. చెపాక్లో పదిసార్లు ఎదురుపడగా ఏకంగా ఏడుసార్లు విజయం సాధించింది. ఓవరాల్గా కేకేఆర్పై చెన్నైదే పైచేయి! తుదిజట్ల అంచనా సీఎస్కే రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), అజింక్య రహానె, శివమ్ దూబే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ/ మిచెల్ శాంట్నర్, ఎంఎస్ ధోని, దీపక్ చహర్, తుషార్ దేశ్ పాండే, మహీష్ తీక్షణ [ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్: ముఖేష్ చౌదరి] కేకేఆర్ సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి [ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్: సుయాష్ శర్మ]. చదవండి: ముఖం మాడ్చుకున్న రోహిత్: పాండ్యాను హత్తుకుంటూనే సీరియస్ 📍Chennai Sound 🔛🎙️ 𝙅𝙪𝙨𝙩 𝙈𝙎 𝘿𝙝𝙤𝙣𝙞 𝙩𝙝𝙞𝙣𝙜𝙨 😎#TATAIPL | #CSKvKKR pic.twitter.com/7CPnrl9Ysa — IndianPremierLeague (@IPL) April 8, 2024 -
భారత కెప్టెన్గా అతడి స్థాయిని ఎవరూ అందుకోలేరు: గంభీర్
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనిపై మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రశంసలు కురిపించాడు. భారత జట్టు కెప్టెన్గా ధోని సాధించిన ఘనతలను అందుకోవడం ఇక ముందు ఎవరికీ సాధ్యం కాదనడంలో సందేహం లేదన్నాడు. టీమిండియా కెప్టెన్గా ఎవరెన్ని విజయాలు సాధించినా ధోని మూడు ఐసీసీ ట్రోఫీల ముందు దిగదుడుపేనని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్-2024లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్(కేకేఆర్)- చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మధ్య సోమవారం మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ మాజీ కెప్టెన్, ప్రస్తుత మెంటార్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీఎస్కేతో పోరును తాను ఎల్లప్పుడూ ఆస్వాదిస్తానని పేర్కొన్నాడు. అప్పుడు కెప్టెన్గా.. ఇప్పుడు మెంటార్గా ఇందులో ఎటువంటి మార్పులేదన్నాడు. సీఎస్కేపై పైచేయి సాధించాలనే పట్టుదలతో ఉన్నామని తెలిపాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); ఇక ధోని గురించి ప్రస్తావనకు రాగా.. ‘‘నేను ఈ మ్యాచ్ గెలవాలనే కోరుకుంటున్నాను. నేనే కాదు.. నా స్థానంలో ధోని ఉన్నా తన జట్టే గెలవాలని కోరుకుంటాడు. స్నేహితులుగా ఒకరిపట్ల ఒకరికి గౌరవం ఉంది. అంతమాత్రాన పోటీ పడటంలో ఎవరూ తగ్గరు కదా!.. ఏదేమైనా టీమిండియా కెప్టెన్గా ధోని మాదిరి మరెవరూ విజయవంతం కాలేదన్నది నిజం. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలవడం మామూలు విషయం కాదు. కొంతమంది భారత కెప్టెన్లు విదేశాల్లో చారిత్రక విజయాలు సాధించవచ్చు.. మరికొందరు టెస్టు మ్యాచ్లలో గెలిపించవచ్చు. అయినా మూడు ఐసీసీ ట్రోఫీల కంటే అవేమీ పెద్దవి కావు’’ అని గంభీర్.. ధోని నాయకత్వ నైపుణ్యాలను కొనియాడాడు. కాగా ధోని కెప్టెన్సీలో టీ20 వరల్డ్కప్-2007, వన్డే ప్రపంచకప్-2011 గెలిచిన భారత జట్టులో గంభీర్ సభ్యుడన్న విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్ ఫైనల్లో 75, వన్డే ఫార్మాట్ ఫైనల్లో 97 పరుగులు చేసి ఈ ట్రోఫీలు గెలవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. అయితే, ఎల్లప్పుడూ ధోనిని ఏదో రకంగా విమర్శించే ఈ కేకేఆర్ మెంటార్ ఈసారి ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. కాగా కేకేఆర్ సారథిగా సీఎస్కేతో 11సార్లు పోటీపడ్డ గంభీర్ ఐదుసార్లు గెలిచాడు. 2012 ఫైనల్లో సీఎస్కేను ఓడించి టైటిల్ గెలిచాడు కూడా! View this post on Instagram A post shared by Star Sports India (@starsportsindia) -
IPL 2024, DC VS KKR: కేకేఆర్ తొలిసారి ఇలా..!
17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కోల్కతా నైట్రైడర్స్ తొలిసారి సీజన్ తొలి మూడు మ్యాచ్ల్లో వరుస విజయాలు సాధించి రికార్డుల్లోకెక్కింది. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్పై బంపర్ విక్టరీతో కేకేఆర్ ఈ ఘనత సాధించింది. గతంలో ఏ సీజన్లోనూ కేకేఆర్ సీజన్ తొలి మూడు మ్యాచ్ల్లో వరుస విజయాలు సాధించలేదు. ప్రస్తుత సీజన్లో కేకేఆర్ హ్యాట్రిక్ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కేకేఆర్.. సన్రైజర్స్, ఆర్సీబీ, ఢిల్లీపై వరుస విజయాలు సాధించి అజేయ జట్టుగా కొనసాగుతుంది. ఈ సీజన్లో సన్రైజర్స్తో ఆడిన తొలి మ్యాచ్లో 4 పరుగుల స్వల్ప తేడాతో బయటపడిన కేకేఆర్.. ఆతర్వాత ఆర్సీబీ (7 వికెట్ల తేడాతో), ఢిల్లీపై (106 పరుగుల తేడాతో) ఘన విజయాలు సాధించింది. ఈ సీజన్లో అన్ని విభాగాల్లో అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న కేకేఆర్.. ఆర్సీబీ, ఢిల్లీలను వారి సొంత మైదానాల్లో ఓడించి శభాష్ అనిపించుకుంది. ప్రస్తుత సీజన్లో కేకేఆర్.. శ్రేయస్ అయ్యర్ సారధ్యంలో, గంభీర్ మెంటార్షిప్లో, చంద్రకాంత్ పండిట్ శిక్షణలో టైటిల్ రేసులో దూసుకుపోతుంది. ఐపీఎల్ అరంగేట్రం నుంచి కొనసాగుతున్న కేకేఆర్.. రెండు సార్లు (2012, 2014) ఛాంపియన్గా, ఓ సారి రన్నరప్గా (2021) నిలిచింది. గౌతమ్ గంభీర్ (ప్రస్తుత మెంటార్) కేకేఆర్ను రెండుసార్లు ఛాంపియన్గా నిలబెట్టాడు. 2021 సీజన్లో కేకేఆర్ రన్నరప్గా నిలిచినప్పుడు ఆ జట్టుకు ఇయాన్ మోర్గాన్ నాయకత్వం వహించాడు. కేకేఆర్ ఛాంపియన్స్ లీగ్లోనూ ఓసారి రన్నరప్గా (2014) నిలిచింది. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో కేకేఆర్ భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల చేసింది. ఐపీఎల్ ఇది రెండో అతి భారీ స్కోర్. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్పై సన్రైజర్స్ చేసిన స్కోర్ (277/3) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్గా ఉంది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. 17.2 ఓవర్లలో 166 పరుగులకే చాపచుట్టేసి, 106 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రిషబ్ పంత్ (55), ట్రిస్టన్ స్టబ్స్ (54) ఓటమి ఖరారైన దశలో బ్యాట్ను ఝులిపించారు. వీరిద్దరు మినహా ఢిల్లీ ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. వార్నర్ (18), పృథ్వీ షా (10) రెండంకెంల స్కోర్లు చేయగా.. మార్ష్, పోరెల్, అక్షర్ డకౌట్లయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌల్ చేసి చెరి 3 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ 2, రసెల్, నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
IPL 2024 DC VS KKR: రసెల్ రికార్డును సమం చేసిన నరైన్
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న (ఏప్రిల్ 3) జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి కేకేఆర్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. నరైన్ కేకేఆర్ తరఫున ఈ అవార్డు అందుకోవడం ఇది 14వసారి. కేకేఆర్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న రికార్డు ఆండ్రీ రసెల్ (14) పేరిట ఉండగా.. నిన్నటి మ్యాచ్తో నరైన్ రసెల్ రికార్డును సమం చేశాడు. రసెల్, నరైన్ ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో 10, 11 స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడి ఢిల్లీ డేర్డెవిల్స్, ఆర్సీబీ తరఫున 25 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఏబీడీ తర్వాత క్రిస్ గేల్ (22), రోహిత్ శర్మ (19), డేవిడ్ వార్నర్ (18), ఎంఎస్ ధోని (17), విరాట్ కోహ్లి (17), షేన్ వాట్సన్ (16), యూసఫ్ పఠాన్ (16) అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. రసెల్, నరైన్తో సమానంగా సురేశ్ రైనా, కీరన్ పోలార్డ్ కూడా 14 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. కాగా, ఢిల్లీతో మ్యాచ్లో నరైన్తో పాటు యువ ఆటగాడు రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) రెచ్చిపోవడంతో కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో భారీ స్కోర్. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్పై సన్రైజర్స్ చేసిన స్కోర్ (277/3) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్గా ఉంది. 273 పరుగుల భారీ లక్ష్యాన్నిఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. 17.2 ఓవర్లలో 166 పరుగులకే చాపచుట్టేసి, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. రిషబ్ పంత్ (55), ట్రిస్టన్ స్టబ్స్ (54) ఓటమి ఖరారైన దశలో బ్యాట్ను ఝులిపించారు. వీరిద్దరు మినహా ఢిల్లీ ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. వార్నర్ (18), పృథ్వీ షా (10) రెండంకెంల స్కోర్లు చేయగా.. మార్ష్, పోరెల్, అక్షర్ డకౌట్లయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌల్ చేసి చెరి 3 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ 2, రసెల్, నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో కేకేఆర్ హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. ఢిల్లీ తాజా ఓటమితో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. -
కళ్లు చెదిరే యార్కర్.. అభినందించకుండా ఉండలేకపోయిన బ్యాటర్
ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ కళ్లు చెదిరే యార్కర్ను సంధించాడు. కేకేఆర్తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగుతున్న మ్యాచ్లో ఇషాంత్ సూపర్ డెలివరీని బౌల్ చేశాడు. ఇషాంత్ యార్కర్ దెబ్బకు బ్యాటర్ ఆండ్రీ రసెల్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. సెకెన్ల వ్యవధిలో బంతి వికెట్లను గిరాటు వేయడంతో రసెల్ నిర్ఘాంతపోయాడు. ఇషాంత్ యార్కర్కు సమాధానం చెప్పలేని రసెల్ బంతిని అడ్డుకునే క్రమంలో బొక్కబోర్లా పడ్డాడు. ఈ బంతిని సంధించినందుకుగాను రసెల్ ఇషాంత్ను అభినందించకుండా ఉండలేకపోయాడు. కిందపడి లేవగానే చప్పట్లతో అభినందించాడు. ఇషాంత్ సూపర్ యార్కర్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ISHANT SHARMA WITH A BALL OF IPL 2024...!!! 🤯 pic.twitter.com/9O015ZzlwZ — Mufaddal Vohra (@mufaddal_vohra) April 3, 2024 ఇషాంత్ రసెల్ను ఔట్ చేసిన సందర్భం కూడా చాలా కీలకమైంది. ఆఖరి ఓవర్ తొలి బంతికి.. అప్పటికే రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోయి ఉన్నాడు. ఆ సమయంలో ఇషాంత్ అద్భుతమైన యార్కర్తో రసెల్ను బోల్తా కొట్టించాడు. ఆ బంతికి రసెల్ ఔట్ కాకపోయి ఉండివుంటే, కేకేఆర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ స్కోర్ నమోదు చేసి ఉండేది. లేటు వయసులో ఇషాంత్ ప్రదర్శనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ మ్యాచ్లో అతను ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్, శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో భారీ స్కోర్. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్పై సన్రైజర్స్ చేసిన స్కోర్ (277/3) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్గా ఉంది. ఓ సీజన్లో 250పైగా స్కోర్లు రెండు సార్లు నమోదు కావడం 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి. -
IPL 2024 DC VS KKR: ఐపీఎల్ చరిత్రలో రెండో భారీ స్కోర్
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ బ్యాటర్లు వీరంగం సృష్టించారు. టాపార్డర్ బ్యాటర్లు పోటాపోటీపడి విధ్వంసం సృష్టించారు. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలోనే రెండో అతి భారీ స్కోర్ నమోదైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల చేసింది. ఐపీఎల్లో ఇది రెండో అతి భారీ స్కోర్. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్పై సన్రైజర్స్ చేసిన స్కోర్ (277/3) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్గా ఉంది. ఓ సీజన్లో 250పైగా స్కోర్లు రెండు సార్లు నమోదు కావడం 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి. ఐపీఎల్ చరిత్రలో టాప్-5 అత్యధిక స్కోర్లు.. సన్రైజర్స్ హైదరాబాద్ (277/3): 2024 సీజన్లో ముంబై ఇండియన్స్పై కోల్కతా నైట్రైడర్స్ (266/6): 2024 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (263/5): 2013 సీజన్లో పూణే వారియర్స్పై లక్నో సూపర్ జెయింట్స్ (257/5): 2023 సీజన్లో పంజాబ్ కింగ్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (248/3): 2016 సీజన్లో గుజరాత్ లయన్స్పై -
విధ్వంసం సృష్టించిన కేకేఆర్ యువ బ్యాటర్.. శుభ్మన్ గిల్ తర్వాత..!
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా కేకేఆర్ తరఫున శుభ్మన్ గిల్ తర్వాత అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. శుభ్మన్ 18 ఏళ్ల 237 రోజుల వయసులో (2018 సీజన్) సీఎస్కేపై హాఫ్ సెంచరీ చేయగా.. రఘువంశీ 18 ఏళ్ల 303 రోజుల వయసులో ఢిల్లీ క్యాపిటల్స్పై అర్దసెంచరీ సాధించాడు. రఘువంశీకి ఐపీఎల్లో ఇది తొలి ఇన్నింగ్స్ కావడం విశేషం. Innovative! Maiden IPL Fifty for Angkrish Raghuvanshi ✨ Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #DCvKKR pic.twitter.com/72oQQZIDbd — IndianPremierLeague (@IPL) April 3, 2024 ఈ ఇన్నింగ్స్కు ముందు అతను ఓ మ్యాచ్ ఆడినా అందులో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కేకేఆర్ తరఫున అరంగేట్రం ఇన్నింగ్స్లో ఆరో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగానూ రఘువంశీ రికార్డుల్లోకెక్కాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తం 27 బంతులు ఎదుర్కొన్న రఘువంశీ 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో రఘువంశీతో పాటు సునీల్ నరైన్ సైతం విధ్వంసం సృష్టించాడు. నరైన్ కేవలం 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. వీరిద్దరి ఊచకోత ధాటికి ఢిల్లీ బౌలర్లు వణికిపోయారు. వీరిద్దరు ఔటయ్యాక రసెల్ భారీ షాట్లు ఆడటం మొదలుపెట్టాడు. రసెల్ 15 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేసి క్రీజ్లో కొనసాగుతున్నాడు. అతనికి జతగా శ్రేయస్ అయ్యర్ (12) ఉన్నాడు. నరైన్, రఘువంశీ, రసెల్ ధాటికి కేకేఆర్ 16వ ఓవర్లోనే 200 పరుగుల మార్కును దాటింది. ఐపీఎల్ చరిత్రలో ఇది మూడో వేగవంతమై 200. 17 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 224/3గా ఉంది. ఈ మ్యాచ్లో కేకేఆర్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదో ఓవర్లో ఫిలిప్ సాల్ట్ (18) ఔటయ్యాడు. నోర్జే బౌలింగ్లో ట్రిస్టన్ స్టబ్స్కు క్యాచ్ ఇచ్చి సాల్ట్ పెవిలియన్కు చేరాడు. కాగా, ప్రస్తుత సీజన్లో ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కేకేఆర్ మరో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తుంది. అండర్-19 వరల్డ్కప్ హీరో.. 18 ఏళ్ల రఘువంశీ భారత అండర్-19 జట్టు వరల్డ్కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. 2022 వరల్డ్కప్ ఎడిషన్లో రఘువంశీ భారత్ తరఫున లీడింగ్ రన్స్కోరర్గా ఉన్నాడు. -
IPL 2024, DC VS KKR: సునీల్ నరైన్ ఊచకోత
ఢిల్లీ క్యాపిటల్స్తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్ శివాలెత్తిపోయాడు. కేవలం 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. నరైన్ విధ్వంసం ధాటికి కేకేఆర్ 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 126 పరుగులు చేసింది. నరైన్కు జతగా యువ ఆటగాడు రఘువంశీ (14 బంతుల్లో 31; 4 ఫోర్లు, సిక్స్) క్రీజ్లో ఉన్నాడు. రఘువంశీ కూడా చెలరేగి ఆడుతున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత కూడా నరైన్ దూకుడు కొనసాగుతుంది. Sunil Narine is in some form! 🔥 pic.twitter.com/326qICPqWl — Mufaddal Vohra (@mufaddal_vohra) April 3, 2024 నరైన్ 28 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 68 పరుగులతో అజేయంగా కొనసాగుతున్నాడు. నరైన్ ఇషాంత్ శర్మ, రసిక్ సలామ్ అక్షర్ పటేల్లకు చుక్కలు చూపించాడు. ఇషాంత్ వేసిన నాలుగో ఓవర్లో మూడు సిక్సర్లు సహా 26 పరుగులు పిండుకున్న నరైన్.. రసిర్ వేసిన 6వ ఓవర్లో మూడు ఫోర్ల సాయంతో 18, అక్షర్ వేసిన 8వ ఓవర్లో 2 సిక్సర్ల సాయంతో 19 పరుగులు రాబట్టాడు. THE DESTRUCTION OF SUNIL NARINE...!!!!- He smashed 6,6,4,0,6,4 in an over against Ishant Sharma..!!! 🔥 pic.twitter.com/i9vkivM2NH— CricketMAN2 (@ImTanujSingh) April 3, 2024 ఈ మ్యాచ్లో కేకేఆర్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదో ఓవర్లో ఫిలిప్ సాల్ట్ (18) ఔటయ్యాడు. నోర్జే బౌలింగ్లో ట్రిస్టన్ స్టబ్స్కు క్యాచ్ ఇచ్చి సాల్ట్ పెవిలియన్కు చేరాడు. ప్రస్తుత సీజన్లో ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కేకేఆర్ మరో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తుంది. -
IPL 2024: కోట్లు పెట్టినా పేలని పేస్ గన్.. 20 లక్షలకే పేట్రేగిపోతున్న యువ సంచలనం
ఐపీఎల్ 2024 వేలంలో అత్యధిక ధర (24.75 కోట్లతో కేకేఆర్ సొంతం చేసుకుంది) పలికి, లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన ఆసీస్ పేస్ గన్ మిచెల్ స్టార్క్.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రదర్శనలతో నిరాశపరుస్తున్నాడు. భారీ అంచనాల నడుమ ఈ సీజన్ బరిలోకి దిగిన స్టార్క్ ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్ల్లో ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 100 పరుగులు సమర్పించుకున్నాడు. సన్రైజర్స్తో జరిగిన తొలి మ్యాచ్లో 4 ఓవర్లలో 53 పరుగులిచ్చిన స్టార్క్.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లు బౌల్ చేసి 47 పరుగులు సమర్పించుకున్నాడు. జట్టులోని కుర్ర బౌలర్లు సత్తా చాటుతుంటే కోట్లు కుమ్మరించి కొనుక్కున స్టార్క్ తేలిపోతుండటంతో కేకేఆర్ యాజమాన్యం అసంతృప్తిగా ఉంది. స్టార్క్తో పాటు కేకేఆర్ బౌలింగ్ అటాక్ను ప్రారంభిస్తున్న 22 ఏళ్ల యువ పేసర్ హర్షిత్ రాణా సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్లు, ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 2 వికెట్లు తీసి ఔరా అనిపిస్తే.. స్టార్క్ మాత్రం తనపై పెట్టిన డబ్బుకు కనీస న్యాయం కూడా చేయలేక ఉసూరుమనిపిస్తున్నాడు. స్టార్క్పై పెట్టిన పెట్టుబడిలో కనీసం ఒకటో వంతు (20 లక్షలు) కూడా లభించని రాణా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటే.. స్టార్క్ మాత్రం కోట్లు జేబులో వేసుకుని దిక్కులు చూస్తున్నాడు. మరో పక్క తన సహచరుడు, సన్రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ తనపై పెట్టుకున్న అంచనాలకు న్యాయం చేస్తుంటే స్టార్క్ మాత్రం కేకేఆర్ అభిమానులకు, యాజమాన్యానికి గుండు సున్నా చూపిస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్ల్లో కేకేఆర్ ఎలాగోలా గెలిచింది కాబట్టి సరిపోయింది. లేకుంటే స్టార్క్పై విమర్శల పర్వం మొదలయ్యేది. ఇప్పటికైనా స్టార్క్ మొద్దు నిద్రను వీడి రాణించాలని కేకేఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, ప్రస్తుత సీజన్లో కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్.. ఏప్రిల్ 3న జరిగే తమ తదుపరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. నేటి మ్యాచ్ల విషయానికొస్తే.. ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్లో గుజరాత్ తమ సొంత మైదానంలో సన్రైజర్స్ను ఎదుర్కోనుండగా.. విశాఖలో జరిగే రాత్రి మ్యాచ్లో ఢిల్లీ, సీఎస్కే జట్లు తలడనున్నాయి. -
Virat Kohli-Gambhir: కలిసిపోయిన గంభీర్, కోహ్లి.. హగ్ చేసుకుని మరి! వీడియో వైరల్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మధ్య గత కొంత కాలంగా వైరం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు వారిద్దరూ కలిసిపోయారు. అవును మీరు విన్నది నిజమే. ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, కేకేఆర్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ స్ట్రాటజిక్ టైమ్లో గౌతం గంభీర్, కోహ్లి ఇద్దరూ ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకుంటూ హగ్ చేసుకున్నారు. దీంతో వారిద్దరి మధ్య 11 ఏళ్లగా కొనసాగుతున్న వైరానికి తెరపడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు తమ అభిమాన క్రికెటర్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. క్రికెట్ జెంటిల్మెన్ గేమ్ అని, ఎప్పుడు మీ ఇద్దరూ ఇలానే కలిసి ఉండాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్లో కోహ్లి ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. గౌతం గంభీర్ కేకేఆర్ మెంటార్గా వ్యవహరిస్తున్నాడు. కాగా తొలిసారిగా 2013 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్- ఆర్సీబీ మ్యాచ్లో విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత 2015 ఐపీఎల్ సీజన్లో మళ్లీ విరాట్, గౌతీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ మ్యాచ్లో కేకేఆర్పై ఆర్సీబీ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. దీన్ని తట్టుకోలేకపోయిన గౌతమ్ గంభీర్, డగౌట్లో కూర్చీని తన్ని, ఫైన్ కూడా కట్టాడు. అనంతరం 2023 ఐపీఎల్ సీజన్లో మరోసారి విరాట్ , గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నవీన్ ఉల్ హాక్-కోహ్లి మధ్య గొడవ జరగగా.. అందులో గంభీర్ జోస్యం చేసుకోవడంతో ఆ గొడవ మరింత తీవ్రమైంది. అయితే మళ్లీ ఏడాది తర్వాత ఇద్దరూ ఒకే మైదానంలో ఉండడంతో అందరి కళ్లు ఈ మ్యాచ్పైనే ఉన్ను. కానీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. They hugged 😭😭😭 Gautam gambhir said sorry to king kohli for everything he spoke against him. I think the only controversy which will last this season is Hardik vs Rohit 😂#RCBvsKKR #IPL2024 #ViratKohli #GautamGambhir Maxwell pic.twitter.com/G0pZpGsOOb — RanaJi🏹 (@RanaTells) March 29, 2024 -
IPL 2024 RCB VS KKR: చరిత్ర సృష్టించనున్న సునీల్ నరైన్
ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మార్చి 29) జరుగబోయే మ్యాచ్తో కేకేఆర్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ చరిత్ర సృష్టించనున్నాడు. ఈ మ్యాచ్తో నరైన్ టీ20ల్లో 500 మ్యాచ్ల మైలురాయిని తాకబోతున్నాడు. ప్రపంచ క్రికెట్లో కేవలం ముగ్గురు మాత్రమే నరైన్కు ముందు ఈ మైలురాయిని తాకారు. వీరిలో కీరన్ పోలార్డ్ అందరికంటే ఎక్కువగా 660 మ్యాచ్లు ఆడగా.. డ్వేన్ బ్రావో 573, షోయబ్ మాలిక్ 542 మ్యాచ్లు ఆడారు. టీ20ల్లో అత్యంత అరుదైన క్లబ్లో చేరబోతున్న నరైన్.. ఈ ఫార్మాట్లో ఇప్పటివరకు 499 మ్యాచ్లు ఆడి 536 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్లో 3736 పరుగులు చేశాడు. 2011లో టీ20 ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన నరైన్ చాలా రికార్డుల్లో భాగంగా ఉన్నాడు. టీ20ల్లో అత్యధిక మెయిడిన్లు (30) వేసిన బౌలర్గా.. టీ20ల్లో మూడో అత్యధిక వికెట్ టేకర్గా (536).. కనీసం 2000 బంతులు బౌల్ చేసిన వారిలో రెండో అత్యధిక ఎకానమీ రేట్ (6.10) కలిగిన బౌలర్గా.. పవర్ ప్లేల్లో నాలుగో అత్యుత్తమ స్ట్రయిక్రేట్ (155.05) కలిగిన బ్యాటర్గా.. టీ20ల్లో అత్యధిక టైటిళ్లలో (10) భాగమైన నాలుగో ఆటగాడిగా పలు రికార్డుల్లో తన పేరును లిఖించుకున్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో ఇరు జట్లు గెలుపు కోసం కొదమ సింహాల్లా పోరాడనున్నాయి. కేకేఆర్ తమ తొలి మ్యాచ్లో సన్రైజర్స్ను మట్టికరిపించి జోష్లో ఉండగా.. ఆర్సీబీ తమ చివరి మ్యాచ్లో (రెండోది) పంజాబ్ కింగ్స్కు షాకిచ్చి నూతనోత్సాహంతో ఉరకలేస్తుంది. -
IPL 2024 RCB VS KKR: సెంటిమెంట్ కొనసాగేనా..!
ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (మార్చి 29) మరో క్లాసీ మ్యాచ్ జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో ఇరు జట్లు గెలుపు కోసం కొదమ సింహాల్లా పోరాడే అవకాశం ఉంది. కేకేఆర్ తమ తొలి మ్యాచ్లో సన్రైజర్స్ను మట్టికరిపించి జోష్లో ఉంటే.. ఆర్సీబీ తమ చివరి మ్యాచ్లో (రెండోది) పంజాబ్ కింగ్స్కు షాకిచ్చి నూతనోత్సాహంతో ఉరకలేస్తుంది. ఇవాల్టి మ్యాచ్కు ముందు ఓ సెంటిమెంట్ అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు జరిగిన తొమ్మిది మ్యాచ్ల్లో హోం గ్రౌండ్లో ఆడిన జట్లే విజయాలు సాధించాయి. చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్లో సీఎస్కే (ఆర్సీబీపై విజయం), చంఢీఘడ్లో జరిగిన రెండో మ్యాచ్లో పంజాబ్ (ఢిల్లీ క్యాపిటల్స్పై), కోల్కతాలో జరిగిన మూడో మ్యాచ్లో కేకేఆర్ (సన్రైజర్స్పై), జైపూర్లో జరిగిన నాలుగో మ్యాచ్లో రాజస్థాన్ (లక్నోపై), అహ్మదాబాద్లో ముంబైపై గుజరాత్, బెంగళూరులో పంజాబ్ కింగ్స్పై ఆర్సీబీ, చెన్నైలో గుజరాత్పై సీఎస్కే, హైదరాబాద్లో ముంబైపై సన్రైజర్స్, జైపూర్లో నిన్న జరిగిన తొమ్మిదో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై రాజస్థాన్ రాయల్స్ విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో ఆర్సీబీ హోం గ్రౌండ్లో విజయం సాధించి సెంటిమెంట్ కొనసాగిస్తుందా.. లేక కేకేఆర్కు దాసోహమై సెంటిమెంట్ను బ్రేక్ చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. గత రికార్డులను పరిశీలిస్తే.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య ఇప్పటివరకు 32 మ్యాచ్లు జరగగా కేకేఆర్ 18, ఆర్సీబీ 14 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. బలాబలాల విషయానికొస్తే.. ఇరు జట్లు బ్యాటింగ్లో సమతూకంగా కనిపిస్తున్నప్పటికీ.. కేకేఆర్కు బ్యాటింగ్ డెప్త్ కాస్త ఎక్కువేనని చెప్పాలి. ఆ జట్టులో ఎనిమిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేసే వాళ్లు ఉన్నారు. ఆర్సీబీ విషయానికొస్తే పరిస్థితి అలా లేదు. విరాట్, డుప్లెసిస్, మ్యాక్సీ ఔటైతే ఆ జట్టు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. బౌలింగ్లోనూ ఆర్సీబీతో పోలిస్తే కేకేఆర్ మెరుగ్గానే ఉందని చెప్పాలి. ఐపీఎల్ కాస్ట్లీ ప్లేయర్ మిచెల్ స్టార్క్ నాయకత్వంలో కేకేఆర్ బౌలింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తుంది. సన్రైజర్స్తో మ్యాచ్లో హర్షిత్ రాణా ఇరగదీశాడు. రసెల్ బ్యాట్తో పాటు బంతితోనూ చెలరేగాడు. నరైన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. స్టార్క్, వరుణ్ చక్రవర్తి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ పరిస్థితి రిపీట్ కాదని అనిపిస్తుంది. ఆర్సీబీ విషయానికొస్తే.. ముందుగా ఈ జట్టులో చెప్పుకోదగ్గ బౌలర్ లేడు. కేవలం బ్యాటింగ్పైనే ఆ జట్టు ఆధార పడింది. సిరాజ్, అల్జరీ జోసఫ్, యశ్ దయాల్, గ్రీన్ లాంటి పేసర్లు ఉన్నా వారి నుంచి గొప్ప ప్రదర్శనలు ఆశించలేని పరిస్థితి ఉంది. స్పిన్నర్లు కర్ణ్ శర్మ, మయాంక్ డాగర్, మ్యాక్సీ అడపాదడపా రాణిస్తుంటారు. మొత్తంగా చూస్తే.. ఆర్సీబీ కంటే కేకేఆర్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
IPL 2024: పాపం కావ్య మారన్.. క్షణాల్లో ముఖం మారిపోయింది..!
ఐపీఎల్ 2024లో భాగంగా కోల్కతా వేదికగా కేకేఆర్తో నిన్న జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ చివరి బంతి వరకు హోరాహోరీగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. ఫిలిప్ సాల్ట్ (40 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రసెల్ (25 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో హెన్రిచ్ క్లాసెన్ (29 బంతుల్లో 63; 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించినప్పటికీ సన్రైజర్స్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. Day 1 of asking @JioCinema why we can't have #KavyaMaran on a separate hero cam feed during the live stream on #SRH matchday!? pic.twitter.com/QkzCPdvMkR — Saurav Shrivastava 🇮🇳 (@SaySaurav) March 23, 2024 చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. హర్షిత్ రాణా (4-0-33-3) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి సన్రైజర్స్ గెలుపును అడ్డుకున్నాడు. అప్పటికే శివాలెత్తిపోయిన క్లాసెన్ వికెట్తో పాటు షాబాజ్ అహ్మద్ను పెవిలియన్కు పంపాడు. ఆఖరి ఓవర్ తొలి బంతికే క్లాసెన్ సిక్సర్ బాదినప్పటికీ.. సన్రైజర్స్ మిగిలిన ఐదు బంతుల్లో 7 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. క్లాసెన్ సిక్సర్ బాదాక (19.1వ ఓవర్) వీఐపీ స్టాండ్స్లో ఉన్న సన్రైజర్స్ యజమాని కావ్య మారన్ ఆనందంతో గంతులేసింది. Kavya Maran's reactions in 20th over. 19.1. 19.5. pic.twitter.com/oybUIk9LhL — CricketMAN2 (@ImTanujSingh) March 23, 2024 అయితే ఈ సంతోషం ఆమెకు ఎంతో సేపు నిలబడలేదు. 20వ ఓవర్ ఐదో బంతికి క్లాసెన్ ఔట్ కావడంతో కావ్య ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటిదాకా నవ్వుతూ జాలీగా కనిపించిన ఆమె ఒక్కసారిగా ఢీలా పడిపోయింది. సుయాష్ శర్మ అద్భుతమైన క్యాచ్ (క్లాసెన్) పట్టి కావ్య ముఖంలో చిరునవ్వును మాయం చేశాడు. నాలుగు బంతుల వ్యవధిలో కావ్య ముఖంలో వచ్చిన మార్పులకు సంబంధించిన ఫోటోలను ఓ నెటిజన్ నెట్టింట షేర్ చేయగా అవి వైరలవుతున్నాయి. -
IPL 2024: రసెల్ సిక్సర్ల సునామీ.. గేల్ రికార్డు బద్దలు
ఐపీఎల్ 2024లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో నిన్న జరిగిన మ్యాచ్లో కేకేఆర్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్ ఓ భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో సిక్సర్ల సునామీ (25 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) సృష్టించిన రసెల్.. ఐపీఎల్లో అత్యంత వేగంగా 200 సిక్సర్లను (1322 బంతుల్లో) పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రసెల్కు ముందు ఈ రికార్డు క్రిస్ గేల్ (1811 బంతుల్లో) పేరిట ఉండేది. రసెల్, గేల్ తర్వాత అత్యంత వేగంగా 200 సిక్సర్లు పూర్తి చేసిన ఘనత కీరన్ పోలార్డ్కు (2055) దక్కింది. ఈ జాబితాలో టాప్-3 ఆటగాళ్లు విండీస్ వీరులే కావడం విశేషం. ఈ మ్యాచ్తో సిక్సర్ల సంఖ్యను 202కు పెంచుకున్న రసెల్.. క్యాష్ రిచ్ లీగ్లో 200 సిక్సర్ల మైలురాయిని తాకిన తొమ్మిదో క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. రసెల్కు ముందు గేల్ (357), రోహిత్ శర్మ (257), ఏబీ డివిలియర్స్ (251), ధోని (239), విరాట్ కోహ్లి (235), వార్నర్ (228), పోలార్డ్ (223), రైనా (203) ఈ మార్కును తాకిన వారిలో ఉన్నారు. కాగా, సన్రైజర్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో రసెల్ బ్యాటింగ్ విన్యాసాలకు హర్షిత్ రాణా అద్భుతమైన బౌలింగ్ (4-0-33-3) తోడు కావడంతో కేకేఆర్ చిరస్మరణీయ విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో సన్రైజర్స్కు చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. రాణా అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాగే కీలకమైన క్లాసెన్ వికెట్తో పాటు షాబాజ్ అహ్మద్ వికెట్లు పడగొట్టి కేకేఆర్ను గెలిపించాడు. ఆఖరి ఓవర్ తొలి బంతికే క్లాసెన్ సిక్సర్ బాదినప్పటికీ.. సన్రైజర్స్ మిగిలిన ఐదు బంతుల్లో 7 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సాల్ట్ (54), రసెల్ (64) అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో క్లాసెన్ (63; 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించినప్పటికీ సన్రైజర్స్ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. సన్రైజర్స్ ఈ మ్యాచ్ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. -
IPL 2024 ఓవరాక్షన్కు తగిన మూల్యం చెల్లించుకున్న హర్షిత్ రాణా
కేకేఆర్ పేస్ సంచలనం హర్షిత్ రాణా తాను చేసిన ఓవరాక్షన్కు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. సన్రైజర్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన రాణా.. మయాంక్ అగర్వాల్ను ఔట్ చేసిన అనంతరం కోపంగా ఫ్లయింగ్ కిస్ ఇస్తూ సెండాఫ్ ఇచ్చాడు. A flying kiss by Harshit Rana to Mayank Agarwal as a send off.pic.twitter.com/LVkQYKmisZ — Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2024 ఈ అతి చేష్ఠలను తీవ్రంగా పరిగణించిన మ్యాచ్ రిఫరీ మను నయ్యర్ రాణా మ్యాచ్ ఫీజ్లో 60 శాతం కోత విధించాడు. ఇదే మ్యాచ్లో రాణా హెన్రిచ్ క్లాసెన్ పట్ల కూడా దురుసుగా ప్రవర్తించాడు. ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకున్న రిఫరీ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.5 నిబంధన ఉల్లంఘన కింద జరిమానా విధించాడు. Harshit Rana fined 60% of his match fees for giving Mayank Agarwal a send off. pic.twitter.com/kTXDBOXUtB — Mufaddal Vohra (@mufaddal_vohra) March 24, 2024 కాగా, నిన్నటి మ్యాచ్లో సన్రైజర్స్ గెలుపుకు చివరి ఓవర్లో 13 పరుగులు కావాల్సి ఉండగా రాణా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. షాబాజ్ అహ్మద్తో పాటు అప్పటికే శివాలెత్తిపోయిన ఉన్న క్లాసెన్ను ఔట్ చేసి కేకేఆర్ను గెలిపించాడు. ఓవర్ తొలి బంతికే క్లాసెన్ సిక్సర్ బాదినప్పటికీ.. సన్రైజర్స్ మిగిలిన ఐదు బంతుల్లో 7 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన రాణా 33 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. HARSHIT RANA, THE HERO OF KKR. SRH needed 13 in 6 balls - 6 on the first ball then 1,W,1,W,0 to win it for KKR. 🤯 pic.twitter.com/oXlzpAEJLV — Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2024 ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సాల్ట్ (54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రసెల్ (64; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో క్లాసెన్ (63; 8 సిక్సర్లు) చెలరేగినప్పటికీ సన్రైజర్స్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్రైజర్స్ ఈ మ్యాచ్ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. -
KKR Vs SRH: శభాష్ సుయాష్.. సన్రైజర్స్ నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు..!
ఐపీఎల్ 2024 సీజన్లో ప్రారంభమైన రెండో రోజు అదిరిపోయే మ్యాచ్ను అందించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య నిన్న (రాత్రి 7:30 గంటలకు) జరిగిన మ్యాచ్ ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది. భారీ లక్ష్య ఛేదనలో ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా.. హెన్రిచ్ క్లాసెన్ తొలి బంతికే సిక్సర్ బాది సన్రైజర్స్ శిబిరంలో గెలుపుపై ధీమా పెంచగా.. కేకేఆర్ ఆటగాళ్లు హర్షిత్ రాణా, సుయాష్ శర్మ ఆ ఆనందాన్ని వారికి ఎంతో సేపు నిలబడనీయలేదు. చివరి ఓవర్ బౌలింగ్ చేసిన రాణా వైవిధ్యమైన బంతులు సంధించి సన్రైజర్స్ గెలుపుకు అడ్డుకోగా.. సుయాష్ శర్మ కీలక దశలో (2 బంతుల్లో 5 పరుగులు) మెరుపు క్యాచ్ (క్లాసెన్) పట్టి ఆరెంజ్ ఆర్మీ చేతుల్లో నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. ONE OF THE GREATEST CATCHES IN IPL HISTORY...!!! - Take a bow, Suyash Sharma. 🫡pic.twitter.com/CAq18gb8EO — Johns. (@CricCrazyJohns) March 23, 2024 సుయాష్ ఆ క్యాచ్ మిస్ చేసి ఉంటే బౌండరీ లభించి సన్రైజర్స్ సునాయాసంగా మ్యాచ్ గెలిచేది. ఒకవేళ ఆ క్యాచ్ డ్రాప్ అయ్యి, పరుగు రాకపోయినా అప్పటికే శివాలెత్తి ఉన్న క్లాసెన్ ఆఖరి బంతికి సిక్సర్ బాది సన్రైజర్స్ను గెలిపించేవాడు. సుయాష్ అందుకున్న ఈ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. క్యాచెస్ విన్ మ్యాచెస్ అని ఇందుకే అంటారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సాల్ట్ (54), రసెల్ (64) అర్దసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఆఖర్లో రసెల్ 7 సిక్సర్లు, 3 బౌండరీలతో విరుచుకుపడి కేకేఆర్ 200 పరుగుల మార్కును దాటేందుకు దోహదపడ్డాడు. చివర్లో రమన్దీప్ సింగ్ (35; ఫోర్, 4 సిక్సర్లు), రింకూ సింగ్ (23; 3 ఫోర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. సన్రైజర్స్ బౌలర్లలో నటరాజన్ 3 వికెట్లు పడగొట్టగా.. మయాంక్ మార్కండే 2, కమిన్స్ ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్రైజర్స్.. ఆదిలో తడబడినప్పటికీ గెలుపు అంచుల వరకు వచ్చి ఓటమిపాలైంది. క్లాసెన్ మెరుపు ఇన్నింగ్స్తో (29 బంతుల్లో 63; 8 సిక్సర్లు) మ్యాచ్ రూపురేఖల్నే మార్చేశాడు. అయితే గెలుపుకు 5 పరుగులు కావాల్సిన తరుణంలో అతడు ఔట్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా కేకేఆర్పైపు మలుపు తిరిగింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసి లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సన్రైజర్స్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (32), అభిషేక్ శర్మ (32) ఓ మోస్తరు స్కోర్లతో శుభారంభాన్ని అందించగా.. వన్డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి జిడ్డు బ్యాటింగ్తో (20 బంతుల్లో 20) సన్రైజర్స్ ఓటమికి పరోక్ష కారకుడయ్యాడు. సన్రైజర్స్ ఈ మ్యాచ్ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్ తమ విధ్వంసకర ఇన్నింగ్స్తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. -
ఉత్కంఠ పోరులో SRHపై KKR విజయం..
-
IPL 2024: కేకేఆర్ క్యాంప్లో జోష్ నింపుతున్న మిచెల్ స్టార్క్
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ కోల్కతా నైట్రైడర్స్ క్యాంప్లో కొత్త జోష్ నింపుతున్నాడు. ఐపీఎల్ 2024 ప్రారంభానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో అన్ని జట్లతో పాటు కేకేఆర్ కూడా ప్రాక్టీస ముమ్మరం చేసింది. కేకేఆర్ విషయానికొస్తే.. స్టార్క్ ఆ జట్టుకు తరుపుముక్కగా పరిగణించబడుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్లో స్టార్క్ పేట్రేగిపోతున్నాడు. Mitchell Starc in Purple😍pic.twitter.com/yBDau2M436 — CricTracker (@Cricketracker) March 20, 2024 నిప్పులు చెరిగే బంతుల సంధిస్తూ సహచరులను తెగ ఇబ్బంది పెడుతున్నాడు. తాజాగా స్టార్క్ సహచర ఆటగాడిని ఎల్బీడబ్ల్యూ చేసే వీడియో ఒకటి నెట్టింట వైరలవుతుంది. ఇందులో స్టార్క్ మెరుపు వేగంతో బంతిని సంధిస్తూ కనిపించాడు. సహజంగానే మెరుపు వీరుడిగా పేరున్న స్టార్క్ ఇంత భారీ మొత్తం తనపై పెట్టుబడి పెట్టడంతో ఇంకాస్త విజృంభించే అవకాశం ఉంది. Pure cinema! 🤌 pic.twitter.com/u1vR0Wvq2r — KolkataKnightRiders (@KKRiders) March 19, 2024 కేకేఆర్ యాజమాన్యం స్టార్క్పై భారీ ఆశలు పెట్టుకుంది. గంభీర్ మెంటార్షిప్లో కేకేఆర్ కొత్త రక్తంతో ఉరకేలుస్తుంది. ఈసారి ఎలాగైనా మూడో ఐపీఎల్ టైటిల్ సాధించాలని ఆ జట్టు యాజమాన్యం కంకణం కట్టుకు కూర్చుంది. ఐపీఎల్ 2024 వేలంలో కేకేఆర్ స్టార్క్ను 24.75 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. All about the 𝐊𝐧𝐢𝐠𝐡𝐭 kind of hustle! 🔥 pic.twitter.com/9aJNIpJUtN — KolkataKnightRiders (@KKRiders) March 20, 2024 ఇదిలా ఉంటే, ఐపీఎల్ 17వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా జరిగే సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఆర్సీబీతో తలపడుతుంది. కేకేఆర్ తమ తొలి మ్యాచ్ను మార్చి 23న ఆడనుంది. ఈడెన్ గార్డెన్స్లో జరిగే ఈ మ్యాచ్లో కేకేఆర్.. ఆరెంజ్ ఆర్మీను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. తొలి విడదలో ప్రకటించిన షెడ్యూల్ వరకు కేకేఆర్ మార్చి 29, ఏప్రిల్ 3న మరో రెండు మ్యాచ్లు ఆడనుంది. 29న జరిగే తొలి మ్యాచ్లో ఆర్సీబీతో (బెంగళూరు), 2న జరిగే మరో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో (విశాఖ) కేకేఆర్ తలపడనుంది. Chalo shuru karte hai! 🗓 pic.twitter.com/i2l0M9dP8x — KolkataKnightRiders (@KKRiders) February 22, 2024 కోల్కతా నైట్ రైడర్స్ పూర్తి జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కేఎస్ భరత్, చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, షెర్ఫానే రూథర్ఫోర్డ్, మనీష్ పాండే, ముజీబ్ ఉర్ రెహమాన్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్. గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్ళు: జాసన్ రాయ్, గుస్ అట్కిన్సన్. -
IPL 2024: షెడ్యూల్, వేదికలు, పది జట్లు.. పూర్తి వివరాలు
అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా క్రికెట్ సమరానికి సమయం ఆసన్నమైంది. చెపాక్ వేదికగా మార్చి 22న ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ మొదలుకానుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోరుతో 2024 సీజన్కు తెరలేవనుంది. ఇక దేశంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తొలి 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 21 మ్యాచ్లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఇప్పటికే తెలిపారు. ఈ నేపథ్యంలో ఏ రోజు ఏ మ్యాచ్?.. వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు తదితర వివరాలు తెలుసుకుందాం! ఐపీఎల్-2024 తొలి దఫా షెడ్యూల్లో 21 మ్యాచ్లు.. ఏయే వేదికల్లో అంటే! ►మార్చి 22- చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే- CSK) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ- RCB)- చెన్నై ►మార్చి 23- పంజాబ్ కింగ్స్(పీబీకేఎస్- PBKS)వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ- DC)- మొహాలీ(మధ్యాహ్నం) ►మార్చి 23- కోల్కతా నైట్ రైడర్స్(కేకేఆర్) వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్)- కోల్కతా(రాత్రి) ►మార్చి 24- రాజస్తాన్ రాయల్స్(ఆర్ఆర్) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ)- జైపూర్(మధ్యాహ్నం) ►మార్చి 24- గుజరాత్ టైటాన్స్(జీటీ-GT) వర్సెస్ ముంబై ఇండియన్స్(ఎంఐ- MI)- అహ్మదాబాద్(రాత్రి) ►మార్చి 25- ఆర్సీబీ- పంజాబ్ కింగ్స్- బెంగళూరు ►మార్చి 26- సీఎస్కే- గుజరాత్ టైటాన్స్- చెన్నై ►మార్చి 27- సన్రైజర్స్- ముంబై- హైదరాబాద్ ►మార్చి 28- రాజస్తాన్- ఢిల్లీ- జైపూర్ ►మార్చి 29- ఆర్సీబీ- కేకేఆర్- బెంగళూరు ►మార్చి 30- లక్నో- పంజాబ్- లక్నోలో ►మార్చి 31- గుజరాత్- సన్రైజర్స్- అహ్మదాబాద్(మధ్యాహ్నం) ►మార్చి 31- ఢిల్లీ- సీఎస్కే- వైజాగ్ ►ఏప్రిల్ 1- ముంబై- రాజస్తాన్- ముంబై ►ఏప్రిల్ 2- ఆర్సీబీ- లక్నో- బెంగళూరు ►ఏప్రిల్ 3- ఢిల్లీ- కేకేఆర్- వైజాగ్ ►ఏప్రిల్ 4- గుజరాత్- పంజాబ్- అహ్మదాబాద్ ►ఏప్రిల్ 5- సన్రైజర్స్- సీఎస్కే- హైదరాబాద్ ►ఏప్రిల్ 6- రాజస్తాన్- ఆర్సీబీ- జైపూర్ ►ఏప్రిల్ 7- ముంబై- ఢిల్లీ- ముంబై ►ఏప్రిల్ 7- లక్నో- గుజరాత్- లక్నో. నోట్: మార్చి 23, 24, 31, ఏప్రిల్7న డబుల్ హెడర్ మ్యాచ్లు.. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం జరిగే మ్యాచ్లు 3.30కి, రాత్రి జరిగే మ్యాచ్లు 7.30కి ఆరంభమవుతాయి. స్టార్ స్పోర్ట్స్(టెలివిజన్), జియో సినిమా(డిజిటల్)లో ప్రత్యక్ష ప్రసారం. ఐపీఎల్-2024 తొలి దఫా మ్యాచ్లు జరిగే వేదికలు చెన్నై, మొహాలి, కోల్కతా, జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, లక్నో, వైజాగ్, ముంబై. తొలి దఫా షెడ్యూల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు వైజాగ్ హోం గ్రౌండ్గా ఉంటుంది. IPL 2024లో పాల్గొనే పది జట్ల వివరాలు చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చహర్, తుషార్ దేశ్పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, అజింక్య రహానే, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, సిమర్జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహీశ్ తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అవనీష్ రావు అరవెల్లి. ►గాయపడిన ఆటగాళ్ళు: డెవాన్ కాన్వే, మతీష పతిరణ. ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, నంబూరి తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్ , ల్యూక్ వుడ్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, నువాన్ తుషార, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, మొహమ్మద్ నబీ, శివాలిక్ శర్మ. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: జాసన్ బెహ్రెన్డార్ఫ్, దిల్షాన్ మధుశాంక. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, విరాట్ కోహ్లి, రజత్ పాటీదార్, అనూజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయి, విల్ జాక్స్, మహిపాల్ లామ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్కుమార్ వైశాక్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కరాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్. కోల్కతా నైట్ రైడర్స్ శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కేఎస్ భరత్, చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, షెర్ఫానే రూథర్ఫోర్డ్, మనీష్ పాండే, ముజీబ్ ఉర్ రెహమాన్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్ళు: జాసన్ రాయ్, గుస్ అట్కిన్సన్. గుజరాత్ టైటాన్స్ శుభమన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, బి. సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, షారుక్ ఖాన్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మానవ్ సుతార్, స్పెన్సర్ జాన్సన్. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: మహ్మద్ షమీ, రాబిన్ మింజ్. లక్నో సూపర్ జెయింట్స్ కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతం, శివమ్ మావి, అర్షిన్ కులకర్ణి, ఎం. సిద్ధార్థ్, ఆష్టన్ టర్నర్, డేవిడ్ విల్లీ, మొమ్మద్. అర్షద్ ఖాన్. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్ళు: మార్క్ వుడ్. రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డొనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చహల్, ఆడం జంపా, ఆవేష్ ఖాన్, రోవ్మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్మోర్, అబిద్ ముస్తాక్, నండ్రే బర్గర్. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: ప్రసిద్ధ్ కృష్ణ. ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ (కెప్టెన్), ప్రవీణ్ దూబే, డేవిడ్ వార్నర్, విక్కీ ఓస్త్వాల్, పృథ్వీ షా, అన్రిచ్ నోర్జే, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్, ఇషాంత్ శర్మ, యష్ ధుల్, ముఖేష్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, ఝే రిచర్డ్సన్, సుమిత్ కుమార్, షాయ్ హోప్, స్వస్తిక్ చికార. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: హ్యారీ బ్రూక్, లుంగి ఎన్గిడి. పంజాబ్ కింగ్స్ శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్స్టోన్, అథర్వ తైడే, అర్ష్దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కరాన్, కగిసో రబడ, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, హర్ప్రీత్ భట్యా , విద్వత్ కవేరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌవ్. సన్రైజర్స్ హైదరాబాద్ పాట్ కమిన్స్(కెప్టెన్), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి. నటరాజన్, అన్మోల్ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హక్ ఫరూకీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగా, జయదేవ్ ఉనాద్కట్, ఆకాష్ సింగ్, ఝాతావేద్ సుబ్రమణ్యన్. చదవండి: SRH: రెండుసార్లు చాంపియన్గా నిలబెడితే ఇలా చేస్తారా? షాకయ్యా -
39 మ్యాచ్ల చిన్న కెరీర్లో ఆరో శతకం సాధించిన కేకేఆర్ బ్యాటర్
ఆఫ్ఘనిస్తాన్ యువ ఓపెనర్, ఆ జట్టు వికెట్కీపర్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్భాజ్ తన వన్డే కెరీర్లో దూసుకుపోతున్నాడు. ఐపీఎల్లో కేకేఆర్కు ఆడుతున్న ఈ 22 ఏళ్ల విధ్వంసకర బ్యాటర్.. తన 39 మ్యాచ్ల కెరీర్లో ఆరో శతకం సాధించాడు. ఇంత స్వల్ప కెరీర్లో ఇన్ని సెంచరీలు సాధించడమంటే ఆషామాషీ విషయం కాదు. గుర్బాజ్ కెరీర్లో ఈ ఆరు శతకాలతో పాటు నాలుగు అర్దశతకాలు కూడా ఉన్నాయి. pic.twitter.com/J3sHi6z0OD— CricTracker (@Cricketracker) March 7, 2024 మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా షార్జా వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో గుర్బాజ్ మెరుపు సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో 117 బంతులు ఎదుర్కొన్న గుర్బాజ్ 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేశాడు. గుర్బాజ్తో పాటు మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (60), వెటరన్ మొహ్మద్ నబీ (40), కెప్టెన్ షాహిది (50 నాటౌట్) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో థియో వాన్ వోర్కోమ్ 3 వికెట్లు పడగొట్టగా.. హ్యూమ్, క్రెయిగ్ యంగ్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్కు ముందు ఐర్లాండ్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో వారికంటే పటిష్టమైన ఆఫ్ఘనిస్తాన్కు పరాభవం ఎదురైంది. ఆ మ్యాచ్లో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ను మట్టికరిపించింది. -
IPL 2024: కేకేఆర్లోకి శ్రీలంక ఫాస్ట్ బౌలర్.. ఇంగ్లండ్ ఆటగాడి స్థానంలో..!
ఐపీఎల్ 2024 సీజన్ కోసం కోల్కతా నైట్రైడర్స్ శ్రీలంక స్పీడ్స్టర్ దుష్మంత చమీరాను జట్టులోకి తీసుకుంది. గాయపడిన ఇంగ్లండ్ బౌలర్ గస్ అట్కిన్సన్కు ప్రత్యామ్నాయంగా చమీరాను ఎంపిక చేసుకున్నట్లు కేకేఆర్ మేనేజ్మెంట్ వెల్లడించింది. చమీరా రూ. 50 లక్షల రిజర్వ్ ప్రైజ్తో కేకేఆర్తో జతకట్టనున్నాడు. చమీరా 2018, 2021, 2022 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ కెరీర్లో మొత్తం 12 మ్యాచ్లు ఆడిన చమీరా 9 వికెట్లు పడగొట్టాడు. చమీరా అంతర్జాతీయ కెరీర్ విషయానికొస్తే.. ఈ 32 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ శ్రీలంక తరఫున 12 టెస్ట్లు, 52 వన్డేలు, 55 టీ20లు ఆడి ఓవరాల్గా 143 వికెట్లు పడగొట్టాడు. చమీరా ఇటీవల స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లో లంక జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం చమీరాకు వన్డే ఫార్మాట్లో మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. గట్కిన్సన్ విషయానికొస్తే.. ఈ ఇంగ్లండ్ పేసర్ను 2024 సీజన్ వేలంలో కేకేఆర్ యాజమాన్యం బేస్ ధర కోటి రూపాయలకు దక్కించుకుంది. ఐపీఎల్ 2024 కోసం కేకేఆర్ జట్టు.. శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్),నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, జేసన్ రాయ్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కేఎస్ భరత్, చేతన్ సకారియ , అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, మనీష్ పాండే, ముజీబ్ ఉర్ రెహమాన్, దుష్మంత చమీరా (గుస్ అట్కిన్సన్ రీప్లేస్మెంట్), సాకిబ్ హుస్సేన్