
సాకేత్ శుభారంభం
యానింగ్ (చైనా): కున్మింగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత రెండో ర్యాంకర్ సాకేత్ మైనేని శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఈ హైదరాబాద్ ప్లేయర్ 6-4, 6-3తో డక్హీ లీ (దక్షిణ కొరియా)పై విజయం సాధించాడు. రెండో రౌండ్లో నికొలస్ బారింటోస్ (కొలంబియా)తో సాకేత్ తలపడతాడు. డబుల్స్ విభాగంలో భారత్కే చెందిన మహేశ్ భూపతితో జతకట్టిన సాకేత్ బుధవారం జరిగే తొలి రౌండ్లో మొల్చనోవ్ (ఉక్రెయిన్)-నెదోవ్యెసోవ్ (కజకిస్తాన్)లతో ఆడనున్నాడు.